vijay antony
-
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
మర్డర్ మిస్టరీ
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గగన మార్గన్’ టైటిల్ ఖరారైంది. ‘అట్టకత్తి, సూదు కవ్వుం, ఏ1, మాయవన్’ వంటి తమిళ చిత్రాలకు ఎడిటర్గా చేసిన లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ని ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.‘‘గగన మార్గన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో చిత్రీకరించిన అండర్ వాటర్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సైలెంట్గా కొత్త సినిమా పూర్తి చేసిన విజయ్ ఆంటోని
కథానాయకుడిగా సక్సెస్ అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి బాగా కనెక్ట్ అయిన విజయ్ నుంచి జయాపజయాలకు అతీతంగా పలు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. మల్టీ టాలెంటెడ్గా రాణిస్తున్నున్న విజయ్ నిర్మాతగానూ విజయాలు అందుకున్నారు. విజయ్ఆంటోని తాజాగా నటించిన హిట్లర్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని అటుంచితే ఈయన తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, అసలు ప్రారంభం అయిన విషయాన్నే తెలపకుండా చిత్ర షూటింగ్ను పూర్తి చేశారు. ఈ చిత్రం ద్వారా లియో జాన్పాల్ అనే ఎడిటర్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈయన పిజ్జా, సూదుకవ్వుమ్ (గడ్డం గ్యాంగ్ పేరుతో తెలుగులో రీమేక్ అయింది) తదితర చిత్రాలకు ఎడిటర్గా పని చేశారు. మహానది శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్ఆంటోనినే సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'తుఫాన్'.. పదిరోజుల్లోనే స్ట్రీమింగ్
కోలివుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతుంది. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్పై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.తుఫాన్ సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ, అమెజాన్ ప్రైమ్లో సడెన్గా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తమిళ్లో తుఫాన్ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేశారు. టాలీవుడ్లో ఆగష్టు 11న విడుదల చేశారు. ఈ క్రమంలోనే ముందుగా తమిళ్ వర్షన్ను ఓటీటీలో విడుదల చేసిన మేకర్స్ వచ్చే వారంలో తెలుగు వర్షన్ కూడా విడుదల చేయనున్నారని సమాచారం. -
ఆ సీన్లో నటించింది నేను కాదు... విజయ్ ఆంటోని
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మలై పిడిక్కాద మనిదన్. ఇన్ఫినిటీ ఫిలిం వేంచర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. నటుడు శరత్కుమార్, సత్యరాజ్, నటి మేఘాఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఈ చిత్రంలోని ఆరంభంలో వచ్చే ఒక నిమిషం సన్నివేశాలను తనకు తెలియకుండా కలిపారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయమై ఆయన మీడియాను కలవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తరువాత మీడియాను కలవాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్రంలో కథానాయకుడు ఏం చేస్తాడు, అతను రౌడీనా? పోలీసా? అతనికి వర్షం అంటే ఎందుకు నచ్చదు? వంటి విషయాలను సస్పెన్స్గా ఉంచానన్నారు. అయితే ఆ సన్నివేశాలను చిత్రంలో ముందుగానే రివీల్ చేసేలా తనకు తెలియకుండా చేర్చారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో నటుడు శరత్కుమార్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని దర్శకుడికి, నిర్మాతకు మధ్య సమన్వయం కుదిర్చినట్లు సమాచారం. ఈ వివాదం గురించి ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొంటూ మలై పిడిక్కాద మనిదన్ చిత్రంలో నిమిషం పాటు సాగే సన్నివేశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సన్నివేశాల్లో నటించింది తాను కాదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగినా? అనే చర్చ సాగుతోంది. -
నా లుక్ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్
‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్. ‘‘తుఫాన్’ను థియేటర్స్లో చూడండి’’ అన్నారు విజయ్ మిల్టన్. ‘‘తుఫాన్’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ. -
విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో బర్త్డే.. సంతోషమే లేకుండా పోయింది!
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో బర్త్డే నేడు (జూలై 24). పుట్టినరోజు అనగానే ఎవరైనా హుషారుగా ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ కుటుంబమే ప్రాణంగా బతికే విజయ్ ఆంటోనికి ఈసారి ఆ భాగ్యం లేకుండా పోయింది. కూతురు చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది.కూతుర్ని పోగొట్టుకుని..గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని గుండెలవిసేలా రోదించారు. తన బాధను తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ విచారాన్ని తొలగించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటినుంచి విజయ్ దంపతులు కుమిలిపోతూనే ఉన్నారు. తన రెండో కూతురి కోసం ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు. ఆ విషాదం నుంచి బయటపడని ఆంటోనిఇటీవల వచ్చిన రోమియో సినిమాలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు చనిపోయిన కూతురు మీరా పేరును వాడారు. అక్కడే వారు గడిచిన విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాక్క ముక్క పాటకుగానూ కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్న తొలి సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. నాన్ మూవీతో హీరోగా మారాడు. తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టి హీరోగానే ఎక్కువ సినిమాలు చేశాడు.చదవండి: పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్బీ కండీషన్? -
తెలుగులో అమ్మ పాట పాడి అదరగొట్టిన విజయ్ ఆంటోని
-
విజయ్ ఆంటోని 'తుఫాన్' ట్రైలర్ విడుదల
విజయ్ ఆంటోని.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో బాగా దగ్గరపయ్యాడు. రీసెంట్గా ఇటీవలే 'లవ్గురు'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇప్పుడాయన 'తుఫాన్'తో మెప్పించనున్నాడు. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన తుఫాన్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది ఒక దీవిలో జరిగే కథతో రూపొందించారు. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగు పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ ట్రైలర్లో ఉంది. ఈ చిత్రంలో యాక్షన్తో పాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలున్నట్లు తెలుస్తోంది. -
Vijay Antony: కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. టాలీవుడ్లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్ని ఓ పీడకల వెంటాడే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్గా సాగుతుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
లవ్ గురులా పరిష్కారాలు చెబుతాను
‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘లవ్ గురు’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్ గురు’ చిత్రం విజయ్ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
బిచ్చగాడు హీరో రొమాంటిక్ మూవీ.. తెలుగులో ఆసక్తికర టైటిల్!
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్కు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని
'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్'. చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా, డీఆర్ సంజయ్కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) ఈ సినిమాలో ప్రియా సుమన్ హీరోయిన్ కాగా.. గౌతమ్ మేనన్, రెడిన్ కింగ్స్లీ, వివేక్, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్గా విజయ్ ఆంటోని కొత్త లుక్లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'మీరా బంగారం..' విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ పోస్ట్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీరా బంగారం.. నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో! నిన్ను కలిసేవరకు.. ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్ అవుతోంది..' అంటూ ఎక్స్(ట్విటర్)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్గా మారగా బాధపడకండి మేడమ్ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023 చదవండి: సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం -
విజయ్ ఆంటోనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరోయిన్
కోలీవుడ్లో నటి అనూయకు మంచి గుర్తింపే ఉంది. 'శివ మనసుల శక్తి' చిత్రంలో నటుడు జీవాతో జత కట్టి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఒరుకల్ఒరు కన్నాడి, మదురై సంభవం, నన్బన్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్బాస్ సీజన్-1లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఐటెం సాంగ్స్లోనూ నటించడానికి వెనుకాడ లేదు. అయితే అలా శృంగార తారగా అందాలు ఆరబోసిన అవకాశాలు లేకపోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగయ్యారనే చెప్పాలి. అయితే తరచూ తన గ్లామరస్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. కాగా ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భాన్ని అనూయ పేర్కొంటూ తాను దుబాయ్లో పుట్టి పెరిగానని చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేశానని, కాగా తనకు సంబంధం లేకపోయినా నటుడు విజయ్ ఆంటోని, సుందర్ సి, జీవాతో తనను కలుపుతూ వదంతులు ప్రచారం చేశారని చెప్పింది. తాను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేకున్నా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రచారాలు అన్నీ అవాస్తవాలు కావడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. దీంతో ఎందుకు ఒంటరిగా ఉన్నారు? పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ఒక అభిమాని ప్రశ్నకు అనూయ బదిలీస్తూ తన చుట్టూ మంచి మగవాళ్లెవరూ లేరని చెప్పింది. దీంతో అనూయ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనూయ హీరో విజయ్ చిత్రం అయిన స్నేహితుడులో నటించింది. ఆ చిత్రంలో వారి ప్రొఫెసర్ పాత్రలో కనిపించిన సత్యరాజ్కు కూతురిగా ఆమె మెప్పించింది. -
విజయ్ ఆంటోని అలాంటివాడు.. ఈగో లేకుండా..: సత్యరాజ్
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్సామియిన్ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్. విజయ్.. నిరాడంబర వ్యక్తి నల్లుసామి పతాకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు. అప్పుడు ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్ చిత్రంలో విజయ్ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్ టైటిల్ దర్శకుడు సుశీంద్రన్ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్ ప్రశంసించారు. చదవండి: తెలంగాణ ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు -
‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉంది. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నారు. తాజాగా విజయ్ కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు. (ఇదీ చదవండి: ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన) విజయ్ ఆంటోనీ పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది. అలా నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల భాద్యతలను ఫాతిమానే దగ్గరుండి చూశారు. అలా సినిమా నిర్మాణ రంగంలో ఆమెకు మంచి అనుభవంతో పాటు గుర్తింపు ఉంది. కుమార్తె మీరా మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ తాజాగా ట్వీట్ చేశారు. మీరాను మరోసారి గుర్తుచేసుకుని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునే దానిని. కనీసం నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నేను దాచుకునే దాన్ని. ప్రస్తుతం నువ్వు మా మధ్య లేకపోవడంతో ఎప్పుడూ నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం కష్టంగా ఉంది. ఈ అమ్మ- నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా.. నీ కోసం నీ చెల్లెలు ఎదురుచూస్తూనే ఉంది. లవ్ యు తంగం.' అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. If I’d known u will live only for 16 yrs, I would have just kept u very very close to me,not even shown you to the sun and moon,am drowning and dying with ur thoughts,can’t live without you ,come back to babba and amma.laara keeps waiting for u,love u Thangam@vijayantony pic.twitter.com/7PAQ5Ji9qp — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) October 9, 2023 -
బాధలో కూడా ప్రమోషన్స్..
-
కూతురు లేదన్న బాధను దిగమింగుకుంటూ ప్రమోషన్స్
-
అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ.. విభిన్నమైన కథలతో పాటు తన సూపర్ టాలెంట్తో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. బిచ్చగాడు2తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత 'హత్య' అంటూ పలకరించినా అది పెద్దగా మెప్పించలేదు. తాజాగా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. దానికి హిట్లర్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పేరుతో ఇప్పటికే చిరంజీవి బ్లాక్బస్టర్ కొట్టాడు. దీంతో సులభంగా హిట్లర్ పేరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందనే ఈ టైటిల్ పెట్టినట్లు టాక్. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. (ఇదీ చదవండి; నటి హరితేజ విడాకులు.. వైరల్గా మారిన పోస్ట్) విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన వారు ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. అయితే దీనిని అన్ని భాషల్లో లాంచ్ చేశారు. 'హిట్లర్' సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక నియంతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే హిట్లర్.' అని చెప్పారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ను ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇదే ట్రైన్లో హీరోయిన్ రియా సుమన్ను హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తూ గౌతమ్ మీనన్ కొత్త లుక్లో కనిపించారు. త్రీడీ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ మోషన్ పోస్టర్లో చివరగా విజయ్ ఆంటోని జోకర్ గెటప్లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇదీ యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది. -
దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట ఈ మధ్య జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే.. 16 ఏళ్ల వయసులోనే ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. కూతురు చనిపోవడంతో విజయ్ ఎంతగానో కృంగిపోయాడు. ఈ బాధలో ఇప్పటి వరకు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. తన కుటుంబ సభ్యులు సరిగ్గా భోజనం కూడా చేయడంలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. (ఇదీ చదవండి; థియేటర్స్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా) సాదారణంగా చాలామంది నటీనటులు సినిమా షూట్ పూర్తి అయిన తర్వాతో ఎదో కారణం చెప్పి సినిమా ప్రమోషన్లుకు రాకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారు. కానీ కన్నకూతురు చనిపోయినా తన సనిమా విడుదల దగ్గర్లో ఉండటంతో ఆయన నిర్మాతల గురించి ఆలోచించి తన చిన్న కూతురుతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే విజయ్ ఆంటోనీ ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్లో పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్ ఈ ఈవెంట్కు హాజరయ్యారని తెలిసింది. విజయ్ హీరోగా సీఎస్ ఆముదన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడదల విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ పరిస్థితిని చూసి ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అలా చేస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని విజయ్ ఈ సినిమాను ముందుగా అనుకున్న అక్టోబరు 6న రిలీజ్ చేయండి అని చెప్పారట. అందుకు అంగీకరించిన మూవీ టీమ్ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ నిబద్ధత కలిగిన నటుడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో మాత్రమే విడుదల అవుతుంది. త్వరలో తెలుగులో కూడా విడుదల కానుంది. #VijayAntony's Daughter #Lara at the Raththam press meet❤️@vijayantony @mrsvijayantony #Raththam #Galatta pic.twitter.com/jbg63rDcUy — Galatta Media (@galattadotcom) September 28, 2023 #VijayAntony arrives at #Raththam press meet with his second daughter Lara. pic.twitter.com/jkFCL750dv — Chennai Times (@ChennaiTimesTOI) September 28, 2023 -
ఇంతటి దుఃఖంలో కూడా విడుదల ఆపొద్దని చెప్పిన విజయ్ ఆంటోనీ.. కారణమిదే
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా 'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం. (ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ) దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్ 6న తమిళ్లో విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు.తెలుగు వర్షన్ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోనీ భావించారట. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది. ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది. -
విజయ్ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్ ఎమోషనల్
హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని. సునీల్, నటి రీతూవర్మ, అభినయకింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్కుమార్ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నటుడు సునీల్ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్ తన కాలేజ్మేట్ అని పేర్కొన్న విశాల్.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య -
కుమార్తె మృతిపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. కన్నీరు పెట్టిస్తున్న వ్యాఖ్యలు
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్) 'నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి ఆమె వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.' అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. మీరా మృతిపై అందరి హృదయాలను కదిలించే నోట్ను విజయ్ ఆంటోనీ షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా దానిని చూసి కంటతడి పెడుతున్నారు. నిర్మాత ఫాతిమాను విజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బలవన్మరణానికి పాల్పడిన పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. -
విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్
విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ చిత్రసీమ తీవ్రమైన శోకంలో ఉంది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే నటుడు మరిముత్తు మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి సమయాల్లో వార్తాపత్రికలతో పాటు పలు యూట్యూబ్ చానెళ్ల కార్యకలాపాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని కోలీవుడ్ తీసుకుంది. అసలు కారణం ఏంటి..? కోలీవుడ్లో ఈ మధ్యే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం మరిచిపోకముందే విజయ్ ఆంటోనీ కుమార్తె మరణించడంతో ఇండస్ట్రీతో పాటు పలువురిని కలచివేసింది. ఈ నేపథ్యంలో వారికి నివాళిలు పలువరు ప్రముఖులు అర్పించారు. ఆ సమయంలో తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్తో పాటు యూట్యూబ్ సిబ్బంది వ్యవహరించిన తీరు తమిళనాట చర్చనీయాంశం అయింది. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్లు పోటీపడ్డాయి. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పలు ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెరపైకి వచ్చింది. మీడియా, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఇలాంటి కార్యకలాపాలపై సినీ పరిశ్రమ నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటులు వివేక్, మైలస్వామి, మనోబాల మృతి ఘటనల్లో కూడా మీడియా ఇలాగే ప్రవర్తించిదని వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటన చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీడియా వారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు. -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్ను షాక్కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
విజయ్ ఆంటోని కూతురి సూసైడ్ నోట్ వైరల్?
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధను జీర్ణించుకోవడం ఎవరితరమూ కాదు. కళ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగే కూతురు ఇక కనిపించదన్న వాస్తవాన్ని క్షణమైనా భరించలేరు పేరెంట్స్. అయినా సరే, భగవంతుడు కొందరికి అటువంటి శిక్షలే వేస్తాడు. భరించలేని బాధను ఇస్తాడు. హీరో విజయ్ ఆంటోని సైతం ప్రస్తుతం అదే బాధతో కుమిలిపోతున్నాడు. మిస్ యూ ఆల్ ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కదా! సెప్టెంబర్ 19న తెల్లవారుజామున ఉరి వేసుకుని మరణించింది. అయితే ఆమె గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెన్నై పోలీసులు ఆమె రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మీరా.. తన స్నేహితులను, టీచర్స్ను మిస్ అవుతానని రాసుకొచ్చింది. తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని పేర్కొంది. చివర్లో.. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసింది . ఈ లెటర్ను ఆమె నోట్బుక్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? ఇక విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది ఆమె తల్లి ఫాతిమా. 'నిన్ను నా గర్భంలో మోశానమ్మా.. నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా?' అని కంటికి ధారగా ఏడ్చేసింది. కూతురితో చివరిసారిగా ఫాతిమా మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చీకటి అంటే భయమున్న మీరా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? నిజంగానే డిప్రెషన్లో ఉందా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి! 3 ఇడియట్స్ నటుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్బాక్కమ్లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో విజయ్కు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించింది. పిల్లల పట్ల కన్నవారికి ఎంత ప్రేమ ఉంటుందో.. ఇలాంటి సమయంలో బాధను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి కోలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచింది. అయితే తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో విజయ్ భార్య ఫాతిమా పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఆమె తన పెద్దకూతురి పట్ల చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ విషాద సమయంలో విజయ్, ఆయన భార్య ఫాతిమా ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. పిల్లలపై వారి ప్రేమను తెలిపేందుకు ఈ ట్వీట్ నిదర్శనం. ఫాతిమా తన కుమార్తె మీరా పాఠశాలలో సాధించిన విజయాల గురించి చేసిన పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మార్చిలో ఫాతిమా తన కూతురు మీరా స్కూల్ యూనిఫాంతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది. ట్వీట్లో రాస్తూ.. 'నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు, నా ఒత్తిడికి కారణం(నీ కొంటెతనం సూపర్)నా తంగకట్టి-చెల్లకుట్టి. మీరా విజయ్ ఆంటోనీ కంగ్రాట్స్ బేబీ’.' అంటూ పోస్ట్ చేసింది. కుమార్తె మరణం తర్వాత ఫాతిమా చేసిన పాత పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయం రవి, ఆర్జే బాలాజీ, శరత్కుమార్, పలువురు తారలు సంతాపం తెలిపారు. కాగా.. విజయ్ భార్య ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. విజయ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby 🤗❤️🥰🔥🔥🔥 pic.twitter.com/yfTTdIiAjL — Fatima (@mrsvijayantony) March 12, 2023 -
విజయ్ ఆంటోని కూతురు సూసైడ్.. టీనేజీ వయసులోనే డిప్రెషన్
ఈ మధ్య కాలంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయిన పీలింగ్తో డిప్రెషన్కు లోవుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి ఒంటితనంతో బాధపడ్డవాళ్లే. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, పేదరికం, ప్రేమలో విఫలమవ్వడం, ఉద్యోగం లేకపోవడం, పనిలో ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలో సగటున 40 శాతం మంది ‘డిప్రెషన్’ డిజార్డర్స్తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరన్న ఒంటిరి ఫీలింగ్ మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించడమే అతిపెద్ద తప్పు. మీలాగే లక్షలాది మంది ఏదో ఒక కారణంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతమాత్రాన ప్రాణం తీసుకోకూడదు. సాధారణంగా సినిమా స్టార్స్ని చూడగానే,వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ యటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల వాళ్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దీపికా పదుకొణె దగ్గర్నుంచి కాజల్ అగర్వాల్ వరకు డిప్రెషన్ నుంచి బయటపడినవాళ్లే. ఇదేం అంత పెద్ద సమస్య కాదు, అలా అని తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. సమస్యను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాం అనేది ముఖ్యం. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్యహత్యతో కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్కి గురయ్యింది. టీనేజీ వయసులోనే డిప్రెషన్తో మీరా సూసైడ్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. గత కొన్నాళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మీరా డిప్రెషన్కు చదువల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ర్యాంకుల వెంట పడిపోయి పేరెంట్స్ పిల్లలను ప్రెజర్ చేయొద్దని సూచించారు. అలాంటిది ఈరోజు ఆయన కూతురే డిప్రెషన్తో చనిపోవడం తీరని విషాదాన్ని నింపుతుంది. Stay strong @vijayantony brother#VijayAntony| #Meera| #MeeraVijayAntonypic.twitter.com/01Fbf3RtvN — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 మీరా ఆ నిర్ణయం తీసుకునేముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని, చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ ఆంటోని ఓ సందర్భంలో.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడని, దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు ఎప్పుడూ పరిష్కారం కాదని విజయ్ పేర్కొన్నారు. కానీ విధి ఎంత విచిత్రమో.. ఆరోజు తండ్రి సూసైడ్ చేసుకోగా, ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కొన్ని సార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుందో, శిక్షిస్తుందో అర్ధం కాదు, స్టే స్ట్రాంగ్ విజయ్ సార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 ఒత్తిడి.. ఎలా బయటపడాలి? ఒంటరితనం వల్ల రకరకాల ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫ్రెండ్స్, ఫ్యామిలితో సమయం గడపండి. ఏదో సాధించాలని తపన అందరిలో ఉంటుంది. కానీ దానికి టైం కూడా రావాలి. కష్టపడిన వెంటనే ఫలితం ఆశించకండి. సమయంతో పాటూ అన్నీ సర్దుకుంటాయి అని పాజిటివ్గా ఉండండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త హాబీని ఏర్పరుచుకోండి. సంగీతం, డ్యాన్స్, మ్యాజిక్.. ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని ఇష్టంతో చేయండి. ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా ఒంటరితనం, డిప్రెషన్ నుంచి బయటరాలేమనుకుంటే వెంటనే సైకాలజిస్ట్ని సంప్రదించండి. Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అప్పుడు ఆయన.. ఇప్పుడు కన్న కూతురు.. తీవ్ర విషాదంలో విజయ్!
తమిళ నటుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్న మీరాను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్ను షాక్కు గురి చేసింది. కాగా.. మీరా చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?) అయితే ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ నెట్టింట వైరలవుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో రిలేషన్పై పలు సూచనలు చేశారు. తాను ఎప్పుడు కూడా తన కుమార్తెను చదువు విషయంలో బలవంతం చేయలేదని అన్నారు. పిల్లల చదువుల గురించి ఇంటి దగ్గర ఎప్పుడు చర్చించలేదని తెలిపారు. కానీ పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. విజయ్ మాట్లాడుతూ..'నేను నా కూతురిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే వదిలేశా. చదవు విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తా. చదవాలనుకుంటే చదవచ్చు. అది తన ఇష్టం. నేను చదువు విషయంలో పిల్లలను బలవంతం చేయను.' అని అన్నారు. మనం పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని విజయ్ సూచించారు. దీనివల్ల పేరేంట్స్, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందన్నారు. (ఇది చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..! ) పిల్లల గురించి అంతలా ఆలోచించే విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా జరగడం ఆయన అభిమానులకు షాకింగ్కు గురిచేసింది. ఆయనకు లారా అనే చిన్న కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు, ఆయన అభిమానులు ధైర్యంగా ఉండాలని మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మీరా డిప్రెషన్తో బాధపడుతోందని.. చికిత్స కూడా తీసుకుంటోందని ఆంటోనీ సన్నిహితులు ఒకరు వెల్లడించారు. కానీ ఆంటోనీ తండ్రి కూడా అతనికి ఏడు సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విజయ్ తండ్రి ఆత్మహత్యపై గతంలో మాట్లాడుతూ..' జీవితంలో ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలే శరణ్యం కాదు. వారి పిల్లల గురించి తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపింది. అయితే అది ఎంత అనేది నాకు మాత్రమే తెలుసు. మా నాన్న పోయిన తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే ఆత్మహత్యల గురించి వింటే నాకు చాలా బాధేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల గురించి నాకు తెలుసు. చాలా కష్టాలు చూశా. కానీ ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు." అని అన్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 -
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!
బిచ్చగాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా ఆంటోని సూసైడ్ చేసుకుంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా) కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్పేటలోని డీడీకే రోడ్డులో నివాసముంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ (16) చర్చ్ పార్క్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది. అయితే చదువుల వల్లే ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మీరా తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే తన గదిలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీరాను గమనించిన కుటుంబసభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోని ఇంట్లో లేడని చెబుతున్నారు. #BREAKING || நடிகரும் இசையமைப்பாளருமான விஜய் ஆண்டனியின் மகள் தூக்கிட்டு தற்கொலை மன அழுத்தம் காரணமாக தற்கொலை என கூறப்படுகிறது சென்னை, டிடிகே சாலையில் உள்ள வீட்டில் அதிகாலை 3 மணி அளவில் தூக்கிட்டு தற்கொலை #vijayantony | #vijayantonydaughter | #laara pic.twitter.com/MZ7Px8HsV2 — Thanthi TV (@ThanthiTV) September 19, 2023 Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆ వార్తల్లో నిజం లేదు.. పరువు నష్టం దావా వేస్తా: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడమ్ చిత్రం ఫేమ్ సిఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి. పంకజ్ బోరా కలిసి నిర్మిస్తున్నారు. నటి రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని, గోపీ అమర్నాథ్ అందిస్తున్నారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సీఎస్ అముదమ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని తాను చదువుకున్న రోజుల్లోనే మిత్రులందరికీ, ఓకే కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని ఈ రత్తంతో అది కుదిరిందని చెప్పారు. ఇది మీడియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. చిత్రంలో మత రాజకీయాలు కూడా ఉంటాయని, అయితే ఇందులో ఇంతకుముందు వచ్చిన ఏ చిత్ర ఛాయలు ఉండవని చెప్పారు. దర్శకుడు అముదమ్ చెప్పిన కథ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు విజయ్ ఆంటోని చెప్పారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరీ వ్యవహారంలో నటుడు విజయ్ ఆంటోని హస్తం ఉన్నట్లు ఒక యూట్యూబ్లో ఛానల్లో ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ ఆంటోని ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు. -
బిచ్చగాడు ఇప్పుడు 'లవ్ గురు' అయ్యాడు!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ఆంటోని.. ఆ తర్వాత నటుడు, ఎడిటర్, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈ మధ్యే 'బిచ్చగాడు 2'తో దర్శకుడుగాను మారి హిట్ కొట్టారు. తాజాగా 'రోమియో' చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తీస్తున్నారు. తెలుగులో లవ్గురు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ కాగా, వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన గుడ్ డెవిల్ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఇది రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తీస్తున్నట్లు విజయ్ చెప్పుకొచ్చారు. ఇందులో కొత్త విజయ్ ఆంటోనీని చూస్తారని ఆయన చెప్పారు. దీనికి భరత్ ధనశేఖర్ సంగీతాన్ని, ఫరూఖ్ జే.బాషా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రోమియో చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నా తదుపరి చిత్రం #LOVEGURU ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది🙏😊 Summer 2024#Blockbuster @GoodDevilOffl @mirnaliniravi pic.twitter.com/uNgRh9lvZs — vijayantony (@vijayantony) August 16, 2023 (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) -
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!
ఏ సినిమా అయినా థియేటర్లలోకి రావడం లేటు.. బిగ్ స్క్రీన్పై చూసి ఆనందించేవాళ్లు కొందరైతే, ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్లు మరికొందరు. వాళ్లకోసమా అన్నట్లు ప్రతివారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలానే ఓ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే మరీ రెండు వారాల్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది. విజయ్ ఆంటోని పేరు చెప్పగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తొస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్లకు ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే.. నటుడిగానూ మారాడు. అలా 'బిచ్చగాడు'తో తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీని తర్వాత హీరోగా మూవీస్ చేస్తున్నాడు గానీ పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. అలా ఈ ఏడాది 'బిచ్చగాడు' సీక్వెల్తో వచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) అక్కడే స్ట్రీమింగ్? ఈ సినిమా ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫస్ట్ పార్ట్ కి ఉన్న క్రేజ్ వల్ల మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టింది. గత నెలలో అంటే జూలై 21న 'హత్య' అనే థ్రిల్లర్ సినిమాతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల్ని పలకరించాడు. పోస్టర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగినప్పటికీ.. థియేటర్లలో మాత్రం బోల్తా కొట్టేసింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైపోయినట్లు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. 'హత్య' కథేంటి? మోడల్ లైలా(మీనాక్షి చౌదరి)ని ఎవరో హత్య చేస్తారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకవు. ఈ క్రమంలోనే ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య దర్యాప్తు చేస్తారు. చివరకు ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అసలు మోడల్ని చంపింది ఎవరు? అనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ
టైటిల్: హత్య నటీనటులు: విజయ్ ఆంటోనీ, మీనాక్షి చౌదరి, రితికా సింగ్, మురళీ శర్మ, రాధిక శరత్కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు దర్శకత్వం: బాలాజీ కుమార్ సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్ విడుదల తేది: జులై 21, 2023 బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. నటించిన కొత్త మూవీ ‘కోలై’. తెలుగులో హత్య పేరుతో విడుదల చేశారు. మీనాక్షి చౌదరి, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘హత్య’ కథేంటంటే.. హైదరాబాద్కు చెందిన ఫేమస్ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఈ కేసు కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్) చేతికి వస్తుంది. ఆమె ప్రముఖ డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. లైగా బాయ్ఫ్రెండ్ సతీష్(సిద్ధార్థ శంకర్), ప్రముఖ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్(అర్జున్ చిదంబరం), మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్(మురళీ శర్మ)తో పాటు బబ్లూ అనేవ్యక్తి (కిషోర్ కుమార్)ని విచారిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారి సంధ్యకు డిటెక్టివ్ వినాయక్ ఎలాంటి సహాయం చేశాడు. కేసు విచారణలో వీరిద్దరికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకుడిని ఎలా గుర్తించారు? అనేది తెలియాలంటే ‘హత్య’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి చిత్రాల్లో ప్రేక్షకుడు థ్రిల్కు గురయ్యే సన్నివేశాలు ఉంటేనే కథతో లీనమవుతారు. కానీ ‘హత్య’లో అలాంటి సన్నివేశాలు తక్కువనే చెప్పాలి. పైగా ఈ తరహా కథలు తెలుగులో బోలెడు వచ్చాయి. ఈ చిత్రంలో కొత్తగా చూపించిదేమి లేదు.ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా రొటీన్గా ఉంటుంది. లైలా హత్యతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. లైలా హత్య కేసు విచారణలో ఐపీఎస్ సంధ్య డెటెక్టివ్ వినాయక్ సహాయం కోరడం.. ఇద్దరు కలిసి విచారణ ప్రారంభించడం.. కొంతమంది అనుమానితుల్ని పిలిచి విచారించడం..ఇలా రొటీన్గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇక మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ ఆంటోనీ పాత్ర ఫ్యామిలీ నేపథ్యం, అతని కూతురు యాక్సిడెంట్ గురయ్యే సీన్స్ని చొప్పించారు. అయితే అవి సాఫీగా సాగుతున్న కథను అతికించినట్లు ఉన్నాయే తప్పా.. ఆడియన్స్కి కనెక్ట్ కాలేవు. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండాఫ్లో కూడా రొటీన్గా సాగుతుంది. లైలా హత్యలో కేసులో అనుమానితులు వరుసగా చనిపోవడంతో అసలు హంతకుడు ఎవడనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సినిమా స్టార్టింగ్లోనే కాస్త జాగ్రత్తగా గమనిస్తే హంతకుడు ఎవరో ఈజీగా కనిపెట్టగలరు. ఓవరాల్గా ‘హత్య’ ఓ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ వినాయక్గా విజయ్ ఆంటోనీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా సీరియస్ లుక్, గ్రే హెయిర్తో తెరపై కొత్తగా కనిపించాడు. ఇక మోడల్ లైలాగా మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిమేర నటించింది. కథంతా తన పాత్ర చుట్టే తిరుగుతుంది కానీ గుర్తిండిపోయే సన్నివేశాలేవి తనకు పడలేదు. ఐపీఎస్ సంధ్యగా రితికా సింగ్ నటన పర్వాలేదు. మురళీ శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతగా బాగా నటించాడు. రాధికా శరత్ కుమార్, సిద్ధార్థ్ శంకర్, అజిత్ చిదంబరంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. -
ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని
కోలివుడ్లో 'నాన్' అనే సీరియస్ కథా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆ తరువాత పలు సక్సెస్పుల్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన పిచ్చైక్కారన్– 2 తెలుగులో (బిచ్చగాడు-2) చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యి విజయం సాధించారు. తాజాగా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం కొలై (హత్య). నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విజయ్ ఆంటోని మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని దర్శకుడు చెప్పారన్నారు. ఆ తరువాత ఇద్దరని అన్నారనీ, వారిలో నటి మీనాక్షీ వేరే నటుడికి పెయిర్ కాగా, నటి రిత్వికా సింగ్ తనకు సోదరిగా నటించినట్లు చెప్పారు. ఇందులో తనకు ఒకే ఒక్క భార్య ఉన్నారనీ, ఆమె కూడా కళ్ల ముందే కాలిపోతుందని చెప్పారు. అలా ఈ చిత్రంలో తనకు రొమాన్స్ లేకుండా చేశారని, ఇందుకు తనకు న్యాయం కావాలి అని సరదాగా అన్నారు. అయితే దర్శకుడు బాలాజీ కే.కుమార్ ఏడు ఏళ్ల తరువాత దర్శకత్వం వహంచిన చిత్రం ఇది అనీ, చాలా బాగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా మళ్లీ సంగీత దర్శకుడిగా ఎప్పుడు పని చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ ఇచ్చానని, తన కేరీర్ ముగిసేలోగా కనీసం 20 మంది కొత్త సంగీత దర్శకులను పరిచయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే సంగీతదర్శకుడిగా కొంత కాలం తప్పుకుంటున్నట్లు చెప్పారు. -
'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం'
‘‘హత్య’ సినిమా క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలు గుర్తొస్తాయి. గిరీష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ‘హత్య’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు విజయ్ ఆంటోని. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, రితికా సింగ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హత్య’. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేశ్ ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరై, ‘హత్య’ హిట్టవ్వాలన్నారు. ‘‘1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాను’’ అన్నారు బాలాజీ కుమార్. -
హత్య చేసిందెవరు?
విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్పై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ .బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మించిన ‘హత్య’ ఈ నెల 21న రిలీజవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ ΄ాత్ర చేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన సరికొత్త లుక్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
ఆ బ్యానర్కు విజయ్ ఆంటోని ఫుల్ సపోర్ట్.. ఏకంగా మూడు సినిమాలు..
పిచ్చైక్కారన్ –2(బిచ్చగాడు 2) చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొలై. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి నాయకిలుగా నటించారు. గిరీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి, కలైపులి ఎస్. ధాను, సత్య జ్యోతి త్యాగరాజన్, అమ్మ క్రియేషన్స్ శివ ,దర్శకుడు విజయ్, లింగుసామి, మిష్కిన్, నటుడు జాన్ విజయ్, నటి మీనాక్షి చౌదరి, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తి వెల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థను ప్రారంభించడానికి ముఖ్య కారణం నటుడు విజయ్ ఆంటోనీ అని పేర్కొన్నారు. ఈ సంస్థలో వరుసగా మూడు చిత్రాలు చేద్దామని ఆయనే తమను ప్రోత్సహించారని తెలిపారు. ఆ విధంగా కొలై చిత్రం, తర్వాత రత్తం, ఆ తర్వాత మలై పిడిక్కాద మనిదన్ చిత్రాలు తమ సంస్థ నుంచి వరుసగా విడుదల కానున్నాయని చెప్పారు. ఇలా విజయ్ ఆంటోనితో వరుసగా చిత్రాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు బాలాజీ కుమార్ దీన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన బడ్జెట్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించినట్లు ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ విషయాలు చోటుచేసుకుంటాయని ధనుంజయన్ తెలిపారు. చదవండి: ప్రాజెక్ట్ కె యూనిట్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ -
ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజులో హిట్ అవుతుంటాయి. అలాంటి మూవీస్ లిస్ట్ తీస్తే అందులో డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గా దీని సీక్వెల్ 'బిచ్చగాడు 2' థియేటర్లలోకి రాగా, ఇది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో కలెక్షన్స్ బాగానే సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తెలుగులో శ్రీకాంత్ 'మహాత్మ' మూవీకి సంగీతమందించాడు. పేరు కూడా తెచ్చుకున్నాడు. కొన్నాళ్లకు 'నకిలీ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అంటే 2016లో 'బిచ్చగాడు' చేసిన విజయ్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాడు. తమిళంలో ఏమోగానీ తెలుగులో ఎవరూ ఊహించని రేంజులో ఈ మూవీ హిట్ అయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. దీంతో తనకు అచ్చొచ్చిన 'బిచ్చగాడు'నే విజయ్ ఆంటోని నమ్ముకున్నాడు. సీక్వెల్ లో హీరోగా నటించి, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్.. ఇలా అన్ని బాధ్యతల్ని తానే చూసుకుని ఫైనల్ గా హిట్ కొట్టాడు. జూన్ 18 నుంచి అంటే ఈరోజు(ఆదివారం) నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంకెందుకు లేటు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. Vijay Gurumoorthy is here now! #Bichagadu2 is streaming now on #DisneyPlusHotstar. #Bichagadu2OnHotstar. @vijayantony @iYogiBabu @KavyaThapar pic.twitter.com/vU7tWi43V3 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 18, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) -
'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా, ఎందుకు హిట్ అవుతుందనేది అస్సలు అంచనా వేయలేం. అలా 2016లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టిన మూవీ 'బిచ్చగాడు'. అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ తెలిసిన విజయ్ ఆంటోని.. ఈ సినిమాతో హీరోగా క్రేజ్ సంపాదించాడు. చాలా సినిమాల్లో నటించాడు. అయితే 'బిచ్చగాడు' సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు గానీ ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన 'బిచ్చగాడు' సీక్వెల్ తో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంతో పోలిస్తే తెలుగులో 'బిచ్చగాడు 2'కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు సొంతం చేసుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే కొందరు మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వారి కోసమా అన్నట్లు తాజాగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం జూన్ 18 నుంచి హాట్ స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?) -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకుంటా: 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
బీచ్రోడ్డు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కట్టుకుంటా.. తెలుగు భాష నేర్చుకుంటానని హీరో విజయ్ ఆంటోనీ అన్నారు. బిచ్చగాడు–2 సినిమా సక్సెస్ మీట్ను శనివారం బీచ్రోడ్డులో నిర్వహించారు. బిచ్చగాడు, బిచ్చగాడు–2 సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు. త్వరలోనే బిచ్చగాడు–3 కూడా తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రం 2026లో విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా బిచ్చగాడు 2లోని చెల్లి చెల్లి పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ బిచ్చగాడుని మించి బిచ్చగాడు–2 విజయవంతం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు సినిమాలు తెలుగులో సూపర్ హిట్లు కావడం ఆనందంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్ సురేష్ మాట్లాడుతూ బిచ్చగాడు–2 సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బాగా విజయవంతం అయ్యిందన్నారు. ఆంధ్రాలోనే అతి పెద్ద థియేటర్ అయిన జగదాంబలో బిచ్చగాడు–2 సినిమా హౌస్ఫుల్గా నడుస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పూర్వీ పిక్చర్స్ ద్వారా విడుదలైందని తెలిపారు. కథ బాగుంటే హీరో ఎవరైనా సరే సినిమా హిట్ అవుతుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ అధినేత వి.జగదీష్, మేనేజర్ రాజు, పూర్వీ పిక్చర్స్ అధినేత నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2026లో బిచ్చగాడు 3 -
'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్లో కూడా హీరోనే!
బిచ్చగాడు సినిమాతో ఫేమస్ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తాజాగా సీక్వెల్ను తెరకెక్కించారు. తానే హీరోగా, దర్శకుడిగా రూపొందించిన బిచ్చగాడు-2 ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) తాజాగా ఈ సినిమా సక్సెస్ను విజయ్ ఆంటోనీ అందరికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో యాచకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తానే స్వయంగా వారికి వడ్డించారు. ఇదీ చూసిన ఆయన అభిమానులు హీరో చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. విజయ్ ఆంటోని భోజనం వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. (ఇది చదవండి: అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి) -
బిచ్చగాడు 3 ఉంటుంది: హీరో విజయ్ ఆంటోని
ఒక్కో రంగంలో తనను తాను సక్సెస్ఫుల్గా మలుచుకుంటూ ఎదుగుతూ వస్తున్న నటుడు విజయ్ ఆంటోని. ఈయన మొదట్లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేశారు. ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత 2012లో నాన్ అనే చిత్రంతో నిర్మాతగా, కథానాయకుడిగా మారారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అలా వరుసగా నటిస్తూ, మరో పక్క సంగీత దర్శకుడిగానూ రాణిస్తున్న విజయ్ ఆంటోని బిచ్చగాడు(పిచ్చైక్కారన్) చిత్రంతో సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇటీవల బిచ్చగాడు 2 చిత్రంతో దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్గా బహుముఖాలను ప్రదర్శించి సక్సెస్ అయ్యారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2 చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో ఈ చిత్రానికి పార్టు 3 ఉంటుందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ 2025లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది బిచ్చగాడు 1, 2 సినిమా కథలకు సంబంధం ఉండదని, వేరే విధంగా ఉంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్ ఆంటోని రత్తం, మళై పిడిక్కాద మణిదన్, వల్లి మలై, అగ్నిసిరకుకళ్, కొలై చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు విడుదలైన తరువాతనే బిచ్చగాడు 3 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్ఆంటోని చెప్పారు. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: హరీశ్ శంకర్ -
వెయిటర్గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఇటీవలె బిచ్చగాడు-2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన బిచ్చగాడు మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించారు. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్గా నటించింది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్గా మారారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్కు విచ్చేసి వెయిటర్గా సర్వ్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
'చావు అంచుల దాకా వెళ్లా'.. బిచ్చగాడు హీరోయిన్ కామెంట్స్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు బిచ్చగాడు-2 రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతుంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరోయిన్ కావ్య థాపర్ తనను రక్షించిందని విజయ్ ఆంటోనీ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై కావ్య థాపర్ స్పందించింది. ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె ఆనాడు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ను గుర్తుచేసుకుంటూ.. మలేషియాలో యాక్షన్ సీన్ చేస్తుంటే అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగింది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలని నేను కూడా సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ను పట్టుకున్నాను. ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లినట్లు అనిపించింది. వెంటనే యూనిట్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించారు అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్. -
ప్రముఖ ఓటీటీలో బిచ్చగాడు-2.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ను సొంతం చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సీక్వెల్గా బిచ్చగాడు-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న(శుక్రవారం)తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించి హీరోగా నటించారు. కావ్య థాపర్ విజయ్కు జోడీగా నటించింది. ప్రస్తుతం థియేటర్స్లో సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కూడా హాట్స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్ మూడోవారం లేదా చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. -
బిచ్చగాడు 2 సంచలనం
-
Bichagadu 2 Review: ‘బిచ్చగాడు 2’మూవీ రివ్యూ
టైటిల్: బిచ్చగాడు 2 నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు తదితరులు దర్శకత్వం: విజయ్ ఆంటోని సంగీతం: విజయ్ ఆంటోని సినిమాటోగ్రఫీ: విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్ విడుదల తేది: మే 19, 2023 ‘బిచ్చగాడు 2’ కథేంటంటే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఏడో వ్యక్తి. ఎన్నికల ఫండ్ కోసమే రూ. 5000 కోట్లు ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటుంది. అయితే.. విజయ్ గురుమూర్తి ఆస్తిపై అతని స్నేహితుడు, వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే అరవింద్(దేవ్ గిల్) కన్నుపడుతుంది. ఎలాగైనా విజయ్ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తున్న సయమంలో టీవీలో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి చెప్పేది వింటాడు. విజయ్ని చంపేసి అతని శరీరంలో వెరొకరి బ్రెయిన్ని ట్రాన్స్ప్లాంట్ చేయించి, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ వేస్తాడు. పథకం ప్రకారమే విజయ్ని దుబాయ్కి వచ్చేలా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ బాడీలో సత్య అనే ఓ బిచ్చగాడి బ్రెయిన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్ అనుకున్నట్లు విజయ్ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సత్య ఎవరు? ఎలా బిచ్చగాడు అయ్యాడు? అతని చెల్లెలు ఎవరు? ఎలా దూరమైంది? సత్య చిన్నప్పుడు జైలుకు ఎందుకు వెళ్లాడు? సత్య విజయ్గా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనిపై ఎవరికి అనుమానం రాలేదా? విజయ్ ప్రియురాలు, కంపెనీ సెక్రటరీ హేమ(కావ్యా థాపర్)కు నిజం తెలిసిన తర్వాత ఏం చేసింది? సీఎం(రాధా రవి) సత్యను ఎందుకు చంపించాలనుకున్నాడు? అసలు యాంటీ బికిలీ కార్యక్రమం ఏంటి? చివరకు సత్య తన చెల్లి కలిశాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’లో మదర్ సెంటిమెంట్ ఉంటే.. దానికి సీక్వెల్గా వచ్చిన ‘బిచ్చగాడు 2’లో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమా స్పెషల్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనే ఆసక్తికర సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా బిలియనీర్ విజయ్ గురిమూర్తి నేపథ్యాన్ని తెలియజేస్తూ అలసు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇక సత్య పాత్రని పరిచయం చేయగానే.. తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలిసిపోతుంది. అతని బ్రెయిన్ని విజయ్ బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు లెన్తీగా అని అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్, సందేశం.. సామాజిక సేవ చుట్టు తిరుగుతుంది. పేదల కోసం ‘యాంటీ బికిలీ’అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయ్ అనౌన్స్ చేసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చివర్లో వచ్చే కోర్టు సీన్స్ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు ప్రతిసారి రిపీట్ అవ్వడం.. అది కూడా ఎమోషనల్గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండాఫ్లో స్క్రీన్ల్ప్లే మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్గా ఈ బిచ్చగాడు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు.. యాక్షన్స్తో అలరిస్తాడు.. అలాగే ఓ మంచి సందేశాన్ని అందిస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఒక సినిమాకు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం అంటే అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కానీ విజయ్ ఆంటోని మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించాడు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. అలా అని తన నటనలో ఎక్కడా తగ్గలేదు. ధనవంతుడైన విజయ్ గురిమూర్తిగా, బిచ్చగాడు సత్యగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విజయ్ ... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమగా కావ్యా థాపర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో అందాల ప్రదర్శన చేసి అందరిని అలరించింది. ఇక నెగెటీవ్ షేడ్స్ ఉన్న అరవింద్ పాత్రకి దేవ్ గిల్ న్యాయం చేశాడు. సీఎంగా రాధా రవి, డాక్టర్గా హరీశ్ పేరడితో పాటు యోగిబాబు, జాన్ విజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. విజయ్ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ని తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించి దర్శకుడిగా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం పిచ్చైక్కారన్–2. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!) విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో సరైన వ్యక్తులను పెట్టాం. ఎడిటింగ్, మ్యూజిక్, డైరెక్షన్.. ఇలా టెక్నికల్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. హీరోయిన్ కావ్య థాపర్ ప్రమాదం నుంచి నన్ను రక్షించింది. నేను చేసిన పొరపాటు వల్లే చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. బిచ్చగాడు చూసిన మిమ్మల్ని ఈ సినిమా నిరాశపరచదు.' అని విజయ్ అన్నారు. అడివి శేష్ నటించిన గూఢచారి’ సినిమాని చూశానని.. అలాంటి సినిమాలో నటించడమేకాకుండా కథను స్వయంగా రాయడం కష్టమన్నారు. ఆకాశ్ పూరీ నటించిన సినిమా బాగా ఆకట్టుకుందన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ పొంగల్ రోజున విజయ్ ఆంటోని సహాయకుడు ఫోన్ చేసి సార్ నీళ్లలో మునిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పారన్నారు. అప్పుడు తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైందన్నారు. తాను విజయ్ ఆంటోనికి అర్థాంగిగానూ, ఆయన చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ విజయ్ ఆంటోని మంచి సంగీత దర్శకుడిగా రాణిస్తూ మళ్లీ కథానాయకుడిగా నటించాడు ఎందుకు అని అనుకున్నానని, అయితే పిచ్చైక్కారన్ చిత్రం చూసిన తరువాత తన ఆలోచన మారిందన్నారు. ఇప్పుడు ఈ పిచ్చైక్కారన్–2 చిత్రం ట్రైలర్ చూస్తుంటే అన్ని విషయాలు చక్కగా చేశారనిపిస్తోందన్నారు. విజయ్ ఆంటోని పునర్ జన్మ ఎత్తింది ఆయన సతీమణి ఫాతిమా కోసం, అభిమానుల కోసం అని ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. -
కోలీవుడ్ కు సీక్వెల్స్ కలిసి రావడం లేదా?
-
Bichagadu 2 Movie: నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆమెనే: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బిచ్చగాడు-2. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ నిర్వహించారు. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. 'హీరోయిన్ కావ్యే నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు థ్యాంక్యూ. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బిచ్చగాడు తర్వాత మరో బ్లాక్ బస్టర్ వస్తోంది. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు.' అని అన్నారు. (ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి) తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ' ఏపీ, తెలంగాణలో ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. విజయ్ ఆంటోనీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను ఈ సినిమా రెండు రీళ్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రెండు రీళ్లకే నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని అన్నారు. నటుడు జాన్ విజయ్ మాట్లాడుతూ.. 'ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా స్టేజ్ మీద నిల్చున్నా. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్. తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించింది. ఈ సారి దర్శకుడుగా మరింత పెద్ద బాధ్యత తీసుకున్నాడు విజయ్. ఈ మూవీ మీ అందరికీ బాగా నచ్చుతుంది." అన్నారు. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్) ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్లో అద్భుతమైన పాయింట్తో వచ్చారు. ఆ టైమ్లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది. నాకు చెల్లి చెల్లీ అనే పాట చాలా ఇష్టం. ఈ పాట ఎంత గొప్పగా తీసి ఉంటారో ఊహించగలను. ఈ చిత్రాన్ని హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.'అని అన్నారు. -
బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది
‘‘విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు.. రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు. ‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న 'బిచ్చగాడు-2' ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగులోనూ ఆయనకు సూపర్ క్రేజ్ను తెచ్చిపెట్టిందీ సినిమా. దీంతో ఇప్పుడు రానున్న బిచ్చగాడు-2పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మాంచి హైప్ను క్రియేట్ చేస్తోంది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? లక్ష కోట్లకు వారసుడైన ధనవంతుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడులవుతున్న ఈ సినిమాకు విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ను రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. Trailer tomorrow at 11 AM🔴 Releasing Worldwide on May 19🟡#BLOCKBUSTER 🟢#Pichaikkaran2 #bichagadu2 pic.twitter.com/Xc0TjFQWzx — vijayantony (@vijayantony) April 28, 2023 -
కన్నీళ్లు తెప్పిస్తున్న 'బిచ్చగాడు-2' సాంగ్ చెల్లి వినవే..
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఈ వేసవిలో విడుదల కానుంది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లీ వినవే.. నా తల్లీ వినవే, నీ అన్నను కాను అమ్మను నేను, చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టుమచ్చై ఉంటా తోడు..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటను భాష్య శ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ‘‘ప్రతి ఒక్కర్నీ కదిలించేలా ఈ పాట సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో
‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్ ఆంటోని. 2016లో విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్ కంపోజింగ్, సింగర్ విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. -
సమంతతో బాక్సాఫీస్ ఫైట్కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
వినూత్నంగా బిచ్చగాడు 2 ప్రమోషన్స్, హీరో లేకుండా ట్రైలర్..!
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరో తెరకెక్కితోన్న లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’. గతంలో సాధారణ సినిమాగా విడుదలై సెన్షేషన్ క్రియేట్ ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం మూవీ షూటింగ్ను జరుపుకుంటోంది. ఇదిలా రీసెంట్గా మలేషియలో జరిగిన షూటింగ్లో జరిగిన ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ఆంటోని 90 శాతం కోలుకున్నాడు. దీంతో అతడు షూటింగ్ను ప్రారంభించాడు. ఇక ఈ చిత్ర సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను వినూత్నంగా ప్రారంభించింది. చదవండి: ఆటో రామ్ ప్రసాద్కు క్యాన్సర్? స్పందించిన నటుడు తాజాగా బిచ్చగాడు 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు మేకర్స్. టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్లో ఎక్కడ హీరో గనిపించకపోవడం విశేషం. డబ్బు ప్రపంచానికి హానికరం అనే క్యాప్షన్తో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే భిన్న కాన్సెప్ట్తో బిచ్చగాడు 2 రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధునాతనమైన టెక్నాలజీని డబ్బు కోసం ఎలా దుర్వినియోగం చేశాడు, దీని ఎదురయ్యే పరిణామాల చూట్టు బిచ్చగాడు 2 కథ ఉండోబోతుందని తెలుస్తోంది. చదవండి: ప్రకాశ్ రాజ్ కామెంట్స్పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ -
తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో.. షూటింగ్ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం తాను తొంభై శాతం కోలుకున్నానంటూ తాజాగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు విజయ్. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. ఈ మేరకు ఆయన తమిళంలో ట్విట్ చేశారు. ‘ప్రస్తుతం 90 శాతం కోలుకున్నాను. ప్రమాదంలో విరిగిన నా దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. ఏం జరిగిందన్నది నాకు తెలియదు. కానీ, మీ వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా. ఏప్రిల్ 2న విడుదల కాబోయే పిచైకారన్ 2(బిచ్చగాడు 2) షూటింగ్ను నేటి నుంచి ప్రారంభించబోతున్నా. నాపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞుడుని. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విజయ్ తన ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ ట్విట్లో రాసుకొచ్చారు. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? அன்பு இதயங்களே நான் 90% குணம் அடைந்து விட்டேன். உடைந்த என் தாடை, மூக்கு எலும்புகள் ஒன்று சேர்ந்துவிட்டன. என்னமோ தெரியவில்லை, நான் இப்போது முன்பைவிட அதிக சந்தோஷத்தை உங்களால் உணருகிறேன்😊 வரும் ஏப்ரல் வெளியாகும் பிச்சைக்காரன் 2 பட வேலைகளை இன்று முதல் தொடங்குகிறேன்🙏 அன்புக்கு நன்றி — vijayantony (@vijayantony) February 2, 2023 -
విజయ్ ఆంటోని ఆరోగ్యంపై రకరకాల వార్తలు! ఫొటోతో క్లారిటీ ఇచ్చిన హీరో
కోలీవుడ్ స్టార్ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కొమాలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమాలంత ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు విజయ్. ఆస్పత్రి బెడ్పైనే ఉన్న ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై బాగానే ఉందని, కోలుకుంటున్నానని చెప్పారు. ‘‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) చిత్రీకరణ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. ఈ ఘటనలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ట్వీట్ చేశారు. చదవండి: ఆనంద్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించిన ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్పైనే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న తన ఫోటోని షేర్ చేశారు ఆయన. దీంతో ఆయన ట్వీట్ వైరల్గా మారింది. విజయ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు-2 షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia. I just completed a major surgery. I will talk to you all as soon as possible😊✋ Thank you for all your support and concern for my health🙏❤️ pic.twitter.com/YJm24omxrS — vijayantony (@vijayantony) January 24, 2023 -
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక సైతం విరిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలియని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, కండిషన్ సీరియస్గా ఉండటంతో విజయ్ కుటుంబసభ్యులు ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడినుంచి చెన్నైకి తరలించినట్లు ఆమె భార్య ఫాతిమా తెలిపారు. కాగా మలేషియాలో ప్రస్తుతం బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకంటున్నారు. ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే. మరోవైపు విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. -
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
సమ్మర్ స్పెషల్గా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై మంచి పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా పిచ్చైక్కారన్–2 తెరకెక్కుతోంది. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ విశేషమేంటంటే ఈ చిత్రం ద్వారా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. #ANTIBIKILI 👺#Pichaikkaran2 #Bichagadu2 #Bhikshuka2 #Bhikshakkaran2 Satellite & Digital rights acquired by Star Network 🔴 Summer 2023 🔥@vijaytelevision @StarMaa @asianet @StarSuvarna @DisneyPlusHS @mrsvijayantony @vijayantonyfilm @DoneChannel1 @gskmedia_pr @gobeatroute pic.twitter.com/w0YPShC1xy — vijayantony (@vijayantony) December 20, 2022