Aircraft
-
ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల్లోకి స్టార్ ఎయిర్
ముంబై: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. 2019లో ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మార్చి నాటికి ఫ్లీట్ సంఖ్య 14కు చేర్చనున్నట్టు వెల్లడించింది. అలాగే సర్వీసుల సంఖ్యను 100కు పెంచనున్నట్టు తెలిపింది.ప్రస్తుతం సంస్థ వద్ద ఎంబ్రాయర్ తయారీ తొమ్మిది విమానాలు ఉన్నాయి. 23 కేంద్రాలను అనుసంధానిస్తూ రోజుకు 44 సర్వీసులను నడుపుతోంది. 15 లక్షల మందికిపైగా కస్టమర్లకు సేవలు అందించింది. ఉడాన్ స్కీమ్ కింద కంపెనీకి కేటాయించిన రూట్లలో 90 శాతంపైగా కవర్ చేసినట్టు స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రాన్ సింగ్ తివానా తెలిపారు. నెట్వర్క్కు మరో అయిదు కేంద్రాలు తోడు కానున్నట్టు చెప్పారు. -
నల్లపెట్టె మౌనరాగం!
నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్ బాక్స్. ‘డెత్ కోడ్’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే. కానీ ఇటీవల బ్లాక్బాక్సులు తరచూ విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చిక్కాలి. అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) అని రెండు భాగాలుంటాయి. వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్ పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్పిట్ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. అయితే... → సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సు పనిచేయదు. → ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. → విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్ చేసినా బ్లాక్బాక్స్ పనిచేయడం మానేస్తుంది. → డేటా ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. → కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. → అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. → తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! నిజానికి ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే దాని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సుల బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమై ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్ చేస్తుంది. రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్రెజిల్లోని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్ తెర నుంచి అదృశ్యమైంది. మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల డేటా రికార్డింగ్ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు! తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్ టైమ్లో పంపే బ్లాక్ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. – జమ్ముల శ్రీకాంత్ -
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్ఫోన్ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. స్వీడన్ నుంచి అమెరికాలోని మియామి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని యూటర్న్ చేసుకొని తిరిగి యూరప్లో ల్యాండ్ చేశారు. విమానం కుదుపులకు లోనైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.స్కాండినేవియన్ ఎయిర్ లైనస్కు చెందిన విమానం 254 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉంది. ఇంతలో మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడగా.. మరికొందరైతే ఏకంగా ఫ్లైట్ పైకప్పుకు గుద్దుకున్నారు.చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు ఆందోళన చెందారు. గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్లో ల్యాండ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని సంబంధిత స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రయాణీకులకు రాత్రిపూట హోటల్లో వసతి కల్పించామని, శుక్రవారం ఉదయం ఇతర విమానాలలో వియామికి వెళ్లేందుకు షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.🚨 #BreakingNow A video from #SK957 cabin as extreme turbulence hit a SAS A330 over Greenland,throwing unbuckled passengers into the ceiling.This incident highlights how turbulence can occur without warning,making seatbelts essential for passenger safety. https://t.co/iYVA4IIUER pic.twitter.com/S4kCaKwnn0— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) November 15, 2024 -
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్క్రాఫ్ట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్సభ ఆగస్ట్లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్బస్లకు భారత్ కీలక మార్కెట్గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
ఎయిరిండియాలో కొత్తగా నారోబాడీ ఎయిర్క్రాఫ్ట్
ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లోకి చేరింది. ఫ్రాన్స్లోని ఎయిర్బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా.. లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్ పోటీ!
ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో పనిచేసే కారును రూపొందించింది.హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు -
విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్ రౌత్
ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్సింగ్ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి ఎక్కడుందో వెతికారు. దారావీ స్లమ్ ఏరియా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్ చెప్పారు. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు -
బీహార్: పొలాల్లో కూలిన ఎయిర్క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లకు గాయాలు!
బీహార్లోని గయ జిల్లాలోని బుద్ధగయలో ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. బాగ్దాహాలోని కంచన్పూర్ గ్రామంలో శిక్షణ సమయంలో ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎయిర్క్రాఫ్ట్లో లేడీస్ పైలట్, జెంట్స్ ఆర్మీ పైలట్ ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా బాగ్దాహా, బోధ్ గయ సమీపంలోని కంచన్పూర్ పొలాల్లో ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అది మైదాన ప్రాంతంలో పడిపోయింది. శిక్షణలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎయిర్క్రాఫ్ట్ను తమ వెంట తీసుకెళ్లారు. గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ విమానం 200 నుంచి 400 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంతకుముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎయిర్క్రాఫ్ట్ పొలంలో కూలిపోయింది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి.. బాలున్ని చంపేసింది!
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక విధానాల వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత్ అందించిన ఎయిర్క్రాఫ్ట్ వినియోగాన్ని నిరాకరించిన కారణంగా బ్రెయిన్ స్ట్రోక్తో బాలుడు మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న అబ్బాయిని వేగంగా ఆస్పత్రికి తరలించడానికి ఎయిర్క్రాఫ్ట్ కోసం బాధితులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు బ్రెయిన్ ట్యూమర్ స్ట్రోక్తో బాధపడుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో బాధిత కుటుంబం అతన్ని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని వారి ఇంటి నుండి రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్క్రాఫ్ట్ అంబులెన్స్ను అభ్యర్థించింది. కానీ సమాధానం రాలేదు. 16 గంటల తర్వాత బాలున్ని మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. "స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలున్ని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్కు కాల్ చేశాం. కానీ మా కాల్కు సమాధానం అందలేదు. ఉదయం 8:30 గంటలకు ఫోన్కు సమాధానం ఇచ్చారు. సాధారణంగా అలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఇస్తారు. అది ఉండటమే పరిష్కారం" అని బాలుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభణ కొనసాగుతోంది. భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలుడి మరణంపై వ్యాఖ్యానించిన మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్.. “భారతదేశం పట్ల అధ్యక్షుడి వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు. ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? -
భారత్కు మరో 2,500 విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన రంగానికి 2042 నాటికి మరో 2,500కు పైగా విమానాలు అవసరం అవుతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. ‘పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్ను తీర్చడానికి దక్షిణాసియాకు చెందిన విమానయాన సంస్థలు రాబోయే రెండు దశాబ్దాలలో తమ విమానాల పరిమాణాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని అంచనా. వృద్ధి, విమానాల భర్తీని పరిష్కరించడానికి ఈ కంపెనీలకు 2,705 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరమవుతాయి. ఇందులో 92 శాతం భారత్ కైవసం చేసుకుంటుంది’ అని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డేరిన్ హస్ట్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అంచనా వేసిన మొత్తం విమానాల్లో.. తక్కువ దూరం ప్రయాణించడానికి అనువైన చిన్న విమానాలు 2,300లకుపైగా, సుదూర ప్రాంతాల కోసం సుమారు 400 విమానాలు అవసరం అవుతాయని చెప్పారు. ఆసియాలో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పరంగా మహమ్మారి ముందస్తు స్థాయికి పుంజుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద మార్కెట్ భారత్ మాత్రమేనని ఆయన అన్నారు. -
జెట్సెట్గో భారీ డీల్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ విమాన సర్వీసుల రంగంలో ఉన్న జెట్సెట్గో భారీ డీల్కు తెరలేపింది. ఇందులో భాగంగా 280 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకుంటోంది. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 వేదికగా ఎలెక్ట్రా, ఏరో, హారిజన్ ఎయిర్క్రాఫ్ట్, ఓవర్ఎయిర్తో జెట్సెట్గో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ.10,790 కోట్లు. హారిజన్ తయారీ 50 కెవోరైట్ ఎక్స్7 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకుంటున్నట్టు సమాచారం. మరో 50 ఎక్స్7 ఈవీటోల్స్ తీసుకునే అవకాశమూ ఉంది. నగరాల్లో ఎయిర్ట్యాక్సీలుగా, విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రదేశాలకు, నగరాల మధ్య, నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లేందుకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లను వినియోగించవచ్చని జెట్సెట్గో శుక్రవారం వెల్లడించింది. ‘ఈ మూడు కంపెనీలతో భాగస్వామ్యం భారత్కు బ్లోన్ లిఫ్ట్, ఫ్యాన్ ఇన్ వింగ్ లిఫ్ట్ సిస్టమ్స్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సూపర్–క్వైట్ ఆప్టిమల్ స్పీడ్ టిల్ట్ రోటర్స్ వంటి ప్రత్యేక సాంకేతికతలను పరిచయం చేస్తుంది’ అని జెట్సెట్గో ఫౌండర్, సీఈవో కనిక టేక్రివాల్ తెలిపారు. -
మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ ఎంవోయూ
హైదరాబాద్: మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్ వెరి్టక్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటాల్) ఎయిర్క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ/ఫ్లయింగ్ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది. తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్ డ్రోన్స్కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్ డ్రోన్స్ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది. -
చిన్నసైజు హెలికాప్టర్ కనిపిస్తుంది..తుఫాన్ బాధితుల్ని కాపాడటంలో
తుఫానులనూ తట్టుకోగల డ్రోన్ చిన్నసైజు హెలికాప్టర్లా కనిపించే ఈ డ్రోన్ వాతావరణంలోని ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటూ ఇట్టే దూసుకుపోగలదు. చెక్ కంపెనీ ‘థండర్ ఫ్లై’ ఈ డ్రోన్ను ‘టీఎఫ్–జీ1’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యవసర వస్తువులను గమ్యానికి చేరవేయడానికి వీలుగా ‘థండర్ ఫ్లై’ ఇంజినీర్లు దీనిని రూపొందించారు. తుఫానుల్లో సైతం ఈ డ్రోన్ చెక్కుచెదరకుండా ప్రయాణించగలదు. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ డ్రోన్ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, గంటకు పైగా నిరంతరాయంగా ప్రయాణించగలదు. ఇది ఐదు కిలోల వరకు బరువున్న వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా తీసుకుపోగలదు. తుఫానుల్లో చిక్కుకు పోయిన వారికి ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడగలదు. థండర్ ఫ్లై వెబ్సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 9,999 డాలర్లు (రూ.8.33 లక్షలు). రోటరీ బ్లేడ్లు అదనంగా కావాలను కుంటే, మరో 499 డాలర్లు (రూ.41,611) చెల్లించాల్సి ఉంటుంది. -
మరిన్ని యుద్ధ విమానాలు భారత్కు.. రక్షణ శాఖ అనుమతి
భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది. అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం కుప్పకూలిపోయింది. జపాన్ సమీపంలోని యకుషిమా ద్వీప సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిదిమంది సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్ తీరప్రాంత అధికారి వెల్లడించారు. అయితే విమానంలోని వారి పరిస్థితి, భద్రతపై సమాచారం తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. యూఎస్కు చెందిన మిలిటరీకి చెందిన వి-22 ఓస్ప్రే విమానం ఎనిమిది మధ్య వ్యక్తులతో వెళ్తుంది. జపాన్లోని యకుషిమా ద్వీపం సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జపాన్ సమయం ప్రకారం( భారత కాలమాన ప్రకారం ఉదయం 11:17 గంటలు) బుధవారం మధ్యాహ్నం 2.47 గంటలకు జరిగింది. యుఎస్ మిలిటరీ విమానం సముద్రంలో పడిపోవడంతో దాని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జపాన్లోని యూఎస్ బలగాల ప్రతినిధి పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన ఎస్ప్రే సంస్థ విస్తరణ జపాన్లో వివాదాస్పందగా మారింది. ఈ హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలను అమెరికా సైన్యం, జపాన్ కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తి సురక్షితమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఆగస్టులో ఇదే యూఎస్ ఎస్ప్రే విమానం ఉత్తర ఆస్ట్రేలియా తీరంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2016 డిసెంబర్లో కూడా జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావా సముద్రంలో మరో విమానం ప్రమాదానికి గురైంది. -
భారత్లో విమానాల సర్వీసింగ్.. హాల్తో ఎయిర్బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ భారత్లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్బస్ కట్టుబడి ఉందని ఎయిర్బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ‘ఎయిర్బస్ వరల్డ్’కి యాక్సెస్ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
పర్సనల్ జెట్ప్యాక్లు వచ్చేస్తున్నాయి..
ప్రస్తుతం కారు ఉండటం అనేది చాలా సాధరణం అయిపోయింది. అదే కారు లాగే ‘పర్సనల్ ఫ్లైట్’ ఉంటే... అమ్మో అది రూ. కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంబానీ వంటి అపర కుబేరులకే అది సాధ్యమవుతుంది కానీ ఇతరులకెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? పర్సనల్ వాహన రంగంలో సరికొత్త శకం రాబోతోంది. కారు కొన్నంత సులువుగా, కారు ధరకే ‘పర్సనల్ ఫ్లైట్’లు కొనుక్కునే కాలం ఎంతో దూరంలో లేదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టేసింది ఓ విదేశీ ఏవియేషన్ స్టార్టప్ కంపెనీ. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (eVTOL) ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేస్తోంది. అంటే ఇది విద్యుత్శక్తి సాయంతో ఎగురుతుంది. ఇందు కోసం ప్రముఖ సెలబ్రిటీ ఆర్టిస్ట్, టెక్ విజనరీ విలియమ్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సైతం పొందింది. కారు కంటే వేగంగా.. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇది ఆకాశ ఫార్ములా వన్ రేసింగ్ కారు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్తో దీన్ని తయారు చేశారు. ఇందులో ఎనిమిది శక్తివంతమైన మోటర్లు ఉంటాయి. ఇవి సమాన మొత్తంలో ప్రొపెల్లర్లను నడుపుతాయి. చూడటానికి డ్రోన్లాగా ఉండే ఈ వాహనాలను ఇటీవల అమెరికాలో పరీక్షించారు. అక్కడ వీటిని నడపడానికి పైలట్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఆర్డర్ల స్వీకరణ జెట్సన్ వన్ పర్సనల్ జెట్ప్యాక్లకు ఈ కంపెనీ ఆర్డర్లు స్వీకరిస్తోంది. వీటి కోసం ఇప్పటికే 300 మంది ఆర్డర్ చేశారు. ఇందు కోసం ఒక్కొక్కదానికి 98,000 డాలర్లు (సుమారు రూ.81.5 లక్షలు) చెల్లించారు. అంటే ఒక ప్రీమియం కారు ధర కంటే తక్కువే. -
విమానాల లీజింగ్ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్
ముంబై: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) తాజాగా విమానాల లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్వత్ లీజింగ్ ఐఎఫ్ఎస్సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) గిఫ్ట్ సిటీలో సొంత ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం.