africa
-
వన్యప్రాణులతో హాయ్.. హాయ్
ఠీవిగా నడిచే సింహం...మెడ సాగదీసే జిరాఫీ,.. ఘీంకరించే ఏనుగులు...గాల్లో బెలూన్లను అందుకునే డాల్ఫీన్స్... ఇలా వివిధ రకాల జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో దగ్గరగా వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఇండోనేసియా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవేకాక... చిన్నారులను సైతం ఆకట్టుకునేలా సెంట్రల్జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నాజిప్లైన్, గోకార్ట్ వంటివి ఏర్పాటు చేసింది.సాక్షి, అమరావతి: వన్యప్రాణి పర్యాటకంపై ఇండోనేసియా దృష్టి సారించింది. ప్రకృతి ఒడిలోకి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆసియాలో... ఆఫ్రికాను పోలిన సఫారీ అనుభవాన్ని అందిస్తోంది. వీసా నిబంధనలను సైతం సరళతరం చేసింది. 2025 నాటికి కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది లక్ష్యం. ఈక్రమంలో భారతీయ మార్కెట్పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత్తో సహా 97 దేశాలకు చెందిన ప్రయాణికులు ఆన్లైన్లో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై ఈ–వీసా ఆన్ అరైవల్స్లో ఇండోనేసియా చుట్టిరావచ్చు. వాస్తవానికి ఇండోనేసియా ఇన్»ౌండ్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్–2024 డేటా ప్రకారం ఇండోనేసియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 7.10 లక్షలకు చేరుకుంది. ఇది గతేడాదికంటే 17.20 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. కుటుంబంతో సహా విహార, సాహస యాత్రలు, బీచ్ అందాలు, సాంస్కృతిక పర్యటనల సమ్మేళనంతో ఇండోనేసియా భారతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలోనే ‘తమన్ సఫారీ’ ఒక ప్రధాన వన్యప్రాణుల గమ్యస్థానంగా మారింది. కంగారూలూ కనిపిస్తాయితమన్ సఫారీ ప్రిజెన్లో ప్రయాణికులకు ఆ్రస్టేలియా వన్యప్రాణులను పరిచయం చేస్తుంది. కంగారూలు, వొంబాట్స్, ఈములతో పాటు త్వరలో కోలాస్ వంటి జంతువులు సందర్శించవచ్చు. ఇక్కడ చిన్నచిన్న ఏటీవీ వాహనాల్లో సాహస యాత్రలు కూడా చేయవచ్చు. సెంట్రల్ జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నా జిప్లైన్, గోకార్ట్ వంటివి చిన్నారులకు మంచి అనుభవాలను అందిస్తున్నాయి. సింహాలను చూస్తూ భోజనం చేయవచ్చు. తమన్ సఫారీ బాలిలో కొమోడో డ్రాగన్లు, ఒరంగుటాన్లు (కోతిజాతి), స్టార్లింగ్ పక్షుల అందాలను వీక్షించొచ్చు. ప్రిడేటర్ ఫీడింగ్ సెషన్లు, జీప్ సఫారీలు వంటి సాహస యాత్రలు ఉంటాయి. నీటి కింద భోజనం చేస్తూ వరుణ షో, అగుంగ్షోల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సంస్కృతి ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. జకార్తా అక్వేరియం సఫారీలో మెరై్మడ్ షోలు, అక్వాట్రెక్కింగ్, అండర్ వాటర్ ఫాంటసీ డైనింగ్లు ఉంటాయి. వీటితో సఫారీల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలను అందిస్తున్నాయి. సందర్శకులకు మొక్కల ఆధారిత వంటకాలనూ అందిస్తున్నాయి.ఆకట్టుకుంటున్న బహుళ సఫారీ పార్కులు వివిధ దేశాల్లో ఉన్న జూ మాదిరిగా కాకుండా ఆఫ్రికా తరహాలో జంతువుల మధ్య వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ‘తమన్ సఫారీ’ సాహస యాత్రను తలపిస్తోంది. ఇక్కడ జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో వీక్షించవచ్చు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇండోనేసియా... ప్రధాన విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలకు సమీపంలోనే సఫారీలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇండోనేసియాలో బహుళ సఫారీ పార్కుల యాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తమన్ సఫారీ బోగోర్ (పశ్చిమ జావా), తమన్సఫారీ ప్రిజెన్ (తూర్పు జావా), తమన్ సఫారీ బాలి, సోలో సఫారీ (సెంట్రల్ జావా), జకార్తా అక్వేరియం సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నైట్ సఫారీ..24 గంటలూ సాహసం! ఇండోనేసియా సఫారీల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తమన్ సఫారీ బోగోర్ 24 గంటల పాటు వన్యప్రాణుల మధ్య సాహసయాత్రలను నిర్వహిస్తోంది. అందుకే అత్యధిక సందర్శకులు దీనికే క్యూ కడుతున్నారు. ప్రయాణించే వాహనంలో భోజన సదుపాయాలు సైతం కల్పిస్తుండటంతో రోజంతా చుట్టిరావచ్చు. సింహాలు, జిరాఫీలు, ఏనుగులతో పాటు వివిధ దేశాల జంతువులను చూడొచ్చు. దీనికి తోడు డాల్ఫీన్లతో ఈతకొట్టడం, పెంగ్విన్లకు ఆహారం అందించడం వంటి అనుభవాలు పొందవచ్చు. ముఖ్యంగా పర్యాటకులు రాత్రిపూట కూడా వన్యప్రాణులను చూసేలా నైట్ సఫారీ ఉంది. అక్కడే రిసార్టుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. -
ఆఫ్రికాను చీలుస్తూ... ఆరో మహాసముద్రం
మహాసముద్రాలు ఐదు అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆరు అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీలుస్తూ శరవేగంగా ఆరో మహాసముద్రం పుట్టుకొస్తోంది. ఆ క్రమంలో అక్కడి పలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నింటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది. ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇది తప్పదన్నది తెలిసిన విషయమే అయినా, అందుకు కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆరో మహాసముద్రం ఆవిర్భావానికి మహా అయితే కొన్ని వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు!టెక్టానిక్ ఫలకాల కదలికల కారణంగా ఆఫ్రికా ఖండం నిలువునా చీలిపోతోంది. వేలాది ఏళ్లుగా స్థిరంగా జరుగుతూ వస్తున్న ఈ పరిణామం కొంతకాలంగా అనూహ్య రీతిలో వేగం పుంజుకుంది. ఆఫ్రికా ఖండం దిగువన నుబియన్, సోమాలీ, ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లలో జరుగుతున్న కదలికలే దీనికి ప్రధాన కారణం. అవి ఏటా ఏకంగా దాదాపు ఒక సెంటీమీటర్ మేరకు దూరం జరుగుతున్నాయి! ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టం (ఈఏఆర్ఎస్)గా పిలిచే ఈ ప్రాంతం ఇది మొజాంబిక్ నుంచి ఇథియోపియా, కెన్యా, టాంజానియా మీదుగా ఎర్రసముద్రం దాకా వేలాది కిలోమీటర్ల మేర విస్తరించింది. దాని పొడవునా భూగర్భంలో వేలాది ఏళ్లుగా అతి నెమ్మదిగా సాగుతూ వస్తున్న నిరంతర టెక్టానిక్ కదలికల పరిణామం కొన్నాళ్లుగా స్పీడందుకుంది. తూర్పు ఆఫ్రికాను నిలువునా చీలుస్తోంది. ఫలితంగా చివరికి తూర్పు ఆఫ్రికా క్రమంగా మిగతా ఖండం నుంచి పూర్తిగా విడిపోనుంది. వాటి మధ్య ఏర్పడే ఖాళీలో ఏకంగా 10 వేల బిలియన్ గ్యాలన్ల పై చిలుకు అపార జలరాశి నిండిపోయి సరికొత్త మహాసముద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నిదర్శనాలు ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇథియోపియాలో 2005 నాటికే ఏకంగా 60 మైళ్ల పొడవున లోతైన గుంత ఏర్పడింది. ఇది పలుచోట్ల ఏకంగా 20 మీటర్ల పై చిలుకు లోతుంది! 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగుళ్లు పుట్టుకొచ్చాయి. కారణాలెన్నో... టెక్టానిక్ కదలికలతో పాటు భూమి లోపలి పొరల్లోని శిలాజ ద్రవం తూర్పు ఆఫ్రికా చీలికను మరింత వేగవంతం చేస్తోంది. క్రమంగా లోపలి పొర పూర్తిగా పగుళ్లిచ్చి భారీ లోయల పుట్టుకకు దారితీస్తుంది. అగి్నప్రమాద కార్యకలాపాలను పెంచుతుంది. 2005లో ఇథియోపియాలో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఏకంగా 420కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఈ పరిణామం సైంటిస్టులతో పాటు పరిశోధకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆఫ్రికా ఖండం దిగువ భూ ఫలకాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని వారంటున్నారు. ఇకపై ఆఫ్రికాలో మరిన్ని భూకంపాలు, అగి్నపర్వతాల పేలుళ్ల వంటి పరిణామాలను చూడనున్నామని తులానే వర్సిటీ జియో సైంటిస్టు సింథియా ఎబింగర్ చెప్పుకొచ్చారు. అట్లాంటిక్ ఇలాగే పుట్టింది... మహాసముద్రాల్లో వయసురీత్యా అట్లాంటిక్ అన్నింటికంటే చిన్నది. ప్రస్తుత ఆఫ్రికా ఖండం తరహా పగుళ్లే లక్షలాది ఏళ్ల క్రితం దాని పుట్టుకకు దారితీసినట్టు సైంటిస్టులు చెబుతారు. తర్వాత మళ్లీ ఇంతకాలానికి మరో మహాసముద్రం పుట్టుకకు దారి తీయగల స్థాయిలో ఓ ఖండం నిలువునా చీలుతోంది. మహాసముద్రాల ఆవిర్భావ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది చాలా అరుదైన అవకాశమని సైంటిస్టులు అంటున్నారు.కొత్త ఖండం కూడా... ఆఫ్రికా చీలిక ఆరో మహాసముద్రంతో పాటు కొత్త ఖండం పుట్టుకకు కూడా దారితీయనుంది. ఎందుకంటే సోమాలియా, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా నుంచి పూర్తిగా విడిపోతాయి. ఆరో సముద్రం ఆ మధ్యలో విస్తరిస్తుంది.లక్షల్లో నిర్వాసితులు... వాతావరణ మార్పుల దెబ్బకు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఆ ఖండంలో ఏర్పడుతున్న చీలిక వల్ల పలు దేశాల్లో జీవజాలం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో మొత్తంగా వాటి ఆర్థిక పరిస్థితులే తారుమారు కానున్నాయి. దాంతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే వారి సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోనుంది. కొత్త మహాసముద్రం ఆఫ్రికా భౌగోళిక స్వరూపాన్నే సమూలంగా మార్చనుంది. పలు దేశాల ఆర్థిక, పర్యావరణ, మౌలిక వ్యవస్థలనే తలకిందులు చేయనుంది. చుట్టూ భూభాగాలతో కూడిన జాంబియా, ఉగాండా వంటి దేశాలు కొత్త సముద్ర తీర ప్రాంతాలు మారిపోతాయి. దాంతో కొత్త వర్తక మార్గాలు, ఆ దేశాల్లో నౌకాశ్రయాల వంటివి పుట్టుకొస్తాయి. అలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలే సమూలంగా మారిపోతాయి. సరికొత్త సముద్ర వాతావరణ పరిస్థితులు కొత్త ఆవాస ప్రాంతాలుగా మారతాయి. ఈ పరిణామం జీవవైవిధ్యంలో చెప్పుకోదగ్గ మార్పులకు దారి తీస్తుంది. అదే సమయంలో సముద్రమట్టంలో పెరుగుదల మరింత వేగంపుంజుకుంటుంది. భూభాగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. అంతేగాక పలుచోట్ల తరచుగా తీవ్ర భూకంపాలు సంభవించవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల వచ్చిపడే తీవ్రమైన రిసు్కలను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇప్పటినుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. కొత్త మహాసముద్రం ఆవిర్భావం వేలాది ఏళ్ల తర్వాత జరిగినా ఆ క్రమంలో తలెత్తే పరిణామాలు ఆఫ్రికా ఖండంపై సమీప భవిష్యత్తు నుంచే కొట్టొచ్చినట్టుగా కన్పించడం మొదలవుతుంది. భూగోళం నిరంతరం పరిణామం చెందుతున్న తీరుకు ఈ పరిణామం మరో తాజా ఉదాహరణ. దీని ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలయ్యారు. ఎందుకంటే తూర్పు ఆఫ్రికాలో జరుగుతున్నది కేవలం భౌగోళికపరమైన మార్పు మాత్రమే కాదు. సుదూర భవిష్యత్తులో మరిన్ని ఖండాలు విడిపోయి కొత్త మహాసముద్రాల పుట్టుక వంటివి జరిగి చివరికి మనకిప్పుడు తెలిసిన ప్రపంచమే సమూలంగా, శాశ్వతంగా మారిపోతుందనడానికి తిరుగులేని నిదర్శనం. ఆరో మహాసముద్రం ఆవిర్భావంతో ప్రపంచ భౌగోళిక స్వరూపంతో పాటు పర్యావరణ వ్యవస్థలు కూడా సమూల మార్పులకు లోనవడం ఖాయమని భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్మార్క్గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.ఇక, డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.డింగా డింగా లక్షణాలు..జ్వరం.తలనొప్పి.దగ్గు.ముక్కు కారటం.శరీర నొప్పులు.A mysterious illness locally called 'Dinga Dinga' is rapidly spreading amog women and girls in Uganda's Bundibugyo district, leaving dem dancing and shaking uncontrollably, along with experiencing fever. The illness is treatable with antibiotics. pic.twitter.com/yYEx9unIbR— Common Sense (@keysense_1) December 20, 2024 -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్నగర్కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్కు చెందిన మావటి మైఖేల్తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
వామ్మో మంకీపాక్స్!.. భారత్లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Zambia: 400 కుక్కలు మృతి.. ప్రభుత్వం అప్రమత్తం
ఆఫ్రికా దేశమైన జాంబియాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న 400కు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి. జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన 25 నమూనాలలో ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు. ఈ ఫంగస్ అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవులకు, జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి ఎలిజా ముచిమా మాట్లాడుతూ జాంబియాలోని ప్రజలకు మొక్కజొన్న ప్రధాన ఆహారం. అందుకే ఇది ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ క్యాన్సర్కు కారణమయ్యే విష పదార్థం.జాంబియా ఆరోగ్య శాఖ తాజాగా కలుషితమైన మొక్కజొన్న పంటను గుర్తించి, దానిని నాశనం చేస్తోంది. దేశ జనాభాలో 60 శాతం మందికి మొక్కజొన్న ప్రధాన ఆహారం. ఇటీవలి కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడి మొక్కజొన్న పంటను దెబ్బతీయగా, ఇప్పుడు ఈ ఫంగస్ మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్కు పాకిన మంకీపాక్స్.. ముగ్గురికి పాజిటివ్
ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.పాకిస్థాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. -
ఆఫ్రికాలో పడవ బోల్తా.. 15 మంది మృతి
ఆఫ్రికన్ దేశమైన మారిటానియా సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ సమాచారాన్ని తెలియజేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300 మంది ఉన్నారు. మారిటానియా రాజధాని నౌవాక్చాట్కు సముద్రమార్గంలో పడవ చేరుకుంటున్న సమయంలో అది బోల్తా పడింది. ఈ పడవ ఏడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పడవలో అధికశాతం మంది సెనెగల్, గాంబియన్ ప్రజలు ఉన్నారు.నౌక్చాట్లో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందడం, సముద్రంలో 195 మందికి పైగా జనం గల్లంతుకావడం తమకు చాలా బాధ కలిగించిందని ఐఓఎం ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారిలో 10 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. -
West Africa: పడవ బోల్తా.. 105 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.ఈ ఉదంతం గురించి ఎన్డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.పశ్చిమ ఆఫ్రికా దేశపు మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. -
ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆఫ్రికాలో భారతీయులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 30వ తేదీ ఆదివారం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా దారుసలెమ్ భారతీయ రాయబార కార్యాలయ ఉద్యోగి డాక్టర్ సౌమ్య చౌహన్ ఆధ్వర్యంలో టాంజానియా రాష్ట్రం ఎంబీఈఎఫ్వై టౌన్లో 9వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సౌమ్య చౌహన్ మాట్లాడుతూ.. "యోగా అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఇది అంతర్గత శాంతికి, స్వీయ-ఆవిష్కరణకు, ప్రకృతితో సామరస్యానికి ఒక మార్గం. "అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ తిరువూరు వాసి రామిశెట్టి వెంకట నారాయణ (సత్య) మాట్లాడుతూ ..." ప్రధాని మంత్రి మోదీగారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయలు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు, సమగ్ర ఐక్యతకు యోగ ఒక మంచి సాధనమన్నారు. రోజువారీ ఒత్తుడులు, వ్యక్తిగత జీవితాల తోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. ఈ యోగా అభ్యాసకులలో మానసిక ప్రశాంతతా, ఐక్యత భావాన్ని పెంపొందించి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతుందని యోగ సాధకుడు రోహిత్ పేర్కొన్నారు. (చదవండి: డాలస్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు) -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్పోర్ట్ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?
టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు ఉన్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ గుర్తించింది. దాంతో ఈస్ట్ఆఫ్రికాలోని టాంజానియాలో ‘కేజీఎఫ్’ తరహా తవ్వకాలు జరుపనున్నట్లు తెలిసింది. బంగారంతోపాటు లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో ఇదొక కీలక పరిణామమని సంస్థ తెలిపింది. డెక్కన్ గోల్డ్ మైన్స్కు చెందిన డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్ న్జెగా-టబోరా గ్రీన్స్టోన్ పరిధిలోని పీఎల్ బ్లాక్ 11524లో ఈ నిల్వలను గుర్తించింది. అక్కడ బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు ఉన్నట్లు తేలింది. విద్యుత్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి లిథియం ఎంతో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ లిథియం నిల్వల గుర్తింపు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ మొదాలి తెలిపారు. ఇదీ చదవండి: మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..? లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్ లైసెన్సు(పీఎల్) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి పేర్కొన్నారు. టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి పీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులున్నాయి. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్వుడ్ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ వాణిజ్యానికి వేలకోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. తాజాగా ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20 శాతం పెరగొచ్చని జీటీఆర్ఐ నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సముద్రం, హిందూ మహాసముద్రానికి కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ హౌతీ మిలిటెంట్లు దూకుడు పెంచడంతో ఈ రూట్లో రవాణా కష్టంగా మారినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దాంతో నౌకా సంస్థలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేలా ప్రయాణం మొదలుపెట్టాయి. ఫలితంగా భారత్కు సరుకు రవాణా కావాలంటే అదనంగా 20 రోజుల వరకు సమయం పడుతుందని జీటీఆర్ఐ తెలిపింది. హౌతీ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్తో ఇండియాకు జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతోందని పేర్కొంది. క్రూడాయిల్, ఎల్ఎన్జీ దిగుమతుల కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై ఆధారపడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికాతో భారత్కు జరుగుతున్న సరుకు రవాణాలో ఏటా 50 శాతానికి పైగా దిగుమతులు, 60 శాతం ఎగుమతులు ఉన్నాయి. దాంతో మొత్తం 113 బిలియన్ డాలర్(దాదాపు రూ.9 లక్షల కోట్లు)ల వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్ఐ వెల్లడించింది. ఫలితంగా భారత్ ఇతర మార్గాల వైపు చూడాల్సి వస్తోందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి రవాణాను ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం! హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
వామ్మో ఆఫ్రికన్ నత్తలు! ఇవి ఎంత ప్రమాదమో తెలుసా?
ఆఫ్రికన్ నత్తలు(జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్) మార్కాపురం–తర్లుపాడు రోడ్డులోని మాగుంట పార్కులో ప్రత్యక్షమయ్యాయి. గత మూడు రోజులుగా సుమారు 100 నత్తలు పార్కులో సంచరిస్తూ వాకర్లను ఆకర్షిస్తున్నాయి. మన ప్రాంతంలో కనిపించే సాధారణ నత్తల కంటే ఇవి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ నత్తలు వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఇవి మామూలు నత్తలు కావు.. అచాటినిడే కుటుంబానికి చెందిన ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రపంచ వ్యాప్తంగా చీడ సమస్యలకు ప్రధాన కారణం. వ్యవసాయ పంటలతోపాటు స్థానిక మొక్కలకూ నష్టం కలిగిస్తాయి. అత్యంత హానికరమైన ఇన్వాసివ్(ఆక్రమిత) జాతుల్లో ఒకటైన ఈ ఆఫ్రికన్ నత్తలు మానవుల్లో మెనింజైటిస్కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో టాప్ 100 ఆక్రమిత జాతుల్లో ఈ నత్తలూ ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పష్టం చేసింది. ఇవి చదవండి: వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి.. -
దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు!
ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు. వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్కు మోడలింగ్ చేసింది. మోడల్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్షాప్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్షాప్లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
అరుదైన వింత వ్యాధి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..!
కరోనా టైంలో లాక్డౌన్, హోం క్యారంటైన్ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే.. వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. ఇలా వేరొక జెండర్ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్గా పిలుస్తారు. దీన్ని క్లినికల్ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!) -
ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు. తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. ఫోబియా Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. గైనోఫోబియా అంటే ఏమిటి? స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి. -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్ను కూడా స్థానిక డీలర్కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్లో నిమ్స్లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్పెల్లియర్లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
ప్రకృతి వ్యవసాయం భేష్
చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చాలా బాగుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం ప్రశంసించింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ పరిధిలోని యగ్నిశెట్టిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బృందం శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.విజయకుమార్ ఆధ్వర్యంలో సెనగల్, టునీషియా, మడగాస్కర్, జాంబియా, బెనిన్, మలవాయి తదితర ఆఫ్రికా దేశాల నుంచి 27 మంది ప్రతినిధులు యగ్నిశెట్టిపల్లిలోని పంట పొలాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తున్న నందీశ్వర, నరసింహప్ప అనే రైతులకు చెందిన వేరుశనగ, నవీన్కు చెందిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ విధానం తదితర వాటిని రైతులు, అధికారులు సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామంలోని కల్పవల్లి గ్రామ సంఘం, మహేశ్వరి మహిళా సంఘ సభ్యులు ప్రధాన పంటలు ఐదు రకాలు వేయటం, 20 రకాల జీవ వైవిధ్య పంటల సాగు, 5శాతం విత్తనాలు వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు, మార్కెటింగ్ వంటి వాటిని విదేశీ బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)కు చెందిన ఆన్నె సోఫియా, సీఐఆర్ఏడీకి చెందిన బ్రూనో, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్, అధికారులు విజయ్కుమార్, బాబు పాల్గొన్నారు. -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం!
గతంలో లిబియాలో సంభవించిన వరదలు, మొరాకోలో వచ్చిన భూకంపం చాలామంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారాంతం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ జలమయమైపోయాయి, ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కొన్ని వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. వర్షాలు తగ్గిన తరువాత ఇలాంటి వాహనాలను (కార్లను) ఉపయోగిస్తారా? లేదా ఎక్కడికైనా ఎగుమతి చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వరదల్లో మునిగిన కార్లను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి రిపేర్ చేసుకుని మళ్ళీ ఉపయోగిస్తారు. అది కూడా కారు ఖరీదుని బట్టి, రిపేరుకి అయ్యే ఖర్చుని బట్టి ఉంటుంది. అయితే అమెరికా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఒకసారి వరద నీళ్లలో కారు ఇంజిన్ తడిస్తే.. దాన్ని అమెరికాలో ఎవరూ ముట్టుకోరు. సాధారణంగా లగ్జరీ కార్ల ధరలు లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లు ఒక్కసారి వరద నీళ్లలో తడిచినా.. దాని విలువ దారుణంగా పడిపోతుంది. బురద నీళ్లలో ఇంజిన్ తడిస్తే.. ఎంత గొప్ప కారయినా 5 వేల డాలర్లకు మించి విలువ రాదు. ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పగించి కొత్త కార్లు తీసుకుంటారు. కార్లను వేలం ద్వారా విక్రయించడం నిజానికి అమెరికా వరదల్లో మునిగిన కార్లను.. అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్యార్డ్లు లేదా వెహికల్ రీబిల్డర్లకు సాల్వేజ్ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన కంపెనీలు.. లేదా వ్యక్తులు కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. కారు వరదల్లో మునిగితే ఇంటీరియర్ & ఇంజిన్ వంటి వాటిలో మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. కొంత మేర సీట్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అక్కడి కంపెనీలు పరిష్కరించి, వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగించి, కొంత యధా స్థితికి తీసుకువస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది. అంటే 2లక్షల డాలర్ల విలువ చేసే కార్లు కేవలం 40వేల డాలర్లకే విక్రయిస్తారన్న మాట. వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు. ఆఫ్రికాలో లాభాల పంట ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేరు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో లాభాల పంట పండినట్లే. ముఖ్యంగా కెన్యా, నైగర్, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. సాధారణంగా వరదల్లో మునిగిన కారు ఇంజిన్ కొంత మేరకు దెబ్బతింటుంది, వాహనానికి గుండెలాంటి ఇంజిన్లో సమస్య తలెత్తితే దాన్ని మళ్ళీ బాగుచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నపని, కావున అమెరికాలో ఇలాంటి కార్లను వెనుకాడకుండా విక్రయించేస్తారు. ఇదీ చదవండి: వేగం పెంచిన ఇండియా.. డౌన్లోడ్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్లో ఇలా.. ఇంజిన్తో పాటు కార్పెట్లు, సీట్-మౌంటు స్క్రూలు, లైట్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివన్నీ సమస్యకు గురవుతాయి. అంతే కాకుండా కొన్ని రోజులకు తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే వాటిని తక్కువ ధరలను విక్రయిస్తారు. ఇక సాఫ్ట్వేర్ విషయంలోనూ ఇప్పుడు చాలా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆడి, బెంజ్, BMW, లెక్సస్, ఫోర్డ్ ఫోక్స్ వాగన్.. బ్రాండ్ ఏదైనా అందులో ఉండే సాఫ్ట్వేర్ను చైనా కంపెనీలు క్రాకర్ వర్షన్లలో అమ్ముతున్నాయి. కాబట్టి ఈ వరద కార్లు అన్ని హంగులు సమకూర్చుకుని బురదను వదిలి మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. మరి ఈ కార్లు ఇండియాకు రావా.. అనుకుంటున్నారా? మన ప్రభుత్వం ఎందుకనో ఈ డీల్స్కు నో చెబుతోంది. కాబట్టి ఆ అదృష్టమేదో అఫ్రికన్లకే చేరని. Consumer caution is rising as flood-damaged cars enter the used car market, often appearing in auto auctions, dealerships and classified ads. The @WisconsinBBB joined us this morning for tips on how to avoid being scammed by these vehicles: https://t.co/wN3xPmoTDR — CBS 58 News (@CBS58) October 2, 2023 -
కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
కెనడాలో చోరీ అయిన వాహనాలు చివరికి ఆఫ్రికాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కెనడాలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని ఆఫ్రికా దేశాల్లోని అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీసీ మీడియా ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన ఘనాలో డజన్ల కొద్దీ చోరీకి గురయిన వాహనాలు అంటారియో, క్యూబెక్ లైసెన్స్ ప్లేట్లతో కనిపించాయి. ఈ వాహనాలలోని కొన్నింటికి కెనడియన్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ ధరకు దగ్గరగా వీటికి ధరను చెల్లిస్లున్నారని తేలింది. సోషల్ మీడియాతో సహా వివిధ ఆన్లైన్ ఛానళ్ల ద్వారా ఈ కార్ల విక్రయాలకు సంబంధించిన ప్రకటలు వెలువడుతున్నాయి. కెనడాలో 2022లో పెరిగిన కార్ల చోరీలు ‘తాము చోరీ అయిన వాహనాల విషయంలో ప్రపంచ దాతగా మారామని కెనడియన్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ అసోసియేషన్ ప్రతినిధి మైఖేల్ రోత్ సీబీసీకి చెప్పారు. కాగా బీమా పరిశ్రమ గ్రూప్ ఈక్విటీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలో వాహనాల దొంగతనాలు 2022లో పెరిగాయి. క్యూబెక్, అంటారియోలో దాదాపు 50 శాతం మేరకు కార్ల చోరీలు పెరిగాయి. అట్లాంటిక్ కెనడాలో కార్ల చోరీ 34 శాతానికిపైగా పెరిగింది. దీనివెనుక మాంట్రియల్లోని వ్యవస్థీకృత నేరగాళ్లు కారణమనే ఆరోపణలున్నాయి. చోరీ అయిన వాహనాలు మాంట్రియల్ పోర్ట్ నుంచి విదేశాలలోని గమ్యస్థానాలకు తరలిపోతున్నాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస చోరీలు ఈ సంవత్సరం ప్రారంభంలో పీల్ ప్రాంతీయ పోలీసులు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సంయుక్తంగా పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అండ్ ఎక్విట్ అసోసియేషన్ సహాయంతో 10 మిలియన్ డాలర్లకు మించి విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పేరుతో విచారణ మొదలయ్యింది. ఈ వాహనాలను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించి, ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా మాంట్రియల్ పోర్ట్కు తరలిస్తున్నట్లు విచారణతో తేలింది. 300 శాతం మేరకు పెరిగిన వాహన చోరీలు నెల రోజుల క్రితం హాల్టన్ పోలీసులు చోరీకి గురయిన 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆరు నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతుండటంతో రికవరీలు సమస్యగా పరిణమిస్తున్నాయి. గత జూన్లో కెనడియన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అసోసియేషన్ అందించిన వచ్చిన ఒక నివేదిక ప్రకారం టొరంటోలో 2015 నుండి 2022 వరకు వాహనాల దొంగతనాలు 300 శాతం మేరకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. 2022లో ఒక్క టొరంటోలోనే 9,600 వాహనాలు చోరీ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో జాతీయస్థాయిలో ప్రయత్నాలు జరగాలని నివేదిక పిలుపునిచ్చింది. వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్ను అప్డేట్ చేయాలి కెనడాలో వాహనాల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత నేరాగాళ్లు చోరీ చేసిన వాహనాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో మరింత ప్రవీణులుగా మారారు. దొంగతనాల నివారణకు తక్షణమే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు నిర్వహించడం అవసరం అని సీఎఫ్ఎల్ఏ ప్రెసిడెంట్ మైఖేల్ రోతే అన్నారు. అలాగే ఈక్విట్ అసోసియేషన్ వంటి ఇతర సంస్థలు.. కెనడాలోని ఫెడరల్ మోటార్ వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్ను అప్డేట్ చేయాలని కెనగా ట్రాన్స్పోర్ట్ విభాగానికి పిలుపునిచ్చాయి. విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు నేరస్తులు ఇప్పుడు పాత ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని విచారణాధికారి బ్రయాన్ గాస్ట్ పేర్కొన్నారు. వారు వ్యవస్థలోని లోపాలను త్వరగా , సులభంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది కెనడా అంతటా వాహనాల దొంగతనాల పెరుగుదలకు దారితీస్తున్నదన్నారు. అంటారియో ప్రభుత్వం వాహనాల దొంగతనాలను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో 51 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిమినల్ సంస్థలపై దర్యాప్తు , విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. చాలా తక్కువ మాత్రమే రికవరీ కెనడియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్కు చెందిన హువ్ విలియమ్స్ మాట్లాడుతూ కెనడాలో గృహాలు, డీలర్షిప్ షోరూమ్ల నుండి కార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా తక్కువ మాత్రమే రికవరీ అవుతున్నాయని తెలిపారు. యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ పనిని సమర్థవంతంగా చేస్తోంది. కానీ కెనడాలో అలా జరడం లేదన్నారు. కాగా ఘనాకు చెందిన ఎకనామిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దులై బషీరు దపిలా మాట్లాడుతూ వాహన దొంగతనాలకు సంబంధించి ఏ కెనడియన్ ఏజెన్సీ కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించలేదని, నేరుగా అధికారిక ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కార్లను వెదుక్కుంటున్న వాహనయజమానులు కొన్ని సందర్భాల్లో కెనడియన్లు చోరీకి గురయిన కారు కోసం తామే ప్రయత్నిస్తున్నారు. గత జూలైలో టొరంటోకు చెందిన ఒక వ్యక్తికి చెందిన రేంజ్ రోవర్ చోరీ జరిగాక అతను దానిని ట్రాక్ చేసి, మాంట్రియల్లో ఉందని, దానిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. 64 ఏళ్ల స్టీఫెన్ టౌబ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ పరికరం సాయంతో తన కారు వాహనం టొరంటో తూర్పు చివరలో ఉందని తెలుసుకున్నారు. తరువాత పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద షిప్పింగ్ కంటైనర్లోకి చేరుకుందని తెలిపారు. ట్రాకింగ్ డివైజ్ ప్రొవైడర్ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ కారు లొకేషన్ను షేర్ చేసిందని టౌబ్ కెనడియన్ ప్రెస్కు తెలిపారు. అయితే సిబ్బంది కొరత కారణంగా కంటైనర్ను తెరవడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని, ఈలోపునే కంటైనర్ను రవాణా జరగవచ్చని టౌబ్ పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో టౌబ్ మాంట్రియల్లోని సంబంధింత కార్యాలయానికి వెళ్లి అక్కడి ఏజెన్సీని కలిశాడు. మరుసటి రోజు తన రేంజ్ రోవర్ను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లకపోతే తన కారును తిరిగి పొందేవాడిని కాదని టౌబ్ మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్పాడ్ మింగేసింది.. తరువాత? -
ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్గా కరువుకు చెక్!
కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల్లో దేశాల్లో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు రైతులు వాన నీటి సంరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటిలో ‘అర్ధ చంద్రాకారపు గుంతలు’ తవ్వటం ఒక పద్ధతి. చెట్టు చేమ కరువైన ప్రదేశాల్లో అరుదుగా కురిసే కొద్దిపాటి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి భూమిలోకి ఇంకింపజేయటంలో ఈ వినూత్న ఇంకుడు గుంతలు ఉపయోగపడుతున్నాయి. వెస్ట్ సహెల్లో రైతులు భూసారం కోల్పోయిన భూములను పునరుజ్జీవింపజేయటం కోసం, ఎడారీకరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతిలో లోతు తక్కువ గుంతలు తవ్వి సత్ఫలితాలు సాధించారు. వాలుకు అడ్డంగా అర్థ చంద్రాకారంలో గుంతలు తవ్వి, తవ్విన మట్టిని లోతట్టు వైపు గట్టుగా వేస్తే.. వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూమిలోకి ఎక్కువగా ఇంకుతోంది. నీరు ఇంకడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల భూమి పైపొర మట్టి కోతకు గురికాకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతోంది. ఎడారీకరణ బారిన పడిన రైతుల మొహాల్లో ఆనందాన్ని నింపుతుండటంతో వీటికి ‘జాయ్ పిట్స్’ అని కూడా పేరొచ్చింది! ఖర్చు, శ్రమ తక్కువ.. ఫలితం ఎక్కువ! అర్థ చంద్రాకార గుంతలు నిర్మించడం సులభం, ఖర్చు స్వల్పం. వాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న భూముల్లో నేల కోతను నియంత్రించేందుకు, వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎత్తులో వ్యత్యాసం దాదాపుగా బెత్తెడు ఎక్కువ ఉంటే వాలు 5% కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్మించేదెలా? మొదట భూమిపై వాలు వైపు తిరిగి నిలబడి అర్ధ చంద్రుని ఆకారాన్ని రెండు మీటర్ల వెడల్పుతో గీయాలి. రెండు పిడికిళ్ల (10 సెంటీమీటర్ల) లోతు మట్టిని తవ్వి, ఆ మట్టిని దిగువ వైపున కట్టగా వేయండి. కట్ట బలంగా ఉండాలంటే కట్ట కింది వైపు ఇరవై అంగుళాల వెడల్పు ఉండాలి. పైభాగం కనీసం సగం (10 అంగుళాల) వెడల్పు ఉండాలి. ఎత్తు అడుగు సరిపోతుంది. వర్షాకాలంలో చివరి నెలన్నరలో అర్ధ చంద్రాకార కందకాలను తవ్వాలి. అప్పుడు నేల తేమగా ఉంటుంది. తవ్వటం, గట్లు వేయటం సులభం అవుతుంది. ఎండా కాలంలో వానకు ముందు దీన్ని ఏర్పాటు చేయాలంటే కష్టం. అర్ధ చంద్రాకారపు గుంతలు తీయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పార, పలుగు చాలు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్.. తిన్నారా? అంతే సంగతి!) -
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్గా పేర్కొంది. ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ! -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్టైమ్గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
56 కి.మీ. మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..
భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయకంపితులను చేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేరకు ఉండటం విశేషం. ఈ పగుళ్లు జూన్ నాటికి మరింత విస్తరించాయి. ఇవి మరింతగా కొనసాగుతున్నాయి. లండన్కు చెందిన జియోలాజికల్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు టెక్టోనిక్ ప్లేట్లను అధ్యయనం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై నాసా కూడా దృష్టి సారించింది. దీనిపై నాసాకు చెందిన అర్త్ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడిస్తూ ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్ ప్లేట్ న్యూబియాన్ టెక్టోనిక్ ప్లేట్కు తూర్పు దిశగా బలంగా కదులుతోంది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు సాగిస్తోంది.ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. కాలిపోర్నియా యూనివర్శిటీకిచెందిన ప్రొఫెసర్ అమెరిటస్ కెన్ మాట్లాడుతూ ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్లో పెనుముప్పు తప్పదన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు. ఇది కూడా చదవండి: మురికి బెడ్షీట్తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్! -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : 19వ శతాబ్దం ప్రారంభంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా ఆ తరువాత ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది నివసిస్తుండగా సగం జనాభా 1975 తర్వాతే పెరిగింది. 50 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ సంతానోత్పత్తి రేటులో ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ దశకు చేరుకోగా 2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశం నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది. జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది. ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’లో భారత్.. 1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా 2020 చివరి నాటికి 2.3కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభాలో పెరుగుదల, తగ్గుదల నమోదు ఉండదు. ముందు తరం స్థానంలో తర్వాత తరం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లేదా ‘రీప్లేస్మెంట్ రేట్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడానికి కారణాలు ♦ గర్భ నిరోధ అవకాశాలు పెరగడం ♦ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ♦ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం దక్షిణ కొరియాలో అత్యల్పం ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతోంది. నైజర్ 6.9 సంతానోత్పత్తి రేటుతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే నైజీరియాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ (14వ స్థానం) మినహా సంతానోత్పత్తిలో టాప్ 30 దేశాలన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2100 నాటికి ఆఫ్రికా 250 కోట్ల మందిని ప్రపంచ జనాభాకు జోడిస్తుందని అంచనా. మిగతా ఖండాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఉండదు. ఇక అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ సంతానోత్పత్తి రేటు 0.84 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికాలో సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే దిగువన ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు 1970 నుంచి తక్కువ సంతానోత్పత్తి రేటుతో కొనసాగుతున్నాయి. తగ్గినా తిప్పలే.. సంతానోత్పత్తి రేటు క్షీణించడం వల్ల అనేక దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఈ విజయగాథలు గత చరిత్రే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారీ జనాభాతో ఇబ్బందులున్నప్పటికీ సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్నప్పుడు భిన్న సమస్యలు తలెత్తుతాయి. పని చేసేవారు, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి నిష్పత్తిలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. వృద్ధుల వైద్య ఖర్చులు పెరగడంతో పాటు సంపాదించి పన్నులు చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీర్ఘ కాలంలో.. ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహించి తాత్కాలికంగా జనాభా తగ్గుదల, మానవ వనరుల కొరతను ఎదుర్కొన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది. పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
ఎంత దారుణం.. మార్కెట్లో ప్రవేశించి 47 మందిని కాల్చి చంపారు!
ఆఫ్రికాలోని నైజీరియాలోని సాయుధులు నరమేధానికి తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో సాయుధులు 50 మందిని దారుణంగా చంపారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు. కాగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ రెండు దాడులకు సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో.. ఫులానీ మూలానికి చెందిన పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని "నైజీరియా ఆహార బుట్ట"గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది. -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి
గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్ కివు ప్రావిన్స్ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి. బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి. -
ఆ ఊరికి ఆత్మబంధువులు
ఉద్యోగం నిమిత్తం భార్య సుమితో కలిసి ఆఫ్రికాలోని మలావి దేశానికి వెళ్లాడు కేరళలోని మలప్పురంకు చెందిన అరుణ్ అశోకన్.అక్కడ ఒక గ్రామంలో శిథిలావస్థలో ఉన్న స్కూల్ను చూసి చలించిపోయాడు.ఆ తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూల్ పునర్నిర్మాణానికి నడుం కట్టారు.తమ కలను సాకారం చేసుకున్నారు... మలావిలో ఒకరోజు... తాను పనిచేస్తున్న ప్రదేశానికి చిసాలియా అనే గ్రామం మీదుగా కారులో వెళుతున్నాడు అరుణ్ అశోకన్. వర్షం మొదలైంది. తల మీద పుస్తకాలు, బ్యాగులు పెట్టుకొని స్కూల్ పిల్లలు గుంపులు, గుంపులుగా పరుగెడుతున్నారు.‘వర్షం పడుతున్నప్పుడు స్కూల్లో కూర్చోక ఇలా పరుగెడుతున్నారేమిటి!’ అని డ్రైవర్ను అడిగాడు అరుణ్. ‘అది పేరుకే స్కూలు. గదులు పాడైపోయాయి. పిల్లలందరూ ఆరుబయటే కూర్చుంటారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలా ఇంటికి పరుగులు తీయాల్సిందే’ అని చెప్పాడు డ్రైవర్. అరుణ్కు మనసులో చాలా బాధగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తరువాత తన బాధను భార్య సుమితో కలిసి పంచుకున్నాడు.‘బాధపడడం ఎందుకు? మనమే స్కూల్ కట్టిద్దాం’ అన్నది సుమి.నిజానికి ఈ యువదంపతులు సంపన్నులు కారు. అయితే వారు ఆ నిర్ణయం తీసుకునే ముందు ‘మనం స్కూల్ కట్టించగలమా?’ ‘అంత డబ్బు మన దగ్గర ఉందా?’ అని ఆలోచించలేదు. ‘మనం స్కూల్ కట్టించాలి. అంతే!’ అని గట్టిగా అనుకు న్నారు. తమ సేవింగ్స్ను బయటికి తీశారు. స్కూల్ పునర్నిర్మాణంలో శ్రమదానం చేయడానికి ఊరివాళ్లను ఒప్పించారు. తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తాలతోనే పని కాదనే విషయం ఈ దంపతులకు అర్ధమైంది. ఈ పరిస్థితులలో ‘మలావి డైరీ’ పేరుతో యూట్యూబ్ చానల్కు శ్రీకారం చుట్టింది సుమి. ఈ చానల్ ద్వారా వచ్చిన డబ్బు, తమ సేవింగ్స్తో లోకాస్ట్ కన్స్ట్రక్షన్ టెక్నిక్తో స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్కూలో ఆవరణలో తోట పెంచారు. లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్లేగ్రౌండ్ తయారుచేశారు. స్కూల్ ప్రారంభోత్సావాన్ని ఒక పండగలా ఘనంగా జరుపుకున్నారు. సుమీ, అరుణ్లు ఇప్పుడు చిసాలియా ఊరి వాళ్లకు ఆత్మబంధువులయ్యారు. ‘స్కూల్ను పునర్నిర్మించాలనుకున్నాం. నిర్మించాం. ఇక సెలవ్’ అనడం లేదు సుమి, అరుణ్ దంపతులు. పిల్లల చదువుల గురించి కూడా పట్టించుకుంటున్నారు. తమకు సమయం ఉన్నప్పుడల్లా క్లాస్రూమ్లో పిల్లలతో కలిసి సమావేశం అవుతున్నారు. నాలుగు మంచి విషయాలు చెబుతున్నారు. ‘బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి’ ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం ఎప్పుడూ అడ్డు కాదు’... మొదలైన మాటలను గట్టిగానే చెబుతున్నారు. -
అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. రెండు గ్రామాల్లో లాక్డౌన్..
మలాబో: ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గినియాలో అంతుచిక్కని వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రక్తస్త్రావ జ్వరంతో 8 మంది చనిపోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ వ్యాధి ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. రక్తస్రావం, జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 200 మందిని క్వారంటైన్కు తరలించారు. రెండు గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. వ్యాధి బారినపడిన వారి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాన్కు పంపారు. లాసా, ఎబోలా వంటి ప్రాణాంతక మహమ్మారులు వెలుగుచూసిన ప్రాంతం కావడంతో కొత్త వ్యాధి గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో గంటల్లోనే చనిపోయారని అధికారులు వివరించారు. ఈ వ్యాధిపై నిఘా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈక్వెటోరియల్ గినియా పొరుగు దేశం కామెరూన్ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఇతరులకు ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
'కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ చీతాలను తెచ్చింది'
భోపాల్: బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్కు చీతాలను తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగిలాల్ జాతవ్. కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ వీటిని తీసుకొచ్చిందని అన్నారు. సోమవారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నుంచి భారత్ వచ్చిన చీతాలు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కరేరా నియోజకవర్గం నుంచే జాతవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో మాజీ సీఎం కమల్నాథ్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి జాతవ్ మాట్లాడారు. 'కుట్రలో భాగంగానే చీతాలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. ఇవి ఇప్పుడు చిన్నాగానే ఉన్నాయి. కానీ పెరిగి పెద్దయ్యాక మిమల్ని తినేస్తాయి. ఫలితంగా కాంగ్రెస్ ఓటర్ల సంఖ్యను తగ్గిస్తాయి. బీజేపీ కావాలనే పథకం ప్రకారం చీతాలను ఇక్కడకు తెచ్చింది. దీని కోసం రూ.117 కోట్లు ఖర్చుపెట్టింది.' అని జాతవ్ అన్నారు. జాదవ్ మాటలకు కాంగ్రెస్ శ్రేణులు చప్పట్లు, ఈలలతో హోరెత్తాయి. దీంతో ఆయన మొహంలో చిరునవ్వుతో వెలిగిపోయింది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అణగారిన వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జాతవ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమని, జంతువుల ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని సెటైర్లు వేశారు. 2020లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై జాతవ్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా.. దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి కేంద్రం చీతాలను తెప్పించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లో వీటిని కునో నేషనల్ పార్కురు తరలించింది. చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్.. అదానీ వ్యవహారంపై ప్రశ్నల వర్షం.. -
టీచర్ మిస్సింగ్ కేసు..అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు
ఆఫ్రికాలో గతేడాది తప్పిపోయిన ఓ సంగీతం టీచర్ దారుణమైన హత్యకు గురయ్యాడు. తన రూమ్మేట్సే అతన్ని కడతేర్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాంగోలోని బ్రజ్జావిల్లేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గతేడాది అక్టోబర్ 26న ఆస్ట్రేలియన్ సంగీత ఉపాధ్యాయుడు మార్క్ సియవరెల్ల ఆఫ్రికాలోని కాంగోలో కనిపించకుండాపోయాడు. అప్పటిన నుంచి అంతు చిక్కని మిస్సింగ్ కేసుగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కేసు చిక్కుముడి వీడింది. కానీ అతడ్ని అంతమొందించిన విధానం విని పోలీసులను ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..న్యూసౌత్ వేల్స్లోని లీటన్కు చెందిన 57 ఏళ్ల మార్క్ సియవరెల్లా ఆరేళ్ల క్రితం ఆప్రికా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను మొదటగా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ తోపాటు సంగీతాన్ని భోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ కాన్సులర్ స్కూల్కు మారారు. అతను కాంగోలోని బ్రజ్జావిలేలోని అపార్ట్మెంట్లోన తన స్నేహితుడి కలిసి ఉంటున్నాడు. ఇంతలో అతని పాత సహచరుడు, రూమ్మేట్ క్లెమెంట్ బెబెకా అనే వ్యక్తి మార్క్ వద్దకు వచ్చాడు. కాసేపు అక్కడే అపార్ట్మెంట్లో ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో మార్క్ వాష్రూమ్కి వెళ్లగానే ఆ ఆపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి మార్క్ ఇంకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు అతని రూమ్మేట్తో చెప్పాడు. అంతేగాదు అతను ఇక్కడ నుంచి వెళ్లిపోతే మనకేం ప్రయోజనం ఉండదు అని మార్క్ రూమ్మేట్తో అన్నాడు. దీంతో బెబెకా అయితే ఏం చేద్దాం మరీ అని అతడిని అడిగాడు. అందుకని అతన్ని కడతేర్చి అతని వద్ద నుంచి ఎంత కొంత సొమ్ము దుండుకుందా అని సలహ ఇచ్చాడు. ఇంతలో మార్క్ తాగి వదిలేసిన మందు గ్లాస్లో పాయిజన్ వేసి అక్కడ టేబుల్ మీద ఉంచాడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి. ఇంతలో వాష్రూమ్ నుంచి వచ్చిన మార్క్ వారితో మాట్లాడుతూ.. ఆ గ్లాస్లోని పాయిజన్ని తాగేశాడు. కాసేపటికే స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో తామిద్దం మార్క్ని ఒక బెడ్షీట్లో చుట్టి మొసళ్లు అధికంగా ఉండే కాంగో నదిలో పడేశామని బెబెకా చెప్పాడు. ఐతే మార్క్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అతని వద్ద ఉన్న బ్యాంకు కార్డుల సాయంతో డబ్బులు కొట్టేశామని పోలీసలుకు వివరించాడు. కనీసం కుటుంబసభ్యులకు చివరి చూపుకూడా దక్కనీయకుండా అత్యంత ఘోరంగా హతం చేసిన విధానం పోలీసులను షాక్ గురి చేసింది. ఈ విషయాన్ని మార్క్ కుటుంబసభ్యులు విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. (చదవండి: కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..) -
సెనెగల్లో ఘోర రోడ్డు ప్రమాదం
డాకర్: ఆఫ్రికా దేశం సెనెగల్లో శనివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. కఫ్రిన్ ప్రాంతం గ్నివీ గ్రామం వద్ద ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సుల్లోని 40 మంది చనిపోగా, మరో 78 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు బస్సులు పూర్తిగా నుజ్జయ్యాయన్నారు. ఘోర విషాదం నేపథ్యంలో దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని అధ్యక్షుడు మాకీ సాల్ ప్రకటించారు. కెన్యా–ఉగాండా సరిహద్దుల్లోనూ... నైరోబి: ఉగాండాలోని ఎంబాలె నగరం నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తున్న బస్సు రెండు దేశాల సరిహద్దుల్లో ప్రమాదానికి గురైంది. 21 మంది చనిపోగా 49 మంది గాయపడ్డారు. -
క్లిష్ట సమయంలోనూ వీడని ఔదార్యం: ఉక్రెయిన్ చేయూత
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు సుమారు 150 మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ పథకాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1923-33 శీతాకాలంలో మిలియన్ల మంది ఉక్రెయిన్లను పొట్టనబెట్టుకున్న రష్యా యుగం నాటి కరువు హోలోడోమోర్ కోసం జరిగిన ఉక్రెయిన్ వార్షిక స్మారక దినం సందర్భంగా ఈ ఫథకాన్ని ప్రారంభించారు. తమతో యుద్ధానికి దిగి ఆఫ్రికాలో ఆహార తీవ్ర ఆహార కొరతకు కారణమైందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయంటూ రష్యా రకరకాల కథనాలను వెలువరిస్తుంది. దీంతో వాటన్నింటిని తిప్పికొట్టేలా తాజాగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఉక్రెయిన్. ఈ మేరకు ఇథియోఫియా, సూడాన్, సౌత్సూడాన్, సోమాలియా, యెమెన్లతో సహా దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో సహా 20కి పైగా దేశాల నుంచి సుమారు రూ.150 మిలయన్ డాలర్లను సేకరించిందని జెలెన్స్కీ చెప్పారు. కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు ఉక్రెనియన్ ఓడరేవుల నుంచి కనీసం 60 నౌకలను పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధానిలో లక్షలాది మంది విద్యుత్ కొరతను ఎదుర్కొటున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్లోని 27 ప్రాంతాలలో 14 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. అదీగాక మాస్కో దళాలు ఖేర్సన్ నగరం నుంచి వైదొలగినప్పటికీ షెల్లింగ్ దాడులు కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడిలో సుమారు 32 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదీఏమైనా రష్యా ఉక్రెయిన్పై పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా యూఎన్ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి ఎగుమతి చేసిన ఆహారం అత్యంత తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు చేరడం లేదంటూ రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ పథకాన్ని ప్రకటించారు. (చదవండి: ఉక్రెయిన్కి సునాక్ మద్దతు హామీ) -
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. పెరట్లో కూరగాయల సాగు, కోళ్లు, కుందేళ్ల పెంపకం! ఇంకా
ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ అర్బన్ ప్రజలు సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో 30% వ్యవసాయం నుంచి పొందుతున్న కెన్యాలో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఏదో విధంగా తిప్పలుపడి సేంద్రియంగా పండించుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ఆహార కొరత, ధరల పెరుగుదలతో కొంతమంది కెన్యన్లు అర్బన్ ప్రాంతాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం చౌకగా ఉండటంతో పాటు సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి పెరటి స్థలాలు చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. అయితే, కోవిడ్ మహమ్మారి అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకూ ఊపునిచ్చింది. ఆహార సరఫరా తగ్గిపోవటంతో ఆరోగ్యదాయకమైన ఆహార భద్రత కోసం అర్బన్ ప్రాంతాల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వ్యాపకం ఇటీవల ఊపందుకుంది. ఇంటి స్థాయిలో ఆహార భద్రతను కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ‘మిలియన్ కిచెన్ గార్డెన్స్ ప్రాజెక్ట్’లో భాగంగా రెండేళ్ల క్రితం కూరగాయల విత్తనాలు, వ్యవసాయ కిట్లను పంపిణీ చేసింది. అర్బన్ గార్డెనింగ్ చానల్ నగరంలో ఉంటున్నా ఇంటి దగ్గరే సొంత ఆహారాన్ని పెంచుకోగలుగుతున్న అదృష్టవంతుల్లో న్యాంబురా సిమియు ఒకరు. 35 ఏళ్ల శాస్త్రవేత్త అయిన ఆమె తన కుటుంబంతో పాటు కెన్యా రాజధాని నగరం నైరోబీ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. తన ఇంటి వెనుక పెరట్లో తన నలుగురు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాదు, 200 వరకు కోళ్లు, కుందేళ్లను సైతం పెరట్లో పెంచుతున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు, గుడ్లు, మాంసాలతో కూడిన సేఫ్ ఫుడ్ను కుటుంబానికి సమకూర్చుతున్నారు. అర్బన్ రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం తన పేరుతోనే యూట్యూబ్లో అర్బన్ గార్డెనింగ్ చానల్ను నిర్వహిస్తున్నారు. పురుగుమందులకు బదులు కుందేలు మూత్రం వాడుతున్నారు. తెగుళ్ళను అరికట్టడానికి ‘కంపానియన్ ప్లాంటింగ్’ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉపాధి మార్గంగానూ.. యువ అర్బన్ ఫార్మింగ్ ఎంటర్ ప్రెన్యూర్స్లో నైరోబీ వాసి ఎల్జీ చెబెట్ ఒకరు. సృజనాత్మకంగా కిచెన్ గార్డెనింగ్ నమూనాలను నిర్మించటంలో ఆమె దిట్ట. కుటుంబం కోసం కూరగాయలు, ఆకుకూరలు పండించటం మాత్రమే కాదు, దాన్నే ఉపాధి మార్గంగానూ ఎంచుకున్నారామె. కెన్యా ఆర్గానిక్ కిచెన్ గార్డెన్స్ సంస్థను నెలకొల్పారు. పెరట్లో, మేడ మీద, గచ్చు మీద ఏ కొంచెం స్థలం వున్నా సరే గృహస్థుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా ఎడిబుల్ లాండ్స్కేప్ గార్డెన్స్ను అందంగా డిజైన్ చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత పరిమిత స్థలంలోనే కొంతమంది నగరవాసులు తమ వంట గదుల్లో, బాల్కనీల్లో కూరగాయలను పెంచడం ప్రారంభించారని ఎల్జీ చెబెట్ చెప్పారు. రెండు చదరపు మీటర్లు చాలు.. ‘ఆహారోత్పత్తి అనేది ప్రభుత్వ విధాన స్థాయిలో, ఇంటి స్థాయిలోనూ ఒక ముఖ్యమైన పని’ అని ప్రజలు గ్రహించారని రూట్–టు–ఫుడ్ ఇనీషియేటివ్ సంస్థను నిర్వహిస్తున్న ఇమాన్యుయేల్ అటాంబా అన్నారు. ప్రజలు, వారు తినే ఆహారం, దాన్ని ఎలా పండిస్తారు అనే విషయాలపై అవగాహన లోపించింది అన్నారాయన. ‘నగరంలో కూరగాయలు పెంచడం మంచిది కాదని భావించే వ్యక్తులు ఉన్నారు. ఇది మురికి పని లేదా చేయవలసిన పని కాదని అనుకుంటున్న మహానుభావులు కూడా వున్నార’ని న్యాంబురా సిమియు చెప్పారు. ఒక వ్యక్తికి సరిపడా కూరగాయలు పెంచుకునే కిచెన్ గార్డెన్కు కేవలం రెండు చదరపు మీటర్ల భూమి చాలు. పట్టణ వ్యవసాయానికి నీరు, స్థలం అవసరం. వీటిని నగరంలో ఏర్పాటు చేసుకోవటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. కెన్యా నగరాలూ, పట్టణాల్లో వుండే చాలా మందికి ఈ వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా నగర జనాభాలో ఎక్కువ మంది నివసించే మురికివాడల్లో మరీ కొరతగా వుంది అంటున్నారు ఆటంబ. సంప్రదాయ వ్యవసాయానికి అవసరమైన నీరు, స్థలంలో నాలుగింట ఒకవంతు కంటే తక్కువ ఉపయోగించి ఆహారాన్ని పండించే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే -
ఊహించని ఝలక్: రష్యాకు రహస్యంగా ఉత్తరకొరియా ఆయుధ సరఫరా!
వాషింగ్టన్: మధ్య తూర్పు దేశం లేదా ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఉత్తర కొరియా ఆఫ్రికాకు సరఫరా చేస్తున్న ముసుగులో రష్యాకు గణనీయంగా ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే రష్యా ఆ మందుగుండు సామాగ్రిని స్వీకరించిందో లేదో తెలియదు అని వైట్ హౌస్ జాతీయ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. తాము ఆ మందు సామాగ్రి పర్యవేక్షించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క అమెరికా రష్యా ఉక్రెయిన్ మీద సాగిస్తున్న దురాక్రమణ చర్యకు ఆగ్రహంతో ఆంక్షలు విధించి ఉక్రెయిన్కి మిలటరీ సాయం అందిస్తోంది. మరోవైపు ఇదే సరైన సమయం యూఎస్పై పగ సాధించేందుకు అనుకుందో ఏమో ఉత్తరకొరియా పక్కగా వ్యూహా రచన చేసింది. దక్షిణ కొరియాతో యూఎస్ చేసిన సైనిక కసరత్తులకు ప్రతిగా ఇలా ఉత్తర కొరియా తన ప్రతీకారం తీర్చుకుంటోందో ఏమో! వేచి చూడక తప్పదు. (చదవండి: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు) -
ఆ సత్తా భారత్కే ఉంది: ఎగ్జిమ్ బ్యాంక్ నివేదిక
జోహన్నస్బర్గ్: ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ‘రీఇన్విరోగేటింగ్ ఇండియాస్ ఎకనమిక్ ఎంగేజ్మెంట్స్ విత్ సదరన్ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ వంటి ఆఫ్రికా దేశాల కీలక రక్షణ అవసరాలు తీర్చడంలో భారత్ పెద్దదిక్కుగా మారింది. భారత ఆయుధాలను ఈ దేశాలు భారీమొత్తంలో కొన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, మానవతా సాయం, వేరే దేశ సైన్యానికి శిక్షణ అంశాలపైనా భారత్ దృష్టిసారించాలి. అప్పుడే 2025 కల్లా 5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్య లక్ష్యాన్ని భారత్ సాకారం చేసుకోగలదు. ఇందులో రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థలైన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇక, కొత్త తరం స్వదేశీ సాంకేతికతల సాయంతో నావికారంగంలో మానవరహిత జలాంతర్గత వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధిచేయాలి’ అని నివేదిక పేర్కొంది. జోహన్నస్బర్గ్లో భారత్–దక్షిణాఫ్రికా దేశాల అభివృద్ధి భాగస్వామ్యం కోసం సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. హిందూ సముద్ర ప్రాంత భద్రత, రక్షణలో భారత్, ఆఫ్రికా దేశాల పాత్ర కీలకమైనదని నివేదిక శ్లాఘించింది. సైబర్ సెక్యూరిటీలోనూ దేశాల పరస్పర సహకారం ప్రధానమని సూచించింది. ఈ సదస్సులో పలు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పరిశ్రమల, వ్యాపార సంస్థల అధినేతలు పాల్గొని ఏఏ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టంచేసుకోవాలో చర్చించారు. -
WHO: ఆ భారత కంపెనీ సిరప్లను వాడొద్దు
జెనీవా: భారత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్తో సిరప్లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో
సాక్షి, హైదరాబాద్: మానవ జాతి పుట్టిందెలా? వానరాల నుంచి అని చెప్పడం సులువే కానీ.. మానవులను పోలిన వానరాలూ బోలెడన్ని ఉండగా పరిణామ క్రమంలో కొన్ని నశించిపోయాయి. కొన్ని అవసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందుతూ నేటి ఆధునిక మానవుడు ‘హోమో సేపియన్’గా ఎదిగాయి. ఈ అద్భుత పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టాలను పరిశోధించి మరీ ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఎప్పుడో అంతరించిపోయిన హోమోసేపియన్ దూరపు చుట్టం ‘నియాండెర్తల్’ జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకూ అస్సలు గుర్తించని మరో బంధువు డెనిసోవన్ జాతిని గుర్తించినందుకు ఈ బహుమతి లభించింది. సుమారు 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన హోమో సేపియన్ల ప్రస్థానంలో పరిణామంలో నియాండెర్తల్, డెనిసోవన్ జాతుల జన్యువులూ చేరాయని, ఈ చేరిక ప్రభావం మనపై ఈ నాటికీ ఉందని పాబో గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బులకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాండెర్తల్, డెనిసోవన్ జాతి జన్యువులపై ఆధారపడి ఉందని పాబో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రత్యేక శాస్త్ర విభాగం మానవ పరిణామంపై జరుగుతున్న పరిశోధనల్లో పాబో సరికొత్త శకానికి, విభాగానికి దారి వేశానడంలో ఎలాంటి సందేహమూ లేదు. నియాండెర్తల్, డెనిసోవన్ జాతులపై పాబో చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు ‘పాలియో జినోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఒకటి ఉనికిలోకి వచ్చింది. హోమో సేపియన్లను, మానవుల్లాంటి ఇతర జాతులను (హోమినిన్లు) వేరు చేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. హోమో సేసియన్లలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించడం అన్నమాట. అంతరించిపోయిన హోమినిన్ జాతి హోమో సేపియన్లు ఎప్పుడో మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరిణమించారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నియాండెర్తల్ జాతి ఆఫ్రికాకు అవతల... స్పష్టంగా చెప్పాలంటే యూరప్, పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన వారు. నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచి ముప్ఫై వేల ఏళ్ల క్రితం వరకూ వీరి మనుగడ కొనసాగింది. ఆ తరువాత ఈ హోమినిన్ జాతి అంతరించిపోయింది. కానీ, 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మధ్యాసియా ప్రాంతానికి వలస వెళ్లిన హోమో సేపియన్లు నియాండెర్తల్ జాతితో కలిశారని పాబో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాతి కాలంలో హోమో సేపియన్లు క్రమేపీ ప్రపంచమంతా విస్తరించారన్నమాట. ఇరు జాతులు యురేసియా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి జీవించాయని అంచనా. అయితే ఈ నియాండెర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 1990 చివరి నాటికి మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కాగా.. హోమినిన్లతో మనకున్న సంబంధాలను వెతకడం మాత్రం మొదలు కాలేదు. నియాండెర్తల్స్ వంటి హోమినిన్ల జన్యుక్రమం ఏదీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాబో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియాండెర్తల్స్ డీఎన్ఏను అధ్యయనం చేసేందుకు స్వాంటే పాబో ప్రయత్నించారు. వేల ఏళ్ల క్రితం నాటి.. అంతరించి పోయిన జాతి డీఎన్ఏ దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాలక్రమంలో ఎంతో డీఎన్ఏ నాశనమైపోయి లేశమాత్రమే మిగిలి ఉంటుంది. పైగా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పరిణామ జీవశాస్త్ర నిపుణులు అలన్ విల్సన్ వద్ద స్వాంటే పాబో పోస్ట్ డాక్టరల్ విద్యార్థిగా నియాండెర్తల్ డీఎన్ఏ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 1990లో జర్మనీలో మ్యూనిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ పురాతన డీఎన్ఏపై పరిశోధనలను కొనసాగించిన పాబో నియాండెర్తల్ల మైటోకాండ్రియా నుంచి డీఎన్ఏను సేకరించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్రోమోజోముల్లోని డీఎన్ఏతో పోలిస్తే ఈ మైటోకాండ్రియల్ డీఎన్ఏ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి విశ్లేషణ విజయవంతమవుతుందని పాబో అంచనా. సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటి నియాండెర్తల్ ఎముక ముక్క నుంచి తొలిసారి ఈయన మైటోకాండ్రియల్ డీఎన్ఏను వేరు చేయగలిగారు. ఈ జన్యుక్రమంతో మానవులు, చింపాంజీల జన్యుక్రమాన్ని పోల్చి చూడటం సాధ్యమైంది. కణ కేంద్రక డీఎన్ఏను విశ్లేషించి నమోదు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీల సాయంతో దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తల్ జన్యుక్రమ నమోదును 2010లో పూర్తి చేశారు. ఈ జన్యుక్రమాన్ని హోమో సేపియన్ల జన్యుక్రమంతో పోల్చి చూసినప్పుడు ఇరుజాతుల ఉమ్మడి పూర్వ జాతి భూమ్మీద సుమారు ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రాంతాల్లోని హోమోసేపియన్ల జన్యుక్రమాలను పోల్చి చూడటం ద్వారా మనకున్న ప్రత్యేకతలు తెలిశాయి. యూరోపియన్, ఆసియాకు చెందిన హోమోసేపియన్లలో 1–4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్స్దని తెలిసింది. సరికొత్త హోమినిన్ గుర్తింపు స్వాంటే పాబో పరిశోధనల్లో అత్యంత కీలకమైంది.. డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 వేల ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా ఇది జరిగింది. మంచులో కప్పబడి ఉండటం వల్ల ఈ ఎముకలోని డీఎన్ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డీఎన్ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండెర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవ అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనల్లో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. హోమో సేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండెర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ రెండు జాతులతో కలవడం కూడా ఎక్కువైంది. పరిణామక్రమంపై పరిశోధనలకు నోబెల్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్య శాస్త్ర నోబెల్ స్టాక్హోమ్: వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల (హోమినిన్స్) కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి, రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గ్స్ట్రామ్ 1982లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్లో, మ్యాక్స్ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతను మంగళవారం, రసాయన శాస్త్రంలో విజేతను బుధవారం, సాహిత్యంలో విజేతను గురువారం, శాంతి బహుమతి విజేతను శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో విజేతను ఈ నెల 10వ తేదీన నోబెల్ కమిటీ ప్రకటించనుంది. నోబెల్ ప్రైజ్ గ్రహీతకు 9 లక్షల డాలర్ల (రూ.7.35 కోట్లు) నగదు అందజేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగనుంది. -
అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా?
సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్పై హక్కులు వస్తాయి. యూరప్ దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూరప్ దేశాల్లో... యూరప్లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచి్ఛత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్ఛిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్ చేయించుకోవచ్చు. యూరప్, లాటిన్ అమెరికా సంప్రదాయ కేథలిక్ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్లో అబార్షన్ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి. 24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్ అమెరికా, యూరప్కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి. సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్ సాల్వేడర్లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంస్థ నివేదికలో వెల్లడైంది. 50 దేశాల్లో పరిమితులతో హక్కులు దాదాపుగా 50 దేశాల్లో అబార్షన్ చేయించుకునే హక్కు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులున్నాయి. లిబియా, ఇండోనేసియా, నైజీరియా, ఇరాన్, వెనిజులాలో తల్లి ప్రాణాలు ప్రమాదం ఉంటే మాత్రమే అబార్షన్ చేయించుకోచ్చు. మిగిలిన దేశాల్లో అత్యాచారం, అవాంఛిత గర్భధారణ, గర్భంలో శిశువు ఎదుగుదలలో లోపాలుంటే అబార్షన్ చేయించుకోవడానికి అనుమతినిస్తారు. బ్రెజిల్లో అత్యాచారం వల్ల గర్భం వచి్చనా, గర్భస్థ పిండం ఎదగకపోయినా గర్భస్రావానికి అనుమతిస్తారు కానీ వైద్యులు, వైద్య రంగంలో కనీసం ముగ్గురు అనుమతి తప్పనిసరి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నాళ్లో వేచిన ఉదయం...
షోపూర్: కునో నేషనల్ పార్కు. శనివారం ఉదయం 11.30 గంటలు. బోను తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఓ చీతా హుందాగా, నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు బొత్తిగా అలవాటు లేని కొత్త వాతావరణం పలకరించడంతో తొలుత కాస్త అయోమయానికి లోనైంది. మెల్లిగా పరిసరాలను 360 డిగ్రీలూ స్కాన్ చేసింది. తర్వాత ఎదురుగా పరుచుకున్న తనకెంతో ఇష్టమైన గడ్డి మైదానంలోకి ఒక్కో అడుగే వేసింది. చూస్తుండగానే మెరుపు వేగంతో పరుగందుకుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ చెట్టు దగ్గర ఆగింది. తలను చుట్టూ తిప్పుతూ పరిసరాలను మరోసారి నింపాదిగా పరికించి చూసింది. తర్వాత స్వేచ్ఛా సంచారం మొదలు పెట్టింది. అలా... 70 ఏళ్ల కింద భారత్లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. ఈ అపురూప క్షణాలను మీడియాతో పాటు బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు. ‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి శనివారం ఉదయం గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి. ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో చీతాల ఉనికిని పునరుద్ధరించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘ఇన్ని దశాబ్దాల తర్వాత మిత్రదేశమైన నమీబియా మద్దతుతో వాటిని రప్పించగలిగాం. ఇకనుంచి కునో పార్కు గడ్డి మైదానాల్లో చీతాలు పరుగులు తీస్తూ కనువిందు చేస్తాయి’’ అన్నారు. ‘‘కేంద్రం నిరంతర కృషి ఫలితంగా పులులు, ఏనుగులు, సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కూడా ప్రగతి సాధ్యమేనని ప్రపంచానికి మనం సందేశమిస్తున్నాం’’ అని చెప్పారు. ఇలా తరలించారు... నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్లో వాటి కథ ముగిసిపోయింది. ఇవేం తమాషాలు: కాంగ్రెస్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సమస్యల నుంచి, భారత్ జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు చీతాల విడుదల పేరిట తమాషాకు తెర తీశారంటూ దుయ్యబట్టింది. చౌకబారు ట్రిక్స్లో బీజేపీ నేతలకు భారతరత్న ఇవ్వొచ్చంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. చీతాలను రప్పించే ప్రాజెక్టుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో తెర తీసిందంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో ప్రత్యేకంగా జోడో యాత్ర చేస్తామన్నారు. నన్ను కూడా రానివ్వొద్దు! తర్వాత ‘చీతా మిత్ర’ సిబ్బందితో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ‘‘చీతాలను జాగ్రత్తగా చూసుకోండి. మనుషులకు, వాటికి అనవసర సంఘర్షణ తలెత్తకుండా చూడండి. కొత్త వాతావరణానికి అవి అలవాటు పడేదాకా ఎవరినీ వాటి దగ్గరికి పోనివ్వకండి. నాయకులు, బ్రేకింగ్ న్యూస్ కోసం వచ్చే మీడియా, అధికారులు, నా బంధువులు ఎవరినీ కునో నేషనల్ పార్కులోకి అనుమతించొద్దు. స్వయంగా నేనే వచ్చినా సరే, అడ్డుకోండి’’ అని సూచించారు! చీతాల పరిరక్షణకు, వాటిని గురించి పరిసర గ్రామాల వారికి అవగాహన కల్పించేందుకు 400 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. గుజరాత్ సీఎంగా ఉండగా సింహాల సంఖ్య పెంచే చర్యల్లో భాగంగా ఇలాగే 300 మంది వన్యప్రాణి మిత్రులను నియమించినట్టు మోదీ గుర్తు తెచ్చుకున్నారు. -
కిలిమంజారో పర్వతంపై వైఫై
డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్పై 2010 నుంచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే.. -
ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత
ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్కు చెందిన ఈ మహిళ ఆడిస్అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్ బయటపడటంతో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ విభాగం అధికారులు చెప్పారు. చదవండి: యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం -
పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు.. గమ్యస్థానం దాటేసిన తర్వాత మేలుకున్నారు!
అడీస్ అబాబా: ప్రయాణంలో ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎయిర్పోర్ట్లో రన్వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు హాయిగా నిద్రపోయారు. గమ్యస్థానం దాటేసిన తర్వాత విమానంలో అలారం మోగాక హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకున్నారు. ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దదైన ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 ఈటీ343 విమానం ఈ నెల 15వ తేదీన సూడాన్ నుంచి ఇథియోపియాకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం అడీస్ అబాబా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, అందులోని ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. అడీస్ అబాబాకు చేరుకున్నా లేవలేదు. ఆ సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తున ఆకాశంలో దూసుకెళ్తోంది. రన్ వేపై దిగాల్సిన జాడ లేకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమతమయ్యారు. పైలట్లను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఫ్లైట్లోని అలారం మోగించారు. ఆ శబ్దానికి పైలట్లు కళ్లు తెరిచారు. జరిగిన పొరపాటు గుర్తించారు. అధికారుల సూచనతో విమానాన్ని వెనక్కి మళ్లించి, ఎయిర్పోర్ట్లో దించారు. -
Manju: 85 ఏళ్ల బామ్మ! గుజరాత్లో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి.. బ్రిటన్లో రెస్టారెంట్!
ఇండియాలో పుట్టి, ఆఫ్రికాలో పెరిగి, ఇంగ్లాండ్లో స్థిరపడింది. అయినా భారతీయ వంటకాలను అద్భుతంగా వండుతూ ఎంతోమంది కస్టమర్ల మనసులను దోచుకుంటోంది 85 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదులకు చేరువలో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా దేశీయ వంటకాలను వండివార్చుతూ మంచి కుక్గా పేరు తెచ్చుకున్న ఈ పెద్దావిడే మంజు. రుచికరమైన ఈ వంటకాలను యూరోపియన్లు సైతం లొట్టలేసుకుని లాగించేస్తూ వావ్ అంటున్నారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1936లో మంజు పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఉగాండాలో స్థిరపడడంతో అమ్మతో కలిసి ఆ దేశం వెళ్లింది. మంజుకు పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఇంట్లో తనే పెద్ద కావడంతో..∙తోబుట్టు వుల భారం కూడా తనపై పడింది. దీంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ రోజూ వివిధ రకాల అల్పాహారాలు తయారు చేయడం నేర్చుకుని, పద్నాలుగేళ్ల వయసులో టిఫిన్లు తయారు చేసి విక్రయించేది. అమ్మతో కలిసి పనిచేస్తోన్న సమయంలో చనా దాల్ మంజుకు బాగా నచ్చింది. దీంతో గుజరాతీ సంప్రదాయ వంటకాలన్నింటినీ తల్లి దగ్గర నేర్చుకుని రుచికరంగా తయారు చేసేది. ఒకపక్క టిఫిన్లు విక్రయిస్తూనే, ట్యూషన్లు కూడా చెప్పేది. పెళ్లి తరువాత కూడా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన మంజుకి పెళ్లి తరువాత కూడా ఒడిదొడుకులు తప్పలేదు. 1964లో గుజరాత్ మూలాలున్న ఆఫ్రికన్ వ్యాపారవేత్తతో మంజుకు పెళ్లయ్యింది. వెంటవెంటనే ఇద్దరు కొడుకులు నైమేష్, జైమిన్లు పుట్టారు. వాళ్లకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఉగాండలో రాజకీయ పరిస్థితులు మారి అక్కడ నిబంధనలు మారడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్కు వలస వెళ్లింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. ఉదయం స్విచ్బోర్డుల తయారీ ఫ్యాక్టరీలో మంజు ఉద్యోగానికి వెళ్తే భర్త పిల్లల్ని చూసుకునేవాడు. రాత్రి అతను ఉద్యోగం చేస్తే మంజు పిల్లలను చూసుకునేది. అలా ఇద్దరూ ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచారు. ఏళ్లపాటు ఫ్యాక్టరీలో పనిచేసిన మంజు 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది. బాధ్యతలు తీరాయి కానీ... కుటుంబ బాధ్యతల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచి వంటలు చేసే అలవాటు ఉండడం వల్ల చిన్న రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది మంజుకి. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన దగ్గర రెస్టారెంట్ నడపడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు. తన కల ఎప్పుడు నెరవేరుతుందా... అని ఎదురు చూస్తుండేది. అమ్మకోరికను ఎలాగైనా నెరవేర్చాలన్న సంకల్పంతో కొడుకులిద్దరూ తాము దాచుకున్న డబ్బులతో లండన్ నగరానికి దగ్గర్లో ఉన్న బ్రిటన్లో చిన్న రెస్టారెంట్ను ప్రాంభించారు. దీంతో మంజు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కల 80 ఏళ్ల వయసులో నిజమైనట్లనిపించింది. పూర్తిగా గుజరాతీ శాకాహార భోజనం, నాణ్యమైన నూనె, ఇతర దినుసులతోనే వండడం, నాలుగు రకాల పదార్థాలతో షేరింగ్ థాలీని అందుబాటులో ఉంచడంతో రెస్టారెంట్ కొద్దికాలంలోనే యూరోపియన్లను అమితంగా ఆకర్షించింది. దీంతో చుట్టుపక్కల అనేక ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ మంజు రెస్టారెంట్కే కస్టమర్లు ఎగబడేవారు. దీనికి తోడు ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్ర లేచి రాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్లో వంటకాలను తన స్వహస్తాలతో తయారు చేయడం బాగా కలిసి వచ్చింది. కొడుకులతో పాటు కోడళ్లు దీపాలీ, కిట్టీలు కిచెన్లో మంజుకి సాయం చేస్తుండడంతో తక్కువమంది సిబ్బందితో రెస్టారెంట్ చక్కగా నడిపిస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా.. మంజు ఇండియా వచ్చింది కేవలం మూడుసార్లే అయినప్పటికీ..తన తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవంతో పానీపూరి, బేల్పూరి, పనీర్ మసాలా, కనడ పాలక్, కధీ, ఆలుకీ సబ్జి, దాల్ ధోక్లి, ఉందాయు, తెప్లా, ఖందవి వంటి రుచికరమైన వంటకాలను రెస్టారెంట్లో అందిస్తోంది. దేశీయ రుచులతోపాటు... భారతీయ సంప్రదాయ పండగలను వేడుకగా నిర్వహించడం, పండుగకు తగ్గట్టుగా రెస్టారెంట్ను అలంకరించడం, ప్రత్యేకమైన మెనూ, సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి అక్కడి వాళ్లను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. గుజరాత్ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రెస్టారెంట్లో పాత్రలు, పోస్టర్లు, సిబ్బంది డ్రెíస్సింగ్ ఉంటుంది. మంజు కస్టమర్లలో ఇంగ్లిష్, ఇండియన్, విఐపీలు ఉన్నారు. ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడికి గాను ‘గ్రేట్ టేస్ట్’ అవార్డును కూడా అందుకుంది. సంకల్పం గట్టిదైతే ఏళ్లుగడిచినా అనుకున్నది తప్పక నెరవేరుతుందనడానికి మంజు జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ! -
ఎయిర్టెల్ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం
ముంబై: ఎయిర్టెల్ ఆఫ్రికా 125 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం, మొబైల్ మనీ సేవలు అందిస్తోంది. స్థానిక కరెన్సీతోపాటు, డాలర్ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్టెల్ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్టెల్కు చెందిన ముంబై యూనిట్ ద్వారా ఈ డీల్ చేసుకున్నట్టు ప్రకటించింది. -
Monkeypox: బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం
బ్రెసిలియ: మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. మంకీపాక్స్ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 👉🏽 బ్రెజిల్ రాష్ట్రం మినాస్ గెరాయిస్ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 👉🏽 ఇదిలా ఉంటే.. జూన్ 10వ తేదీన యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. 👉🏽జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 👉🏽డబ్ల్యూహెచ్వో ప్రకారం.. మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి. 👉🏽 మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్ నుంచి బయటపడొచ్చు. 👉🏽 అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన WHO.. సెక్స్ పార్ట్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది. చదవండి: మంకీపాక్స్తో సీరియస్ అయితే ఈ టీకా వాడొచ్చు! -
Marburg virus: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. డబ్ల్యూహెచ్వో అలర్ట్!
అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్' వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్లోని ల్యాబ్కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో తెలిపింది. 'సెనెగల్లోని ఇన్స్టిట్యూట్ పాస్టెర్లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం.. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్ వైరస్ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్ వైరస్ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్ అశాంతి నగర్కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్ఓ అత్యవసర సమావేశం -
భయంతో పరుగు లంఘించిన మూడు సింహాలు: వీడియో వైరల్
సింహాన్ని చూస్తే ఏ జంతువైన పరుగు లంఘించాల్సిందే. అలాంటి సింహమే గజగజలాడుతూ ప్రాణాల కోసం పరుగులు పెట్టింది. అదీ కూడా మూడు పెద్ద సింహాలు కలిసి ఉండగా...వాటినే హడలెత్తించి మరీ పరుగులు పెట్టించింది హిప్పో అనే జీవి. పాపం ఆ సింహాలు మాములుగా భయపడలేదు. ఈ ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది. హిప్పొపొటామస్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పెద్ద క్షీరదంగా చెబుతారు. ఇది ఆఫ్రికాలో ఒక్క ఏడాదిలోనే సుమారు 500 మందిని దాక చంపేయగలదు. మూడు సింహాలు బోట్స్వానాలోని సెలిండా రిజర్వ్ స్పిల్ వద్ద నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఉన్న హిప్పో వాటిని అడ్డగించింది. అందులో ఒక సింహా పై దాడి చేసేందుకు యత్నిచింది. ఆ సింహాన్ని హిప్పో మాములుగా పరిగెట్టించలేదు. దెబ్బకు ఒడ్డునున్న మిగతా రెండు సింహాలు అది బతకుతుందో లేదో అన్నంత టెన్షన్గా చూస్తున్నాయి. ఐతే కొద్దిలో ఆ సింహం ఆ హిప్పో భారి నుంచి తప్పించుకుంది. ఈ మేరకు ఈ ఘటకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు నీటిలో ఉంటే సింహం పిల్లి అయిపోతుంది, అందుకే పరుగు లంఘించింది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
ఆఫ్రికన్ గాడిదలను ఎత్తుకెళ్లి మరీ.. చైనా దుర్మార్గం
కరోనా టైంలో చైనా ఆహారపు అలవాట్ల గురించి ప్రధానంగా చర్చ నడిచింది. ఒకానొక టైంలో ఆ అలవాట్ల వల్లే కరోనా విజృంభించిందన్న వాదన సైతం చక్కర్లు కొట్టింది. అయితే.. చైనీస్ సంప్రదాయ మందుల తయారీ కోసం మూగజీవాలను పొట్టనబెట్టుకుంటుందని ఆ దేశం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. ఆఫ్రికాలో సైతం గాడిదలను ఎత్తుకెళ్లి దేశాలు దాటించి మరీ చంపి.. సంప్రదాయ మందులు తయారు చేస్తున్న చైనా దుర్మార్గపు చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఇంప్రెసెస్ ఇన్ ది ప్యాలెస్ అనే చైనీస్ టీవీ షో కారణంగానే.. ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం. పదులు, వందలు కాదు.. లక్షల్లో గాడిదలను సంప్రదాయ మందుల పేరిట బలిగొంటోంది చైనా. మూగజీవాలను ఎత్తుకెళ్లి మరీ సుత్తెలతో కొట్టి చంపి మరీ అమానుషంగా వ్యవహరిస్తోంది. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఎజియావో అనే సంప్రదాయ మందు కోసం ఆరాచకాలకు పాల్పడుతోందని యూకేకు చెందిన డాంకీ శాంక్చురీలో పని చేసే సైమన్ పోప్ ఆరోపిస్తున్నారు. ఎజియావో అనేది ‘డాంకీ గ్లూ’గా పిలుస్తారు చైనాలో. గాడిదల చర్మం నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ టానిక్ వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారని చైనీయుల నమ్మకం. అందుకే.. గాడిదలను దుర్మార్గంగా చంపేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాలో ఈ టానిక్ తయారీకి సరిపడా గాడిదలు లేవు. అందుకే.. విదేశాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆఫ్రికాలో గాడిదల సంఖ్యపై ఆధారపడింది. ఈ మేరకు మాలి, జింబాంబ్వే, టాంజానియాలో అక్రమ దందాలకు చైనా తెర తీసిందని వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రచురించింది. అక్కడి ప్రజలకు గాడిదలు ప్రధాన జీవనాధారం. వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో.. వాటిని ఎత్తుకెళ్లే చేష్టలకు దిగింది చైనా మాఫియా. మొత్తం ఐదు మిలియన్ల గాడిదలకుగానూ.. సొంతగడ్డపై రెండు మిలియన్లు, విదేశాల నుంచి మరో మూడు మిలియన్ల గాడిదలను రప్పించుకుంటోంది. అయితే.. వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రకారం ఆ మూడు మిలియన్లలో 25 నుంచి 35 శాతం గాడిదలు ఎత్తుకొచ్చినవే అని తెలిపింది. తమ తమ దేశాల్లో గాడిదల సంఖ్య తగ్గిపోతుండడంపై ఆయా దేశాలు దృష్టిసారించాయి ఇప్పుడు. తమ దేశంలో గాడిదలు అంతరించిపోయే దశకు చేరుకోవడంతో.. టాంజానియా గత నెలలో గాడిదల వధ, చర్మం వర్తకాలపై నిషేధం విధించింది. నైజీరియా కూడా ఇదే బాటలో పయనిస్తూ నిషేధం ప్రకటించింది. తమ గాడిదలు తమ దేశాల సంపదని.. వాటిని అమ్మడం, చంపడం కుదరంటూ కొన్ని దేశాలు ఇప్పటికే డ్రాగన్ కంట్రీకి గట్టి సంకేతాలు పంపాయి. -
ఇక అరెస్టులు ఉండవు.. తిప్పి పంపుడే: కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో తొలిసారిగా ఐదుగురిపై ఈ ప్రక్రియను అనుమతి పొందారు. వీరిని బుధవారం నగర పోలీసు కార్యాలయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే... నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ మధ్య కాలంలో బెయిల్పై బయటకు వచ్చే ఆ ఆఫ్రికన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపుకార్డులు, వీసాలు తయారు చేసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్... ఈ పరిణామాలను గమనించిన సీవీ ఆనంద్ డిపోర్టేషన్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ కోసం ఆíఫ్రికన్ల ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్ రెడ్డిలు తమ బృందాలతో రెండు నెలల క్రితం బంజారాహిల్స్లోని పారామౌంట్కాలనీలో సోదాలు చేశారు. అక్రమంగా నివసిస్తున్న ఆంటోనీ సన్డే (నైజీరియా), కోనే మౌసా (ఐవరీ కోస్టు), ఆసూయ్ విలియం డెకోస్టేరియా (ఐవరీ కోస్టు), ఒబేరా పీటర్ (నైజీరియా), ఒమెజోరియా కింగ్స్లే (నైజీరియా) చిక్కారు. వీరి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొంది సీసీఎస్లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఈ ఐదుగురికీ విమాన టిక్కెట్లు ఖరీదు చేసిన సిటీ పోలీసులు ఖతర్ ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. దీంతో వీళ్లు మరోసారి భారత్లో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉండదు. 750 మంది అక్రమంగా ఉంటున్నారు హైదారాబాద్ ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా 2900 మంది ఆఫ్రికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండిపోయారు. వీళ్లు నగరంలో ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అనేది ఆరా తీస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభిస్తాం. ఇకపై చిక్కిన వాళ్లంతా డిపోర్టేషన్ కావాల్సిందే. ఇళ్ల యజమానులు సైతం వీసా, పాస్పోర్టు చూడకుండా అద్దెకు ఇవ్వద్దు. అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ చదవండి: బీజేపీ జాతీయ సభ.. షెఫ్లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు! -
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెనెగల్లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాగా, అంతకుముందు కూడా సెనెగల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గడేదాడి లింగూరీలో ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు చనిపోయారు. ఇది కూడా చదవండి: ప్రపంచానికి టెన్షన్.. పుతిన్ మరో బిగ్ ప్లాన్..? -
మంకీపాక్స్ కలకలం...వందకు పైగా కేసులు
Monkeypox, a viral infection more common to west and central Africa: ఆఫ్రికాలో సర్వసాధారణమైన మంకీపాక్స్ యూరవప్ని వణికిస్తోంది. ఈ మంకీపాక్స్కి సంబంధించిన కేసలు యూరప్లో 100కు పైగా నమోదయ్యాయి. అంతేగాదు యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా దేశాల్లో వీటికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఐతే శాస్ర్తవేత్తలు మాత్రం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించిన కేసులు అంతంగా వ్యాప్తి చెందలేదు కాబట్టి ఇది అంతగా వ్యాప్తి చెందదని చెబుతున్నారు. మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరల్ అనారోగ్యం. ఇది జ్వరం వంటి లక్షణాలతో శరీరంపై దద్దర్లు కూడిన పొక్కుల వస్తుంటాయి. ఈ వ్యాదిని తొలిసారిగా కోతుల్లో గుర్తించారు. అంతే కాదు ఈ మంకీ పాక్స్ ఆఫ్రికావాసుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికి వరకు ఈ కేసులు యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్ మరియు పోర్చుగల్లలో ఈ కేసులను గుర్తించారు గానీ యూరప్లో ఇప్పటి వరకు గుర్తించని ఈ మంకీ పాక్స్కి సంబంధించిన కేసులు ఇప్పుడు అత్యధికంగా నమోదవుతున్నాయని జర్మని సాయుధ దళాల వైద్యా బృందం తెలపింది. ఐతే ఇది అంటువ్యాధి అని ఎక్కువకాలం కొనసాగే అవకాశం కూడా చాలా తక్కువ అని చెబుతోంది. దీనికి నిర్ధిష్టమైన వ్యాక్సిన్ మాత్రం లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మాత్రం మశూచిని నిర్మూలించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ కోతులకు వ్యతిరేకంగా 85% వరకు ప్రభావవంతంగా ఉందని తెలిపింది. మంకీపాక్స్ బారిన పడిన కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతరులకు మశూచి వ్యాక్సిన్ను అందించినట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
Ganvie: బతికి తేలిన ఊరు
సాగరానికి చేరువలో నీటి మధ్య కొలువైన అద్భుతం.. వెనిస్ నగరం. ఆ ఊరు పేరు చెప్పగానే ఎటుచూసినా నీరు.. మధ్యలో అందమైన భవనాలు.. వంతెనలు.. పడవ ప్రయాణాలు.. కళ్లల్లో మెదులుతాయి. అయితే అలాంటి హంగులేవీ లేని వెనిస్ గురించి ఎప్పుడైనా విన్నారా? చీకటి ఖండం ఆఫ్రికాలో ఉంది ఆ ఊరు. పేరు.. గాన్వీ. నీటిపై తేలియాడే ప్రాంతాలు నిజంగా అద్భుతాలు. అలాంటి అద్భుతాల్లో ఒకటే గాన్వీ. వెనిస్ అంత కాకపోయినా ఈ ఊరూ పర్యాటకానికి వరల్డ్ ఫేమస్సే. కారణం.. నీటి అందాలతో పాటు ఈ ఊరికి ఉన్న చారిత్రక నేపథ్యం. ఇది పశ్చిమ ఆఫ్రికా, బెనిన్ ప్రాంతంలోని నోకోయూ సరస్సు మధ్యలో ఉంటుంది. బానిసత్వం రాజ్యమేలిన కాలంలోనే గాన్వీ వెలిసిందని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట టోఫిన్ గ్రామ ప్రజలు.. ఫోన్తెగ పోరాటయోధులకు భీతిల్లి ఇలా నీటి మధ్యలో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్తెగ వాళ్లు తమను బానిసలుగా అప్పజెప్తారనే భయంతోనే టోఫిను ప్రజలు పారిపోయారు. అలా సరస్సు మధ్యలో వెలిసిన ఆ ఊరు.. ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. గాన్వీ అంటే వాళ్ల భాషలో ‘బతికి బట్టకట్టాం’ అని అర్థం. అందుకే ఆ పేరొచ్చింది గాన్వీ జనాభా ముప్పై వేలకు పైనే. వీళ్లు సరస్సు మధ్యలో గట్ల వెంట ఆరడుగుల కంటే ఎత్తులో వెదురు బొంగులు, చెక్కలతో ఇళ్లు నిర్మించుకున్నారు. మూడు వేలకు పైగా భవనాలు నీటి మధ్యలోనే ఉంటాయి. అందులో రెండు బడులు, ఓ బ్యాంకు, ఓ పోస్టాఫీస్, ఇంకా ప్రార్థన మందిరాలు ఉన్నాయి. నీటి ఆవాసం కారణంగా వీళ్లను ‘నీటి మనుషులు’(వాటర్ మెన్) అని వ్యవహరిస్తుంటారు. ఊరిలో తిరగడానికి ఏకైక మార్గం.. చిన్నపడవలు. అందుకే గాన్వీకి ‘వెనిస్ ఆఫ్ ఆఫ్రికా’ అనే పేరొచ్చింది. కోళ్లను ఎక్కువగా తినే గాన్వీ ప్రజలు.. తాటాకులతో, గడ్డిపోచలతో చేపలనూ వేటాడి తింటారు. ఒకప్పుడు చేపలు పట్టడమే ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. కానీ ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి.. టూరిస్ట్ గైడ్స్గా మారిపోతున్నారు. రీజన్.. టూరిస్టులు క్యూ కడుతుండడమే. సోలార్ ప్యానెల్స్, జనరేటర్స్, సరస్సు నీటితో కరెంట్ అందుతోంది ఈ ఊరికి. పడవల మీదే తిరుగుతూ కూరగాయలు, నిత్యావసరాలు అమ్ముతుంటారు. 1996లో గాన్వీ.. వెనిస్ ఆఫ్ ఆఫ్రికాకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది. నెట్ఫ్లిక్స్లో ఈమధ్యే స్ట్రీమింగ్లోకి వచ్చిన డాక్యుసిరీస్ ‘హై ఆన్ ది హోగ్: హౌ ఆఫ్రికన్ అమెరికన్ కజిన్ ట్రా¯Œ్సఫార్మ్డ్ అమెరికా’లో గాన్వీ గురించీ ఉంటుంది. రణగొణ ధ్వనులకు దూరంగా.. రాకపోకలకు బాటలుగా పిల్ల కాలువలున్నాయి. అందుకే కాలుష్యం ఈ నగరానికి ఆవలే ఉండిపోయింది. ఓవైపు వరదలు పోటెత్తుతున్నా.. మరోవైపు పర్యాటకులతో కిటకిటలాడుతోంది గాన్వీ. అందుకు కారణం.. మనసుకు సాంత్వననిచ్చే ప్రాంతం కావడమే. మొసలి రాజు? ఈ ఊరికి ఓ నేపథ్య కథ కూడా ప్రచారంలో ఉంది. బానిసత్వమంటే టోఫిన్ ప్రజలు భయపడుతున్న సమయంలో.. గాన్వీ రాజు ఒక కొంగగా మారి సురక్షితమైన ప్రదేశం కోసం గాలించాడు. ఆ తర్వాత నోకోయూ సరస్సును సురక్షితమైన ప్రాంతంగా గుర్తించి వాళ్లను అక్కడికి వెళ్లమని సూచించాడు. అయితే తమ వస్తువులతో అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో.. భారీ మొసలిగా మారిన ఆ రాజు తన వీపుపై వాళ్లందరినీ మోసుకుంటూ వెళ్లాడట. తీరా ఆ సరస్సులో శాపగ్రస్త ఆత్మలు ఉన్నాయనే భయంతో నది నీటిని తాకకూడదనే ఉద్దేశంతో కాస్త ఎత్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆ కథ సారాంశం. అయితే గాన్వీ నేటి తరం మాత్రం అలాంటి నమ్మకాలేవీ లేకుండా.. మొసళ్లు లేని ఆ సరస్సులో హాయిగా జీవిస్తోంది. -భాస్కర్ శ్రీపతి -
ఆఫ్రికాలో ఆర్బీకేలు!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల వరకు గ్రామస్థాయిలో రైతన్నలకు సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆఫ్రికా దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆర్బీకేలు అనుసరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేయూతను అందించనుంది. ఇథియోపియా ప్రతినిధి బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పు వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్బీకే వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. 10,778 ఆర్బీకేలు రైతులకు ఇంటి ముంగిటే అన్ని సేవలు అందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, మిశ్రమ దాణా, రొయ్యలు, చేపల మేత.. ఇలా సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కళ్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. వీటి సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘చాంపియన్’ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి. ఇథియోపియాలో సమృద్ధిగా సాగు భూములు ఆఫ్రికాలో అత్యంత పేద దేశమైన ఇథియోపియాకు వ్యవసాయం, పాడి రంగాలే ఆర్ధిక పునాది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 46.3 శాతం ఈ రంగాల నుంచే వస్తున్నప్పటికీ ఏటా 4.6 మిలియన్ల మంది ఆహార కొరతతో సతమతమవుతున్నారు. మొక్కజొన్న, కాఫీ, పప్పులు, తృణధాన్యాల సాగులో ప్రత్యేక స్థానం పొందిన ఇథియోపియాలో సాగు యోగ్యమైన భూములు విస్తారంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తేవడం, రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఉత్పత్తి ఖర్చులను నియంత్రించడం, నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించే లక్ష్యంతో సౌత్సౌత్ కో ఆపరేషన్ భాగస్వామి దేశాల్లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇథియోపియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్బీకేల తరహాలో అక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్బీకేలను సిఫార్సు చేసిన కేంద్రం ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్లో ఆర్బీకేల సేవల గురించి ప్రపంచ బ్యాంకు బృందానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో మరోసారి భేటీ కానున్న ఇథియోపియా–వరల్డ్ బ్యాంక్ –కేంద్ర బృందాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. జూన్ లేదా జూలైలో ఇథియోపియా వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఆర్బీకేల సేవలు, విస్తరణ కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. అనంతరం మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇథియోపియాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తుంది. మన శాస్త్రవేత్తలు, అధికారులు ఇథోయోపియాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతను తీసుకురావడంపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఐరాస –ఎఫ్ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్లో ఇథియోపియా కోసం వీటిని వరల్డ్ బ్యాంక్కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది మన ఆర్బీకేలకు దక్కిన మరో గౌరవం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు
ఫుట్బాల్ ఆటలో ఇరుజట్లు గోల్ కొట్టాలని ప్రయత్నిస్తాయి ఈ నేపథ్యంలో గోల్ అడ్డుకునే క్రమంలో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం అయితే ఒక్కోసారి అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్బాల్ లీగ్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. లీగ్లో భాగంగా సెనెగల్, కేప్ వర్డేల మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: ఫుట్బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి ఆట 57వ నిమిషంలో సెనెగెల్ స్ట్రైకర్ సాడియో మానే, కేప్వర్డే గోల్కీపర్ వోజిన్హా ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. గోల్ కొట్టే క్రమంలో సాడియో మానే.. కేప్వర్డే నెట్స్ వైపు వేగంగా దూసుకొచ్చాడు. అదే సమయంలో గోల్ కీపర్ వోజిన్హా గోల్ను అడ్డుకునే క్రమంలో బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ మానే అతని పైనుంచి గోల్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునే క్రమంలో అతని తల ..మానే తలకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన మానే స్టేడియంలోనే కుప్పకూలాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి చికిత్స అవసరమని చెప్పాడు. చదవండి: Australian Open 2022: పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు కానీ మానే ఇదేం పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. గాయం బాధిస్తున్నా నొప్పిని పంటికింద అదిమి సరిగ్గా ఆరు నిమిషాలకు గోల్ కొట్టాడు. అలా సెనెగ్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత గోల్ కొట్టడంలో కేప్వర్డే విఫలం కావడంతో సెనెగల్ క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. కాగా మానేను ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు గోల్ కీపర్ వోజిన్హాకు రిఫరీ రెడ్కార్డ్ చూపెట్టాడు. ఇక ఆదివారం మాలి వర్సెస్ ఈక్వెటోరియల్ జినియా మధ్య విజేతతో సెనెగల్ క్వార్టర్ఫైనల్లో తలపడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మానేను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం అయినప్పటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమి లేదని.. తర్వాతి మ్యాచ్కు తాను సిద్ధంగా ఉన్నట్లు మానే ఆసుపత్రిలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చదవండి: Mitchell Santner: మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి 💥 NASTY HEAD COLLISION BETWEEN SADIO MANE AND YOSIMAR DIAS! The goalkeeper was sent off after VAR review 🟥 Cape Verde down to nine men! 😱#TotalEnergiesAFCON2021 | #AFCON2021 | #SENCPV pic.twitter.com/GBGwasSHmk — beIN SPORTS USA (@beINSPORTSUSA) January 25, 2022 -
మిలటరీ బేస్ వద్ద తిరుగుబాటు జరిగిందంటూ వదంతులు!!
Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు. (చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత! -
పక్షిలా ఎగిరే విమానం!... ఎలాగో తెలుసా!!:
ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అయితే వీటీఓఎల్ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి.. 19 మంది మృతి..
బుర్కినా ఫాసో(ఆఫ్రికా): ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడులలో 19 మంది అమాయకులు మృతి చెందారు. వీరిలో 9 మంది భద్రత దళాలున్నట్లు సమాచారం. సెంటర్ నార్త్ రీజియన్లో జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిని ముష్కరులు కాలబెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణల కారణంగా బుర్కినాఫాసోలో హింస రోజురోజుకి పెరుగుతుంది. దీంతో వేలాది మంది అమాయకులు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్తో తాగేస్తోంది.
Black Cobra Drinks Water From Glass Video Goes Viral: చాలామంది పాముని చూస్తేనే హడలిపోయి పారిపోతారు. అంతెందుకు కొన్ని విషపూరిత పాములను చూస్తేనే వొళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒక విషపూరితమైన పాముకి గ్లాస్తో నీళ్లు తాగించాడు ఇక్కడొక వ్యక్తి. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....ఆఫ్రికాలో, ఉప-సహారా ప్రాంతంలో కనిపించే బ్లాక్ కోబ్రా వస్తున్నప్పడే ఒక రకమైన శబ్దంతో వస్తాయి. పైగా అవి తమకు ఏదైన అపాయం వాటిల్లుతుందని తెలిస్తే ఒకేసారి పెద్ద ఎత్తున విషాన్ని వెదజిమ్ముతాయి. అలాంటి బ్లాక్ కోబ్రాకి ఇక్కడొక వ్యక్తి గ్లాస్తో నీళ్లు పట్టిస్తాడు. పైగా ఆ కోబ్రాకి కూడా చాలా దాహం వేసినట్టుంది. తెగ ఆత్రుతగా తాగేస్తుంది. కానీ నీళ్లు తాగిస్తున్న వ్యక్తికి ఏ మాత్రం హానీ చేయదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్ లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ) View this post on Instagram A post shared by Royal Pythons (@royal_pythons_) -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్పెడిషన్కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ మేరకు మురికి పులకిత హస్వి మాట్లాడుతూ..."ఇది ఒక సాహసోపేతమైన అనుభవం. కిలిమంజారో పర్వతం పై అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ముందు మూడు నెలల నుంచే ఈ పర్వతారోహణకు సన్నద్ధం కావాల్సి ఉంది. పైగా పర్వతారోహణకు మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకోసం యోగా, మెడిటేషన్ వంటివి చేసేదాన్ని. నేను 2024కి ముందు మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాని అందుకోసం నేను ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను. " అని చెప్పింది. (చదవండి: మేడం..! ఈ పర్స్ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్ అదే..) -
రు.600 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ మాదక ద్రవ్యాలను గుజరాత్ ఉగ్ర వ్యతిరేక బృందం స్వాధీనం చేసుకుంది. కేసులో ముగ్గురిని అరెస్ట్చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని దేశానికి తరలించేందుకు పాకిస్తాన్కు చెందిన జహీద్ బషీర్ బలూచ్ అనే వ్యక్తి నుంచి 120 కేజీల హెరాయిన్ను ఈ ముగ్గురు తెప్పించారని పోలీసులు వెల్లడించారు. మోర్బీ జిల్లాలోని జింజువా గ్రామంలో ఈ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆశిశ్ భాటియా చెప్పారు. -
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
-
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
సియర్రాలియోన్/ ఆఫ్రికా: ఆఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 91 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా సియర్రాలియోన్లో శనివారం చోటు చేసుకుంది. సియర్రాలియోన్ రాజధాని ఫ్రీటౌన్లో ఈ పేలుడు సంభవించింది. ఆ వివరాలు.. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతుండటంతో దాన్ని పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచారు. విషయం తెలిసిన స్థానికులు లీకవుతున్న చమురును పట్టుకునేందుకు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి: భూమి కుంగడంతోనే ప్రమాదం) ఇదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు, బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 91 మంది మృతి చెందినట్లు అధికారుల ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చదవండి: రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది? -
African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!
ఓటింగ్, మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే! -
సూడాన్లో సైనిక తిరుగుబాటు
కైరో: ఆఫ్రికా దేశం సూడాన్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకున్న సైన్యం..దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ పరిపాల నాబాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్ను రద్దు చేయడంతోపాటు ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా బుర్హాన్ చేసిన ప్రకటన టీవీ చానెళ్లలో ప్రసారమైంది. రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. సైనిక తిరుగుబాటు వార్తలతో ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని ఖార్తూమ్ వీధుల్లోకి చేరుకున్నారు.టైర్లకు నిప్పుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్ను పదవి నుంచి తొలగించాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేందుకు మిలటరీ అధికారులు, పౌర నేతలతో ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏర్పాటుతోపాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించారు. ప్రజా ప్రభుత్వా నికి నవంబర్లో అధికారం అప్పగించాల్సి ఉంది. -
బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!
డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!! పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్మ్యాన్గా అందరికీ గుర్తుండిపోయాడు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్ప్రెస్సివ్గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్గా మారి..! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ట్యునీసియా కేబినెట్లో రికార్డు స్థాయిలో మహిళలు
ట్యునిస్: ఆఫ్రికా దేశం ట్యునీసియాలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు చోటు దక్కింది. అధ్యక్షుడు కైస్ సయీద్ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్ను బర్తరఫ్ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి నజ్లా బౌడెన్ పేరును ప్రతిపాదించారు. తాజాగా, దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్ 24 మంత్రులతో కేబినెట్ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బౌడెన్ ప్రకటించారు. -
127వ ఏట మృతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం
ఆఫ్రికా/అస్మారా: ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం 65-70 ఏళ్లు. మనకంటే 20-30 ఏళ్ల ముందు వారి ఆయుర్దాయం 80-90 ఏళ్లు. ఇక ఎక్కడో ఓ చోట కొందరు శతాధిక వృద్ధులు తారసపడుతుంటారు. ఇప్పటి వరకు మనం 100 ఏళ్ల కు పైబడిన వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్తలోని వ్యక్తి ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన మనిషిగా రికార్డు సృష్టించబోతున్నాడు. కాకపోతే మరణించిన తర్వాత. సదరు వ్యక్తి 127 సంవత్సరాల వయసులో మరణించాడని.. అతడని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గుర్తించాల్సిందిగా గిన్నిస్ రికార్డ్ బుక్ ప్రతినిధులను కోరారు మరణించిన వృద్ధుడి కుటుంబ సభ్యులు. ఆ వివరాలు.. ఆఫ్రికాలోని అజెఫాలో ఎరిత్రియాకు చెందిన నటాబే మాచేట్ సోమవారం మరణించాడు. ప్రస్తుతం నటాబే వయసు 127 సంవత్సరాలని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అందుకే అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నటాబేని అత్యంత కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గుర్తించాలని కోరింది. ఈ క్రమంలో నటాబే మనవడు జీర్ తన తాత పుట్టుకకు సంబంధించిన పత్రాలను గిన్నిస్ బుక్ వాళ్లకు అందించాడు. (చదవండి: లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు) చర్చి రికార్డులు ప్రకారం 1894లో నటాబే జన్మించినట్లు జనన ధ్రువీకరణ పత్రంలో ఉందన్నాడు జీర్. అయితే ఆయన జన్మించిన పదేళ్ల తర్వాత బాప్టిజం పొందాడని తెలిపాడు. దీని ఆధారంగా తన తాత 127 ఏళ్లు బతికినట్లు తను ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరిస్తున్నాయని జీర్ తెలిపాడు. సహనం, దాతృత్వం, సంతోషకరమైన జీవితమే.. నటాబే సుదీర్ఘకాలం జీవించడానికి కారమణమని మీడియాకు వెల్లడించారు అతడి కుటుంబ సభ్యులు. తన తాత “అసాధారణమైన వ్యక్తి” అని జీర్ తెలిపాడు. 1934 లో నటాబే వివాహం చేసుకున్నాడని తెలిపాడు. తాత-నానమ్మలిద్దరూ సుద్ఘీకాలం జీవించారన్నాడు. నటాబే భార్య 2019 లో 99 సంవత్సరాల వయసులో మరణించింది. నటాబే తన జీవితంలో ఎక్కువ భాగం పశువుల కాపరిగా గడిపాడని జీర్ తెలిపాడు. 2014 లో, నటాబే 120 వ పుట్టినరోజును గ్రామం మొత్తం జరుపుకుంది. (చదవండి: ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు) ప్రస్తుత అత్యధిక కాలం జీవించిన రికార్డు జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ పేరు మీద ఉంది. ఆమె 1997లో 122 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా జపాన్కు చెందిన జిరోమోన్ కిమురా ఉన్నాడు. అతను 2013 లో 116 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సమాధానం కోసం నటాబే కుటుంబం ఎదురుచూస్తోంది. చదవండి: చావునుంచి తప్పించుకోవచ్చేమో, కామాక్షి నుంచి తప్పించుకోలేరు?! -
ఒక జీబీ @ రూ.3,659
మొబైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా ఎన్నో యాప్స్.. ఎన్నో పనులు.. ప్రతిదానికీ డేటా అవసరమే. డబ్బులు చెల్లించి డేటాను రీచార్జి చేసుకోవాల్సిందే. మన దగ్గర కొన్నేళ్లుగా డేటా ధరలు బాగా తగ్గిపోయాయిగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేట్లు చుక్కలను తాకుతూనే ఉన్నాయి. మరి ఏ దేశంలో సగటున ఒక్కో గిగాబైట్ (జీబీ) డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దీనిపై బ్రిటన్కు చెందిన కేబుల్ అనే వెబ్సైట్ విస్తృతమైన సర్వే చేసి లెక్కలు తేల్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా? 230 దేశాల్లో పరిశీలించి.. అమెరికాకు చెందిన గూగుల్, న్యూఅమెరికాస్ ఓపెన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ల ఉమ్మడి సంస్థ ఎం–ల్యాబ్, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెట్ ల్యాబ్ తదితర సంస్థల సహకారంతో కేబుల్ డాట్ యూకే వెబ్సైట్ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ప్లాన్లు, ధరలపై సర్వే చేశారు. 230 దేశాల్లో 6000 మొబైల్ డేటా ప్లాన్ల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయా దేశాల్లోని ప్రధాన టెలికాం సంస్థల డేటా ప్యాకేజీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో గుర్తించిన వివరాలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. ►ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా ఖండాల పరిధిలోని దీవుల్లో డేటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ►టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. ►ప్రపంచ సగటు డేటా ధరల కంటే అగ్రరాజ్యమైన అమెరికా, దాని పరిసర దేశాల్లో డేటా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా (154వ ర్యాంకు), జపాన్ (156వ ర్యాంకు) తదితర దేశాల్లో సగటున ఒక జీబీ రేటు రూ.250కిపైనే ఉంది. ►యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ మినహా మిగతా దేశాల్లో డేటా ధరలు చాలా ఎక్కువ. ►పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఇండియా కంటే తక్కువ ధరలకు మొబైల్ డేటా అందుబాటులో ఉందని సర్వే పేర్కొంది. ►ఇప్పటికీ 2జీ, 3జీ మొబైల్ నెట్వర్క్లను వినియోగిస్తున్న దేశాల్లో.. తక్కువ మొత్తంలో డేటాకు ఎక్కువగా చార్జి చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఒక్కో జీబీ డేటాకు రేటు వేల రూపాయల్లోకి వెళుతోంది. -
రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది?
టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని వసతులొచ్చినా.. నేటికీ ఏదో ఒక నదినో, సరస్సునో, వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. సస్యశ్యామలమైన, అహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే పరిసరప్రాంతాలనే ఇష్టపడుతుంటారు. అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరపడాలని కోరుకుంటారు. ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ వాసుల పాలిట శాపం అయ్యింది. మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్లో న్యోస్ సరస్సు చుట్టూ పల్లెలు పచ్చగా అల్లుకున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు, సమూహాలకు సమూహాలు గుమిగూడి గ్రామాలుగా మారాయి. కానీ ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి ఊహించని విధంగా శ్మశానాలైపోయాయి. సరస్సు పొంగి ఊళ్ల మీదకు వరదై రాలేదు.. ఎండిపోయి కరువు ఎద్దడులూ తేలేదు. కానీ.. 5,246 ప్రాణాలను బలిగొంది. అసలు ఏం జరిగింది? ఈ వారం మిస్టరీలో.. ‘న్యోస్ సరస్సు’.. ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది. ఆవాసానికి అనువుగా ఉండటంతో.. చా, న్యోస్, సుబుమ్ అనే గ్రామాలు సరసు చుట్టూ ఏర్పడ్డాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అక్కడ జనం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 1986లో ఆగస్టు 21న గాఢ నిద్రలో ఉన్న ఆ మూడు గ్రామాల ప్రజలు.. ఇక నిద్రలేవలేదు. మరునాడు ఎక్కడ చూసినా శవాలే. మంచం మీద ఉన్నవారు మంచం మీదే.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు. పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు మాత్రం.. ‘ఆ రాత్రి తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా గాలి స్తంభించింది. ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఆ తర్వాత స్పృహ లేదు’ అని చెప్పుకొచ్చారు. చనిపోయినవారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కథను మిస్టరీగా మార్చాయి. ఈ విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు.. 3,500 జంతువులు, పక్షులు చనిపోయాయని, రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్ సరస్సు నుంచే వచ్చిందని తేల్చారు. అసలేం జరిగింది? ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది. నీరు చేరినా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు. ఆ రాత్రి 9 గంటలకు.. రసాయనిక చర్యల్లో భారీ మార్పులు జరిగి.. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్ డై ఆక్సైడ్ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. 25 కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన పరిశోధకుడు డెవిడ్ బ్రెస్సెన్ నాటి పరిస్థితిని వివరిస్తూ.. ‘నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. న్యోస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది. కదలిక చోటుచేసుకోవడంవల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది’ అన్నారు. అయితే ఇలాంటì ఘటనే 1984లో కూడా జరిగింది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మొనౌన్ సరస్సు కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై 37 మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. న్యోస్ ఘటన జరిగుండేది కాదనే విమర్శలూ వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. మొత్తానికి న్యోస్ సరస్సు ఓ విషాదంగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే
గినియా/కోనక్రీ: కరోనా మహమ్మారికి కళ్లెం వేయకముందే ప్రపంచం ముంగిట మరో కొత్త సమస్య ప్రవేశించింది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో మహమ్మారి తరుముకొస్తుంది. ఇది కరోనా కన్న మరింత ప్రమాదకరం అని.. ఒక్కసారి ఈ వైరస్ సోకితే మరణమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ వివరాలు.. పశ్చిమ ఆఫ్రికా గినియాలో మరో ప్రమాదకర వైరస్ వెలుగు చేసుంది. దీని పేరు మార్బర్గ్ అని.. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుందని.. దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దక్షిణ గెక్కెడౌ ప్రిఫెక్చర్ ప్రాంతంలో తొలి మార్బర్గ్ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్బర్గ్ వైరస్ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు. గినియాలో ఎబోలా సెకండ్ వేవ్ ముగిసిందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన రెండు నెలలకే ఈ కొత్త వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మార్బర్గ్ సాధారణంగా రౌసెట్టస్ గబ్బిలాలకు ఆవాసాలుగా మారిన గుహలు, మైన్స్ల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వైరస్ వ్యాప్తిలో మరణాల రేటు 88 శాతంగా ఉంటుందన్నారు. ఏంటి మార్బర్గ్ వైరస్.. మార్బర్గ్ కూడా ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన వైరసే. దాని కన్నా ఇది మరింత ప్రమాదకారి. ఈ వైరస్ సోకిన వారు రక్తస్రావ జ్వరం బారిన పడతారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్గ్రేడ్, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్బర్గ్, ప్రాంక్ఫర్ట్ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది. వైరస్ పొదిగే కాలం రెండు నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. 2008 లో, ఉగాండాలోని రౌసెట్టస్ గబ్బిలాలు నివసించే గుహను సందర్శించిన ప్రయాణికులలో రెండు స్వతంత్ర కేసులు గుర్తించారు. మార్బర్గ్ వ్యాధి లక్షణాలు... మార్బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవి ఒక వారం పాటు కొనసాగుతాయి. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు లోపలికి పోయి.. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక.. విపరీతమైన బద్ధకంగా ఉంటారు. ఇక మలేరియా, టైపాయిడ్, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినట్లు.. మార్బర్గ్ను గుర్తించడం కష్టమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్టీపీసీఆర్ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన తెలిపింది. -
ఆఫ్రికా దేశం మాలిల్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర ప్రమాదం: లారీ, బస్సు ఢీ 41 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ బస్సు ఢీకొన్న ఘటనలో 41 మంది మరణించారు. మరో 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన ట్రక్కు బస్సు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. వస్తువులు మార్కెట్ కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్యాసింజర్ బస్సును ఢీకొట్టినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు మీదికి దూసుకెళ్లిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఆఫ్రికాలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మంది జనాభాకు 26 మరణాలు నమోదవుతున్నాయి. -
మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’
కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి. ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే. కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు. సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. – నాగవర్ధన్ రాయల జర్నలిస్ట్ -
ఆఫ్రికా లో అశాంతి
-
ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం
ప్రపంచంలో మూడో అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం. ఆంగ్లో అమెరికన్(ఎఎఎల్), బీర్స్, స్థానిక ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో జరిపిన తవ్వకాలలో ఇది దొరికింది. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. గతంలో దొరికిన అతిపెద్ద వజ్రాలలో మొదటి రెండు కూడా ఆఫ్రికాలోనే దొరికాయి. మొదటి అతిపెద్ద 3,106 క్యారెట్ల వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. దీనికి కుల్లినన్ స్టోన్ అని పేరు పెట్టారు. 2015లో బోట్స్వానాలో లుకారా డైమండ్స్ 1,109 క్యారెట్ల "లెసెడి లా రోనా" అనే రెండవ అతిపెద్ద వజ్రాన్ని వెలికి తీసింది. గత 50 సంవత్సరాల చరిత్రలో డెబ్స్వానా స్వాధీనం చేసుకున్న అతిపెద్ద వజ్రం ఇది అని ఆర్మ్ స్ట్రాంగ్ చెప్పారు. ప్రాథమిక విశ్లేషణ తర్వాత ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వజ్రం అని పేర్కొన్నారు. 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 27 మి.మీ మందం కలిగిన ఈ వజ్రానిక్ ఇంకా పేరు పెట్టలేదు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల వజ్రాల అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు ఈ వజ్రం దొరకడంతో మళ్లీ మంచి రోజు వచ్చినట్లు ఖనిజాల శాఖ మంత్రి లెఫోకో మోగి తెలిపారు. డివిడెండ్లు, రాయల్టీలు, పన్నుల ద్వారా డెబ్స్వానా అమ్మకాల రూపంలో ప్రభుత్వం 80 శాతం ఆదాయాన్ని అందుకుంటుంది. ఉత్పత్తి 2020లో డెబ్స్వానా 29 శాతం పడిపోయి 16.6 మిలియన్ క్యారెట్లకు పడిపోయింది. ఈ మహమ్మారి ప్రభావం ఉత్పత్తి, డిమాండ్ రెండింటి మీద పడటంతో అమ్మకాలు 2.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. 2021లో ప్రపంచ వజ్రాల మార్కెట్ కోలుకోవడంతో 38 శాతం ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట! -
Corona Vaccination:జో బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్హౌజ్ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్సైట్స్ ఒక కథనం ప్రచురించాయి. కాగా, ఫైజర్ బయోఎన్టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్ డోసులు, మిగిలిన 300 మిలియన్ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్ డోసుల డొనేషన్లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్ దేశాలకే అందించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్హౌజ్ ప్రకటించింది. ఇక ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. జీ7 సమ్మిట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ఏకైక పరిష్కారమిదే -
5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ శుభవార్త అందించింది. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్వర్క్లోని తక్కువ-ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ.49 ప్యాక్ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. రూ.49 ప్యాక్ కింద 100 ఎంబి డేటా, 38 విలువైన టాక్ టైమ్ రూ.28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో క్లిష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడనున్నట్లు పేర్కొంది. అలాగే, ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం ఉందని గ్రహించిన ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.79తో రీఛార్జ్తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఈ కూపన్ల వల్ల క్లిష్ట సమయాల్లో వారి కుటుంబంతో కనెక్ట్ అవ్వొచ్చని పేర్కొంది. ఈ రెండు ప్రయోజనాలు రాబోయే వారం రోజుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని 18 దేశాలలో 45.8 కోట్లకు పైగా కస్టమర్లు కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఎయిర్టెల్ ఒకటి. ఇది ఆఫ్రికన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్. ప్రస్తుతం మనదేశంలో భారతీ ఎయిర్టెల్కు 34కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చదవండి: హీరో మోటోకార్ప్ ప్రియులకు తీపికబురు -
ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?
పిట్టది, చెట్టుది అవినాభావ సంబంధం.. పిట్టలు గూళ్లు కట్టుకుని బతకడానికి చెట్లు కావాలి.. గింజలు దూరంగా పడి చెట్లు విస్తరించడానికి పిట్టలు కావాలి.. కానీ ఆ చెట్లు, వాటి గింజలే పిట్టలకు ప్రాణాంతకమైతే..? పిట్టలన్నీ ఇష్టంగా వచ్చి గూళ్లు కట్టుకునే చెట్టే.. వాటి ప్రాణాలు పోవడానికి కారణమైతే..? అవును.. అలాంటి ఓ చెట్టు కథే ఇది. ఆ చెట్టు పేరు పిసోనియా. అన్ని చెట్లలా ఇదీ ఓ సాధారణ చెట్టే అయినా.. పక్షులు చనిపోవడానికి కారణమై ‘బర్డ్ క్యాచర్’ అనే పేరు తెచ్చుకుంది. మరి ఎందుకిలా జరుగుతోంది, కారణం ఏమిటో తెలుసా? మిగతా చెట్లలాగానే ఉన్నా.. ఆఫ్రికా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఈ పిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్ల లాంటివే. అన్నింటిలాగే పూలు పూస్తాయి, గుత్తులుగా గింజలు ఏర్పడుతాయి. ఇవి విషపూరితమో, మరో రకంగానో ప్రమాదం కలిగించేవో కాదు. ఈ చెట్టు గింజలకు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది, దానిపై సన్నని కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. చెట్టుపై వాలిన ఏవైనా పక్షులు, పురుగులకు ఈ గమ్, కొక్కాలు ఉన్న గింజలు అంటుకుని.. తర్వాత ఎప్పుడో దూరంగా రాలిపోతాయి. అలా దూరంగా పడిన గింజలు మొలకెత్తి పిసోనియా చెట్లు పెరుగుతాయి. ఇలా చెట్లు, మొక్కల జాతులు విస్తరించడం ప్రకృతిలో సహజమే. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఆ గింజలతో.. పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్ఫుల్. పిట్టలేవైనా ఈ చెట్టుమీద వాలినప్పుడు ఆ గింజలు వాటి ఈకలకు అతుక్కుంటాయి. గుత్తులు గుత్తులుగా గింజలు ఉంటాయి కాబట్టి.. పిట్టలకు తల దగ్గరి నుంచి తోక దాకా అంటుకుంటాయి. వాటి బరువు వల్ల, ఈకలు అతుక్కుపోవడం వల్ల పక్షులు ఎగరలేకపోతాయి. ఎగిరినా కొంత దూరంలో కిందపడిపోతాయి. గింజలు ఎక్కువగా అతుక్కుంటే పెద్దగా కదల్లేని స్థితిలో పడిపోతాయి. చివరికి ఆహారం లేక చనిపోతాయి. లేకుంటే పాములు, ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి. పిట్టలు, చిన్న చిన్న పక్షులు అయితే.. పిసోనియా గింజల గుత్తులకు అలాగే అంటుకుపోతాయి. అలా వేలాడుతూనే చనిపోతాయి. చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షుల డెడ్బాడీలు, అస్థి పంజరాలు వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్ క్యాచర్స్’ అని పిలుస్తుంటారు. ఈ చెట్లంటే.. పక్షులకు ఎంతో ఇష్టం పిసోనియా చెట్ల కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా.. చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టం. ఎక్కడా కూడా పక్షులు గూళ్లు పెట్టని పిసోనియా చెట్టు ఒక్కటి కూడా కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా సముద్ర పక్షులు వలస వచ్చే సమయంలోనే పిసోనియా చెట్లు పూలు పూసి, గింజలు ఏర్పడుతాయి. ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెడతాయి. ఈ పక్షి పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి. సీషెల్స్ దేశంలోని కజిన్ ఐల్యాండ్స్లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. పిసోనియా చెట్ల కారణంగా.. వైట్ టెర్న్స్ పక్షుల్లో నాలుగో వంతు, ట్రాపికల్ షీర్వాటర్స్ పక్షుల్లో పదో వంతు చనిపోతున్నాయని తేల్చారు. ఏటా లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఇదేం ముంగిస.. ఉన్నట్టుండి చస్తుంది.. మళ్లీ! వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట -
హిందూ మహాసముద్రంలో వింత జీవి
మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు, రకరకాల జంతు జాతులు ఉంటాయి. ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సహికులు ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వండర్స్ ఎన్నో ఉంటాయి. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు. తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు 3,700 అడుగుల లోతున కనీవినీ ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఈ వింత జీవి కదిలికలు అన్ని కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది పలు రకాల షేపులు మారుస్తూ, అతి వేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్ల బంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేపు మారుస్తూ కనిపించింది. కొందరు దీన్ని సముద్ర ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు. కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ని గుర్తు చేస్తున్నారు. ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్ ను 2013లో ఆన్లైన్లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్రికా తూర్పు తీరంలో తీయబడింది. ఇప్పుడు యూట్యూబ్లో దీనిని 1.5 మిలియన్లకు పైగా చూశారు. నాటి నుంచి నేటి వరకు ఈ విచిత్ర జీవి ఏమిటో అనేది ఎవరు చెప్పలేక పోతున్నారు. చదవండి: గడ్డకట్టే చలిలో డాన్స్ అంటే మాటలా... -
ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా..
‘ఒక్కగానొక్క ఆడబిడ్డ’ అన్నట్లుగా కమలా హ్యారీస్ను అమెరికాలో అందరూ తమ కుటుంబ సభ్యురాలిని చేసుకున్నారు! ఆమె ‘పరిపూర్ణమైన అమెరికన్’ అయుంటే ఇంకా బాగుండేదనే భావన తెల్లజాతి స్థానికుల్లో ఉన్నప్పటికీ, తమ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమెను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మహిళలైతే ఆమెతో ఏమైనా చెప్పాలని ఉత్సాహపడుతున్నారు కూడా. ఆ ఉత్సాహం ఒక్క అమెరికన్ మహిళల్లోనే కాదు, యావత్ ప్రపంచ మహిళల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్ని న్యూయార్క్లోని ఆఫ్రో–అమెరికన్ రచయిత్రి డాక్టర్ పెగ్గీ బ్రూక్స్ కనిపెట్టారు. కమలపై తనొక పుస్తకం వేస్తున్నాననీ, ఆమెకు ఏదైనా చెప్పదలచినవారు ఉత్తరం రాసి తనకు పంపిస్తే ఆ ఉత్తరాలను పుస్తకంగా వేస్తానని ప్రకటించారు. వేల ఉత్తరాలు వచ్చాయి. వాటిలోంచి 120 ఉత్తరాలు ఎంపిక చేసి పుస్తకంగా విడుదల చేశారు పెగ్గీ బ్రూక్స్. పెగ్గీ బ్రూక్స్ వేసిన ఆ పుస్తకం పేరు ‘డియర్ కమల: ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్’. ఆ పుస్తకాన్ని ఒక వ్యక్తి తప్పకుండా చదవాలని బ్రూక్స్ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కమలా హ్యారిస్! ఇప్పటికే ఒక కాపీని ఆమె యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి పంపించారు కనుక కమల ఆ పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. పైగా అందులోనివి వివిధ మహిళలు తనకు రాసిన ఉత్తరాలు! నేడు, రేపట్లో కమల నుంచి బ్రూక్స్కి ఒక సందేశం వచ్చినా రావచ్చు..‘బ్రూక్స్.. మీ ప్రయత్నం నాకెంతగానో ఉపకరిస్తుంది’ అని. మంచి విషయానికి స్పందించకుండా ఉండలేకపోవడం కమల స్వభావం. పుస్తకంలో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఆ ఉత్తరాలను సమన్వయం చేస్తూ కమలా హ్యారిస్తో ఒక రచనా ప్రక్రియగా రచయిత్రి బ్రూక్స్ పంచుకున్న మనోభావాలూ ఉన్నాయి. ‘‘ఉత్తరాల్లో ఎక్కువ భాగం.. సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను తొలగించమని కోరుతూ చేసిన విజ్ఞప్తులే ఉన్నాయి’’ అంటున్నారు బ్రూక్స్. ∙∙ బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన భార్య, ‘ఫస్ట్ లేడీ’ అయిన మిషెల్ ఒబామా మీద కూడా ఇదే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బ్రూక్స్. ఆ పుస్తకం పేరు ‘గో, టెల్ మిషెల్’. అయితే రాజకీయాల్లో ఉన్న మహిళలు, రాజకీయ నేతల భార్యల మీద మాత్రమే పుస్తకాలు రాసే స్పెషలిస్టు కారు బ్రూక్స్. ప్రధానంగా ఆమె ఆఫ్రో–అమెరికన్ మహిళల జీవిత వైవిధ్యాలకు, వారి జీవన వైరుధ్యాలకు ప్రామాణికత కల్పించే చరిత్రకారిణి. కవయిత్రి, నాటక రచయిత్రి. ఆమె రాసిన ‘వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్’ గ్రంథం జగద్విఖ్యాతి చెందినది. కుషైట్లది ఈజిప్టులోని ఇరవై ఐదవ రాజవంశం. డెబ్బై ఎనిమిదేళ్ల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్లో జన్మించారు. భర్త yð న్నిస్తో కలిసి 1986లో న్యూయార్క్ వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. పుస్తకాలు, నాటికలు ఆమె జీవనాసక్తులు. ఆమె చదివేవీ, రాసేవీ అన్నీ కూడా స్త్రీల సంబంధ సామాజికాంశాలే. పొలిటికల్ సైన్స్ బి.ఎ. చదివారు. ప్రజారోగ్యంపై రెండు డాక్టరేట్లు చేశారు. అవి కూడా ఉమెన్ హెల్త్ పైనే. కుటుంబ బంధాలపై, ముఖ్యంగా తల్లీబిడ్డల అనుబంధాలపై ఆమె రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడితే సమాజం, సామాజిక సంబంధాలు మెరుగుపడితే స్త్రీల స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు పెగ్గీ బ్రూక్స్. -
బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి
అందుకే అంటారు బాడీ ఉంటే సరిపోదు.. కాసింత బుర్ర కూడా ఉండాలి అని.. ఇక్కడ జరిగిందదే.. ఈ చీతాకు సెకన్ల వ్యవధి చాలు..గంటకు 95 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి.. ఈ ఇంపాలా మాత్రం గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తగలదు.. స్పీడ్ ప్రకారం చూస్తే.. చీతాదే పైచేయి.. మరి స్ట్రాటజీ.. ఇక్కడ స్పీడ్ చీతాది అయితే.. స్ట్రాటజీ ఇంపాలాది. అది 80 కిలోమీటర్ల వేగంలోనూ జిగ్జాగ్ తరహాలో పరిగెత్తగలదు.. దాంతో ఇంపాలాను.. లంచ్ కింద లాగించేయాలని చూసిన చీతాకే చివరికది చుక్కలు చూపించింది. జిగ్జాగ్ తరహాలో పరిగెత్తుతూనే చివరి నిమిషంలో గాడిదలా ఓ బ్యాక్ కిక్ ఇచ్చుకుంది. చూశారుగా.. దాని పరిస్థితి.. ఇక దాని గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్.. ఆఫ్రికా అడవుల్లో జరిగిన ఈ సన్నివేశాన్ని ఈ లు అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. -
ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు
ఆఫ్రికాకు చెందిన ఓ ఫ్యామిలీ చాలా ప్రత్యేకమైనది. ఎంతంటే?.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేంత. వారి ప్రత్యేకత ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకే సైకిల్ మీద ప్రయాణించటం. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా పది మంది సైకిల్ మీద సర్కస్ చేస్తున్నట్లు ఒకరిపై ఒకరు కూర్చుని ప్రతీ రోజు జర్నీ చేస్తారు. చిన్నారులతో సైకిల్ మొత్తం నిండిపోయినా.. దారి సరిగా కనిపించకపోయినా దాన్ని నడుపుతున్న వ్యక్తి ఎలాంటి అసహనానికి గురికాకపోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన 48 సెకన్ల నిడివి కలిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ( అతడికి సెల్యూట్.. నిజంగా రియల్ హీరో ) దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఫ్యామిలీ సర్కస్ అంటే ఇదేనేమో’’.. ‘‘ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు’’.. ‘‘ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ ఫ్యామిలీ’’.. ‘‘ ఈ ఫ్యామిలీని గిన్నిస్ బుక్లో ఎక్కించాలి!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఆఫ్రికాలో ఎక్కడ జరిగింది. వారు ఎవరు అన్న సంగతి మాత్రం తెలియలేదు. -
ఆఫ్రికన్ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్
అచ్చం మన బ్రహ్మిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కడుపుబ్బా నవ్వించే ఆఫ్రికన్ యాక్టర్ ‘ఒసితా ఇహెమ్’. సందర్భానికి తగ్గట్టు ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా ఒసితా దగ్గర దొరుకుతుంది. కొందరు తమలో ఉన్న క్రియేటివిటీని మీమ్స్ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అలాంటి మీమ్స్లో చిన్నపిల్లాడి క్యారెక్టర్లో కనిపిస్తూ నవ్వులు పూయిస్తుంటారు ఒసితా. ట్విట్టర్,ఫేస్బుక్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఎక్కడ చూసినా ఒసితా ఫొటోలు, జీఐఎఫ్, మీమ్స్ కనిపిస్తాయి. 1982 ఫిబ్రవరి 20న నైజీరియాలోని ఇమొ రాష్ట్రంలో ఒసితా ఇహెమ్ జన్మించారు. జన్యులోపం కారణంగా 38 ఏళ్ల ఒసితా చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. తన మరుగుజ్జు ఆకారాన్ని చూసి ఒసితా ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. తనకెంతో ఇష్టమైన సినీ రంగంలో మంచి కమెడియన్గా రాణిస్తున్నాడు. 2002లో నాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒసితా 2003లో ‘అకీ నా ఉక్వా’ అనే నైజీరియన్ సినిమాలో పావ్పావ్ అనే బాలుడి పాత్ర లో తన నటనతో జీవించేశాడు. ఈ క్యారెక్టర్ నైజీరియన్లతోపాటు ప్రపంచ దేశాలను మెప్పించింది. అప్పటినుంచి ఒసితాపేరు ‘పావ్పావ్’అని ప్రముఖంగా వినిపించేది. వందకుపైగా సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. 2007లో ఒసితా నటనను గుర్తించిన ఆఫ్రికన్ మూవీ అకాడమీ ‘లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు’తో సత్కరించింది. కమెడియన్గా, నిర్మాతగా, అన్ని విభాగాల్లో రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒసితా. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ.. యువతను ప్రోత్సహిస్తున్నాడు. ఆఫ్రికా, నైజీరియన్ యువత లో స్ఫూర్తి నింపేందుకు ‘ఆఫ్రికా ఇన్స్పైర్డ్ మూమెంట్’’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తూ సేవలందిస్తున్న ఒసితా కృషికి గుర్తింపుగా నైజీరియా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్’ వరించింది ఆయన్ని. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
సంతబొమ్మాళి: దేశంకాని దేశంలో చిక్కుకున్న తమ వాళ్లు ఎప్పుడొస్తారో అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని లిబియా బాధితుల కుటుంబాల కల ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, చొరవతో ఆఫ్రికా దేశం లిబియాలో చిక్కుకున్న ముగ్గురు జిల్లా యువకులకు విముక్తి కలిగింది. గురువారం స్వగ్రామమైన సీతానగరంలో అడుగుపెట్టిన బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనై తమ కుటుంబ సభ్యులను హత్తుకొని ఆనందభాష్పాలు కార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియా వెళ్లారు. అక్కడ కంపెనీలో 11 నెలలపాటు పనిచేశారు. తిరిగి భారత్ వచ్చేందుకు సెపె్టంబర్ 14న లిబియా రాజధాని ట్రిపోలి ఎయిర్పోర్టుకు కారులో వస్తుండగా మార్గమధ్యంలో దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుల కుటుంబసభ్యులు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెచ్చారు. వారు వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాచారాన్ని చేరవేశారు. సీఎం చొరవ, కృషితో లిబియాలోని భారత రాయబార కార్యాలయం.. కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలా ప్రయతి్నంచింది. దీంతో 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి యువకులు బయటపడ్డారు. బుధవారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరిన యువకులు గురువారం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ఎక్కి విశాఖపట్నం చేరారు. అక్కడి నుంచి కారులో స్వగ్రామమైన సీతానగరం చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మార్గమధ్యంలో యువకులు ఎస్పీ అమిత్ బర్దార్ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ చూస్తామనుకోలేదు.. బతుకుతెరువుకు లిబియా వెళ్లి కిడ్నాప్కు గురయ్యాం. ఎన్నో అవస్థలు పడ్డాం. మళ్లీ మావారిని చూస్తామనుకోలేదు. సీఎం వైఎస్ జగన్ చొరవతో మళ్లీ స్వగ్రామంలో అడుగుపెట్టాం. – బత్సల జోగారావు, బొడ్డు దానయ్య, బత్సల వెంకటరావు, లిబియా బాధితులు సీఎం వైఎస్ జగన్కు మా కృతజ్ఞతలు దేశం కాని దేశం వెళ్లి తిరిగి వస్తుండగా కిడ్నాప్ కావడంతో చాలా భయపడ్డాం. ఏమైందో అని ఆందోళన చెందాం. వెంటనే ప్రభుత్వం స్పందించి విముక్తికి సహకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు రుణపడి ఉంటాం. – బొడ్డు దానయ్య, కుటుంబ సభ్యులు, సీతానగరం -
శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు
బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్ పెప్పర్ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్ ఆర్టీవోలో క్లర్క్గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్ రాహుల్ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ డీలర్ సాంబా... రవిశంకర్కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. నటి రాగిణిని అరెస్టు చేయడం ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి
కాంగో : ఆఫ్రికా దేశమైన కాంగోలో శుక్రవారం అర్థరాత్రి కార్గో విమానం అడవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మృతిచెందారు. ఏజ్ఫ్రెకో అనే కంపెనీకి చెందిన చిన్న కార్గో మనీమా ప్రావిన్స్లోని కలిమా నుంచి దక్షిణ కివూ ప్రావిన్స్లోని బుకావు వెళ్తున్నది. మరికొద్ది సేపట్లో లాండింగ్ అవుతుందనగా దక్షిణ కివూ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఇద్దరు పైలట్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో అందరూ మరణించారని ప్రావిన్స్ రవాణ, సమాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బాసిలా తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అమెరికా మిషన్ బృందం దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు. కాంగోలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా యూరోపియన్ యూనియన్ కాంగో విమాన సర్వీసులపై నిషేధం విధించింది. -
పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్ గార్డెన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు. -
అస్సాంలో ఆఫ్రికన్ ఫ్లూ కలకలం
గువహటి : భారత్లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఫిబ్రవరిలో అస్సాంలో తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైంది. ప్రస్తుతం అది తీవ్రరూపం దాల్చి 15,600 పందులు మరణించాయని ఆ రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. వ్యాధి నివారణకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అతుల్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. (ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు ) ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 15,600 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. పంది పెంపకం దారులకు ఉపశమనం కలిగించే దిశగా పంది మాంసం అమ్మకం, వినియోగం విషయంలో కొన్ని నిబంధనలపై సడలింపు ఇచ్చామని అతుల్ బోరా చెప్పారు. (టాపర్గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు ) -
చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవర్
గువాహటి: భారత్లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి అసోంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. ఫిబ్రవరిలో ఇక్కడ తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అది కాస్తా క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. (వైరస్లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి ) పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 14,919 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో పరిస్థితిని కేంద్రానికి వివరించి అప్రమత్తం చేశామని తెలిపారు మరోవైపు బాధిత పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. (మాస్కు ఉల్లంఘన: హైదరాబాద్ టాప్ ) ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది జంతువులకు సోకే వైరస్. ఇది మనుషులకు వ్యాప్తి చెందదు. ఒక జంతువు నుంచి ఇతర జంతువులకు సోకే ఈ వైరస్ భారత్లో వ్యాపించడం ఇదే మొదటిసారి. చైనా నుంచి ఈ వ్యాధి వచ్చినట్లు అసోం పేర్కింది. ఇది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో కూడా వ్యాపించింది. (దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!) -
కరోనా: 5 లక్షలకు పైగా ఎయిడ్స్ మరణాలు!
న్యూయార్క్: కరోనా సంక్షోభం నేపథ్యంలో హెచ్ఐవీ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోతే ఎయిడ్స్తో మరణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సహారా ఆఫ్రికా ఉప ప్రాంతంలో ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ‘‘కోవిడ్-19 వ్యాప్తి వల్ల యాంటీవైరల్ థెరపీకి అంతరాయం కలిగిన కారణంగా 2020-21 నాటికి సహారా ఆఫ్రికా ప్రాంతంలో 5 లక్షలకు మించి మరణాలు సంభవించే అవకాశం ఉంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), యూఎన్ఎయిడ్స్ సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో హెచ్ఐవీ రోగులకు అందించే సేవలు, మందుల సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నాయి. (ప్రపంచంలో 82 కోట్ల మంది ఆకలి కేకలు) ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2008 నాటి చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ ఏడాది దాదాపు 9,50,000కు పైగా ఎయిడ్స్ పేషెంట్లు మృత్యువాత పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ‘‘ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో ఆఫ్రికాలో ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉంది. చరిత్ర పునరావృతం అవుతుంది. మళ్లీ తిరోగమనం’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధనోమ్ గాబ్రియేసస్ హెచ్చరించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాలు హెచ్ఐవీ రోగులకు సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నాయని.. వాటిని అనుసరించాలని ఆఫ్రికా దేశాలకు విజ్ఞప్తి చేశారు.(‘సార్స్’లాగా ‘కరోనా’ కూడా అదృశ్యం...?) కాగా 2018 నాటి గణాంకాల ప్రకారం సబ్- సహారా ఆఫ్రికా ప్రాంతంలో దాదాపు 25.7 మిలియన్ మందికి హెచ్ఐవీ సోకినట్లు అంచనా. అందులో 16.4 మిలియన్ మందికి యాంటీవైరల్ థెరపీ నిరంతయరాయంగా కొనసాగాల్సి ఉంది. లేనట్లయితే వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో అనవసర మరణాలు అరికట్టాలని, యాంటీవైరల్ థెరపీ ప్రారంభించాలని డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ఎయిడ్స్ విజ్ఞప్తి చేశాయి. -
భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!
దాదాపు మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది.. ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం) శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. పోర్ట్స్మౌత్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు. అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు. -
కేసులు 2లక్షలు.. మరణాలు 8వేలు
పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్లో 3,422 మంది మరణించారు. చైనా, ద.కొరియాల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చైనాలో బుధవారం కూడా కొత్తగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) అమెరికాలో.. అమెరికాలో కరోనా (కోవిడ్-19) తో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. దేశవ్యాప్తంగా మెడికేర్ టెలీహెల్త్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలు పొందాలన్నారు. కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు న్యూయార్క్ వ్యాప్తంగా సామూహిక క్వారంటైన్ను ప్రకటించే అవకాశముందని మేయర్ బిల్ డి బ్లేసియో పేర్కొన్నారు. మొత్తం 86 లక్షల మంది పౌరులను ఇళ్లలోనే నిర్బంధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి) యూరోపియన్ యూనియన్ వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో సరిహద్దులను మూసేస్తూ యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల ప్రజలు 30 రోజుల పాటు ఈయూ దేశాల్లోకి రాకూడదని నిషేధం విధించింది. యూరోప్లో మొత్తం 3,422 మరణాలు చోటు చేసుకోగా.. వాటిలో ఇటలీలోనే 2,978 మంది చనిపోయారు. (కరోనా వైరస్ కృత్రిమంగా తయారు చేసింది కాదు!) ఇరాన్లో.. మరోవైపు, ఇరాన్లో కరోనా మృత్యుఘంటికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 147 మంది ఈ వైరస్తో మృత్యువాత పడ్డారు. బుధవారం వరకు ఈ దేశంలో కోవిడ్తో మరణించినవారి సంఖ్య 1,135కి చేరింది. 1,192 కొత్త కేసులతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 17,161కి పెరిగింది. ఆఫ్రికాలో.. వైద్య సదుపాయాలు అతి తక్కువగా ఉండే ఆఫ్రికాలో ఇప్పటివరకు సుమారు 500 కేసులు నమోదయ్యాయి. బుర్కినాఫాసోలో తొలి మరణం చోటు చేసుకుంది. లాటిన్ అమెరికా లో 1100 కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో మంగళవారం తొలి మరణం నమోదైంది. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియాలో 454 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఐదుగురు మరణించారు. ప్రధాని మోరిసన్ దేశవ్యాప్తంగా ‘హ్యూమన్ బయో సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. అనవసర విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రజలను కోరారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. నిరుద్యోగం పెరుగుతుంది కరోనాతో విశ్వవ్యాప్తంగా నిరుద్యోగం భారీగా పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయే వీలుంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మూడున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని కార్మికులు కోల్పోతారని తెలిపింది. రాణి అపాయింట్మెంట్స్ రద్దు ► 94 ఏళ్ల బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2, రానున్న కొన్ని నెలల పాటు తన అన్ని అపాయింట్మెంట్స్ను రద్దు చేసుకున్నారు. గురువారం బకింగ్హామ్ప్యాలెస్ నుంచి విండ్సర్ క్యాజిల్కు తన విడిదిని మార్చుకోనున్నారు. ► కరోనాపై పోరుకు 500 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయాలంటూ వెనెజువెలా చేసిన అభ్యర్థనను ఐఎంఎఫ్ తోసిపుచ్చింది. ► వైరస్ విజృంభణ నేపథ్యంలో తమ దేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అంగీకరించారు. సత్వరమే వైద్య సౌకర్యాలను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మలేసియా– సింగపూర్లను కలిపే జొహోర్ బహ్రూ ఫ్లై ఓవర్ దారులు నిర్మానుష్యంగా మారిన దృశ్యం -
ఆ గుహ నిండా మనుషుల ఎముకలే
ఆఫ్రికా : స్పానిష్ కెనరీ ఐలాండ్లోని ఐలాండ్ ఆఫ్ గ్రాండ్ కెనరియాలో 8వ శతాబ్దానికి చెందిన ఓ రహస్య సమాధి గుహని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 1000 సంవత్సరాలు కనుమరుగై ఉన్న గుహని డ్రోన్ సహాయంతో వారు గుర్తించారు. ఈ గుహలో 72మంది మనుషులకు చెందిన ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు 62 మంది మధ్య వయస్కులు, 10మంది చిన్నపిల్లలవిగా గుర్తించారు. వారంతా అప్పటి కెనరీ ఐలాండ్లో నివాసముంటున్న ‘గుంచె’ తెగకు చెందినవారిగా తేల్చారు. పురావస్తు శాస్త్రవేత్త ఆల్బర్టో మాట్లాడుతూ.. ‘గ్రాన్ కెనరియాలో ఎన్నో సమాధి గుహలు ఉన్నాయి. అయితే అన్నీ ఈ గుహలా మాత్రం లేవు. అప్పటి ‘గుంచె’ తెగవారు సమాధి వస్త్రాలను జంతువుల చర్మాలతో, కూరగాయల తోలుతో తయారు చేసేవారు. ఆ జాతి మొత్తం ఒకేరకమైన విధానాన్ని ఉపయోగించేవారు. మేమిక్కడికి చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడికి చేరుకునే అవకాశం లేదు కనుక ముందుగా డ్రోన్ సహాయంతో దీన్ని అన్వేషించామ’ని తెలిపాడు. 2019 జూన్ చివర్లో ఈ గుహను కనుగొన్నప్పటికి గుహను ధ్వంసం, పాడు చేస్తారనే ఉద్దేశ్యంతో వివరాలను అధికారికంగా ప్రకటించలేదని ఓ ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త తెలిపాడు. అక్కడి అధికారుల సహాయంతో దాన్ని సంరక్షించుకోవాలనే ప్రస్తుతం గుహ విషయాలు బయటపెట్టామని చెప్పాడు. -
అయ్యో పాపం.. ఎంత దీనస్థితి!
సుడాన్: అడవికి రారాజు సింహం అంటారు. అలాంటి సింహం పేరు వినగానే దట్టమైన జూలు, దిట్టమైన శరీరాకృతితో ఊహాల్లోకి రాగానే వెన్నులో వణుకు పుడుతుంది. మృగరాజు గంభీరమైన గాండ్రింపు వినపడితే చాలు గుండెల్లో పిడుగు పడినంత పనవుతుంది. ఇక ఆఫ్రికా జాతి సింహాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని సినిమాల్లో చూసే అమ్మో అనుకుంటాం. ఆఫ్రికా దేశమైన సుడాన్లోని అల్ ఖురేషీ పార్క్లో సింహాలు దీనికి భిన్నంగా కన్పిస్తున్నాయి. వాటిని చూస్తే భయపడాల్సింది పోయి అసలు అవి సింహాలా లేక ఏవైనా పెద్ద జాతి పిల్లులా అనేలా తయారయ్యాయి. ఇక ఆ పార్కుకు వచ్చిన సందర్శకులకు వినోదం సంగతి అటుంచితే వాటిని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన ఆ సింహాల దీనస్థితిని చూసి తట్టుకోలేక ఓ సందర్శకుడు వాటి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సింహాలను చూసి నెటిజన్లంతా షాకవుతూ వాటి పరిస్థతిని చూసి జాలి పడుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో సూడాన్.. ప్రస్తుతం సూడాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కరెన్సీ కొరత అక్కడి ప్రజలను బాధిస్తోంది. సూడాన్లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవాలు కూడా ఆకలికి అలమటించి పోతున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్లోని అల్ ఖురేషి పార్క్లోని సింహాలకు అయితే కొన్ని వారాలుగా తినేందుకు తిండి కూడా లేదు. అంతేకాదు అనారోగ్యానికి గురైన సింహాలకు సరైన చికిత్స, మందులు అందుబాటులో లేవు. ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొచ్చి సింహాలు దీనంగా కన్పిస్తున్నాయి. ఆ పార్క్కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవలేని పరిస్థితికి వచ్చాయి. ఒక సింహాన్ని అయితే తాడుతో కట్టేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడి మృగరాజుల దుస్థితి చూసి జంతు ప్రేమికులు చలించిపోతున్నారు. -
బుర్కినాఫాసోలో రక్తపాతం
ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి. -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
ఆఫ్రికా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆఫ్రికా పశ్చిమ తీరంలో 20 మంది భారతీయులను సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వ్యవహారాన్ని భారత అధికారులు నైజీరియా అధికారులకు చేరవేశారు. హాంకాంగ్ జెండాతో ఉన్న పడవలో వీరు ప్రయాణిస్తుండగా కిడ్నాప్ అయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నైజీరియా అధికారులతో మాట్లాడామని విదేశాంగ శాఖ తెలి పింది. నైజీరియా తీరం వెంట ఇలా జరగడం ఈ ఏడాది ఇది మూడోది. -
దోమను చూస్తే... ఇంకా దడదడే!
దేశంలో మలేరియా కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆగ్నేయాసియాలో మొదటి స్థానంలో మనమే ఉండటం కలవరపరుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ ఆఫ్రికా దేశాల సరసన నిలబడి 11వ స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ మలేరియా నివేదిక–2019 స్పష్టం చేసింది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఆగ్నేయాసియాలో 11 దేశాలుంటే, వాటిల్లో కేవలం 3 దేశాల్లోనే 98 శాతం మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో భారత్లోనే ఎక్కువగా 58 శాతం కేసులు నమోదవగా.. ఇండోనేసియాలో 30 శాతం, మయన్మార్లో 10 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా మరణాలు సైతం భారత్లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మలేరియా కేసులు 19 దేశాల్లోనే నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఐదేళ్లలో భారత్లో తగ్గుముఖం.. 2020 నాటికి మలేరియా కేసుల సంఖ్యను 40 శాతం కంటే ఎక్కువగా తగ్గించాలని, 2030 నాటికి మలేరియాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు మార్గనిర్దేశనం చేసింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ ముందుకు సాగుతోందని, సాపేక్షికంగా చూస్తే మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2014లో భారత్లో 11.02 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 562 మంది చనిపోయారు. అయితే తర్వాత మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2018లో మలేరియా కేసుల సంఖ్య ఏకంగా 3.99 లక్షలకు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 85కు పడిపోయింది. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నివేదికలో నూ వెల్లడించింది. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 5,189 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 1,327 మలేరియా కేసులే నమోదయ్యాయి. 38 దేశాలు మలేరియా రహితం.. మన పక్కనే ఉన్న మాల్దీవులు, శ్రీలంక దేశాలు మలేరియా రహితంగా కొనసాగుతున్నాయి. మొత్తం 38 దేశాలు మలేరియా రహితమని ధ్రువీకరించడం గమనార్హం. ఇక 2018లో 27 దేశాల్లో 100 కంటే తక్కువ మలేరియా కేసులున్నట్లు తేలింది. ప్రపంచంలో గతేడాది ఏకంగా 4.05 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారని నివేదిక తెలిపింది. అందు లో 2.72 లక్షల (67%) మంది ఐదేళ్ల పిల్లలే కావడం గమనార్హం. ఈ మరణాల్లో 85 శాతం భారత్ సహా ఆఫ్రికన్ ప్రాంతంలోనే సంభవించడంపై విచారం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో మలేరియాను ఎదుర్కోవాలన్న సవాల్లో పురోగతి మందగించిందని ప్రపంచ మలేరియా నివేదిక వ్యాఖ్యానించింది. వెయ్యిలో 57 మందికి.. 2010–18 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియా తీవ్రత తగ్గిందని ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది. 2010లో ప్రతీ వెయ్యిలో 71 మంది మలేరియాకు గురికాగా, 2018లో ఆ సంఖ్య 57 కేసులకు పడిపోయింది. ఏదేమైనా 2014–2018 వరకు మలేరియా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువ గా మలేరియా బారిన పడుతున్నా రు. వీరిపై దృష్టి పెట్టకపోతే ఎటువంటి పురోగతి సాధించలేమని మలేరియా నివేదిక తెలిపింది. -
డీఆర్ కాంగోలో కూలిన విమానం
గోమా: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. -
11 సెకన్లకో ప్రాణం బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అంతరాలు పెరుగుతున్నాయా? కొన్నిదేశాల్లో గర్భిణులు, నవజాతశిశు మరణాలు గణనీయంగా తగ్గుతుంటే, మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందా? అంటే ఐక్యరాజ్యసమితి(ఐరాస) అవుననే జవాబిస్తోంది. సరైన వైద్య సౌకర్యాలు, పరిశుభ్రతలేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఓ గర్భిణి–బాలింత లేదా నవజాతశిశువు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. అందుబాటులో మెరుగైన వైద్యం, మందులు, పరిశుభ్రత, పోషకాహారంతో ఈ మరణాలను నివారించవచ్చని వెల్లడించింది. అధికాదాయం ఉన్న ధనికదేశాల్లో స్త్రీ, శిశు మరణాలు తగ్గుతుంటే, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు. ► గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ► ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ► ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు. ► పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు. ► ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు. ► ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ. ► ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం. ► 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే. ► ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు. ► అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు. -
కెమెరామెన్ను కొమ్ములతో కుమ్మేసింది!
సాధారణ ఫొటోగ్రఫీ కంటే వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారమే. వన్యప్రాణులను చిత్రీకరించే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. జంతువుల మూడ్పైనే వారి రక్షణ ఆధారపడుతుంది. సింహం, పులుల వంటి మృగాలతో పోలిస్తే శాకాహార జీవులతో కాస్త చనువుగా ఉన్నా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. అయితే నైరుతి ఇంగ్లండ్లోని వైల్ట్షైర్ జంతువుల పార్కులో ఉండే సిసిల్ అనే గొర్రె మాత్రం ఇందుకు మినహాయింపు. తనను వీడియోలో బంధించేందుకు వచ్చిన ఓ కెమెరామెన్ను కొమ్ములతో కుమ్మేసింది. చివరకు పార్కు నిర్వాహకులు కలుగజేసుకుని వెనక్కి పిలవడంతో శాంతించి..అతడిని వదిలేసింది. ‘సఫారీ పార్కుల్లో దాగున్న వన్యప్రాణుల జీవితంలోని దృశ్యాల ఆవిష్కరణ’ పేరిట బీబీసీ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం విల్ట్షైర్లోని పార్కులో వీడియోషూట్ చేసేందుకు బీబీసీ కెమెరామెన్ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు. అయితే ఆ పార్కులో రౌడీగా పేరొందిన సిసిల్ను పార్కు నిర్వాహకులు కెమెరామెన్కు పరిచయం చేశారు. తను చాలా మొండిదని, ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వెంటనే వాళ్ల పనిపడుతుందని చెబుతుండగానే అది నెమ్మదిగా కెమెరామెన్ దగ్గరికి వెళ్లింది. వీడియో తీసేందుకు కెమెరా సెట్ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అతడిపై కొమ్ములతో విరుచుకుపడింది. ఈ తతంగాన్నంతా పక్కనే ఉండి గమనిస్తున్న పార్కు సిబ్బంది మాత్రం ఇది షరామామూలే అన్నట్లుగా నవ్వుతుండటంతో కెమెరామెన్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీబీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. ఇక ఆఫ్రికాలో నివసించే అరుదైన రకానికి చెందిన ఈ గొర్రె చేష్టలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘మీ దగ్గర కెమెరా ఉంటే..దానికి పదునైన కొమ్ములు ఉన్నాయి. ఎంత కోపం వచ్చిందో అందుకే అలా కుమ్మింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది
కంపాలా: ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా మందికి చాలా కష్టంగా మారిపోతోంది. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 44 మందికి జన్మనిచ్చింది. ఏ మహిళలైనా నలభై ఏళ్లకే నలభైనాలుగు మంది పిల్లల్ని కనడాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యమైన అంశాన్ని ఆమె సుసాధ్యం చేసింది. అయితే అది ఆమె ఇష్టంతో చేసిన పనికాదు. ఒకవైపు దయనీయ పరిస్థితి, మరోవైపు తన శరీరంలో జన్యువుల అసాధారణ స్థితి. ఆమెను 44 మంది పిల్లలకు తల్లిని చేశాయి. ఆమె పేరు మరియమ్ నబాటాంజీ. నివాసముండేది అత్యంత వెనుకబడిన ఉగాండాలోని ముకనో జిల్లాలో. ఆమెకు 12 ఏళ్లకే వివాహమైంది. గత రెండు దశాబ్దాలలో ఏటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్య 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు. అతంటితో ఆగకుండా ప్రతి ఏడాది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆమెకే ఎందుకిలా జరుగుతుందనే దానిపై దేశంలోని ప్రముఖ వైద్యలంతా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్ పెద్దదిగా ఉండడమే దానికి కారణమని తెలిపారు. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె కన్న 44 మంది పిల్లల్లో ఆరుగురు రకరకాల కారణాల వల్ల చనిపోగా, ప్రస్తుతం 38 మంది జీవించి ఉన్నారు. తన జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనే విషయంపై ఆమె మాట్లాడుతూ 'నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి పిల్లల్ని చంపేసింది. నేను మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను లైంగిక బానిసగా మార్చేశాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 18 మంది పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని, కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అది వీలుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్ ఫ్లోర్ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. రెండేళ్ల కిందట ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేశారు. -
ఎంత సక్కగున్నావే..!
కనురెప్పలతోనే మాయ చేస్తున్న ఓ విహంగమా.. నీ కళ్లను చూస్తే ఏ మగువైనా కుళ్లుకోదా..! రెప్ప వాల్చకుండా నిన్నే చూడాలనేంత అందం తన సొంతం.. తల వెనుక చూశారా ఈకలతో కిరీటం ధరించిన రాణిలా ఎలా హొయలు పోతోందో.. ఈ అందమైన గువ్వ పేరు సెక్రటరీ బర్డ్. రాబందులు, గద్దల జాతికి చెందిన ఈ పక్షి ఎక్కువగా పాములను వేటాడి ఆహారంగా తీసుకుంటుందట. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఇవి ఉంటాయట. తన ఆహారం కోసం రోజూ 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుందట. చాలా వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలి వెళుతుందట మన పక్షిరాజం. ఎంతైనా ఈ పక్షి కాస్త డేంజరసే సుమీ! -
పెట్రోల్ ట్యాంకర్ పేలి 58 మంది మృతి
నియామే: ఆఫ్రికా దేశం నైగర్ రాజధాని నియామేలో బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ సేకరిస్తుండగా అది పేలి 58 మంది మరణించారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ట్యాంకర్ బోల్తా పడి పెట్రోల్ కారుతుండగా, ఆ పెట్రోల్ను తెచ్చుకోడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ట్రక్కు పేలడంతో అక్కడ ఉన్నవాళ్లలో చాలా మంది మరణించారు. చుట్టుపక్కల ఇళ్లు కూడా ఈ మంటల కారణంగా ధ్వంసమయ్యాయి. 58 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. -
కుబేరుడికి డౌటొచ్చింది.. బ్యాంక్కు వెళ్లి..
అబూజా : ఆఫ్రికా కుబేరుడు అలికో డాంగోట్ (61) చేసిన ఓ పని చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 10.3 బిలియన్ డాలర్లతో ఆఫ్రికా రిచెస్ట్ పర్సన్గా కొనసాగుతున్న నైజీరియాకు చెందిన డాంగోట్కు.. ‘ఇంతకూ నేను కోటీశ్వరుడినేనా’ అనే సందేహం కలిగింది. తన సంపాదనంతా ఎప్పుడూ కాగితాల్లోనే చూసుకుని మురవాలా అని మదనపడ్డాడు. తన కష్టార్జితాన్ని ఓసారి కళ్లారా చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్యాంక్కు వెళ్లి ఓ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.69 కోట్లు)ను విత్డ్రా చేశాడు. డాంగోట్ అంత భారీ మొత్తం విత్డ్రా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు విస్తుబోయారు. చివరకు అతని కోరిక తెలిసి.. ఇదేం కోరికా అంటూ లోలోన నవ్వుకున్నారు. ఇక డ్రా చేసిన 10 మిలియన్ డాలర్లను ఓ సారి తడిమి చూసుకున్న డాంగోట్.. వాటిని ఓ రోజంతా తన దగ్గర ఉంచుకుని మరుసటి రోజు బ్యాంక్లో వేశాడు. ‘యుక్త వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించే మొదటి 10 మిలియన్ డాలర్లే అత్యంత ప్రధానం. తర్వాతా ఆ మొత్తం పెరుగుతూ వెళ్తుంది. నువ్వప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవు. కానీ, నాకెందుకో నా డబ్బును కళ్లారా చూద్దామనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. సిమెంట్, షుగర్, ఫ్లోర్ తదితర తయారీ రంగాల్లో డాంగోట్ బడా పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. -
మాలి జాతి ఘర్షణల్లో 50 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశమైన మాలి మరోసారి నెత్తురోడింది. మాలిలోని ఫులానీ తెగకు చెందిన ఒగౌస్సగౌ గ్రామంపై శనివారం తెల్లవారుజామున 4 గంటలకు డోగోన్ జాతికి చెందిన వేటగాళ్లు దాడిచేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది ఫులానీ తెగప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్న ఘర్షణలో డోగోన్ వేటగాళ్లు 37 మంది ఫులానీ ప్రజలను చంపేశారన్నారు. ఈ ప్రాంతంలోని జాతివైరాన్ని అల్కాయిదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు పావుగా వాడుకుంటూ భారీగా చేరికలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. -
స్కూల్ బస్సు హైజాక్.. ఆపై నిప్పు
రోమ్: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. ‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్ ఈ హైజాక్కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్ను బస్పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి హైజాక్ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు. -
మూడో అతిపెద్ద దేశంగా భారత్
సాక్షి, హైదరాబాద్: భారత్–ఆఫ్రికాల మధ్య పరస్పర సహకారం అవసరమని భారత శాస్త్ర, సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ అన్నారు. ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఫిక్కీ ఆధ్వర్యంలో 2 రోజులపాటు జరగనున్న గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్–2019ను ఆయన గురు వారం ప్రారంభించారు. భారత్– ఆఫ్రికా దేశాలమధ్య విద్య, వైద్య రంగాల్లో పర స్పర సహకారం అవసరమని అశుతోష్ అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రానున్న కాలంలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఉంటుందని తెలిపారు. యువత ఎక్కువగా సాంకేతిక స్టార్టప్స్ను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి, ఫిక్కీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, జాంబియా, ఇథియోపియా, రువాండా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
నగరంలో అదో మినీ ఆఫ్రికా..
ఆరడుగులకుపైగా ఎత్తు.. రింగురింగుల జుత్తు.. బ్లాక్ కలర్లో భారీ ఆకారం.. వెస్ట్రన్ ఫ్యాషన్ను ఫాలో అవుతున్న యువతరం. సరికొత్త స్టైల్ వారి సొంతం.. ప్రపంచ చరిత్రలో వారిదో ప్రత్యేక స్థానం. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీరు కనిపిస్తారు. మన దేశంలోనూ కనిపిస్తారు. అందులో మినీ ఇండియాగా పేరుగాంచిన మన హైదరాబాద్లోనూ వారు దర్శనమిస్తారు. నగరంలో వీరికి ఓ ప్రత్యేక కాలనీయే ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఇక్కడికి వెళ్లినవారికి ఆఫ్రికా దేశానికి వెళ్లామనే ఫీలింగ్ కలగమానదు. వీరు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తారు. జూబ్లీహిల్స్ను ఆనుకొని ఉన్న పారామౌంట్ హిల్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తోంది. నల్లజాతీయుల జీవనశైలి అబ్బురపరుస్తోంది. రకరకాల కారణాలతో హైదరాబాద్కు వస్తున్న వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పారామౌంట్ హిల్ కాలనీలోని ఆఫ్రికన్లపై ప్రత్యేక కథనం. బంజారాహిల్స్ :ఇటీవల కాలంలో ఆఫ్రికన్లు హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం కోసం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మెడికల్ టూరిజంలో ముంబై, చెన్నై తర్వాత హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులకు హైదరాబాద్లో కొదవ లేదు. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, హైదరాబాద్ నుంచి విమాన సేవలు మెండుగా ఉండటంతో ఆఫ్రికన్ దేశస్థులు చికిత్స కోసం హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. చాలా మంది ఆఫ్రికన్ యువత ఉన్నత విద్య కోసం నగరాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య, వైద్య సదుపాయాలు, తక్కువ ఖర్చుతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ను బెస్ట్ ఆప్షన్గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పారామౌంట్ హిల్ కాలనీ చిన్నపాటి ఆఫ్రికాలా మారింది. వీరు ఇక్కడ 30 ఏళ్లుగా నివసిస్తున్నారు. అడుగడుగునా ఆఫ్రికన్ సంస్కృతి సుడాన్, సోమాలియా, కాంగో, ఘనా తదితర దేశాల నుంచి వచ్చిన ఆఫ్రికన్లు ఏళ్ల తరబడి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్ సంస్కృతీ సంప్రదాయాలు దర్శమిస్తుంటాయి. వారి జీవన విధానాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారాలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, అరేబియన్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్రికన్ ఘుమఘుమలే కాకుండా దుస్తులకు సంబంధించిన వ్యాపారాలూ కనిపిస్తాయి. లాల్చీ లాంటి పొడవాటి రంగురంగుల దుస్తులు ధరించే వారు ఆకట్టుకుంటారు. ఇక జీన్స్, టీషర్టులతో సరికొత్త లుక్ ఇచ్చే యువత ప్రత్యేక ఆకర్షణ. మహిళలు ధరించే బూర్ఖాలు కూడా అందుబాటులో ఉంటాయి. తక్కువ మొత్తంలో అద్దెలు ఉండటంతో ఈ కాలనీని ఎంచుకుంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది వరకు విద్యార్థులు, మరో వెయ్యి మంది వరకు వివిధ కారణాలతోవచ్చిన వారు ఉన్నారు. కొంత మంది ఆఫ్రికన్ల పిల్లలు కూడా ఇక్కడి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ సందడే సందడి. ఉస్మానియాలో బీటెక్ చేస్తున్నా.. నేను మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నాను. పారామౌంట్ కాలనీలో నా స్నేహితులతో కలిసి అద్దెఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్లో ఉంటే మా దేశంలో ఉన్నట్లుగానే ఉంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు బాగా నచ్చాయి. – ఇసా సాల ఇసా, విద్యార్థి, ఆఫ్రికా అందరితో కలిసిపోతాం.. నేను ఇక్కడ నా స్నేహితులతో ఉంటున్నా. పారామౌంట్ కాలనీలో ఎటు చూసినా మా కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి ఆఫ్రికన్ ఇదే కాలనీలో ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా మేమే కనిపిస్తాం. ఐకమత్యంతో ఉంటాం. – జరత్ లూయిస్ రాబర్ట్,విద్యార్థి, కామెరూన్ మంచి వాతావరణం.. కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి పారామౌంట్ కాలనీలో ఉంటున్నా. మిగతా దేశాల కంటే హైదరాబాద్లోనే తక్కువ ఖర్చుతో నివాసం ఉండటమే కాకుండా అన్ని సౌకర్యాలతో జీవించగలుగుతాం. చదువు కూడా మాకు ఉచితంగానే లభిస్తోంది. – అబ్దుల్ రహీం, విద్యార్థి, సూడాన్ -
ఆఫ్రికా అందం
-
ఆగని ఆకలి కేకలు
బ్యాంకాక్: ఓ వైపు ఆసియా–పసిఫిక్ దేశాలు(తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియాతోపాటు ఆస్ట్రేలియా, రష్యాలో కొంత భాగం, పసిఫిక్ తీరంలోని మరికొన్ని దేశాలు) అభివృద్ధిలో దూసుకుపోతున్నా... మరోవైపు వాటిలో ఆకలి కేకలూ అదే స్థాయిలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడైంది. సుమారు 48కోట్ల 60 లక్షల మంది ఇంకా ఆకలి సమస్యతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. బ్యాంకాక్, మలేసియా, కౌలాలంపూర్ లాంటి మేటి నగరాల్లోనూ ఇప్పటికీ చాలా కుటుంబాలు తినడానికి తిండి లేక అలమటిస్తున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన మరో మూడు ఏజెన్సీలు తెలిపాయి. ఒక్క బ్యాంకాక్లోనే మూడో వంతు చిన్నారులు తగిన ఆహారాన్ని పొందలేకపోతున్నారని వెల్లడించాయి. ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో కేవలం 4శాతం చిన్నారులు మాత్రమే సరిపడ ఆహారాన్ని తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. ‘ఈ ప్రాంతాల్లో 2030 నాటికి ఆకలితో బాధపడేవారి సంఖ్యను సున్నాకు తీసుకురావాలంటే... రోజుకు కనీసం లక్షా పదివేల మందిని ఆకలి సమస్యకు దూరం చేయాల్సి ఉంటుంద’ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజినల్ డైరెక్టర్ జనరల్ కుందవి కడియన్సన్ తెలిపారు. తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, గత కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో ఎలాంటి మెరుగుదలా కనిపించలేదని ఆమె వివరించారు. ఇక భారత్తోపాటు దక్షిణాసియాలోని ఇండోనేసియా, మలేసియా, కంబోడియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. ఈశాన్య ఆసియా దేశాల్లో ప్రత్యేకించి కంబోడియాలో మంచినీటి కొరత సైతం తీవ్రంగా ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం సుమారు 79 మిలియన్ చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా పూర్తి స్థాయి ఎత్తు కూడా ఎదగలేకపోతున్నారని తేలింది. ఇక పట్టణ ప్రాంతాల్లోని వారు అనారోగ్యమైన, తక్కువ ధరకు లభించే ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ బారిన కూడా పడుతున్నట్లు వెల్లడైంది. -
నేను వేధింపులకు గురయ్యాను : మెలానియా ట్రంప్
వాషింగ్టన్ : ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వేధింపులకు గురవతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటున్నారు అమెరికా ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్. ఆఫ్రికా పర్యటన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెలానియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో చర్చిస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. గత వారం ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియ ఘనా, మళావి, కెన్యా , ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో, మీడాయాలో జనాలు ఆమె వస్త్రధారణ గురించే ఎక్కువగా పరహసించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మెలానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే వాక్యాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాక ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా వైట్ షర్ట్, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా మెలానియా ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం భేష్
కీసర వికారాబాద్ : అహ్మద్గూడలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. శుక్రవారం ఆఫ్రికాకు చెందిన 30 మంది జర్నలిస్టుల బృందం నగర శివార్లో పర్యటించింది. కీసర మండలంలోని అహ్మద్గూడలో 20.73 ఎకరాలలో రూ.384 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ 4428 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 41 బ్లాకుల్లో 9 అంతస్తులలో అన్ని మౌలిక సదుపాయాలతో 4428 ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందం అభినందించింది. అహ్మద్గూడలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, స్లమ్లెస్ సిటీగా హైదరాబాద్ను రూపొందించాలన్న ప్రణాళికలను వారు ప్రశంసించారు. గృహæనిర్మాణ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేంద్రకుమార్ అహ్మద్గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందానికి వివరించారు. ఈతకొల్లూరు, రాంపల్లిలలో చేపడుతున్న అతిపెద్ద కాలనీల అనంతరం అహ్మద్గూడలో డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ మూడో అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. మీడియా అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓ వెంకటరమణ, సమాచార శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. -
నడిచొచ్చిన నల్లపిల్ల
ఈ ఫొటోలోని అమ్మాయిలు ఆఫ్రికా అందాల భామలు. నగరంలో చదువుకుంటున్న వీరు... మోడల్స్గా రాణిస్తున్నారు. ర్యాంప్లపై మెరుస్తున్నారు. ఈ బ్లాక్ బ్యూటీల అందచందాలకు సిటీ ఫిదా అవుతోంది. ప్రతి ఈవెంట్లో ఒక్కరైనా ఆఫ్రికన్ మోడల్ కనిపిస్తున్నారు. అంతర్జాతీయంగా మోడలింగ్లో అగ్రస్థానంలో ఉన్నఆఫ్రికన్ అమ్మాయిలకు... ఇప్పుడు దేశీయ ఫ్యాషన్ రంగం దాసోహమంటోంది. ఈ నేపథ్యంలో సిటీకీ నయా గ్లామర్ తోడైంది. బ్లాక్ బ్యూటీలకు అవకాశాలు కల్పించేందుకు నగరంలో ప్రత్యేకంగా ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో తొలి ఈవెంట్ నిర్వహించగా, ఇప్పుడు ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ కాంటెస్ట్కూ నగరం వేదికవుతోంది. ఈ కల్చర్తో సిటీ ఫ్యాషన్ రంగం కొత్తపుంతలు తొక్కగా... ఆఫ్రికన్ అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. నగరంలోని ఈ నయా ట్రెండ్పై వీకెండ్ స్పెషల్. సాక్షి, సిటీబ్యూరో : వెనకబడిన ప్రాంతానికి చిరునామాగా మారిన ఆఫ్రికా... అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి కూడాపేరొందింది. ఆఫ్రికన్ల గురించి మన దేశంలోని సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం అయినా ఉండొచ్చు. కానీఅంతర్జాతీయ స్థాయిలో రాణించే టాప్ మోడల్స్లో ఆఫ్రికన్అమ్మాయిలదే అగ్రస్థానం. ఈ బ్లాక్ బ్యూటీలకు ఇటీవల మన దేశంలోనూ ర్యాంప్పై మెరిసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యాషన్ రంగం ఆఫ్రికన్ అమ్మాయిలకూ రెడ్కార్పెట్పరుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ ఇండియా ఆఫ్రికా కాంటెస్ట్ పోటీలకు ఆడిషన్స్జరుగుతున్నాయి. ఇది నగరంలోని ఆఫ్రికా బ్యూటీలకు కొత్త గ్లామర్తీసుకొచ్చింది. నల్లని ఒత్తయిన జుట్టు, తీరైన ఫిజిక్, చక్కని హైట్వెయిట్ ఉన్న ఆఫ్రికా అమ్మాయిలు మన ర్యాంప్లపై బాగా సందడి చేస్తున్నారు. ఆఫ్రికా అందచందాలకు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయిపోతుండడంతో సిటీ కూడా అదే బాట పట్టింది. ఈ ట్రెండ్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు... ఆఫ్రికన్ బ్యూటీస్ కోసం జల్లెడ పట్టేలా చేసింది. ఇది సిటీలోని ఆఫ్రికన్ పీపుల్కి కొత్త అవకాశాలు అందిస్తోంది. ‘ఇంతింతైన ఇంటర్నేషనల్ ట్రెండ్... నగరంలో జరిగే టాప్ ఫ్యాషన్ షోలలో ఒక్కరైనా ఆఫ్రికా మోడల్ ఉండడమనేది తప్పనిసరిగా మారింది. ‘సిటీలో అంతర్జాతీయ ఈవెంట్లు జరుగుతుండడంతో ఆఫ్రికా మోడల్స్ కోసం అడిగే డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎక్కువయ్యారు’ అని సిటీకి చెందిన మోడల్ కో–ఆర్డినేటర్ అహ్మద్ చెప్పారు. దీంతో నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లో నివసించే ఆఫ్రికన్లకు చాన్స్లు పెరిగాయి. సూడాన్, నైజీరియా తదితర ఆఫ్రికా దేశాల నుంచి విద్య నిమిత్తం నగరానికి వచ్చే అమ్మాయిలకు ఇవి వరంగా మారాయి. ‘ఆఫ్రికా నుంచి అత్యధికులు బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల కోసం నగరానికి వస్తున్నారు. ఫారిన్ లాంగ్వేజెస్ అభ్యసించేవారూ ఎక్కువే. చాలామంది ఆఫ్రికన్లు వెస్ట్రన్ కల్చర్ అంటే బాగా మక్కువ చూపిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేయడానికి కూడా సై అంటారు. వీరికి పార్ట్టైమ్ జాబ్గా కూడా ఇది ఉపకరిస్తోంది’ అని అహ్మద్వివరించారు. సిటీలోమరోఈవెంట్.. ‘అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆఫ్రికా మోడల్స్ ఎందరో ఉన్నారు. అదే విధంగా మన సిటీలోనూ వారికి తగినంత ప్రాధాన్యం కల్పించాలని గతంలో ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో ఈవెంట్ నిర్వహించాం. అందులో విజేతగా నిలిచిన కాంగో దేశపు అమ్మాయి ఇప్పుడు అంతర్జాతీయ మోడల్గా రాణిస్తోంది’ అని చెప్పారు నగరానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జోసెఫ్ సుందర్. ఇప్పుడు తాను మరికొన్ని సంస్థలతో కలిసి ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ ఈవెంట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ తరహా పోటీ నగరంలోనే తొలిసారి కావడం విÔశేషం. ఈ కాంటెస్ట్లో 18 మంది అమ్మాయిలు నగరం నుంచి పాల్గొంటున్నారని, వీరిలో చాలామంది కళాశాల విద్యార్థినులే ఉన్నారని చెప్పారు. ట్రెడిషనల్ వేర్తో సహా విభిన్న రకాల దుస్తులతో ర్యాంప్లపై వీళ్లుమెరవనున్నారు. అందానికి చిరునామా... ఆఫ్రికాను ఒక దేశంగా మాత్రమే చాలా మంది భావిస్తారు. కానీ అది 54 దేశాల ఖండం. మన నగరంలో విభిన్న జాతులు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు చెందిన ఆఫ్రికన్లు ఉన్నారు. వాళ్లందరినీ ఒక చోటకు తీసుకురావడం, వారి దేశాల గొప్పదనాన్ని, విశిష్టతలను ప్రతిబింబింపజేయడం, ఆ అమ్మాయిల అందచందాలను, ప్రతిభను ప్రపంచానికి వెల్లడి చేయడం... ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్స్ను నగరంలోనే నిర్వహించాలని అనుకుంటున్నాం. – జోసెఫ్ సుందర్, కొరియోగ్రాఫర్ అనుబంధాల వేదిక.. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ప్రేమానుబంధాలు పెంపొందించాలనే ప్రధాన లక్ష్యంతో మిస్ ఆఫ్రికా ఇండియా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా జూన్–సెప్టెంబర్ మధ్యలో ఈ పోటీ ఉంటుంది. కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. భారత్లోని ఆఫ్రికా మహిళలు తమ అనుభవాలు పరస్పరం పంచుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మహిళా సాధికారత అంశాలపై అనుభవం పొందేందుకు ఈ వేదిక ఉపకరిస్తుంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, పుణె, బెంగళూర్ తదితర నగరాల్లో రీజనల్ పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్ హైదరాబాద్లోనే నిర్వహిస్తాం. – లారిస్కా, ఈవెంట్ ప్రతినిధి -
రువాండాలో పర్యటించిన తొలి ప్రధానిగా..
కిగాలి, రువాండా : ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి రువాండా చేరుకున్నారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే ఎయిర్పోర్టుకు వచ్చి మోదీకి సాదర స్వాగతం పలికినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే దిశగా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. పాల్ కగామేతో భేటీ సందర్భంగా రువాండాకు 2 వందల మిలియన్ డాలర్ల రుణాన్ని అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. రువాండాలో భారత హై కమిషన్ను ప్రారంభించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవచ్చని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, రక్షణ, వ్యాపారం తదితర రంగాల్లో పరస్పర సహకారానికై రువాండాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ తెలిపారు. జిన్పింగ్ తర్వాత మోదీ.. తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్థి చెందుతోంది. ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రువాండాలో పర్యటించారు. ప్రస్తుతం మోదీ కూడా ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొదటగా రువాండా చేరుకున్నారు. భారత్ రుణంగా అందించిన 2 వందల మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం కోసం, మరో వంద మిలియన్ డాలర్లు వ్యవసాయం కోసం ఖర్చు చేయనున్నట్లు రువాండా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా పేద కుటుంబాల ఉపాధి కోసం రువాండా ప్రభుత్వం చేపట్టిన ‘గిరింకా’ (కుటుంబానికి ఒక ఆవు చొప్పున అందించే కార్యక్రమం)లో పాల్ కగామేతో కలిసి మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా భారత్ తరపున 200 ఆవులను మోదీ రువాండా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. కాగా రువాండాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. -
రువాండాలో ప్రధాని మోదీ
కిగాలీ / న్యూఢిల్లీ: ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రువాండాకు చేరుకున్నారు. రాజధాని కిగాలీలోని ఎయిర్పోర్టులో మోదీకి రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనతో రువాండాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పర్యటనలో కగమేతో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. రువాం డాలో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ తోళ్ల అనుబంధ పరిశ్రమ, వ్యవసాయ పరిశోధనకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రువాండాలో పారిశ్రామిక పార్కులు, కిగాలీ సెజ్ అభివృద్ధికి రూ.1,379.10 కోట్ల రుణాన్ని, వ్యవసాయం, నీటివనరుల అభివృద్ధికి మరో రూ.689.55 కోట్ల సాయాన్ని భారత్ అందజేయనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. తర్వాత మంగళవారం ఉగాండాకు వెళ్లనున్న మోదీ.. ఆ దేశ ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 200 ఆవుల బహుమతి.. రువాండా పర్యటనలో మోదీ ఓ గ్రామానికి 200 ఆవుల్ని బహుమతిగా ఇవ్వనున్నారు. రువాండా ప్రారంభించిన ‘గిరికా’ కార్యక్రమం కింద ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ఆవు ఇవ్వనున్నారు. ఇందుకు స్థానిక ఆవుల్ని సేకరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం సమకూర్చడమే పథకం లక్ష్యం. -
ఒక్కసారి వచ్చి ఏడ్చిపోరా..?
ఎవరైనా చనిపోతే.. శత్రువుకైనా కన్నీళ్లు వస్తాయి అంటారు.. ఎక్కడైనా ఇది కామన్. అయితే ఆఫ్రికాలోని ఘనాలో ఏడవడం తప్పనిసరి సంప్రదాయం అట. ఎందరు ఏడుస్తున్నారన్న దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని ఎందరు ప్రేమిస్తున్నారనేది అంచనా వేస్తారట. పైగా ఎంతమంది ఏడిస్తే అంత ప్రెస్టేజీగా భావిస్తారు అక్కడి వారు. కొందరు తమ బంధువులు చనిపోతే ఏడుపు రావట్లేదట. అందుకే డబ్బులు ఇచ్చి మరీ ఏడ్పించుకుంటున్నారట. అందుకు కొందరు మహిళలను నియమించుకుంటున్నారట. ఇప్పుడు అక్కడ అదో బిజినెస్గా మారిపోయింది. అలా ఏడ్చేందుకు మహిళలు కావాలంటే అమీ డోక్లీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆమె వారందరికీ బాస్ అన్న మాట. తెలియని వారి దగ్గరికి వెళ్లి ఏడవడం అంటే అంత సులువేం కాదని, అందుకే డబ్బులు తీసుకుని మరీ ఏడుస్తున్నామని అమీ చెబుతోంది. కాస్త పెద్ద కార్యక్రమంగా చేయాలనుకుని ఎక్కువ డబ్బులు ఇస్తే గట్టిగా ఏడుస్తామని, తక్కువ డబ్బులు ఇస్తే చిన్నగా ఏడుస్తామని వివరించింది. ఎంత పిండికి అంత రొట్టె అన్న మాట! -
హైతీ ప్రజలు ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను..
-
హైతీ ప్రజలు మట్టి రొట్టెలు తింటున్నారా!
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను లేదా పెంకులను ఆవురావురుమని ఎలా తింటున్నారో చూడండి! అంటూ గత రెండు రోజులుగా ఓ వీడియో వివిధ ‘వాట్సాప్’ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ‘మనం వదిలేసే తిండి కూడా దక్కని దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న ఇలాంటి ప్రజలను చూసైనా మీరు వృథాచేసే తిండిని సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అనే సందేశంతో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కూడా ఆ వీడియోతో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వీడియో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. మొదటి సారి 2009, ఫిబ్రవరిలో, రెండోసారి 2013, జూలైలో, మూడవ సారి 2016లో వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ యూట్యూబ్లో వీక్షించవచ్చు. అంత దీనావస్థలో ఉన్నారా? ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను తింటున్నారా? చారిత్రకంగా హైతీని ఆఫ్రికా దేశం అనేకంటే ఆఫ్రో–కరీబియన్ దేశమంటే బాగుంటుంది. స్విడ్జర్లాండ్ కన్నా ఈ దేశంలో కొండలు ఎక్కువ. అందుకే దీనికి హైతీ అనే పేరు వచ్చింది. హైతీ అంటే స్థానిక భాషలో ఎత్తయిన కొండలని అర్థం. దీన్ని అన్ని విధాల అష్టకష్టాల కూడలి అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలకు ప్రకృతి అనుకూలించకపోగా అనూహ్యంగా ఉంటుంది. ఎప్పుడు తుపానులు విరుచుకుపడతాయో, ఎప్పుడు భూప్రకంపనలు ప్రకోపిస్తాయో ఎవరికీ తెలియవు. ఇక్కడి ప్రజల ప్రధాన వత్తి వ్యవసాయమైనా, వ్యయసాయానికి దేశంలోని 12 శాతం భూమే అనుకూలమైనది. మరో 31 శాతం భూమి కాస్త వ్యవసాయానికి అనుకూలమైనా పంట చేతికొచ్చేవరకు నమ్మకం ఉండదు. చుట్టూ ఆక్రమించిన సముద్రపు అలల కోతలు ఎక్కువ. 54 శాతం భూమి ఎత్తయిన పండ్ల తోటలకు అనుకూలమని గతంలో అమెరికా వ్యవసాయ శాఖ ఓ సర్వేలో తేల్చింది. ఏయే పండ్ల తోటలను వేసుకోవచ్చో కూడా సూచించింది. అయితే వాటిని హైతీ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తున్నదో తెలియదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు. సముద్రం ఆటుపోట్లు లాగానే రాజకీయ సంక్షోభాలు ఎక్కువ. అందుకని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం హైతీలో జాతీయ దారిద్య్రం శాతం 58.6. పోషక ఆహార లోపాల వల్ల ఏటా వెయ్యి మందికి 53 మంది పిల్లలు మరణిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి పరంగా 230 దేశాల్లో దీని స్థానం 146. 2010లో వచ్చిన ‘మాథ్యూ హరికేన్’, దాని వెన్నంటి వచ్చిన భూకంపం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది మరణించారు. ఇప్పటికీ బాధితులు టార్పోలిన్ టెంట్లలోనే తలదాచుకుంటున్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో బతకలేక దేశ రాజధాని ‘పోర్ట్ ఔ ప్రిన్స్’ నగరానికి ఎక్కువగా వలసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మట్టి రొట్టెలను తినే అలవాటు ఉంది. వీటిని స్థానిక భాషలో ‘గలెట్టి’ అని, ఇంగ్లీషులో మడ్ కేక్స్ అని మడ్ కుకీస్ అని పిలుస్తున్నారు. సముద్రపు ఒడ్డున దొరికే గోధుమ వర్ణపు మెత్తటి బంక మట్టిని తీసుకొచ్చి దానికి కొంత ఉప్పు కలిపి రొట్టెల్లా చేసి ఎండ పెడతారు. వాటిని పిల్లలు, పెద్దలు మన గారెల్లా కొర్కుక్కు తింటారు. ఆ మట్టిలో వివిధ ఖనిజాలు ఉండడం వల్ల వాటిని ఇలా తిన్నట్లయితే కడుపు పేగుల్లోని క్రిములన్నీ చనిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని వారి నమ్మకం. మొదట్లో గర్భవతులు, ముసలి వాళ్లు వాటిని తినేవారు. డబ్బున్న వారు కూడా మన ఆయుర్వేద వైద్యంలా అప్పుడప్పుడు వాటిని తినేవారు. ఇప్పుడు పేద ప్రజలందరు వాటినే తింటున్నారు. కేవలం వారు బతకడం కోసమే తింటున్నారు. మట్టి రొట్టెల్లో పోషక పదార్థాలు ఉన్నాయనుకోవడం వారి ఆత్మ సంతప్తి కోసమే. ఆ మట్టిలో వివిధ రకాల ఖనిజాలు ఉన్నప్పటికీ పిల్లలకు, పెద్దలకు అవసరమైనన్ని పోషక పదార్థాలు లేవని ఐక్యరాజ్య సమితి ఇదివరకే తేల్చింది. ఉంటే 52 శాతం హైతీ పిల్లల్లో పోషక పదార్థాల లోపం ఎందుకుంటుందని కూడా ప్రశ్నించింది. -
1982 తర్వాత తొలి‘సారీ’
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్కు చేరకపోవడం ఇదే తొలిసారి. రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్లోనైనా సాధ్యపడుతుందో చూడాలి. -
ఆమె బతికేవుంది.. కణాలుగా!
నువ్వు లేవు కానీ నీ జ్ఞాపకాలున్నాయి అని మనకు ప్రియమైన వాళ్లను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ బతికిçస్తుంటాం. కానీ హీన్రియెటా లాక్స్ విషయంలో ఈ ఉద్వేగం పనిచేయదు. మనిషి కొన్ని కోట్ల కణాల సమూహం అని ఒప్పుకుంటే ఈ ఆఫ్రికన్ అమెరికన్ మహిళ ఇప్పటికీ బతికివున్నట్టే లెక్క. కాకపోతే సాంకేతికంగా ఆమె జీవితకాలాన్ని 1920–1951 అని రాయాలంతే. హీన్రియెటా అనారోగ్యంతో 1951లో అమెరికా మేరీలాండ్లోని జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో చేరింది. ఆ ప్రాంతంలో అప్పుడు నల్లవారికి చికిత్స చేసే ఆసుపత్రి అదొక్కటే. అప్పటికి ఆమె ఐదుగురు పిల్లల తల్లి. పొగాకు పండించే కుటుంబం వాళ్లది. గర్భాశయంలో చిన్న ముడిలాంటిదేదో ఉన్నట్టు ఆమె అనుకుంది. ఇంట్లోవాళ్లు మళ్లీ గర్భం దాల్చిందేమో అనుకున్నారుగానీ రక్తస్రావం జరిగాక, చాలా పరీక్షల తర్వాత సెర్వికల్ కేన్సర్ అని తేలింది. అప్పుడు ఆమె ట్యూమర్ కణాలను శాంపిల్గా తీసుకున్నారు. ఆ విషయం ఆమెక్కూడా తెలియదు. వాటిని బయాప్సీ చేసిన బయాలజిస్ట్ జార్జ్ ఆటో గై... యురేకా అని అరిచినంత పనిచేశాడు. ఆమె కణాలు వేగంగా పెరగడమే కాదు, వాటికి మృత్యువనేదే లేదని గుర్తించాడు. సాధారణంగా పరిశోధకులు కణాల మీద చేసే ప్రయోగాల్లో ప్రయోగం కంటే ఆ కణాలను కాపాడుకోవడమే ఎక్కువ ప్రయాస అవుతుంది. కానీ హీన్రియెటా కణాలు ఏ పరిస్థితుల్లోనైనా మనగలిగే గొప్ప గుణాన్ని కలిగివుండటం సృష్టి మర్మం. పది నెలల పోరాటం అనంతరం 31 ఏళ్ల హీన్రియెటా మరణించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల ప్రయోగశాలల్లోనూ జరుగుతున్న బయోమెడికల్ రీసెర్చ్లో ఆమె కణాలు కీలకమవుతున్నాయి. ఏఉnటజ్ఛ్టీ్ట్చ ఔఅఛిజుటపేరు మీదుగా రూపొందిన హీలా సెల్ లైన్ వేలాది రోగాల చికిత్స కోసం తయారుచేస్తున్న వేలాది మందులను పరీక్షించడానికి పనికొస్తోంది. 2010లో మాత్రమే ఆమె సేవను అధికారికంగా గుర్తించారు. 2017లో ఆమె జీవితం ఆధారంగా ‘ది ఇమ్మోర్టల్ లైఫ్ ఆఫ్ హీన్రియెటా లాక్స్’ పేరుతో సినిమా కూడా వచ్చింది. -
రెండు ముక్కలు కానున్న ఆఫ్రికా ఖండం
-
బూడిద.. ఆ రైతు జీవితాన్నే మార్చేసింది!
ఈ ఫొటోలో ఉన్న రైతు శాస్త్రవేత్త పేరు నువిమన. అతను ఆఫ్రికా దేశం బురుండిలోని కబుయెంగె కొండ ప్రాంతంలో తన తోటి రైతులతో పాటు టమాటాలను ఎక్కువగా పండిస్తుంటారు. సీజన్లో కొనే వారే లేక పండించిన సగం టమాటాలను పారబోస్తుంటారు. ఆ తర్వాత ధర బాగా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో టమాటాలను ఏవిధంగా నిల్వ చేయగలమని అనేక పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉండగా.. ఒకానొక రోజు చక్కని పరిష్కారం దొరికింది. అనుకోకుండా చెట్టు కింద బూడిదలో ఉండిపోయిన టమాటాలు నెలల తరబడి చెడిపోకుండా ఉండటాన్ని గుర్తించి ఎగిరి గంతేశాడు. టమాటాలను అట్టపెట్టెల్లో నింపి.. ఆపైన బూడిద పోసి నిల్వ చేశాడు. ఐదు, ఆరు నెలల పాటు చెడిపోకుండా అలాగే ఉంటున్నాయి! ఈ ఆవిష్కరణ రైతు నువిమన జీవితాన్నే మార్చేసింది. పండించిన ప్రతి టమాటానూ అమ్ముకోగలుగుతున్నాడు. అన్సీజన్లో టమాటాలను హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తానే ఒక చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ట్రక్కు కొని నలుగురికి ఉపాధి కల్పిస్తానని గర్వంగా చెబుతున్నాడు రైతు శాస్త్రవేత్త. ఈ టెక్నిక్ను టమాటా సాగుకు ప్రసిద్ధిచెందిన సిబిటొకె ప్రాంతంలో రైతులు చాలామంది ఉపయోగిస్తున్నారు. నువిమనకు జేజేలు పలుకుతున్నారు. విత్తనాలను బూడిదలో భద్రపరుచుకోవడం తరతరాలుగా తెలిసిందే. బూడిదలో ఉంచిన టమాటాలు ఆరోగ్యానికి మంచిదేనా? బురుండికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త జీన్ నివ్యబండిని అడిగితే.. ‘ఏం పర్వాలేదు. బూడిద వల్ల టమాటాలపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. నిస్సంకోచంగా తినొచ్చు. అయితే, ప్రభుత్వ వ్యవసాయ విభాగం లోతైన అధ్యయనం చేయటం మంచిది’ అన్నారు. -
భారత తీరప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరికలు