Veerappa Moily
-
సిద్దరామయ్యకు ఝలక్.. కర్ణాటక సీఎంగా డీకే?
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇక, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరొకరు ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం’అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధూ దృష్టికి తేగా.. ‘నేను హైకమాండ్ అదేశాల మేరకే నడుచుకుంటాను’ అని ఆయన బదులిచ్చారు. -
మొయిలీ కుమార్తె హంస కన్నుమూత
బొమ్మనహళ్లి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూతురు హంస మొయిలీ (46) అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీ పనిపై చత్తీస్గడ్లో ఉన్న మొయిలీ వెంటనే బెంగళూరుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుపుతారు. మొయిలీ మూడవ కుమార్తె అయిన హంస సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. ఆమె మొదటి నుంచి భరతనాట్య కళాకారిణి. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2007లో దేవదాసీల జీవిత చరిత్రతో తమిళంలో నిర్మించిన శృంగారం అనే సినిమాలో ఆమె నటించారు. నాటకాలలోనూ నటించారు, కవితల సంపుటిని కూడా రచిండంతో పాటు యోగా సాధకురాలిగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంగా ఉన్న హంస ఇటీవలే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అనేకమంది ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
బజరంగ్ దళ్ను బ్యాన్ చేయలేం: మొయిలీ
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే గనుక బజరంగ్ దళ్ను, పీఎఫ్ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ స్వరం మార్చింది. అలాంటి ప్రతిపాదన ఆచరణకు వీలుపడదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం ఉడిపిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బజరంగ్ దళ్ నిషేధంపై ఆయన స్పందించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు బజరంగ్ దళ్ గురించి మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. ఇది అన్ని రాడికల్ గ్రూప్లకు వర్తిస్తుందని చెప్పాం. కానీ, అలా నిషేధించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, కర్ణాటక ప్ఱభుత్వం బజరంగ్ దళ్ను బ్యాన్ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంపై కర్ణాటక బీజేపీ చీఫ్ డీకే శివకుమార్ మీకు (మీడియాను ఉద్దేశించి..) మరింత స్పష్టత ఇస్తారు. చివరకు సుప్రీం కోర్టు కూడా విద్వేష రాజకీయాలకు ముగింపు ఉండాలని తన తీర్పులో అభిప్రాయపడింది. కాబట్టి.. అలాంటి ప్రతిపాదనేం మేం చేయట్లేదు. కాంగ్రెస్ నేతగా ఈ విషయాన్నే మీకు స్పష్టం చేయదల్చుకున్నా’’ అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిషేధం గురించి స్పష్టమైన వివరణ ఉంది. మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ప్రజలందరి మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాలను రగిలించే గ్రూపులను నిషేధించి తీరతామని పేర్కొంది. ఆ లిస్ట్లో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ కూడా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఈ అంశంపై బీజేపీపై భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా కాంగ్రెస్పై మండిపడ్డారు. ఈ తరుణంలో.. ఇప్పుడు కర్ణాటక ఆ ప్రకటనపై వెనక్కి మళ్లడం గమనార్హం. ఇదీ చదవండి: కర్ణాటక ఎన్నికల్లో ఇదో సిత్రం.. తనకు తానే కిడ్నాప్ చేసుకుని.. -
మీరు ఏ ఎన్నికల్లో గెలిచారు?!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని గళమెత్తుతున్న జి–23 (గ్రూప్ ఆఫ్ 23) నాయకులపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్(68) మండిపడ్డారు. త్యాగాలతోనే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అకస్మాత్తుగా ప్రశ్నించడం ద్వారా కాదని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. జి–23లోని చాలామంది పెద్దలు పార్టీ పదవుల్లో నామినేట్ అయిన వాళ్లేనని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతూ అదే విధానాన్ని(నామినేట్) ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల రణరంగంలో ముందంజలో నిలవాలంటే కాంగ్రెస్కు పెద్ద శస్త్రచికిత్స అవసరమని జి–23 నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మా నాయకుడు పదేళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు నేతలు చేసే ‘అద్భుత వ్యాఖ్యానాల’తో పరిష్కారం దొరకదని సల్మాన్ ఖుర్షీద్ చురక అంటించారు. పార్టీ నేతలంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలని, సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఆయన పార్టీ అధినేత అయినా కాకపోయినా తమ నాయకుడిగా మాత్రం ఉంటారని వెల్లడించారు. సంస్కరణలు, శస్త్రచికిత్స అంటూ కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ లేవనెత్తిన అంశాలపై ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘‘శస్త్రచికిత్స చేస్తానంటే నేను సంతోషిస్తా. కానీ, నా కాలేయం, మూత్రపిండాలు తీసుకుంటానంటే ఎలా? ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనుకుంటున్నారో దయచేసి ఎవరైనా చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సర్జరీ చేయాల్సిందేనని, అయితే, దానివల్ల సాధించదేమిటో, కోల్పోయేదేమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్జరీ కంటే ముందు ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు అవసరమని తెలిపారు. సమస్య లోతుల్లోకి వెళ్లాలని, దానికి పరిష్కారాన్ని కనిపెట్టాలని అన్నారు. పదవులు వదులుకుంటేనే సంస్కరణలు సాధ్యం సర్జరీ, సంస్కరణలు, ప్రాథమిక మార్పు తీసుకురావడం అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. వాటి అర్థాలేమిటో తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని, వారికి (జి–23 నాయకులు) కీలక పదవులు దక్కాలని కోరుకుంటున్నారేమో తెలియదు. అదే నిజమైతే అది సంస్కరణగానీ, సర్జరీ గానీ కాబోదు. ‘నాకొక›పదవి కావాలి’ అని కోరుకోవడం మాత్రమే అవుతుంది’’ అని తేల్చిచెప్పారు. సంస్కరణ అం టూ మాట్లాడుతున్న నేతలు తొలుత ఇతర నాయకులతో మాట్లాడాలని సూచించారు. వారు తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎన్నికలు జరగాల్సిందే. అయితే, ఏ ఎన్నికల్లో గెలిచి వారు (జి–23 నేతలు) ఇప్పుడున్న స్థానాలను చేరుకున్నారో గుర్తుచేస్తే మాలాంటి వారు సులభంగా అర్థం చేసుకుంటారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచి వారంతా పదవులు చేపట్టారా?’’అని ఖుర్షీద్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సంస్కరణ అనేది అకస్మాత్తుగా సాధ్యం కాదని, పొందినదాన్ని వదులుకున్నప్పుడే అది సాకారమ వుతుందని తెలిపారు. పార్టీలో మార్పు రావాలని కోరుకున్నప్పుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు. -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్తో న్యూస్ పేపర్పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ అవార్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్కు ఇంగ్లిష్లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్కు ఈ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది. మొయిలీ, అరుంధతి కాకుండా, ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణి), హరీశ్ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్ దేవన్(మణిపుర్), రూప్ చంద్ హన్స్దా(సంతాలి), నందకిషోర్(మరాఠీ), మహేశ్చంద్ర గౌతమ్(సంస్కృతం), హుస్సేన్ ఉల్ హక్(ఉర్దూ), అపూర్వ కుమార్సైకియా(అస్సామీ), దివంగత హిదయ్ కౌల్ భారతి(కశ్మీరీ), ధరనింధర్ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు. -
‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’) కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. శశి థరూర్, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఏకగ్రీవంగా తీర్మానించడంతో.. పార్టీలో చెలరేగిన ప్రకంపనలు చప్పున చల్లారిపోయాయి.(చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) ఈ పరిణామాల గురించి వీరప్ప మొయిలీ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘‘‘పార్టీ కోసం సోనియాజీ చేసిన త్యాగం గురించి మాకు తెలుసు. అందుకు మేం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఎన్నో ఏళ్లుగా మేం కూడా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టే పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అధినాయకత్వ దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అంతేతప్ప సోనియా గాంధీ మనోభావాలను కించపరచుకోవాలనుకోలేదు. ఆమెపై గౌరవం అలాగే ఉంటుంది. అయితే అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం దానిని ఆశించే మేం లేఖ రాశాం. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఆమె మాకు తల్లిలాంటి వారు. తొలుత అధ్యక్షురాలిగా కొనసాగేందుకు నిరాకరించినా తర్వాత ఆమె అంగీకరించారు. ఆమె మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమె పట్ల మా ప్రేమ తగ్గదు. అయితే మేం రాసిన లేఖ ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అనేకసార్లు ద్రోహం చేసిన వాళ్లే.. పార్టీ విధేయులుగా నటిస్తూ తమ విధేయతనే ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా సీనియర్ నాయకుల తీరుపై ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సీనియర్ నేతలు ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి. -
ముందుచూపు లేని మోదీ సర్కారు
ముంబై: మోదీ సర్కారు ముందుచూపు లేకుండా లాక్డౌన్ విధించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డాన్ వల్ల తలెత్తె పరిణామాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లిందని దుయ్యబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధం చేసినట్టుగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో ఆర్థిక లోటు గురించి ఆలోచించకుండా ప్రజలకు అన్నిరకాలుగా సాయం అందించాలని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. 21 రోజుల నిర్బంధం గడువు ముగిసిన తర్వాత లాక్డౌన్ బాధితులకు అండదండలు అందించాలని కేంద్రానికి సూచించారు. ‘ఇది(కోవిడ్పై పోరు) యుద్ధం లాంటిదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. ఆర్థిక లోటును సవరించుకుని అత్యవసర పరిస్థితిని తక్షణం ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కరోనా నివారణ చర్యలకు ప్రైవేటు రంగం సరైన విధంగా స్పందించలేద’ని వీరప్ప మొయిలీ అభిపప్రాయపడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్లో ‘తబ్లిగీ జమాత్’ను అనుమతించడాన్ని పెద్ద తప్పిదంగా ఆయన వర్ణించారు. ‘ఈ తెలివైనోళ్లంతా అప్పుడు ఏం చేస్తున్నారు. కరోనా పరిణామాల గురించి పూర్తిగా తెలిసినా అధికార యంత్రాంగం ఎందుకు తబ్లిగీ జమాత్ను అనుమతించింద’ని మొయిలీ ప్రశ్నించారు. కాగా, కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యాఖ్యానించింది. (భారత్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాదు) -
‘రాహుల్ వెళ్లి పోవచ్చు కానీ..’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధ పడటం.. సీనియర్ నాయకులు అందుకు అంగీకరించకపోవటం వంటి విషయాలు తెలిసిందే. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి రాహుల్ గాంధీ రాజీనామాను అంగీకరించారు. అయితే దానికి ఒక షరతు పెట్టారు. రాహుల్ స్థానంలో సమర్థుడైన ఓ కొత్త వ్యక్తిని నియమించిన తర్వాతనే ఆయన రాజీనామా చేయాలని వీరప్ప మొయిలి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్ ఆలోచించేది సరైందే. అయితే ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే వెళ్లొచ్చు. అయితే పార్టీకి నూతన సారథిని వెతికి పెట్టిన తర్వాతే ఆయన ఆ పని చేయాలి. ప్రస్తుతం పార్టీ సంక్షోభ స్థితిలో ఉంది. ఈ స్థితిని నుంచి పార్టీని గట్టెంచిగలిగేది రాహుల్ మాత్రమే. ఆయన నాయకత్వ లక్షణాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే కావు. జాతీయ స్థాయి బాధ్యతల విషయం. అలాంటి బాధ్యతను సరైన వ్యక్తి చేతిలో పెట్టాకే రాహుల్ రాజీనామా చేయాలి’ అని మొయిలి అన్నారు. -
కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సిగ్గు చేటన్నా రు. శనివారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కుంతి యా, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, జైపాల్రెడ్డి, జెట్టి కుసుమ కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్లు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు సబి తా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్దన్రెడ్డి, బానోత్ హరిప్రియ, కందాల ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు ఫిరాయింపులపై స్పందిం చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు ఇదే చివరి హెచ్చరిక: మొయిలీ ‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి. ఈ తతంగమంతా సీఎం కార్యాలయం కేంద్రంగానే నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నామని విడుదల చేసిన లేఖలన్నీ ఒకే విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే విషయమై పలుమార్లు మా పార్టీతోపాటు టీడీపీ స్పీకర్కు అనేక పిటిషన్లు ఇచ్చింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై ఎలాంటి వేటు పడలేదు. కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. దీనికి కారణం సీఎం కేసీఆరే. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల తరువాత కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం దారుణం. కేసీఆర్ రాజ్యంగ విలువల్ని, రాజధర్మాన్ని విస్మరించారు. ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి కేసీఆర్ అక్రమాలపై రాజ్యాంగాధినేతగా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ను కోరాం. సీఎం కేసీఆర్కు ఇదే మా చివరి హెచ్చరిక. గవర్నర్కు ఇదే చివరి వినతి’’అని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు తెలంగాణలో 29% ఓటు బ్యాంకు, 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే ఫిరాయింపు లను టీఆర్ఎస్ ప్రోత్సహించడం దారుణమని మరో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి విమర్శించారు. నేను నరసింహన్ను.. ఉత్సవ విగ్రహాన్ని కాదు : గూడూరుతో గవర్నర్ వ్యాఖ్యలు పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ను కాంగ్రెస్ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చిన సమ యంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రె స్ నేత గూడూరు నారాయణరెడ్డి తనను ఉత్సవ విగ్రహంగా గతంలో అభివర్ణించడాన్ని నరసింహన్ ప్రస్తావించారు. గవర్నర్ సిబ్బంది ఒకరు గూడూరు ను నరసింహన్కు పరిచయం చేయగా ‘‘నేను నరసింహన్ను, అంతటా ఉంటాను. ఉత్సవ విగ్రహాన్ని కాదు’’అని వ్యాఖ్యానించారు. -
‘రఫేల్’ అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఆరోపించారు. రఫేల్ విమానాల కొనుగోలు కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని ఫ్రాన్స్లోని కంపెనీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే రూ. 520 కోట్లుగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంచనాలను రూ. 1,600 కోట్లకు పెంచారని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొçన్నం ప్రభాకర్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ భద్రతపై ప్రధాని మోదీ రాజీపడి, భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. ఈ ఒప్పందంపై చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త ప్రశ్న తలెత్తుతుందన్నా రు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ చేయించాలన్నారు. మేకిన్ ఇండియా గురించి చెప్పే మోదీ ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం తప్పుడు సమాచారంతో సుప్రీంకో ర్టును సైతం తప్పుదోవ పట్టించి, కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసిందని విమర్శించారు. కాగ్ నివేదికను పీఏసీకే సమర్పించలేదని, అలాంటి నివేదిక ఏదీ లేకుండానే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించిందన్నారు. దీనిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని ఎందుకు వణికిపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. -
ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి మొయిలీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్వన్నీ వంచన రాజకీయాలేనని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మాజీ కేంద్ర మంత్రి రహమాన్ ఖాన్, ఎంపీ నాసిర్ హుస్సేన్, కర్ణాటక మాజీ హోంమంత్రి రామలింగారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో నేనూ ఆ సమావేశంలో ఉన్నాను. నాకు సీఎం పదవి వద్దు. సీఎల్పీ ఇస్తే చాలన్నాడు. కానీ మాట నిలబెట్టుకోలేదు. వంచించడమే ఆయన విధానం. తెలంగాణ ప్రజలకు సైతం అనేక హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు’ అని మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్లో అభివృద్ధి ఊహించని రీతిలో జరిగిందని, టీఆర్ఎస్ రాగానే అది కుంటుపడిందన్నారు. ఐటీ సహా ఇతర అంశాల్లో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడిందని, ప్రస్తుతం హైదరాబాద్కు ఆ ప్రభ లేదని చెప్పారు. కొత్త పరిశ్రమలేవీ హైదరాబాద్కు రాలేదన్నారు. అవినీతి, ఆత్మహత్యల్లో రెండో స్థానం.. తెలంగాణ రాష్ట్రం అవినీతి, ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని మొయిలీ అన్నారు. ఇక, నిరుద్యోగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో మొత్తం జనాభాలో 70 శాతం పేదరికంలోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఎక్కువ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని, దొంగతనాలు 17 శాతం, కిడ్నాప్లు 31 శాతం, రేప్ కేసులు 30 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. బీజేపీతో కుమ్మక్కై సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, బీజేపీ తోడేలు పాత్ర పోషిస్తుంటే, టీఆర్ఎస్ గొర్రెల కాపరి పాత్ర వహిస్తోందని మొయిలీ ఆరోపించారు. -
అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి -
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు : వీరప్ప మొయిలీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూడా పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... రక్షణ సంబంధమైన అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొయిలీ విమర్శించారు. దేశ రక్షణ కోసం 126 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు.. రాఫెల్ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందని ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ కంపెనీకి ఎన్డీయే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. ఈ కాంట్రాక్టుకు 12 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశారని... తద్వారా 61 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడమంటే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని మొయిలీ విమర్శించారు. పార్టీ తరపున మెమోరాండం ఇస్తాం.. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారణ జరపాలని కోరిన విషయాన్ని మొయిలీ గుర్తుచేశారు. ప్రతీ వేదికపై రాహుల్ ఈ విషయాన్ని లేవనెత్తుతున్నా.. మోదీజీ మాత్రం మౌనంగానే ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయమై సెప్టెంబరు 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారని తెలిపారు. అదే విధంగా 24న గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మెమోరాండం అందజేస్తామని పేర్కొన్నారు. -
‘పులిని తిరిగి అడవికి పంపే సమయం వచ్చేసింది’
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలను కోతులు, నక్కలతో మోదీని పులితో పోల్చిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. హెగ్డే వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ స్పందిస్తూ క్రూర మృగంగా మారిన పులిని తిరిగి అడవికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కర్ణాటకలోని కర్వార్లో శుక్రవారం ఓ సభలో పాల్గొన్న హెగ్డే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పులి లాంటి మోదీనే ఎంపిక చేసుకుంటారని కోతులు, నక్కలతో కూడిన విపక్షాలను కాదని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఏడాది జనవరిలో దళితులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించగా తాను వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తనను టార్గెట్ చేసిన కుహనా మేథావులను ఉద్దేశించి అలా అన్నానని వివరణ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. -
పార్లమెంటరీ ప్యానల్ ముందుకు పీఎస్బీల సారథులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్యలు, మోసపూరిత కేసులపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆర్థిక శాఖ స్థాయీ సంఘం దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ ముందు ఐడీబీఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు అధినేతలు మంగళవారం హాజరై తమ ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే కమిటీ ముందు ఈనెల మొదట్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) రూ.8.99 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలే రూ.7.77 లక్షల కోట్లు కావడం గమనార్హం. మరోపక్క మోసపూరిత కేసు లూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. -
కాంగ్రెస్లో ట్వీట్ల రగడ
సాక్షి,బెంగళూరు : వచ్చే ఎన్నికల్లో మంత్రి మహదేవప్ప ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో కీలకపాత్ర పోషించనున్నారని మాజీ సీఎం, ఎంపీ వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్లు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ట్వీట్లు పార్టీకి ప్రమాదకారిగా మారుతాయని కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజా పనులశాఖ మంత్రితో కలిగిన సంబంధాలే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను నిర్దేశించనున్నాయంటూ వీరప్పమొయిలీ ట్విట్టర్ఖాతాలో ట్వీట్లు దర్శనమిచ్చాయి. దీంతో పార్టీలో నేతల మధ్య అసంతృప్తి, భేదాభిప్రాయాలు తలెత్తాయంటూ దావాలనంలా వ్యాపించిన వార్తలు సీఎం సిద్దరామయ్య తదితర సీనియర్ నేతలకు తలనొప్పిగా మారింది. వీరప్ప మొయిలీ ట్వీట్లను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, కాంగ్రెస్ హైకమాండ్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరప్ప మొయిలీ ట్వీట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే తమ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లపై మాజీ సీఎం వీరప్పమొయిలీ వివరణ ఇచ్చుకోసాగారు. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా ట్వీట్లు చేసారని మొయిలీ ఆరోపించారు. ట్వీట్ల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ వేణుగోపాల్ వివరణ కోరగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తాము పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుమారుడు హర్షపై కూడా విమర్శలు వ్యక్తమవుతుండటం తమను మరింత క్షోభకు గురి చేస్తోందంటూ వీరప్పమొయిలీ ఆవేదనకు లోనయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ట్వీట్లను వీరప్పమొయిలీ ఖాతా నుంచి తొలగించగా తమ కుమారుడు హర్షకు టికెట్ దక్కే అవకాశం లేదంటూ సమాచారం అందండంతోనే మాజీ సీఎం వీరప్పమొయిలీ ఈ విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం వీరప్పమొయిలీ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లు కాంగ్రెస్లో ప్రకపంపనలు సృష్టిస్తుండగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడానికి ఆయుధాల్లాగా పరిణమించాయి. వీరప్పమొయిలీ చేసిన ట్వీట్ల ఆధారంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పదిశాతం కమీషన్ల ప్రభుత్వమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్పమొయిలీ తమ ట్వీట్ల ద్వారా వాటిని నిజం చేసారన్నారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్లపై విమర్శలు, ఆరోపణలు చేసిన సీఎం సిద్దరామయ్య తదితర కాంగ్రెస్ నేతలు వీరప్ప చేసిన ట్వీట్లకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడ కూడా ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజాపనుల శాఖా మంత్రి మహదేవప్ప, పది శాతం ప్రభుత్వ పోస్టర్బాయ్ సీఎం సిద్దరామయ్య ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ విమర్శించారు. బహుశా కమీషన్లు, నల్లధనం సేకరణలో తీరిక లేకుండా గడుపుతున్నారేమోనని విమర్శించారు. ఇది ముగిసిన అధ్యాయం... తమ ట్విట్టర్ఖాతాను ఎవరో హ్యాక్ చేసారని తమ ట్విట్టర్ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లకు తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మాజీ సీఎం వీరప్పమొయిలీ స్పష్టం చేసారని, ఇక దీనిపై చర్చ అనసవసరమని ఇది ముగిసిన అధ్యాయమంటూ మంత్రి మహదేవప్ప తెలిపారు. శుక్రవారం ఇదే విషయంపై మంత్రి మహదేవప్ప మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో వీరప్ప మొయిలీ ప్రముఖులని అటువంటి వ్యక్తి ట్విట్టర్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇది ఎవరో కాంగ్రెస్లో చిచ్చు పెట్టే ఉద్దేశంతో చేసిన దుశ్చర్యగా తాము భావిస్తున్నామని ఈ పరిణామాలు వీరప్పమొయిలీకి తమకు మధ్యనున్న సత్సంబంధాలు దెబ్బ తీయలేవంటూ స్పష్టం చేశారు. -
మా పార్టీలో డబ్బే ముఖ్యం: వీరప్ప మొయిలీ
బెంగళూరు: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ శుక్రవారం చేసిన ఓ ట్వీట్తో వివాదం చెలరేగింది. ‘రాజకీయాల్లో డబ్బు సమస్యను కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజా పనుల విభాగం మంత్రి (మహదేవప్ప)తో కాంట్రాక్టర్లకున్న సంబంధాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి సరైంది కాదు’ అని మొయిలీ ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్ పేర్కొంది. అయితే ఇది ధ్రువీకృత ఖాతా కాదు. ‘ఆ ట్వీట్ను నేను చేయలేదు. అది వేరెవరో చేసిన తప్పు. ఆ ట్వీటర్ ఖాతా నా నియంత్రణలో లేదు’ అని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొయిలీ కుమారుడు హర్షకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల విభాగం మంత్రి మహదేవప్ప ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. -
జయలలిత పార్టీ నాశనం అవుతుందా ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజకీయ నేతగా మారిన కమల్ హాసన్ కొత్త పార్టీకి తమిళనాడులో పెద్దగా చోటు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఒకప్పుడు తమిళనాడుకు ఇన్చార్జ్గా వ్యవహరించిన వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన పార్టీ పెద్దగా ఎదగబోదని, చాలా తక్కువ మార్జిన్ మాత్రమే సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలని, మరోపక్క, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించారని, ఈ నేపథ్యంలో కమల్, రజినీల పార్టీలు ముందుకెళ్లగలగాలంటే డీఎంకే, అన్నాడీఎంకేలతో కలవాల్సిందేనని చెప్పారు. ఆ పార్టీలతో సంబంధాలు పెట్టుకోకుండా వారు మనుగడ సాగించడం కష్టమని అంచనా వేశారు. తమిళనాడులో ఉన్న చోటంతా కూడా డీఎంకే, అన్నాడీఎంకేలే ఆక్రమించాయని, కమల్కు భారీగా చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదన్నారు. బహుషా అన్నాడీఎంకే కూలిపోవచ్చని, ఆ స్థానాన్ని తాను ఆక్రమిస్తానని కమల్ అనుకుంటూ ఉండొచ్చేమోనని, అలా జరుగుతుందని మాత్రం తనకు అనిపించడం లేదని మొయిలీ సందేహం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను డామినేట్ చేసేలాగా కమల్ ప్రాంతీయ అజెండా ఉంటే మాత్రం చెప్పలేమని అభిప్రాయపడ్డారు. డీఎంకేతో కాంగ్రెస్ పార్టీది బలమైన సంబంధం అని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఇప్పటికిప్పుడైనా ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నారు. -
సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ పాత్ర మున్ముందు కూడా కొనసాగుతుందని పార్టీ సీనియర్ నేత ఎం.వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. త్వరలోనే ఆ బాధ్యతలను ఉపాధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్గాంధీకి అప్పగించేందుకు రంగం సిద్ధమయిన విషయం విదితమే. దీనిపై మొయిలీ మాట్లాడుతూ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ సోనియా పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తల్లిగా కూడా సోనియా గాంధీ దాదాపు 19 ఏళ్లపాటు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు మోశారని గుర్తు చేశారు. ఇకపైనా ఆమె పార్టీకి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత నిర్ణయాత్మకంగా, చురుగ్గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. -
మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు?
విశాఖ : రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. పాలన అంతా సంగ్ పరివార్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో అందరూ ఇబ్బంది పడ్డారని, చివరకు ప్రతి లావాదేవిపై పన్ను వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ మరి విజయ్ మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారని మొయిలీ ప్రశ్నించారు. -
కాంగ్రెస్కు మొయిలీ చురకలు
న్యూఢిల్లీ :ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈ అంశంపై సొంతపార్టీ నిర్ణయంతో విభేదించారు. సీనియర్ల నుంచి అభిప్రాయం తీసుకోలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్ జత కలవడాన్ని మొయిలీ తప్పుబట్టారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంల విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే ఫిర్యాదులు కూడా అందయని, వాటన్నిటిని తాము సమీక్షించడం జరిగిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ అత్యున్నతమైనదని, ఈ ఘనత కాంగ్రెస్, యూపీఏలకు దక్కుతుందన్నారు. మళ్లీ బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు వెళ్లేది లేదని ఆయన అన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓటమికి కేవలం ఈవీఎంలు మాత్రమే కారణం కాదని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే ఓడినవాళ్లు తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించడం సరికాదని ఆయన చురకలు అంటించారు. మిగతా దేశాలతో పోల్చితే మన ఎన్నికల నిర్వహణా విధానం ఉత్తమమైనదని మొయిలీ అన్నారు. ఆ ఘటన యూపీఏతో పాటు కాంగ్రెస్ పార్టీకే దక్కుదుందన్నారు. ఈ నేపథ్యంలో మొయిలీ బుధవారం ఉదయం విపక్ష నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఈవీఎంల వినియోగంపై 13 పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే సహా పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ఈసీని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఈసీని కోరాయి. ఈవీఎంలపై తమ అనుమానాల్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా పార్టీలు ఎన్నిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి. -
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
-
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది. ‘పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకుకు కేంద్రం కోరింద’ని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో నకిలీ రూ. 500, వెయ్యి రూపాయల చెలామణి పెరగడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది. కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు(నవంబర్ 8) సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవనీ చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు. -
నోట్ల కిలాడీ అరెస్ట్
రూ. 25 కోట్ల నోట్ల మార్పిడి వ్యవహారంలో.... ► పారిపోతుండగా ముంబై ఎయిర్పోర్టులో పట్టుకున్న ఈడీ న్యూఢిల్లీ/రాయ్పూర్: రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్కతా వ్యాపారి పరాస్ ఎం ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోధాపై అంతకుముందే లుకౌట్ నోటీసు జారీ కాగా... ముంబై ఎయిర్ పోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిబ్బంది బుధవారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో రూ. 25 కోట్ల మేర పాత నోట్ల మార్పిడితో లోధాకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కస్టడీ కోరుతూ అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అస్సాంలో రూ. 2.3 కోట్ల కొత్త నోట్లు ఐటీ అధికారులు గురువారం అస్సాంలోని నగౌన్ పట్టణంలో వ్యాపారవేత్త అముల్య దాస్ నుంచి రూ. 2.3 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇల్లు, వ్యాపార కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో భారీగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఐటీ అధికారులు ఒక ఫైనాన్షియర్ నుంచి రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 43 లక్షల మేర కొత్త కరెన్సీగా గుర్తించారు. ఆ ఫైనాన్షియర్ ఎన్నడూ పన్ను చెల్లించలేదని, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఐటీ అధికారులు కనుగొన్నారు. అప్రకటిత ఆదాయం రూ. 10.3 కోట్ల వరకూ ఉన్నట్లు అతను వెల్లడించాడు. పార్లమెంటరీ కమిటీ ముందుకు ఉర్జిత్ జనవర్ 19న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు అంశాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై వివరించనున్నారు. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాౖటెన స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు అనంతరం పలువురు నిపుణులు ప్యానల్ ముందు హాజరై తమ అభిప్రాయాల్ని తెలిపినట్లు మెయిలీ పేర్కొన్నారు. -
మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అవసరముందని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థపై మొండి బకాయిలు భారంగా మారతాయని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అధ్యక్షతన గల ఈ సంఘం రూపొందించిన నివేదిక హెచ్చరించింది. 31మంది సభ్యులుగా గల ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంట్కు సమర్పించిన నివేదిక ప్రకారం..రుణాలు మొండి బకాయిలుగా మారకుండానే తగిన సమయంలో బ్యాంకులు జోక్యం చేసుకోవాలి. ఒకవైపు మనం ఆర్థికంగా సంపన్నమైన దేశాలతో పోటీ పడుతున్నాం. మరోవైపు బ్యాంకుల మొండి బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ మొండి బకాయిల సమస్య కారణంగా బ్యాంక్ల మూలధనం, లిక్విడిటీ హరించుకుపోతున్నాయి. భవిష్యత్తులో మూలధనం సమీకరించే బ్యాంకుల సత్తా కూడా క్షీణిస్తోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.80వేల కోట్లుగా ఉన్నాయి. జూన్ నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న బ్యాంక్ల మొండి బకాయిలు సెప్టెంబర్కి రూ.6,30,323 కోట్లకు పెరిగాయి. -
కాంగ్రెస్ను గెలిపించాలి: ఎపీ మొయిలీ
ఎత్తినహొళె పథకం నిర్విఘ్నంగా సాగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి: ఎపీ మొయిలీ దొడ్డబళ్లాపురం : బయలుసీమ జిల్లాలకు శాశ్వత సాగు, తాగునీరందించే ఎత్తినహొళె పథకం నిర్విఘ్నంగా సాగాలంటే జిల్లా,తాలూకా పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని స్థానిక ఎంపీ ఎం వీరప్ప మొయిలీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఆయన దొడ్డ బళ్లాపురం తాలూకాలో దొడ్డబెళవంగల, కొడిగేహళ్లి, రాజఘట్ట, బాశెట్టిహళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చివరగా రాజఘట్టలో ఏర్పాటు చేయబడిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల జీ లక్ష్మిపతి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ఆఫ్రికన్ విద్యార్థుల పై దాడి, ప్రతిదాడుల విషయానికి సంబంధించి మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఆఫ్రికన్ విద్యార్థుల విషయంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో బయాప అధ్యక్షుడు ఆర్జీ వెంకటాచలయ్య, ఎమ్మెల్యే వెంకట రమణయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహం సరికాదు:మొయిలీ
ఏపీ, తెలంగాణలపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరిబాబు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండడంపై కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ, తెలంగాణలకు అదనపు పెట్టుబడి అలవెన్స్, డిప్రిసియేషన్ అలవెన్స్లను ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమే. దీని పర్యవసనాలేంటో ప్రభుత్వానికి తెలుసా? ఈ కారణంగా కేరళ, కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలకు దక్కాల్సిన పెట్టుబడులన్నీ ఆ రెండు రాష్ట్రాలకే వెళ్తాయి. ఒక పద్ధతి ఉండాలి. ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు. వ్యతిరేకించడం తగదు: బీజేపీ ఎంపీ హరిబాబు ఏపీకి కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ వ్యతిరేకించడం తగదని, ఈ చర్యలు కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదని ఓవైపు కోటి సంతకాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టగా, మరోవైపు మొయిలీ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. -
పదవుల పందేరం
కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల నియామకానికి కసరత్తు ఆశావహులు పదివేలకు పైగా 900 మందికి స్థానం నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం బెంగళూరు : రాష్ట్రంలోని కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ బోర్డు పదవులకు సంబంధించి అధ్యక్షులు, సభ్యులుగా 900 మందిని నియమించే అవకాశాలుండగా, ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మాత్రం 10వేల మందికి పైగా కావడం గమనార్హం. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో 900 మందిని ఎంపిక చేసేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్లు ఇంతకు ముందు చర్చలు జరిపారు. అయితే తుది జాబితాను సిద్ధం చేయాల్సిన తరుణంలో దళిత ముఖ్యమంత్రి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్ వెనక ఉన్నది కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ అన్న వార్తలు రావడంతో సిద్ధు, పరమేశ్వర్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మరోసారి కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల భర్తీ వాయిదా పడవచ్చనే వార్తలు వచ్చాయి. ఇక కార్పొరేషన్ బోర్డులకు అధ్యక్ష, సభ్యుల నియామకం ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తుండడంతో క్షేత్ర స్థాయి అభిృద్ధి పూర్తిగా కుంటుపడిందనే విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తాయి. అంతేకాక చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకోసం ఇన్నాళ్లు శ్రమించిన ఎంతో మంది క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ల మధ్య నెలకొన్న విబేధాలతో ఈ నియామకాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో సహనం నశించిన కొంతమంది నాయకులు పార్టీ హైకమాండ్కు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తక్షణమే కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాల భర్తీపై ృష్టి సారించాలని, కార్యకర్తల్లో మరింత అసంృప్తి చెలరేగకుండా జాగ్రత్త పడాలని హైకమాండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎస్.ఎం.ృష్ణ, మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, బి.కె.హరిప్రసాద్ల సిఫార్సులు, సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని తుది జాబితాను రూపొందించినట్లు సమాచారం. కాగా మొత్తం 900 మందితో కూడిన తుది జాబితా మంగళవారం వెలువడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
90 చట్టాల రద్దుకు లోక్సభ ఓకే
న్యూఢిల్లీ: కాలం చెల్లిన 90 సవరణ చట్టాల రద్దు విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకతల నడుమ సంబంధిత బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపకపోవడం ద్వారా కమిటీ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ, సీపీఎం సభ్యుడు సంపత్ విమర్శించారు. చాలా చట్టాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష జరపాలని మొయిలీ సూచించారు. అయితే, ఈ బిల్లు కేవలం సవరించిన చట్టాల రద్దుకు ఉద్దేశించిందేనని, స్టాండింగ్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని న్యాయ మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. అస్తిత్వం కోల్పోయిన మరో 700 చట్టాల రద్దు కోసం వేరొక బిల్లును కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. తాజా బిల్లు ద్వారా రద్దు కానున్న చట్టాల్లో సుప్రీంకోర్టు (జడ్జీలసంఖ్య) సవరణ చట్టం-2008, వక్ఫ్ సవరణ చట్టం-2013, పార్లమెంటు సభ్యుల జీతాలు, పింఛను చట్టం-2010 ఉన్నాయి. ఈ బిల్లుపై లోక్సభచర్చలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్బెనర్జీ మాట్లాడుతుండగా మంత్రి రూడీ అడ్డుతగలడంతో వారి మధ్య వివాదానికి దారి తీసింది. ఎస్సీల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి మరిన్ని కులాలను చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇంతకుముందే లోక్సభలోనూ గట్టెక్కింది. అలాగే, మూతబడిన ఎన్టీసీ టెక్స్టైల్ మిల్లుల పునరుద్దరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం లభించింది. మరోవైపు బొగ్గు గనుల జాతీయకరణ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. 1993 తర్వాత చేసిన 204 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అందుకు అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. సర్దుమణిగిన సాధ్వి వివాదం: మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలతో వారం రోజులుగా అట్టుడిగిన పెద్దల సభలో సోమవారం వివాదం సర్దుమణిగింది. -
ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవడం లేదు
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రతిపక్ష హోదా కోసం తాము అడుక్కోవడం లేదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ అన్నారు. లోక్సభలో బుధవారం సీబీఐ డైరెక్టర్ నియాయకంలో సవరణలపై చర్చ సందర్బంగా ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విధానాలు పాటించాలని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వీరప్ప మొయిలీ అన్నారు. కాగా లోక్సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధనను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించిన విషయం తెలిసింది. ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం లోక్ సభ సీట్లలో పది శాతం సీట్లు ఉండాలి. అంటే లోక్ సభలో కనీసం 55 సీట్లు ఉండాలి. అయితే లోక్ సభలో కాంగ్రెస్కు 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో సభ నియమ నిబంధనల మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని స్పీకర్ తేల్చి చెప్పారు. -
హిందూ ఓ అశబ్దం: మొయిలీ
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభివర్ణించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా ఆ పదం లేదన్నారు. ముస్లింలను, మిగిలిన వర్గాల వారి నుంచి వేరుచేయడానికే అటువంటి పదాలను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త జవరేగౌడ మాట్లాడుతూ పురోహితులు ఉన్నంత వరకూ దేశంలో శాంతి ఉండదన్నారు. -
ప్రధాని కోసం దుబారా ఖర్చులు
కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ దొడ్డబళ్లాపురం, న్యూస్లైన్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీనికి రక్షణ పేరుతో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి స్థానిక ఎంపీ ఎం వీరప్పమొయిలీ మండిపడ్డారు. వీరప్పమొయిలీ చిక్కబళ్లాపురం లోక్సభ స్థానానికి మళ్లీ ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో దుబారా ఖర్చులు చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ప్రధానమంత్రి నివాసం నుంచి ఎయిర్పోర్టు వరకూ సొరంగ మార్గం నిర్మించే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇందుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కావాలంటే యూపీఏ హయాంలో ఖర్చులపై విచారణ చేయించుకోవచ్చని మొయిలీ సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మార్పు చేసి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని ప్రశ్నించగా, అవి వారి వ్యకిగత అభిప్రాయాలు... వారు ప్రచారం కోసం ఇలా స్టేట్మెంట్లు ఇస్తుంటారు... పార్టీ ఓటమికి కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే కారణం కాదన్న ఆయన, నాయకత్వ మార్పు అవసరం ఏమాత్రం లేదు. ఈ విషయాలు మా పార్టీ వ్యకిగత విషయాలు. ఇవన్నీ అధినేత్రి సోనియా చూసుకుంటారన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమిపాలైందని, పార్టీ భవిష్యత్ ఏంటని అడగ్గా కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఓటములను చవి చూసిందని. ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ అధికారంలోకి రావడం కాంగ్రెస్కు కొత్తేమీ కాదన్నారు. పార్లిమెంట్లో ఉన్న 44 మంది ఎంపీలు సమర్థవంతంగా ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తామన్నారు. కుమారస్వామి నన్ను ఓడించడానికే పోటీ : ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తనను ఓడించడానికే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కబళ్లాపురం స్థానం నుంచి పోటీ చేశారని వీరప్ప మొయిలీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యరి బచ్చేగౌడ, జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి కుమ్మక్కయ్యారని, తన ఓటమే లక్ష్యంగా పని చేశారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనను మోసం చేయలేదన్నారు. ఓట్లు తక్కువగా వచ్చాయని తాను బాధపడడం లేదని, ఏది ఏమైనా గెలిచినందుకు తృపిగా ఉందన్నారు. శాయశక్తులా ప్రజలకు సేవచేస్తానని, జక్కల మడుగు పథకం పూర్తిచేసేవరకూ నిర్విరామంగా పని చేసానన్నారు. రాష్ట్రంలో ఏడీజీపీ, కమిషనర్ల మధ్య రాజుకుంటున్న వివాదాన్ని ముఖ్యమంత్రి క్షణం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని మొయిలీ సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ సందర్భంగా వీరప్పమొయిలీని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంకటరమణయ్య, మాజీ ఎమ్మెల్యే వెంకటాచలయ్య, నేతలు లింగనహళ్లి లక్ష్మిపతి, రంగరాజు, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. -
'ఆ విప్లవానికి కాంగ్రెస్ పార్టీ బలైంది'
దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పోస్ట్మార్టం చేసుకుంటుంది. అందులోభాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు ఒకొక్కరు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే సర్జరీ అనివార్యమని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా, అర్బన్ ఓటర్లు ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్, సామాజిక అనుసంధాన వేదిక వంటివి ఉపయోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఆ విప్లవానికే బలైందన్ని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుపుకోసం ఆర్ఎస్ఎస్ కేడర్ దేశవ్యాప్తంగా 24 గంటలు పని చేసిందన్నారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ 59 లోక్సభ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎందుకు ఓడామన్న దానిపై పార్టీలో సమీక్ష నిర్వహిస్తుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేయడమే కాకుండా, ట్విట్టర్, సామాజిక అనుంధాన వేదికలను తరచుగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ దేశవ్యాప్తంగా 282 స్థానాలను గెలుకున్న సంగతి తెలిసిందే. -
ముళ్లబాటేనా..!
సీఎం సిద్ధరామయ్యకు అగ్ని పరీక్ష పార్టీ లక్ష్యాన్ని అందుకోలేక పోయిన నాయకులు నిరుత్సాహాన్ని మిగిల్చిన ఫలితాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే అగ్ని పరీక్షలా ఎదురైన లోక్సభ ఎన్నికలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చాయి. ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించలేక పోయినందుకు అధిష్టానం ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. కనీసం 20 స్థానాల్లో విజయం సొంతం చేసుకోవాలని, లేన ట్లయితే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధిష్టానం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అసోంలో పేలవమైన ఫలితాల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేయడం కూడా సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచుతోంది. అధిష్టానం ఆమోదించేదీ, లేనిదీ తర్వాత...ముందుగా నామమాత్రంగానైనా ఆయన రాజీనామా లేఖను పంపించాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు పార్టీలోని అసమ్మతి వాదుల నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలను ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అధికారంలోకి వచ్చిందిప్పుడే కదా, అంత త్వరగా విమర్శలు చేస్తే ఎలా...చేసినా అధిష్టానం ఊరకుంటుందా అని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన ప్రత్యర్థులు, ఇక విజృంభించనున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా మైసూరులో ఓడిపోవడం సీఎంకు ఊహించని పరిణామం. తన అనుయాయులైన మంత్రులకు మాత్రమే ముఖ్యమంత్రి అండదండలు అందిస్తున్నారని పార్టీలో విమర్శలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీనియర్లను సంప్రదించలేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం సీఎంకు కొంత ఊరట అనే చెప్పాలి. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఆనవాయితీ లేదు. కనుక సీఎం కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఓటమితో సొంత పార్టీలోని ప్రత్యర్థులనే కాకుండా, ఘన విజయం కారణంగా ఉత్సాహంతో ఉరకలేస్తున్న కమలనాథులను ఎదుర్కోవడం సీఎంకు అంత సులభం కాదు. -
కమలానికే కిరీటం!
కమలానికే కిరీటం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే బీజేపీ పైచేయి సాధించేట్లుంది. సోమవారం సాయంత్రం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీజేపీకి నాలుగైదు సీట్లు ఎక్కువగా రావచ్చని అంచనా వేశాయి. నగరానికి చెందిన క్రియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ పొలిటికల్ స్టడీస్ (సీఓపీఎస్) బీజేపీకి 14 సీట్లు, కాంగ్రెస్కు పది, జేడీఎస్కు నాలుగు సీట్లు వస్తాయని పేర్కొంది. ఆ సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాల ప్రకారం.... కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), కేహెచ్. మునియప్ప (కోలారు)ల్లో ఓడిపోతారు. ఆ రెండు స్థానాలతో పాటు హాసన, మండ్యల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ ఖాతాలో చిక్కోడి, బిజాపుర, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ, ఉడిపి-చిక్కమగళూరు, తుమకూరు, మైసూరు, బెంగళూరు ఉత్తర, దక్షిణ నియోజక వర్గాలు పడనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు బెల్గాం, బాగలకోటె, గుల్బర్గ, రాయచూరు, బీదర్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, చామరాజ నగర, బెంగళూరు గ్రామీణ, బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలున్నాయి. 11 వేల మందికి పైగా సిబ్బంది మొత్తం 5700 మంది వలంటీర్లు, 5,600 మంది ఫీల్డ్ సిబ్బంది, వంద మంది ఫీల్డ్ వలంటీర్లు ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ఫీల్డ్ వలంటీరు రెండేసి బూత్లలో సర్వేను నిర్వహించాడు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 50 పోలింగ్ కేంద్రాల వద్ద ఎగ్జిట్ పోల్ను చేపట్టారు. మొత్తం 28 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో 11,200 పోలింగ్ బూత్లలో ఈ సర్వేను నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పురుషులు, మహిళలను కలుపుకొని, ఎవరికి ఓటేశారో అడగడం ద్వారా ఈ సర్వేను నిర్వహించారు. 59 శాతం మంది ఓటర్లు సిద్ధరామయ్య ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 31 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం బాగా కనిపించింది. -
అయిదుగురు సీఎంల రణరంగం
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మాజీ సీఎంలు కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ చాలరన్నట్టు ఇంకో మాజీ సీఎం కూడా రంగంలో దిగేందుకు రెడీగా ఉన్నారు. మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవెగౌడ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, వీరప్పమొయిలీలు తమ తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక బిజెపి కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - సదానంద గౌడ, ఎడియోరప్పలు రంగంలో ఉన్నారు. ఎడియోరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ బెంగుళూరు నార్త్ నుంచి పోటీలో ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ సుపుత్రుడు హెచ్ డీ కుమార స్వామి కూడా తాను లోకసభకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆరో సీఎం కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట. ఏయే సీఎంలు గెలుస్తారో, ఏయే సీఎంలు ఓడిపోతారో చూడాలి! -
కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ
న్యూఢిల్లీ: బీజేపీలో ఇప్పుడు ఏకఛత్రాదిపత్యం నడుస్తోందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ విమర్శించారు. బీజేపీకి ఒకటే ఎజెండా ఉందని, అది ఆర్ఎస్ఎస్ అజెండా అని అన్నారు. జశ్వంత్ సింగ్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ను బీజేపీలో చేర్చుకుని, బయటకు గెంటడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీలో స్థిరత్వం లోపించిందని, ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పొంతన కుదరడం లేదని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధర పెంపు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలు వాస్తవదూరమైనవి మొయిలీ కొట్టిపారేశారు. కేబినెట్ నిర్ణయాన్నే తాము అమలు చేశామని తెలిపారు. వీధిలో ఎవరినైనా కేజ్రీవాల్ కరవగలరంటూ ఘాటుగా విమర్శించారు. -
పట్టు వీడని మొయిలీ
చిక్కబళ్లాపురం లోక్సభ స్థానానికి టికెట్టు దక్కదనే వదంతులు వ్యాపిస్తుండడంతో కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. శనివారం రాత్రి ప్రకటించిన ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్లారు. రెండో జాబితాలో మొయిలీ పేరు ఉంటుందని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్వాసంతో ఉన్నా రాహుల్ వ్యూహమేమిటో వారికీ అంతుబట్టడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొయిలీతో పాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కేజీ బేసిన్ నుంచి తీసుకునే సహజ వాయువు ధరను పెంచడం ద్వారా రిలయన్స్కు లబ్ధి చేకూర్చడానికి మొయిలీ ప్రయత్నించారని కేజ్రీవాల్ అప్పట్లో ఆరోపించారు. కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చెల్లుబాటు కానందున మొయిలీకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొయిలీ కోవలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది సీనియర్ నాయకులకు తొలి జాబితాలో చోటు లభించలేదు. తొలి జాబితాలో కాంగ్రెస్ 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో 14 మంది అభ్యర్థులను ఖరారు చేసే విషయమై చర్చించడానికి బుధవారం నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పరమేశ్వర, సిద్ధరామయ్యలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. మొయిలీ మినహా మిగిలిన ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలకు తొలి జాబితాలోనే చోటు లభించింది. మొయిలీకి ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయిస్తే, ఆయన కుమారుడు హర్ష మొయిలీకి టికెట్టు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు కోరుతున్నారు. -
మొయిలీకి మొండి‘చేయి’?
స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలీకి చిక్కబళ్లాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ లభించదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆది నుంచి ఈయనకు ఈసారి టికెట్ దక్కే విషయమై స్థానికంగానే సొంత పార్టీలో ఉన్న నేతల్లోనే అనుమానాలున్నాయి. అందుకు బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో మొయిలీ పేరు లేక పోవడంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా కావలసినంత అనుభవంతో పాటు, వైఎస్ఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన ‘ఘన త’ కలిగిన మొయిలీ పేరు ప్రకటించేందుకు హైకమాండ్ వెనుకా, ముందూ ఆలోచిస్తోందంటే పరిస్థితి ఇట్టే ఊహించవచ్చు. గత ఎన్నికల్లో మంగళూరు నుంచి చిక్కబళ్లాపురం వలస వచ్చిన ఈయన పై ఇక్కడి ప్రజలు అనేక ఆశలు పెట్టుకుని గెలిపించారు. మొయిలీ గెలిస్తే కేంద్ర మంత్రి కావడం ఖాయమని, మంత్రి అయితే ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేస్తారని గంపెడాశ పెట్టుకున్నారు. అయితే మొయిలీ గెలిచి కేంద్ర మంత్రి అయితే అయ్యారే కానీ.. సమస్యలు చెప్పుకోడానికి స్థానికులకు అందుబాటులో లేరు. ఇది చాలదన్నట్టు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాగునీటి పథకాల అమలుపై పూటకోమాట చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆగమేఘాలపై ఎత్తినహొళె పథకానికి వివాదాల నడుమ శంకుస్థాపన చేశారు. పరమశివయ్య నివేదికను పక్కన పెట్టడం, ఎత్తిన హొళె పథకాన్ని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు, పోరాట సంఘాలతో చర్చించి ఈ పథకంపై కనీసం అవగాహన కల్పించే దిశగా ఆలోచించకుండా ఒంటెత్తు పోకడలకు పోవడంతో మొయిలీ పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిక్కబళ్లాపురం లోక్సభ పరిధిలో ఉన్న ఎనిమిది తాలూకాల్లో మొయిలీకి వ్యతిరేకంగా పూటకో నిరసన ప్రదర్శన జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు మొయిలీని సమర్థించుకోవడానికి కష్టంగా తయారైంది. ఒక దశలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఈసారికి మొయిలీ కాకుండా మరొకరైతే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి పోటీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రలో కావలసినంత వ్యతిరేకతను కూడగట్టుకున్న కేంద్ర మంత్రి చిరంజీవి పేరు ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. చిరంజీవి సీమాంధ్రలో ఎక్కడి న ుంచి పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కించుకోరనే విషయం జగమెరిగిన సత్యం. దీంతో ఇక్కడ ఆయనపై ఉన్న సినీ అభిమానాన్ని ఓట్లుగా మలచుకొనేలా హైకమాండ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి గత అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా పలుమార్లు వచ్చి బాగేపల్లి, చిక్కబళ్లాపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురం, దేవనహళ్లి తదితర తాలూకాల్లో విస్తత ప్రచారం చేశారు. ఆ సమయంలో ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. అయితే చిరంజీవిపై ఉన్న అభిమాన ం ఓట్లుగా మారుతాయా? అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకుంటే సరిహద్దు ప్రాంతాలైన ఈ ప్రాంతంలో ఉన్నది దాదాపు అందరూ సీమాంధ్ర ప్రాంతాలకు చెందినవారే. స్థానికంగా లేకపోయినా రాష్ట్ర విభజన తతంగం మొత్తం ప్రజలకు తెలుసు. ఒకవేళ చిరంజీవి చిక్కబళ్లాపురం స్థానం నుంచి పోటీ చేసినా రాష్ట్ర విభజన సెగ తగిలే అవకాశముంది. ఎందుకంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగాయి. చిరంజీవికి బాగేపల్లి, గౌరిబిదనూరు, చిక్కబళ్లాపురం ప్రాంతాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ అభిమానులున్నారు. దొడ్డబళ్లాపురం, దేవన హళ్లి, హొసకోట, నెలమంగల తాలూకాల్లో సినీ అభిమానులు మాత్రమే ఉన్నారు. చిరంజీవి పోటీచేస్తే ఆలోచించకుండా ఓటు వేసేంత గుడ్డి అభిమానం అయితే లేదనే చెప్పవచ్చు. కన్నడిగుడైన మొయిలీనే వలస పక్షిగా చిత్రీకరిస్తున్న ప్రతిపక్షాలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోటీ చేసే చిరంజీవిపై ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తారో ఇట్టే ఊహించవచ్చు. ఏది ఏమైనా చిక్కబళ్లాపురం స్థానం అభ్యర్థి ఎన్నిక విషయంలో హైకమాండ్ తర్జనభర్జన పడుతోందని స్పష్టమవుతోంది. -
మొయిలీ, అంబానీల కుమ్మక్కు..
ఎఫ్ఐఆర్లో ఏసీబీ అభియోగం ఎన్టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల పెంపు అక్రమం రిలయన్స్కు లబ్ధి చేకూర్చేందుకే యూపీఏ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: వరుస కుంభకోణాలతో అపవాదు మూటగట్టుకున్న యూపీఏ ప్రభుత్వానికి మరో మచ్చ ఇది. ఎన్టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల విషయంలో యూపీఏ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుకూలంగా వ్యవహరించిందని అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 2014 ఎన్నికల్లో అయ్యే వ్యయానికి అవసరమైన నిధులను రిలయన్స్ నుంచి పొందే ఆలోచనతోనే ఇలా చేసిందని పేర్కొంది. ఇదే ఆలోచనతో బీజేపీ కూడా నోరు మెదపలేదని అభిప్రాయపడింది. ఈ గ్యాస్ ధరల విషయంలో పెట్రోలియం మంత్రి ఎం.వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధినే ముఖేశ్ అంబానీ, మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇలా మొదలైంది: ఢిల్లీ కేబినెట్ మాజీ కార్యదర్శి టి.ఎస్.ఆర్. సుబ్రమణియన్, మాజీ కార్యదర్శి ఇ.శర్మ, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హెచ్. తహిలియానీ, అడ్వొకేట్ కామినీ జైశ్వా ల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఎం కేజ్రీవాల్ ఈ కేసు లో ఏసీబీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుత డాలర్ విలువను బట్టి చూస్తే గ్యాస్ ధరల పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ. 54,500 కోట్ల భారం పడుతుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘కేజీ డీ6 బ్లాక్లో కనుగొన్న సహజ వాయువుపై భారత ప్రభుత్వానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), నికో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2000 సంవత్సరం ఏప్రిల్ 12న ఒప్పందం కుదిరింది. 2004లో ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటులకు ఒక్కో ఎంఎంబీటీయూ(మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్ 2.34 డాలర్ల చొప్పున, ఇలా 17 ఏళ్లపాటు సరఫరా చేసేందుకు రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కొంత కాలం తర్వాత ఆర్ఐఎల్ మాట మార్చింది. ఒప్పందంలో పేర్కొన్న ధరకు గ్యాస్ సరఫరా చేయడానికి నిరాకరించింది. రిలయన్స్ ఒత్తిడితో 2007లో యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను ఏకంగా ఎంఎంబీటీయూ-4.2 డాలర్లకు పెంచింది. ఇది పూర్తిగా అవినీతి, అక్రమాలతో కూడుకున్న చర్య’ అని ఫిర్యాదులో ఆరోపించారు. ఇది చాలదన్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాన్ని 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయించడం యూపీఏ చేసిన అతిపెద్ద అవినీతికి నిదర్శనమన్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలను పెంచాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. -
ముఖేశ్ అంబానీ, మొయిలీలపై కేసు
గ్యాస్ వ్యవహారంలో ఢిల్లీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు మురళీదేవరా, వీకే సిబల్పై కూడా.. న్యూఢిల్లీ: కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కుమ్మక్కయ్యారంటూ వచ్చి న ఫిర్యాదులననుసరించి కేసులు పెట్టాలన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలపై ఢిల్లీ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) చర్యలు చేపట్టింది. ముఖేశ్ అంబానీ, వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవరా, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్లపై ఆ సంస్థ కేసు పెట్టింది. వారిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైందని ఏసీబీ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. సహజవాయువుకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెంచేందుకు కుమ్మక్యయ్యారంటూ కేజ్రీవాల్ కేంద్ర మంత్రి, రిలయన్స్ అధిపతిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన మీకు: కేసులో విచారణ పూర్తయే వరకూ గ్యాస్ ధరలు పెంచాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. గ్యాస్ ధరల పెంపు వల్ల సీఎన్జీ, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి సామాన్యుడికి కష్టాలు తెచ్చిపెడుతుందని, ఆర్థికవేత్త అయిన మీకు ధరల పెంపు కుమ్మక్కు ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఏమేరకు ప్రభావం పడుతుంతో చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు. అవినీతి బాగా పెరిగింది: సీజేఐ న్యూఢిల్లీ: అవినీతి కేన్సర్ వంటిదని, గత 60 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలంటే ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. ఆయన బుధవారమిక్కడ కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగించారు. ప్రజలు అవినీతి నిర్మూలనపై ఆశ వదులుకోవడం, దానితో రాజీపడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. సీవీసీని లోక్పాల్తో అనుసంధానించాలని లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. కాంగ్రెస్ అవిశ్వాసాన్ని నెగ్గిన నవీన్ సర్కారు భువనేశ్వర్: బీజేడీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ బుధవారం అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం 69 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 95 మంది, మద్దతుగా 26 మంది ఓటేశారు. ప్రభుత్వం నిరుద్యోగం, అవినీతి తదితర సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమైందని, కేంద్ర నిధులను ఖర్చు చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం వీగడం కాంగ్రెస్ మేధోపరమైన దివాలాకోరుతనానికి అద్దం పడుతోందని నవీన్ దుయ్యట్టారు. -
మొయిలీ, అంబానీలపై ఢిల్లీ సర్కారు క్రిమినల్ కేసులు
-
మొయిలీ, అంబానీలపై ఢిల్లీ సర్కారు క్రిమినల్ కేసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరంతర పోరాట యోధుడిగా తన పేరును సార్థకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తన పోరాటాన్ని నేరుగా కేంద్ర మంత్రులు, కార్పొరేట్ పెద్దలపైనే ఆయన ఎక్కుపెట్టారు. కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆశాఖ మాజీ మంత్రి మురళీ దేవ్రా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అది కూడా తాను వ్యక్తిగతంగా కాకుండా ఢిల్లీ ప్రభుత్వం తరఫునే పెట్టిస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సహజ వాయువు ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని ఆయన తొడగొట్టి సవాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్ తదితరులపై కేసులు దాఖలు చేయాల్సిందిగా ఏసీబీకి తాను సూచించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గ్యాస్ ధర పెంపును తాత్కాలికంగా పక్కన పెట్టాలని, ఈ అంశాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, అక్కడే తేల్చుకుంటానని కేజ్రీవాల్ చెబుతున్నారు. -
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
-
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, జిఓఎం సభ్యుడు వీరప్ప మొయిలీ చెప్పారు. జిఓఎం సంప్రదింపులు ఎందుకు కొనసాగుతున్నాయన్న దానిపై ప్రశ్నలు అనవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని మొయిలీ తెలిపారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జిఓఎం సభ్యులు ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ
-
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ
న్యూఢిల్లీ: విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మెయిలీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. -
ఇక ఢిల్లీలోనూ 5కేజీల సిలిండర్
న్యూఢిల్లీ: నగరవాసులకు నేటినుంచి 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. చమురుశాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ వీటిని నేడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. దీంతో నగరంలోని అన్ని పెట్రోలు పంపుల్లో మార్కెట్ ధరకే ఈ 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను మినహాయించారు. కాగా నేటి నుంచి ఢిల్లీవాసులకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని రూ.543కు పెట్రోలు పంపుల్లో విక్రయించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నగరంలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను రూ.414కే అందజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 13,088 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు/డీలర్లు మాత్రమే ఇప్పటిదాకా వంటగ్యాస్ను విక్రయిస్తున్నారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న 50,392 పెట్రోలు పంపుల్లో కూడా వంటగ్యాస్ విక్రయిస్తారు. మొదట ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులలోని పెట్రోలు పంపుల్లో 5 కేజీల సిలిండర్లను కొన్ని చమురు సంస్థలు విక్రయించాయి. సఫలీకృతం కావడంతో దేశవ్యాప్తంగా విక్రయించుకునేందుకు వాటికి అనుమతి లభించింది. ఇలా 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రావడం వలస వచ్చినవారికి, చదువుకునే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అన్ని ఆధారాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ను పొందడం ఇలాంటి వారికి సాధ్యం కాదు. దీంతో వారికి ఈ ఐదు కేజీల సిలిండర్తో వంటచేసుకోవడం, పూటగడుపు కోవడం సులభమవుతుంది. -
సబ్సిడీపై 12 సిలిండర్లు
-
సబ్సిడీపై 12 సిలిండర్లు
కేంద్రంలో మాకు మెజారిటీ రాకుండా కుట్ర బలహీన ప్రభుత్వం ఏర్పడేలా మాపై అసత్య ఆరోపణలు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కాంగ్రెస్పై రాజ్నాథ్ నిప్పులు సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ తమపై కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, కేవలం పేలవ ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీలతో కలసి రాజ్నాథ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, వీర్రాజు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా కృష్ణంరాజు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రాంలీలా మైదాన్లో జరగనున్నాయి. రాజ్నాథ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: యూపీఏ పదేళ్ల పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని తెలుసుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అసత్య ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓటుబ్యాంకు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్...మన వల్ల లౌకిక వాదానికి పెనుముప్పంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు యూపీఏ పాలనలో జరిగిన స్కాంలు, ఆర్థిక వ్యవస్థ పతనం, ఓటుబ్యాం కు రాజకీయాల వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోక్సభ ఎన్నికల్లో 272 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం. భేటీలో ఏం చేశారంటే... 272 కన్నా ఎక్కువ సీట్ల సాధనకు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై అగ్రనేతల మేధోమథనం. ఒక ఓటు ఒక నోటు కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు వెళ్లడం, పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి, బూత్స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చ. ఆర్థిక, రాజకీయ తీర్మానాలకు తుదిరూపు సిక్కుల ఊచకోత గుర్తులేదా: బీజేపీ బీజేపీతో లౌకికవాదానికి ముప్పన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాలపాటు సాగిన కాం గ్రెస్ పాలనలో 13 వేల అల్లర్లు జరిగాయని, 70 వేల మందికిపైగా మృత్యువాతపడటానికి కాంగ్రెస్ మతఛాందసవాద విధానాలే కారణమన్నారు. ముఖ్యంగా తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్న కాంగ్రెస్కు 10 వేల మంది సిక్కుల ఊచకోత ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా? అని దుయ్యబట్టారు. -
రాహుల్ ఎఫెక్ట్.. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు?
గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానుండటం, ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎలాగైనా ప్రజల్లో సానుకూలత తెచ్చుకోడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంపుపై కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఆఘమేఘాల మీద సబ్సిడీ సిలెండర్ల సంఖ్యను పెంచాలని సర్కారు భావిస్తోంది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. దటీజ్ రాహుల్ ఎఫెక్ట్!! అయితే, ఎన్నికలు దగ్గర పడగానే సిలిండర్లు గుర్తుకొచ్చాయా అని బీజేపీ నేతలు కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఎన్నాళ్లనుంచో చెబుతున్నా, ప్రజలందరూ అడుగుతున్నా ఏమాత్రం స్పందించని మంత్రివర్గం.. ఇప్పుడు రాహుల్ పేరుచెప్పి, ఎన్నికల బూచి చూసి సిలిండర్ల సంఖ్య పెంచుతోందా అని నిలదీశారు. -
ఈ పరుగులో మర్మమేమిటి?
సంపాదకీయం: మిగిలినవాటి మాటెలా ఉన్నా పాలనలో తీసుకునే విధాన నిర్ణయాలు సహేతుకంగా, అర్ధవంతంగా ఉండాలి. అలాంటి నిర్ణయాలు కోట్లాది మంది పౌరుల జీవితాలతో ముడిపడి ఉంటాయి గనుక అది తప్పనిసరి. కానీ, యూపీఏ ఈమధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలన్నిటికీ ఎన్నికల ప్రయోజనాలే గీటురాయి అవుతున్నాయి. ఆహార భద్రత, భూసేకరణ సవరణ చట్టాలనుంచి ఆంధ్రప్రదేశ్ విభజనవరకూ... అన్నిటి విషయంలోనూ స్వీయలాభాపేక్షను మాత్రమే కాంగ్రెస్ ప్రాతిపదికగా తీసుకున్నదని ఆయా సందర్భాల్లో విమర్శలు చెలరేగాయి. ఆ వరసలోనే కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ను ఉన్నట్టుండి సాగనంపి ఆ శాఖ బాధ్యతలను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీకి అప్ప జెప్పారు. జయంతి మంత్రిగా ఉన్నకాలంలో పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయాయంటున్న పదులకొద్దీ ప్రాజెక్టులకు వీరప్ప మొయిలీ పచ్చజెండా ఊపుతున్నారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉండిపోయిన ప్రభుత్వంలో ఎక్కడలేని చైతన్యమూ కనబడుతోంది. ఆమె పాలనా కాలంలో అనుమతుల కోసం వేచిచూసిన ప్రాజెక్టుల విలువ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కాగా, తాను ఈ శాఖ చేపట్టాక లక్షన్నర కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశానని స్వయంగా మొయిలీయే చెబుతున్నారు. ఇందులో రూ.53,000 కోట్ల విలువైన పోస్కో ప్రాజెక్టు కూడా ఉంది. ఆమె రాజీనామాకు దారితీసిన కారణాలపై జయంతి ఏమి చెప్పుకున్నా అటు పార్టీవైపునుంచిగానీ, ఇటు ప్రభుత్వం వైపునుంచిగానీ ఎవరూ నోరు మెదపలేదు. కానీ, ఆ రెండువైపులనుంచీ మీడియాకు మాత్రం పుంఖానుపుంఖాలుగా లీకులిస్తున్నారు. ఆ లీకుల సారాంశం చాలా ముఖ్యమైనది. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థతోనూ, అభివృద్ధి తోనూ ముడిపడి ఉన్నది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ లీకులను ఆధారం చేసుకునే ఒక బహిరంగ సభలో ‘జయంతి టాక్స్’ అనే మాట వాడారు. పరిశ్రమలకు అవసరమయ్యే పర్యావరణ అనుమతులు తెచ్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముడుపులు చెల్లించుకునేవారని ఆయన వ్యాఖ్యల్లోని సారాంశం. నరేంద్ర మోడీ ఏ మాటన్నా వెనువెంటనే విరుచుకుపడే యూపీఏ సర్కారులోని పెద్దలు ఈసారి పెద్దగా మాట్లాడలేదు. జయంతి స్వయంగా చానెళ్లముందుకొచ్చి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించుకున్నారు. ఈ పరస్పర నిందల సంగతెలా ఉన్నా యూపీఏ ప్రభుత్వమూ, కాంగ్రెస్ పార్టీ జవాబివ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ) సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వెళ్లినరోజునే, ఆయన ఆ సదస్సులో పాల్గొనడానికి కొన్ని గంటలముందే జయంతి తన పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆ సమావేశంలో రాహుల్ చాలా కటువైన విమర్శలు చేశారు. ఇవన్నీ జయంతిని, ఆమె పనితీరుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినవేనని ఆమె రాజీనామా వల్ల అందరికీ ధ్రువపడింది. పైగా, ఆమె పనితీరు గురించి ఇచ్చిన లీకులు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఉదాహరణకు రాజీనామా చేసేనాటికి ఆమె వద్ద దాదాపు 350 ఫైళ్లు ఉండిపోయాయని మీడియాలో వెల్లడైంది. ఇందులో ఆమె ఆమోదం తెలుపుతూ సంతకాలు చేసిన 119 ఫైళ్లు, సంతకాలు చేయని మరో 180 ఫైళ్లు ఉన్నాయని ఆ కథనం చెబుతోంది. మరో 50 ఫైళ్లు ఆ మంత్రిత్వశాఖలోని సిబ్బందివద్ద ఉండిపోయాయట. వీటిలో చాలాభాగం మూడేళ్లక్రితానివికాగా, కొన్ని రెండేళ్లక్రితానివి. అంటే పరిశ్రమల స్థాపనకు అనుమతించిన ఫైళ్లు, తిరస్కరించిన ఫైళ్లు కూడా జయంతి నటరాజన్ వద్దే పెట్టుకున్నారని అర్ధమవుతున్నది. అసలు మీ విభాగాల నుంచి ఏఏ ఫైళ్లు పంపారో తెలపండంటూ వివిధ విభాగాధిపతులకు తాఖీదులు పంపారని కూడా ఆ కథనం పేర్కొంది. ఒక మంత్రిత్వశాఖలో ఇన్నేళ్లు ఫైలు ఆగిందంటే అందుకు గల కారణాలేమిటో ఆ శాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం గుడ్డి దర్బారుగా తయారైందని ఈ ఉదంతం వెల్లడిస్తోంది. ఈ కథనం చూస్తే పర్యావరణ శాఖ పెద్ద కుంభకోణాలమయంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. జయంతి ఖండనల మాటెలా ఉన్నా ప్రభుత్వం నుంచి నోరు పెగలడంలేదు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కదలిక లేకపోవడానికి, ఇప్పుడు లేడికి లేచిందే పరుగన్నట్టు వ్యవహరించడానికి కారణాలేమిటో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది. కానీ, యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇదేదో తమ సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. మొయిలీ అనుమతి మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో చాలా భాగం పర్యావరణ వినాశనానికి దారితీస్తాయని పర్యావరణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. పోస్కో ప్రాజెక్టునుంచి గోరఖ్పూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు వరకూ ఇచ్చిన అనుమతుల్లో తొందపాటేతప్ప మరేది కనబడటంలేదని వారి అభియోగం. దక్షిణ కొరియా అధ్యక్షుడు పర్యటనకొచ్చేనాటికి పోస్కో పెండింగ్లో ఉండ రాదన్న తహతహను మొయిలీ ప్రదర్శించారు. అటు జయంతి వైదొలగ డానికి కారణాలు చెప్పక, ఇటు ఎడాపెడా ఇస్తున్న అనుమతుల్లోని మతలబేమిటో వివరించక యూపీఏ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఇల్లు ఖాళీచేసేవాడు అన్నీ సర్దుకున్నట్టు సర్కారు ఒక్కొక్క పనే మెరుపువేగంతో చేసుకుపోతోంది. తమపై కినుకవహించి ఉన్న కార్పొరేట్లను మంచిచేసుకోవడం, తద్వారా రాబోయే ఎన్నికల్లో ఆర్ధికంగా, హార్ధికంగా లాభపడటమే ఈ చర్యల సారాంశమని కొందరు చేస్తున్న విమర్శల్లో నిజం ఉన్నదేమోనన్న సంశయానికి చోటు కల్పిస్తోంది. ఈ క్రమంలో ప్రాణప్రదమైన పర్యావరణ పరిరక్షణ అంశాన్ని విస్మరిస్తున్న భావన మాత్రం అందరిలోనూ కలుగుతున్నది. ఇప్పటికైనా యూపీఏ సర్కారు సంజాయిషీకి సిద్ధపడుతుందా? -
ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్మెంట్లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్యూ దిగ్గజాలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. గురువారం బీఎస్ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375; కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది. -
నెల్ప్-10 వేలం ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: కొత్త అన్వేషణ, లెసైన్సింగ్ విధానం కింద పదో విడత(నెల్ప్-10) చమురు-గ్యాస్ బ్లాక్ల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతానికి తాము 46 బ్లాక్లను వేలంలో పెడుతున్నామని.. అన్ని అనుమతులూ లభించాక ఈ సంఖ్య 60-65కు పెరగనుందని ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ఈ 46 బ్లాక్లలో.. రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్ నుంచి వెనక్కితీసుకున్న 6,199 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, కెయిర్న్ ఇండియా రాజస్థాన్ బామర్ బ్లాక్ చుట్టుపక్కలఉన్న 9,000 చదరపు కిలోమీటర్ల ఏరియా కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆర్ఐఎల్ నుంచి చమురు శాఖ వెనక్కితీసుకున్న ప్రాంతంలో రిలయన్స్ అన్వేషించిన డీ4, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు చమురు-గ్యాస్ నిక్షేప క్షేత్రాలు(0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలున్నట్లు అంచనా) ఉండటం గమనార్హం. కాగా, తాను వెనక్కిచ్చేసిన ప్రాంతాన్ని మళ్లీ కెయిర్న్ ఇండియా తిరిగి ఇవ్వాలంటోంది. ప్రస్తుత ఉత్పత్తి క్షేత్రాలను అనుసంధానం చేయడానికి ఇది అవసరమని చెబుతోంది. కాగా, తాజా నెల్ప్-10లో పాల్గొనే బిడ్డర్లు తాము ప్రభుత్వానికి ఉత్పత్తి తొలి రోజు నుంచే ఎంత చమురు-గ్యాస్ వాటా ఇవ్వనున్నారనేది వేలం సందర్భంగా తెలియజేయాలని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఎక్కువ వాటా ఆఫర్ చేసే కంపెనీకే బ్లాక్లు దక్కుతాయని కూడా వెల్లడించారు. ఈ మేరకు రంగరాజన్ కమిటీ నిబంధనలను అమలుచేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నిబంధనలకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే వేలానికి బిడ్లను ఆహ్వానిస్తామని మొయిలీ పేర్కొన్నారు. -
ఏడాదికి 12 సిలిండర్లు?
సబ్సిడీ కోటా పెంపును తీవ్రంగా పరిశీలిస్తాం: మొయిలీ న్యూఢిల్లీ: వంటింటి గ్యాస్ మంటల సెగ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారుకు తగిలినట్లుంది. ఎన్నికల ఏడాది కావడంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోటాను ఏడాదికి 12కు పెంచాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ కూడా కాస్త మెత్తపడినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల కోటాను 12కు పెంచే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తుందని వీరప్ప మొయిలీ శుక్రవారం మీడియాకు తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల పెంపు ప్రతిపాదన లేదని వారం క్రితమే ప్రకటించిన మొయిలీ భిన్నంగా మాట్లాడడం గమనార్హం. ఆర్థిక మంత్రి చిదంబరంతో సంప్రదించి ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ ముందుకు తీసుకెళతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్ను కలిసి.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను పెంచాలని గట్టిగా కోరారు. అనంతరం ఎంపీలు సంజయ్ నిరుపమ్, పీసీ చాకో, మహాబల్ మిశ్రాలు మొయిలీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సాధారణ ప్రజలకు ఈ కోటా సరిపోదని, 12కు పెంచాలని డిమాండ్ చేసినట్లు పీసీచాకో చెప్పారు. ఈ మేరకు ఎంపీలు మొయిలీకి ఒక వినతిపత్రం కూడా ఇచ్చారు. కాగా, పలు రాష్ట్రాల సీఎంల నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పెంచాలంటూ ఒత్తిడి వస్తోందని.. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చిదంబరం గతవారమే ప్రకటించారు. -
సబ్సిడీ సిలిండర్లు పెంచే ప్రతిపాదనలేదు
కొచ్చి: సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కేరళలోని పుతేవ్యపె వద్ద నెలకొల్పిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడికి వచ్చిన మొయిలీ ఈ విషయం చెప్పారు. దేశంలో 90 శాతం మంది సబ్సిడీ సిలిండర్లను వినియోగించుకుంటున్నారని, కేవలం పది శాతం మందికి మాత్రమే ఆ పథకం వర్తించడం లేదన్నారు. కాగా, గురువారం ఆర్థిక మంత్రి చిదంబరం ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సబ్సిడీపై ఏడాదికి ఇస్తున్న 9 సిలిండర్లను 12 పెంచాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. -
అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ
దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవనం వెనువెంటనే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వీరప్ప మొయిలీ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జయంతి వెల్లడించారు. అయితే పర్యావరణ ప్రాజెక్టు అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగా జయంతిని పదవి నుంచి తొలగించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. -
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
-
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తన మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేందుకే జయంతి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జయంతి వ్యవహరించారు. కాంగ్రెస్పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదేశానుసారం తిరిగి పూర్తీస్థాయిలో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకే ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. యూపీఏ-2 హయాంలో.. చివరిసారి కేంద్రమంత్రివర్గంలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్నికల సమయానికి.. పార్టీని బలోపేతం చేసేందుకు 10 జన్పథ్ కసరత్తుచేయడంలో భాగంగా.. మరికొంతమంది సీనియర్లు కేంద్ర కేబినెట్ వదిలి.. పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే జయంతి నటరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. అడవులు, పర్యావరణ శాఖలను ఇకపై కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పర్యవేక్షించనున్నారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది...
న్యూఢిల్లీ: సహజవాయువు(గ్యాస్)కు అధిక ధర చెల్లించడం వల్ల దే శీయంగా ఉత్పత్తి పుంజుకుంటుందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గ్యాస్ ధర రెట్టింపుకానున్న నేపథ్యంలో మొయిలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలకు సంబంధించి కొత్త విధానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రైవేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6లో ఉత్పత్తి చేసే గ్యాస్కు సైతం కొన్ని షరతులతో ఇవే నిబంధనలు అమలయ్యేలా కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. గ్యాస్ ధరను పెంచకపోతే దేశీయంగా ఉత్పత్తి నిలిచిపోతుందని మొయిలీ వ్యాఖ్యానించారు. వెరసి దిగుమతుల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఏఐఎంఏ ఇక్కడ నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల మూడో సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశీయ గ్యాస్ అవసరాల్లో సగభాగాన్ని ప్రస్తుతం దిగుమతుల ద్వారా పూరించుకుంటున్నామని తెలిపారు. గ్యాస్ వెలికితీతకు దేశీయంగా పలు అవకాశాలున్నప్పటికీ ఇందుకు భారీ స్థాయిలో నిధులను వె చ్చించాల్సి ఉంటుందని చెప్పారు. తక్కువ ధర వల్లే ప్రస్తుత తక్కువ ధరల కారణంగా ఇప్పటికే మూడు లక్షల ఘనపు మీటర్ల గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నదని మొయిలీ వివరించారు. ప్రస్తుతం ఒక ఎంబీటీయూ గ్యాస్కు 4.2 డాలర్లను చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి ఈ ధర 8.4 డాలర్లకు పెరగనుంది.ఇందువల్లనే ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ వంటి సంస్థలకు చెందిన కొన్ని బ్లాకుల్లో గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నట్లు తెలిపారు. గ్యాస్ను 12-13 డాలర్లకు దిగుమతి చేసుకోవడం లేదా ఇంతకంటే బాగా తక్కువ ధరను చె ల్లించడం ద్వారా దేశీయంగా నిల్వలను వెలికితీయడాన్ని ప్రోత్సహించడమే మనముందున్న ఏకైక అవకాశమని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించకపోతే పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. రెండు నెలల్లో డీజిల్పై నియంత్రణ ఎత్తివేత రానున్న రెండు నెలల్లో డీజిల్ ధరలపై పూర్తిస్థాయిలో నియంత్రణలను ఎత్తివేయనున్నట్లు మొయిలీ చెప్పారు. ఒక మీడియా సంస్థ ఇక్కడ నిర్వహించిన ఆటోకార్ అవార్డుల కార్యక్రమానికి మొయిలీ హాజరయ్యారు. రానున్న కొద్ది రోజుల్లో డీజిల్ను పూర్తిస్థాయిలో డీరెగ్యులేట్ చేయగలమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డాలరుతో మారకంలో రూపాయి భారీగా బలహీనపడకపోయి ఉంటే ఈ పాటికే డీజిల్ ధరలపై నియంత్రణలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసి ఉండేదని వివరించారు. -
గ్యాస్ ధర పెరిగితేనే మంచిది: వీరప్పమొయిలీ
కడుపు కాలడమే మంచిది... సంపాదించడం ఎలాగో తెలుస్తుంది అన్నాడట వెనకటికెవడో. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్లకు గ్యాస్ ధరలను సవరించిన సందర్భంగా మొయిలీ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ''మీరు గ్యాస్ ధరలు పెంచకపోతే, స్వదేశీ ఉత్పత్తి పెరగదు. దిగుమతులు పెరిగిపోతూనే ఉంటాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్కు 4.2 డాలర్ల చొప్పున చెల్లిస్తుండగా దాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర 2014 ఏప్రిల్ నుంచి అమలుకానుంది. ఇదే ధరను కేజీ బేసిన్లోని కేజీ-డి6 చమురు క్షేత్రాల్లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్కు కూడా కేబినెట్ ఆమోదించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మొయిలీ పై విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
‘ఆధార్’ లేదని వంట గ్యాస్ నిరాకరించొద్దు: మొయిలీ
బెంగళూరు: దేశం 2030 నాటికి ఇంధన స్వావలంబన సాధిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. బెంగళూరులోని జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో శనివారం జరిగిన అఖిల భారత వాణిజ్య సమ్మేళనంలో మొయిలీ ప్రసంగించారు. 2020 నాటికి చమురు దిగుమతులు 50 శాతం తగ్గుతాయని అంచనా వేశారు. 2025 నాటికి 75 శాతం తగ్గుతాయని చెప్పారు. దేశంలో సహజ వాయువు, చమురు వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెనడా, అమెరికా ఇలానే ఇంధన స్వావలంబన సాధించాయని తెలిపారు. భారత విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) లేదనే సాకుతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు వంట గ్యాస్ ఇవ్వడానికి నిరాకరించరాదని మొయిలీ అన్నారు. ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి ఆధార్ను నిర్బంధం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వంట గ్యాస్కు కూడా ఆ నిబంధన ఉండబోదని స్పష్టం చేశారు. -
గ్యాస్కు మార్కెట్ ధరే కరెక్ట్
న్యూఢిల్లీ: ఏడేళ్లలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా ఇండియా అవతరించనున్న నేపథ్యంలో గ్యాస్కు మార్కెట్ ఆధారిత ధరల విధానమే తగినదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారీ స్థాయిలోని దేశ అవసరాలను తీర్చాలంటే తగిన సాంకేతికత కూడా అవసరమని చెప్పారు. ఇక్కడ ఫిక్కీ, గెయిల్ నిర్వహణలో ఏర్పాటైన 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ ప్రస్తుతం ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ఏడో పెద్ద ఇంధన ఉత్పత్తిదారుగా నిలుస్తున్నదని తెలి పారు. అయితే రానున్న రెండు దశాబ్దాలలో ఇంధన సరఫరాను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. దేశీయ ఇంధన అవసరాలలో చమురు, గ్యాస్లకు 41% వాటా ఉన్నదని చెప్పారు. 2,020కల్లా ఇండియా మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలవనున్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశం అమెరికా, చైనా, జపాన్ల తరువాత ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. వెరసి గిరాకీ, సరఫరాల మధ్య సమతౌల్యాన్ని సాధించేందుకు వీలుగా ఇంధన వెలికితీతలో దేశ, విదేశీ కంపెనీలను ప్రోత్సహించాల్సి ఉన్నదని వివరించారు. యూఎస్ షేల్ గ్యాస్ ఆదర్శం ఇంధన ఉత్పత్తిని పెంచడంలో అమెరికా షేల్ గ్యాస్ విప్లవాన్ని ప్రధాని ఉదహరించారు. మార్కెట్ ఆధారిత విధానాలు, సాంకేతికతల ద్వారా సంప్రదాయేతర వనరులను వెలికితీయడంలో అమెరికా బాగా విజయవంతం అయిం దని చెప్పారు. దీంతో ఇంధన నిల్వలు(మిగులు) కలిగిన దేశంగా అవతరించిందని చెప్పారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండియావంటి దేశాల ఇంధన అవసరాలకు ఇలాంటి విధానాలు అవసరమని వ్యాఖ్యానించారు. ఇంధన భద్రతను సాధించే దిశలో ఇండియా కూడా పలు ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నదని చెప్పారు. ఈ బాటలోనే ఇతర దేశాల్లోని ఇంధన ఆస్తులను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. 80% దిగుమతులే... దేశ చమురు అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే లభిస్తోంది. ఇదే విధంగా 50% గ్యాస్ సరఫరాను కూడా దిగుమతుల ద్వారానే అందుకుంటోంది. ముడిచమురు విషయంలో మార్కెట్ ధరను ఆధారం చేసుకుంటున్నప్పటికీ, గ్యాస్ విషయంలో ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. అయితే వచ్చే ఏడాది(2014) ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను దాదాపు రెట్టింపునకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కున్న విషయం విదితమే. దీంతో గ్యాస్ ధర ఒక ఎంబీటీయూకి 8.4 డాలర్లవరకూ పెరగనుంది. కొత్త మార్గాల ద్వారా ఇంధనాన్ని వెలికితీసే కంపెనీలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని గ్యాస్ ధర పెంపు ద్వారా నమ్మకాన్ని కలిగించనున్నట్లు ప్రధాని చెప్పారు. కొనుగోలుదారులు, విక్రయదారుల మధ్య ధర విషయంలో భారీ అంతరాలుంటే తగిన స్థాయిలో ఇంధనం లభించదని, దేశీయంగా గ్యాస్కున్న భారీ గిరాకీ దృష్ట్యా ఇండియా వంటి దేశాలలో ఇది సమస్యలు సృష్టిస్తుందని విశ్లేషించారు. దభోల్-బెంగళూరు పైప్లైన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం మహారాష్ర్టలోని దభోల్ , కర్ణాటకలోని బెంగళూరు మధ్య గెయిల్ ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్లైన్ను ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జాతికి అంకితం చేశారు. 1,000 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ను రూ. 4,500 కోట్లతో గెయిల్ అభివృద్ధి చేసింది. 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు మన్మోహన్తోపాటు, ఆయిల్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా హాజరయ్యారు. మహారత్న స్థాయిని అందుకున్న గ్యాస్ దిగ్గజం గెయిల్ మంచి పనితీరును చూపుతున్నదని ఈ సంద ర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఈ పైప్లైన్ ద్వారా జాతీయ గ్రిడ్కు తొలిసారి దక్షిణాది అనుసంధానమైందని గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ పేర్కొన్నారు. పైప్లైన్ ద్వారా రోజుకి 1.6 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్ఎండీ) గ్యాస్ను సరఫరా చేయవచ్చు. -
కేజీ-డీ6లో మరో బావి మూత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒత్తిడి తగ్గిపోవడం; నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలను చూపుతూ కంపెనీ ఇక్కడ మరో గ్యాస్ బావిని మూసివేసింది. ప్రధాన క్షేత్రాలైన డీ1, డీ3లలో బీ7 అనే బావిని మూసేసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్)కు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 నుంచి భౌగోళిక కారణాలతో కేజీ-డీ6లో బావులు మూతపడుతూ వస్తున్నాయి. కాగా, కంపెనీ తాజాగా మూసేసినది పదో బావి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఏ1 అనే బావిని ఆర్ఐఎల్ మూసివేసింది. ఇప్పటిదాకా డీ1, డీ3లలో మొత్తం 22 బావులను తవ్విన రిలయన్స్.. ఇందులో 18 బావుల్లో ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో 10 బావులు మూతపడ్డాయి. పాతాళానికి ఉత్పత్తి... బావుల మూసివేత ప్రభావంతో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయింది. నవంబర్ 17తో ముగిసిన వారంలో ఇక్కడి డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి రోజుకు 8.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్సీఎండీ)కు పడిపోయినట్లు కంపెనీ తన నివేదికలో తెలిపింది. ఇక ఎంఏ చమురు క్షేత్రాల్లో 3.42 ఎంఎంఎస్సీఎండీలతో కలిపితే మొత్తం కేజీ-డీ6 బ్లాక్లో గ్యాస్ ఉత్పత్తి 12.05 ఎంఎంఎస్సీఎండీలకు జారిపోయింది. 2010 మార్చిలో నమోదైన 69.5 ఎంఎంఎస్సీఎండీల గరిష్టస్థాయితో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి 80% పైగా పడిపోవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న గ్యాస్లో 11.75 ఎంఎంఎస్సీఎండీలను ప్రాధాన్యత ప్రకారం ఎరువుల ప్లాంట్లకు సరఫరాచేస్తున్నామని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పైప్ లైన్లద్వారా రవాణాకోసం వినియోగిస్తున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. విద్యుత్ ప్లాంట్లకు పూర్తిగా సరఫరాలు నిలిచిపోయాయని తెలిపింది. ఇప్పటికే భారీగా జరిమానా...: కేజీ-డీ6 క్షేత్రాల్లో ప్రణాళికలకంటే చాలా తక్కువగా గ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నందుకుగాను తాజాగా చమురు శాఖ 792 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,900 కోట్లు) అదనపు జరిమానా విధించడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా మొత్తం జరిమానా విలువ 1.797 బిలియన్ డాలర్లకు (దాదాపు 11,100 కోట్లు) ఎగబాకింది కూడా. 2006లో ఆమోదించిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ) ప్రకారం తగినన్ని బావులను తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని డీజీహెచ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి గతేడాది(2012-13) నాటికే 80 ఎంఎంఎస్సీఎండీ గ్యాస్ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇందులో కేవలం 10% గ్యాస్ మాత్రమే వెలికితీస్తుండటంతో పెద్దయెత్తున ఉత్పత్తి సదుపాయాలు నిరుపయోగంగా మారాయి. దీనివల్ల ఖజానాకు గండిపడుతోంది. దీంతో పెట్టుబడుల్లో రికవరీకి కోతపెడుతూ ప్రభుత్వం జరిమానాగా విధిస్తోంది. గ్యాస్ ధర పెంపుపై వెనక్కితగ్గం: మొయిలీ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గే ప్రసక్తేలేదని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తేల్చిచెప్పారు. త్వరలోనే పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా జారీ చేయనున్నట్లు మంగళవారం ఇక్కడ పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ నివేదికకు అనుగుణంగా గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్) నుంచి 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కొత్త ధరను ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటికీ ఒకేలా వర్తింపజేస్తామని, అదేవిధంగా సంప్రదాయ సహజ వాయువుతోపాటు, కోల్బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్లకు కూడా ఇదే ధర అమలవుతుందని ఆయన వెల్లడించారు. రిలయన్స్ బ్యాంక్ గ్యారంటీకి త్వరలో పరిష్కారం..: రిలయన్స్కు బ్యాంక్ గ్యారంటీ విధింపు అంశానికి మరో 15 రోజుల్లో ఒక పరిష్కారం లభించగలదని ఆయన పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరను అమలు చేయాలంటే ప్రతి క్వార్టర్లో 135 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.800 కోట్లు)ను ఆర్ఐఎల్ బ్యాంక్ గ్యారంటీని సమర్పించాలని చమురు శాఖ షరతు విధించింది. రిలయన్స్ కావాలనే గ్యాస్ను దాచిపెట్టి రేటు పెంపు తర్వాత అనూహ్య లాభాలను ఆర్జించాలని చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కాగా, రిలయన్స్ చెబుతున్నట్లుగా గ్యాస్ ఉత్పత్తి పతనానికి భౌగోళిక ప్రతికూలతలు కారణం కాదని తేలితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్తరేటు వ్యత్యాసాన్ని వడ్డీతోసహా ఈ బ్యాంక్ గ్యారంటీలనుంచి రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
డీజిల్ రేట్లపై ఆరు నెలల్లో... నియంత్రణ ఎత్తేస్తాం
న్యూఢిల్లీ: వచ్చే ఆరు నెలల్లో డీజిల్ ధరలను పూర్తిగా డీరెగ్యులేట్ చేస్తామని చమురు శాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ తెలిపారు. ప్రస్తుతం డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ. 9.28 మేర ఉంటోందని కేపీఎంజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఒక్కసారిగా రేటును రూ.3 లేదా రూ.4 చొప్పున పెంచే యోచనేదీ లేదని, స్వల్ప పెరుగుదల క్రమంగానే కొనసాగుతుందని మొయిలీ వివరించారు. ప్రస్తుత పెరుగుదలను బట్టి చూస్తే డీజిల్పై చమురు కంపెనీల నష్టాలు భర్తీ కావాలంటే 19 నెలలు పడుతుందని అంచనా. అయితే, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఆరు నెలల కాలం సరిపోవచ్చని భావిస్తున్నట్లు మొయిలీ చెప్పారు. ఎన్నికల వేళ అయినా కూడా డీజిల్ డీరెగ్యులేషన్ విషయంలో వెనక్కి పోబోమని, మూడోసారి కూడా యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే డీజిల్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఓఎంసీలు కోల్పోయే ఆదాయాన్ని తాను భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోంది. 2010లో పెట్రోల్ రేట్లపై నియంత్రణ తొలగించినప్పట్నించీ వాటి రేట్లు అంతర్జాతీయ సాయికి అనుగుణంగా మారుతున్నప్పటికీ డీజిల్పై మాత్రం నియంత్రణ పాక్షికంగా కొనసాగుతోంది. క్రమంగా దీన్ని తొలగించే దిశగా ప్రతి నెలా లీటరుపై 50 పైసల చొప్పున ధర పెంచేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అనుమతించింది. దీంతో ఒక దశలో డీజిల్పై ఓఎంసీల ఆదాయ నష్టాలు లీటరుకు రూ. 2.50కి దిగి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత దేశీ కరెన్సీ మారకం విలువ బలహీనపడటంతో మళ్లీ రూ. 14కిఎగిశాయి. ప్రస్తుతం ఈ నష్టాలు లీటరుకు రూ. 9.28 స్థాయికి తగ్గాయి. ఒకవేళ నియంత్రణను ఎత్తివేస్తే ఈ స్థాయిలో డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఆపై అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్ తరహాలోనే డీజిల్ రేట్లు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. బ్లాకుల వేలం..: నూతన అన్వేషణ లెసైన్సింగ్ విధానం(నెల్ప్) కింద పదో రౌండు చమురు, గ్యాస్ బ్లాకుల వేలాన్ని జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని మొయిలీ పేర్కొన్నారు. జనవరిలో జరిగే పెట్రోటెక్ సదస్సులో తేదీలను ప్రకటించవచ్చన్నారు. -
ఓఎన్జీసీ కోసం మేఘా గేదరింగ్ స్టేషన్
హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) నిర్మించిన గ్రూప్ గేదరింగ్ స్టేషన్(జీజీఎస్)ను చమురు శాఖ మంత్రి ఎం. వీరప్పమెయిలీ జాతికి అంకితం చేశారు. అస్సాంలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఓఎన్జీసీ ఇంధన వ్యవస్థను పునర్నిర్మించే ప్రాజెక్ట్ను తాము పొందామని, ఈ ప్రాజెక్ట్లో భాగంగా అస్సాంలోని లక్వా ప్రాంతంలో ఈ జీజీఎస్ను నిర్మించామని ఎంఈఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ 2030 కల్లా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా జీజీఎస్ నిర్మాణం ఒక ముందడుగని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ సీఎండీ సుధీర్ వాసుదేవ, ఎంఈఐఎల్ ఎండీ, పీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అసోంలోని 500 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్లైన్లతో పాటు పంపింగ్, గ్రూప్ గేదరింగ్ తదితర కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
నెలాఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం: మొయిలీ
ఢిల్లీ: ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మొయిలీ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్నిస్పష్టం చేశారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన సీమాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని గతంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. .సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు. -
హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది: జేడీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు గురువారం సహజ వనరుల శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ హైదరాబాద్తో సమానంగా రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ అందరిదనీ, గత ఎనిమిదేళ్లలో హైదరాబాద్లో 55వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. హైదరాబాద్పై అందరూ ఆధారపడ్డారని, ఇరుప్రాంతాల ప్రజల సమస్యలపై జోవోంఎం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను శాశ్విత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని జేడీ శీలం అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను మొయిలీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు జేడీ శీలం తెలిపారు. క్లిష్టమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోలేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. తెలుగు ప్రాంత ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరామన్నారు. సాగునీరు, రాజధాని, సహజ వనరులు, చమురు కేటాయింపులపై చర్చించినట్లు తెలిపారు. తాను ఎవరికి నివేదిక ఇవ్వలేదని, ప్యాకేజీలపై చర్చించలేదన్నారు. తమ అభ్యంతరాలపై మొయిలీ సానుకూలంగా స్పందించినట్లు జేడీ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పురందేశ్వరి, చిరంజీవి, కావూరి సాంబశివరావు, జేడీ శీలం పాల్గొన్నారు. కాగా హైదరాబాద్లోని సీమాంధ్రల భద్రతకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. -
హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది: జేడీ
-
ప్రీమియం ఇంధనాలపై పన్నులు తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రీమియం పెట్రోల్, డీజిల్లపై సుంకాలు తగ్గించాలని చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు. అధిక మైలేజీ నిచ్చే ఈ ప్రీమియం ఇంధనాలపై సుంకాల కోత కారణంగా, ఈ ప్రీమియం ఇంధనాల వాడకం పెరిగి సాధారణ ఇంధనాల వినియోగం తగ్గుతుందని ఆయన వివరించారు. ఈ ప్రీమియం ఇంధనాలపై ప్రభుత్వం అధికంగా ఎక్సైజ్ సుంకాలను విధిస్తోంది. ఫలితంగా సాధారణ ఇంధనాల కన్నా వీటి ఖరీదు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ పోకడలకనుగుణంగా భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పెషలైజ్డ్ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను అందిస్తున్నాయి. ప్రీమియం, సాధారణ ఇంధనాల ధరల మధ్య వ్యత్యాసం రూ.8-14 గా ఉంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన చమురు పరిరక్షణ ఉత్సవాల ముగింపు సందర్భంగా మొయిలీ ఈ విజ్నప్తిని చేశారు. 2009 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్, డీజిల్లపై కొత్తగా సుంకాలను విధించింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ తరహా ఇంధనాలకు సబ్సిడీలనివ్వటాన్ని కూడా ప్రభుత్వం నిలిపేసింది. సాధారణ పెట్రోల్పై లీటర్కు రూ.1.20, ప్రీమియం పెట్రోల్పై రూ.7.50 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ఇక సాధారణ డీజిల్పై లీటర్కు రూ.1.46, ప్రీమియం డీజిల్పై రూ.3.75 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ప్రీమియం ఇంధనాలపై సుంకాల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయమేమీ గణనీయంగా పడిపోదని, వీటి విక్రయాలు ప్రస్తుతానికి స్వల్పంగా ఉ ండటమే దీనికి కారణమని మొయిలీ అన్నారు. -
ఇక బంకుల్లో వంట గ్యాస్
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో వంట గ్యాస్ సిలిండర్ల (ఎల్పీజీ) విక్రయం ఇకపై దేశవ్యాప్తం కానుంది. ఐదు మెట్రో నగరాల్లో చమురు సంస్థల యాజమాన్యంలోని బంకుల్లో అక్టోబర్ 5 నుంచిప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను దేశవ్యాప్తంగా చమురు సంస్థల యాజమాన్యంలోని దాదాపు 1,440 పెట్రోల్ బంకులన్నింట్లోనూ విక్రయించేందుకు అనుమతిస్తూ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత భద్రతా ప్రమాణాలున్న ఇతర బంకులను కూడా సిలిండర్లను విక్రయానికి అనుమతించే అవకాశముందని పెట్రోలియం శాఖ పేర్కొంది. ఇవి మార్కెట్ ధరకు (అంటే సబ్సిడీ ధరకు రెట్టింపుకు కాస్త ఎక్కువగా) అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కొనుగోలుదారు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీవో ఉద్యోగుల వంటివారికి దీనితో బాగా లబ్ధి చేకూరనుంది. 5 కేజీ ఎల్పీజీ సిలిండర్ మొదటిసారి కొనుగోలు చేసేందుకు రూ.1,000, రెగ్యులేటర్కు రూ.250 (పన్నులు అదనం) ఖర్చవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలును ప్రస్తుతానికి నిలిపేశారు. -
గుత్తా జ్వాలకు మద్దతిస్తాం: మంత్రి జితేంద్ర
న్యూఢిల్లీ: జీవితకాల ప్రతిపాదన ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అవసరమైన మద్దతు అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ ఉదంతం గురించి పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాసిన లేఖకు ఆయన పై స్పందించారు. జ్వాల అంశాన్నిపూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని తన శాఖను ఆదేశించినట్లు జితేంద్ర తెలిపారు. ఆమెకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కాగా, ఆమెకు బాయ్ తో తలెత్తిన వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లిందని, కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
డీజిల్ ధర పెంచేందుకు రంగంసిద్ధం
న్యూఢిల్లీ: డీజిల్ ధరను లీటర్కు ఏకంగా రూ.5 చొప్పున తక్షణమే పెంచాలని కిరీట్ ఎస్.పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. కిరోసిన్ రేటును కూడా లీటర్కు రూ.4 చొప్పున పెంచాలని సూచించింది. అంతేకాదు గృహావసరాలకు సబ్సిడీపై ఇచ్చే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.250 పెంచాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 9 చొప్పున సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీటిని 6కు తగ్గించాలని సూచించింది. తద్వారా సబ్సిడీ బిల్లు రూ.72 వేల కోట్ల మేరకు తగ్గుతుందని అంచనా. ఈ మేరకు బుధ వారం చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీకి నివేదికను సమర్పించిన పారిఖ్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ధరలు పెంచిన తర్వాత చమురు కం పెనీలకు డీజిల్పై లీటర్కు కేవలం రూ.6 చొప్పున మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని కమిటీ సూచించింది. -
కేజీ-డీ6లో 80% తిరిగివ్వాల్సిందే...
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి బేసిన్లోని డీ6 గ్యాస్ బ్లాక్లో అయిదు నిక్షేపాలు సహా 81 శాతం భాగాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ని (ఆర్ఐఎల్) కేంద్రం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా ఈ ప్రాంతాన్ని కంపెనీ అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు పంపడం జరిగి ఉంటుందని లేని పక్షంలో వెంటనే పంపుతామని చమురు శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ తెలిపారు. కంపెనీ తన వాదనలను వినిపించేందుకు తగినంత అవకాశం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. డీ6 బ్లాక్లో 7,645 చ.కి.మీ. మేర ప్రాంతం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ అదీనంలో ఉంది. ఇందులో 5,367 చ.కి.మీ. తిరిగిస్తామని రిలయన్స్ ప్రతిపాదించింది. అయితే, అంతకు మించి 6,198.88 చ.కి.మీ.ని తిరిగివ్వాలని చమురు శాఖ చెబుతోంది. ఈ భాగంలో సుమారు 805 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉంటాయని అంచనా. వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉంటుంది. మరోవైపు, కంపెనీ తన వద్ద అట్టే పెట్టుకునేందుకు చమురు శాఖ అనుమతించనున్న 1,4465.12 చ.కి.మీ. స్థలంలో డీ29, డీ30, డీ31 గ్యాస్ క్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 345 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అంచనా. డీ6 బ్లాకులో 2010లో గరిష్టంగా రోజుకు 60 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. కానీ ప్రస్తుతం 14 ఎంసీఎండీకి తగ్గిపోయింది. భౌగోళికమైన సమస్యలే ఉత్పత్తి తగ్గుదలకు కారణమని ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ చెబుతున్నాయి. అయితే, నిర్దేశిత స్థాయిలో గ్యాస్ బావులు తవ్వకపోవడమే ఇందుకు కారణమని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) భావిస్తోంది. అందుకే, రిలయన్స్ వాదనల్లో వాస్తవాలు తేలేంత వరకూ కొత్తగా నిర్ణయించిన ధరను (యూనిట్కు 8.4 డాలర్లు) దాని గ్యాస్కి వర్తింప చేయకూడదని చమురు శాఖ యోచిస్తోంది. -
కేజీ-డీ6లో అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) మరో 8-10 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో బీపీ సీఈవో బాబ్ డడ్లీ, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ తెలిపారు. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి తగ్గిపోవడానికి సంబంధించి పలు జరిమానాలు విధించడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. గంట సేపు సాగిన ఈ సమావేశంలో.. గ్యాస్ను వెలికితీయకుండా కృత్రిమంగా తొక్కి పెట్టి ఉంచడం సాధ్యం కాదని, తమపై విధిస్తున్న జరిమానాలు ఒప్పందానికి విరుద్ధమని డడ్లీ, అంబానీ వివరించారు. అయితే, డీ6లో కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్కి కొత్త ధరను వర్తింప చేసే అంశంపై కేబినెట్ కమిటీయే నిర్ణయం తీసుకోగలదని మొయిలీ వారికి తెలిపారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా డడ్లీ సమావేశమయ్యారు. కేజీ డీ6 బ్లాక్లో గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయినందున కేంద్రం 1.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించడం తెలిసిందే. దీంతో పాటు ఉత్పత్తి క్షీణతకు కారణం తెలిసే దాకా కొత్తగా ఈ క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్కు కొత్త రేటు(యూనిట్కు 8.4 డాలర్లు) వర్తింపచేయబోమని కూడా స్పష్టం చేసింది. అయితే, బ్లాక్ సంక్లిష్టంగా ఉండటం వల్లే గ్యాస్ ఉత్ప త్తి తగ్గిపోయిందని, అధిక ధర కోసం తాము కృత్రిమంగా తగ్గించడం సాధ్యం కాదని రిలయన్స్, బీపీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డడ్లీ, అంబానీలు కేంద్ర మంత్రులతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదు: మొయిలీ
పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ న్యూఢిల్లీ: వంటగ్యాస్(ఎల్పీజీ)పై సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తేల్చిచెప్పేంత వరకు కార్డు తప్పనిసరి కాదని బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. ‘ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే. సుప్రీంకోర్టు ఏదో ఒకటి స్పష్టంగా తేల్చేవరకు దీన్ని తప్పనిసరి చేయం’ అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం తెలిసిందే. -
సమస్యల పరిష్కారానికే మంత్రుల బృందం: వీరప్ప మొయిలీ
ఏపీ విభజనపై కేంద్ర మంత్రి మొయిలీ బెంగళూరు: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు, ప్రజలు లేవనెత్తిన అన్ని సమస్యల పరిష్కారానికే మంత్రుల బృందం ఏర్పాటయిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శనివారం తెలిపారు. ముఖ్యంగా వనరుల పంపిణీ, హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజల భద్రత, జలవనరుల పంపిణీ, రాజధాని.. తదితర అంశాలపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఆ బృందానికి ఆరువారాల సమయం ఇచ్చారని, ఆ లోపే అన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదని ఆయన చెప్పారు. ‘ఒక్కసారి సమస్యలకు పరిష్కారం కనిపిస్తే.. అన్ని ప్రాంతాల ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది’ అన్నారు. తెలంగాణ 60 ఏళ్ల సమస్య అని, ఆందోళనల కారణంగా మరికొంత కాలం దీన్ని పెండింగ్లో పెట్టలేమని స్పష్టంచేశారు. వైఎస్సార్ పార్టీతో పొత్తు విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆ అంశం అప్రస్తుతమన్నారు. ఆ పార్టీలది పచ్చి అవకాశవాదం: దిగ్విజయ్ న్యూఢిల్లీ: విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం పచ్చి అవకాశవాదమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం సామాజిక అనుసంధాన వెబ్సైట్ ట్విట్టర్లో ఆయన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబునాయుడు, జగన్లు లేఖలు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ యూ టర్న్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎంత అవకాశవాదం’ అని పోస్ట్ చేశారు. -
ఇక నచ్చిన చోట ‘గ్యాస్’
5 నుంచి ‘గ్యాస్’ కనెక్షన్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా 30 నగరాల్లో అమలు సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త! గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సేవలు నచ్చకున్నా.. గతిలేక అక్కడే కనెక్షన్ కొనసాగించుకుంటున్న వారు.. ఇకమీదట అలా ఉండాల్సిన పనిలేదు. ఇకపై వెంటనే అదే కంపెనీలోని మరో డిస్ట్రిబ్యూటర్కు లేదా వేరే కంపెనీకి కనెక్షన్ మార్చేసుకోవచ్చు. ‘‘మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పథకం’’ తరహాలోనే ‘‘ఇంటర్ కంపెనీ వంటగ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ’’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 5న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కర్ణాటక రాజధాని బెంగళూరులో దీన్ని ఆరంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్/సికింద్రాబాద్ జంటనగరాలు, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మొత్తం 30 ముఖ్య నగరాల్లో ఈ పథకాన్ని తొలివిడతగా ప్రవేశపెడుతున్నారు. ఈ నగరాల జాబితాలో దేశంలోని ఐదు ప్రధాన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఉన్నాయి. ఈ పథకంతోపాటు 5 కిలోల వంటగ్యాస్ సిలిం డర్ల విక్రయాలకు కూడా ఆయన అదేరోజు బెంగళూరులో శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పుడు ఉన్న విధానం ఇదీ...: ప్రస్తుత విధానంలో ఒక కంపెనీలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారు... ఆ కంపెనీ సేవలు నచ్చినా నచ్చకున్నా అదే గ్యాస్ వాడక తప్పడం లేదు. ఉదాహరణకు హెచ్పీ గ్యాస్ వాడే వినియోగదారులు ఇండేన్ గ్యాస్ లేదా భారత్ గ్యాస్కు మళ్లడానికి వీలు లేదు. అలాగే, హెచ్పీ గ్యాస్ పంపిణీదారు నుంచి గ్యాస్బండ అందుకుంటున్నవారు హెచ్పీకి చెందిన మరో పంపిణీదారు నుంచి గ్యాస్బండ పొందే అవకాశం కూడా లేదు. తమకు దగ్గరగా ఏజెన్సీ ఉన్నా దూరంగా ఉన్న ఏజెన్సీ నుంచి దగ్గరి ఏజెన్సీకి గ్యాస్ సేవలను మార్చుకునే వీలూ లేదు. ఇకమీదట ఈ పరిస్థితి మొత్తం మారనుంది. కొత్త విధానంలో ఇలా... పోర్టబిలిటీ పథకం కింద ఓ కంపెనీ సేవలు లేదా ఆ కంపెనీ పంపిణీదారు సేవలు నచ్చకుంటే వెంటనే ఆ కంపెనీ వెబ్సైట్లో తమ అయిష్టతను ప్రకటించి వేరే కంపెనీ లేదా పంపిణీదారును ఎంచుకోవచ్చు. తాము నివాసమున్న ప్రాంతానికి చేరువలోని పంపిణీదారుల్లో ఇష్టమైన పంపిణీదారుణ్ని వినియోగదారులు ఎంపికచేసుకోవచ్చు. కంపెనీ సేవలే నచ్చనిపక్షంలో వేరే కంపెనీ సేవలకు మారవచ్చు. అలా కాకుండా ఓ కంపెనీకి చెందిన ఒక నిర్దిష్ట పంపిణీదారు సేవలే ఇష్టం లేకుంటే అదే కంపెనీకి చెందిన పంపిణీదారుల జాబితానుంచి తమకు నచ్చిన పంపిణీదారు నుంచి సేవలు స్వీకరించవచ్చు. {పతి చమురు మార్కెటింగ్ కంపెనీ వెబ్సైట్లో ప్రతి ప్రాంతంలోని గ్యాస్ పంపిణీదారుల సేవలకు ఇచ్చిన రేటింగ్స్ని వినియోగదారులు చూడవచ్చు. సేవలస్థాయి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారుణ్ని ఎంచుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో వినియోగదారు పోర్టబిలిటీ కోసం పేరును నమోదుచేసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతారు. సేవల్లో మెరుగుదల తథ్యం...: గ్యాస్ పోర్టబిలిటీ పథకం అమలుతో వంటగ్యాస్ కంపెనీలు, పంపిణీదారులు వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో గణనీయంగా మార్పు వస్తుందని, సేవలు మెరుగుపడటం తథ్యమని పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీల మధ్య, పంపిణీదారుల మధ్య పోటీతత్వాన్ని ఈ పథకం పెంచనున్నందున ప్రతి కంపెనీ లేదా పంపిణీదారు తమ సేవలను ఇతరులకు దీటుగా మార్చుకోక తప్పదని వారంటున్నారు. మార్కెట్లోకి ఇక 5 కిలోల సిలిండర్లు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు మార్కెట్ ధరకు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నైల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తారు. తర్వాత క్రమేపీ ఇతర నగరాలకు, ప్రాంతాలకు ఈ విక్రయాలను విస్తరిస్తారు. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీఓ ఉద్యోగులు, సాధారణానికి భిన్నంగా ఇతర సమయాల్లో పనిచేసేవారికి ఈ 5 కిలోల సిలిండర్లు ఉపకరిస్తాయన్నది కేంద్రం ఉద్దేశం. తమకిష్టమైన సమయంలో ఖాళీ సిలిండర్ను ఇచ్చి కొత్త సిలిండర్ను పొందే వెసులుబాటు ఉంటుంది కనుక వారి కష్టాలు తీరతాయని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో సిలిండర్ల విక్రయం రోజూ ఎక్కువ గంటలపాటు సాగుతుందని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. -
ప్రతి బుధవారం ప్రజలతోనే ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రతి బుధవారం తాను కార్లకు సెలవు ఇచ్చి మెట్రో రైలు లేదా సిటీ బస్సులో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపుపై దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంకల్పించారు. అక్టోబర్ 9 నుంచి ప్రతి బుధవారం తాను కార్యాలయానికి కారులో వెళ్లబోనని, మెట్రో రైలు లేదా సిటీ బస్సులో వెళతానని మొయిలీ శుక్రవారం ప్రకటించారు. ప్రతి బుధవారం ప్రత్యేక వాహనాలను వినియోగించకుండా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే కార్యాలయాలకు వచ్చి ఇంధనం పొదుపు చేయాలని తన మంత్రిత్వ శాఖ పరిధిలోని 14 ప్రభుత్వ రంగ సంస్థల్లోని అధికారులు, సిబ్బంది అందరికీ మొయిలీ సూచించారు. ఇందులో నిర్బంధం ఏమీ లేదని, స్వచ్ఛందంగా ఇంధనం పొదుపు ఉద్యమంలో పాల్గొనమని కోరుతున్నానని, ఈ మేరకు సర్క్యులర్ జారీ అవుతుందన్నారు. వాస్తవానికి.. ఇంధన పొదుపుపై ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు ప్రచారోద్యమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. రూ. 52 కోట్ల ఖర్చుతో ఆరు వారాలపాటు సాగే ఈ ప్రచారోద్యమం ప్రారంభానికి ముందే తాను వారానికోరోజు ఇంధనం పొదుపు పాటిస్తానని మొయిలీ ప్రకటించడం విశేషం. వారానికో రోజు వ్యక్తిగత వాహనాలకు సెల విచ్చి బస్సు ద్వారా ప్రయాణించాలని కోరారు. ఇంధన పొదుపు పాటించడం ద్వారా ఏటా 500 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని దేశ ప్రజలకు మొయిలీ పిలుపునిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతికి 14వేల కోట్ల డాలర్ల విదేశీ మారద్రవ్యాన్ని వెచ్చించింది. మరే ఇతర అంశంపైనా ఇంత పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చవడం లేదు. ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేయాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు మొయిలీ విజ్ఞప్తి చేశారు. నగరాల్లో ఉచిత సైకిల్ పథకాలను ప్రవేశపెట్టి ఇంధన పొదుపునకు దోహదపడాలని పట్టణాభివృద్ధి శాఖకు సూచించారు. ఢిల్లీలోని మొయిలీ నివాసానికి దగ్గర్లోనే మెట్రో రైలు స్టేషన్ ఉంది. అక్కడి నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్కు మెట్రో రైలులో వెళితే.. కూతవేటు దూరంలోనే ఆయన కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ ఉంటుంది. సిటీ బస్సులో కూడా కార్యాలయానికి వెళ్లడానికి వీలుంది.