chandrasekhar
-
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
Hyderabad: పిల్లల్ని చంపి దంపతుల బలవన్మరణం
-
Tatiparthi Chandrasekhar: అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
వెలిగొండ ప్రాజెక్ట్పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్కి దిమ్మతిరిగే కౌంటర్
-
ఒకరు తీర్థయాత్ర.. ఒకరు విహారయాత్ర.. కొంచెం కూడా సిగ్గులేదా
-
‘గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో(AP assembly sessions) భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్(abdul Nazeer) ప్రసంగంపై వైఎస్సార్ సీపీ పలు ప్రశ్నలు సంధించింది. అసలు గవర్నర్ ప్రసంగలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ఊసే లేకపోవడానికి కారణం ఏమిటో అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ఆత్మ స్తుతి, పరనిందలా ఉందని విమర్శించింది.‘సీఎం చంద్రబాబు(Chandrababu Naidu).. గవర్నర్ ప్రసంగంలో పిట్ట కథలు చెప్పించారు. ప్రజలను ఎలా మోసం చేయాలో గవర్నర్ తో చెప్పించారు. విద్యా వ్యవస్థ సర్వ నాశనం అవుతున్నా.... లోకేష్ క్రికెట్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్ళారు. మరొకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్థ యాత్రలు చేస్తారు. మంత్రి లోకేష్ ఆయన శాఖను పట్టించుకోరు.పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సిఎం పోస్టు రాజ్యాంగం లో ఉందా?, ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేన కు డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చింది?, ప్రజా స్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కి తెలుసా PAC చైర్మన్ పదవి అనేది ప్రతి పక్ష పార్టీకి ఇవ్వాలి. జనసేన పార్టీ PAC చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారు?2019 లో రెండు చోట్ల ఓడి పోయాక మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడ్రెస్ లేరు.భారత రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఎల్లోమీడియా నా పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు. -
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: చంద్రశేఖర్
-
ఏపీలో రాజ్యాంగ రాజ్యానికి బదులు రాక్షస రాజ్యం నడుస్తోంది
-
సత్యవర్థన్ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుతం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారుగన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
వల్లభనేని వంశీకి 14రోజుల రిమాండ్.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రియాక్షన్
-
కూటమి ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో చెప్పాలి
-
చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్ చెప్పారు. -
అప్పుడు తాలిబన్లు.. ఇప్పుడు కూటమి.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
కేసులకు భయపడేది లేదు.. వైఎస్ జగన్ ను సీఎం చేసేదాకా తగ్గేదేలే
-
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై నాలుగు కేసులు నమోదు
యర్రగొండపాలెం/టెక్కలి/మంత్రాలయం/ పామూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఎస్ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేశ్పై ట్వీట్ చేసిన కేసు ఒకటి కాగా, మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి పెట్టిన కేసులుగా ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడపై ఫిర్యాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ సోమవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది. సోమవారం రాత్రి మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం పోలీస్స్టేషన్లో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్టుకు రిమాండ్ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులపై పోస్టులు పెట్టిన వ్యక్తికి సోమవారం కనిగిరి జేఎఫ్సీఎం 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్ఐ కిషోర్బాబు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మల్కిపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు నానిబాబుపై పామూరుకు చెందిన మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నానిబాబును ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఏపీలో YSRCP నాయకులపై కూటమి సర్కారు వేధింపులు
-
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్పై పెట్టిన పోస్టింగ్తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు), బూసినె విరూపాక్ష (ఆలూరు), రేగ మత్స్యలింగం (అరకు) అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీలు, మోసాలతో పాటు.. వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేమనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని చెప్పారు. ప్రభుత్వం అదే కోరుకుంటోందా? ‘సభలో తమను ఎదుర్కొనే సత్తా లేదా? లేక మీ దుర్మార్గాలు బయట పడతాయని భయపడుతున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కుతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పీకర్కు లేఖ రాశారన్నారు.అయితే దానిని వారు పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమ పిటిషన్పై కోర్టు.. స్పీకర్ వివరణ కోరితే, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాన్ని పిలవాలని.. కానీ తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంటే ప్రతిపక్షం సభకు రాకూడదని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.5 నెలలు.. రూ.57 వేల కోట్ల అప్పు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఐదు నెలలు ఎందుకు పట్టిందని, ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే ఏకంగా రూ.57 వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిలదీశారు. ఐదు నెలలుగా ప్రతి వ్యవస్థలో అధికారులను తమ ఏజెంట్లుగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తామనే భయంతోనే తాము అసెంబ్లీకి రాకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తాము రూ.14 లక్షల కోట్ల అప్పు చేశామని ఇన్నాళ్లూ చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో తేలిపోయిందని తెలిపారు. చివరకు అందులో సగం అప్పు కూడా చూపించలేకపోయారన్నారు.తాము అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఎల్లో మీడియా ద్వారా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తుండటం దారుణం అన్నారు. అప్పులు 6.46 లక్షల కోట్లేనని ఇప్పుడు వాళ్లే చెబుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను సమగ్రంగా ప్రస్తావించడానికే ప్రతిపక్ష హోదా కోరుతున్నాము తప్ప సౌకర్యాల కోసం కాదని స్పష్టం చేశారు. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా వెల్లడించారు.ఈ ప్రశ్నలకు బదులివ్వండి⇒ మీరిచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తామని భయమా?⇒ హామీలను తుంగలో తొక్కింది వాస్తవం కాదా?⇒ వైఎస్సార్సీపీకి ప్రతిపక్షహోదా ఇచ్చే దమ్ము, ధైర్యం లేదా?⇒ సభలో తగినంత సమయం ఇప్పిస్తామని స్పీకర్తో ప్రకటన చేయించగలరా?⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చింది నిజం కాదా?⇒ ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేయడం లేదా?⇒ రూ.57 వేల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు?⇒ ఏకంగా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి అరాచకానికి పాల్పడింది వాస్తవం కాదా?⇒ మీ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టడం లేదా?⇒ రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ ఉందా? -
ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు: Tatiparthi Chandrasekhar
-
అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత
-
Big Question: ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్.. పవన్ ఇప్పుడే నిద్ర లేచాడు..
-
జలాశయాల్లో ‘సికెంట్’ వినియోగించరు!
సాక్షి, హైదరాబాద్: ‘జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరు. సికెంట్ పైల్స్ డిజైన్ల తయారీకి ప్రత్యేక నిబంధనలూ లేవు. మేడిగడ్డ బరాజ్కి సికెంట్ పైల్స్ ఎందుకు వాడారు?’అని కాళేశ్వరం బరాజ్లపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ ఎస్ఈ కె.ఎస్.ఎస్.చంద్రశేఖర్కు శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో బరాజ్ల డిజైన్లపై కమిషన్ కీలక ప్రశ్నలను సంధించింది. దేశంలో జలాశయాల నిర్మాణాల్లో సికెంట్ పైల్స్ వినియోగంపై అప్పట్లో తమ వద్ద సమాచారం లేదని చంద్రశేఖర్ బదులిచ్చారు. ఇన్ఫ్రా, సముద్రపు తీర ప్రాజెక్టుల్లో వీటిని వినియోగిస్తున్నారన్నారు. వీటి డిజైన్లకు మార్గదర్శకాలు లేకపోవడంతో బ్రిటిష్ కోడ్ను అనుసరించామన్నారు. సికెంట్ పైల్స్పై నిర్ణయం ఫీల్డ్ ఇంజనీర్లు, ఎల్అండ్టీదే.. మేడిగడ్డ బరాజ్ పునాదు (ర్యాఫ్ట్)ల కింద షీట్పైల్స్కి బదులు సికెంట్ పైల్స్తో కటాఫ్ వాల్ నిర్మించాలని ప్రాజెక్టు క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నిర్ణయం తీసుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాథమిక దశలో నాలుగు బోర్ రంధ్రాలు వేసి నిర్వహించిన మట్టి నమూనా పరీక్షల ఆధారంగా షీట్పైల్స్ను డిజైన్లలో ప్రతిపాదించామన్నారు. తర్వాత దశలో మరిన్ని బోర్ రంధ్రాలు వేసి పరీక్షలు నిర్వహించగా భూగర్భంలో కంకర మట్టి, ఇసుక రాళ్లు ఉన్నట్టు తేలడంతో షీట్పైల్స్ను వాడడం సాధ్యం కాదని క్షేత్ర స్థాయి ఇంజనీర్లు నివేదించారన్నారు. తాము ప్రత్యామ్నాయంగా డయాఫ్రమ్ వాల్కి డిజైన్లు ఇవ్వగా, క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు సికెంట్ పైల్స్ వేసేందుకు డిజైన్లు కోరారన్నారు. సరైన షూటింగ్ వెలాసిటీని పరిగణనలోకి తీసుకున్నారా సీడీఓ విభాగం సరైన డిజైన్లు ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ కుంగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రశేఖర్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా.. మేడిగడ్డ బరాజ్ నుంచి విడుదలయ్యే వరద వేగాన్ని (షూటింగ్ వెలాసిటీని) సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని, విడుదలైన వరద నేలను తాకే చోట మట్టికోతకు గురికాకుండా దిగువన సరిపడా నీటి నిల్వలతో టైల్పాండ్ ఉండాలనే ఆలోచన చేయలేదని కమిషన్ తప్పుబట్టగా, అందులో వాస్తవం లేదన్నారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా సరైన షూటింగ్ వెలాసిటీ, టైల్పాండ్ లెవల్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నేల కోతకు గురై మేడిగడ్డ బరాజ్ కుంగిందని ఓ మోడల్ స్టడీలో తేలడంతో కమిషన్ ఈ కీలక ప్రశ్నను లేవనెత్తింది. అధిక షూటింగ్ వెలాసిటీ ఉండనుందని క్షేత్ర స్థాయి ఇంజనీర్ల నుంచి తమకు లెక్కలు అందలేదన్నారు. వ్యాప్కోస్ నివేదికలోని లెక్కల ఆధారంగా సరైన టైల్పాండ్ లెవల్తోనే డిజైన్లను తయారు చేశామన్నారు. డీపీఆర్లో నీటి నిల్వ సామర్థ్యం లేదు.. మేడిగడ్డ బరాజ్ డీపీఆర్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సూచించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖర్ తెలిపారు. వ్యాప్కోస్ ఇచి్చన హైడ్రాలజికల్ డేటాను హైపవర్ కమిటీ ఆమోదించిందని, దాని ఆధారంగానే డిజైన్లను తయారు చేశామని వివరించారు. సీఈ సీడీఓ ఇచి్చన డిజైన్లకు నిర్మాణ దశలో చేసిన మార్పులు గుర్తు లేదన్నారు. క్షేత్ర స్థాయి ఇంజనీర్ల సూచనతో బరాజ్ల ర్యాఫ్ట్ డిజైన్లలో మార్పులు చేసిచ్చామన్నారు. నీటి నిల్వ సామర్థ్యంపై క్షేత్ర స్థాయి ఇంజనీర్లు ఏమైనా సూచనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, గుర్తు లేదన్నారు. 2డీ, 3డీ మోడల్ స్టడీస్ తర్వాత డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. -
తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు.కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు..తమ కుమార్తెపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెమ్మసాని అనుచరుడిగా..బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో పెమ్మసాని తరఫున ప్రచారం నిర్వహించాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నిస్సార్ బాషా తెలిపారు.పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ముచ్చుమర్రి, హిందూపురం, పిఠాపురం, బద్వేలు, ఇప్పుడు తెనాలిలో మహిళలపై వరుసగా దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
షర్మిలపై తాడిపత్రి చంద్రశేఖర్ సంచలన కామెంట్స్
-
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
సంపద సృష్టిస్తానన్న బాబు అప్పులు సృష్టిస్తున్నాడు..!
-
నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు
తెనాలి: ‘నా జీవితం అందమైన పూలతోట కాదు.. జీవనం కోసం ఎన్నెన్నో చిరుద్యోగాలు చేశాను. అన్నింటిలోను అత్తెసరు సంపాదనే. చివరకు రచనా వ్యాసంగమే బాలసాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. గుర్తింపువచ్చాక వెనుదిరిగి చూసుకోలేదు. కథలు, నవలికలు, నవలలు, టెలీఫిలింస్తో బిజీ అయ్యాను. కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో కమర్షియల్ కాదలచుకోలేదు. సీరియస్ సాహిత్యాన్నే చేశాను. సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాలతోనే సాహిత్య సృజన చేశాను. ఇప్పుడీ అవార్డుకు ఎంపికవటం సంతోషంగా ఉంది..’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ బాలసాహితీవేత్త, నవలా రచయిత, కాలమిస్ట్, టెలీఫిలింస్ కథ, మాటలు, స్క్రీన్ప్లే రచయిత పి.చంద్రశేఖర ఆజాద్ స్పందన ఇది. అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రశేఖర అజాద్ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల గ్రామం వెల్లటూరు. 1955 మే 24న జన్మించారు. తండ్రి పమిడిముక్కల లక్ష్మణరావు. అప్పట్లో కమ్యూనిస్టు యోధుడు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కొడుక్కి స్వాతంత్య్రయోధుడు చంద్రశేఖర అజాద్ పేరు పెట్టారు. అజాద్కు ఏడేళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయం ఆయన పేరుతోనే ఉంటుంది. రేపల్లెలో ఇంటర్ వరకు చదివిన అజాద్.. ఆ మరుసటిరోజే తెనాలిలోని బావగారి హోటల్లో పనికి కుదిరాడు. ఏ ఉద్యోగంలోను ఎక్కువకాలం చేయలేదు. నవభారత్ టొబాకోలో కొంతకాలం, తర్వాత మరికొన్నింటిలో పనిచేశారు. అపరాధ పరిశోధన.. నిలబెట్టింది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే తనలోని భావాలను అక్షరాల్లోకి మార్చే ప్రయత్నం చేశారు అజాద్. వాటిని అప్పటి దినపత్రికలకు పంపేవారు. ఆరోజుల్లో ‘అపరాధ పరిశోధన’ మాసపత్రిక వచ్చేది. తన కథలు, నవలికలు పంపుతుండేవారు. ‘ఆ పుస్తకమే తనను రచయితగా నిలబెట్టింది..’ అని అజాద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆ పత్రికకు 16–17 నవలికలు, 40కి పైగా కథలు రాశాను. అప్పటో్లనే కథకు రూ.75, నవలికకు రూ.125 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేవారు. చేసే ఉద్యోగంతో నెలకు రూ.180 వరకు వచ్చేవి. అమ్మ విజయలక్ష్మి వాళ్లంతా తెనాల్లో ఉండేవారు. ఆ డబ్బులు తీసుకుని అమ్మను చూడ్డానికి వెళే్లవాడిని..’ అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్లో చేరారు. రోజుకు రూ.10 వేతనం. సెలవులొస్తే అది కూడా ఉండేది కాదు. 1974లో పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు. 1982 వరకు నెలకొచ్చే వేతనం ఏనాడు రూ.180కి మించలేదు. అందమైన పూలతోటకు మొదటి బహుమతి 1983లో ఒక దినపత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల మాసపత్రిక బాలల నవలల పోటీని ప్రకటించింది. ‘అందమైన పూలతోట’ అనే నవలను రాసి పంపారు. తెలుగు బాలసాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన ఆ నవలకు ప్రథమ బహుమతి, ఆరుద్ర భార్య రామలక్ష్మి రాసిన నవలకు ద్వితీయ బహుమతి వచ్చాయి. ‘మహదానందం కలగటమే కాదు.. ఆ నవలతో నా జీవితం మలుపు తిరిగింది..’ అన్నారు అజాద్. ‘అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితలు సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. నాలాంటి వర్ధమాన రచయితలకు ఖాళీలేదని అర్థమైంది. బాలసాహిత్యంలో అవకాశం ఉందనిపించటంతో అప్పట్నుంచి పిల్లలకోసం అంకితమయ్యాను..’ అంటారు అజాద్. విజయవాడ నుంచి వెలువడే ‘స్వాతి’ మాసపత్రికలో అవకాశమిచ్చారు. ‘మా హృదయం’ పేరుతో పదేళ్లలోపు పిల్లలకు అమ్మ, నాన్నతో మొదలుకొని వారికి సంబంధించిన మొత్తం 50 అంశాలను వారి భాషలో రాసిన సీరియల్కు కూడా మంచి గుర్తింపు లభించింది. స్వాతి మాసపత్రికల్లో ఆ సీరియల్ ఆఖరిది. అప్పట్నుంచి రచనలు వేగం పుంజుకున్నాయి. కట్చేస్తే.. ఇప్పటికి 85 నవలలు, 17 నవలికలు, 850కి పైగా కథలు రాశారు. కమ్యూనిస్టు నేపథ్యం కావటంతో సీరియస్ సాహిత్యమే చేశానంటారు అజాద్. సామాజిక అంశాలకు సంబంధించిన ఏదో ఒక సమస్యను చర్చించినవే అన్నీ. వందకుపైగా కథలు, 30కి పైగా నవలలు వివిధ బహుమతులు గెల్చుకున్నాయి. తెలిమబ్బుల ఛాయ, మనోప్రస్థానం, నగరంలో వెన్నెల నవలలకు వరుసగా మూడేళ్లు ఆటా, తానా బహుమతులు లభించాయి. విపరీత వ్యక్తులు, అహానికి రంగుండదు, ముక్తిపర్వం, దేవుడొచ్చాడు నవలలు కూడా గుర్తింపు పొందాయి. పిల్లల ప్రపంచం, నాన్నకో ఉత్తరం, మూడ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంప్రెషన్స్ పేరుతో దినపత్రికల్లో రాసిన కాలమ్స్ ప్రజాదరణ పొందాయి. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ‘నగరంలో వెన్నెల’ ఇప్పుడో సాహిత్య మాసపత్రికల్లో సీరియల్గా ఆరంభమైందని తెలిపారు అజాద్. ఆకర్షించిన బుల్లితెర మరోవైపు బుల్లితెర రంగం కూడా అజాద్ను ఆకర్షించింది. దూరదర్శన్లో ‘జీవనతీరాలు’ సీరియల్తో ఆరంభించి, రాధామధు, లయ, అడగక ఇచ్చిన మనసు, ఎదురీత సీరియల్స్తో మొత్తం ఐదువేల ఎపిసోడ్లకు రచనా సహకారం అందించారు. సామాజిక, మానవ భావోద్వేగాలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను చర్చించారు. అజాద్ రచనా సహకారం అందించిన పాండవులు, అడవిపూలు, బోన్సాయ్, తమసోమా టెలీఫిలింస్కు మూడు స్వర్ణాలు, వెండి నంది వచ్చాయి. అడవిపూలు టెలీఫిలింకు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలకుగాను వ్యక్తిగతంగా నంది బహుమతిని స్వీకరించారు. సరదా కోసం కొన్ని టెలీఫిలింస్, టీవీ సీరియల్స్లోను ఆయన నటించారు. ఉపాధికోసం గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రిలో ఉన్నపుడు కొన్ని సాంస్కృతిక సంస్థల నిర్వహణలోను పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు. -
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
శివమొగ్గ: అవినీతిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న వాల్మీకి అభివృద్ధి పాలక మండలి అధికారి చంద్రశేఖర్ భార్య కవిత శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు అవుతూ నీరసంగా ఉండడంతో కవితాను ఆటోలో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది. పదే పదే భర్తను తలుచుకుంటూ విలపిస్తోంది. సరిగ్గా భోజనం చేయలేదని, దీంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. పరామర్శల వెల్లువ మరోవైపు అధికారి ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు, నాయకులు చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు మృతుని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించలేదు. ఎంతో మంది నేతలు ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలిపి రిక్త హస్తాలతో తిరిగి వెళుతున్నారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా మృతుని కుటుంబానికి అందించారు. -
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
-
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
లక్నో హ్యాట్రిక్ విక్టరీ.. టైటాన్స్ తప్పని పరాభవం
-
IPL 2024: ముంబై గెలుపు బోణీ.. పాండ్యా ముఖంలో నవ్వు
-
ముమ్మరంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్పైల్స్ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్పైల్స్ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
విరాట్ విజృభించేనా..ఆ జట్టుకే విజయావకాశాలు
-
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్కు స్టీల్ షీట్ పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
కలిసి పనిచేద్దాం..
సాక్షి, హైదరాబాద్: గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన అరుణ్తివారీ, చిన్నబాబు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత అరుణ్తివారీ, కేన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ల తయారీ కంపెనీ మైక్రాన్టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. -
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత చంద్రశేఖర్
-
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్లోకి చంద్రశేఖర్ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్ చీడపీడ. సీనియర్ నేత చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్ -
ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరుతున్నాను
-
ఏపీలో 4 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్లో నాలుగు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవి అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు మార్గాని భరత్రామ్, వంగా గీతా విశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సర్ ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్ 14, 2023న జీఐ ట్యాగ్ మంజూరైనట్టు కేంద్ర మంత్రి వివరించారు. 3,841 కిలోమీటర్లు విద్యుదీకరణ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూన్ 30 వరకూ 3,841 కిలోమీటర్లు (బ్రాడ్గేజ్ ) విద్యుదీకరణ పూర్తయినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యులు చింతా అనూరాధ, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీలో నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుతున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. కార్యాచరణ సాధ్యాసాధ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలకు లోబడి నూతన వందేభారత్ సేవలు నిర్వహిస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కడప–పెండ్లిమర్రి ప్రాజెక్ట్ ప్రారంభం 268 కిలోమీటర్ల మేర కడప–బెంగళూరు ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన బడ్జెట్లో మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు అవినాశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. పూర్తి ప్రాజెక్టు ఖర్చు రూ.2705.98 కోట్లలో 50శాతం ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. మార్చి 2023 వరకూ ఈ ప్రాజెక్ట్కు రూ.358.60 కోట్లు వ్యయం చేయగా.. 21.30 కి.మీ పొడవున కడప–పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కడప–బెంగళూరు వయా మదనపల్లికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేవలం భూమి ఖర్చు మాత్రమే భరిస్తామని పేర్కొందని, అనంతరం పలు మార్పులు సూచించిందన్నారు. ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రూట్ను అనుమతించామన్నారు. ఇది వైఎస్సార్ కడప జిల్లా మీదుగా వెళ్తుందని తెలిపారు. -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్లు, కార్లలో ఉపయోగించే చిప్లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
భారత ప్రభుత్వం బెదిరించింది
న్యూఢిల్లీ: భారత్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020, 2021లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగినప్పుడు ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని, మాట వినకపోతే దేశంలో ట్విట్టర్ను మూసివేస్తామని హెచ్చరించిందని జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఖాతాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని పోస్టులను తొలగించకపోతే సంస్థను మూసివేయడంతోపాటు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని, తమపై ఒత్తిడి తెచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తుర్కియే(టర్కీ), నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా తమకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. చెప్పినట్లు చేయాలని అక్కడి ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంపై జాక్ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం కొట్టిపారేశారు. డోర్సే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేసేందుకు ట్విట్టర్ యాజమాన్యం నిరాకరించిందని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించిందని అన్నారు. ట్విట్టర్ సంస్థ నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదని, మన దేశంలో ట్విట్టర్ను మూసివేయలేదని చెప్పారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాక్ డోర్సే పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆక్షేపించారు. జాక్ డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్ మాలవీయ తదితరులు ఖండించారు. దేశానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి వారి ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ట్విట్టర్ యాజమాన్యానికి సూచించామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి: ఖర్గే ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడం ప్రభుత్వం ఇకనైనా ఆపాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ఖర్గే తేల్చిచెప్పారు. డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారు: తికాయత్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చిన ట్విట్టర్ ఖాతాలను అప్పట్లో ప్రభుత్వం నిలిపివేసిన సంగతి నిజమేనని, ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఖాతాలను బ్లాక్ చేసేలా ట్విట్టర్ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. చాలా ట్విట్టర్ ఖాతాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని వివరించారు. అసమ్మతిని, వ్యతిరేకతను కేంద్రం సహించదని వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్ల క్రితం వివాహం.. సంతానం కలగడం లేదని...
ఏటూరునాగారం : సంతానం కలగడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎలిశెట్టిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం. ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు–నర్సక్క కుమారుడు పులిశె చంద్రశేఖర్(28) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్కు నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది. అతనికి సంతానం కలగడం లేదని గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఈనెల 28న ఆదివారం భార్యతో గొడవపడగా అతని భార్య పుట్టింటికి వెళ్లిందన్నారు. సంతానం కలగడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్క వారు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిర్భయంగా వచ్చి ఓటేయాలని ఓటర్లకు పిలుపు
-
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
పాపులర్ కపుల్ రవీంద్రన్-మహాలక్ష్మి ఫొటోలు చూశారా?
-
భారత్ను కాలుష్య రహిత దేశంగా మార్చుదాం
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. ఖనిజ పరిశ్రమల్లో హైడ్రోజన్, ఎల్ఎన్జీ గ్యాస్తో నడిచే యంత్రాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు రెండు రోజులపాటు హైటెక్స్లో జరిగింది. ఈ సందర్భంగా ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు అనే అంశంపై సోమవారం పలువురు మైనింగ్ మేధావులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షులు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షులు శాంతేష్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల్లో వినియోగించే థర్మల్ విద్యుత్ తగ్గించేలా చూడాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుందని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేసుకుని, 2023–24 నాటికి సంస్థ అవసరాలకు కావాల్సిన విద్యుత్ను సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. దీంతో 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’లక్ష్యాన్ని సాధించబోతున్నామని వెల్లడించారు. -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
మూన్లైటింగ్కు కేంద్రం సపోర్ట్, రూటు మార్చిన టెక్ కంపెనీలు
మూన్ లైటింగ్ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్ కంపెనీలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల్నిటెక్ కంపెనీలు విధుల నుంచి తొలగించాయి. తాజాగా మూన్లైటింగ్ అంశంలో ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ వెల్లడించింది. ఇప్పుడు టీసీఎస్ దారిలో మరికొన్ని కంపెనీలు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ నిపుణులు భావిస్తున్నారు. దేశీ ఐటీ సేవల కంపెనీలు అక్టోబర్ 10 (సోమవారం) నుంచి ఈ ఏడాది 2022 -23 క్యూ2 (రెండో త్రైమాసిక) ఫలితాల్ని విడుదల చేస్తున్నాయి. తొలుత టీసీఎస్ క్యూ2 ఫలితాల చేయగా.. తర్వాత విప్రో,హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో క్యూ2 ఫలితాల అనంతరం టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ మూన్లైటింగ్ అంశంపై స్పందించారు. 6.16 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న తమ సంస్థ (టీసీఎస్) ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అన్నీ కోణాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మూన్లైటింగ్ అనేది నైతికతకు సంబంధించిన అంశం. ఇది తమ సంస్థ విలువలు, సంస్కృతికి విరుద్ధమే. అయినప్పటికీ మరో టెక్ సంస్థ విప్రో మూన్ లైటింగ్ పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసిందని, కానీ మేం మాత్రం ఇప్పటి వరకూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు టీసీఎస్ తన ఉద్యోగుల పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉందని, ఉద్యోగులకు కంపెనీ పట్ల పరస్పర నిబద్ధత ఉందని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఇతర సంస్థలు వారి ఉద్యోగుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. మూన్లైటింగ్పై కంపెనీ తన వైఖరిని వెల్లడిస్తుందని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు. మరోవైపు, జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవిస్తున్నామని, ప్రథమార్ధంలో ఇప్పటికే 35,000 మంది ఫ్రెషర్స్ను తీసుకున్నామని చెప్పారు. మరో 12,000 మందిని తీసుకోబోతున్నామని.. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 పైచిలుకు ఫ్రెషర్స్ నియామక లక్ష్యాన్ని అధిగమించబోతున్నామని లక్కడ్ తెలిపారు. కేంద్రం సపోర్టు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 21న వర్క్ ఫ్రం హోం పేరిట ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో ఫైర్ చేసింది. మూన్ లైటింగ్ విధానం అనైతికమని..నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. విప్రో నిర్ణయం తర్వాత సెప్టెంబర్ 24న పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఉద్యోగుల మూన్లైటింగ్ను సమర్ధించారు. టెక్ దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగులు.. అదే ఉద్యోగం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే రోజులు గడిచిపోయాయని అన్నారు. అంతేకాదు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించి ఇతర స్టార్టప్లలో పని చేయకూడదని చెబుతున్న ఐటీ కంపెనీల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చదవండి👉 విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! -
‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి!
బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ నినాదం ’ఇంటెల్ ఇన్సైడ్’ తరహాలో ’డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. డీఐఆర్–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్సెట్ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు వివరించారు. -
‘చౌక ట్రూనాట్ కిట్’కు ఇన్ఫోసిస్ పురస్కారం!
సాక్షి, హైదరాబాద్: మోల్బయో డయాగ్నాస్టిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ నాయర్ ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ అవార్డు దక్కించుకున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను సులభతరం చేయడంతోపాటు అత్యంత చౌకగా చేసే ట్రూనాట్ ఆర్టీపీసీఆర్ కిట్ను తయారు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. 2021 సంవత్సరానికిగాను ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఈయనకు దక్కగా హ్యుమానిటీస్ విభాగంలో డాక్టర్ ఆంజెలా బెరాటో జేవియర్ అవార్డు అందుకున్నారు. జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల రంగంలో కృషి చేస్తున్న మహేశ్ శంకరన్కు జీవశాస్త్ర విభాగపు అవార్డు లభించింది. గణితశాస్త్రంలో నీరజ్ కయాల్ (మైక్రోసాఫ్ట్ బెంగళూరు)ను అవార్డుకు ఎంపిక చేశారు. అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తున్న బేదాంతదాస్ మహంతిని భౌతికశాస్త్ర విభాగంలో ఇన్ఫోసిస్ అవార్డు వరించింది. లింగ వివక్షపై పరిశోధనలు చేస్తున్న ప్రతీక్ష బక్షీని సామాజిక శాస్త్ర రంగంలో అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, సామాజిక, తత్వవేత్తలు అవార్డు ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్కు చెందిన క్రిస్ గోపాలకృష్ణన్ గురువారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. యువతరానికి ఆదర్శంగా నిలిచే శాస్త్రవేత్తలను గుర్తించే లక్ష్యంతో 2009లో ఇన్ఫోసిస్ అవార్డును ప్రారంభించామని, ఒక్కో విభాగానికి రూ.50 లక్షల చొప్పున ఆరు విభాగాల్లో నగదు బహుమతితో అవార్డులు అందిస్తున్నామని వివరించారు. -
ఉరివేసుకొని వైద్యుడి ఆత్మహత్య
కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్కు వచ్చారు. నిజాంపేట్లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చి.... చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ను పోలీసులు పిలిచి విచారించారు. – ఆకుల చంద్రశేఖర్, కూకట్పల్లి ఏసీపీ -
తెలంగాణ ఆర్టీసీ: కారుణ్యం లేదు.. కనికరం లేదు
సాక్షి, హైదరాబాద్: వేయి మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రెండేళ్లుగా అంతులేని ఆవేదనతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్నాయి. విధి నిర్వహణలోఉండగా ఉద్యోగి చనిపోయి సంపాదించేవారు లేక కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమైతే, కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేక అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో జీవనాధారం లేక మరికొన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. వీరిని ఆదుకునేందుకు చట్టపరంగా రెండు పథకాలున్నా.. ఆర్టీసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో అవి అక్కర కు రాకుండా పోయాయి. బాధిత కుటుంబసభ్యులు నిత్యం బస్భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి..తప్ప కనికరించే నాథుడే కన్పించడం లేదు. సమ్మె సమయంలో నిర్ణయాలే శాపం 2019 అక్టోబర్.. ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో సమస్యలకు కారణమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే (బ్రెడ్ విన్నర్) కారుణ్య నియామకాలను సంస్థ అటకెక్కించింది. అలాగే అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ అన్ఫిట్గా ప్రకటించి ఉద్యోగం నుండి తొలగిస్తుంది. అలాంటి వారికి ఇంకా సర్వీసు మిగిలే ఉంటే వారి కుటుంబంలో కూడా ఒకరికి మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం 1,025 దరఖాస్తులు 2018 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 మందికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి శిక్షణ ఇచ్చారు. పోస్టింగులు ఇవ్వడమే తరువాయి. అలాగే అనారోగ్య సమస్యలతో 2018 తర్వాత అన్ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాల నుంచి 255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 30 మంది పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీలో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. ఆ సమయంలో ఖర్చును తగ్గించే పేరుతో ఏకంగా వేయికి పైగా బస్సులను తొలగించి వాటి స్థానంలో 1,300 అద్దె బస్సులను తీసుకున్నారు. ఫలితంగా 2,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగులు (ఎక్సెస్)గా తేలారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 58 నుంచి 60కి పెంచారు. ఫలితంగా రెండేళ్లపాటు రిటైర్మెంట్లు లేకుండాపోయాయి. ఈ రెండు నిర్ణయాలతో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడకపోగా, భారీగా సిబ్బంది మిగిలిపోయారు. దీంతో కారుణ్య నియామకాలు, అన్ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన పథకాలు అటకెక్కాయి. భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే తప్ప వారికి ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాని వారి మాటలా ఉంచితే.. చివరకు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగులకు సిద్ధంగా ఉన్న వారిని కూడా తీసుకోలేదు. వారికిచ్చి.. వీరికివ్వకుండా.. ఆర్టీసీ సమ్మె సమయంలో 32 మంది కార్మికులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయారు. ఆ కుటుంబాల్లోని ఇతర సభ్యులకు అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వీరి కంటే ముందునుంచి పెండింగులో ఉన్న దరఖాస్తుదారులను మాత్రం ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. తండ్రికి మందులు కూడా కొనలేక.. పగడపల్లి దత్తు ఆదిలాబాద్ డిపోలో డ్రైవర్. తీవ్ర అనారోగ్య సమస్యతో 2017లో డ్రైవర్గా పనిచేసే అర్హత కోల్పోయారు. ఆయనను సంస్థ అన్ఫిట్గా డిక్లేర్ చేసింది. అప్పటికి మరో ఐదేళ్ల సర్వీసు ఉండటంతో ఆయన కుమారుడు బీఎస్సీ చదివిన చంద్రశేఖర్ బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్గా దరఖాస్తు చేసుకుని, ఎంపికై శిక్షణ కూడా పొందారు. కానీ పోస్టింగ్ ఇచ్చే సమయానికి సంస్థలో ఖాళీలు లేవనే పరిస్థితి ఏర్పడింది. అతని పోస్టింగ్ కోసం ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. వివాహమైన చంద్రశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో రూ.8 వేల జీతానికి పనిచేస్తున్నాడు. తల్లి, అనారోగ్యంతో ఉన్న తండ్రి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఆ కుటుంబానికి రూ.8 వేలు ఎటూ చాలకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఆరోగ్యం సరిగా లేని తండ్రికి మందులు ఇప్పించటం కూడా కష్టంగా మారిందని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నాడు. కండక్టర్గా ఎంపికైనా ఫలితం లేదు ఎన్.లింగన్న నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల్లో ఉండగా 2017లో గుండెపోటుకు గురై చనిపోయారు. బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు విఘ్నేశ్ దానికి రాజీనామా చేసి కారుణ్య నియామకం పథకం కింద ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్ పోస్టుకు ఎంపికయ్యాడు కూడా. పోస్టింగ్ కోసం శిక్షణ ఇచ్చే సమయంలోనే.. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించటం, ఉద్యోగ పదవీ విరమణ వయసును పెంచటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో విఘ్నేశ్కు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబపోషణకు నిర్మల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద చాలీచాలని జీతానికి సైట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
ఎవరి కోసం ఈ అప్పగింత?
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ నష్టదాయకం. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన మౌలిక రంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందించిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుంటోంది. గత అనుభవాలను పరిశీలించినట్లయితే, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల స్వాధీనం అనేది పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. నష్టాలపాలవుతున్న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం డాంబిక పదజాలం వెనుక దాక్కుంటోంది కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్, స్టేషన్లు, ఇంధన పైప్ లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, వేర్హౌస్లు, స్టేడియంలు వంటి ప్రభుత్వ ఆస్తులను బడా ప్రైవేట్ మదుపుదారులకు స్వాధీనం చేయనున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల నగదు సమీకరణ ఈ పథకం లక్ష్యం. ఈ భారీ మొత్తాన్ని కొత్త మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి వాదించారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉనికిలో ఉన్న, పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టుల నుంచి రాబడులు ఆర్జించడానికి ప్రైవేట్ మదుపుదారులకు నిర్దిష్ట కాలం వరకు వాటిపై హక్కులను తాత్కాలికంగా ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని నిర్మలా సీతారామన్ వక్కాణించారు. అయితే ఈ ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ నాలుగు అంశాలను చర్చించాల్సి ఉంది. మొదటిది– ఉపయోగం లేకుండా వృ«థాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం అని చెబుతున్నారు. కానీ ఇలా ప్రైవేట్ పరిశ్రమలకు అప్పగించిన ఆస్తులు నిర్దిష్టకాలం తర్వాత ప్రభుత్వానికి తిరిగి దఖలుపర్చడం జరిగినప్పటికీ, తదుపరి దశ నగదీకరణ కోసం వీటిని మళ్లీ మార్కెట్లోకి ప్రభుత్వం పంపించగలదు. ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన వద్ద ఉన్నమౌలికరంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందిం చిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుం టోంది. కానీ గత అనుభవాల బట్టి, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. పైగా ప్రభుత్వ ఆస్తుల వేలం ప్రారంభానికి ముందే వాటిద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఆస్తుల అమ్మకాల ద్వారా లభించే మొత్తం అంత అధికంగా ఉండదు. రెండు – ప్రభుత్వ మాలిక రంగ ఆస్తులను తీసుకుని, వాటిని నిర్వహించడం ద్వారా, వాటి సేవల అమ్మకాల నుండి వచ్చే రాబడులపై ప్రైవేట్ రంగానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ ఆస్తులకు యజమానిగా ఉన్నప్పటికీ, ధరలు నిర్ణయించడం వాణిజ్యపరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగం ఆశించే అధిక రాబడులు సిద్ధించాలంటే వినియోగదారులపై భారీగా యూజర్ చార్జీలు విధించాల్సి ఉంటుంది లేదా ఈ రాబడుల విషయంలో వచ్చే వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. రాబడులు తక్కువగా ఉండి లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ సహాయం గణనీయంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. మూడు – తగినన్ని రాబడులను ఆర్జించడానికి ప్రైవేట్ రంగం ఖర్చులను తగ్గించుకునే స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేయవచ్చు. వీటిలో కార్మికులు, సిబ్బందిపై పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. లేబర్ ఖర్చులను తగ్గించే ప్రయత్నం వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సంఘటిత కార్మిక మార్కెట్ల కోసం ప్రమాణాలు స్ధిరంగా కొనసాగించే ప్రభుత్వరంగ పాత్ర ఈ విషయంలో పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా దాని ప్రాధాన్యతను తొలగించవచ్చు కూడా. చివరిది – ప్రభుత్వ ఆస్తులను సాధించిన ప్రైవేట్ రంగ మేనేజర్లు వాంఛనీయమైన సేవలను అందించే విషయమై ప్రభుత్వం ఏ రకమైన పాత్ర నిర్వహిస్తుంది అనే అంశంపై ఈ జాతీయ నగదీకరణ విధానం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ లక్ష్యం కోసం రెగ్యులేటరీ వ్యవస్థను అమలు చేసినట్లయితే, అది ఖర్చుతో కూడుకున్నది. కాలహరణం కూడా జరగవచ్చు. దీనివల్ల అధిక ఖర్చులతో కూడిన సేవల నాణ్యత నిర్లక్ష్యానికి గురై క్షీణించవచ్చు కూడా. ఆస్తుల నగదీకరణపై ఒక్కమాటలో చెప్పాలంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పెట్టుబడి వనరులను సమీకరించడం అంటే బడా వ్యాపార వర్గాల చర్యలకు ఈ రంగం మొత్తాన్ని విస్తరించజేయడమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వినియోగదారులు లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టే ఖర్చుతో బడా పారిశ్రామిక వర్గాలు అధిక రాబడులను ఆర్జిస్తాయి. అంటే సంపద అనే పిరమిడ్లో శిఖరాగ్రాన ఉంటున్న వర్గాలవారికే మరింత ఆదాయాన్ని, సంపదను పంపిణీ చేయడమే నగదీకరణ అంతిమ లక్ష్యం. ప్రజా సంపదను తాకట్టు పెడుతున్న కుంభకోణాన్ని తలపించే ఈ పథకం కొంతమంది ఎంపిక చేసుకున్న వాణిజ్య వర్గాలను మరింతగా బలపర్చడానికే ఉపయోగపడుతుంది తప్పితే కేంద్రప్రభుత్వం ఘనంగా చెబుతున్నట్లుగా కొత్త ఆస్తుల సృష్టికి ఏమంత పెద్దగా దోహదం చేయదు. జాతీయ మౌలిక వసతుల కల్పనా రంగంతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 111 లక్షల కోట్ల రూపాయలను మదుపు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా నగదీకరణ పథకం ద్వారా వస్తుందని భావిస్తున్నది 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొత్త మౌలిక రంగ ప్రాజెక్టులకు ఈ నగదీకరణ పథకం ద్వారా అందేది అందులో అయిదు శాతం మాత్రమే. వాస్తవానికి, గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజాధనం వెచ్చించి సృష్టించిన అపార సంపదలను బడా వాణిజ్య వర్గాలకు కట్టబెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్ల కాలంలో ముట్టేది అయిదు శాతం కంటే తక్కువే అనేది చేదు నిజం. ఇది పథకం ప్రకారం రూపొందిస్తున్న భారీ కుంభకోణం తప్ప మరేమీ కాదు. నగదీకరణ వాస్తవ రాబడి ఎంత? ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు 25 సంవత్సరాల పాటు లీజు లేదా రెంట్కు అప్పగించడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేంద్రం ఆశిస్తోంది. కానీ ప్రభుత్వానికి అంతిమంగా మిగిలేది పెద్దగా ఉండదని చిన్న ఉదాహరణ చెబుతుంది. ఆస్తుల విలువ ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ సంపదపై సంవత్సరానికి 4 శాతం రాబడి వస్తుందనుకుందాం (ద్రవ్యోల్బణం తీసివేశాక). అయితే ప్రైవేటు వ్యాపారులు వాస్తవ వడ్డీరేటు అంచనా 6 శాతం అనుకుంటే ఈ వందరూపాయల సంపదపై వారికి వచ్చేది రూ. 51.3. దీన్ని రౌండ్ ఫిగర్ కింద 50గా మారిస్తే 25 ఏళ్లకాలానికి 4 శాతం వార్షిక రాబడి కింద వంద రూపాయల ఆస్తిపై రూ.50 రాబడి వచ్చినట్లు లెక్క. అంటే ఆస్తుల నగదీకరణ కింద అప్పగించిన ప్రతి వంద రూపాయలకు ప్రైవేట్ ఆపరేటర్కి వచ్చే రాబడి 50 రూపాయలన్నమాట. దీంట్లోంచి పెట్టుబడిపై ఆశించే రాబడిని తీసివేయాలి. తన మదుపుపై 50 శాతం కనీస రాబడిని ప్రైవేట్ వ్యాపారి ఆశిస్తున్నట్లయితే, ప్రతి రూ.100 ఆస్తిపై రూ.35లను చెల్లించడానికి అతడు సిద్ధపడతాడు. ఇప్పుడు అసలు లెక్క వస్తుంది. ఆరు లక్షల కోట్ల మార్కెట్ విలువ నుంచి రెంటల్ తదితర ఖర్చులను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే అసలు రాబడి రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే. వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధ్వంసకర నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. 2019లో కార్పొరేట్ రంగానికి పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగిలించడం అతిపెద్ద విధ్వంసకర నిర్ణయం. జీడీపీ వృద్ధి నిరంతరాయంగా పతనం చెందడం, ఆర్థికంగా తప్పుడు నిర్ణయాల వల్ల రాబడులు తగ్గిపోవడం, వీటికి తోడు కార్పొరేట్ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుతూ పోయారు. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. దీంతో జీడీపీ పతన బాట పడుతూనే వచ్చింది. ఆస్తుల అప్పగింత ద్వారా వచ్చే రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముఖ్యం. పెరిగిన ప్రభుత్వ వినియోగానికి రాబడిని ఉపయోగిస్తూ వస్తున్నారు. మౌలికరంగంపై మరింత పెట్టుబడి పెడతామంటున్నారు కానీ మితిమీరిపోయిన ప్రభుత్వ రుణాన్ని చెల్లించడానికి అది సరిపోతుంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఏవీ వాస్తవంగా అమలు కాలేవన్నది నిజం. – ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్, ఆర్థిక రంగ నిపుణులు -
మనిషి మనీషిగా మారాలంటే..?
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత? ►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది. ►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి. ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు. మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే. – బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు -
దేవినేని ఉమపై సోదరుడు చంద్రశేఖర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తన సోదరుడు ఉమాకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని దేవినేని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మంగళవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారన్నారు. చదవండి: వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం విచారణ జరిపించాలని దేవినేని చంద్రశేఖర్ కోరారు. చదవండి: ‘ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నాం’ టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. పోలీసులు ఎలాగూ ధర్నా చేయనివ్వరని తెలిసి గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చి దేవినేని ఉమా డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పతకం అమలువుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ తయారవుతుందని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో నిన్న 3648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. చూసి ఓర్వలేక దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దేవినేని ఉమకు చిత్తశుద్ధి ఉంటే.. పత్రికా ముఖంగానైనా లేదా ఒక టీవీ స్టూడియోకి వస్తే చర్చకు రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. పోలీసులు ఎలాగూ అడ్డుకుంటారని తెలిసి తెలిసి రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గొల్లపూడిలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా మాట్లాడుతున్నారని, ‘ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, గొల్లపూడి లబ్ధిదారులను పిలిపించి సమావేశం పెడదాం.. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా..’ అని దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
డీఎన్ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా?
సాక్షి, వికారాబాద్: ‘బండి సంజయ్ అసలైన హిందువు కాదు, డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని టీఆర్ఎస్లోని కొంత మంది మొరుగుతున్నారు. నేను డీఎన్ఏ పరీక్ష చేసుకునేందుకు సిద్ధం, మరి పెద్ద హిందువును అని చెప్పుకున్న నీవు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా? హిందువు ఎవరో, బొందుగాడు ఎవరో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తేల్చుకుందామా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్కు సవాలు విసిరారు. ‘హిందుత్వ ఎజెండాపై నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీకి వెళ్దాం.. సిసలైన హిందువు ఎవరో అక్కడ తేలుతుంది’అని అన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్.. కండువా కప్పి చంద్రశేఖర్ను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రశేఖర్తోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. అమరుల త్యాగాల పునాదుల మీద కేసీఆర్ సీఎం పదవిని అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: (లక్షన్నర మందితో కేసీఆర్ సభ!) 2023లో బీజేపీ జెండా ఎగురవేస్తాం.. 2023లో గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తామని సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో 80 శాతం కృషి కేసీఆర్దే ఉన్నట్లు ప్రచారం చేసుకోవటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 13,500 కంపెనీలు తీ సుకువచ్చి 3 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు కేసీఆర్ చెబుతున్నారని, ఇది రుజువు చేస్తే కేసీఆర్కు పాదపూజ చేస్తానని అన్నారు. లేదంటే బడితె పూజచేస్తానని హెచ్చరించారు. మాఫియాతో పోల్చటం సిగ్గుచేటు బీజేపీ మాఫియా పార్టీ అని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి గురించి ప్రశ్నిస్తే బీజేపీని మాఫియాగా అభివర్ణించటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీనేత స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1న కేసీఆర్ ఓ దళితున్ని సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని, వివరాలు త్వరలో బహిర్గతం చేస్తానని తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ నాయకులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బంగారు శ్రుతి, సాయన్న, సదానందరెడ్డి, నరసింహారెడ్డి, ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
18న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి
సాక్షి, వికారాబాద్: మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి పంపారు. పార్టీలో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, వెన్నుపోటుదారులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. క్రమశిక్షణ కలిగిన తాను.. క్రమశిక్షణలేని కాంగ్రెస్లో ఇమడలేక పోతున్నానని పేర్కొన్నారు. కాగా, చంద్రశేఖర్ ఈనెల 18న వికారాబాద్లో బీజేపీలో చేరనున్నారు. 1985 నుంచి 2008 వరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా డాక్టర్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. చదవండి: మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక 'కూకట్పల్లిలో బండి సంజయ్కు వ్యాక్సిన్ వేశా' -
కరోనా తగ్గే వరకు స్థానిక ఎన్నికలు వద్దు
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా అవతరిస్తున్నందున తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
కోవిడ్కు కూడా ఎబోలా మందే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్కు ఔషధాన్ని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేస్తోంది. దశాబ్దం కింద వచ్చిన ఎబోలా వైరస్ లక్షణాలే కోవిడ్లోనూ ఉన్నాయని.. అందుకే ఎబోలా యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) అభివృద్ధి చేస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజం, రెమిడిస్విర్ను అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతితో చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ సోకిన వారిపై ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ చేసింది. ఇది విజయవంతమైతే మన దేశీయ అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే ఔషధాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2 నెలల్లో ఏపీఐ తయారీ.. ‘ఏపీఐ అభివృద్ధి కోసం అవసరమైన రైబోస్, పిర్రోల్, అలనీన్, కార్బోహైడ్రేట్స్–5 వంటి ముడి పదార్థాలను పెద్ద ఎత్తున సమీకరించాం. తొలుత శాంపిల్ ఏపీఐ కోసం 50 గ్రాములను తయారు చేస్తున్నాం. 15 మంది శాస్త్రవేత్తలు 2 విడతలుగా అభివృద్ధి పనిలో నిమగ్నమయ్యారు. 2 నెలల్లో పూర్తి స్థాయి ఏపీఐ సిద్ధమవుతుంది’అని చంద్రశేఖర్ తెలిపారు. ముంబై ఫార్మాతో ఒప్పందం.. ‘ఐఐసీటీలోని 3 స్టార్టప్ కంపెనీలు ఏపీఐకి అవసరమైన సాంకేతిక అభివృద్ధిలో సాయం చేస్తున్నాయి. ఏపీఐ తయారీ పూర్తయి, దేశీయ అవసరాల కోసం ఔషధ తయారీ అవసరమని కేంద్రం భావిస్తే.. బల్క్లో తయారు చేసేందుకు ముంబైకు చెందిన ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. స్థానిక మార్కెట్ కోసం ఔషధ తయారీకి హైదరాబాద్కు చెందిన రెండు, మూడు ఫార్మా కంపెనీలకు ఏపీఐలను అందిస్తాం’అని వివరించారు. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే చాలు.. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ తన రూపాన్ని, నిర్మాణాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు సాంకేతికత, అవగాహన పెరిగింది కాబట్టి వైరస్ను సమర్థంగా నివారించొచ్చు. వైరస్ సోకాలంటే ఏదైనా పరాన్నజీవి కావాలి. కోవిడ్ను తట్టుకునే రోగనిరోధక శక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని బలోపేతం చేస్తే చాలు. ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉన్నవారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ 2–3 నెలలు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
చంద్రశేఖర్ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
భారత మాజీ క్రికెటర్ ఆకస్మిక మృతి
సాక్షి, చెన్నై : భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్ గుండెపోటుతో గురు వారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1988–90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులే చేయడంతో స్థానం కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. అతడి 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ మాత్రం బాగా సాగింది. తమిళనాడు ఓపెనర్గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వీబీ 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. దూకుడైన ఆటకు గుర్తింపు పొందిన చంద్రశేఖర్ 1988–89 ఇరానీ కప్ మ్యాచ్లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్ తరఫున అదే ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్గా, భారత సెలక్టర్గా పనిచేసిన ఆయన... ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్లోకి ధోనిని తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటేటర్గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. -
ముమ్మరంగా సింగరేణి సేవా కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆపరేషన్స్, ప్లానింగ్ విభాగం డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే పథకాలను చేపట్టాలని సూచించారు. పాత తరహాకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ ఫండ్ (సీఎస్ఆర్) కింద కార్యక్రమాల అమలుకు సూచనలు, ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఏటా దాదాపు రూ.40 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తున్నామని, కొత్త గనులు ప్రారంభిస్తే నిధులు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితికి సంబంధించిన ‘వెబ్ అప్లికేషన్’ను ప్రారంభించారు. సింగ రేణి సేవా సమితికి సంబంధించిన అన్ని ప్రాంతాల సమాచారం, వివిధ శిక్షణలు, శిక్షణ పొం దుతున్న వారి వివరాలు వంటి అంశాలు దీని ద్వారా ఆన్లైన్లోనే పొందుపర్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 450 మందికి శిక్షణ.. సింగరేణి వ్యాప్తంగా ప్రాథమిక పరీక్షల ద్వారా ఎంపికైన 450 మంది నిరుద్యోగ యువతకు రెసిడెన్షియల్ తరహాలో ఆర్మీ రిక్రూట్మెంట్కి శిక్షణ ఇవ్వను న్నామని పీఆర్ విభాగం జనరల్ మేనేజర్ ఆంటోని రాజా, పీఆర్ఓ బి.మహేశ్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా సంస్థల్లో సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశ శిక్షణలు అందించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పితే ముఖం చూపించను
సాక్షి, యైటింక్లయిన్కాలనీ(రామగుండం) : తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మళ్లీ ముఖం చూపించని కాంగ్రెస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. ఇచ్చిన మాటను ఏడాదిలోగా తీర్చకపోతే నేను మీకు మళ్లీ ముఖం చూపించన ని పేర్కొన్నారు. 24 ఏళ్లకే తాను మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలి చాన ని, ఎమ్మెల్యే కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో 26 ఏళ్లుగా రాజకీయంలో కొనసాగుతున్నానని వివరించారు. సింగరేణి కార్మికు ల ఇన్కంటాక్స్ మాఫీ కోసం అమరణ దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిని కాబట్టే సోనియాగాంధీకి ఇష్టమైన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాతని తెలిపారు. రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మక్కాసింగ్ అధ్యక్షతన జరిగిన ఈగేట్ మీటింగ్లో జనక్ప్రసాద్, రియాజ్అహ్మద్, నర్సిం హారెడ్డి, ఈర్ల కొమురయ్య, అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి పేరు స్వేచ్ఛ
రాణీ లక్ష్మీబాయి నడిచిన నేల ఝాన్సీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ఆ అడవి. ఊర్చాహా అడవులంటారు. ఆ అడవి గుండా సతార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. 1920 దశకం నాటి మాట... ఆ నది ఒడ్డునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం దగ్గరగానే ఒక కుటీరం నిర్మించుకుని ఉండేవాడాయన. పేరు హరిశంకర్ బ్రహ్మచారి. ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఆ అడవులకు దగ్గరగా ఉన్న గ్రామం ధిమార్పురా, దాని చుట్టుపక్కల ఉన్న పల్లెలలోని పిల్లలకు ఆయన చదువు చెప్పేవాడు. కానీ వారెవరికీ తెలియకుండా మరొక పని కూడా చేసేవారు. కొండలలో తుపాకీ పేల్చడం నేర్చుకునేవాడాయన. అలాగే జబువా ప్రాంతంలో ఉన్న భిల్లుల దగ్గర విలువిద్య కూడా నేర్చుకునేవారు. ధిమార్పురా పేరును స్వాతంత్య్రం వచ్చిన తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆజాద్పురా అని మార్చింది. ఆ హరిశంకర్ బ్రహ్మచారి జ్ఞాపకార్థమే ఆ ఊరి పేరు అలా మార్చారు. ఆయన ఎవరో కాదు, భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో మహోన్నతంగా కనిపించే చంద్రశేఖర్ ఆజాద్. జలియన్వాలా బాగ్ దురంతం ఆనాటి పలువురు యువకులని ‘రక్తానికి రక్తం’ అన్న సిద్ధాంతం గురించి ఆలోచించేటట్టు చేసింది. మూడేళ్ల తరువాత జరిగిన మరొక పరిణామం కూడా ఎందరో భారతీయ యువకులను అదే ఆలోచన వైపు అనూహ్యంగా నెట్టివేసింది. గాంధీజీ 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా ఉదంతంతో ఆయనే హఠాత్తుగా నిలిపివేశారు. శాంతియుతంగా ఉద్యమం నిర్వహించగలిగినంత మానసిక సంస్కారం భారతీయులకు లేదని ప్రకటించి, చౌరీచౌరాలో మరణించిన పోలీసుల ఆత్మశాంతి కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ వైఖరే నాటి యువతరాన్ని కొత్త పుంతలు తొక్కేటట్టు చేసింది. జలియన్వాలాబాగ్ ఉదంతం గురించి విన్న తరువాత విప్లవోద్యమం వైపు ఆకర్షితుడైన చంద్రశేఖర్ ఆజాద్, మొదట్లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దృఢంగా ఆకాంక్షించారు. కానీ అ విప్లవ విధాత జీవితంలో అదొక చిన్న ఘట్టం. చిన్న దశ. నిజం చెప్పాలంటే ఆజాద్ అంతరంగమే ఒక విప్లవజ్వాల. బ్రిటిష్ జాతి మీద ద్వేషంతో ఆయన హృదయం దహించుకుపోతూ ఉండేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తన పదిహేనవ ఏటనే తీవ్రవాదం వైపు మొగ్గారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభంలో అందుకు అనుకూలంగా కొన్ని ఊరేగింపులు జరిగాయి. వారణాసిలో జరిగిన అలాంటి ప్రదర్శనలో పాల్గొన్న ఆజాద్ను పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెడితే న్యాయాధీశుడు అడిగాడు, ‘నీ పేరు?’ అని. మీసాలు కూడా సరిగా లేని ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి బహుశా ఆ నాయ్యా«ధీశుడు అదిరిపడి ఉండాలి. ఆ సమాధానమే– ‘నా పేరు స్వేచ్ఛ’ (ఆజాద్). నీ తండ్రి పేరేమిటి అంటే, ‘స్వాతంత్య్రం’ అన్నాడు. న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అప్పటి నుంచి ఆజాద్ ఆయన ఇంటిపేరయింది. ‘నీ రక్తం సలసల మరగకపోతే నీ నరాలలో ప్రవహిస్తున్నది నీరే అనుకోవాలి...’ అని ఆనాటి పరిస్థితిని చూసి ఆజాద్ భావించారు. జలియన్వాలాబాగ్ దురంతం గురించి తెలిసిన తరువాత రక్తం మండక తప్పదు కూడా. చంద్రశేఖర్ (తివారీ) ఆజాద్ (జూలై 23, 1906– ఫిబ్రవరి 27, 1931) ప్రస్తుత మధ్య ప్రదేశ్లోని భవ్రాలో పుట్టారు. వారి స్వస్థలం ఉత్తర పరగణాలలోని (ఉత్తరప్రదేశ్) బదర్కా గ్రామం. తండ్రి పండిట్ సీతారామ్ తివారీ, తల్లి జగరాణీదేవి. తల్లి పట్టుదల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ సంస్కృత విద్య కోసం కాశీ విద్యాపీఠంలో చేరేందుకు వారణాసి వెళ్లారు. సంస్కృత విద్య వారి ఇంటి సంప్రదాయం. ఆయన మొదట హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంస్థను 1924లో రామ్ప్రసాద్ బిస్మిల్, యోగేశ్చంద్ర ఛటర్జీ, శచీంద్రనాథ్ సన్యాల్, శచీంద్రనాథ్ బక్షీ, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలీ బెంగాల్లోని బోలాచాంగ్ అనే గ్రామంలో ఆరంభించారు. ప్రణవేశ్ ఛటర్జీ అనే ఉద్యమకారుడి సాయంతో ఆజాద్ రామ్ప్రసాద్ను కలుసుకుని, హెచ్ఆర్ఏలో సభ్యుడయ్యారు. భారతదేశంలోని ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్య గణతంత్ర దేశంగా నిర్మించడం ఈ సంస్థ ఆశయం. ఈ ఆశయ సాధనలో మొదటి మెట్టు బ్రిటిష్ పాలనను నిర్మూలించడమే. ఇందుకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మారు.అందుకు అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతావని సోషలిస్టు దేశంగా ఉండాలని వారు ఆనాడే స్వప్నించడం ఒక అద్భుతం. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వీరికి ప్రేరణ అని ఒక వాదన ఉంది. అలాగే హెచ్ఆర్ఏ ఆనాడు బెంగాల్లో ఎంతో తీవ్రంగా పనిచేసిన తీవ్ర జాతీయ వాద రహస్య సంస్థ అనుశీలన సమితికి అనుబంధ సంస్థే. గదర్ పార్టీ తరువాత బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన సంస్థలలో ఇది కూడా ఒకటి. సహాయ నిరాకరణోద్యమాన్ని రద్దు చేస్తూ గాంధీజీ తీసుకున్న నిర్ణయం ఒక శరాఘాతం కాగా, ఆయన అహింస చాలామంది యువకులకు నిరుత్సాహం కలిగించింది. అలాంటి ఒక సందిగ్ధ దశలో జనించినదే హెచ్ఆర్ఏ. బ్రిటిష్జాతి వంటి ఒక నిరంకుశ సమూహం నుంచి స్వాతంత్య్రం పొందాలంటే అహింసా పథంలో సాగితే ఎంతమాత్రం సాధ్యంకాదని నమ్మినవారంతా తీవ్రవాద కార్యకలాపాలను ఆశ్రయించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవడం ఒక్కటే వారికి కావాలి. బ్రిటిష్ జాతి నుంచి భారతదేశాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విముక్తం చేయడం వారి ఆశయం. అది సాయుధ పోరుతోనే సాధ్యమని కూడా వారు నమ్మారు. పైగా నాటి ప్రపంచంలో చాలాచోట్ల ర్యాడికల్ ఉద్యమాలు కూడా వీరికి ప్రేరణ ఇచ్చాయి. తన ఉద్యమానికి ఆయుధాలు సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల కోసం హెచ్ఆర్ఏ చేసిన ఒక ప్రయత్నం చరిత్రలో నిలిచిపోయింది. అదే కకోరి రైలు దోపిడీ. దీనినే కకోరి కుట్ర కేసుగా చెబుతారు. ఆగస్టు 9, 1925న ఈ ఘటన జరిగింది. షాజహాన్పూర్ నుంచి లక్నో వచ్చే ఎనిమిదో నెంబర్ డౌన్ రైలులో రూ. 8,000 తీసుకువెళుతున్న సంగతి వీరికి తెలిసింది. ఈ డబ్బును లూటీ చేయడానికి పథకం పన్నారు. ఈ పథకాన్ని రామ్ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, శచీంద్ర బక్షీ, కేశబ్ చక్రవర్తి, మన్మథ్నాథ్ గుప్తా, మురారీలాల్ (అసలు పేరు మురళీలాల్ ఖన్నా), ముకుందీలాల్ (ముకుందీలాల్ గుప్తా), భన్వరీలాల్ అమలు చేశారు. ఆ రైలు లక్నోకు సమీపంలోని కకోరీ చేరగానే చైన్ లాగి, గార్డును బెదిరించి అతడి కేబిన్లో ఉన్న డబ్బును తీసుకుని వారు అదృశ్యమయ్యారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయాడు. దీనితో లూటీ, హత్య కింద కేసు నమోదు చేసి, బ్రిటిష్ ప్రభుత్వం అక్షరాలా హెచ్ఆర్ఏ సభ్యుల కోసం పరమ క్రూరంగా వేట సాగించింది. కకోరి కేసులో దేశమంతా వెతికి మొత్తం నలభయ్ మందిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిలో పదిహేను మందిని వదిలి పెట్టారు. రామ్ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్ఫఖుల్లాఖాన్లకు న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. కొందరికి అండమాన్ ప్రవాసం విధించారు. ఇంకొందరకి యావజ్జీవం విధించారు. కానీ ఆజాద్తో పాటు ఇంకొందరు దొరకలేదు. ఆ తరువాత హెచ్ఆర్ఏ చెల్లాచెదరయిపోయింది. అప్పుడే ఆజాద్ ఆ సంస్థనే హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో పునరుద్ధరించారు. ఎన్నో కష్టాలు, అనేక ప్రయత్నాల తరువాత ఆజాద్ కాన్పూరును తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. 1928 నాటికి ఇది సాధ్యమైంది. అక్కడ ఉండగానే భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటివారు ఆయన మార్గదర్శకత్వంలో నడిచారు. దీని తరువాత సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లాలా లజపతిరాయ్ మీద లాఠీని ప్రయోగించమని ఆదేశించిన స్కాట్ను హత్య చేయాలని హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయించింది. భగత్సింగ్ తదితరులతో కలసి ఆజాద్ కూడా పాల్గొన్నారు. లాహోర్లో అతడిని హత్య చేయదలచుకుని స్కాట్ ఉన్నాడని భావించిన వాహనం మీద బాంబు విసిరారు. కానీ అందులో స్కాట్ లేడు. కానీ సాండర్స్ అనే మరొక పోలీసు అధికారి ఉన్నాడు. అతడు చనిపోయాడు. అంతకు ముందే వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలును పేల్చివేయడానికి కూడా ఆజాద్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది. 1931 ఫిబ్రవరిలో ఆజాద్ సీతాపూర్ కారాగారానికి వెళ్లారు. కకోరి కుట్ర కేసులో ఉన్నవారితో పాటు, భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను విడిపించడం గురించి గణేశ్శంకర్ విద్యార్థితో మాట్లాడడానికి వెళ్లారాయన.గణేశ్శంకర్ ఒక సలహా ఇచ్చారు. త్వరలోనే జరగబోయే గాంధీ–ఇర్విన్ చర్చలలో ఈ అంశం గురించి గాంధీ ద్వారా ఒత్తిడి తేవాలి. ఆ విషయం పండిట్ నెహ్రూ ద్వారా గాంధీకి చెప్పించాలి. ఇది గణేశ్ శంకర్ సలహా.ఆ మేరకే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం అలహాబాద్ వెళ్లి ఆనందభవన్లో నెహ్రూను ఆజాద్ కలుసుకున్నారు. ఆజాద్ ప్రతిపాదనను నెహ్రూ అంగీకరించలేదు. అంతేకాదు, ఆనందభవన్ నుంచి వెంటనే వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు. ఉగ్రుడైన ఆజాద్ అల్ఫ్రెడ్ పార్క్కు సైకిల్ మీద వచ్చారు. ఒక చెట్టు కింద తన సహచరులలో ఒకడైన సుఖదేవ్రాజ్తో (భగత్సింగ్తో కలసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేసిన సుఖదేవ్ కాదు) చర్చిస్తున్నారు. ఆజాద్ అక్కడ ఉన్న సంగతి పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. మొదట పోలీస్ సూపరింటెండెంట్ బిశ్వేశ్వర్సింగ్, ఎస్ఎస్పి (సీఐడీ) నాట్ బోవర్ పార్కులోకి చొరబడ్డారు. ఆజాద్ కేసి తర్జని చూపుతూ బిశ్వేశ్వర్కి ఏదో చెబుతుండగానే ఆజాద్ గమనించారు. తన జేబులోని రివాల్వర్ తీసి కాల్చారు. సరిగ్గా గుండు వెళ్లి బోవర్ కుడి మణికట్టులో దిగింది. దీనితో బిశ్వేశ్వర్ తిట్లు లంఘించుకున్నాడు. దీనితో అతడి నోటి కేసి గురి పెట్టి మళ్లీ కాల్చాడు ఆజాద్. అతడి పళ్లు పగిలిపోయాయి. అయితే అంతలోనే అక్కడికి బలగాలు చేరుకుని చుట్టూ మోహరించడం కనిపించింది. కాల్పులు మొదలయ్యాయి. ఒక గుండు వచ్చి ఆజాద్ తొడలో దిగిపోయింది. కదలడం సాధ్యంకానంత గాయం. వెంటనే సుఖదేవ్రాజ్ను తప్పించుకోమని చెప్పి, అతడు తప్పించుకున్న సంగతి రూఢి అయిన తరువాత రివాల్వర్ కణతకు పెట్టుకుని కాల్చుకున్నాడాయన. తూటాలతో పోరాడతాం కానీ పోలీసులకు పట్టుబడే ప్రశ్నే లేదంటూ ఉద్యమకారునిగా జీవితం ఆరంభించిన నాడే ప్రతిజ్ఞ చేసిన ఆజాద్ అదే విధంగా పోలీసులు తనను సమీపిస్తుండగానే బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛను ఇంటి పేరు చేసుకోగలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు మరే దేశ చరిత్రలో అయినా కనిపిస్తాడా? - డా. గోపరాజు నారాయణరావు -
పెట్రోల్ బండికి.. మైలేజీ నాకు
సాక్షి, అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంక్లో వాహనదారులకు పెట్రోల్ విక్రయించి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. -
హైదరాబాద్లో పాక్టెరా కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పాక్టెరా భారత్లో అడుగుపెట్టింది. హైదరాబాద్లోని హైటెక్సిటీలో ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ ఆఫీస్ను బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు ఉన్నారని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రంగాపురం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. మూడేళ్లలో భారత ఉద్యోగుల సంఖ్య 3,000లకు చేరుతుందని వెల్లడించారు. ఫ్రెషర్స్కు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఇంజనీరింగ్తోపాటు ఆర్ట్స్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్లో సొంత భవనాన్ని నెలకొల్పుతామని కంపెనీ ఇండియా హెడ్ నారాయణ్ మూర్తి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సంస్థలో 30,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని సొల్యూషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దినేష్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయన్నారు. -
ఐటీకి ఇదేమీ కలిసొచ్చే ఏడాది కాదు: నాస్కామ్
హైదరాబాద్: దేశీ ఐటీ రంగం 2018లో ఆందోళనకరంగానే ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది. గ్లోబల్ ఐటీ వ్యయాలు పెరగడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వంటి సానుకూలతల నడుమ ఇంకా సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. 2018 ఐటీకి కమ్బ్యాక్ ఇయర్ అనే ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అదే సమస్య. వారు పునరుద్ధరణ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఊహించిన క్షీణత కానీ ఆకస్మిక మెరుగుదల కానీ ఉండదు’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘గ్లోబల్ ఎకానమీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటి వల్ల ఇప్పటికిప్పుడు పరిశ్రమకు పెద్దగా అవకాశాలేమీ అందుబాటులోకి రావు’ అని హెచ్చరించారు. సవాళ్లు లేవని అనుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదన్నారు. పాత సవాళ్లు కొనసాగుతున్నాయని, అవి సమసిపోలేదన్నారు. అలాగే అమెరికాలోని పాలన చర్యలు వంటి కొత్తవీ ఉన్నాయని చెప్పారు. -
ఉద్యమాల గడ్డపై అణచివేతలా?
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమాలను దెబ్బతీయడానికి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మరోసారి ఉద్యమించిన మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం యావత్ సమాజాన్ని నివ్వెరపర్చింది. ఉద్యమాలు చేస్తే జైళ్లో పెడతారా అని ప్రజల్లో చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మందకృష్ణపై కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం దారుణం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మరణించిన భారతి మృతికి నివాళులు అర్పించేం దుకు నిర్వహించిన అమరవీరుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి పలుకేసులు నమోదు చేసి జైలుకెళ్లేలా చేశారు. ఉద్యమంతోనే రాష్ట్రాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం అదే ఉద్యమాలను అణగదొక్కాలని చూడడం సహేతుకం కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉద్యమాలే కారణం అనే విషయం కేసీఆర్ మర్చిపోయారా లేక తాను మాత్రమే ఉద్యమాలు చేయాలి. ఇతరులెవరికీ ఆ హక్కు లేదని భావిస్తున్నారా? తెలంగాణ సాధించడం ద్వారా ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ చివరకు ఆ ఉద్యమాల పట్ల అణచివేత ధోరణితో వ్యవహరించడం మంచిది కాదు. – ఇ. చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు ‘ 98488 22333 -
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం..
-
ఏసీబీ వలలో భారీ తిమింగలం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇంటితోపాటు ఇతర బంధువుల, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురం జిల్లా ఊబిచర్లలో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆస్తులు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడుతున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో విధులు నిర్వహిస్తున్నారు. రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లపై సోదాలు అప్ డేట్ ఏకకాలంలో 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు భారీగా బయటపడుతున్న అక్రమ ఆస్తులు కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్ జేసీ కార్యాలయాన్ని తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్న చంద్రశేఖర్ ఆజాద్ ఏలూరు పత్తేబాద్ సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు విజయవాడ పడమట సమీపంలో విద్యుత్ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయిల విలువ చేసే అయిదు అంతస్తుల భవనం గొల్లపూడిలో కోటిన్నర రూపాయిలతో 500 గజాల స్దలంలో గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాల స్దలంలో అబేధ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్..దీనిపై రూ.15 కోట్ల రుణం ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.. -
మృత్యుంజయుడు చంద్రశేఖర్ జీజీహెచ్ నుంచి డిశ్చార్జి
నగరంపాలెం (గుంటూరు) : గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడి మృత్యుంజయుడిగా బయటపడిన చిన్నారి అనుమళ్లమూడి చంద్రశేఖర్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శనివారం డిశ్చార్జి చేశారు. బోరుబావిలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చికిత్స నిమిత్తం చిన్నారిని జీజీహెచ్కు తరలించిన విషయం తెలిసిందే. డిశ్చార్జి సందర్భంగా చిన్నారికి ఆటవస్తువులు అందించి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టరు డీఎస్ రాజునాయుడు అంబులెన్స్లో వారిని స్వగ్రామానికి పంపారు. మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేందుకు సహకరించిన వైద్య బృందానికి చిన్నారి తండ్రి మల్లికార్జునరావు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉదయించిన బాల‘చంద్రుడు’
సాక్షి, గుంటూరు, వినుకొండ: గ్రామస్తుల తోపాటు టీవీలు చూస్తున్న అనేక మంది తల్లులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఓ అమ్మకు ఊరట కలిగిస్తూ బాల‘చంద్రుడు’ ఉదయించాడు! బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి చందు బోసి నవ్వులతో మృత్యుం జయుడుగా వచ్చాడు. గుంటూరు జిల్లా విను కొండ మండలం ఉమ్మడివరంలో మంగళ వారం చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడటంతో ఆగమేఘాలపై రంగంలోకి దిగిన అధికారులు శక్తి వంచన లేకుండా 10 గంటలకుపైగా శ్రమించి చిన్నారిని రక్షించారు. ఉత్కంఠ వాతావరణంలో ఒకవైపు వర్షం కురుస్తున్నా చంటిబిడ్డ ప్రాణాల కోసం కృషి చేసిన అధికార యంత్రాంగం, ప్రజలు చందు సజీవంగా రావ టంతో ఊపిరి పీల్చుకున్నారు. 15 అడుగుల లోతులో కూరుకుపోయి బాలుడు అనుభవి స్తున్న నరకయాతనకు తల్లిదండ్రుల తోపాటు గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. చిన్నారి తల్లిదం డ్రులు మల్లికార్జునరావు, అనూష తమ గారాల బిడ్డ క్షేమంగా రావాలని వేయి దేవుళ్లకు మొక్కు కున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బాలుడు బోరు బావిలో పడిపోగా బుధవారం తెల్లవారు జామున 2.40 గంట లకు సురక్షితంగా బయటకు తీశారు. గుం టూరు జీజీహెచ్ పిల్లల వార్డుకు తరలించారు. ఊరంతా కదిలింది... చందు బోరు బావిలో పడిపోయిన వెంటనే రక్షించటానికి ఊరంతా ఒక్కటై సహాయ చర్యల్లో పాల్గొంది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని అండగా నిలిచి మానవ త్వం చాటుకున్నారు. అధికారులు వచ్చే వరకు విశ్రమించకుండా వారు పడ్డ శ్రమ ఎనలేనిదని చందు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనూష తన బిడ్డ బోరు బావిలో పడ్డాడని కేకలు వేయగానే గ్రామస్తులు స్పందించారు. బోరు బావి గుంతలో బిడ్డ ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడు అని గమనించి పెద్ద ఇనుపరాడ్డును లోపలికి పంపి అంతకన్నా కిందకు జారకుండా రక్షణ చర్యలు చేపట్టడం చందు ప్రాణాలను కాపాడటానికి వీలైంది. సమీపంలోని క్వారీ నుంచి పొక్లెయిన్ తెచ్చి సమాంతరంగా గుంత తవ్వకం చేపట్టారు. అధికారులు సంఘటనాస్థలికి చేరుకునేలోగా దాదాపు 7 అడుగులకుపైగా గుంత తవ్వటం సహాయ చర్యలకు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రతి క్షణం విలువైన ఆ సమ యంలో గ్రామస్తులు వేగంగా స్పందించి తీసు కున్న నిర్ణయం బాలుడి ప్రాణాలను కాపా డింది. సహాయక చర్యలు వేగంగా జరుగుతు న్న సమయంలో అందరినీ ఉలికిపాటుకు గురి చేస్తూ కొద్దిసేపు వర్షం చినుకులు రాలాయి. అయినా మొక్కవోని దీక్షతో శ్రమించి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామస్తుల సంబరాలు ముద్దులొలికే చిన్నారి చందు క్షేమంగా బయటపడడంపై ఉమ్మడివరం ప్రజలు సంబరం చేసుకున్నారు. చందు చిరంజీవిగా తమ కళ్ల ముందుకు రావటంలో అధికారులు పడిన శ్రమ మరువలేనిదని, ఎప్పటికీ తమ గ్రామస్తులు రుణపడి ఉంటామని అంటున్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడులు స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. -
దోపిడీలే ఆ ఎస్ఐ పరమావధి
► సస్పెన్షన్కు గురై పరారీలో ఉన్న ఎస్ఐ అరెస్ట్ ► అతని ఇద్దరు సోదరులు కూడా బనశంకరి(కర్నాటక): సస్పెన్షన్కు గురై పరారీలో ఉన్న ఓ ఎస్ఐ తన ఇద్దరు సోదరులతో కలిసి దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు అతనితోపాటు ఇద్దరు సోదరులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్కమిషనర్ ఎస్.రవి కథనం మేరకు.. 1987లో సీఐఎస్ఐఎఫ్లో ఏఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ అలియాస్ చల్లఘట్ట చంద్ర పదోన్నతిపై ఎస్ఐగా నియమితులయ్యారు. అయితే వివిధ కారణాలతో 2001లో చల్లఘట్ట చంద్రను సస్పెండ్ చేశారు. అనంతరం తన ఇద్దరు సోదరులైన బాక్సర్మంజ, అశోక్ తో కలిసి ముఠాగా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డాడు.ఈ ముగ్గురిపై జీవనభీమానగర పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. అంతేగాకుండా చల్లఘట్ట చంద్రపై హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, చెన్నపట్టణ గ్రామాంతర, ఎలక్ట్రానిక్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇతడిపై కోర్టులో ప్రోక్లోమేషన్ కూడా జారీ అయ్యింది. ఎట్టకేలకు సీసీబీ పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. -
సింగరేణికి కొత్త డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న బి.భాస్కరరావును అదే విభాగానికి, ఆడ్రియాల లాంగ్వాల్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.చంద్రశేఖర్ను సంస్థ ఆపరేషన్ విభాగం డైరెక్టర్గా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సచివాలయంలో 10 మంది సింగరేణి సీనియర్ అధికారులకు ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిని ఎంపిక చేసింది. కమిటీలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి, సింగరేణి సీఎండీ, కోల్ ఇండియా సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీలు సభ్యులుగా వ్యవహరించారు. ప్రతిభ, నడవడిక అంశాల ఆధారంగా కొత్త డైరెక్టర్లుగా ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. -
అల్లుడి ఘాతుకం
- అత్తగారింటిని లారీతో గుద్ది భార్య, బిడ్డతో సహా అందరినీ హతమార్చే యత్నం - ఇంటి గోడలు కూలి అత్తకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం - తృటిలో తప్పించుకున్న ఐదుగురు - మారెంపల్లిలో అర్థరాత్రి అలజడి - పట్టుకునేలోగా పరారైన నిందితుడు గుమ్మఘట్ట (రాయదుర్గం) : రెండు కుటుంబాల్లో తలెత్తిన చిన్న వివాదంతో ఓ వ్యక్తి బంధం, బంధుత్వాలు మరచి క్రూరమృగానికన్నా క్రూరంగా మారిపోయాడు. కట్టుకున్న భార్య, బిడ్డతో సహా ఆమె కుటుంబీకులను అందరినీ మట్టుపెట్టేందుకు ఒడికట్టాడు. ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం మేరకు... రాయదుర్గం మండలం డీ కొండాపురానికి చెందిన గొల్ల చంద్రశేఖర్కు మూడేళ్ల క్రితం గుమ్మఘట్ట మండలం మారెంపల్లికి చెందిన గొల్ల తిమ్మారెడ్డి కుమార్తె మారెక్కతో వివాహమైంది. రెండు కుటుంబాలవారూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇరు కుటుంబాల వారూ సర్దుకున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం మారెక్క మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు గాడిద పాలు పడితే మంచిదని భర్తకు చెప్పడంతో పిల్లాడి నాయనమ్మ గాడిదపాలు తీసుకొచ్చింది. అవి తాగించాక రెండు, మూడు రోజులు పిల్లాడు మల విసర్జన కాక ఇబ్బందిపడ్డాడు. వైద్యం చేయించడంతో నయమైంది. అయితే పిల్లాడి నాయనమ్మ పాలలో ఏదో కలిపిందని, అందువల్లే మలవిసర్జన కాలేదని పిల్లాడి అమ్మమ్మ వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. అది ఆనోటా ఈనోటా పడి నాయనమ్మకు తెలిసింది. ఆగ్రహించిన ఆమె మారెంపల్లికి వచ్చి కోడలు, ఆమె కుటుంబసభ్యులను నిలదీసింది. దీంతో గొడవ జరిగింది. గ్రామస్తులు సర్ధి చెప్పారు. ఈ విషయం తెలిసి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. లారీ డ్రైవర్ అయిన ఆయన లోడ్ తీసుకెళ్లే లారీతోనే శుక్రవారం రాత్రి అత్తగారింటికి వచ్చి అత్త, భార్య, బావమరుదులతో గొడవ పడ్డాడు. మీ అంతు చూస్తానని, మిమ్మల్ని చంపి తీరతానని బెదిరించి వెళ్లాడు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయానికి అన్నంత పనీ చేసేందుకు పూనుకొన్నాడు. లారీని తీసుకొచ్చి రివర్స్గేర్లో అత్తగారింటిని గుద్దేశాడు. ముందు గోడ, బయట వేసిన షీట్లు కుప్పకూలిపోయాయి. గోడ పక్కన నిద్రిస్తున్న అత్త గంగమ్మ(40) కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన మరో ఐదుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంతేకాకుండా చంద్రశేఖర్ ఆరు బయట నిద్రిస్తున్న బావమరిది అంజినేయులుపై కత్తితో దాడి చేసేందుక్కూడా యత్నించాడు. ఈ ఘటన గ్రామంలో పెద్ద అలజడి సృష్టించడంతో అందరూ ఇళ్లు వదిలి గ్రామస్తులు రోడ్లపైకి పరుగుపెట్టారు. అంతమంది జనాన్ని చూసి భయపడిన నిందితుడు పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన గంగమ్మను చిక్సిత కోసం హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుమ్మఘట్ట ఎస్ఐ హైదర్వలీ తెలిపారు. -
ఉపాధి పనులకు వెళ్తే ఆగిన ఊపిరి
కుందుర్పి(కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం తూముకుంటలో చంద్రశేఖర్(38) అనే కూలీ ఉపాధి పనులు చేస్తుండగానే.. గుండెపోటుకు గురై ఊపిరి ఆగింది. రోజులాగే బుధవారం ఉదయం గ్రామ శివార్లలో జరుగుతున్న ఫారంపాండ్ తవ్వేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో కుప్పకూలిపోయాడని కూలీలు తెలిపారు. వెంటనే కుందుర్పి పీహెచ్సీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలొదిలినట్లు చెప్పారు. మృతుడికి భార్య పద్మజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ, వెలుగు ఏపీఎం తిమ్మప్ప, ఏపీఓ నీరజ, తహసీల్దార్ రమేషన్ తూముకుంటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉపాధి హామీ నుంచి రూ.50 వేలు, చంద్రన్న బీమా పథకం కింద మరో రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 వేలు అందించారు. -
మందు బాబుల వీరంగం
= యువకుడి పరిస్థితి విషమం పెద్దపప్పూరు(తాడిపత్రి): పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో మందు బాబులు మంగళవారం వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీహర్ష కథనం మేరకు... గ్రామానికి చెందిన నారాయణస్వామి, చంద్రశేఖర్ ఇళ్లు పక్కపక్కనే కాగా, తన మిత్రులు గౌడ్, సుధాకర్రెడ్డితో కలసి నారాయణస్వామి తన ఇంటి వద్ద మందు తాగుతూ అల్లరి చేస్తున్నట్లుతెలిపారరు. దీంతో అభ్యంతరం తెలిపిన చంద్రశేఖర్ సహా అతని అన్న రాముపై మందుబాబులు దాడికి దిగారు. సుధాకర్రెడ్డి చంద్రశేఖర్ను కట్టెతో తలపై బాదడంతో తీవ్ర గాయమైం, రక్తస్రావమైంది. దీంతో అతను అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఓ ప్రైవేటు వాహనంలో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఉదంతంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గరు మహిళలు, మరో ముగ్గరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ ఎంత కఠనం
⇔యువజంట ఆత్మహత్యాయత్నం ⇔ ప్రియుడు మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం ⇔యువతికి పెళ్లి నిశ్చయం ⇔వివాహానికి పెద్దలు అంగీకరించరని తొందరపడ్డ ప్రేమికులు ⇔ఇరు కుటుంబాల్లో విషాదం ఏడడుగులు వేద్దామనుకున్నారు.. జీవితాంతం కలిసి నడుద్దామనుకున్నారు.. ఉద్యోగం వచ్చాక తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించాలని ఆశ పడ్డారు.. అంతలోనే అమ్మాయికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆందోళన పడ్డారు.. తరుణోపాయం తెలీక మరణమే శరణమనుకొని విషం తాగారు.. తల్లిదండ్రులకు విషాదం మిగిల్చారు.. ప్రేమికుడు కనుమూయగా.. ప్రియురాలు చావుబతుకుల్లో ఉంది. చోడవరం: ఒకే ఊరు.. ఇద్దరివీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే.. పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడంతో అందివస్తారని భావించారు. అంతలోనే ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. తూర్పుగోదావరి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామం శోకసముద్రంలో మునిగింది. తమ అనురాగం గురించి పెద్దలకు చెప్పడానికి సాహసం చేయలేని ఆ ప్రేమ జంట.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఇద్దరూ కలిసి పరీక్షలు కూడా రాశారు. ఇంతలోనే ప్రియురాలికి కుటుంబసభ్యులు వేరొకరితో పెళ్లి కుదర్చడంతో ఇద్దరూ కలత చెందారు. దేవుని సన్నిధిలో ఒకటవుదామని చోడవరం వచ్చి అక్కడే ఆత్మహత్యకు యత్నించడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన ఆ రెండు కుటుంబాలనూ దుఃఖసాగరంలో ముంచింది. ఎదిగొచ్చిన కొడుకు వృద్ధాప్యంలో చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న సమయంలో విగత జీవిగా మారడం దాడి చంద్రశేఖర్ (27) కుటుంబ సభ్యులను కలచివేసింది. ఆస్పత్రి మంచంపై ప్రాణం లేకుండా పడి వున్న కొడుకుని చూసి తండ్రి రామచంద్రరావు, తల్లి కమల బోరున విలపించారు. విజ్ఞత కలిగిన కొడుకు ఇలా అకస్మాత్తుగా విగతజీవి కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకొని జీవించే ఈ కుటుంబం చంద్రశేఖర్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎమ్మెస్సీ చదివిన కొడుక్కి పెద్ద ఉద్యోగం వస్తే కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటాడనుకున్నామని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోపక్క యువతి కుటుంబం మరింత శోకంతో మునిగింది. మరికొద్ది రోజుల్లో ఎంతో ఆడంబరంగా ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేకపోయినా తండ్రి, అన్నయ్య కలిసి చెల్లి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ప్రేమించిన వ్యక్తితో కలిసి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. కొన ఊపిరితో చోడవరం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న చెల్లిని బతికించుకోవడానికి అన్న ఎంతో ఆత్రుత పడ్డాడు. మత్యువుతో పోరాడుతున్న చెల్లెల్ని విశాఖపట్నంలో పెద్దాసుపత్రికి తరలించేందుకు తన చేతుల మీద తీసుకొచ్చి కారెక్కించి రోదించాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎస్ఐ కావాలనుకొని...కిడ్నాపర్గా మారాడు
ఇద్దరు స్కూల్ విద్యార్థుల కిడ్నాప్ గంటలోనే కేసును చేధించిన గోపాలపురం పోలీసులు మారేడుపల్లి: ఎస్ఐ కావాలనుకున్న ఓ యువకుడు ఉద్యోగం రాక పొవడంతో కిడ్నాపర్గా మారాడు. ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్చేసి డబ్బు డిమాండ్చేశాడు. అయితే పోలీసులు గంటలోనే కిడ్నాపర్ను పట్టుకుని కటాకటాల్లోకి నెట్టారు. నార్త్ జోన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ సెంట్ మేరిస్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న హర్షవర్దన్(9), ధీరజ్ (9)లను కిడ్నాప్ చేశామంటు కిడ్నాపర్ నుండి వారి తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాయిన్ బాక్స్ నుండి వచ్చిన కాల్స్ ఆధారంగా కిడ్నాప్ ను గంటలో పట్టుకున్నారు. కిడ్నాపర్ వద్ద ఉన్న ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా పోలీసులు వారి తల్లి దండ్రులకు అప్పగించారు. ఉద్యోగం కొరకు వచ్చి కిడ్నాపర్గా అవతరం జగిత్యాల జిల్లా మలియ మండలం తక్కల పల్లి గ్రామానికి చెందిన పి. చంద్రశేఖర్ (25) డిగ్రీ(బీఎస్సీ) వరకు చదివాడు. నగరంలో ఎస్ఐ ఉద్యోగానికి శిక్షణతీసుకొని ఫెయిల్ అయ్యాడు. అనుకున్న ఉద్యోగం లభించక పోవడంతో తన స్నేహితులైన రాకేష్, గణేష్ లను నగరానికి పిలిపించుకున్నాడు. నెలకు 15 వేల జీతం ఇస్తానాని సికింద్రాబాద్ పలు పాఠాశాల విద్యార్ధులకు ట్యూషన్ కొరకు మార్కెటింగ్ చేసి వారి తల్లి దండ్రలు ఫోన్ నెంబర్లను సేకరించాలని సూచించాడు. దీంతో 13వ తేదీ సెంట్మేరిస్ స్కూల్తో పాటు మరో స్కూల్ లో 12 మంది విద్యార్ధుల తల్లిదండ్రుల నెంబర్లను సెకరించి చంద్రశేఖర్కు ఇచ్చారు. మరుసటి రోజు చంద్రశేఖర్ సెంట్ మేరిస్ స్కూల్ వద్ద టూష్యన్కు ఆసక్తి కనపరచిన హర్షవర్దన్, ధీరజ్ లను మభ్య పెట్టి ట్యూషన్ డేమో క్లాస్ వినలంటూ స్థానికంగా ఓ చోటకు తీసుకు వెళ్ళాడు. వారి తల్లి దండ్రులకు కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేసి మొదట పిల్లలతో మాట్లాడించిన తరువాత పిల్లలను కిడ్నాప్ చేశామని లక్ష రూపాయాలు ఇవ్వాలంటూ బెదిరించాడు. తల్లి దండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ వద్ద నమోదైన సీసీ కెమేరాల దృశ్యాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా పాస్ పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న మల్లన్న ఆలయం వద్ద నిందితుడిని అదుపులొకి తీసుకుని దర్యాప్తు చేశారు.. నిందితుడిని బుధవారం రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా గంటలోపే కేసును చేధించిన గోపాలపురం ఎసిపి శ్రీనివాసరావు, సిఐ రాంచంద్రారెడ్డి, సిబ్బందిని డీసీపీ అభినందించారు. విద్యార్ధులను తీసుకు వెళుతూ..(సీసీ కెమెరా ఫుటేజీ) -
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
-
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్పేటలో గతరాత్రి దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్విన్పేటకు చెందిన ధనలక్ష్మి, చంద్రశేఖర్లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ధనలక్ష్మిపై అతను అనుమానం పెంచుకున్నాడు. సోమవారం ఉదయం సైకిల్పై వస్తున్న ధనలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. ఆసమయంలో ఆమె సోదరి కూడా వెంట ఉండడంతో ధనలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాగా ధనలక్ష్మి వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ చనువుగా ఉంటుందనే అక్కసుతోనే చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితునిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపించాలి
ఆర్ఎంకు వైఎస్సార్సీపీ వినతి మంకమ్మతోట : వివిధ ప్రాంతాలకు బస్సుసౌకర్యం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ గురువారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. నగరంలో నడుస్తున్న రెండు కొత్త సిటీ బస్సులను కరీంనగర్ నుంచి సుల్తానాబాద్కు వయా బొమ్మకల్స్టేజీ మీదుగా నడిపించాలని కోరారు. రైల్వేస్టేషన్, తీగలగుట్టపల్లి, ప్రతిమ మెడికల్ కళాశాల, చామన్పల్లి, చెర్లబూత్కూర్, మొగ్దుంపూర్, దుర్శేడ్, ఆనందరావు మెడికల్ కళాశాల, బొమ్మకల్ స్టేజీ మీదుగా కరీంనగర్కు నడిపించాలని విన్నవించారు. వేములవాడకు మాదిరిగానే ధర్మపురి దేవస్థానానికి కరీంనగర్ నుంచి డెరైక్ట్ బస్సులు వేయాలని కోరారు. కరీంనగర్ నుంచి ధర్మారం వరకు నాన్స్టాప్ బస్సులు, చొప్పదండి వరకు నడుస్తున్న సిటీ బస్సులను ధర్మారం వరకు పొడిగించాలని, లక్షెట్టిపేట మీదుగా మంచిర్యాలకు నడుస్తున్న కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కండిషన్ బస్సులను నడిపించాలని కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పారుపెల్లి వేణుగోపాల్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వినుకొండ రామకృష్ణారెడ్డి, యూత్స్టేట్ జనరల్ సెక్రటరీ దుబ్బాక సంపత్, జిల్లా నాయకులు సాన రాజయ్య, వరాల అనిల్, అహ్మద్ పాల్గొన్నారు. -
మోడల్ జీపీల ఏర్పాటే లక్ష్యం
అక్రమలే అవుట్లపై కొరడా పారిశుధ్యం, తాగునీటి వసతులపై ప్రత్యేక దృష్టి ‘సాక్షి‘తో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ హాజీపూర్(మంచిర్యాల రూరల్) : గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తూ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తగిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి చిట్టుమల్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డీపీవో బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్తో ‘సాక్షి‘ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి : ఇప్పటి వరకు పంచాయతీ వ్యవస్థలో ఎలాంటి బాధ్యతలు చేపట్టారు? డీపీవో : 1990లో గ్రూప్-2 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలో భాగంగా బాధ్యతలు స్వీకరించాను. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, మావల గ్రేడ్ పంచాయతీలో పని చేశాను. 2007లో ఈవోపీఆర్డీగా పని చేశారు. ఇక ఎంపీడీవోగా కౌటాల, బెజ్జూర్, తాంసీలో పని చేశాను. ఇన్చార్జి డీఎల్పీవోగా 2010లో ఆదిలాబాద్లో పని చేశాను. 2013 నుంచి ఇప్పటి వరకు డివిజినల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో)గా జగిత్యాలలో పని చేశాను. జిల్లాల ఏర్పాటులో భాగంగా జీపీ అధికారిగా పదోన్నతి పొంది మంచిర్యాల జిల్లాలో మొదటి డీపీవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి : పారిశుధ్యం, తాగు నీరు అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? డీపీవో : మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉం డగా మొత్తం 205 గ్రామ పంచాయతీలున్నాయి. వ్యా ధుల సీజన్ అని కాకుండా ప్రతీ కాలంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వ్యూ హా త్మకంగా ముందుకు వెళ్తాం. మురికికాలువలు శ ుభ్ర ం, క్లోరినేషన్ తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాక్షి : వర్షాకాల సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డీపీవో : వర్షాకాల సీజన్లో భాగంగా ఈ అక్టోబర్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ప్రజలకు సురక్షిత నీరు అందేలా చూస్తాం. పౌష్టికాహారం, వైద్యం విషయాల్లో కూడా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా పందుల పెంపకం గ్రామాల్లో జరగకుండా చూస్తాం. సాక్షి : గ్రామాల అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తున్నారు? డీపీవో : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం, తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతాం. అభివృద్ధిలో ప్రత్యేక ప్రణా ళికతో గ్రామాలను ఆదర్శంగా తయారు చేసేలా చూస్తాం. సాక్షి : నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎలా అధిగమిస్తారు ? డీపీవో : పలు జీపీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. ఈ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరి స్తాం. ప్రజలకు జవాబుదారీ తనంగా ఇదే సమయంలో పారదర్శక పాలన అందేలా బాధ్యతల నిర్వహణ సాగుతుంది. సాక్షి : మోడల్ గ్రామ పంచాయితీలపై ఎలా వ్యవహరిస్తారు? డీపీవో : జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి చేస్తాం. మొదటి విడతలో మండలానికి 2 గ్రామాలను మోడల్ జీపీలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికతో ముందుకు సాగుతాం. సాక్షి : పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి? డీపీవో : జిల్లాలో పన్నుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామాల పన్నుల లక్ష్యాలను మాత్రం వచ్చే జనవరిలోగా సాధించేలా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు 100 శాతం పన్నుల లక్ష్యాలను చేరుకున్నాం. సాక్షి : అక్రమ లే అవుట్ వెంచర్లపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? డీపీవో : ముందు ఆ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణ విషయంలో ఇబ్బందులు తప్పవు. ఇక అక్రమ లే అవుట్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అ నుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై నివేది క తెప్పించుకున్నాం. అక్రమ లే అవుట్లపై కొరడా ఝుళిపిస్తాం. సాక్షి : జీపీల అభివృద్ధికి చర్యలు? డీపీవో : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ని బద్ధతగా పని చేయాలి. -
డీసీఎంలు ఢీ..ఒకరు మృతి
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వేకువజామున జాతీయ రహదారిపై రెండు డీసీఎంలు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక డీసీఎం క్లీనర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన చంద్రశేఖర్(30) చనిపోయాడు. గాయపడిన మరో ఇద్దరిని 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చదివింది బీటెక్... చేసేది చోరీలు
చదివింది ఇంజినీరింగ్.. చేసేది సెల్ఫోన్ చోరీలు. ఈ-కామర్స్ వెబ్సైట్ తయారు చేస్తానని సాఫ్ట్వేర్ సంస్థల నిర్వాహకులను పిలిపించి వాళ్ల సెల్ఫోన్లతో ఉడాయిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ నివాసి చేగొండి చంద్రశేఖర్(25) భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ పూర్తి చేశాడు. కొద్ది రోజులు శోభ డెవలపర్స్లో సివిల్ ఇంజినీర్గా పని చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక సరికొత్త చీటింగ్తో చోరీలకు శ్రీకారం చుట్టాడు. తాను ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తానని నమ్మబలికి సాఫ్ట్వేర్ సంస్థల నిర్వాహకులను పిలిపిస్తాడు. ఈ నెల 17న టాంజీనియా టెక్సొల్యూషన్స్ అధినేత రవితేజకు ఫోన్లో వల వేశాడు. ఓ రెస్టారెంట్కు పిలిచి వెబ్సైట్ గురించి మాట్లాడాడు. భోజనం తర్వాత తన ఫోన్ పని చేయడం లేదని, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే కాల్ చేసుకొని ఇచ్చేస్తానని తీసుకున్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే విధంగా సునీల్కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను జూబ్లీహిల్స్లోని సెలబ్రేషన్స్ హోటల్లో, మోజం అనే సాఫ్ట్వేర్ సంస్థ అధినేతను స్పైసీ అవెన్యూ హోటల్లో చంద్రశేఖర్ మోసం చేశాడు. నిందితుడు గతంలో వైజాగ్లో కూడా ఇలాగే ల్యాప్టాప్తో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేంకటేశ్వరునికే శఠగోపం...
- అక్రమ మార్గంగా డబ్బులు వసూలు కల్యాణ మండపం నిర్వాహకులు - పదినెలలుగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించని వైనం - నిబంధనలకు విరుద్దంగా పలు ఎగ్జిబిషన్ల ఏర్పాటు.. సాక్షి,సిటీబ్యూరో: కలియుగ దైవం వేంకటేశ్వరునికీ అక్రమార్కులు శఠగోపం పెట్టారు. హిమాయత్నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఈ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ ఇటు టీటీడీ ఖజనాకు అటు భక్తుల జేబులకు చిల్లుపెడుతున్నారు. దీనిని నిరోధించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి మిన్నకుండిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలిలా.. తితిదే కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తోన్న ఓ సంస్థ ఆయా ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో స్టాల్ నుంచి రోజుకు రూ.1000 అద్దె వసూలు చేస్తోంది. ఇలా ఒక్కొ ఎగ్జిబిషన్లో 30నుంచి 40స్టాల్స్ ఉంటాయి ఇవి నెలలో సుమారు పక్షం రోజుల పాటు నడుస్తాయి. దీంతో ఆయా స్టాళ్ల నిర్వాహకుల నుంచి నెలకు రూ.5 నుంచి 6 లక్షలు వసూలు చేయడంతోపాటు ఈ అక్రమార్జనలో టీటీడీ అధికారులకు సైతం మామూళ్లు ముట్టజెబుతుండడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆలయాలు, వాటికి అనుసంధానంగా కల్యాణమండపాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ అంతా టీటీడీ నుంచే కొనసాగుతుంది. నిబంధనల ప్రకారం కల్యాణ మండపాలను ఆలయానికి సంబంధించిన అధికారులే నిర్వహించాలి. అయితే హిమాయత్నగర్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్రమ మార్గంలో లక్షలు వెచ్చించి పై స్థాయిలో పైరవీలు నడిపి ఎస్.వైష్ణవి’ లెసైన్స్ పేరుతో ఓ వ్యక్తి రూ.63.14 లక్షలు చెల్లించి కల్యాణ మండప నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ పెట్టిన పెట్టుబడికి నాలుగురెట్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సేవాపన్నుకూ ఎగనామమే..! వైష్ణవి పేరుతో 2015అక్టోబర్ 22వ తేదీన టిటిడి లెసైన్సును మంజూరు చేసింది. అయితే కల్యాణ మండపంను నిర్వహిస్తున్నందుకు గాను టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి నెలా సేవాపన్ను చెల్లించాల్సి ఉంది. పది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఈ పన్ను చెల్లించలేదు. టిటిడి అధికారులు లెసైన్సుదారులను ప్రశ్నిస్తే తన పేరుపై లెసైన్సు నంబర్ ఉంది కాబట్టి నేను కట్టాల్సిన అవసరం లేదని మొండికేయడం గమనార్హం. ఇద్దరి మధ్య వైరంతో దేవుని ఖాతాలో జమ కావాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబులు నింపుతోందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇంజినీరింగ్ అధికారి ఏమంటున్నారంటే... టిటిడి కల్యాణ మండపంలో బహిరంగంగా జరుగుతోన్న ఈ అవినీతిభాగోతంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.చంద్రశేఖర్ను..సాక్షి’ ప్రశ్నించగా అడ్డగోలుగా వసూలు చేస్తున్న విషయం తమ దష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. సర్వీస్ ట్యాక్స్ను చెల్లించే విషయంలో ఉన్నత అధికారులు సైతం కఠినంగా ఉన్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం
డీసిఎంను ఓవర్టేక్ చేయబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్బషీర్బాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం మెదక్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన మామిడి ఛంద్రశేఖర్, స్వరూపారాణిలు గత కొంత కాలంగా మేడ్చల్ మండలం కండ్లకోయలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు మామిడి సంతోష్కుమార్(20) డిగ్రి చదువుతూ స్థానికంగా ఉన్న రిలయన్స్ గోడౌన్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం తన ద్వచక్రవాహనంపై బట్టలు కుట్టించేందుకు బహుదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. మైసమ్మగూడ చౌరస్తాకు రాగానే జీడిమెట్ల నుండి వరంగల్కు వెళ్తున్న డిసీఎంను ఓవర్టేక్ చేయబోయి డిసీఎం వెనుక చక్రాల కింద పడి పోయాడు. సంతోష్ మెదడు చిట్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహన్ని గాందీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముమ్మాటికీ కక్షసాధింపే
– ప్రజా సమస్యలపై ధర్నాల్లో పాల్గొంటే రౌడీషీట్ బనాయిస్తారా? – వైఎస్సార్ఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ధర్నాల్లో పాల్గొన్న రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ బనాయించడం టీడీపీ కక్ష సాధింపు చర్యలేనని వైఎస్సార్ఎస్యూ జిల్లా ప్రధాన lకార్యదర్శి చంద్రశేఖర్ గురువారం విమర్శించారు. చిలమత్తూరు మాజీ విద్యార్థి నాయకుడు రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం చేసిన ధర్నాలకు ఇప్పుడు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజాసేవ, విద్యార్థుల సమస్యల కోసం వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నాడని టార్గెట్ చేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు రౌడీషీట్ బనాయించడం తగదన్నారు. అక్రమంగా బనాయించిన రౌడీషీట్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. -
కడపలో ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
కడప నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లను వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు చైన్స్నాచర్లలో ఒకరు సీకే దిన్నె మండలానికి చెందిన కొత్తపల్లి కృష్ణాంజనేయులు కాగా..కడప నగరం నాగరాజుపేటకు చెందిన సాకె చంద్రశేఖర్ మరొకరు. వీరు నగరంలో జరిగిన 11 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులు. వీరి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 33 తులాల బంగారు ఆభరణాలను, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో ముంచి.. కాలుతో తొక్కి..
- ఇద్దరు పిల్లలను చంపేసిన తండ్రి - మరో చిన్నారిని కాపాడిన స్థానికులు - భార్యపై అనుమానంతో ఘాతుకం ఎడపల్లి/రెంజల్ : భార్యపై అనుమానంతో తన పిల్లలను ఆదివారం కాలువలో ముంచి.. కాలుతో తొక్కి చంపేశాడో దుర్మార్గుడు. ఇలా ఇద్దరు పిల్లలను చంపేయగా.. మూడో చిన్నారిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట సమీపంలో జరిగింది. జిల్లాలోని రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన గౌరాడి చంద్రశేఖర్కు ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుబీర్ గ్రామానికి చెందిన ప్రమీలతో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు సాత్విక్ (10), మోక్ష (5) పోమేష్ (13 నెలలు) ఉన్నారు. వారి చదువు నిమిత్తం ఐదు నెలలగా వీరు నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉంటున్నారు. చంద్రశేఖర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అయితే, తాగుడుకు బానిసైన చంద్రశేఖర్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పిల్లలు తనకు పుట్టలేదని తరుచూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. పిల్లలను చంపాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం సమీపంలో గల డి-40 నిజాంసాగర్ కాలువకు తీసుకువచ్చాడు. ముగ్గురు పిల్లలను స్నానం చేద్దామని నమ్మించి వారి బట్టలను విప్పి కాలువలోకి తీసుకెళ్లాడు. ముందుగా పెద్ద పిల్లలు సాత్విక్, మోక్షలను నీటి బురదలో ముంచి.. కాలుతో తొక్కి చంపాడు. పెట్రోలింగ్లో ఉన్న ఇరువురు కానిస్టేబుళ్లు పిల్లల అరుపులు విని.. అటువైపు వెళ్లి చూడగా చంద్రశేఖర్ ఇద్దరు పిల్లలను నీటిలో ఉంచి తొక్కడాన్ని గమనించారు. కానిస్టేబుళ్లు అరుస్తుండగానే చిన్న కొడుకు పోమేష్ను నీటిలో వేసి తొక్కాడు. స్థానిక యువకులను అప్రమత్తం చేసిన కానిస్టేబుళ్లు పిల్లలను రక్షించారు. పిల్లలను నీటిలోంచి తీయగా సాత్విక్, మోక్ష అప్పటికే ప్రాణాలు విడిచారు. కొన ఊపిరితో ఉన్న పోమేష్ను స్థానిక యువకులు ప్రశాంత్, గణేష్, గోపి నీటి నుంచి కాలువ ఒడ్డుకు తీసుకొచ్చి హుటాహుటిన జానకంపేట ఆసుపత్రికి బైకుపై తీసుకెళ్లి చికిత్స అందించారు. -
భార్య పై అనుమానంతో..
వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని అనుమానంతో.. కన్న తండ్రి ఇద్దరు పిల్లలను కిరాతకంగా హతమార్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా యడవల్లి మండలం జానకంపేటలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన చంద్రశేఖర్(34)కు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న చంద్రశేఖర్ వివాహేతర సంబంధాల ద్వారా పిల్లలను కన్నదని తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో ఈతకు వెళ్దామని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకొని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని అలీసాగర్ కాలువ వద్దకు తీసుకొచ్చాడు. పెద్ద కూతురు స్వాతి(10)ని నీటిలో ముంచి బురదలో పడేసి కాలుతొ తొక్కి చంపాడు. అనంతరం మోక్ష(5) ను కూడా నీటిలో ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. మూడో సంతానమైన 13 నెలల చిన్నారిని నీటిలో విసిరేయడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బాబును రక్షించి అతన్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ ఢీకొని తీవ్ర గాయాలతో బాలుడు మృతి
ప్రమాద వశాత్తు ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. వైఎస్సార్జిల్లా వల్లూరు మండలం పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం చంద్రశేఖర్ (9) రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు స్నానాల గదిలో ఉండగా... ట్రాక్టర్ గోడను వచ్చి ఢీకొంది. ఆ రాళ్లు చంద్రశేఖర్పై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. -
నాటకీయంగా సురేశ్ను వదిలిన పోలీసులు
వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న నూతక్కి సురేశ్ను బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వదిలేశారు. పోలీసులు సురేశ్ను అదుపులోకి తీసుకుని వదలడం లేదంటూ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి సురేశ్ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి అతడిని తీసుకెళ్లాలంటూ హడావుడి చేసినట్లు చెబుతున్నారు. ఎస్.ఐ. రవిబాబు బుధవారం సురేశ్ను తెలుగుదేశం పార్టీకి చెందిన తుళ్ళూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర వద్ద విడిచి వెళ్లారు. సురేశ్ను జెడ్పీటీసీ సభ్యుడి వద్ద ఎలా వదిలి వెళతారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. సురేశ్ను వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేసి పంట దహనానికి పాల్పడింది తానేనని, తన మేనమామ చంద్రశేఖర్ చేయించాడని పేపర్లపై రాయించుకుని సంతకాలు చేయించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రస్థాయిలో భయపెట్టి సెల్ఫోన్లో రికార్డు చేశారని, ఈ కేసులో అన్యాయంగా ఇరికిచేందుకు పోలీసులు కుట్రపన్నడం దారుణమని వాపోతున్నారు. జగన్ వచ్చిపరామర్శించడంజీర్ణించుకోలేకే కుట్ర రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్కు పొలం ఇవ్వలేదనే కోపంతో గుర్తుతెలియని వ్యక్తులు మల్కాపురంలోని నా చెరకు పంటను దహనం చేశారు. స్పందించిన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పంట పొలానికి వచ్చి నన్ను పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పు పట్టడాన్ని జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి నన్ను, నా మేనల్లుడిని కేసు లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. 29వ తేదీ న విచారణ పేరుతో నామేనల్లుడు సురేశ్ను తీసుకెళ్లి డీఎస్పీ విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తానే ఈ పంట దగ్ధానికి పాల్పడినట్లుగా సురేశ్చేత రాయించుకుని సంతకాలు చేయించి సెల్లో వీడియో రికార్డు కూడా చేశారు. రాజధాని ప్రాంతం లో 13 చోట్ల పంట పొలాల్లో వెదురు బొంగులు దగ్ధమైన సంఘటనలకు సంబంధించి కేసులను సైతం సురేశ్పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. - గద్దే చినచంద్రశేఖర్ -
సీఆర్పీఎఫ్ జవాను అనుమానాస్పద మృతి
కైకలూరు: భార్యను తీసుకెళ్లేందుకు అత్త వారింటికి వెళ్లిన ఓ జవాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ...పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెంనకు చెందిన కాటూరి చంద్రశేఖర్(27) ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. అతడు కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన యువతితో వివాహం అయింది. పెళ్లయిన నాటి నుంచి వారి మధ్య సఖ్యత లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో భార్యను తీసుకెళ్లేందుకు చంద్రశేఖర్ సోమవారం విశ్వనాద్రిపాలెం గ్రామానికి వచ్చాడు. రాత్రి అత్త, భార్య, భార్య సోదరితో వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలోనే పట్టుతప్పి అతడు బండపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ ను అత్తింటి వారు చంపేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. -
హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్లో ఆరంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన చంద్రశేఖర్ కానూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రాంతి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. కల్కిమిత్ర కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్కుమార్, సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ శర్మ. -
అతిరథుల రాక నేడే
రాయికల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోలోరాంతో పాటు త్రిదండి చిన్నజీయర్స్వామి సోమవారం రారుుకల్ మండల కేంద్రానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ చిన్నజీయర్స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు కేసీఆర్, విద్యాసాగర్రావు, జోలోరాం ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరుతారు. 11.15 గంటలకు రాయికల్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడినుంచి కొమరం భీమ్ విగ్రహావిష్కరణ ప్రాంతానికి విగ్రహావిష్కరణ చేస్తారు. చిన్నజీయర్స్వామి ట్రస్ట్కు చేరుకొని వృత్తివిద్యాశిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ట్రస్ట్ ఆవరణలో నిర్మించనున్న కల్యాణమండపానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 12.45 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరబాద్కు పయనమవుతారు. ఏర్పాట్లు పూర్తి : అతిరథుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు. ఆదివారం డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ శివకుమార్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్కుమార్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వీరివెంట అదనపు జేసీ నాగేందర్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, జగిత్యాల సబ్కలెక్టర్ కృష్ణభాస్కర్, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో గీత, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీపీ పూర్ణిమ ఉన్నారు. భారీ బందోబస్తు : సీఎం పర్యటన సందర్భంగా రారుుకల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. పర్యటన పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బందోబస్తు కోసం ఆరుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 275 మంది కానిస్టేబుళ్లు, 140 మంది హోంగార్డులు, 59 మంది మహిళా హోంగార్డులు, 70 మంది ఆర్మీ సిబ్బంది నియమించినట్టు తెలిపారు. ఆయన వెంట జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. విజయవంతానికి సహకరించాలి : సీఎం కేసీఆర్, గవర్నర్ విద్యాసాగర్రావు రారుుకల్ పర్యటనను విజయవంతం చేయూలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. ఆదివారం ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు నియోజకవర్గంలోని ఆయూ మండలాల నుంచి 15వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల నాయకులు మోర హన్మండ్లు, శ్యాంసుందర్రావు తదితరులున్నారు. -
తెలంగాణ ఆశలకు గండి
కేంద్రం నిధులకు కత్తెర నెలనెలా వచ్చింది 900 కోట్లు ఈ నెలలో విడుదలైంది రూ.418 కోట్లు సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి భారీగా నిధులు ఆశిస్తున్న తెలంగాణ సర్కారుకు ఈ నెలలో చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరుస ఢిల్లీ పర్యటనలు.. ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్రమోదీతో భేటీలు... వివిధ శాఖల మంత్రుల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో... ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేంద్రం నుంచి నిధులు వెల్లువెత్తుతాయని ఆశపడ్డ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామమే ఎదురైంది. వివిధ పథకాలు.. పద్దులు.. పన్నుల వాటా కింద కేంద్రం విడుదల చేసే నిధులు ఫిబ్రవరిలో మరింతగా తగ్గిపోవడం కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు నిధుల విడుదలను చూస్తే సగానికిపైగా కోత పడింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రతీ నెలా కేంద్రం నుంచి వివిధ పన్నుల వాటా కింద సగటున రూ.800 నుంచి రూ.1000 కోట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు కేవలం రూ.418 కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలతో ముగియనుంది. మరో నలభై రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. ఇంత తక్కువ సమయంలోనే పాత బకాయిలతో పాటు నెలనెలా వచ్చే నిధులు రాబట్టుకోవటం తప్పనిసరి. లేకుంటే నిధులు మురిగిపోయే ప్రమాదముంది. ఈ అనివార్య పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే గుర్తించింది. విభాగాల వారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మంజూరీకి ఒత్తిడి పెంచాలని.. సీఎం కెసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్ని విభాగాల మంత్రులను అప్రమత్తం చేశారు. నిధుల కోసం ఢిల్లీ పర్యటనలు కేంద్ర గ్రాంట్లను తెచ్చుకునేందుకు ఢిల్లీ పర్యటనలు జోరుగా సాగినప్పటికీ ఆశించినన్ని నిధులు రాకపోగా.. రావాల్సిన తరుణంలో నిధుల్లో కోత పడటం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది. పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం తగ్గిందని.. అదే దామాషా పద్ధతిలో రాష్ట్రానికి ఆశించినన్ని నిధులు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం తగ్గిపోవటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సైతం ఆరా తీస్తోంది. మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రాష్ట్రంలో తలపెట్టిన మిషన్ కాకతీయ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు సగం నిధులివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆదాయం ఆశాజనకంగా లేని పరిస్థితిలో కేంద్రం ఎలా స్పందిస్తుంది..? 2015-16 బడ్జెట్టులో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయిస్తుందా..? అనేది ఆర్థిక శాఖ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. స్పెషల్ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు? ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీగా రూ.5వేల కోట్లు వస్తాయని తెలంగాణ సర్కారు ఆరు నెలలుగా ఎదురుచూస్తోంది. ఇప్పటికీ అటువంటి సానుకూల సంకేతాలేవీ రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం 2014-15 బడ్జెట్టులో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు ప్రణాళిక నిధుల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ. 11 వేల కోట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. 13 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రానికి రూ. 3139 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 997 కోట్లు విడుదలయ్యాయి. మిగతా రూ. 2142 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. అమ్మకపు పన్ను వాటాకు సంబంధించి ఎనిమిదేళ్లుగా రావాల్సిన రూ. 2,500 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయి. ప్రస్తుతమున్న రుణ పరిమితిని పెంచే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఎఫ్ఆర్బీఎం నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ.9వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే వీలుంది. ఈ పరిమితిని రూ.13వేల కోట్లకు పెంచాలనే విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. -
వచ్చే ఏడాది రెండు పడకల ఇళ్లు
సమగ్ర సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఎట్టకేలకు కదలిక మొదలైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల పర్యటన సమయంలో దానిపై అడపాదడపా ప్రకటనలు చేస్తూ వస్తున్న సీఎం బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహా దారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ఆ శాఖ గత కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రస్తుత కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ బోర్డు ఎండీ మహేశ్ దత్ ఎక్కా పాల్గొన్నారు. ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ప్రకటించిన ఆయన తెలంగాణవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలుపెడుతున్నట్టు వెల్లడిం చారు. సమగ్ర సర్వే ఆధారంగా ఇళ్లు లేని వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేసుకుని దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉం టుందని పేర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్ పట్టణాలలో ప్రయోగాత్మకంగా పట్టణ గృహ నిర్మా ణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడించారు. ఆ అవినీతి మరకలొద్దు గతంలో ఓట్ల వేట లక్ష్యంగా గృహనిర్మాణ పథ కం కొనసాగి చివరకు అవినీతికి ఆలవాలంగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లక్షల ఇళ్లు మంజూరై, వేల కోట్లు ఖర్చయినా ఇంకా ఇళ్లులేని నిరుపేదలు ఉన్నారంటేనే పథకం సాగిన తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్తోందన్నారు. నాటి అవకతవకలపై సీఐడీ విచారణలో ప్రతి గ్రామంలో తప్పులు జరిగాయని తేలుతోందన్నారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప పేరుతో జరిగిన ఇళ్ల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి వాటి విషయంలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వృథా ఇళ్ల వినియోగంపై సూచనలు అందజేయాలని పేర్కొన్నారు. -
సముదాయంగా ప్రభుత్వ కార్యాలయాలు
అవకాశాలపై నివేదిక కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓ సముదాయంగా నిర్మించే అంశాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష జరిపారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.? వాటి కున్న స్థలం ఎంత.? భవన సముదాయాల నిర్మాణం కోసం ఎంత స్థలం కావాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ సముదాయాల్లో కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం అత్యంత ఆధునికంగా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం సూచించారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు ఏది ఎక్కడుందో తెలియక అవస్థలు పడుతున్నందున వాటిని ఒకే చోట నిర్మిస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, మిగిలిన జిల్లా కార్యాలయాల్లో ఒక్కోటి ఒక్కో చోట ఉన్నాయి. ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఆఫీసులు సుదూరంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే సీఎం సముదాయాలుగా ఒకేచోట ఉంచేందుకు యత్నిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా.. హైదరాబాద్ నగర ప్రజల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఆయన సచివాలయంలో హైదరాబాద్ మహానగర మంచినీరు, మురుగునీటి పారుదల మండలి అధికారులతో నీటి సమస్యపై సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్కు తాగునీరు ఎంత కావాలి..? భవిష్యత్తులో ఎంత నీరు అవసరం అనే విషయాన్ని అధ్యయనం చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు మళ్లించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా సీఎం పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
కాటేసిన కాల్మనీ
వడ్డీ వ్యాపారి ఆగడాలకు కేబుల్ కాంట్రాక్టర్ మృతి విజయవాడ సిటీ : ఓ కాల్మనీ వ్యాపారి ఆగడం నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న సొమ్ము తిరిగిచ్చేయాలంటూ కాల్మనీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో దిక్కుతోచని ఓ చిరు కాంట్రాక్టర్ బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. కాల్మనీ వ్యాపారి నైజం తెలిసిన మృతుని కుటుంబీకులు విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నట్టు తెలిసింది. సేకరించిన సమాచారం ప్రకారం.. సత్యనారాయణపురానికి చెందిన చంద్రశేఖర్ కేబుల్ కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. వ్యాపార నిర్వహణ కోసం గాంధీనగర్లోని శాంతి ప్రశాంతి థియేటర్ ప్రాంతంలో వడ్డీ వ్యాపార సామ్రాజ్యానికి ‘చక్రవర్తి’గా పేరొందిన ఓ వ్యక్తి వద్ద రూ.2లక్షలు కాల్మనీగా తీసుకున్నాడు. గత రెండు నెలలుగా కేబుల్ కాంట్రాక్టు పనుల నిమిత్తం రావాల్సిన బిల్లులు బీఎస్ఎన్ఎల్ వద్ద బకాయిపడ్డాయి. దీంతో ఆర్థికంగా ఇతను ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. దీంతో కాల్మనీ చెల్లింపులో జాప్యం జరిగింది. దీనిపై ఆగ్రహించిన వడ్డీ వ్యాపారి కొద్ది రోజులుగా చంద్రశేఖర్పై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. పైగా నలుగురిలో పదే పదే అవమానిస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర మనస్థాపానికి లోనైన చంద్రశేఖర్.. ఈ విషయం స్నేహితుల వద్ద చెప్పుకొని వాపోయాడు. వీలైనంత తొందరగా తీసుకున్న కాల్మనీ చెల్లిస్తానంటూ ప్రాథేయపడినా వడ్డీ వ్యాపారి తీరు మారకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు చెపుతున్నారు. విషయం తెలిసి కూడా వడ్డీ వ్యాపారి ఆగడాలకు భయపడి కుటుంబ సభ్యులు విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోతున్నట్టు చంద్రశేఖర్ స్నేహితుల సమాచారం. గతంలో కూడా ఎస్కెపివి హిందూ హైస్కూలు సమీపంలోని ఓ టైలరింగ్ షాపు యజమాని కొడుకు వడ్డీ డబ్బులు సకాలంలో చెల్లించలేదని నడిరోడ్డుపై కొట్టినట్టు చెపుతున్నారు. నలుగురిలో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అతను కూడా చంద్రశేఖర్ మా దిరిగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. -
‘గుట్ట’ వద్ద మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. రూ. మూడు వేల కోట్ల పెట్టుబడితో యాదగిరిగుట్ట సమీపంలో 250 ఎకరాల్లో సిద్ధక్షేత్రధామ్ నిర్మించే ప్రతిపాదనలను సహ్యోగ్ ఫౌండేషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చింది. శుక్రవారం సంస్థ ప్రతినిధులు జయేష్ దేలివాల, అశోక్ధోబి, సురేష్షా, రజనీకాంత్షా తదితరులు సచివాలయంలో సీఎంను కలిసి ఈ వివరాలు అందించారు. ఈ సంరద్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఆ నిర్మాణాలకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వారికి హామీ ఇచ్చారు. -
‘విమర్శ’కు పురస్కారం
సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బాధ్యతను మరింత పెంచిందన్న అవార్డు గ్రహీత తిరుచానూరు/తిరుపతి తుడా : ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం తన బాధ్యతను మరింత పెంచడమేనని అవార్డు గ్రహీత యోగి వేమన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఆయనకు అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాచపాళెం మాట్లాడుతూ ఈ అవార్డు సాహితీ విమర్శక ప్రపంచానికి వచ్చినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తాను చేయాల్సిన, తన ముందు ఉన్న కర్తవ్యాన్ని అవార్డు గుర్తు చేస్తోందని చెప్పారు. 42 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య విమర్శపై రచనలు చేసినట్లు తెలిపారు. మొత్తం 19సాహిత్య విమర్శలు రాశానన్నారు. ఇదీ రాచపాళెం ప్రస్థానం.. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామంలో 16-10-1948లో రామిరెడ్డి, రాజమ్మ దంపతులకు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను కుంట్రపాకం, ఉన్నత విద్యను వెంకటాపురం, తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో అభ్యసించారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. 1970-72లో ఎస్వీయూలో ఎంఏ తెలుగు చేశారు. 1976లో ప్రొఫెసర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. 1977లో అనంతపురం జిల్లాలోని ఎస్వీయూ పీజీ సెంటర్లో లెక్చరర్గా పనిచేశారు. తరువాత పీజీ సెంటర్ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీగా మార్చాక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, రీడర్గా, 1993లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. అధ్యాపకుడిగా 35 ఏళ్ల పాటు సేవలందించారు. 2008 అక్టోబర్లో ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది నవంబర్లో వైఎస్సార్ జిల్లా కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ప్రత్యేకాహ్వానం మేరకు గెస్ట్ ప్రొఫెసర్గా చేరారు. ప్రస్తుతం యోగి వేమన యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా ఉంటూ సీపీ బ్రౌన్ లైబ్రరీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ప్రాచీన తెలుగు కవుల సిద్ధాంతాలు, చర్చ అనే తెలుగు విమర్శ రచనలకు శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. ఈయన ఇప్పటి వరకు 19 తెలుగు సాహిత్య విమర్శన గ్రంథాలు వెలువరించారు. పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించింది. త్వరలోనే ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
పోలీసుల్ని బెదిరించిన కేసులో
చింటూ అరెస్టు నిరసనగా రోడ్డుపై టీడీపీ నేతల బైఠాయింపు చిత్తూరు (అర్బన్): చిత్తూరు టీడీపీ నాయకుడు కఠారి మోహన్ బావమరిది చింటూ అనే చంద్రశేఖర్ను స్థానిక వన్టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను బెదిరించారంటూ నాటకీయ పరిణామాల మధ్య చింటూను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. చింటూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై 2007లో జరిగిన రెండు హత్యాయత్నాల కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్నాడు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు కథనం మేరకు.. సీకే బాబుపై జరిగిన కాల్పుల ఘటన కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న చింటూ న్యాయస్థానం ఆవరణలోకి వస్తుండగా అతని ముందు వెళుతున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణ జరుగుతున్న వ్యక్తుల వాహనాలు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీకాంత్కు, చింటూకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదే రోజు రాత్రి ఎస్ఐ లక్ష్మీకాంత్ వన్టౌన్ పోలీసులకు చింటూపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడని, అంతు చూస్తామని బెదిరించాడని పేర్కొన్నారు. వన్టౌన్ ఏఎస్ఐ గుణశేఖర్ చింటూపై ఐపీసీ 353, 506 రెడ్విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శుక్రవారం న్యాయస్థానం ఎదుట హాజరై వస్తున్న చింటూను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్కు తరలించారు.ఎలాంటి తప్పు చేయకుండా చింటూను ఎలా అరెస్టు చేస్తారంటూ చిత్తూరు టీడీపీ నాయకులు చిత్తూరు నగరంలో నిరసనలు వ్యక్తం చేశారు. మేయర్ కఠారి అనురాధ, దేశం నాయకులు కఠారి మోహన్, పలువురు కార్పొరేటర్లు గాంధీ విగ్రహం ఎదుట, వన్టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం చింటూకు చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. -
పోచారం ‘జోన్ల’ విభజన బాగుంది
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు ఆయకట్టును ‘ఏ’,‘బీ’జోన్లుగా విభజించిన విధానం బాగుందని మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ అధికారుల బృందం కితాబుని చ్చింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన నీటి పారుద ల శాఖ చీఫ్ ఇంజినీర్ అవినాష్ షర్వేతోపాటు ఏడుగురు ఎస్ఈలు, నలుగురు ఈఈలు స్టడీ టూర్లో భాగంగా మండలంలోని పోచారం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. హైదరాబాద్లోని వాల ంతరీకి చెందిన ఐడీ అండ్ సీబీ ఎక్స్పర్ట్ ఝాన్సీరాణి, ట్రైనింగ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ వారికి పోచారం ప్రాజెక్టు చరిత్ర, ఆయకుట్ట వివరాలు, ప్రాజెక్టు నీటి వినియోగం తీరును గురించి వివరించారు. అనంతరం అవినాష్ షర్వే స్థానిక విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణలోని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధ్యయ నం చేయడానికి రెండురోజుల క్రితం తాము హైదరాబాద్కు వచ్చామన్నారు. మొదటిరోజు ఇరిగేషన్ అధికారులకు శిక్షణను ఇచ్చే వాలంతరీని, పటాన్చెర్వులోని ఇక్రిశాట్ను సందర్శించామన్నారు. రెండోరోజు పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రాజెక్టుల్లోని సాగునీటిని ప్రజల భాగస్వామ్యంతో వినియోగించుకునే తీరును అధ్యయనం చేస్తున్నామన్నారు. పోచారం ప్రాజెక్టు నీటిని ఖరీఫ్లో పూర్తి ఆయకట్టుకు అందించి, రబీలో మాత్రం ‘ఏ’,‘బీ’జోన్లకు అందించడం బాగుందన్నారు. ఈ విధా నం వల్ల ప్రాజెక్టులోని నీరు కొద్దిపాటి ఆయకట్టుకైనా పూర్తిస్థాయిలో అందుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులు సుమారు 3,700 ఉన్నాయని అవినాష్ షర్వే తెలిపారు. తెలంగాణలో వరి సాగుచేసే రైతుల నుం చి ఎకరాకు రూ. 200 చొప్పున నీటితీరువా వసూలు చేస్తుండగా తమ రాష్ట్రంలో ఎకరాకు రూ. 476 నీటిపన్ను వసూలు చేస్తున్నామన్నారు. చెరుకు రైతుల నుంచి ఇక్కడ ఎకరానికి రూ. 350 వసూలు చేస్తుండ గా మహారాష్ర్టలో రూ. 4,500 వసూలు చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచే ప్రాజెక్టుల నిర్వహణకు కొంతభాగం కేటాయిస్తామని తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఎస్ఈలు పటాక్, గునలే, సంజీవ్ టటు, షాహ్, అజయ్ కోహీర్కర్, సంతోష్ తిరమన్వర్, ఈఈలు అశిశ్ దేవ్ఘడే, బోడ్కే, రాథోడ్, విశ్వకర్మ, బోర్సేతోపాటు కామారెడ్డి ఈఈ మధుకర్రెడ్డి, డీఈఈ విజయేందర్రెడ్డి ఉన్నారు. నిజాంసాగర్లో.. నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రాంత నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి పంపిణీ తీరును తెలుసుకున్నారు. ప్రాజెక్టు గురించి స్థానిక అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఐబీసీబీ నిపుణురాలు ఝాన్సీరాణి, టీం కన్వీనర్ చంద్రశేఖర్ స్థానిక డిప్యూటీ ఈఈ సురేశ్బాబు తదితరులున్నారు. ఎక్లాస్పూర్లో.. కోటగిరి : ఎక్లాస్పూర్ నీటి సంఘం కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం సందర్శించింది. బృంద సభ్యులు నీటి సంఘం ద్వారా చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామని సంఘం అధ్యక్షుడు శరత్బాబు వారికి వివరించారు. -
రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్మాల్
* శాసనసభలో సీఎం కేసీఆర్ విమర్శ * అక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు * తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంట రుణాలను మాఫీ చేశాం * రైతులకు రూ. 8 వేల కోట్ల కొత్త రుణాలు కూడా అందాయి * కొన్నిచోట్ల బ్యాంకులు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని వ్యాఖ్య * ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ కూడా డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ చేయకపోగా.. గోల్మాల్ వ్యవహారాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో.. పలుమార్లు కలుగజేసుకుని మాట్లాడారు. ఏపీలో మహిళలకు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేశారని, తెలంగాణలో కూడా చేయాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు కోరగా.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... పంట రుణాలకు సంబంధించి రూ. 17 వేల కోట్లు ఇవ్వడం చారిత్రాత్మక మని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదని, మేనిఫెస్టో ఇంగ్లిష్లో స్పష్టంగా పంట రుణాలని ఉందని.. తెలుగులో ప్రచురితమైన మేనిఫెస్టోలో పొరపాటు జరిగిందని చెప్పారు. ఈ విషయంపై టీడీపీ సభ్యులు జోక్యం చేసుకోవడంపై ఆగ్రహించిన సీఎం కేసీఆర్... ‘ఇష్టమొచ్చినప్పుడు రన్నింగ్ కామెంటరీ లాగా మాట్లాడితే మా వాళ్లు కూడా అలాగే చేస్తారు. సంయమనం ఉండాలండీ.. కూర్చోండి..’ అని సూచించారు. దీంతో అధికార సభ్యులు, టీడీపీ సభ్యులు కొద్దిసేపు గందరగోళం సృష్టించారు. రూ. 8 వేల కోట్ల కొత్త రుణాలిచ్చాం.. అధికార, టీడీపీ సభ్యుల గందరగోళం మధ్య వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. 36,31,908 మంది రైతులకు సంబంధించిన రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, అందులో తొలివిడతగా ప్రభుత్వం 25 శాతం చెల్లించిందని తెలిపారు. ఈ మొత్తానికి మరో 30 శాతం అదనంగా కలిపి రైతులకు కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరామన్నారు. ఇప్పటివరకు 19,60,721 మంది రైతులకు రూ. 8,123 కోట్ల కొత్త రుణాలు అందాయని చెప్పారు. బంగారం తాకట్టు పెట్టినవారు 3.63 లక్షల వరకూ ఉన్నారని, వారి రుణాలు రూ. 1,500 కోట్ల వరకూ ఉన్నాయని తెలిపారు. అయితే ఏడు శాతం వడ్డీతో ఇచ్చిన రుణాలను మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తామని, 14 శాతం వడ్డీతో ఇచ్చిన బంగారం రుణాలకు రుణమాఫీ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందేట్లు చేస్తామన్నారు. కౌలు రైతుల సంగతేమిటి?: ఎర్రబెల్లి అనంతరం టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ... కౌలు రైతులకు రుణమాఫీ వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. రైతులకు ఏ షరతూ లేకుండా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారని, కానీ దీర్ఘకాలిక రుణాలను పక్కన పెట్టేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేస్తున్నామని చెప్పారు. దీంతో ఎర్రబెల్లి టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను చూపుతూ రైతులకు రూ. లక్ష రుణమాఫీ అని ప్రకటించారని, ఇప్పుడు అందులోంచి దీర్ఘకాలిక రుణాలను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పోచారం మాట్లాడుతూ... బంగారం రుణాలను మాఫీ చేశామని, వడ్డీ లేని రుణాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. పావలా వడ్డీని కూడా కొనసాగిస్తున్నామన్నారు. గిరిజనేతరులకు, కౌలు రైతులకు కూడా రుణమాఫీ కల్పిస్తామని తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా రుణమాఫీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
తరుణ్జోషీ బదిలీ
నిజామాబాద్ క్రైం : ఎస్పీ తరుణ్జోషీ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే ఎస్పీగా ఉన్న ఎస్ చంద్రశేఖర్రెడ్డి ని జిల్లా ఎస్పీగా నియమించింది. తరుణ్ జోషీ బదిలీతో జిల్లాలోని కొందరు ప్ర జాప్రతినిధులు తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లయ్యింది. 2013 అక్టోబరు 31న జిల్లాకు వచ్చిన తరుణ్జోషీ యేడాది తిరగక ముందే బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన తీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కంటగింపుగా మారింది. గత ఎన్నికల సందర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తనయుడిపై చేయి చేసుకోవటం మొదలుకుని మొన్నటి ఎస్ఐల బది లీ వ్యవహరం వరకు ఎమ్మెల్యేలకు నచ్చలేదు. దాంతో ఆయనను బదిలీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒత్తిడి తెచ్చారు. తరుణ్జోషీని హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు వచ్చాయి. చంద్రశేఖర్రెడ్డి సీనియర్ అధికారి కొత్త ఎస్పీగా నియమితులైన ఎస్. చంద్రశేఖర్రెడ్డి గ్రూపు 1 అధికారిగా పోలీస్శాఖలో అడుగుపెట్టారు. 1993-94 బ్యాచ్కు చెందిన ఈయన తొలి పోస్టింగ్ వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీగా. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాలో, తిరుపతిలో పనిచేశారు. నాన్ కేడర్లో హైదరాబాద్ ట్రాఫీక్ డీసీపీగా బదిలీ అయ్యారు. 2011లో ఐపీఎస్ కన్ఫర్మేషన్తో ఎస్పీగా క ర్నూల్ జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. -
నిల్వ నీటిని తీసివేయాలి
ధారూరు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంటను దెబ్బ తీస్తుందని ధారూరు ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పత్తి పొలాల్లో నిల్వ నీటిని వెంటనే తీసివేయాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే పత్తికి తెగుళ్లు సోకుతాయని చెప్పారు. ఈ వర్షాల వల్ల ప్యారావిల్ట్, వేరుకుళ్లు తెగుళ్లు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఈ తెగుళ్ల నివారణకు కార్బండిజం, మ్యాంకోజెబ్ కలిపిన పౌడర్ను (స్టాఫ్ లేదా స్ప్రింట్) లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ముదురు ఆకులు పసుపు, ఎరుపు రంగుకు మారితే డీఏపీని లీటరు నీటికి 10 గ్రాములు లేదా యూరియాను లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంట బీమాకు ఈ నెల 30వ తేదీ ఆఖరు ఈ సంవత్సరం ఖరీఫ్లో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకుల తరఫున బీమా చేయలేరని ఏడీఏ చంద్రశేఖర్ తెలిపారు. రైతులంతా గ్రామం యూనిట్గా చేసుకుని మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోవడానికి ప్రతిపాదన ఫారాన్ని వీఆర్ఓ సంతకంతో నేరుగా బ్యాంకులో గానీ పీఏసీఎస్లో చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
నవ్యాంధ్ర ప్రదేశ్లో మొదటి టాపర్
చంద్రశేఖర్ ఐఏఎస్ మురళీనగర్: మన చంద్రశేఖరుడు ఐఏఎస్ దక్కించుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు వివిధ కేంద్ర సర్వీసులు కేటాయిస్తూ డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) జాబితాను విడుదల చేసింది. నవ్యాంధ్ర ప్రదేశ్లో ప్రథమ ర్యాంకరుగా విశాఖ వాసి చంద్రశేఖర్ ఐఏఎస్ క్యాడరుకు ఎంపికయ్యారు. ఆయన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 234 ర్యాంకు సాధించిన విషయం విదితమే. ప్రస్తుత తరంలో చంద్రశేఖర్ ఒక్కరే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పవచ్చు. మొదట్లో సాధారణ విద్యార్థిగా ఉన్న కిల్లి చంద్రశేఖర్ అంచెలంచెలుగా తన మేధస్సుకు పదును పెట్టుకుంటూ నిరంతర సాధనతో సివిల్స్లోనే అత్యున్నత స్థాయి కేడర్ ఐఏఎస్కు ఎంపికవడం విశేషం. బీటెక్ చేసిన ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎంబీఏ చేశారు. లండన్లో బిజినెస్ కన్సల్టెంటుగా పనిచేస్తూ అమెరికా ఆఫర్ను వదిలేసి సివిల్స్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 1 తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిమిత్తం ఉత్తరాఖండ్లోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తరగతులు ఉంటాయి. ఇది రెండు నెలలు ఉంటుంది. తర్వాత కూడా ఐఏఎస్ క్యాడరుకు ఎంపికైనవారు అక్కడే పూర్తి స్థాయి శిక్షణ పొందుతారు. ఇది స్వాతంత్య్ర దినోత్సవ కానుక నాకు ఐఏఎస్ క్యాడరు కేటాయించడం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భావిస్తున్నాను. నవ్యాంధ్ర ప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచి సివిల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ అనంతరం నాకు కేటాయించే విధులను సమర్థవంతంగా నిర్వహించి పేద ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని భావిస్తున్నాను. -కిల్లి చంద్రశేఖర్, విశాఖపట్నం -
సమావేశం రసాభాస
ఖానాపూర్ : ఖానాపూర్ మండలం సత్తన్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు, సత్తన్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బెల్లాల చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఇద్దరు డెరైక్టర్లతోపాటు సంఘం పరిధిలోని రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రైతులు రుణాల కోసం కార్యాలయానికి వస్తున్నారని, పెండింగ్లో ఉన్న రుణాలు చెల్లిస్తే నూతనంగా రుణాలు ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. లేకపోతే రుణమాఫీపై నిర్ణయం వచ్చే వరకు వేచిచూడాలని పేర్కొన్నారు. దీంతో ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోతే ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సీఈవో నారాయణ పలు అంశాలపై తీర్మానం చేశారు. వారందరూ అనర్హులే.. సహకార సంఘానికి చెందిన పది మంది డెరైక్టర్లు ఓవర్ డ్యూ ఉన్నారని, లీగల్ ఓపీనియన్ ప్రకారం ఖరీఫ్ డ్యూడేట్ ఫిబ్రవరి 23వ తేదీనఈ విషయాన్ని సంఘం కార్యాలయంలోని నోటీసు బోర్డులో పెట్టామని చైర్మన్ పేర్కొన్నారు. మళ్లీ ఓవర్ డ్యూ తేదీ మే 31 కూడా చివరిసారిగా నోటీసు బోర్డులో పేర్కొన్నామన్నారు. అయినాడబ్బులు చెల్లించలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు, కో-ఆపరేటీవ్ సొసైటీ చట్టం సెక్షన్ 21-ఏ, 21-ఏఏ లేదా 21-బీ 1964 చట్టం ప్రకారం మే 31వ తేదీ నుంచి డెరైక్టర్లుగా వారంతా అనర్హులుగా పరిగణించబడుతారని చైర్మన్ ప్రకటించారు. రైతుల ఆగ్రహం ఈనెల 16న చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ఉన్నందు వల్ల నే చంద్రశేఖర్రెడ్డి పదవిని కాపాడుకోవడానికి తప్పుడు సమావేశం ఏర్పాటు చేశారంటూ ఆగ్రహంతో సమావేశంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. అనంతరం 222 రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో సంఘటనా స్థలానికి సీఐ జీవన్రెడ్డి, ఎస్సై సునీల్ చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం రైతుల కోరిక మెరకు సంబంధిత డీసీవో సూర్యచందర్రావుతో ఫోన్లో సీఐ జీవన్రెడ్డి రైతులతో మాట్లాడించారు. సమావేశం నివేదికను, చైర్మన్ తీసుకున్న నిర్ణయాలు తాము పరిశీలిస్తామని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీసీవో చెప్పడంతో రైతులు శాంతించారు. వైస్ చైర్మన్, కోశాధికారి ఎన్నిక సర్వసభ్య సమావేశంలో కో-ఆప్షన్ సభ్యులుగా ప్రకటించిన ఎనిమిది మందితో చైర్మన్, ఇద్దరు డెరైక్టర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్గా ఎన్నిక యిన వారి నుంచి పాత ఎల్లాపూర్కు చెందిన కొప్పుల మంజులను వైస్ చైర్మన్గా, బావాపూర్(కే)కు చెందిన దూస శంకర్ను కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సభ్యులు ప్రకటించారు. -
వివాదానికి దారితీసిన అవిశ్వాసం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అవిశ్వాసం అంశం కొత్త వివాదానికి దారితీస్తోంది. గురువారం నాటి డీసీసీబీ ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని రేపటికి వాయిదా వేశామని ప్రకటించిన జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావు.. శుక్రవారం డీసీసీబీ సమావేశం హాలు వైపే రాకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చైర్మన్పై అవిశ్వాసం పెట్టిన చంద్రశేఖర్రెడ్డితోపాటు అవిశ్వాసానికి మద్దతిస్తున్న డెరైక్టర్లు మాత్రం శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం హాల్కు వచ్చారు. డీసీవోతోపాటు అధికారులెవరూ అక్కడ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో డీసీవో తన సెల్ఫోన్ను స్విచ్ఆఫ్ చేశారని డెరైక్టర్లు తెలి పారు. డీసీవో పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఉద యం నుంచి రాత్రి వరకు డీసీసీబీ కార్యాల యంలో ఆందోళనకు దిగారు. డీసీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. డీసీవో తీరు వివాదాస్పదమవుతోంది. ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి న డీసీవో శుక్రవారం ఉదయం చేతులెత్తేయడం అవిశ్వాస తీర్మానం పెట్టిన డెరైక్టర్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడంతో చైర్మన్ దామోదర్రెడ్డిపై పెట్టిన అవి శ్వాస తీర్మానం వీగిపోయిందా? నెగ్గిందా? అని ఎటూ తేలలేదు. డీసీవో మాత్రం గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటన మినహా అవిశ్వాసంపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాగా, డీసీవో వైఖరిని నిరసిస్తూ డీసీసీబీ డెరైక్టర్లు రాత్రి 9.30 గంటల వరకు కార్యాలయం గదిలో ఉండి గడియ పెట్టుకుని నిరసన తెలిపారు. న్యాయ పోరాటం చేస్తాం : చంద్రశేఖర్రెడ్డి అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో డీసీవో వైఖరిపై న్యాయపోరాటం చేస్తామని వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. డీసీవో చైర్మన్కు వత్తాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైతే కేవలం తొమ్మిది మంది సంతకాలు మాత్రమే తీసుకుని కోరం లేదనడం దారుణమని వివరించారు. ఎవరి ప్రయోజనాల కోసం డీసీవో ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని చెప్పిన జిల్లా సహకార అధికారి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. ఆయనపై కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. -
బ్లూస్ను గెలిపించిన చంద్రశేఖర్
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: చంద్రశేఖర్ (7/35) నిప్పులు చెరగడంతో డెక్కన్ బ్లూస్ 64 పరుగుల తేడాతో ఎస్.రేమండ్స్పై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ బ్లూస్ 236 పరుగులు చేసి ఆలౌటైంది. శేషగిరి 46, శ్రీకాంత్ 35 పరుగులు చేశారు. రేమండ్స్ బౌలర్ తేజోధర్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్.రేమండ్స్ జట్టు 172 పరుగుల వద్ద ఆలౌటైంది. వికాస్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు విజయ్నగర్: 220 (కమల్ 31, నర్సింహా 30; గణేశ్ 6/63), స్పోర్టీవ్: 221/8 (రోషన్ 70, ధీరజ్ 48; సతీశ్ 4/53) యాదవ్ డెయిరీ: 242 (శ్రీనివాస్ 53, సూర్యతేజ 53; ప్రణవ్ 4/87), డెక్కన్ కోల్ట్స్: 174 (రమేశ్ 47, అర్జున్ 44; రిషబ్ 5/35) శాంతి ఎలెవన్: 146 (జగన్ 47 నాటౌట్; సుశిక్షిత్ 5/37), భరత్: 147/4 (రోహిత్ దివేశ్ 52) సెయింట్ ప్యాట్రిక్స్: 229 (నిఖిల్ 40 నాటౌట్, శ్రీమాన్ 37; నీరజ్ 5/48), ఎం.ఎల్.జయసింహా: 189 (వినయ్ 55, సాత్యకి 3/40) ఎంపీ బ్లూస్: 236 (యేసుదాస్ 77 నాటౌట్; కశ్యప్ 4/64), మాంచెస్టర్: 178 (సొహైల్ ఖాన్ 47 నాటౌట్; సతీశ్ 4/58) -
ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా
రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా ఉంచామని, ఇప్పటికే నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లింగ్కు పాల్పడుతున్న 35 మందిని గుర్తించినట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల డివిజన్ ఇన్చార్జ్ ఫారెస్టు అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గుర్తించిన వారిలో 10 మందిపై పీడీయాక్ట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన అహోబిలం అటవీ సెక్షన్లోని బోరింగ్ రస్తా, ఊట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేష్ క్యాంపులతో పాటు అహోబిలం పారెస్టు కార్యాలయం, నర్సాపురం చెక్ పోస్టును తనిఖీచేశారు. తర్వాత రుద్రవరం అటవీ కార్యాలయం అవరణలోని నర్సరీని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల డి. వనిపెంట సెక్షన్లోని ముత్యాల పాడు గ్రామానికి చెందిన స్మగ్లర్ మస్తాన్ వలిని పీడీయాక్ట్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. జిల్లాలో పారెస్టుకు సంబంధించి 1500 కేసులు నమోదు కాగా వాటిలో ఎర్రచందనం కేసులు 500 ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో నిందితులైన 453 మందిని ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. అటవీ సంపదను కాపాడుకునేందుకు నంద్యాల డివిజన్ పరిధిలోని బండిఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల, చెలిమ, రుద్రవరం ఫారెస్ట్ రేంజ్లలో 144 సెక్షన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. నల్లమల అటవీలో 12 పులులను గుర్తించామని చెప్పారు. బేష్ క్యాంపుల్లో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించక పోతే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట రేంజ్ అధికారి రామ్సింగ్తో పాటు అటవీ అధికారులు ఉన్నారు. -
విలన్గా కూడా చేస్తా!
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అనూప్ తేజ్ రచ్చ గెలిచారు. ఇప్పుడు ఇంట గెలవడానికి సిద్ధమయ్యారు. తమిళంలో మూడు చిత్రాల్లో కథానాయకునిగా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అనూప్ తెలుగులో ‘కేక’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ యువహీరో నటించిన ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ ఈ 13న విడుదల కానుంది. ‘యామినీ చంద్రశేఖర్’, ‘నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా’లో కూడా నటించారు అనూప్. హీరో కాకముందు నృత్యశిక్షణాలయాన్ని నడిపానని, ఇప్పుడు నటన మీదే దృష్టి సారించానని అనూప్ చెప్పారు. కథ బాగుంటే రెండో హీరోగా, విలన్గా కూడా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. -
భయం వద్దు.. భవిత మనదే
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ సమీక్షలు జరిగాయి. పార్టీ అధికారంలోకి రాలేదన్న నిరాశతో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపి.. భవిష్యత్తుపై భరోసా కల్పిం చేందుకు నాయకులు ప్రయత్నించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు సేకరించింది. కమిటీ సభ్యులైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, మరో నాయకుడు గుడివాడ అమర్నాథ్లు స్థానిక వైఎస్సార్ కల్యాణ మండపంలో శనివారం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిం చారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో ఓటమికి కార ణాలను, పార్టీ నేతల పాత్రను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి దోహదం చేసిన అంశాలనూ తెలుసుకున్నారు. అభ్యర్థులతోపాటు మండలస్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలుసేకరించారు. రోజంతా సాగిన ఈ సమీక్షల్లో ఒక్కో నియోజకవర్గం తరఫున 50 నుంచి 70 మంది కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై నిశితంగా సమీక్షించారు. అభ్యర్థుల పని తీరు, ప్రచారాల తీరు, ఇతర నేతల పాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఏ విషయాల్లో వెనుకబడ్డాం, ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలపై లోతుగా చర్చించి వాస్తవాలను సేకరించారు. భవిష్యత్తుకు ప్రణాళిక మరోవైపు పార్టీ భవిష్యత్తు గురించి కూడా చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి సూచనలు స్వీకరించారు. భవిష్యత్తు మనదేనన్న ధీమాతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. జగన్మోహన్రెడ్డి పార్టీని మరింత పటిష్టంగా ముందుకు నడిపిస్తారని, ఇందుకు రంగం సిద్ధమైందని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడే అవకాశం లభించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై దృష్టి సారించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమీక్షల్లో అందిన సూచనలు, అభిప్రాయాలతో పూర్తిస్థాయి నివేదికను పార్టీ అధ్యక్షుడు జగన్కు అందజేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. వీటి ఆధారంగా ఆయన రాజమండ్రిలో జూన్ 4,5,6 తేదీల్లో జిల్లాల వారీ సమీక్షలు నిర్వహిస్తారని వివరించారు. స్థైర్యం నింపిన సమీక్షలు ఈ సమీక్షలతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. మొహమాటాలకు తావు లేకుండా నిక్కచ్చి అభిప్రాయా లు చెప్పాలని కమిటీ సభ్యులు ముందే స్పష్టం చేయడంతో పలు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో జరిగిన సమన్వయ లోపాలు, ప్రత్యర్థి పార్టీ చేసిన కుట్రలు, క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించడంలో నేతల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, పాలకొండ, పాతపట్నం, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల అభ్యర్ధులు దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, నర్తు రామారావు, గొర్లె కిరణ్కుమార్, పార్టీ సీజీసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్కుమార్, మహిళా విభాగం సభ్యురాలు కామేశ్వరి, ఇతర ముఖ్య నేతలు వై.వి.సూర్యనారాయణ, గొండు కృష్ణమూర్తి, మార్పు ధర్మారావు, పాలవలస విక్రాంత్, కిల్లి వెంకటసత్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, పేరాడ తిలక్, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పవన్కల్యాణ్పై కేసు నమోదు
డిచ్పల్లి, సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎస్సై చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం డిచ్పల్లి, నిజామాబాద్కు చెందిన న్యాయవాదులు రవికుమార్, మధు నిజామాబాద్ రెండో అదనపు జ్యుడిషియల్ కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పవన్కల్యాణ్పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ డిచ్పల్లి పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 506 కింద కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. -
కిరాయి పాలనా.. సొంత పాలనా?
తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి: కేసీఆర్ హైదరాబాద్: కిరాయి పాలనా.. సొంత పాలనా?.. ఏదీ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణకు పట్టిన శనిగా అభివర్ణించారు. ఉద్యమం నుంచి వచ్చిన టీఆర్ఎస్కే సీఎం పోస్టును అడిగే అర్హత ఉందని కాంగ్రెస్కు చురకలంటించారు. అసెంబ్లీకి 69 మంది అభ్యర్థులతో కూడిన పార్టీ తొలి జాబితాను శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో నలిగారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొందరు రంగులు మార్చి ప్రజలను ఏమార్చడానికి వస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘తెలంగాణను కబళించడానికి వచ్చిన చంద్రబాబు ఉద్యమ ద్రోహి. ఆయన చివరి వరకు తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరాయి పాలనలో ఉంది. మళ్లీ ఇప్పుడు కొంత మంది కిరాయి మనుషులు వస్తున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కిరాయి పాలన కావాలో, సొంత పాలన కావాలో తే ల్చుకోవాల్సిన సమయం వచ్చింది’ అని కేసీఆర్ అన్నారు. తొలి జాబితాలో వుుస్లిం అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం ఇవ్వకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ.. గతంలో రెండు సార్లు వుహబూబ్నగర్లో టిక్కెట్ ఇస్తే ఓడించారని, బోధన్లో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. అందుకు వుుస్లింలే కారణవూ? అన్న ప్రశ్నకు... ఆయున కాదా? అని ఎదురు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ముఖ్య నేతల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఖరారైన ఎంపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. ఎక్కడ.. ఎవరు?: మెదక్ - కె.చంద్రశేఖర్రావు, జహీరాబాద్ - బి.బి.పాటిల్, నిజామాబాద్ - కె.కవిత, మహబూబ్నగర్ - ఎ.పి.జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు - మందా జగన్నాథం, కరీంనగర్ - బి.వినోద్కుమార్, వరంగల్- కడియం శ్రీహరి, మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాం నాయక్, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్, నల్లగొండ - రాజేశ్వర్ రెడ్డి, చేవెళ్ల - కె.విశ్వేశ్వర్ రెడ్డి -
‘పుర’పోరు రసవత్తరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కొత్తగా నగరపంచాయతీ కావడం.. వీటి పరిధిలో నాలుగు గ్రామాలుండడంతో ఆసక్తికర పోటీ నెలకొంది. పార్టీల తరఫున చైర్మన్ అభ్యర్థులు ఖరారు కానప్పటికీ ఎవరికి వారు చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 20 వార్డుల్లో దాదాపు మెజారిటీ స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. సీతారాంపేట్, ఖానాపూర్, శేరిగూడ గ్రామాల్లో అభ్యర్థుల సంఖ్య పెద్దగా లేనప్పటికీ.. ఇబ్రహీంపట్నంలో మాత్రం ప్రతి వార్డులోనూ ఆసక్తికర పోరు సాగుతోంది. 12వ వార్డు జనరల్కు రిజర్వ్ కావడంతో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు బరిలో దిగారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున మాజీ జెడ్పీటీసీ భర్త యాలాల యాదయ్య, టీడీపీ రాష్ట్ర నేత చంద్రశేఖర్లతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా ఏడో వార్డులోనూ టీడీపీ తరపున పోటీలో ఉన్నారు .రాములుతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా జోష్ మీదున్నారు. మిగిలిన వార్డుల్లోనూ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకే ప్రచారాన్ని ప్రారంభిస్తున్న అభ్యర్థులు.. సాయంత్రం రెండోవిడత ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో మధ్యాహ్నం సమయంలో సైతం ప్రచారానికి అభ్యర్థులు వెనకడుగేయడం లేదు. మహిళా అభ్యర్థుల ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. పూలు, కుంకుమబొట్లతో విన్నూతంగా, సంప్రదాయబద్దంగా కొత్తరకమైన ప్రచారానికి తెరతీశారు. తాండూరులో ఇంటిపోరు మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో రెబల్స్ బరిలో ఉండటం అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. పలు వార్డుల్లో టీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన పలువురు తిరుగుబాటు బాట పట్టారు. ఓ వార్డులో సొంత అన్నదమ్ములు పోటీపడుతున్నారు. 18 వార్డులో కాంగ్రెస్ నుంచి సయ్యద్ముజీబ్ హుస్సేన్, ఆయన తమ్ముడు తమ్ముడు జాకీర్ హుస్సేన్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక 21వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపున హన్మంతు పోటీ చేస్తుండగా... ఆ పార్టీ రెబెల్ అనిల్సింగ్ కయ్యానికి కాలుదువ్వారు. కొన్ని కారణాల వల్ల బీ-ఫారం హన్మంతుకు దక్కడంతో పట్టువదలని అనిల్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దూకారు. 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అలీం పోటీచేస్తుండగా... రెబల్గా మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ పోటీలో ఉన్నారు. 12వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తయ్యగౌడ్ కొడుకు జి.సుదర్శన్గౌడ్కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. ఇక్కడ పార్టీ వెంకటేశంకు బీ-ఫారం ఇవ్వడంతో సుదర్శన్గౌడ్ రెబల్గా పోటీపడుతున్నారు. 15వ వార్డు నుంచి కాంగ్రెస్ బీ-ఫారం మాజీ కౌన్సిలర్ లయఖ్ఫాతిమాకు దక్కడంతో ఈ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రఫిఖ్ఖాన్ కూడా పోటీలో ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద మున్సిపాలిటీలో రెబల్స్ జోరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వికారాబాద్లో ఇంటిపోరు... వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు బరిలో నిలిచిన అన్ని పార్టీల్లోనూ ఇంటిపోరు ఎక్కువైంది. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కని వారంతా రెబల్స్గా మారి ప్రత్యర్థుల గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఎక్కువగా కన్పిస్తోంది. టీఆర్ఎస్లో సైతం నేతలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి కన్పించడం లేదు. దాదాపు 14 వార్డుల్లో రెబల్స్ అసలు అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు. -
చంద్రబాబుది నరకాసుర పాలన
జంగారెడ్డిగూడెం, న్యూస్లైన్ :చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన నరకాసురుని పాలనను తలపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం జంగారెడ్డిగూడెంలోని తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసిందన్నారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీరు కోసం రైతులు, ప్రజలు అల్లాడిపోయారన్నారు. తానేదో గొప్ప పాలన సాగించినట్లు నేడు ప్రజాగర్జనలు పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు గుప్పిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సమయంలో జగన్మోహన్రెడ్డిని సైకోగా వర్ణించారని, అయితే విపరీత స్వభావం కలిగిన భయంకరమైన సైకో చంద్రబాబే అన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళన చేస్తున్న రైతులను తుపాకులతో కాల్పించారని, అలాగే సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. అలాగే దగ్గరకు చేరదీసి ఎంతో నమ్మకంతో తన కూతురినిచ్చి పెళ్లి చేసిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన మహాఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో, రైతులకు, పేదలకు ఏం మేలు చేశారో నిజాయితీతో చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్సార్ అయితే, నమ్మకద్రోహానికి మారుపేరు చంద్రబాబు అన్నారు. రెండుకళ్ల సిద్దాంతంతో నేటి రాష్ట్ర పరిస్థితికి కారణమయ్యారన్నారు. కిరణ్కుమార్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తూ ప్రజలపై పన్నుల మీద పన్నులు విధిస్తున్నారన్నారు. వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనికి చంద్రబాబు కూడా కారకుడే అన్నారు. కిరణ్కుమార్రెడ్డి ప్రజల మధ్యకు వస్తే తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని బాలరాజు విమర్శించారు. వైఎస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో అందని వారు ఎవరూ లేరన్నారు. కాని కిరణ్పాలనలో పథకాలకు కొత్తపేర్లు పెడుతూ, తానేదో ప్రజాకర్షణ పథకాలను అమలు చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్కు జవసత్వాలు అందించిన వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేసింది టీడీపీతో కుమ్మక్కైన నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. సోనియా అనాలోచిత చర్యల వల్లే రాష్ట్రం విడిపోయే దుస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగాఉంచేందుకు జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్చౌదరి, కొయ్యరాజారావు రెడ్డి, రావూరి కృష్ణ, అచ్యుత రామయ్య, మిడతా రమేష్, బాలస్వామి, బి.వెంకటేశ్వరరావు, కేమిశెట్టిమల్లిబాబు, మంగా రామకృష్ణ, రాఘవరాజు ఆదివిష్ణు, పాములపర్తి శ్రీనివాసరావు, ముప్పిడి అంజి, పాటిబండ్ల సుదర్శనం పాల్గొన్నారు. -
కాటేసిన కరెంట్
డిచ్పల్లి, న్యూస్లైన్: డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, స్థాని కుల వివరాల ప్రకారం... మండల వ్యవసాయశాఖలో పనిచేసే కిషన్ ఇంట్లో విద్యుత్ సర ఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక జేఎల్ఎంకు ఆయ న ఫోన్ చేశాడు. జేఎల్ఎం స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా సరిచేయాల్సి ఉండగా, స్థానిక యువ కుడు, ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న హమాలీ శ్రీనివాస్ (23)ను పిలిచి స్తంభంపైకి ఎక్కించాడు. సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కి విద్యుత్ సర్వీస్ వైరును సరిచేస్తుం డగా, అదే స్తంభానికి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు శ్రీనివాస్ చేతికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కిందనున్న విద్యుత్ వైర్లపై పడి విలవిల్లాడుతూ కొట్టుకోసాగాడు. వెంటనే స్థానికులు గమనించి ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని కిందికి దించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్లో ప్రాణం ఉందేమోనని ప్రయత్నించినా లాభం లేకపోయింది. వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్న ట్రాన్స్కో సిబ్బంది తాము చేయాల్సిన పనిని ఇతరుల చేత చేయిస్తూ అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి తగిన నష్టపరిహారం ఇవ్వాలని, అప్పటి వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేది లేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అందోళనకు దిగారు. పది రోజుల క్రితమే మృతుడి తండ్రి హమాలీ సాయిలు అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అంతలోనే కొడుకు మృతిచెందడంతో ఆ కుటుం బంలో పుట్టెడు విషాదం నెలకొంది. శ్రీనివాస్కు తల్లి భూదవ్వ, అన్న సాగర్, అక్కలు సుమలత, కళావతి ఉన్నారు. -
దర్శకుడు బీరం మస్తాన్రావు కన్నుమూత
సీనియర్ దర్శకుడు బీరం మస్తాన్రావు(70) మంగళవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు. కృష్ణ, శ్రీదేవి నటించిన ‘బుర్రిపాలెం బుల్లోడు’తో దర్శకునిగా పరిచయమైన ఆయన... ఎన్టీఆర్తో ‘ప్రేమ సింహాసనం’ చేశారు. అటుపై విప్లవ శంఖం, తల్లి గోదావరి మొదలగు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, జయశ్రీ జంటగా నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పలు టీవీ సీరియళ్లను కూడా తెరకెక్కించిన మస్తాన్రావు, కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ‘రైల్వే కూలీ’లో విలన్గా చేశారు. త్వరలో విడుదల కానున్న ‘యామినీ చంద్రశేఖర్’ చిత్రంలో కూడా ఆయన నటించారు. మస్తాన్రావు తొలి భార్య నవీనలక్ష్మి 2005లో కన్నుమూశారు. దీంతో చిన్ననాటి స్నేహితురాలైన దేవీని మస్తాన్రావు ద్వితీయ వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో స్థిరపడిన బీరం మస్తాన్రావు రెండు నెలల క్రితం చెన్నై వెళ్లారు. అక్కినేని అంత్యక్రియలను టీవీలో చూస్తూ బాధతో గుండెపోటుకు గురయ్యారని,ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆసుపత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం చెన్నైలో శ్మశాన వాటికలో జరగనున్నాయి. -
రొటీన్కు భిన్నంగా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : లోకల్ మేనిఫెస్టో.. ఓటర్ల నమోదులో భాగస్వామ్యం.. ఎస్ఎంఎస్ క్యాంపెయిన్. మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నంగా తోట చంద్రశేఖర్ చేపట్టిన కార్యక్రమాలివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకునిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వినూత్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతూ ఆకర్షిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నిపార్టీల నాయకులు సాధారణంగా సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తారు. చంద్రశేఖర్ వాటితోపాటు విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నారు. లోకల్ మేనిఫెస్టో తాజాగా ఆయన ప్రకటించిన లోకల్ మేనిఫెస్టో పూర్తిగా భిన్నంగా కనబడుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను జాతీ య, రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోల పేరుతో విడుదల చేస్తాయి. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో కేజ్రీవాల్ నియోజకవర్గ మేనిఫెస్టోలు ప్రకటించారు. అదే తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేయడానికి చంద్రశేఖర్ కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలో నిర్ణయించేందుకు భారీస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల 745 గ్రామాల్లో అభిప్రాయ సేకరణ కోసం నమూనాను రూపొందిం చారు. మూడు ప్రశ్నలతో కూడిన నమూనా ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా జనం ముందుకు తీసుకెళ్లి వారితో పూర్తి చేయించి తిరిగి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభిప్రాయాలు, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రశ్నలు ఈ నమూనాలో ఉన్నాయి. అభిప్రాయ సేకరణ అనంతరం వాటిన్నిం టినీ క్రోఢీకరించి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల సమస్యలపై చర్చ జరిగే అవకాశం కలుగుతుందని చంద్రశేఖర్ అంటున్నారు. 25 వేల కొత్త ఓటర్ల నమోదు ఓటర్ల నమోదు కార్యక్రమంలోనూ చంద్రశేఖర్ కీల కంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదులో పాల్గొంటున్నా అది నామమాత్రమే. చంద్రశేఖర్ మాత్రం ఇందుకోసం రెండు నెలల నుం చి ప్రత్యేకంగా పనిచేస్తూ బూత్కమిటీల ద్వారా ఓట ర్ల నమోదు చేయించారు. ప్రతి బూత్ కమిటీకి ఒక వలంటీర్ను అప్పగించి.. వారికి ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించి గ్రామాల్లోకి పంపారు. వారు ఓటు హక్కులేని వారిని గుర్తించి, పత్రాలు నింపి, తహసిల్దార్ కార్యాలయాలకు తీసుకెళ్లి ఓటర్లుగా చేర్పించారు. నియోజకవర్గమంతా ఓటర్ల నమోదుపై అవగాహన కోసం పోస్టర్లు సైతం వేయించారు. ఓటు హక్కు లేని వారు దానిని పొందాలని కోరుతూ ప్రజలకు ఎస్ఎంఎస్లు పంపించారు. ఇలా చంద్రశేఖర్ స్వయంగా పార్టీ బూత్ కమిటీ సభ్యుల ద్వారా 25 వేల కొత్త ఓటర్లను చేర్పించడం విశేషం. ఈ కార్యక్రమం కొనసాగుతోంది. -
కాంగ్రెస్కు ఎందుకు ఓటెయ్యాలి?
టి.నరసాపురం, న్యూస్లైన్ : విభజన కుట్రతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. టి.నరసాపురంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్కు పట్టాభిషేకం కోసం సోనియా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పనులు చేస్తానన్నా ప్రజలు ఆయనను విశ్వసించరని స్పష్టం చేశారు. ఇప్పుడు మహిళలకు రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వడమే మానేశాయని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎప్పుడూ ఇది చేస్తానని చెప్పలేదని, చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రికాగానే 68 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని గుర్తుచేశారు. జగన్మోహన్రెడ్డి రైతులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఏం చేయాలో ఇప్పటికే స్పష్టత కలిగి ఉన్నారన్నారు. త్వరలోనే మరిన్ని కొత్తపథకాలతో పార్టీ మ్యానిఫెస్టో విడుదల కాబోతుందని తెలిపారు. అదంతా ఎల్లోమీడియా సృష్టే వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని సర్వేలు వెల్లడిస్తుంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎల్లోమీడియా కావాలనే దుష్ర్పచారం చేస్తోందని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరిన్ని జిమ్మిక్కులు చేస్తాయన్నారు. సమైక్యాంధ్రలోనే ఎన్నికలు జరుగుతాయని, సునాయాసంగా వైసీపీ 200 సీట్లుపైనే సాధించడం ఖాయమని చెప్పారు. కార్యకర్తలు వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా పోలవరం నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతానని తోట చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీలు వారి వ్యాపారాలను పెంచుకున్నారే గాని, ప్రజా సేవను విస్మరించారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల భరతం పట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండలంలోని వైసీపీ బలపర్చిన సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సభకు మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య అధ్యక్షత వహించగా రాష్ట్రయువజన కమిటీసభ్యుడు బీవీఆర్చౌదరి, తాడికొండ మురళీ, ఆరేటి సత్యనారాయణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి, టి.నరసాపురం మండల నాయకులు కాశీరాజు, శ్రీనురాజు, కాల్నీడి రాంబాబు, శ్రీనివాసరెడ్డి, యర్రా గంగాధరరావు, దాసరి దేవానంద్, మల్లిబాబు, పొటేలు సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత తెడ్లెం నుంచి టి.నరసాపురం వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం గడపగడపకు వైసీపీ నిర్వహించారు. -
నేడు పోలింగ్
సాక్షి, గుంటూరు: జిల్లాలో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ జరగనుంది. నాలుగు పంచాయతీలు, 29 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ పోలింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు అప్పగించారు. ఎన్నిక ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం పోలింగ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఆయా గ్రామాలకు చేరుకుంది. అసలు ఆరు పంచాయతీలు, 45 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు ఖరారయ్యాయి. ముత్తాయపాలెం, రామచంద్రపురం పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు నేడు పోలింగ్ కాలేదు. పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, ముప్పాళ్ళ మండలంలో కుందూరివారిపాలెం, పొన్నూరు మండలంలోని కసుకర్రు, మంగళగిరి మండలంలోని బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే నాలుగు పంచాయతీల్లో ఆయా మండలాల తహశీల్దార్లు గ్రామాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టరు సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ 144 సెక్షన్ అమలు చేయాల్సి వస్తే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో తహశీల్దార్లు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. -
పాస్టర్పై దాడి ఘటనను ఖండించిన క్రైస్తవులు
వికారాబాద్, న్యూస్లైన్: వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి సియోన్ చర్చిలో గుర్తుతెలియని దుండగులు పాస్టర్ సంజీవులపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాడిని నిరసిస్తూ ఆదివారం క్రైస్తవులు వికారాబాద్లోని సియోన్ చర్చి నుంచి పట్టణంలోని ఎంఆర్పీ, బీజేఆర్, ఎన్టీఆర్ చౌరస్తాల మీదుగా భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిందుతులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పాస్టర్పై దాడి చేసిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు దురదృష్టకరం అన్నారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. పాస్టర్పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఇప్పటికే ముగ్గురు సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుశ్చర్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. త్వరలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఘటనలో ప్రస్తుతం ఎవరూ సాక్షులు లేరని, పాస్టర్ భార్య ఓ దుండగుడిని చూసిందని, ఆమె ప్రస్తుతం షాక్లో ఉందన్నారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని ఎస్పీ రాజకుమారి సూచించారు. శాంతియుతంగా ఉండి కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. అనంతరం పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. దుండుగులు ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమని అన్నారు. పాస్టర్పై దాడి చేసిన దుండగులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. పాస్టర్లు నీతిని ప్రభోదిస్తారని, వారికి కీడు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు రెవరెండ్ కృపావరం, హైకోర్టు న్యాయవాది శ్రీని సుందర్, ఎలియాజర్, ఏసుదాసు, కృపానందరావు, సుదర్శన్, జైపాల్, రవి, జోసెఫ్, సైనస్, జె. ఎలియాజర్, కుమార్, దేవదాసు, మోహన్, దేవదానం, ఉదయ్కుమార్, ప్రవీణ్, దేవదాసు తదితరులు ఉన్నారు. స్తంభించిన ట్రాఫిక్ పాస్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ క్రైస్తవులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ దాదాపు అర్ధగంట సేపు పూర్తిగా స్తంభించింది. అనంతరం పోలీసులు వాహనాలను నియంత్రించారు. -
నవంబర్ 1 సీమకు చీకటి దినం
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీ రాయలసీమ చరిత్రలో చీకటి దినమని రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని ఆ రోజు హైదరాబాద్కు తరలించడంతోనే సీమకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. శుక్రవారం ఆర్పీఎస్ఎస్ఎఫ్, టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ ఎస్టేట్ నుంచి కలెక్టరేట్ వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్పీఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, టీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ చంద్రప్ప ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడారు. రాయలసీమ వాసుల త్యాగంతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజధానిని కర్నూలుకు కేటాయించాలని కోరుతూ తక్షణమే అన్ని రాజకీయ పార్టీలూ లేఖలు ఇవ్వాలని కోరారు. రాజధాని చేయలేకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సైన్స్ సిటీ, మదనపల్లిలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీను, రాజు, రవి, జనార్ధన్, వినయ్ పాల్గొన్నారు. -
సీబీఐ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్
హైదరాబాద్ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గురువారం హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ముంబై సీబీఐ విభాగంలో చంద్రశేఖర్ ఎస్పీగా విధులు నిర్వహించారు. సీబీఐ డీఐజీగా విధులు నిర్వహించిన హెచ్.వెంకటేష్ డిప్యుటేషన్ గడువు ముగియడంతో మరో వారం రోజుల్లో సొంత కేడర్ కేరళకు తిరిగి వెళ్లనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ప్రధాన దర్యాప్తు అధికారిగా వెంకటేష్ ఉన్నారు. వాస్తవానికి ఆయన డిప్యుటేషన్ ఈ ఏడాది జూలై 16తో ముగిసింది. అయితే జగన్ కేసు దర్యాప్తు కారణంగా ఆయన డిప్యుటేషన్ను పొడిగించారు. కాగా 2009లో సీబీఐలోకి ఎస్పీగా డిప్యుటేషన్పై వచ్చిన వెంకటేష్కు ఈ ఏడాది మొదట్లో డీఐజీగా పదోన్నతి లభించింది. -
కాంగ్రెస్లో చేరిన విజయరామారావు, రఘునందన్
న్యూఢిల్లీ: టిఆర్ఎస్కు రాజీనామా చేసిన గుండె విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దిగ్విజయ్ సింగ్ వారి భుజాలపై పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్కు రాజీనామ చేసిన రోజునే చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు మెదక్ ఎంపి విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ఓ పక్క ఏఐసిసి అధ్యక్షురాలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఆమె వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్లను కలిశారు. ఈ నేపధ్యంలో ముందుగా వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.