undavalli arun kumar
-
విభజనపై పార్లమెంటులో చర్చకు కృషి చేయండి
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రాన్ని విభజించిన తీరు, తద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరిగేలా నోటీసు ఇప్పించాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాసిన లేఖను మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. 2014 నుంచి జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో.. ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్సభలో ప్రకటించారు. ఈ విషయం మీకు తెలిసిందే..’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుసూ్తనే ఉన్నా... కేంద్రం నేటికీ కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు. 2018 ఫిబ్రవరి 18న మీరు(పవన్) ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బకాయిలు రూ.74,542 కోట్లుగా లెక్క తేల్చింది. 2018 జూలై 16న అప్పటి సీఎం చంద్రబాబును కలిసి లోక్సభలో జరిగిన దుర్మార్గం గురించి వివరించాను. నేను చూపించిన లోక్సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబు నా వాదనతో ఏకీభవించి, లోక్సభలో ఈ విషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనా అవి అమలు కాలేదు.2019 జనవరి 29న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపీ, సీపీఎం తప్ప మిగిలిన ముఖ్య పార్టీల నేతలందరూ హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు స్వయంగా హాజరయ్యారు. 2019 ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజు సమావేశంలో తీర్మానించుకున్నాం. ఇప్పుడు మీరు, చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో కలిసి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను, సహకరించిన బీజేపీ కేంద్రంలోను అధికారంలో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయం. మీరిద్దరూ శ్రద్ధ తీసుకుని, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజనపై, జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలి. దీంతోపాటు సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలి.’ అని ఉండవల్లి ఆ లేఖలో పేర్కొన్నారు. -
నిజాయితీగా వాస్తవాలు చెప్పండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్డ్రైవ్లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టుచట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్డ్రైవ్ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు. చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.‘సన్లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్ -
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు ఎల్రక్టానిక్ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్కుమార్ వర్చువల్గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్డ్రైవ్లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
మార్గదర్శి వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..
-
వైవి సుబ్బారెడ్డిపై నీచమైన ఆరోపణలు చేస్తారా?: ఉండవల్లి
-
‘మార్గదర్శి’కి చంద్రబాబు ఉపకారం దారుణం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు అడ్డాగా నిలిచిన మార్గదర్శికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపకారం చేయడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. దీంతో మార్గదర్శి, చంద్రబాబు ముసుగు తొలగిందన్నారు. బాబు చరిత్రలో ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోవడం ఖాయమని చెప్పారు. గత ప్రభుత్వం మార్గదర్శిపై దాఖలు చేసిన అఫిడవిట్ను ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతానన్నారని గుర్తు చేశారు.ఆయన అన్నట్లే ఇప్పుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పన్నారు. డిపాజిట్లపై ఫ్యూచర్ సబ్్రస్కిప్షన్ ఉండకూడదని నిబంధన ఉన్నా.. మార్గదర్శి దీన్ని కొనసాగించిందన్నారు. చంద్రబాబు మార్గదర్శిపై అఫిడవిట్ ఉపసంహరించుకున్నా కేసు ఆగదని.. ఆయనను ఇందులో పార్టీ చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు.. సీఎం చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు.. కానీ మార్గదర్శికి బహిరంగంగా సాయం చేసి తన ముసుగు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యూచర్ సబ్్రస్కిప్షన్ పేరుతో మార్గదర్శి సేకరిస్తున్న డిపాజిట్లు చట్టవిరుద్ధమని దాని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1,051 కోట్లను అటాచ్ చేశారు. ఇది అన్యాయమని అప్పట్లో మార్గదర్శి కోర్టుకు వెళ్లలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను ఉపసంహరించుకునేలా చేసింది. అటాచ్ చేసిన ఆ నగదు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. సెపె్టంబర్ 11న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వాయిదాకు వస్తున్న సమయంలో ఇలా చేయడం తగదు. అక్కడ కూడా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది. మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.. మార్గదర్శి చేసింది తప్పేనని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం.. చిట్ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధన ఉంది. రామోజీరావు అన్ని వ్యాపారాలు, ఆయన సామ్రాజ్య విస్తరణ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నడుస్తున్నవే. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్ఫండ్ బ్రాంచ్లను మూసేశారు. దీంతో వారి ఖాతాలన్నింటినీ తెలంగాణలోని ఇతర బ్రాంచ్లకు మార్గదర్శి తరలించింది. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో తమ సంస్థను వ్యతిరేకించరని తెలుసు. ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారోనని సీఎం ఆలోచించాలి. మార్గదర్శిలో ఉన్న మొత్తం డబ్బులో 70 శాతం అన్ అకౌంటబుల్. దీన్ని ఖచి్చతంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది.దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు తమకు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం రూ.వేల కోట్లు ఉంటుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ వద్ద తమ ఆస్తి రూ.25 వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడి నుంచి అంత ఆస్తి వచి్చందని ఎవరైనా ప్రశి్నంచారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పీఎస్సార్ ఆంజనేయులు మంచి అధికారి. ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు. -
మార్గదర్శి కోసం ముసుగు తీసేసాడు: Undavalli Arun Kumar
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
మార్గదర్శి కేసులో చంద్రబాబు ఏం చేస్తారో?.. ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
-
రామోజీ ఆర్థిక నేరగాడే
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్కు కూడా చైర్మన్గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి. ఆర్బీఐకి తెలియకుండానే...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటైంది. ఈ హెచ్యూఎఫ్కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్యూఎఫ్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకుకే తెలియదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది. ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది. దీంతో ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివరణ కోరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్)కు వర్తించదని మార్గదర్శి ఆర్బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి ఆర్బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లను కొట్టేసింది. మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్ కోసం కృష్ణరాజు ఫిర్యాదు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది. మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్యూఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్ 31వ తేదీన విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్చిట్ ఇచ్చేసిన న్యాయమూర్తి... డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్ అయింది. యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగంపత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. రంగాచారి నివేదికలోని కీలక అంశాలు ⇒ రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ⇒ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. ⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. ⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు. ⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. ⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు. ⇒ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు. -
తస్సాదియ్యా... మన రోశయ్య!
విషయ పరిజ్ఞానం, లెక్కలు, తేదీలు, చమత్కారం, సమయ స్ఫూర్తి, ముక్కుసూటిగా ప్రవాహ వేగంతో మాట్లాడే లక్షణం, స్పష్టమైన ఉచ్చా రణ, గంభీరమైన కంఠస్వరం వంటి లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఓ ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. శాసన సభలోనూ, బయటా ఆయన మాట్లాడిన ప్రతిమాటా ఒక చెణుకే.ఓసారి రోశయ్య అల్లుడు ఒక విందులో తన మిత్రులతో ఎంజాయ్ చేస్తూ టీవీ ఛానెళ్లకు చిక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో టీడీపీ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఉత్సాహంతో రెచ్చిపోయారు. చివరగా రోశయ్య తాపీగా నిలబడ్డారు. ‘అధ్యక్షా... ఎన్టీ రామారావు గారికీ, నాకూ దేవుడు మంచి అల్లుళ్ళనివ్వలేదు. ఏంచేస్తాం అధ్యక్షా’ అనేసి ఠక్కున కూర్చున్నారు. పాపం... తెలుగు తమ్ముళ్లు నవ్వలేరు, నవ్వకుండా ఉండలేరు. ఇక చంద్రబాబు పరిస్థితి సరే సరి! మిగతా సభ్యుల నవ్వులతో ఆనాటి సభ వెల్లివిరిసింది.మరోసారి సభలో చంద్రబాబు ఆరోపణలపై ప్రతిస్పందిస్తూ ... ‘అధ్యక్షా... స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నేను డ్రామా కంపెనీవాడు అనలేదు. ముందు ఆయన డ్రామాలు వేశాడు. తరవాత సినిమాల్లోకి వెళ్లి ప్రముఖ నటుడయ్యాడు అన్నానంతే. మీరు (చంద్రబాబును ఉద్దేశించి) ఒకప్పుడు ఆయన్ను గౌరవించారు. మధ్యలో పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది... సరే, నన్ను తెలివితేటలు గలవాణ్ణని అన్నారు. నేను తెలివితేటలు గలవాణ్ణయితే ఇలా ఉంటానా? ఒంటరిగా ఉన్నప్పుడెప్పుడో అదనుచూసి రాజశేఖర రెడ్డిని ఒక్కపోటు పొడిచి ఆ సీట్లో కూర్చునేవాడిని...’ అన్నారు. అంతే... చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు కిక్కురుమంటే ఒట్టు.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన ఓ చెణుకు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా చెప్పారు: ‘‘రోశయ్య ఓసారి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లడంపై మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి మంచిది కాదు–అప్పుల ఊబిలోకి పోతాం అన్నారు... సరే విలేకర్లు తర్వాత ఆయన మాటల్ని మరో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫైనాన్స్ మినిస్టర్ (యనమల రామృష్ణుడు)తో అని, దీనికేమంటారు? అని అడిగారు. అందుకాయన మేమేమైనా తప్పు చేస్తున్నామా, ఫెసిలిటీ ఉంది, వాడుకుంటున్నాం. దాని కెందుకింత గొడవ? అన్నారు. ఈ సంగతి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సులో రోశయ్యతో చెప్పి, దీనిపై మీరేమంటారు? అని అడిగారు. దీనికి రోశయ్య ‘చూడు నాయనా... ప్రతి ఊరికీ శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది. ఉంది కదాని వాడుకోం కదా, జీవుడు పోయిన తర్వాతే అక్కడికి పట్టుకెళ్ళేది’ అని జవాబిచ్చారు.చెణుకులు విసరడమే కాదు అణకువలోనూ, అందరితో కలివిడిగా ఉండడంలోనూ ఆయన పెట్టింది పేరు. ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగుతూ తన పేషీలో సెక్రెటరీ, పీ.ఏ, ఇతర ఉద్యోగులందరి సీట్ల దగ్గరకూ వెళ్లి ‘నా టెర్మ్ అయిపోయింది. కృతజ్ఞతలు. నా వల్ల ఏమైనా ఇబ్బందిపడి ఉంటే ఏమీ అనుకోకండి’ అని వినమ్రంగా చెప్పారు రోశయ్య.శాసన మండలి సభ్యునిగా ఎన్టీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేసి, మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకునేలా చేశాడని నాటి విశ్లేషకులు అంటుంటారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ఉద్యోగంలా భావించారు. అసంతృప్తిగా పని చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అవినీతి మచ్చలేని నిలువెత్తు నిజాయితీ ఆయన. ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే సత్యమిది. రాజకీయాల్లో ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.– తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి!?
సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిమిత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే.. వీటిలో 40 లక్షలు వినియోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్ను కోరితే.. తమకేం తెలీదని.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ను అడగాలంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఓ కమ్యునిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తంచేశారన్నారు. ఈవీఎంల గోల్మాల్ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్మాల్పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందోననే అపోహ ప్రస్తుతం నెలకొందని, ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఉండవల్లి సూచించారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములకు ఓట్ల తేడా కేవలం 1.9 శాతం మాత్రమేనన్నారు. అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అని ఉండవచ్చన్నారు.వైఎస్సార్సీపీకి మళ్లీ మంచి రోజులు..ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకోవద్దని.. ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరంలేదన్నారు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని.. వారికి మళ్లీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలుపే దీనికి నిదర్శనమన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటుచేసుకున్నాయని చెప్పారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని.. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలితకు 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అలాగే, 1996లో కరుణానిధి 221 సీట్లు సాధించగా.. జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమయ్యారన్నారు. మళ్లీ 2011 ఎన్నికల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించారని చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడదని ఉండవల్లి అన్నారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి..మరోవైపు.. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఆయన ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధనకు కృషిచేయాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి రూ.1.42 లక్షల కోట్లలో 50 శాతం ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు.రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకుని, ఇప్పుడు బాబు చర్చకు డిమాండ్ చేయాలన్నారు. అలాగే, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నోటీసు ఇప్పించాలన్నారు. వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్లపై సైతం చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పారు. జగన్ జైలుకెళ్లే అవకాశం ఉండదు..అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకెళ్లే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అన్ని చార్జిషీట్లూ పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ, కాపులది డెడ్లీ కాంబినేషన్ అని.. కసి, పట్టుదలవల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చునన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అలాంటి వారివల్లే కొంతమంది వైఎస్సార్సీపీకి దూరమయ్యారని చెప్పారు. -
రామోజీ రావుపై నాకు వ్యకిగతంగా ఎలాంటి కోపం లేదు
-
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
-
రామోజీరావు పట్ల కూడా చట్టం చట్టప్రకారమే వ్యవహరిస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
-
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
మార్గదర్శి అక్రమాల కేసులో నేడు కీలక విచారణ
సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. -
రామోజీకి భారీ షాక్.. ఫలించిన ఉండవల్లి పోరాటం
-
పోలవరంపై చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ భజనలు చేయించడం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 70:30 నిష్పత్తిలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, నేటికి పదేళ్లు పూర్తయిందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. బిల్లు ఆమోదం విషయంలో లోక్సభ ప్రచురించిన డాక్యుమెంట్ ఆధారంగా తాను కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బిల్లు ఆమోదం తప్పని తనకు మద్దతుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 2015 డిసెంబర్ నాటికి నీతిఆయోగ్ తయారు చేసిన నివేదిక ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు కోరినప్పటికీ కేంద్రం నిరాకరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అడిగితే రూ. 4 వేల కోట్లు తగ్గించి ఇచ్చిందని, ట్యాక్స్ ఇన్సెంటివ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 89 ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సిందిగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టారని, దీనిపై ఇంతవరకూ ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదని అన్నారు. కొట్టుకు చావండని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందని దుయ్యబట్టారు. ఏ ఇన్స్టిట్యూట్ కట్టాలన్నా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రా మధ్య తేలాల్సిన ఆస్తుల విలువ రూ. 1.46 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనే విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. రాష్ట్రపునర్విభజనపై సుప్రీంకోర్టులో వేసిన కేసును అడ్వాన్స్ చేయిస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఉండవల్లి చెప్పారు. -
ఉండవల్లి పిటిషన్ పై వాయిదా
-
చంద్రబాబు ఆరోగ్యంపై ఉండవల్లి కామెంట్స్
-
స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి 100% జరిగింది..!
-
టీడీపీ లీడర్స్ పై ఉండవల్లి కామెంట్స్
-
సీబీఐ విచారణ జరగాల్సిందే
-
ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
ఉండవల్లి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
-
చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఉండవల్లి షాక్
-
ఉండవల్లి అరుణ్కుమార్ పై టీడీపీ దుష్ప్రచారం సరికాదు
-
మార్గదర్శి అక్రమాలపై చర్యలు ఉండకూడదా ?
-
రామోజీ ఫిల్మ్సిటీ అక్రమ నిర్మాణమే
సాక్షి, రాజమహేంద్రవరం: రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమ నిర్మాణమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఫిల్మ్ సిటీ కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఉల్లంఘించి భూములు సేకరించారని విమర్శించారు. ఫిల్మ్సిటీ రెండు వేల ఎకరాల భూముల విలువ ఇప్పుడు రూ.2 లక్షల కోట్లన్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో జమీందార్లు, పెద్దలు కూడా భూములు కోల్పోయారన్నారు. కానీ రామోజీ మాత్రం అందుకు భిన్నమన్నారు. ఇందుకు మార్గదర్శి కేసులో జరుగుతున్న విచారణే నిదర్శనమని తెలిపారు. రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వొకేట్లు ఎవరికి కావాలనుకుంటే వారికి శిక్షలు వేయించగలరని చెప్పారు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులో రామోజీరావు, శైలజా కిరణ్లను అధికారులు ప్రశ్నించిన వీడియో బయటపెట్టాలని ఉండవల్లి కోరారు. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన ఆంధ్రాలో జరిగితే తెలంగాణ కోర్టులో విచారించాలని పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం కన్నా రామోజీరావుకు పలుకుబడి ఉందని అర్థం అవుతోందన్నారు. ‘ఈనాడు’తోవ్యవస్థలను భయపెడుతున్నారు.. రామోజీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈనాడు పేపర్ను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అందుకే ప్రతి కేసులో ‘ఈనాడు పత్రిక అధిపతి’ అని ప్రస్తావన తీసుకువస్తారన్నారు. ఒక కేసులో రామోజీరావు మార్గదర్శి ఎండీ అని, మరో కేసులో మార్గదర్శితో రామోజీరావుకు సంబంధం లేదని అఫిడవిట్ వేశారన్నారు. అలాంటి వ్యక్తిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు కట్టిన సొమ్ముకు, మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ వద్ద ఉన్న సొమ్ముకు వ్యత్యాసం ఉందన్నారు. ఆదిరెడ్డి అప్పారావుని అరెస్టు చేసినప్పుడు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిరెడ్డిని పరామర్శించిన చంద్రబాబు రామోజీ గురించి మాట్లాడలేదన్నారు. తన రాజగురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మార్గదర్శి వ్యవహారంలో రామోజీ తప్పు చేయలేదని బాబు చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మార్గదర్శి కేసులో ప్రభుత్వం నాకు సహకరించాలి.. మార్గదర్శి అక్రమాలపై జరుగుతున్న విచారణ చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానం కాదన్న భావన కలుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గదర్శి కేసులో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం తనకు సహకరించాలని కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేక కథనాలు కోకొల్లలుగా వస్తాయన్నారు. చిరంజీవి పిచ్చుక కాదని.. సొంత పార్టీ పెట్టి 18% ఓట్లు సాధించారని గుర్తు చేశారు. -
ఉండవల్లి ప్రశ్నలకు సమాధానాలు లేవా రామోజీ?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి. పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. రవిప్రకాష్కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి. గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు. వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి. మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది. కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మార్గదర్శిలో లోపాలను ప్రభుత్వం ఎత్తు చూపుతుంది
-
మతతత్వ పార్టీలకు ఆదరణ ఉండదు
సాక్షి, అమరావతి: బీజేపీ వంటి మతతత్వ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఫిల్మ్ చాంబర్ హాల్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చిట్ఫండ్ చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని మార్గదర్శి నిర్వాహకులు చెబుతున్నారని, అలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనవసరమని, దానికంటే ముందు దేశంలో ఆర్థిక అసమానతలు తొలిగించే దిశగా దృష్టి సారించాలని కోరారు. దీనిపై వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన వ్యతిరేకమా, అనుకూలమా అనే దానిపై వైఖరి ఏమిటో వెల్లడించాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో వివాహ, విడాకుల సంప్రదాయం ఒక్కోలా ఉంటుందని, అన్నిటికీ ఒకే విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్కు కచ్చితంగా మంచి జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల సమావేశ ప్రభావం ఉంటుంది కేంద్ర ప్రతిపక్షాలు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న సమావేశ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రంతోను, పార్లమెంట్తోను, స్పీకర్తోను తాను గొడవ పడుతుంటే సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చే సర్వేలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగాలు అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నదో, బాధ్యులెవరో, దానిని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చువుతుందో, అసలు పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏమిటనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రూ.కోటి 64.5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్రాన్ని అధికార, ప్రతిపక్షాలు ఒక్కమాట కూడా ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మన రాష్ట్రం నుంచి వెళ్లిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తే మనకు సరిపోతుందని.. అప్పులు చేయక్కర్లేదని అన్నారు. -
మార్గదర్శి విషయంలో అందుకే జీవీరెడ్డి వెనక్కి తగ్గాడు: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మార్గదర్శి చిట్ఫండ్పై చర్చకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి వెనక్కి తగ్గారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. జీవీరెడ్డి తరువాత వస్తానన్నారు.. వస్తే చర్చ ఆరోగ్యకరంగా ఉంటుంది. మార్గదర్శి ఫైనాన్షియర్లపైనే తన పోరాటం’’ అని ఉండవల్లి అన్నారు. ‘‘చిట్స్ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. తమకు కంపెనీ యాక్ట్ మాత్రమే వర్తిస్తుందని రామోజీ వితండవాదం చేస్తున్నారు. రామోజీ తప్పు చేశారని నిర్ధారణ చేసుకున్నాకే అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీలో ఏ చిట్ఫండ్స్ కంపెనీ కూడా నిబంధనలు పాటించడం లేదు. చిట్ఫండ్ సంస్థలు టీడీఎస్, జీఎస్టీలు కట్టడంలేదు. రూ.17 వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి వ్యవస్థను శాసిస్తున్నారు. రామోజీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం బ్లాక్మనీ అయి ఉండాలి’’ అని అరుణ్కుమార్ అన్నారు. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో రామోజీరావుకి వచ్చే ఆదాయం రోజుకు పది కోట్లు. ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే సంస్థలో నిర్వాహకునికి సంబంధించి 50 శాతం సొంత పెట్టుబడి ఉండాలి అని జడ్జిమెంట్ ఉంది. చట్టాన్ని అందరికీ వర్తింపచేయాలి. రామోజీరావు దీనికి మినహాయింపు కాదు’’ అని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. చదవండి: వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్ -
‘వ్యక్తిగత విభేదాలు లేవు.. అక్రమాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా’
సాక్షి, విశాఖ: తనకు రామోజీరావుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం ఆయన చేసిన అక్రమాలని మాత్రమే ప్రశ్నిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్. చట్టాలు, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు ఉండవల్లి. ‘రామోజీరావు సంస్థల చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది - రామోజీరావుకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. మార్గదర్శి చిట్ఫండ్ డబ్బును మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో పెట్టారు. ఇదే విషయం ప్రశ్నిస్తే నాపై పరువునష్టం దావా వేశారు. రామోజీరావుకు చట్టం, నిబంధనలు వర్తించవా? రామోజీ కేసులో వాస్తవాలు వెలుగుచూడాలన్నదే నా ఆకాంక్ష. రామోజీకి వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు మద్ధతు పలుకుతున్నాయి. ప్రజల నుండి మద్ధతు ఉండబట్టే నా పోరాటం కొనసాగుతోంది. దేశంలోని ఆర్థిక నేరాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పడాలి. రామోజీరావు అయినా రూల్స్ పాటించాల్సిందే. చట్టాలు అందరికీ వర్తించాలన్నదే మా డిమాండ్ - చట్టాలకు లోబడే మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందా? ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే ఉండవల్లిని ఈనాడు బ్యాన్ చేసింది. ఈ పోరాటంలో ఉండవల్లికి అన్ని వర్గాల మద్ధతు ఉంది. 17 ఏళ్లుగా ఉండవల్లి చేస్తున్న పోరాటం చాలా గొప్ప విషయం. తప్పులను ఎత్తిచూపాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఉండవల్లి పోరాటం వల్లే రామోజీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి వ్యవహరిస్తోంది. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బు తన దగ్గరే పెట్టుకుంది. డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తే ఆ వివరాలను వెల్లడించవచ్చు కదా. చెల్లించాల్సిన డబ్బు మార్గదర్శి దగ్గర ఉందా?. అక్రమాలను నిరోధించేందుకే చర్యలు చేపట్టింది. వ్యవస్థలోని లోపాలను పత్రికలు ఎత్తిచూపాలి. ప్రభుత్వంలోని తప్పులను పత్రికలు చెప్పాలి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే మార్గదర్శిలాంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తికి, పార్టీకి కొమ్ముకాసే విధంగా పత్రికలు వ్యవహరించకూడదు పొలిటికల్ మాఫియాతో మీడియా మాఫియా చేతులు కలిపిందిమార్గదర్శిలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. 1980 నుంచి మార్గదర్శిలో అవకతవకలు జరిగాయి. కొందరు గ్యారెంటీస్ ఇవ్వకపోవడం వల్ల చిట్ పాడుకున్న తర్వాత కూడా డబ్బు ఇచ్చేవారు కాదు. మార్గదర్శిలో అవకతవకల పై ప్రశ్నించేందుకు సీఐడీ వెళ్లినప్పుడు మంచం పై ఉన్నా సహకరించాననే చెప్పుకునేందుకే రామోజీ యత్నం. చంద్రబాబు లేకుండా రామోజీ లేరు.. రామోజీ లేకుండా చంద్రబాబు లేరు’ అని ఉండవల్లి తెలిపారు. -
సామాన్యుడు కాడు.. వీడు అసామాన్యుడు.. ఇది కదా ఉండవల్లి అంటే..
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. వెండితెరపై హీరో గొప్పదనం చూసి చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో అలాంటి హీరోలు కనిపించినప్పుడు, వారి గురించి తెలిసినప్పుడు పెద్దగా పట్టించుకోం. రీల్ హీరోలు ఎక్కడైనా కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం నానాయాతన పడతాం. అదే రియల్ హీరోలను చూసినప్పుడు, వారి పోరాట పటిమ తెలిసినా సరే ఎక్కడో ఏవో అనుమానాల కారణంగా శెభాష్ అనడానికి మొహమాటపడతాం. ఒక్కోసారి వారు చనిపోయిన తర్వాత వారి గొప్పదనం గురించి తెలిసి, వారు వీరు చెబుతుంటే విని, వావ్ అనిపిస్తుంది. అంతటితో రియల్ హీరోల కథ సమాప్తం. కానీ రియల్ హీరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూస్తే అలా అనిపించడం లేదు. ఆయన స్పెషల్ రియల్ ఫైటర్. ఆయన నిజమైన అసాధారణ పోరాట యోధుడు. Created history with great fighting spirit. మార్గదర్శి అవకతవకల్ని వెలికితీయడంద్వారా ఆర్ధికరంగ నేరాలపై తనదైన శైలిలో సామాన్యులకు సైతం చక్కటి అవగాహన కల్పించిన సామాన్యుడు. ఆయన చెప్పే పాయింట్లలో ఒక్క మాట కూడా తప్పు పట్టేలా లేదు. సామాన్యుల్లో అసామాన్యుడు. ప్రజాప్రతినిధిగా పదికాలాలపాటు నిలిచిపోయే పని చేశారు. ఆర్ధిక రంగ నేరాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించిన ధన్యజీవిగా కీర్తి సంపాదించారు. కేవలం చట్టాలను నమ్ముకొని, న్యాయవ్యవస్థమీద నమ్మకంతో ప్రజాప్రతినిధిగానే కాదు లాయర్ గా కూడా మార్గదర్శిపై పట్టుదలగా పోరాటం చేసి చరిత్రలో తనకంటూ మంచి పేరు ఆర్జించారు. నాకు రాజ్యాంగం పట్టదు, నేను చెప్పిందే చట్టం, నేను సంకల్పించిందే సక్రమం అనుకునే మోనార్క్లలో కనీసం ఒక్కరినైనా నేలమీదకు ఈడ్చుకొచ్చిన మహర్షి ఉండవల్లి. మార్గదర్శి సక్రమంగా పని చేస్తోంది కదా! ఎలాంటి ఫిర్యాదులు లేవు కదా!! ఏంటీ ఈ ఉండవల్లికి వచ్చిన నొప్పి అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సమస్య లోతుపాతులు తెలిసిన తర్వాత ఇంతకాలం జరిగిన మోసం తెలిస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అంతిమంగా దెబ్బతినేది ప్రజలు. లాభపడేది ఆ మోసాలు చేసినవారు, అంతో ఇంతో లబ్ధి పొందేది వారికి చప్పట్లుకొట్టేవారు. ఆ స్పృహతో చూసినప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన పోరాటం అసాధారణం, అమోఘం, అద్వితీయం. మాటలతో చెప్పలేనిది. సెల్యూట్ టు ఉండవల్లి అరుణ్కుమార్ సార్. undavalli arun kumar on margadarshi, on ramoji, on chit funds, on chits, on margadarshi financiers ..అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.. మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత సమాచారం వాటిలో లభ్యమవుతుంది. అయినా సరే మీడియా మొఘల్ రామోజీయే కరెక్ట్ అని ఎవరైనా అంటే ఎవరైనా చేయగలిగిందేమీలేదు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవడమే. -చెమికెల రాజశేఖరరెడ్డి, హైదరాబాద్ -
మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు ఇది: ఉండవల్లి
న్యూఢిల్లీ: మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు చోటుచేసుకుందని మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణ సందర్బంగా ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు?. చెక్కుల రూపంలో ఇచ్చారా?. మరో రూపంలో ఇచ్చారా?. డిపాజిటర్ల అన్ని వివరాలను కోర్టుకు అందజేయాలి. ఒకచోట హెచ్యూఎఫ్, మరో చోట ప్రొప్రైటరీ అని ఎందుకు రాశారు?. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు. కాగా మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీం ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది. డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి లాయర్ తెలపగా, చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. చదవండి: ‘విజయ్కుమార్ స్వామి.. రామోజీ వియ్యంకుడి విమానంలోనే వచ్చారు’ -
రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమే: ఉండవల్లి
-
రామోజీ అతీతుడా? :ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ను అరెస్టుచేస్తే అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. తప్పు ఎవరుచేసినా తప్పేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అది రామోజీరావు అయినా, మరెవరైనా అంతా సమానమేనన్నారు. సాక్షాత్తూ తిరుమల టీటీడీ హుండీలో వేసే విదేశీ కరెన్సీ విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవడంలో జాప్యం చేసినందుకు రూ.10 కోట్ల ఫైన్వేశారని ఉండవల్లి గుర్తుచేశారు. వెంకటేశ్వరస్వామి కంటే అతీతుడినని రామోజీరావు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయ్మాల్యా, రామోజీరావు ఇద్దరూ చేసింది ఒక్కటే అని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరుగు తోందని తాను 2006 నుంచి చెబుతూనే ఉన్నానని.. తాను ఆరోపించినట్లుగానే అక్రమాలు వెలుగుచూస్తున్నాయన్నారు. మార్గదర్శిని రామోజీ ఇష్టమెచ్చినట్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇక మార్గదర్శిలో తప్పు జరిగిందని ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారని.. ఆర్థిక నేరాల్లో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా చర్యలుంటాయన్నారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ గోపాలకృష్ణారెడ్డి పదవిలో ఉండగానే మార్గదర్శి వ్యవహారాన్ని తప్పుబట్టారన్నారు. అందులో జరిగే అక్రమాలపై కర్ణాటక నుంచి ఫిర్యాదు వచ్చిందని తన ఆత్మకథలో ఆయన పేర్కొన్నట్లు గుర్తుచేశారు. సీఏలు నన్ను ధూషించడం తగదు ‘మార్గదర్శి కేసులో బ్రహ్మయ్య అండ్ కో కంపెనీకి చెందిన ఓ సీఏను అరెస్టుచేస్తే అందుకు నేను బాధ్యుడినా? అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుంది? అరెస్టులకు సంబంధించి విజయవాడలో సీఏలు సమావేశం పెట్టి సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటంలేదని దూషించడం తగదు’.. అని ఉండవల్లి అన్నారు. సీఏలు ప్రభుత్వానికి ప్రతినిధుల్లాంటి వారని, వాళ్లు తప్పుచేస్తే శిక్షలు ఉంటాయని గుర్తుచేశారు. సత్యం రామలింగరాజు కేసులో సీఎలను అరెస్టుచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, అప్పట్లో íసీఏలు ఇలా మీటింగ్ పెట్టి విమర్శించిన దాఖలాల్లేవన్నారు. సీఏలు మీటింగ్ పెట్టి ఆహ్వానిస్తే వెళ్లి రామోజీ తప్పుచేశారన్న తన వాదన నిజామా? కాదో వివరిస్తానన్నారు. నా కేసు తప్పని జస్టిస్ రమణతో చెప్పించండి ఇక మార్గదర్శిపై తాను వేసిన కేసు తప్పని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ రమణతో చెప్పిస్తే చాలని ఉండవల్లి అన్నారు. రామోజీరావు చేసింది తప్పాకాదా? అని మాత్రమే సమాధానమివ్వాలన్నారు. తప్పని తేలితే రూపాయి ఫైన్ వేసినా సంతోషమేనని, మిగిలిన చిట్ఫండ్లకు భయం ఉంటుందన్నారు. సెక్షన్ 477–ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని.. రామోజీరావుకు డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రామోజీరావు పత్రికా స్వేచ్ఛపై దాడిగా చెప్పుకుంటారని.. అలాంటప్పుడు చట్టసభల్లో పత్రికాధిపతికి చట్టాలు వర్తించవని చట్టం తీసుకురావాలని ఉండవల్లి సలహా ఇచ్చారు. జగన్ను విమర్శిస్తే విశ్వాస ఘాతుకుడినే.. తనకు టీడీపీ, వైఎస్సార్సీపీ రెండు పార్టీలు సమానమేనని ఆయనన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కోర్టులో కేసు వేయమని టీడీపీ ప్రభుత్వ హయాంలో అడిగితే పట్టించుకోలేదని.. అదే విషయమై ఇప్పుడు కోరితే తనను సపోర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన కేసులో ఇంప్లీడ్ అవుతూ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఎవరూ చేయలేని పని జగన్ చేశారని.. అలాంటప్పుడు కేసు తేలేవరకైనా కృతజ్ఞత లేకుండా ముఖ్యమంత్రి జగన్ను ఎందుకు విమర్శించాలని ఆయన ప్రశ్నించారు. అలా చేస్తే తాను విశ్వాస ఘాతకుడినవుతానన్నారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– (ఫొటో ఉంది) నిజమే.. నిధులు మళ్లించాం! రామోజీ పరోక్ష అంగీకారం -
‘మార్గదర్శి’పై ఈడీ విచారణ చేపట్టాలి
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి చిట్స్కు సంబంధించి గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తనకిచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని.. ఆ వివరాలను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)కు పంపి విచారణ చేపట్టాలని తాను కోరుతున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ చిట్ఫండ్ 14(2) యాక్ట్ ప్రకారం చిట్ఫండ్స్ ద్వారా సేకరించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉన్నా.. మార్గదర్శిలో అలా జరగడంలేదని.. మ్యూచువల్ ఫండ్స్లో పెటు్టబడులు పెట్టారని, ఇతర వ్యాపారాలకూ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనాడు పత్రిక సైతం చిట్ఫండ్స్ డబ్బుతోనే నడుస్తోందన్నారు. ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా? ఇక మార్గదర్శి చిట్ఫండ్స్కు, రామోజీరావుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ తనపై వేసిన రూ.50 లక్షల పరువునష్టం దావాకు సంబంధించిన అఫిడవిట్లో సంతకం చేసిన రాజాజీ.. ఇప్పుడు అదే చిట్ఫండ్స్కు చైర్మన్ రామోజీయేనని తెలంగాణ హైకోర్టులో తాజాగా వేసిన అఫిడవిట్లో పేర్కొన్నారని.. ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా? అని ఉండవల్లి ప్రశ్నించారు. రామోజీరావు తప్పుచేశాడని తాను నిరూపిస్తానని.. ఆధారాలతో సహా చర్చకు వస్తా, చేసిన తప్పు ఒప్పుకునే ధైర్యం రామోజీకి ఉందా? అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న తాను 17 ఏళ్లుగా అడుగుతున్నా ఇప్పటిదాకా స్పందించలేదని ఉండవల్లి ఎద్దేవాచేశారు. నిజానికి.. మార్గదర్శి ఫైనాన్స్ షేర్పై తాను కేసు పెట్టే సమయానికి కంపెనీ రూ.1,360 కోట్ల నష్టాల్లో ఉందని, రామోజీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఇప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు రామోజీది.. బాధ్యులు ఫోర్మెన్లా? మార్గదర్శి చిట్ఫండ్స్లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని.. అధికారులకు సంస్థ ఎలాంటి పత్రాలూ ఇవ్వడంలేదని ఉండవల్లి ఆరోపించారు. చిట్ఫండ్స్లో రామోజీరావు తప్పులు చేస్తే.. వాటికి మార్గదర్శి బ్రాంచుల్లో పనిచేసే ఫోర్మన్లను బాధ్యుల్ని చేసి ఆయన తప్పించుకుంటున్నారన్నారు. తాను తప్పుచేశానని ఏనాడు రామోజీ ఒప్పుకోలేదని, ఎన్ని కేసులు వేసినా తాను ట్రయల్ కోర్టుకు వచ్చిన దాఖలాల్లేవన్నారు. రామోజీ ఏమైనా చట్టానికి అతీతుడా? అని ఉండవల్లి ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్పై ఎవరు ఫిర్యాదు చేశారని కొందరు విలేకరులు సీఐడీ అధికారులను ప్రశ్నిస్తున్నారని.. అలాగే, రామోజీరావును ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం మార్గదర్శి వ్యవహారాన్ని రచ్చచేస్తోందని ఆరోపిస్తున్నారని.. అలా అనుకుంటే తాము తప్పుచేయలేదని రామోజీ ఎందుకు చెప్పడంలేదని ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు. -
రామోజీ రావు మరో విజయ్ మాల్యా ..?
-
ఆ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, విశాఖపట్నం: 'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశం అవసరం' అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆదివారం స్టీల్ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, సినీ నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి కోరారు. ఆ కమిటీ నివేదికను అమలు చేయాలి స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం చెబుతున్న కారణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలన్నారు. ఉక్కు అమ్మకం ప్రజల మనోభావలతో కూడిన అంశం అని తెలిపారు. దస్తూరి కమిటీ నివేదికను కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం అంటే కుట్రలో చిక్కుకున్నట్లే అని అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రల హక్కు నినాదం తన ఐడెంటిటీని కోల్పోతుందన్నారు. ప్రజాఉదయమం ద్వారానే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమన్నారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో!
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో! -
రామోజీరావు స్టేలపై పుస్తకం రాస్తా: ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: ఈనాడు రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా కోర్టు నుంచి స్టే తెచ్చుకోగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. రామోజీరావు కోర్టుల నుంచి తెచ్చుకున్న స్టేలపై తాను ఒక పుస్తకమే రాస్తానని, లా విద్యార్థులకైనా ఉపయోగపడుతుందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై తాను కేసు వేసి 16 ఏళ్లయిందని, అది ఎప్పు డు తేలుతుందో, అప్పటివరకు తాను ఉంటానో లేదోనని వ్యాఖ్యానించారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమన్నారు. మార్గదర్శి అకౌంట్ బుక్స్ ఎవరూ చెక్ చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు. రామోజీకి, మార్గదర్శికి సంబంధం లేదని కోర్టులో చెప్పినప్పటికీ అన్ని సంస్థలకూ చైర్మన్ రామోజీ అనే సంతకం ఉందన్నారు. చిట్ఫండ్ కంపెనీ డబ్బును ఇతర వ్యాపారాలకు వాడకూడదన్న నిబంధనలనూ పట్టించుకోలేదని అన్నారు. మార్గదర్శి రూ.1,300 కోట్లు నష్టాల్లో ఉందని రంగాచారి కమిషన్ చెప్పిందన్నారు. 12 చానళ్లు అమ్మి నష్టాలు పూడ్చానని ఆయన అంటున్నారని, అది నిజమని తాము నమ్మడంలేదని చెప్పారు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశానంటున్న రామోజీ ఎవరికి ఇచ్చారనేది ప్రశ్నార్థకమన్నారు. ఆయన కోర్టుకు తప్పుడు పేర్లు సమర్పించారని, అందులో ఎల్కే అద్వానీ, ఉపేంద్ర అనే పేర్లు కూడా ఉన్నట్లు తాను చూశానన్నారు. మార్గదర్శికి డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై ఈడీ విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి లేఖ రాశానన్నారు. అయితే, 12 చానళ్ల విక్రయ లావాదేవీలపై సెబీ విచారణ జరపాలని, రామోజీ ఫిలిం సిటీ వయోలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్పై స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని ఆర్వోసీ తెలిపిందన్నారు. ప్రభుత్వం చిట్ఫండ్ కంపెనీలపై విచారణ జరుపుతున్నందున, మార్గదర్శిపైనా దర్యాప్తు జరపాలని, తన వద్ద ఉన్న ఆధారాలన్నీ ఇస్తానని అన్నారు. రాష్ట్ర విభజన, అమరావతి రాజధానిపై ‘విభజన వ్య«థ’ అనే పుస్తకం రాస్తున్నానని ఉండవల్లి చెప్పారు. అమరావతి రాజధానిని మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి తానేనని తెలిపారు. రాజధాని అక్కడ పెట్టడం సరికాదని, అది భ్రమరావతి అని చెప్పిందీ తానేనన్నారు. -
ఇదీ.. మార్గదర్శి మోసాల కథ!
సాక్షి, అమరావతి: హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లను సేకరించింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆరి్థక శాఖ దృష్టికి తెచ్చారు. అయితే అక్కడి నుంచి తగిన స్పందన లేకపోవడంతో తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అ«దీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రంగాచారికి సహకరించని మార్గదర్శి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో తన నివేదిక సమరి్పంచారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏమాత్రం సహకరించలేదని నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఎత్తున నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపారు. చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి ఫిర్యాదు... మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అ«దీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. అటు తరువాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు నుంచి సానుకూలంగా స్టే ఉత్తర్వులు పొందింది. స్టే ఇవ్వని సుప్రీంకోర్టు.. ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు... 2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, క్రిమినల్ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే స్టే పొడిగింపునకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు అంటే 31.12.2018న జస్టిస్ రజనీ మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. కొంత కాలం తరువాత అసలు విషయం బయటకు రావడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రజనీ 2021 సెప్టెంబర్లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యున్ (ఎన్సీఎల్టీ) అమరావతి బెంచ్ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్సీఎల్టీ పోస్టు ఖరారైంది. -
ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ‘సుప్రీం’ స్పందన.. మార్గదర్శి, రామోజీకి నోటీసులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్తో పాటు దాని అధినేత రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు నుంచి సానుకూల తీర్పు పొందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డిపాజిటర్లకు తిరిగి పూర్తి డిపాజిట్లు చెల్లించిందా? లేదా? అనే వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు... ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (31.12.2018)న అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ (ప్రస్తుతం ఎన్సీఎల్టీ సభ్యురాలు, అమరావతి బెంచ్) తీర్పునిచ్చారు. మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ తీర్పును సవాలు చేస్తూ 2018లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై తాజాగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించండి... ఉండవల్లి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది రమేశ్ అల్లంకి వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి రికార్డులు తనిఖీ చేయడానికి 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేసి విచారణ అధికారిని నియమించిందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించిందని, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వచ్చిందని తెలిపారు. ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉందని, దానిని కూడా ఈ వ్యాజ్యాలకు జతచేíసి తమ వాదనలను వినాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశాన్ని తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది. తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ డిపాజిట్దారులందరికీ సొమ్ములను తిరిగి ఇచ్చేసిందా? అని ఏపీ ప్రభుత్వాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వికాస్సింగ్ స్పందిస్తూ ఖాతాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదని నివేదించారు. తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) పేరిట అందరి నుంచి డిపాజిట్లు తీసుకోవడం ఆర్బీఐ చట్ట ప్రకారం నేరమని, దీనిపైనే ప్రధానంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనానికి విన్నవించారు. డిపాజిట్దారులందరికీ సొమ్ములు తిరిగి వచ్చాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించిన తరువాత చెబుతామని వికాస్ సింగ్ తెలిపారు. ఆ వివరాలు సేకరించి తమ ముందుంచాలని వికాస్ సింగ్కు ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శి దాఖలు చేసిన ఎస్ఎల్పీని విచారించిన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరైనా హాజరయ్యారా? అని ధర్మాసనం ప్రశ్నించగా ఎవరూ రాలేదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా బదులిచ్చారు. అనుకూల తీర్పు పొంది కూడా రామోజీ కోర్టుకు ఎందుకొచ్చారో..! హైకోర్టులో కేసు గెలిచినప్పటికీ రామోజీరావు సుప్రీంకోర్టుకు ఎందుకొచ్చారో అర్థం కావడంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు సంతృప్తినివ్వలేదేమో అని వ్యాఖ్యానించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రామోజీరావుపై తనకేమీ కక్ష లేదని, జైల్లో పెట్టించాలని తనకేమీ లేదని ఉండవల్లి చెప్పారు. చట్టానికి రామోజీరావును అతీతుడిని చేయకూడదని, సమాజానికి, ధర్మానికి హాని జరగకూడదన్నదే తన ఉద్దేశమన్నారు. హెచ్యూఎఫ్ ద్వారా డిపాజిట్లు సేకరించవచ్చంటే రామోజీ మాత్రమే కాకుండా అందరూ సేకరించవచ్చనన్నారు. డిపాజిట్లు ఇస్తే ఇస్తారు.. లేకపోతే లేదనేది తర్వాత అంశమన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారంలో ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. మార్గదర్శి పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇకపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ వేయక తప్పదన్నారు. మార్గదర్శి వ్యవహారాన్ని ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురాగా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్న క్రమంలో కేసు ఓ తార్కిక ముగింపునకు వచ్చే అవకాశముందన్నారు. ఈ అంశంపై కేవలం హెచ్యూఎఫ్ వరకే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డిపాజిట్దార్లకు సొమ్ములు అందాయా లేదా? అని తనిఖీ చేసేందుకు గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం అధికారిని నియమించగా కొందరు డిపాజిట్దారులు అసోసియేషన్గా ఏర్పడి కోర్టుకు వెళ్లారన్నారు. తమ పేర్లు బయటపడితే రామోజీ దగ్గర సొమ్ములు దాచుకున్నామని వైఎస్సార్ కక్ష సాధిస్తారని భయంగా ఉందంటూ కోర్టు నుంచి స్టే తెచ్చారని ఉండవల్లి చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు. -
ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామం: ఉండవల్లి
-
సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది. మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది. కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. చదవండి: (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తం) -
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం కాదు :ఉండవల్లి
-
చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన సానుభూతి రాదు: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: భార్య పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న ఏడుపునకు సానుభూతి రాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరగని ఘటనకు ఎన్ని వ్యాఖ్యానాలు జోడించినా ప్రజలు నమ్మరని ఉండవల్లి తెలిపారు. ఆయన శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఏడిస్తే అందుకు సానుభూతి ఏమీ రాదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్న ఉండవల్లి.. ఈ ఘటన తర్వాత సీబీఐ విచారణ కోరింది సీఎం వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. అసెంబ్లీలో వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై మాట్లాడటం తప్పని ఉండవల్లి తెలిపారు. చదవండి: పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్ మార్గ నిర్దేశం -
'ఉండవల్లి గారు.. ఊసరవెల్లిగా మారొద్దు!'
సాక్షి, అమరావతి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్రెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్పై ట్విటర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' ఉండవల్లి గారు .. మీరు ఊసరవల్లిగా మారవద్దు! బిజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? చేరే వాళ్లకు తెలుసు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారు. మీ భ్రమ తప్ప... మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఏ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బతికించాలి? అని తాపత్రయ పడుతున్నారో దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు. (చదవండి : ‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’) ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ మీ మాజీ ప్రధాని నెహ్రూ గారు 1963 జనవరి 26 న ఆర్ఎస్ఎస్ ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారు. మీకే చరిత్ర తెలిసినట్లు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి నేడు మీరు వక్రీకరించి హేళనగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు అత్యున్నతమైన రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులలో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే. మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా! ' అంటూ చురకలంటించారు.(చదవండి : రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?) -
‘పోలవరం’ క్రెడిట్ వైఎస్దే
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఆ రోజు ఆయన పూనుకోకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యేది కాదన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణం చేపడితేనే పుష్కలంగా నీరు నిల్వచేసే అవకాశం ఉంటుందని వైఎస్ ఆలోచన చేశారన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. గోదావరిపై తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని, దీనిపై గత చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించలేదని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పార్టీలను కలుపుకుని పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం జాతీయ ప్రాజెక్ట్ను కేంద్రమే పూర్తిగా నిర్మించాల్సి ఉండగా.. నీతి ఆయోగ్ మాత్రం 70 శాతం నిధులను కేంద్రం, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సిపార్సు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టంలో ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ఉన్నాయన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పోలవరం నిర్మాణానికయ్యే మొత్తం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా.. రూ.7 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని కేంద్రం ప్రకటించడం అన్యాయమన్నారు. పునరావాసానికి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. బీజేపీ లో చేరాలనుకునే వారు వినయ్ సేతుపతి రచించిన జుగల్బందీ లేదా బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం చదివి నిర్ణయం తీసుకోవాలన్నారు. -
ఆ విషయంలో బాబు కాంప్రమైజ్ అయ్యారు..
-
ఆ విషయంలో బాబు కాంప్రమైజ్ అయ్యారు..
సాక్షి, తూర్పు గోదావరి : గతంలో పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని, రిజర్వాయరు కట్టడానికి అవకాశం ఉన్న ప్రాంతం పోలవరం ఒక్కటేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రిజర్వాయరు లేకుండా ప్రాజెక్టే లేదన్నారు. స్థానికులకు పునరావాసం కల్పించాలని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం అంశం చట్టంలో ఉన్నా, చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని, స్పెషల్ ప్యాకేజి పేరుతో సరిపెట్టుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా, మోదీ- చంద్రబాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఇవ్వాల్సిన ఖర్చు వందకు వందశాతం భరిస్తామని కేంద్రం చట్టంలోనే తెలిపిందన్నారు. లోక్ సభలో లైవ్ టెలికాస్టు ఆపడం కూడా లోక్ సభ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలోనే చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా సీఎం చూసుకోవాలన్నారు. ‘‘అప్పట్లో ఇచ్చిన హామీలను కూడా ఇప్పుడు కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదు. పోలవరం కూడా పక్కన పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. పోలవరం ప్రాజక్టు అథారిటీ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉంది. పార్లమెంట్లో చేసిన చట్టాన్ని బైపాస్ చేయలేరు. 2017లో కేవీపీ రామచంద్ర రావు కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాం. లోక్ సభలో చర్చకు నోటీసివ్వమని చంద్రబాబుకు గతంలో గంటన్నర పాటు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. పార్లమెంట్లో వెంకయ్యనాయుడు అడిగిన పదివేల కోట్లు కూడా కేంద్రం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఇవ్వలేదు. రాయలసీమను, ఆంధ్రా ప్రాంతాన్ని డెవలెప్ చేస్తామని కేంద్రం ఆనాడు చెప్పింది. ( ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి ) ఇప్పటివరకూ జరగలేదు. జూన్ 24, 2019 కేంద్ర మంత్రి రతన్ లాల్ కఠారియాకు, చంద్రబాబు ప్రభుత్వం పంపిన 57,218 కోట్ల రూపాయల పోలవరం వ్యయ ప్రతిపాదనల్లో 1748 కోట్లు తగ్గించి ఆమోదించారు. చట్టం అమలు జరిగేటట్టు కూడా చూడాలి. పోలవరానికి 35 వేల కోట్ల రూపాయలు మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి. కేవీపీ వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ నేను ఫైల్ చేస్తాను. ఆర్గుమెంట్ నేనే చేస్తాను. పట్టిసీమ మీద పెట్టిన ఖర్చు పోలవరంపై ఖర్చు పెడితే ఈ పాటికి పోలవరం ఆనకట్ట పూర్తయ్యేది. గ్రావిటీ మీద నీరు పంపించే అవకాశం ఉండేది’’ అని అన్నారు. -
నా సూచనలు సీజేఐకి మెయిల్ చేశా: ఉండవల్లి
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్లో చూపించాలని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్ కుమార్ తెలిపారు. -
ఉండవల్లి అరుణ్ కుమార్కు కరోనా పాజిటివ్
సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్లోకి ఉండవల్లి వెళ్లిపోయారు. మీడియా సమావేశాలలో వివిధ అంశాలకు సంబంధించి అరుణ్ కుమార్ విశ్లేషిస్తుంటారు. మంచి వక్తగా, అనువాదకుడిగా ఉండవల్లి అరుణ కుమార్కు మంచి పేరుంది. -
రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చిం ది. ఇప్పటికే ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, మార్గదర్శి ఫైనా న్షియర్స్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వాలు సహా ఆర్బీఐకి కూడా సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. మార్గ దర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందన్న అభియోగాలతో ట్రయల్ కోర్టులో దాఖలైన క్రిమినల్ కంప్ల యింట్ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పని దినం రోజున కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సవా లు చేశారు. ఆయన తరఫున మెస్స ర్స్ రమేష్ అల్లంకి అండ్ అసోసి యేట్స్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. సుభాష్రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అప్పీలు చేయ నందున తాను ఎస్సెల్పీ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలన్న అభ్యర్ధనకు ధర్మాసనం అనుమతించింది. అలాగే, ఎస్సెల్పీలోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. విభజనకు ఒకరోజు ముందు కొట్టేసింది ఉండవల్లి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. తమపై ఉన్న క్రిమినల్ కంప్లయింట్ (సీసీ) నెంబరు 540ను కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు అంటే డిసెంబరు 31, 2018న కొట్టివేసిందని వివరించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ఆర్బీఐ చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను తప్పుగా అన్వయించి క్రిమినల్ కంప్లయింట్ను కొట్టేసిందని నివేదించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 30.11.2006న రాసిన లేఖకు ఆర్బీఐ 2007 జూన్ 2న బదులిస్తూ ప్రతివాది చాప్టర్ 3బి కింద అర్హత కలిగిలేడని, సెక్షన్ 45ఎస్ కింద లావాదేవీలు జరిపేందుకు వీల్లేదని స్పష్టంచేసిందని వివరించారు. అలాగే, సివిల్ అప్పీళ్లు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉండగానే.. హైకోర్టు సీసీని కొట్టివేసిందని గుర్తుచేశారు. ప్రతివాదిగా ఆర్బీఐని చేర్చిన ధర్మాసనం జనవరి 24న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేసింది. తాజాగా ఆర్బీఐను ప్రతివాదిగా చేర్చింది. అలాగే, జీఓ 801 ద్వారా అప్పటి సీఐడీ ఐజీ కృష్ణరాజును మార్గదర్శి సంస్థపై ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థా నంలో కేసు ఫైల్ చేసేందుకు అధీకృత అధికా రిగా నియమించినందున.. కృష్ణరాజును ప్రతి వాదిగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థన మేరకు కృష్ణరాజును ప్రతివాదిగా చేర్చింది. -
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెడితే తప్పేంటి?
-
సీఎం వైఎస్ జగన్కు ఉండవల్లి లేఖ
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కోరిక అని పేర్కొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. (అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?) -
అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు సేకరించిన భూముల వ్యవహారం రియల్ ఎస్టేట్ కోసం ఒప్పంద ప్రాతిపదికగా చేసిందేనని, చంద్రబాబు దీనికి త్యాగం అని పేరు పెట్టడం విచిత్రంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు మంచి విలువ వస్తుందని భూములు ఇచ్చారని, దానిని చంద్రబాబు త్యాగంగా మాట్లాడటం బాగోలేదన్నారు. త్యాగానికి ప్రతిఫలం ఉండదన్నారు. రైతులు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సచివాలయాల ఆలోచన ఎంతో మంచిదన్నారు. చదవండి: మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి రాష్ట్ర రాజధాని ఎక్కడున్నా ఫర్వాలేదని అన్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేలు నిండు శాసనసభలో మాట్లాడుతూ రాజధాని విషయంలో హైదరాబాద్ లాంటి తప్పు చేయమని, డీ సెంట్రలైజ్ చేస్తామని ప్రకటించారని, దానిపై శాసన సభలో చర్చ సాగించాలన్నారు. రామోజీరావు విషయంలో సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది మార్గదర్శి కేసుకు, తనకు ఏవిధమైన సంబంధం లేదన్నారు. బహిరంగంగా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు మాత్రమే చేశానని, దీంతో పోలీసులు రామోజీపై కేసు పెట్టారన్నారు. హైకోర్టులో 31 డిసెంబర్ 2018న కేసు కొట్టేశారని, దీనిపై రెండు ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసులో ఏవిధమైన తీర్పు లేకుండా కేసు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు. ఈ కేసు వ్యవహారంలో వచ్చే సోమవారం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. దేశంలో ఈ విధమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారంతా జైళ్లలో ఉన్నారన్నారు. రామోజీ రావు వేల కోట్లరూపాయలు ఉండబట్టి కేసును పుష్కర కాలం పాటు నెట్టుకు వచ్చారన్నారు. ఈ కేసు వ్యవహారం ట్రైల్ కోర్టులో ఒక విధంగానూ, సుప్రీంకోర్టులో ఒక విధంగా రామోజీ ప్రతినిధులు పిటీషన్లు దాఖలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగిన ఈ కేసు వ్యవహారంపై 400 పేజీల పుస్తకం రాస్తున్నానని, ఇది నేటితరం న్యాయవాదులకు ఉపయోగపడుతుందన్నారు. -
అది త్యాగం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం
-
మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి : మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం తీసుకు వస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ చేయాల్సి ఉందన్నారు. డబ్బు సంపాదించుకున్న కులంలో మనం మాత్రమే బాగుపడాలనే ఆలోచన వస్తే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నారు. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గితే వారిలో 1144 మంది అంటే 50.39 శాతం రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. (మార్గదర్శి కేసులో.. ఉండవల్లి పిటిషన్ స్వీకరణ) కులాలకు సంబంధించి కూడా ఓ పుస్తకం రాస్తానని ఉండవల్లి తెలిపారు. రాజధానికి 30 వేల ఎకరాలు దేనికని గతంలోనే అడిగానని, రాజధానికి భూములు త్యాగం కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 700 కోట్లు మిగల్చడం సరైనదేనని తెలిపారు. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారం 53773 ఎకరాలు సీటీల అభివృద్ధి కోసం కావాలంటూ గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు మంచి నిర్ణయమని ప్రశంసించారు. మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షలు ఎన్ని ఆరోపణలు చేసినా.. ప్రజలు అత్యధిక ఓట్లు వేసి వైఎస్సార్సీపీని గెలిపించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చదవండి : కేసులో నేరం రుజువైతే భారీ జరిమానా: ఉండవల్లి -
మార్గదర్శి కేసు: భారీ జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష!
సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టిసారించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మార్గదర్శి కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్ను కూడా చేయాలన్న మా విజ్ఞప్తిని న్యాయస్థానం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2300 కోట్ల వసూలు చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనపై వ్యక్తిగతంగా కక్షగట్టారని ఆరోపిస్తూ.. రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజశేఖర్రెడ్డి పేరును వాడటానికి వీల్లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు వాడాలని సూచించింది. అనంతరం కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.(మార్గదర్శి కేసులో సుప్రీం కీలక నిర్ణయం) హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేశాము. నేను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటిషన్లో పార్టీలుగా చేశారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ (హెచ్యూఎఫ్) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారు. కేసులో దోషిగా తేలితే, రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుంది. వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉంది. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి’ అని తెలిపారు. -
కేసులో నేరం రుజువైతే భారీ జరిమానా: ఉండవల్లి
-
మార్గదర్శి కుంభకోణం పై సుప్రీం కీలక నిర్ణయం
-
మార్గదర్శి కేసులో సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది. (‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్) ఇదీ నేపథ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై ఇదే చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) ఆధారంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నెంబర్ 800 జారీచేసింది. అలాగే ఈ సంస్థపై ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది. ఎన్.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నెంబర్ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ పిటిషన్ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్ 540లో క్రిమినల్ ప్రొసీడింగ్స్పై స్టే ఇచ్చింది. అయితే ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న తీర్పు వెలువరించింది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న క్రిమినల్ సీసీ నెంబర్ 540ని కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్కుమార్ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. -
‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై ఉన్న క్రిమినల్ కంప్లయింట్ (సీసీ) నెంబర్ 540ని కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిందని, దీనిని ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారించి సీసీ 540ని కొట్టివేసిందని పిటిషన్లో వివరించారు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అప్పీలు చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఒక అప్లికేషన్ దాఖలు చేయడంతోపాటు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు 2018 డిసెంబరు 31న ఈ తీర్పు వెలువడిందని పిటిషన్లో పేర్కొన్న ఉండవల్లి.. ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని మరో అప్లికేషన్ దాఖలు చేశారు. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(హెచ్యూఎఫ్) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా, ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను తప్పుగా అన్వయించిందని, ‘అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్’పరిధిలోకి హెచ్యూఎఫ్ రాదని, ఈ నేపథ్యంలో సెక్షన్ 45ఎస్(2) పరిధిలోకి తేవొద్దని చెబుతూ క్రిమినల్ కంప్లయింట్ను కొట్టేసిందని పిటిషన్లో వివరించారు. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2006 నవంబర్లో రాసిన లేఖకు 2007 జూన్ 2న ఆర్బీఐ బదులిస్తూ.. ప్రతివాది చాప్టర్ 3బి కింద అర్హత కలిగి లేడని, సెక్షన్ 45ఎస్ కింద లావాదేవీలు జరిపేందుకు వీలులేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పైగా సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టులో సివిల్ అప్పీళ్లు పెండింగ్లో ఉండగా.. క్రిమినల్ కంప్లయింట్ను కొట్టివేయడంతో ఆ అప్పీళ్లన్నీ ఫలితం లేనివిగా మారిపోయాయని నివేదించారు. ఇదీ నేపథ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై ఇదే చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) ఆధారంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నెంబర్ 800 జారీచేసింది. అలాగే ఈ సంస్థపై ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(టి), సెక్షన్ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది. ఎన్.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నెంబర్ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ పిటిషన్ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్ 540లో క్రిమినల్ ప్రొసీడింగ్స్పై స్టే ఇచ్చింది. అయితే ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న తీర్పు వెలువరించింది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న క్రిమినల్ సీసీ నెంబర్ 540ని కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్కుమార్ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. -
అబ్దుల్ భట్ బ్రాహ్మణుడే: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి : గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని.. గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో కర్ఫ్యూ నడిపిస్తోందని విమర్శించారు. మంగళవారం ఉండవల్లి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని అమిత్ షా చెబుతున్నారు. పాకిస్తాన్ కూడా మనదే. గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ఎన్నడూ సమర్థించలేదు... ఆయన వాస్తవాలను మాత్రమే చెప్పారు. నిజానికి ఆర్టికల్ 370ని రద్దు చేస్తాననడంలో తప్పులేదు. బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతం మీద. ఆర్టికల్ రద్దు అనేది డిప్లమసీతో చేయాలి. సైన్యంతో కాదు’ అని మోదీ సర్కారు తీరును విమర్శించారు. ఆయన బ్రాహ్మణుడే పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ జిన్నా తాత రాజ్పూత్ వంశానికి చెందినవారు. అబ్దుల్ భట్ కూడా బ్రాహ్మణుడే. వీరంతా ఇస్లాంలోకి వెళ్లినవారే. సాయిబాబా గుడికి వెళ్లొద్దని శంకరాచ్యా పీఠాధిపతే చెప్పారు. నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో... ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదు. అంతేకాదు ఈరోజు గూగుల్ సెర్చ్లో ఆర్టికల్ 370 అనేది లేదు. కశ్మీర్ ఎంపీలు కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం గాంధీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తోంది’ అని విమర్శలు గుప్పించారు. -
విప్లవాత్మక మార్పునకు జగన్ మాటలు నాంది
-
అలా చేస్తే మరో ముప్పై ఏళ్లు జగనే సీఎం: ఉండవల్లి
సాక్షి, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన తీరును చూస్తే ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. పోలవరం పనులపై జ్యుడిషీయల్ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్ జగన్కు సూచించారు. తూర్పు గోదావరిలో ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సామరస్యంగా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 23వేలకోట్ల ఆస్తులు ఇప్పటి వరకు రాలేదని గుర్తుచేశారు. వాన్పీక్ వైఎస్సార్ డ్రీమ్ అని.. దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని పేర్కొన్నారు. కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఇక్కడ కూడా అమలుచేస్తే.. మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో టీడీపీకి చెందిన హేమాహేమీలు ఓడిపోయారు. పాజిటివ్ ఓటుతో వచ్చిన ప్రభుత్వాలకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం రేట్లు పెంచే విషయంపై పీపీఏను సంప్రదించారా అని అధికారులను అడిగాము. సమాధానం ఇప్పటివరకూ ఇవ్వలేదు. చేసిన పనికన్నా ప్రచారంఎక్కువ చేసుకోబట్టే చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్పై ఉన్న లక్షకోట్ల ఆరోపణలను ఒప్పుకోలేదు. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్ జగన్ను భారీ మెజారిటీతో గెలిపించారు’ అని వ్యాఖ్యానించారు. -
వైఎస్ఆర్తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకావిష్కరణ
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాకుండా అడ్డుకోగలిగారు కానీ, సినిమా చూడలనుకున్న ప్రేక్షకులను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి అభిమానులు తెలంగాణకు తరలివస్తున్నారు. వీరిలో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. రాజమండ్రిలో సినిమా రిలీజ్ కాకపోవటంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైదరాబాద్లో సినిమా చూశారు. (చదవండి : బాహుబలి 2, అర్జున్ రెడ్డిలను వెనక్కి నెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’) లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్లతో కలిసి అరుణ్ కుమార్ సినిమా చేశారు. ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్. #LakshmisNTR pic.twitter.com/GjcWoGbpIU — sirasri (@sirasri) 30 March 2019 -
ఫెడరల్ స్ఫూర్తి రక్షణకు దారి ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోటుపాట్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో జరిపిన పాక్షిక రాజకీయ సభ ‘‘నాకు పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా’’ అన్నట్లుగా ముగిసింది. ‘‘రాష్ట్రాల నిర్మాణంలో/రాష్ట్రాల విభజన సందర్భంలో ఆయా స్థానిక శాసనసభలలో మెజారిటీ తీర్మానం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండాలని నిర్దేశించారు. ఆ షరతును కేంద్ర పాలనా వ్యవస్థ రాజకీయ స్వార్థంకోసం ఉల్లంఘించిన నాడే ఫెడరల్ స్ఫూర్తికి పాతర వేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ సాధ్యమవుతుందని ఉండవల్లి ఆశించడం ఎంతవరకు సాధ్యం? ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన పెక్కు సమస్యల పరిష్కారం వాయిదా పడింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కీలక సమావేశం వాయిదా పడినందున ఈ పరిణామం తలెత్తింది’’ కానీ ఎందుకు వాయిదా పడిందో మాత్రం వివరణ లేదు. (ఫిబ్రవరి 2, 2019 వార్త) ‘‘ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని కేంద్రం సరిదిద్దాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందనే విషయాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేయాలి. తద్వారా రాష్ట్ర హక్కులు సాధించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం రాజకీయ వైరుధ్యాలు పక్కనబెట్టి కలసికట్టుగా పనిచేయాలి’’ – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన విజయవా డలో కొన్ని పార్టీలతో జరిగిన సమావేశం అభిప్రాయం. కానీ ఆ సమావేశం తీర్మానం చేయకుండా ముగిసింది. (జనవరి 29, 2019 వార్త) గత అయిదేళ్లుగా, ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం రాష్ట్ర ప్రయోజనా లకు జరుగుతున్న హానికర పరిణామాలను పరిశీలిస్తుంటే ‘నాంచారమ్మ వంటి నక్షత్ర దర్శనం’ ఒక్కసారే జరిగే అవకాశం లేదన్న తెలుగు సామెత గుర్తుకు రాకమానదు. 2014 నాటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత అది విడిచిన చెప్పుల్లోనే కాళ్లు పెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలులోకి రాకుండా ‘గాలి కబుర్లు’గా ఇంకా గాలి లోనే ఉండిపోయాయి. విజయవాడ పాక్షిక రాజకీయ సభ చివరికి ‘నాకు పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా’ అన్నట్లుగా ముగిసింది. నిజానికి ఆ పరీక్ష ఉండవల్లి తదితర ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు 14మందినీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు బయటకు నెట్టేసి తలుపులు మూసి, మైకులు కట్టేయించి బీజేపీ సభ్యుల సహకారంతో కృత్రిమంగా రాష్ట్రాన్ని విభజించడంతోనే మొదలయింది. మీ తర్వాత రేపట్నుంచి అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి, విభజన సందర్భంగా కాంగ్రెస్ పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి తాలూకు ఇచ్చిన హామీలను మేం నెరవేరుస్తాం అని రాజ్యసభ నిండు పేరోలగంలో బీజేపీ నాయ కులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ పక్షం తాలూకు కపిల్ సిబాల్ ప్రభృతులతో ఆనందంగా చేతులూపుకుంటూ ‘బైబై’ చెబుతున్న వీడియో దృశ్యాలను తెలుగు ప్రజలంతా చూశారు. రాజకీయంలో ఇంత కానరాని కుట్ర పొంచి ఉంటుందా అనుకున్నారు. చివరికి ఏతావాతా ఇప్పటిదాకా ఫలించింది ఉభయ పక్ష కుట్ర రాజకీయమేనని మరిచి పోరాదు. ఈలోగా అంతర్నాటకంలో భాగంగా జరిగిన పని– కాంగ్రెస్ తాను ఇరుక్కుపోయిన రాష్ట్ర విభజన నాటకాన్ని రక్తి కట్టించడం కోసం ‘మూజువాణీ’గా చేసిన ‘మేజువాణి’ చట్టం రూపంలో లేని అయిదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి అనే నోటిమాట. దాంతో కాంగ్రెస్కు తామేమీ తీసిపో లేదన్నట్లుగా మీకెందుకు మేం అధికారంలోకి వస్తున్నాం. పదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని బీజేపీ దండు హామీలు. ఈ తరహా రాజకీయ పోరులో తెలుగు ప్రజలు నానారకాలుగా నలిగిపోయారు. కానీ, ఈలోగా అయిదేళ్లు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు స్థిరమైన రాజధాని గాని, ఇతర రాజ్యాంగ సంబంధమైన పాలనాంగాల నిర్మాణం కానీ పరి పూర్ణ స్థితికి చేరుకోలేదు. పైగా బీజేపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన తెలుగుదేశం అధిపతి, సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రతిపత్తి హోదా షరతును కాస్తా కృష్ణలో ముంచేసి ‘హోదా వద్దు ప్యాకేజీయే మాకు ముద్దు’ అని చాటి ప్రధాని మోదీముందు మోకరిల్లారు. ఇలా చంద్రబాబు ‘పాదాక్రాంత’ రాజకీయాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలు, వారి ఉనికి, జీవనోపాధి భద్రతలకు, పేద సాదల బతుకుతెరువుకూ పెను ప్రమాదం ఏర్పడింది. ఇన్ని అప రిష్కృత సమస్యల మధ్య రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపున ఉనికిని నిల బెట్టుకోడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపున రెండిం టిలో ఒక రాష్ట్రానికి అసలు సమగ్ర రూపు రేఖలే ఇంకా ఏర్పడని పరిస్థితి. రాష్ట్ర కృత్రిమ విభజనకు నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజనకు కాంగ్రెస్ది మొదటి బాధ్యత అనీ, దాన్ని కొనసాగించిన రెండో బాధ్యత బీజేపీదనీ ఉండవల్లి చెప్పింది వాస్తవమే. ఆ విషయంలో పార్టీగా తన కాంగ్రెస్ ‘వాజమ్మ’ పాత్రను ఖండిస్తూ మొదట బయటపడిన ఎంపీ కూడా ఉండవల్లే, ఆ పిమ్మట రాష్ట్రానికి విభజనవల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని 18 వ్యాజ్యాలతో (రిట్ పిటిషన్లు) సుప్రీంకోర్టు తలుపులు తట్టిన వారిలో ఉండవల్లి కూడా ఒకరు. అయితే, నిన్న మొన్నటి విజయవాడ సమావే శందాకా ఈ మధ్యకాలంలో తన తొలి ‘రిట్’ చొరవకు కొనసాగింపుగా సుప్రీంను ఆయన కదిపిన ఉదాహరణ ఈ నాలుగున్నర ఏళ్లలోనూ లేదు. ఆ విరామ సమయంలో రాష్ట్ర వ్యాపితంగా ఉధృత స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు, వృత్తి, విద్య, ఉపాధి శరవేగాన వ్యావసాయక, పారి శ్రామిక రంగాల పురోభివృద్ధికి బాటలు వేయగల ‘ప్రత్యేక హోదా’కు రాజ్యాంగపరంగా పార్లమెంట్ సాక్షిగా చట్టపరంగా హామీని సాధించేం దుకు రాష్ట్ర వ్యాపిత పాదయాత్రల ద్వారా ప్రజలలో నిరంతర చైతన్యం తీసుకువచ్చినవారు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి. కానీ ఈ వాస్తవాన్ని మభ్యపెట్టి, అమావాస్యకో, పౌర్ణానికో మేల్కొని పొలికేకలు పెట్టే కొన్ని సంస్థలతో జగన్ కృషిని పోల్చడం సరైంది కాదు. ఒక్క ఉండవల్లి, వేళ్లమీద లెక్కించదగిన ఒకటి రెండు రాజకీయపక్షాలు తప్ప (అవీ అడపాదడపాగా) రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి సాధన కోసం తెలుగునాట నిరంతర పోరాటం అవిశ్రాంతంగా సాగిస్తున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. ఈ సత్యాన్ని అంగీ కరించడానికి నిజాయితీ కావాలి. అందుకే ‘రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా’కు మద్దతు ఇస్తూ ముందు పత్రాలపై సంతకం పెట్టే వారికే రేపటి వైసీపీ పార్లమెంటు సభ్యుల అండదండలన్న విస్పష్ట్ట ప్రకటనను వైఎ స్సార్సీపీ తప్ప మరొక రాజకీయ పక్షం ప్రకటించిన దాఖలా లేదు. ‘రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్న’ ఉండవల్లి రాజ్యాంగంలోని అధికరణ(3) చాటున జరిగిన తతంగంపై తొలి రాజ్యాంగ నిర్ణయ సభ చర్చల సందర్భంగా నడిచిన శషబిషలను విజయవాడ సమావేశంలో వివరించి ఉండవలసింది. ఎందుకంటే, ‘3వ అధికరణ’ అసలు ఆశయం లేదా నిర్దేశిత ఉద్దేశం– స్వాతంత్య్రానంతరం స్వతంత్ర భారత యూనియన్లో విలీనం కావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాటి రాచరిక సంస్థానాలకు ‘ముగుదాడు’ వేయడమే. కనుకనే దాన్ని (అధికరణ–3) రాజ్యాంగ నిర్ణయసభ 1949లో చేర్చింది. అంతే గాదు, 1955కు ముందున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం ఏ బిల్లునైనా సవరణ బిల్లునైనా పార్లమెంట్ ఆయనకు పంపించినప్పుడు ఆ బిల్లువల్ల ‘అధికరణ–3’ కింద రాష్ట్రాలను, వాటి సరిహద్దుల్ని చీల్చి, విడగొట్టడంవల్ల నష్టపోయే రాష్ట్రాల సంబం ధిత శాసనసభల ‘నిశ్చితాభిప్రాయాన్ని’ (ఎసర్టెన్) ఓటింగ్ ద్వారా రాష్ట్రపతి తెలుసుకోవాలన్న నిబంధన ఉంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 1955 డిసెంబర్ 24న గుంపు (బ్రూట్ మెజారిటీ) బలంతో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించి దాని స్థానంలో శాసనసభకు రాష్ట్రపతి కేవలం ‘రిఫర్’ (ప్రస్తావన) చేస్తే చాలునని, ఓటింగ్ తీసుకోవలసిన అవసరం లేదనీ శాసించింది. ఇదే– తెలుగుజాతి ఉనికికే తరువాత ప్రమాదకరంగా తయారైంది. 1955 నాటి ఈ నిరంకుశ పరిణామాన్ని భారత సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర పాలకుల స్వార్థపూరిత రాజ కీయాలకు పరాకాష్టే 2014 నాటి తెలుగుజాతి కృత్రిమ విభజన. ఈ విషయం తెలిసి కూడా నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్, నాటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు జతగట్టి విభజనను వ్యతిరేకి స్తున్నట్టు ‘నాటకం’ ఆడి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు శాసనసభ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. నిజానికి ఆ అవకాశం శాసనసభకు 1955 తోనే అడుగంటిపోయిందని తెలిసి కూడా ప్రజలకు కళ్లతుడుపుగా ఆ తీర్మానం చేశారని మరచిపోరాదు. అంతేగాదు, ‘దేశ అత్యున్నత న్యాయస్థానం నిశిత పరిశీలనకు, సమీక్షకు, అదుపుతప్పిన అధికారాల చెలాయింపు నకు పార్లమెంట్ అతీతం కాదు’ అని పొడ్వాల్ కేసులో (1993) సుప్రీం తీర్పు ఇచ్చింది. అలాగే ‘అధికరణ’ గురించి 1948 నవంబర్ 17న ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేడ్కర్ మాట్లా డుతూ ‘‘రాష్ట్రాల నిర్మాణంలో/ రాష్ట్రాల విభజన సందర్భంలో ఆయా స్థానిక శాసనసభలలో మెజారిటీ తీర్మానం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండాలని నిర్దేశించారు, రాష్ట్ర శాసనసభ నిర్ణయానుసారం మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆ షరతును ఎప్పుడైతే కేంద్ర పాలనా వ్యవస్థ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉల్లం ఘించడానికి బరితెగించిందో– అప్పుడే ఫెడరల్ (సమాఖ్య) స్ఫూర్తికి పాతర వేయడం జరిగింది. అందువల్ల ఆ పరిస్థితుల్లో పార్ల మెంట్ ద్వారానే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ సాధ్యమవుతుందని కూడా ఉండవల్లి ఆశించడం ఎంతవరకు సాధ్యం? కనుక తెలిసి తెలిసీ ‘నంగనాచులు, తుంగబుర్రలు’గా వ్యవహ రించడం ఎంతవరకు సబబో కూడా ఆలోచించాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (abkprasad2006@yahoo.co.in) -
ఈ అఖిల పక్షం ఎవరి కోసం?
ఉండవల్లి అరుణ్కుమార్ ఓ రాజకీయ మేధావిగా పేరు ప్రఖ్యాతులు కల వారు. ఆయనకు ప్రత్యేక గౌరవం డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డికి అత్యంత సన్నిహి తంగా కొనసాగిన నేపథ్యం. ప్రత్యేకించి ఒక దినపత్రికతో, రాష్ట్రంలోనే రాజకీయ పరిణామాలను నిర్దేశించే స్థాయిని అనుభవించిన సంస్థతో ఢీకొని, మార్గదర్శి చిట్ఫండ్ వ్యవహారా లలో అవినీతి అక్రమాలు జరిగాయని పోరాడిన నేపథ్యం ఆయనది. ఈ రోజు ఆయన అఖిలపక్ష సమావేశం అంటూ ఒక రాజకీయ ప్రహసనానికి తెరలేపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధుల విడుదల తదితర అంశాలపై కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్సీపీ, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తది తర పార్టీలతో ఒక కార్యాచరణ లక్ష్యంగా ఆ సమా వేశం ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. వైఎ స్సార్సీపీ, సీపీఎం ఈ సమావేశంలో పాల్గొనబో మని స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని భావించే ఉండవల్లి ఆ రకంగా అక్రమంగా రాష్ట్రాన్ని విభజిం చిన బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో కలసి ఏం పోరాటం చేస్తారు..? పైగా తిరుపతిలో వెంకన్న పాదాల సాక్షిగా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రక టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ, బాబు కేంద్రంలో నాలుగు సంవత్సరాలు పైబడి అధికారంలో కొనసాగి ప్రత్యేక హోదా అంశం మరుగున పరిచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. అలాగే పవన్ సైతం ప్రత్యేకహోదా కోసం ఒక కార్యాచరణను చిత్తశుద్ధితో చేపట్టిన దాఖలాలు లేవు. పైగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వైఎ స్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుపరచడంపై సమరశీల పోరాటాలు చేశారు. అనేక సభలు, దీక్షలు చేపట్టారు. ఒకానొక దశలో ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ్, పవన్కల్యాణ్ ఒక బృందంగా ఏర్పడి రాష్ట్రానికి జరి గిన అన్యాయంపై పోరాటం అంటూ రాజకీయం మొదలుపెట్టారు. పవన్కల్యాణ్ ఒకఅడుగు ముందు కువేసి జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యే కించి మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే తాను 50 మంది ఎంపీలను తమిళనాడు, తది తర రాష్ట్రాల నుండి అవిశ్వాసానికి వ్యతిరేకంగా సమీ కరించగలనని, మద్దతు కూడగట్టగలనని సవాల్ చేశారు. వైఎస్ జగన్ ఆ సవాలును స్వీకరిస్తూ పవన్ కల్యాణ్ తన రాజకీయ మిత్రుడు అయిన చంద్ర బాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వగలమని లేదా మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పవన్, బాబు ఎంపీలతో మాకు మద్దతు ప్రకటించగలరా అంటూ ప్రతి సవాల్ విసిరారు. కానీ పవన్ ఈ సవాల్కు స్పందించలేదు. పైగా ప్రత్యేక హోదా విషయంలో లోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కు చెందిన అయిదుగురు వైఎస్సా ర్సీపీ ఎంపీలకే చెల్లింది. రాజ్యసభలో విజయ సాయిరెడ్డి సైతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చివరకు ఢిల్లీ ఏపీ భవన్లో లోక్సభకు రాజీనామా చేసి నిరవధిక నిరాహార దీక్షకు మేకపాటి రాజ మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్రావు, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డిలు పూనుకున్నారు. ఈ పరిణామాన్ని ఉండవల్లి కానీ, పవన్ కానీ ఆహ్వా నించి వారికి మద్దతుగా దీక్ష స్థలానికి వెళ్లలేదు. ఇదే సమయంలో ప్రత్యేకహోదా సాధన సమితి వారు చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో ఎంపీలకు తమ మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై పవన్ ఏ రకంగా స్పందించారు? అవినీతి అక్రమాలపై ఆయన కార్యాచరణ ఎలా జరిగింది. రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతాన లాక్కున్న బాబు ప్రభుత్వ నిరంకుశ విధానంపై పవన్ జరిపిన రాజకీయ పోరాటం ఏమిటి? ఇటీవల బాబు పవన్ను తనతో కలసి రాజకీయ ప్రయాణం చేయాలని బహిరంగంగానే ఆహ్వానించారు. ఇవన్నీ తెలిసి కూడూ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్లతో కలసి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం ఉండవల్లి ఏ పోరాటం చేస్తారు? ఇప్పుడు జరిగే రాజకీయ సమీకరణ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. పవన్, బాబు, కాంగ్రెస్ తదితరులతో కలిసి విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అంటూ త్వరలోనే ఉండవల్లి సారథ్యంలో ఒక ఆందోళన జరిగితే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రచార ఆర్భాటాలు, కల్ల బొల్లి ప్రకటనలు ఉండవల్లి విశ్వస నీయతను పెంచ లేవు. నిర్దిష్ట కార్యాచరణ ఆయన రూపొందించు కోవాలి. ఎవరు రాష్ట్ర ప్రయో జనాల కోసం పోరాడ గలుగుతున్నారు అనే అంశం ఉండవల్లి అర్థం చేసుకోవాలి. అటువంటి శక్తులతో కలసి ఆయన కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
రాష్టం కోసం అందరూ కలిసి పోరాడాలి
-
ఏపీ ప్రజలకు ఎందుకీ ఖర్మ..?
సాక్షి, విశాఖపట్నం: మే నెలలో పోలవరం నీరు ఇస్తామని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ సమయంలో గోదావరిలో నీళ్లు ఉండవన్న సంగతి తెలియదా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. గోదావరి నుంచి గ్రావీటితో నీళ్లు రావని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. లక్షా 45వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ప్రారంభమని ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమేనని అన్నారు. ఇప్పటి వరకు కడుతున్నవి తాత్కాలిక భవనాలేనని.. ఆంధ్ర ప్రజలకు ఎందుకు ఈ ఖర్మ అని వ్యాఖ్యానించారు. (చంద్రబాబుకు ఉండవల్లి సూటి ప్రశ్న) శ్వేతపత్రాలపై చర్చకు ప్రభుత్వం తరఫున ఎవరు స్పందించడం లేదన్నారు. మోసం చేయడానికే శ్వేతపత్రాలు అంటే ఎవరేం చేసేది లేదని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రాలపై ఐఏఎస్ అధికారులతో చర్చ పెట్టాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పోలవరం, ఇరిగేషన్, ఆదరణ, ఎల్ఈడీ బల్బులు, అన్నా క్యాంటీన్ సహా వేటిపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 600 రూపాయలు ఖరీదు చేసే ఎల్ఈడీ బల్బు అని.. 7వేల రూపాయలు ఖరీదు చేసే సెల్ఫోన్ను 12వేల రూపాయలని శ్వేత పత్రంలో చూపారని అన్నారు. ప్రతి రంగంలో జరుగుతున్నా అవినీతి అద్దం పట్టేలా కనిపిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. ఆరోపణలపై స్పందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని అన్నారు. -
‘చెప్పండి బాబూ.. లింక్ ఎలా కుదురుతుంది’
సాక్షి, రాజమండ్రి : శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. 10 రోజులు అమరావతిలోనే ఉంటానని దమ్ముంటే టీడీపీ ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఓవైపు ఏపీ టాప్లో ఉందంటూ శ్వేతపత్రంలో గొప్పలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మోసం చేసిందని అంటున్నారు. ఈ రెండింటికి లింక్ ఎలా కుదురుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. శ్వేతపత్రంలో ఉన్న నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. శ్వేతపత్రంలోని అంశాలు నిజాలే అయితే చర్చ పెట్టండి అని పునరుద్ఘాటించారు. చర్చలో తనది తప్పని తేలితే క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. ఏం అంశంపై అయినా తప్పులు మాట్లాడి చంద్రాబాబు దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఇంకా మాయ చేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అది మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారమే.. అన్నా క్యాంటిన్ భోజనం మధ్యాహ్న భోజన పథకంలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. అన్నా క్యాంటిన్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయితే.. యభై లక్షలుగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పోలవరం, అమరావతి నిర్మాణాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.