al-Qaeda
-
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్టీఎస్ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్టీఎస్ గ్రూప్కు మొదట్నుంచీ అల్ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్ఖైదాతో హెచ్టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
ఉగ్ర చీఫ్ నుంచి దేశ సారథి దాకా!
బీరూట్: 14 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని ఎలాగోలా పరిపాలన సాగిస్తున్న అసద్ను చావుదెబ్బతీస్తూ దాడులు మొదలెట్టిన కేవలం 11 రోజుల్లో దేశంపై పట్టుసాధించిన అబూ మొహమ్మెద్ అల్ గోలానీ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. జిహాదీ ఉగ్రవాదిగా మొదలైన ప్రస్థానం నేడు దేశాధినేత స్థాయిలో కొత్త పంథాలో కొనసాగనుంది. 42 ఏళ్ల గోలానీ 2003లో తొలిసారిగా అల్ఖైదాతో చేతులు కలిపారు. ఇరాక్లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భావసారుప్యత ముఠాలను ఒక్కతాటి మీదకు తెచ్చి అల్ఖైదా.. అబూ బకర్ అల్ బాగ్దాదీ సారథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ను స్థాపించింది. 2011లో సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలంటూ అబూబకర్.. గోలానీని సిరియాకు పంపించాడు. అక్కడ అల్ఖైదా అనుబంధ నుస్రా ఫ్రంట్ను స్థాపించారు. దీనిని ఆనాడే అమెరికా ఉగ్రసంస్థ ముద్రవేసింది. గోలానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరానా ప్రకటించింది. 2013లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక నుస్రా ఫ్రంట్ను ‘ఇరాక్ అల్ఖైదా’లో కలిపేసి కొత్తగా ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)’ను స్థాపించాని అబూబకర్ సూచించారు. అయితే ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్ను గోలానీ కొనసాగించారు. 2013లో గోలానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. 2016లో అల్ఖైదాతో తెగతెంపులు చేసుకుని సొంతంగా జభాత్ ఫతే అల్–షామ్(ది సిరియా కాంక్వెస్ట్ ఫ్రంట్)ను గోలానీ స్థాపించారు. ఇంకొక ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్(సిరియా విమోచన సంస్థ)గా నామకరణం చేశారు. ఇడ్లిబ్ ప్రావిన్స్లో తన పట్టు నిలుపుకున్నారు. స్వతంత్రంగా పోరాటంచేసే వేర్వేరు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధిపత్యాన్ని అణచివేసి, వారిని తమలో కలుపుకుని సంస్థను మరింత పటిష్టవంతం చేశారు. తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడుల్లో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు. 2016లో తొలిసారిగా బహిరంగంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అమెరికన్ జర్నలిస్ట్కు తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ సంస్థ పశి్చమదేశాలకు వ్యతిరేకంగా పనిచేయబోదని, సిరియాపై ఆంక్షలు విధించడం సబబుకాదని, పరోక్షంగా అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ పశి్చమదేశాల విదేశాంగ విధానాలను విమర్శించిన మాట వాస్తవమే. కానీ మేం అమెరికా, యూరప్ దేశాలతో యుద్ధాలకు దిగాలనుకోవట్లేము. మాకు శాంతిస్థాపనే ముఖ్యం’’ అని గోలానీ గతంలో వ్యాఖ్యానించారు. -
అల్ ఖైదా అనుబంధ గ్రూప్ కీలక నేత హతం
న్యూయార్క్: సిరియాలో జరిగిన దాడుల్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ కీలక నేతను హతమార్చినట్లు అమెరికా మిలిటరీ వెల్లడించింది. అల్ ఖైదా కీలక నేత అబూ అబ్దుల్ రెహ్మాన్ అల్ మక్కీని టార్గెట్ చేసి దాడి చేశామని, ఈ దాడుల్లో ఆయన మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM)సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. రెహ్మాన్ అల్ మక్కీ.. హుర్రాస్ అల్-దిన్ షురా కౌన్సిల్ సభ్యుడు, సిరియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.U.S. Central Command Forces Killed Hurras al-Din Senior LeaderEarlier today, U.S. Central Command Forces killed Hurras al-Din senior leader Abu-’Abd al-Rahman al-Makki in a targeted kinetic strike in Syria. Abu-’Abd al-Rahman al-Makki was a Hurras al-Din Shura Council member… pic.twitter.com/eIxqqU1vFq— U.S. Central Command (@CENTCOM) August 23, 2024హుర్రాస్ అల్-దిన్ సిరియాలో ఉన్న అల్-ఖైదా అనుబంధ గ్రూప్ అని అమెరికా తెలిపింది. అమెరికా, పాశ్చాత్య దేశాలే లక్ష్యంగా నిర్వహించటంలో అల్ ఖైదాకు ఈ గ్రూప్ సహాయం చేస్తోందని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ను అంతం చేయటం కోసం అంతర్జాతీయంగా ఏర్పాటైన సైన్యంలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారని తెలిపింది. ఇరాక్, సిరియాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న అల్-ఖైదా గ్రూప్ను ఎదుర్కోవడం కోసం ఈ సైన్యం 2014లో స్థాపింపించారు. -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న అరీఫ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్ఖైదాతో టెలీగ్రాం, డార్క్నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీని హతమార్చిన అమెరికా
-
హెల్ఫైర్ మిసైల్.. తిరుగులేని మారణాస్త్రం
అల్ఖైదా నంబర్ 2గా ఉన్న అహ్మద్ హసన్ అబూ ఖైర్ అల్మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్ఫైర్ ఆర్9ఎక్స్తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి. 2000లో యెమన్లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్ అహ్మద్ అల్ బదావీని 2019లో హెల్ఫైర్ ఆర్9ఎక్స్తోనే సీఐఏ మట్టుబెట్టింది. ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్ఫైర్తోనే మట్టుబెట్టింది. 2020లో ఇరాన్కు చెందిన మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది. అల్ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్ఫైర్ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్హీడ్ మార్టిన్–నార్త్రోప్ గమ్మన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్స్ట్రీట్ జర్నల్ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్ఫైర్కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్9ఎక్స్ రకం. ఇది వార్హెడ్ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి. దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్లాన్ బీగా హెల్ఫైర్ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్ఫైర్ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్ విజయవంతంగా పని పూర్తి చేశారు. -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్లాడెన్ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్బీఐ సైఫ్ అల్ అడెల్ను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్ మోడలా?
ఆమెను లేడీ అల్ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్ వాంటెడ్ వుమెన్ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్గా భావిస్తే అమెరికా ఆమెపై అల్ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్కి ఎందుకీ ఆరాటం? అమెరికాలోని టెక్సాస్లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు. ► 2011లో అల్ ఖాయిదాలో నెంబర్ 2 ఉగ్రవాది అల్ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగి వారెన్ వీన్స్టెన్ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు. ► 2014లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది. ► 2017లో పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ఖాన్ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ఆఫియా చుట్టూ ఆరోపణలు ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్ విజన్ గాగుల్స్ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్మైండ్ ఖలీద్ షేక్ మహమ్మద్ మేనల్లుడు అమ్మర్ అల్ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్ అరెస్ట్ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఉన్నప్పటి చిత్రం 2008లో అఫ్గానిస్తాన్లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి. అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు. 2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది. ఇప్పుడు ఎలా ఉంది ? టెక్సాస్లోని ఫోర్ట్వర్త్ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకోవచ్చు!. ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్. 1990లో టీనేజ్లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్ఖాన్తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది. భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉండేది. –నేషనల్ డెస్క్, సాక్షి -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
సజీవంగానే అల్ జవహిరి
ఐక్యరాజ్యసమితి: అల్–ఖాయిదా అగ్ర నాయకత్వంలో చాలావరకు అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోనే తిష్టవేసి ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని ఆ సంస్థ నేత అయిమన్ అల్–జవహిరి సజీవంగానే ఉండి ఉండవచ్చని అభిప్రాయపడింది. ‘అల్–ఖాయిదా అగ్రనాయకత్వం పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. భారత ఉపఖండంలో ఉన్న మిగతా శ్రేణులతో కలిసి పనిచేస్తున్నారు. అంతా కలిపి 500 మంది వరకు ఉండవచ్చు. అతడు అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే ప్రచార వీడియోల్లో సైతం కనిపించడం లేదు’ అని ఐరాస ఆంక్షల పర్యవేక్షక బృందం తన 12వ నివేదికలో పేర్కొంది. భారత ఉపఖండంలో అల్–ఖాయిదా కార్యకలాపాలు ప్రస్తుతం ఒసామా మహమూద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని వెల్లడించింది. అల్–ఖాయిదా శ్రేణుల్లో అఫ్గాన్, పాక్, జాతీయులతోపాటు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశస్తులు కూడా ఉన్నారని పేర్కొంది. -
అల్ కాయిదా నంబర్ 2 హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్కాయిదాను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చావుదెబ్బ కొట్టాయి. అల్కాయిదాలో నంబర్–2గా చెలామణి అవుతున్న అబూ మొహమ్మద్ అల్–మాస్రీని ఈ ఏడాది ఆగస్టులో హతమార్చాయి. రహస్యంగా జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ వివరాలను తాజాగా నలుగురు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో దాక్కున్న అల్–మాస్రీ జాడను తొలుత అమెరికా కనిపెట్టింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్ నిఘా సంస్థకు చెందిన కిడోన్ దళం రంగంలోకి దిగింది. టెహ్రాన్లో నక్కిన అల్ మాస్రీని విజయవంతంగా మట్టుబెట్టింది. ఆగస్టు 7న పూర్తయిన ఈ ఆపరేషన్లో మాస్రీ కూతురు మరియం కూడా చనిపోయింది. మరియం మరెవరో కాదు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్లాడెన్ భార్యే. హమ్జాను అమెరికా దళాలు పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండగా గత ఏడాది హతమార్చాయి. 1998లో కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల్లో అల్–మాస్రీ కీలకపాత్ర పోషించాడు. అప్పటినుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్బీఐ అతడిని మోస్ట్వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే అల్కాయిదా చీఫ్ అల్ జవహరీ జాడ గత కొన్ని నెలలుగా తెలియడం లేదు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం..!
టెహ్రాన్/వాషింగ్టన్: ఉగ్ర సంస్థ ఆల్ఖైదా ముఖ్య నాయకుడు అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ మహ్మద్ అల్-మస్రీ హతమయ్యాడన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇరాన్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. అసలు తమ భూభాగంలో ఆల్-ఖైదా ఉగ్రవాదులే లేరని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాల పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న ఆల్ఖైదా సెకండ్-ఇన్-కమాండ్ మస్రీను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం తరఫున రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సేనలు ఆగష్టు నెలలో అతడిని హతమార్చినట్లు ఇంటలెజిన్స్ వర్గాలు వెల్లడించాయని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం పేర్కొంది. టెహ్రాన్ వీధుల గుండా వెళ్తున్న మస్రీని ఇద్దరు వ్యక్తులు మోటార్సైకిలు మీద వెంబడించి తుపాకీతో అతడిని కాల్చినట్లు వెల్లడించింది. మస్రీ వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఐమన్ అల్-జవాహిరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడని తన కథనంలో పేర్కొంది. అయితే మస్రీ కోసం గత కొన్నేళ్లుగా జల్లెడ పడుతున్న అమెరికా, అతడి హతం వెనుక ఎలాంటి పాత్ర పోషించిందన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది. అదే విధంగా ఆల్ఖైదా మస్రీ మృతిని ధ్రువీకరించకుండా ఇరాన్ ప్రభుత్వం కట్టడి చేసిందని పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జదేశ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ట్రంప్ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!) ‘‘అలాంటి(ఉగ్రవాద) గ్రూపులతో ఇరాన్ పేరును ముడిపెడుతూ అసత్య కథనాలు ప్రసారం చేసేలా మీడియాకు లీకులివ్వడం ట్రంప్ యంత్రాంగానికి సర్వసాధారణమైపోయింది. నేరగాళ్ల కార్యకలాపాలను కట్టడిచేయలేక, ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల చెలరేగుతున్న కల్లోలాన్ని రూపుమాపలేక తమ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. ఇరాన్ను భయపెట్టేందుకు వేసే ఎత్తుగడలు పనిచేయవు’’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఆగష్టు 7నాటి ఆపరేషన్లో మస్రీతో పాటు అతడి కూతురు, ఒసామా బిన్ లాడెన్ కోడలు(హంజా బిన్లాడెన్ భార్య) కూతురు కూడా మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక మస్రీ 2003 నుంచి ఇరాన్ కస్టడీలోనే ఉన్నాడని, 2015 నుంచి టెహ్రాన్లో స్వేచ్చగా జీవించేందుకు అతడికి అవకాశం లభించిందని ఇంటలెజిన్స్ అధికారులు చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇరాన్ అధికార మీడియా మాత్రం ఆగష్టు 7న దుండగుల దాడిలో మరణించింది లెబనీస్ హిస్టరీ ప్రొఫెసర్ హబీబ్ దావూద్, అతడి కుమార్తె మరియం అని పేర్కొనడం గమనార్హం. -
దేశంలో పాగాకు అల్కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్కతా: భారత్లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్లో అరెస్ట్చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్కాయిదా మాడ్యూల్పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్కాయిదా నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్కు చెందిన అల్కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అక్రమ బాంబుల తయారీకి నిలయంగా మారిందని గవర్నర్ జగదీప్ దంఖర్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం కేరళ, పశ్చిమ బెంగాల్కు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రవాదుల ద్వారా భారత్లో స్థావరం ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చేసిన ప్రయాత్నాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన అనంతరం గవర్నర్.. దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలోని పలు చోట్ల శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే అక్రమ బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది' ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటూ గవర్నర్ వరుసగా ట్వీట్స్ చేశారు. যা কিছুই ঘটুক না কেন; In service of WB NIA busts Al-Qaeda module in Murshidabad, WB. DGP on this alarming affairs @MamataOfficial to me “West Bengal police firmly adheres to the path laid down by law. There is no discrimination for or against anyone in an extra legal sense” pic.twitter.com/7DCqPyCaz9 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 19, 2020 ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ తప్పిదాలు చేయడంలో మమతా అధికార పోలీసులు బిజీగా ఉన్నారని గవర్నర్ ఆసహనం వ్యక్తం చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల భయంకర క్షీణతకు కారణమవుతున్న రాష్ట్ర ఉన్నతాధికార పోలీసులు వారి జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని' హితవు పలికారు. మరొక ట్వీట్లో పశ్చిమ బెంగాల్ డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి బాధాకరమని, రాష్ట్రంలో జరిగే అక్రమాలు పట్టనట్టుగా చూస్తున్న డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి నిజంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. -
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) కాగా శుక్రవారం నాడు కశ్మీర్లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు. -
అల్ కాయిదా టాప్ లీడర్ రిమీ హతం
వాషింగ్టన్: యెమెన్లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమ య్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్కాయిదా మరింత బలహీనపడుతుందని, దీంతో జాతీయ భద్రతకు ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు. రిమీ 1990 ల్లో అల్కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో అల్కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపు యెమెన్లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు. రిమీ మరణంతో అమెరికా ఆశలు, ఆశయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేసి అమెరికన్ పౌరులను కాపాడుకుంటామన్నారు. కాగా, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్కాయిదాకు అల్జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. గతేడాది అక్టోబర్లో ఐసిస్ నేత బగ్దాదీని, ఈ ఏడాది జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి. -
అతడిని అంతమొందించాం: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఆల్- ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం ఆల్- రిమీని హతమార్చినట్లు అమెరికా తెలిపింది. తమ దేశ నావికా దళ అధికారులను బలి తీసుకున్నందుకు గానూ అతడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. యెమెన్లో హింసకు కారణమైన అత్యంత ప్రమాదకర వ్యక్తిని అంతమొందించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆల్- ఖైదా ఇన్ అరేబియన్ పెనిసులా(ఏక్యూఏపీ) కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. యెమన్లో హింసకు పాల్పడి.. ఇక్కడ కూడా ‘‘రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ యెమెన్లో తీవ్ర హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులను బలిగొన్నారు. ఇప్పుడు అమెరికా పౌరులు, అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రచించింది. అందుకే ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్లో చేపట్టిన ఆపరేషన్లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్- రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్- ఖైదా ఉద్యమం నీరుగారిపోతుంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని పెన్సాకోలా వద్ద ఉన్న నావల్ ఎయిర్ స్టేషన్పై ఓ సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ముగ్గురు అమెరికా సెయిలర్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఏక్యూఏపీ ముందుకువచ్చింది. ఇక ఈ ఘటనపై విచారణ జరిపిన ఎఫ్బీఐ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మహ్మద్ అల్శమ్రానీగా గుర్తించింది. అతడు రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందినవాడని, ప్రస్తుతం మహ్మద్ అమెరికాలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొంది. మహ్మద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడని.. ‘‘నేను దుష్టులకు వ్యతిరేకం, అమెరికా ఓ దుష్టశక్తిగా అవతరించింది. కేవలం ముస్లింలకే కాకుండా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ద్వేషిస్తున్నాను’’ అంటూ ఆల్-ఖైదా వ్యవస్థాకుడు ఒసామా బిన్ లాడెన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అనేక పోస్టులు పెట్టినట్లు గుర్తించింది. ఇదిలా ఉండగా.. మహ్మద్ చర్యను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీవ్రంగా ఖండించారు. హేయమైన నేరానికి పాల్పడిన మహ్మద్ క్షమార్హుడు కాదని పేర్కొన్నారు. కాగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న దాదాపు 5 వేల మంది సౌదీ బలగాల్లో దాదాపు 850 మంది అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. చదవండి: అభిశంసన: ట్రంప్నకు భారీ ఊరట..! కాగా మధ్యప్రాచ్య దేశమైన యెమెన్పై ఆధిపత్యం సాధించేందుకు ఆల్-ఖైదా సహా పలు ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తుండగా.. అక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 2014లో మొదలైన ఈ యుద్ధంలో తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. అంతర్యుద్ధం కారణంగా యెమెన్లో ఎంతో మంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా తినడానికి తిండిలేక చిన్నారులు ఎముకల గూడులా మారి ప్రాణాలు కోల్పోతున్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు.. విధ్వంసానికి ఆల్ఖైదా ప్లాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కన్నేసిందే. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు ఆల్ ఖైదా రచిస్తోందని ఇంటిలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా కమాండర్ జాకీర్ ముసాను పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్- పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాది జాకీర్ ముసాను శనివారం బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అలర్లు సృష్టించేందుకు జాకీర్ను ఆల్ ఖైదా పంపిణి దూతగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లో రక్షణ దళాన్ని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్లు పాకిస్తాన్తో 1090 కి.మీ మెర సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సరిహద్దుల్లో హైలర్ట్ ప్రకటించినట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. -
‘అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు’
వాషింగ్టన్: తీవ్రవాదం అంతమొందించే విషయంలో అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడించిందని యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ లారెన్స్ సెల్లిన్ ఆరోపించారు. తాలిబన్తోపాటు, ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. అప్ఘనిస్తాన్, ఉత్తర ఇరాక్లలో యూఎస్ ఆర్మీ తరఫున పనిచేసిన సెల్లిన్ తన అభిప్రాయాలను ఓ అర్టికల్లో వెల్లడించారు. 2001లో అమెరికా అఫ్ఘనిస్తాన్పై దాడులు ప్రారంభించగానే పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తాలిబన్లకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను సరాఫరా చేసిందని తెలిపారు. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, అప్పటి ఐఎస్ఐ డైరక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్తో పాటు ఇతర ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని.. ఆ సమావేశంలో తాలిబన్, అల్ఖైదాలకు వ్యతిరేకంగా యూఎస్ జరిపే దాడులకు సహాయం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సెల్లిన్ పేర్కొన్నారు. ఇలా 17ఏళ్ల నుంచి పాక్ కపట నాటకం ఆడుతూనే ఉందని విమర్శించారు. ఓ వైపు అమెరికా నుంచి బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందుతూ.. మరోవైపు నెమ్మదిగా అఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలను దెబ్బతీసేందుకు తాలిబన్, హకానీ నెట్వర్క్ గ్రూపులకు సహాయం చేసిందని మండిపడ్డారు. తాలిబన్ గాడ్ ఫాదర్గా పేరు గాంచిన పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ గుల్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు ఐఎస్ఐ, యూఎస్ సహాయంతో అఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ బలగాలను బయటకు పంపుతోందని, అలాగే యూఎస్ సహాయంతోనే యూఎస్ను అఫ్ఘనిస్తాన్ నుంచి పంపిచి వేస్తామని చేసిన వ్యాఖ్యలను సెల్లిన్ గుర్తుచేశారు. 2001కి ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తాలిబన్ బలగాలు పాక్లోనే తలదాచుకుంటున్నాయని.. వారికి కావాల్సిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అంత అక్కడే జరుగుతోందని ఆయన తెలిపారు. ఐఎస్ఐ కూడా ఇందులో కీలక భూమిక పోషించడం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే చైనా కూడా పాక్కు సలహాలు అందజేస్తుందని ఆయన ఆరోపించారు. -
అల్ఖైదా ఉగ్రదాడి..11 మంది సైనికుల మృతి
యెమెన్ : ఆర్మీ కాన్వాయ్పై అల్ ఖైదా తీవ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 11 మంది యెమెన్ సైనికులు మృతిచెందారు. ఈ సంఘటన ఆగ్నేయ హంద్రామౌట్ ప్రావిన్స్లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందని భద్రతాబలగాల అధికారి తెలిపారు. చనిపోయిన సైనికుల్లో అందరూ కొత్తగా రిక్రూట్ అయిన వారే ఉన్నారని చెప్పారు. కొత్తగా నియామకమైన భద్రతా బలగాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు, ప్రత్యేక భద్రతా బలగాలు కూడా యెమెన్లో సహకారం అందిస్తున్నాయి. వివిధ దిశల నుంచి ఒకేసారి కాల్పులు జరపడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని, అందువల్లే కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయామని ఓ అధికారి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా(ఏక్యూఏపీ), ఐసిస్తో పాటు పలు ఉగ్రవాద సంస్థలు ఆగ్నేయ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అల్ ఖైదా, ఐసిస్కు చెందిన వారు ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న మొదటి దేశంగా ఐక్యరాజ్యసమితి యెమెన్ దేశాన్ని ప్రకటించింది. కరువు, కలరా కారణంగా సుమారు 70 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు, మరో 2,000 మంది మృతిచెందారు. -
టార్చర్ చూపిస్తున్నారు: 9/11 నిందితుడు
వాషింగ్టన్: తనను మానసికంగా ఎంతగానో వేధిస్తున్నారంటూ 9/11 దాడుల నిందితుడు, ఫ్రాన్స్కు చెందిన జకారియస్ మౌసాయ్ ఆరోపించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తనను కొలరెడోలోని ఉన్నతస్థాయి సెక్యూరిటీ జైలులో ఉంచారని పేర్కొన్న నిందితుడు నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను రాసినట్లు సమాచారం. గత డిసెంబర్లో రాసిన ఈ లేఖ ఇటీవల వెలుగుచూసింది. 'ట్రంప్ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోంది. నా బాధను బయటి ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటున్నా. లాయర్ ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తే ఆయన ద్వారా 9/11 దాడుల గురించి కొన్ని నిజాలు చెప్పాలని భావిస్తున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం, అమెరికా జైళ్ల శాఖ అందుకు అనుమతించకుండా నన్ను చిత్ర హింసలు పెడుతోంది. గతంలోనూ దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. చివరిగా 2006లో కేసు విచారణ తర్వాత నాకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ 2001 అల్ఖైదా ఉగ్రదాడికి సంబంధించి నిజాలు చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వాలంటూ' తన లేఖలో నిందితుడు, 20వ హైజాకర్ అయిన జకారియస్ మౌసాయ్ రాసుకొచ్చాడు. మరోవైపు తాజాగా అతడు రాసిన ఫిర్యాదు లేఖలో సౌదీ అరేబియాకు చెందిన రాజుల కుటుంబాలు ఉగ్రసంస్థ అల్ఖైదాకు ఆర్థిక సహకారం అందించాయని ఆరోపించాడు. కాగా, అమెరికా అధికారులు, సౌదీ రాజ వంశీయులు ఆ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తాజా పిటిషన్లో తన పేరును 'అల్లాకు బానిస (స్లేవ్ ఆఫ్ అల్లా)' అని నిందితుడు జకారియస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. విమానాలను హైజాక్ చేసి 2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్పై అల్ఖైదా ఉగ్రసంస్థ దాడికి పాల్పడ్డ ఘటనలో 3000కు పైగా ప్రజలు మృతిచెందిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను అమెరికా బలగాలు మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
‘అమెరికా గతాన్ని మర్చిపోయింది’
ఇస్లామాబాద్ : అమెరికాపై పాకిస్తాన్ ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తోంది. అగ్రరాజ్యం బెదిరింపులు లొంగేది లేదని... పాక్ మరోసారి స్పష్టం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు, ఉగ్రవాదం వంటి అంశాలపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై పొరుగుదేశం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. వాషింగ్టన్నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని పాటించలేమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా డెడ్లైన్లను విధించడం, బెదిరింపులకు దిగడం వంటివి ఇరుదేశాల సంబధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఆయన చెప్పారు. పరస్పర గౌరవం, ఒకరిమీదొకరికి నమ్మకం, నిలకడ, ఓర్పు ఉన్నపుడే దౌత్యసంబంధాలు కొనసాగుతాయని.. అవి లేనప్పుడు బంధం కొనసాగడంలో అర్థం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు పాక్ సహకరించిందని.. మా దేశం ఎవరిమీద సమయం చేయలేదన్న విషయానని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. అమెరికా భద్రత కోసం మేం ప్రయత్నించాము.. మా రక్షణ కోసం వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఆల్ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయడంతో మేం చేసిన సహాయాన్ని అమెరికా మర్చిపోయిందని ఆయన అన్నారు. మత స్వేచ్ఛకు ఇబ్బంది లేదు: మత స్వేచ్ఛ ఉల్లంఘనల విషయంలో అమెరికా పాకిస్థాన్ను ‘ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన జాబితా’లో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ అసహనం వ్యక్తం చేశారు. ఏఏ కారణాలతో పాకిస్తాన్ను ఈ జాబితాలో చేర్చారో చెప్పాలని ఆయన అన్నారు. మా దేశంలో మత స్వేచ్ఛ ఉంది.. అందువ్లలే అందరూ ఉండగలుగుతున్నారని చప్పారు. ఇదిలావుండగా.. మత స్వేచ్ఛ ఉల్లంఘనల అంశంలో 10దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ‘ప్రత్యేక ఆందోళనకర దేశాలు’గా హోదా మార్చారు. -
డ్రోన్ దాడిలో తీవ్రవాదులు హతం
ఎడెన్(యెమెన్): దక్షిణ యెమెన్లో అల్ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్పై డ్రోన్ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్ నుంచి బేడా ప్రావిన్స్కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్ కేంద్రంగా నడుస్తున్న అల్ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్ఖైదాపై అమెరికా డ్రోన్ దాడులు సాగిస్తోంది. -
లా‘డెన్’లో దాగిన రహస్యం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కరడుగట్టిన ఉగ్రవాది, అల్కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. పాకిస్తాన్లో అబోటాబాద్లోని రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి ఈ మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు, లాడెన్ అరబిక్లో రాసుకున్న ఓ డైరీ ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. కశ్మీర్ పరిణామాలపై ఆసక్తి... అబోటాబాద్లోని నివాసంలో లాడెన్ ఫోన్, ఇంటర్నెట్లను వాడలేదు. అయినా అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్కు చేరవేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడుల కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణకు సంబంధించిన వార్తలను లాడెన్ క్రమం తప్పకుండా చదివేవాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, అల్కాయిదా, తాలిబన్ల వార్తలను సేకరించేవాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్పై ప్రచురించిన వార్తల క్లిప్పింగులనూ భద్రపరిచాడు. ఇరాన్ను చిక్కుల్లో పెట్టేందుకేనా? లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభ్యమయ్యాయి. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా అందులో ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’, కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలతో పాటు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, అల్కాయిదాలు అవగాహనకు వచ్చినట్లు ఓ ఫైల్లో ఉంది. ఇరాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని చూపేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాసమాచారాన్ని విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – -
మక్కా ప్రధాన ఇమామ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్(పాకిస్తాన్): ప్రపంచానికే ప్రమాదకారులుగా మారిన ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదా ఉగ్రవాద సంస్థలపై మక్కా ప్రధాన ఇమామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం శాంతిని ప్రభోధిస్తుందని..అటువంటి ఇస్లాంకు అల్ఖైదా, ఐఎస్ వంటి సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మక్కా ప్రధాన మసీదులో ముఖ్య ప్రార్థనలను చేయించే షేక్ సలేహ్ బిన్ అబ్దుల్లా బిన్ హుమాయిద్ ఓ ప్రైవేట్ న్యూస్ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు. హింసావాదం అనేది పెనుశాపం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. విభేదాలను పరస్పర అవగాహన కల్మా-ఇ-హఖ్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. జిహాద్(పవిత్ర యుద్ధం)కు జవాబుదారీగా ప్రభుత్వాలే ఉంటాయని, ఒక గ్రూప్ లేదా వ్యక్తి ఉండజాలవన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం.. ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తిని చంపటం ఏకంగా మానవత్వాన్ని చంపినట్లేనని చెప్పారు. అసహనం, పరస్పర విభేదాల కారణంగానే ముస్లిం దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. -
తండ్రి లాడెన్ ఉగ్రజాడల్లో..
-
తండ్రి ఉగ్రజాడల్లో..
► జిహాదీలను ఏకం చేస్తున్న ఒసామా వారసుడు ► ధ్రువీకరిస్తున్న అమెరికా నిఘా వర్గాలు, నిపుణులు పారిస్: అంతమైపోయిందనుకుంటున్న అల్కాయిదా మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోందా? ఒసామా అంతమయ్యాక అస్తిత్వంకోసం పోరాడుతున్నా పూర్తిస్థాయిలో దక్షిణాసియాపై పట్టుకోసం ప్రయత్నిస్తోందా? ఇన్నాళ్లూ నాయకత్వలేమి.. ఒసామాతో ఉన్న సన్నిహితులు కొందరు ఐసిస్ వైపు వెళ్లడంతో దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లైంది. గతవారం అమెరికాపై ఉగ్రదాడికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్కాయిదా విడుదల చేసిన ఓ ఫొటో అల్కాయిదా పునరుజ్జీవం దిశగా అడుగులేస్తోందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ చిత్రంలో ఓవైపు డబ్ల్యూటీసీ టవర్స్ కూలిపోతున్న దృశ్యం, మరోవైపు కుమారుడు హమ్జాతో కలసి ఒసామా కూర్చున్నారు. అప్పటి బాలుడైన హమ్జా ఇప్పుడు 28 ఏళ్ల యువకుడిగా తండ్రి స్థాపించిన ఉగ్రసంస్థను ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా గూఢచార సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఒసామా ఉన్న పాత చిత్రాన్ని చాలా రోజుల తర్వాత తెరపైకి తేవటం వెనక ఉద్దేశం అల్కాయిదా పునరాగమనం కోసమేనని అంతర్జాతీయ విశ్లేషకుల భావన. జిహాదీల ఐక్యతే లక్ష్యంగా... ఒసామా మరణం తర్వాత ఆయన సన్నిహితులు కొందరు అల్కాయిదాను వీడినా.. హమ్జాతో కలసి మరికొందరు బలహీనమైన సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జిహాదీలను ఏకం చేయటంలో హమ్జా కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఐసిస్ మిలటరీ బలహీనపడుతున్న నేపథ్యంలో అల్కాయిదాను బలోపేతం చేసే వ్యూహాలతో హమ్జా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘తన తండ్రి స్థాపించిన సంస్థను నడిపేందుకు హమ్జా పూర్తి సన్నద్ధతకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఒసామా వారసుడిగా జిహాదీల్లో ఐకమత్యం తీసుకురావటంలో ఆయనకు సానుకూల అవకాశాలున్నాయి. ఐసిస్ పతనమవుతున్న తరుణంలో అంతర్జాతీయ జిహాదీ ఉద్యమానికి హమ్జా నాయకత్వం వహించే అవకాశం ఉంది. తండ్రిని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాదులను ఆకర్షిస్తున్నాడు’ అని ఎఫ్బీఐ మాజీ ప్రత్యేక ఏజెంట్, అల్కాయిదా స్పెషలిస్టు అలీ సౌఫాన్ ఉగ్రవాద పోరాట కేంద్రం (సీటీసీ) ప్రచురించిన రిపోర్టులో పేర్కొన్నారు. అబోట్టాబాద్కు ప్రతీకారంగా ఒసామా మూడో భార్య కుమారుడైన హమ్జా.. మొత్తం 20 మంది సంతానంలో 15వ వాడు. చిన్నప్పటినుంచే తండ్రినే అనుసరించాడు. ఆయుధాల వినియోగం నేర్చుకున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడికి ముందు రోజు ఒసామా నుంచి దూరంగా ఈయన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత తండ్రి కలవలేదు. భార్యలు,సోదరులను తీసుకుని అఫ్గాన్ అక్కడినుంచి ఇరాన్కు లాడెన్ వెళ్లిపోయాడు. ఒసామా తయారుచేసిన గూఢచార వ్యవస్థతో నిరంతరం తండ్రితోపాటుగా జిహాదీలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. ఒసామాను ఎన్కౌంటర్ చేసిన పాకిస్తాన్లోని అబోట్టాబాద్ ఇంట్లో కొన్ని లేఖలు దీన్ని బలపరుస్తున్నాయి. 2015లో విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో కాబూల్ నుంచి బాగ్దాద్ వరకు, గాజా నుంచి వాషింగ్టన్, లండన్, పారిస్, టెల్ అవివ్ వరకు జిహాదీలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చాడు. హమ్జా హెచ్చరికలను సీరియస్గా తీసుకున్న అమెరికా.. జిహాదీల్లో ఈయనకు పెరుగుతున్న ఆదరణ వాస్తవమేనని గుర్తించి అంతర్జాతీయ ఉగ్రవాదుల బ్లాక్లిస్టులో పేరు చేర్చింది. పశ్చిమాసియాలో హమ్జా ప్రభావం పెరుగుతోందని తేల్చింది. -
ఢిల్లీలో అల్కాయిదా సభ్యుడి అరెస్టు
దేశంలోని రోహింగ్యాలను రెచ్చగొట్టేందుకు కుట్ర న్యూఢిల్లీ: భారత్లో శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలను రెచ్చగొట్టి మయన్మార్ సైన్యంపై పోరాడేలా చేయడానికి వచ్చిన ఉగ్రసంస్థ అల్కాయిదా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సంతతి బ్రిటిష్ పౌరుడైన సమీయున్ రెహ్మాన్(27) అలియాస్ రాజుభాయ్ను సోమవారం తూర్పు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు. షుమన్ హక్ పేరుతో బిహార్ కిషన్గంజ్ ప్రాంతానికి చెందినవాడిగా తప్పుడు ఓటర్ ఐడీ కార్డును కూడా అతను తయారుచేసుకున్నట్లు వెల్లడించారు. మయన్మార్ సైన్యంపై పోరాడటం కోసం భారత్లోని మిజోరాం, మణిపూర్లో బేస్లు ఏర్పాటు చేయడానికి, నిధులు సేకరించడానికి రెహ్మాన్ యత్నించాడన్నారు. రెహ్మాన్ కార్యకలాపాలపై జూలై నుంచి నిఘా ఉంచిన తాము పక్కా సమాచారంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, 2,000 అమెరికన్ డాలర్లు, దాదాపు రూ.13 వేల విలువైన భారత, బంగ్లాదేశ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
ఎరువులా? మారణాయుధాలా?
- ఎరువులు, పురుగుమందులతో ప్రమాదకరమైన ఆయుధాలు - బాంబులు, రసాయన ఆయుధాలు తయారు చేస్తున్న ఉగ్రవాదులు - ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులు - దేశంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఎరువులు, పురుగు మందులు - అవి దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు ప్రమాదమే! - నియంత్రణ లేకపోవడంపై ఆందోళన.. అవగాహన కల్పించేందుకు చర్యలు - దీనిపై హైదరాబాద్లో ఇండో–అమెరికా వర్క్షాప్ ► అల్కాయిదా ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీవో)పై విమానాలతో దాడి చేసి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. అయితే ఆ దాడికి ముందు వారేం చేశారో తెలుసా..? పంటలకు ఉపయోగించే పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి.. రద్దీగా ఉండే ప్రాంతంలో చల్లడం ద్వారా వేలాది మందిని చంపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎందుకో అది వీలుగాక.. విమానాలతో దాడి చేశారు.. ► 1995లో అమెరికాలోని ఓక్లహామాలో ఉగ్రవాదులు ఒక భవనంపై బాంబుదాడి చేసి 168 మందిని బలితీసుకున్నారు. ఆ బాంబును దేనితో తయారు చేశారో తెలుసా..? పంటలకు వినియోగించే ఎరువులు, పురుగుమందులు కలిపి రూపొందించారు.. ... ఎరువులు, పురుగు మందులు పంటల రక్షణ కోసమే కాదు.. పెద్ద సంఖ్యలో మనుషులను బలితీసుకునే మారణ హోమాలకు ఆయుధాలుగా కూడా మారుతాయని ఈ రెండు ఘటనలు చెబుతాయి. ఉగ్రవాదులు ఎరువులు, పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి 1975 నుంచి 2002 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 146 భారీ విస్ఫోటనాలు సృష్టించారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. దీంతో ఎరువులు, పురుగు మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చ జరుగుతోంది. వ్యవసాయక దేశమైన భారత్లో ఎరువులు, పురుగుమందులను విçస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో... అవి దుష్టుల చేతిలో పడకుండా చర్యలు చేపట్టడంపై భారత్, అమెరికాలు దృష్టి సారించాయి. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో సదస్సు జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన ఇంధనశాఖ, స్టేట్ కెమికల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, పసిఫిక్ నార్త్వెస్ట్ నేషనల్ లేబొరేటరీ (పీఎన్ఎన్ఎల్)ల∙శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ పురుగు మందులతో మారణ హోమమే భారత్ వ్యవసాయక దేశం. దీంతో ఇక్కడ ఎరువులు, పురుగు మందుల వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఇందులోనూ దేశవ్యాప్తంగా ఉపయోగించే వాటిలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 24% వరకు ఉండటం గమనార్హం. దీంతో ఇక్కడ అవి పక్కదారి పట్టడానికి అవకాశాలు ఎక్కువ. పైగా హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి. ఉగ్ర వాదులు, మిలిటెంట్ ఉద్యమకారులు, క్రిమినల్ల చేతిలోకి ఎరువులు, పురుగుమందులు వెళితే అత్యంత ప్రమాదం. పురుగు మందుల సాంద్రత పెంచి ఇతరత్రా రసాయనాలు కలిపితే.. విధ్వంసకర ఆయుధాలుగా తయారవుతాయి. పురుగుమందులను అధిక సాంద్రతతో స్ప్రేచేస్తే విష ప్రభావంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎరువులతో బాంబులు ఎరువులు, పురుగు మందులతో బాంబులు తయారు చేయడం సులువు, చవక కూడా.. నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులు వాటిని ఉప యోగించి తక్కువ సమయంలోనే బాంబులు తయారు చేయగలరని ఇప్పటికే వెల్లడైంది. యూరియాకు నైట్రిక్ యాసిడ్ కలిపి భారీ పేలుడు సృష్టించే బాంబుగా తయారు చేయవచ్చని చెబుతున్నారు. అంటే మనం పెద్దగా పట్టించుకోని ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదు లు, క్రిమినల్స్ చేతిలో పడితే జరిగే నష్టం చాలా ఎక్కువ. దీంతో అమెరికా, భారత నిఘా వర్గాలు ఇప్పుడీ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాయి. పక్కదారి పట్టకుండా చూడాలి ‘‘ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదుల చేతిలో పడితే బాంబులు తయారు చేయడానికి ఆస్కార ముంది. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగు తోంది. పురుగు మందులు, ఎరువుల సరఫరా కట్టుదిట్టంగా ఉండాలి..’’ – డాక్టర్ జీవీఎం శర్మ, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసీటీ, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేయాలి.. ‘‘పురుగు మందులు, ఎరువులు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను ఏర్పా టు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. డీలర్లను, వ్యాపారులను చైతన్యం చేయాలి. తయారీ యూని ట్లన్నీ భద్రత నడుమ ఉండాలి. దేశంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 66 పురుగు మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రకటించి, నిషేధించారు. అందులో మన దేశంలో 18 పురుగు మందులపై నిషేధం ఉంది..’’ – పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?
-
బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: స్పెయిన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనందునే బార్సిలోనాను ఇస్లామిక్ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిపారు. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని ఆధునిక తుపాకులు, బాంబులతో జనాలలోకి చొచ్చుకు పోవడం కుదరడంలేదు కనుకనే టెర్రరిస్టులు జనంపైకి వాహనాలను నడపడం ద్వారా దాడులకు పాల్పడుతున్నారు. అందుకే పర్యాటకులు లేదా జన సాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. టెర్రరిస్టులు తొలిసారిగా ఈ తరహ దాడిని ప్రాన్స్లోని నైస్ సిటీపై 2016లో దాడిచేశారు. అదే ఏడాది బెర్లిన్లో దాడి చేశారు. ఈ ఏడాది లండన్లో ఇప్పుడు బార్సిలోనాలో దాడి చేశారు. తాజా దాడిలో 13 మంది మరణించగా, ఎక్కువ మంది గాయపడ్డారు. 2001 సంవత్సరంలో అల్ఖాయిదా టెర్రరిస్టులు న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై వైమానిక దాడులు జరిపి కొత్త పంథాను అనుసరించిన విషయం తెల్సిందే. ఆ దాడుల్లో అపార ప్రాణ నష్టం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేయడంతో ముంబు నగరంపై మరో రకంగా దాడులకు పాల్పడ్డారు. వివిధ దేశాలు అనుసరిస్తున్న భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకొని టెర్రరిస్టులు ఎప్పటికప్పుడు తమ దాడుల పంథాను మార్చుకుంటున్నారు. నైస్ దాడి అనంతరం బెర్లిన్ నగరంలో కూడా వాహనంతో దాడి జరగడంతో పలు పాశ్చాత్య దేశాలు పర్యాటక లేదా ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటునారు. ప్రజలు గుంపులుగా ఉండే ప్రాంతాలకు ఎక్కువ దూరంలోనే వాహనాలు నిలిపివేసి వాటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ బార్సిలోనాలో దాడి జరగడం దురదృష్టకరం. సిరియాలో ఎక్కువగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులనును ర క్కా ప్రాంతం నుంచి కూడా తరిమేసినందున పాశ్చాత్య దేశాలపై వారి దాడులు తగ్గుతాయని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అయితే పాశ్చాత్య దేశాల కారణంగానే సిరియాలో తాము పట్టుకోల్పోయామని భావిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులు అసహనంతో ఇంకా ఎక్కువ దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తారు. టెర్రరిస్టుల అణచివేతలో ఇంగ్లండ్, ఫ్రాన్స్తోని చేతులు కలిపినందునే ఇప్పుడు తాము స్పెయిన్పై దాడి చేశామని ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం ఇక్కడ గమనార్హం. -
రైళ్లను లక్ష్యంగా చేసుకోండి: అల్ కాయిదా
లండన్: విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పశ్చిమ దేశాల్లోని రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకోవాలని అల్కాయిదా తమ ఉగ్రవాదులకు పిలుపునిచ్చింది. రద్దీగా ఉండే రైలు మార్గాల్లో పట్టాలు తప్పించడం, రైళ్ల లోపలి నుంచి దాడికి పాల్పడటం ద్వారా భారీగా ప్రాణనష్టం కలిగించవచ్చంది. ఈ దాడి కోసం ఎలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదనీ, ఒకే వ్యక్తి మళ్లీమళ్లీ దాడులకు పాల్పడవచ్చని పేర్కొంది. ఈ మేరకు బాంబుల నిపుణుడు ఇబ్రహీం అల్ అసిరీ అల్ కాయి దా అధికార పత్రిక ‘ఇన్స్పైర్’లో 18 పేజీల వ్యాసం రాశాడు. రైళ్లను పట్టాలు తప్పించేందుకు వాడే పేలుడు పదార్థాలను ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు వాడకుండా ఎలా తయారుచేయాలో అందులో వివరించాడు. దీనివల్ల విచారణ సంస్థలకు ఎలాంటి ఆధారాలు లభించవన్నాడు. తన వ్యాసంలో ఇబ్రహీం ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లను ప్రస్తావించాడు. ‘అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. మొత్తం 2,40,000 కి.మీ రైలుమార్గంలో వాళ్లు(అమెరికా) ఎక్కడెక్కడని రక్షణ కల్పిస్తారు? అది సాధ్యం కాని పని. ఇదే అంశం బ్రిటన్ (18,500 కి.మీ), ఫ్రాన్స్ (29,743 కి.మీ)కు వర్తిస్తుంద’ని వ్యాసంలో ఇబ్రహీం తెలిపాడు. -
మతపరమైన దాడులతో అల్కాయిదాకు ఊతం
వాషింగ్టన్: భారత్లో పెరుగుతున్న మతపరమైన దాడుల వల్ల ఉగ్రవాద సంస్థ అల్కాయిదా పుంజుకునే వీలుందని అమెరికా నిపుణులు విశ్లేషించారు. భారత్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు అల్కాయిదా ప్రయత్నిస్తోందనీ, పెద్దఎత్తున యువ తను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోందని అమె రికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు సాగించే కేథరిన్ జిమ్మర్మన్ వెల్లడించారు. ఆఫ్రికా ప్రాంతాలు మఘ్రెబ్, సహెల్లలో ఐసిస్ ప్రవేశించాక అల్కాయిదా అక్కడ బలపడిందనీ, భారత్లోనూ కార్యకలాపాలను విస్తృతం చేయొచ్చని కేథరిన్ అన్నారు. -
ప్రతీకారంతో రగులుతున్న లాడెన్ కొడుకు!
వాషింగ్టన్: తన తండ్రి, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యపై అతడి కుమారుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలో 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 2011 మే2 న లాడెన్ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖలను తన బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటి ప్రకారం.. తండ్రి తర్వాత అల్ ఖైదాకు తాను నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని తాను ఎంచుకుంటానని అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తండ్రి బిన్ లాడెన్కు హంజా మాటిచ్చాడు. ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. 'నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నాను. అమెరికన్లు జాగ్రత్త.. అల్ ఖైదా మీ పై ప్రతీకారం కోసం ఎప్పుడూ రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్.. అఘ్గనిస్తాన్లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోము. ఇదంతా మీపై ప్రతీకారానికి సంకేతాలు' అని హంజా ఆడియో సందేశాలలో ఉన్న విషయాన్ని అధికారి ప్రస్తావించారు. బిన్ లాడెన్ తరహాలో హంజా మాట్లాడుతున్నాడని, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేయడం.. అమెరికాను నాశనం చేశడమే తన ముందున్న లక్ష్యమంటూ హెచ్చరిస్తున్నాడని ఎఫ్బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వివరించారు. జిహాదీలు అందరినీ ఏకం చేసి అమెరికాపై దాడి చేసేందుకు అల్ ఖైదా నేత హంజా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
-
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అల్ కాయిదా దాడి జరిగి ఇప్పటికి దాదాపు 16 ఏళ్లయింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ కాయిదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్ను ఢీకొన్న ఈ ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. పెంటగాన్ ప్రధాన కార్యాలయం కూడా దారుణంగా దెబ్బతిన్న ఈ ఘటనకు సంబంధించి, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అరుదైన ఫొటోలను ఎఫ్బీఐ విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా ఈ ప్రమాదాన్ని చూసినవాళ్లు ఎలా స్పందించారు, నష్టం ఎలా సంభవించిందనే విషయాలను ఈ ఫొటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కుప్పకూలిపోయిన గోడలు, చెలరేగుతున్న మంటలు, విమాన శకలాలు.. ఇలా రకరకాల ఫొటోలు కూడా వ ఈటిలో ఉన్నాయి. అల్ కాయిదా మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేసి, ఈ దాడులకు ఉపయోగించింది. పెంటగాన్ను ఒకటి ఢీకొనగా, మరో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడికి ఉపయోగించారు. నాలుగో విమానంలో ప్రయాణికులు హైజాకర్ల మీద తిరగబడగా.. వాళ్లు దాన్ని పెన్సల్వేనియా సమీపంలో ఒక పొలంలో కూల్చేశారు. కొన్ని ఫొటోలలో గ్యాస్ మాస్కులు ధరించిన గార్డులు ఒక కుక్క పిల్లను శిథిలాల నుంచి రక్షించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది మరణించారు. ఎక్కువమంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. -
శ్రీలంక క్రికెటర్లపై దాడి: సూత్రధారి హతం
అఫ్ఘానిస్థాన్లో అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో అల్కాయిదా కీలక ఉగ్రవాది నేలకూలాడు. 2008లో ఇస్లామాబాద్ హోటల్పై దాడి, 2009లో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లపై దాడి వెనుక ప్రధాన సూత్రధారి అయిన కారి యాసిన్ను గతవారం అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో మృతిచెందాడు. పాక్ బెలూచిస్థాన్కు చెందిన కారి యాసిన్ కరుడుగట్టిన ఉగ్రవాది. అతనికి తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. అల్కాయిదా నిర్వహించిన పలు ఉగ్రవాద దాడులకు పథక రచన చేశాడు. మార్చి 19న అఫ్గాన్లోని పక్టికా ప్రావిన్స్లో జరిపిన వైమానిక దాడుల్లో యాసిన్ ప్రాణాలు విడిచాడని తాజాగా అమెరికా అధికారులు ధ్రువీకరించారు. 2008 సెప్టెంబన్ 20న ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి యాసినే. ఈ ఉగ్రవాద దాడిలో ఇద్దరు అమెరికన్లు సహా పదుల సంఖ్యలో పలువురు ప్రాణాలు విడిచారు. -
భయాందోళనకు గురిచేసేందుకే పేలుళ్లు
అల్ఖైదా బేస్ మూమెంట్ పేరుతో దుశ్చర్యకు పాల్పడిన దుండగులు నెల్లూరు (క్రైమ్): తమ వర్గం వారి పట్ల పోలీసులు, న్యాయస్థానాలు కఠిన వైఖరి అవలంబిస్తున్నాయన్న భావనతో ఓ ఐదుగురు జట్టుగా ఏర్పడి అల్ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తక్కువ పేలుడు సామర్థ్యం కల్గిన ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)లను వినియోగించి కోర్టులు, ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు పథకం రచించారు. అందులో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలు.. కేరళ రాష్ట్రంలోని కొల్లాం, మలపురం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో పేలుళ్లకు పాల్పడ్డారు. దీనిపై శనివారం నిందితుల విచారణ పూర్తయింది. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఇస్మాల్పురానికి చెందిన ఎన్.అబ్బాస్ అలీ, చెన్నై పాలవక్కంకు చెందిన దావూద్ సులేమాన్, మదురై జిల్లా విశ్వాంత్నగర్కు చెందిన ఎం.సంసూన్ కరీం రాజా, కె.పాడూరుకు చెందిన మొహ్మద్ అయూబ్, మదురై త్యారిమార్కెట్కు చెందిన షంషుద్దీన్ అలియాస్ కురువ షంషుద్దీన్లు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. -
మనకిప్పుడు.. లాడెన్కు అప్పట్లోనే భయం
న్యూయార్క్: సాధారణంగా ఒసామా బిన్ లాడెన్ పేరు వింటేనే మిగితా దేశాలవారేమోగానీ అమెరికన్లు మాత్రం ఉలిక్కిపడతారు. అలా అమెరికన్లనే వణికించిన లాడెన్ను కూడా వణికించినవారు ఉన్నారు. అదే ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్). అయితే, ఈ సంస్థ అంతకుముందే అల్ ఖాయిదా మాజీ చీఫ్, అమెరికా బలగాల దాడుల్లో చనిపోయిన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను కూడా వణికించిందంట. ఈ వివరాలకు సంబంధించిన పత్రాలు ఇటీవలె అమెరికా సంస్థ సీఐఏ వెలుగులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ప్రపంచ నలుమూలల్లో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులన్నింటిని కూడగట్టి వాటన్నింటిని కూడా పోగేసి ఒక్క అమెరికాను తొలుత ధ్వంసం చేసి అనంతరం ప్రపంచ దండయాత్ర సాగించాలని లాడెన్ భావించాడని ఆ పత్రాల ఆధారంగా తెలుస్తోంది. అల్ ఖాయిదా నేతృత్వంలో ఉగ్రదాడులు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ స్టేట్ అప్పుడు కూడా చాలా తీవ్రమైన ఆవేశపూరితమైన ఆలోచనలతో ఉండేదంట. ఏ మాత్రం సహనం సంయమనంతో అది వ్యవహరించదని, హింసను సృష్టించేందుకు రచించే వ్యూహాల ముందు అల్ ఖాయిదా మసకబారి పోయే పరిస్థితి వస్తుందని లాడెన్ భయపడుతూ ప్రతిక్షణ మదనపడిపోయేవాడని వాటి ద్వారా వెల్లడైంది. పాకిస్థాన్లోని అబోటాబాద్లో అమెరికాకు చెందిన నేవీ సీల్స్ లాడెన్ను కూల్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాలతోపాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా సీఐఏ పత్రాల్లో తెలిసింది. తన కుమారులను లాడెన్ ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడని, వారిని ట్రాక్ చేసి పట్టుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ చిప్లు ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందని, కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు చెప్తుండే వాడని సమాచారం. అంతేకాదు.. ఒక్కోసారి ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఉగ్రవాదులు ఆవేశపడి ఎత్తుకొచ్చిన విదేశీ ప్రముఖుల విషయంలో కూడా స్వయంగా జోక్యం చేసుకొని సర్దుబాట్లు చేసేందుకు ప్రయత్నించవాడని తెలిసింది. -
లాడెన్ కొడుకు ఎలా ఎంజాయ్ చేసేవాడంటే..?
న్యూయార్క్: ఆల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అమెరికా అంటేనే హంజా పళ్లు పటపట కొరుకుతాడని, అసలు ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర జేస్తాడని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి అతడు అమెరికా వస్తువులను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అమెరికాకు చెందిన కోకాకోలాను ఉపయోగించడంతోపాటు ఇతర అమెరికా వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్ చేసేవాడట. హంజా చిన్నవయసులో ఉండగా అఫ్గనిస్థాన్లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్లో చాలా వస్తువులు అమెరికావే కనిపించేవని సమాచారం. ‘ఒసామాకు ముద్దుల కొడుకు అయిన హంజా అమెరికాను అసహ్యించుకుంటాడేమోకానీ, అమెరికా వస్తువులను కాదు. ఎందుకంటే అతడి ఇంటి కాంపౌండ్లో ఎప్పుడూ కోకాకోలావంటి వస్తువులు కనిపిస్తుండేవి’ అని హంజా చిన్ననాటి స్నేహితుడు అబ్దురహమాన్ ఖాదర్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అతడు మూడేళ్లు హంజాతో కలసి ఉన్నాడు. సాధారణంగా ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, కానీ హంజా మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని అతడు తెలిపాడు. అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని చెప్పారు. ఇటీవల లాడెన్ కొడుకు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
టార్గెట్ హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: అల్కాయిదా పేరుకు ఆంగ్ల రూపమైన ‘ది బేస్ మూవ్మెంట్’ (డీబీఎం) పేరిట ఏర్పడిన ఉగ్రవాద సంస్థ టార్గెట్లో హైదరాబాద్లోని కోర్టులు సైతం ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరుతో పాటు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐదు న్యాయస్థానాల వద్ద పేలుళ్ళకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏఏ) అధికారులు సోమవారం తమిళనాడులోని మధురైలో పట్టుకున్న విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని లోతుగా విచారించిన ఎన్ఐఏఏ అధికారులు పలు కీలకాంశాలను వెల్లడించారు. చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న మధురై వాసి దావూద్ సులేమాన్ నేతృత్వంలో మధురైకు చెందిన అబ్బాస్ అలీ, సామ్సమ్ కరీం రజ, షంషుద్దీన్, మహ్మద్ అయూబ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఫేస్బుక్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్న వీరు ఆన్లైన్ రాడికలైజేషన్ గ్రూప్ ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్ ఉమ ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాల సేకరణ, బాంబుల తయారీని నేర్చుకున్నారు. సామ్సమ్తో పాటు అబ్బాస్ అలీ దీపావళి టపాసుల్లో వాడే రసాయనాలతో బాంబుల తయారీలో నిష్ణాతులుగా మారారు. చిత్తూరుతో మొదలైన ‘ప్రతీకారం’... ఈ మాడ్యుల్ దక్షిణాదిలో మొత్తం ఐదు పేలుళ్ళకు పాల్పడింది. ఏ ఉదంతంలోనూ ప్రాణనష్టం లేకుండా, కేవలం న్యాయస్థానాల్ని టార్గెట్గా చేసుకుని పంజా విసిరింది. అప్పట్లో జరిగిన పరిణామాలకు ప్రతీకారంగా అంటూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీర్పులు రాకూడదనే ఉద్దేశంలో కోర్టుల వద్ద పేలుళ్ళకు పాల్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా కోర్టులోని పార్కింగ్ ప్లేస్లో జరిగిన పేలుడుతో వీరి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆలేరులో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా ఈ దాడి నిర్వహించారు. కొన్నేళ్ళ క్రితం గుజరాత్లో జరిగిన ఇష్రత్ జహా ఎన్కౌంటర్కు ప్రతీకారంగా జూన్ 15న కేరళలోని కొల్లం కోర్టు కార్ పార్కింగ్ ఏరియాలో బాంబు పేల్చారు. యాకుబ్ మొమెన్ను ఉరి తీసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆగస్టు 1న కర్ణాటకలోని మైసూర్ కోర్ట్ కాంప్లెక్స్లో, జమ్మూ కాశ్మీర్లో జరిగిన బుర్హాన్ (హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్) ఎన్కౌంటర్కు ప్రతీకారంగా సెప్టెంబర్ 12న నెల్లూరు కోర్టు వద్ద, ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో పశుమాంసం వివాదంపై చోటు చేసుకున్న మహ్మద్ అఖ్లక్ ఉదంతానికి ప్రతీకారంగా ఈ నెల 1న కేరళలోని మలప్పురం కోర్టు టాయిలెట్లో పేలుళ్ళకు పాల్పడ్డారు. పలు రాష్ట్రాలు, నగరాలకు బెదిరింపులు... ఈ ఆన్లైన్ రాడికలైజ్డ్ సంస్థ దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలకు బెదిరింపు ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్లు పంపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యా రాయబార కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థల్ని పేల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని కోర్టుల్లో పేలుళ్ళకు పాల్పడతామంటూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు ఎస్సెమ్మెస్ వచ్చింది. దీనిని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు ఈ ముఠాకు చెక్ చెప్పడానికి రంగంలోకి దిగాయి. మైసూరు, నెల్లూరు పేలుళ్ళ సందర్భంగా వీరు వదిలిన కరపత్రాల్లో అల్కాయిదా పేరుతో పాటు ఒసామా బిన్ లాడెన్ ఫొటో వినియోగించారు. అప్పుడే తొలిసారిగా ‘ది బేస్ మూవ్మెంట్’ పేరునూ బయటపెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఒకేరోజు మైసూర్ రైల్వేకోర్టు, పాలక్కాడ్ కోర్టుల వద్ద పేలుళ్ళకు కుట్రపన్నారు. ఈలోపు వీరి కదలికల్ని కనిపెట్టిన తెలంగాణ నిఘా వర్గాలు ఎన్ఐఏఏను అప్రమత్తం చేయడంతో ఐదుగురు అరెస్టు అయ్యారు. వీరికి అల్కాయిదాతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికే ఆ పేరు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మోదీ, రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలంగాణ నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏఏ అధికారులు సోమవారం దావూద్ సులేమాన్, అబ్బాస్ అలీ, సామ్సమ్ కరీం రజలను మంగళవారం షంషుద్దీన్, మహ్మద్ అయూబ్లను అరెస్టు చేశారు. దక్షిణాదిలో ఐదు పేలుళ్ళకు పాల్పడి ప్రధానితో పాటు మొత్తం 22 మంది ప్రముఖుల్ని, పలు కీలకమైన సంస్థల్ని టార్గెట్గా చేసిన డీబీఎం మాడ్యుల్కు పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ పోలీసుల్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోమ్మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రశంసించారు. మంగళవారం వారు డీజీపీకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదులకు చెక్ చెప్పడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలంగాణ నిఘా చీఫ్ నవీన్చంద్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధిపతులు వీసీ సజ్జనార్, రాజేష్కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు. -
అల్ఖైదా అడుగులు
ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరిణామాలు రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చాప కింద నీరులా అల్ఖైదా బేస్ మూమెంట్ పేరుతో చేపట్టిన కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది. మధురై కేంద్రంగా సాగుతున్న ఈ గుట్టును ఎన్ఐఏ గుర్తించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చడీ చప్పుడు గాకుండా నాలుగు చోట్ల తనిఖీ చేసి నలుగురిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రం ప్రశాంతతకు నిలయం. శాంతి భద్రతల పనితీరు భేష్ అన్నట్టు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా, చోటు చేసుకుం టున్న నేరాలు, వెలుగుచూస్తున్న పరిణామా లు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై, పారిశ్రామిక నగరం కోయంబత్తూరు మీద తీవ్ర వాదులు గురి పెట్టినట్టుగా గతంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. అయితే, చాప కింద నీరులా తీవ్రవాద కలాపాలు ఆయా నగరాల్లో సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగా సంఘటనలు వెలుగులోకి వస్తున్నారుు. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు కోయంబత్తూరు, తిరునల్వేలి నగరాల చుట్టూ తిరగడం ఇందుకు ఓ ఉదాహరణ. అజ్ఞాత తీవ్రవాదులు రాజమార్గంలో చెన్నైకు వచ్చి వెళ్తున్నా, ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడే వరకు విషయం బయటకు రాలేదు. ఇక, కేరళలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల మద్దతు దారులు పట్టుబడడం, వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరు రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో చిక్కడం గమనించాల్సిన విషయం. ఇక, ఆ సంస్థ శిక్షణ నిమిత్తం వెళ్తూ పట్టుబడ్డ వారిలో రాష్ట్రానికి చెందిన యువత ఉండడం బట్టి చూస్తే, తీవ్రవాదుల కార్యకలాపాలకు యువత ఆకర్షింపబడుతోందా? అన్న ప్రశ్న ఏర్పడుతోంది. ఇక, నిషేధిత సిమి, అల్ఖైదా, ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు రాష్ట్రంలో తిష్టవేసి, యువతను దారి మళ్లించే ప్రయత్నంలో ఉన్నారన్న ఆందోళన కలుగుతోంది. తాజాగా, అల్ఖైదా తీవ్రవాదులు పట్టుబడటంతో రాష్ట్రం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ: రాష్ట్రంలో తాము అప్రమత్తంగానే ఉన్నామని పోలీసు యంత్రాంగం చెప్పుకుంటున్నా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) గుర్తించి, రంగంలోకి దిగేవరకూ ఇక్కడ అల్ఖైదా మద్దతు సానుభూతి సంస్థ చాప కింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తుండడం వెలుగులోకి రావడం బట్టి చూస్తే, మన యంత్రాంగం పనితీరును ప్రశ్నించక మానదు. ఆధ్యాత్మిక నగరం మదురై మీద గురి పెట్టి బెదిరింపులు ఇటీవల కాలంగా పెరిగినా, స్పందన కరువే. తాజాగా, ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో మదురైలో కలకలం రేగింది. అదుపులో ముగ్గురు: ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఉదయాన్నే మదురై పోలీసు యంత్రాంగంతో కలిసి నాలుగు చోట్ల దాడులకు దిగింది. ఒక చోట ఇద్దరు, మరో చోట ఒకరు పట్టుబడ్డారు. మరో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పట్టుబడిన వారు అల్ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా యువతను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడడం దీన్ని ఎన్ఐఏ గుర్తించి రంగంలోకి దిగడం ఆహ్వానించదగ్గ విషయమే. అదుపులోకి తీసుకున్న వారిలో కరీం, అయుబ్, అబ్బాస్లు ఉన్నారు. హకీం, దావూద్ సులేమాన్లు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం వేట సాగుతోంది. మైసూర్ బాంబు పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అరుుతే, అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పష్టం చేసినా, పూర్తి వివరాలను ప్రకటించలేదు. అదుపులోకి తీసుకున్న వాళ్లను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, సాంకేతిక సంబంధిత పరికరాలు, ల్యాప్ టాప్లను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వీరి వలలో పడ్డ యువత వివరాలను, ఏదేని రాష్ట్రంలో కుట్రలకు వ్యూహరచన చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు వేగం పెరిగింది. మరొకరి అరెస్టు: పట్టుబడిన ముగ్గురు ఇచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరువాన్మియూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దావూద్ సులేమాన్ను సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దావూద్ సులేమాన్ చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసింది. -
ట్రంప్ విజయంపై ఉగ్రవాదులు సంతోషం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపట్ల ఉగ్రవాద సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇక అమెరికాకు చీకటి రోజులు మొదలైనట్లేనంటూ వ్యాఖ్యానించాయి. ట్రంప్ విజయం ఖరారైన కొద్ది సేపటికే ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదాకు సంబంధించిన వ్యక్తులు కొందరు సోషల్ మీడియాలో తమ ప్రతి స్పందనను తెలియజేశారు. ’విజయం వల్ల రానున్న రోజుల్లో ట్రంప్ చేష్టలకు ముస్లింలకు అమెరికాలో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. అది ట్రంప్ కు వ్యతిరేకంగా నిగూఢంగా వ్యతిరేకతను, విద్వేశాన్ని పెంపొందిస్తుంది. దీనివల్ల అమెరికాకు నష్టమే’ అని ఇస్లామిక్ స్టేట్ సంస్థకు సంబంధించిన సంస్థ అల్ మిన్బార్ జిహాదీ మీడియా నెట్ వర్క్ పేర్కొంది. ఇంకొందరైతే ట్రంప్ ముజాహిదీన ఉగ్రవాదులను ఏకం చేస్తారంటూ ఆరోపించారు. -
పోలింగ్కు ముందు రోజు అమెరికాపై దాడులు!
-
అవును ఆ ఉగ్రవాదిని చంపేశాం: అమెరికా
కాబూల్: అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు ఫరూక్ అల్ ఖతాని మృతి వార్త నిజమే అని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ శుక్రవారం ధృవీకరించింది. కాబూల్ తూర్పు దిశగా 230 కిలోమీటర్ల దూరంలోని కునార్ ప్రావిన్స్లో అక్టోబర్ 23న జరిపిన వైమానిక దాడుల్లో అల్ ఖతాని మృతి చెందాడని పెంటగాన్ వెల్లడించింది. తమపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా చేపడుతున్న విజయవంతమైన అపరేషన్స్కు ఇదొక ఉదాహరణ అని పెంటగాన్ ప్రకటించింది. ఆఫ్గన్ ఈశాన్య ప్రాంతంలో అల్ కాయిదాను బలోపేతం చేయడానికి అల్ ఖతాని ప్రయత్నించాడని పెంటగాన్ పేర్కొంది. ఆఫ్గనిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) ఇదివరకే అల్ ఖతానీ మృతి చెందాడని ప్రకటించాయి. మరో అల్ కాయిదా లీడర్ బిలాల్ అల్ ఉతాబి సైతం మృతి చెందాడని ఎన్డీఎస్ తెలిపినప్పటికీ పెంటగాన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పోలింగ్కు ముందు రోజు అమెరికాపై దాడులు!
వాషింగ్టన్: ఎన్నికల వేళ అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందటూ ప్రముఖ మీడియా సంస్థ శుక్రవారం బాంబు పేల్చింది. అధికారులంతా ఎన్నికల నిర్వహణలో తనమునకలైనవేళ అల్ కాయిదా ఉగ్రవాదులు దాడులకు దిగబోతున్నారని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) శుక్రవారం ఒక రిపోర్టును ప్రచురిచంది. దీంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడ్డట్లైంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందు (సోమవారం) అల్ కాయిదా దాడులకు దిగనుందని, కీలకమైన న్యూయార్క్ టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో ముష్కరులు విరుచుపడే అవకాశాలున్నాయని సీబీఎస్ తన రిపోర్టులో పేర్కొంది. ఈమేరకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికే స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీచేశారని కూడా సీబీఎస్ పేర్కొంది. అయితే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ) మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. అలాగని తిరస్కరించనూలేదు. ఉగ్రవాద నిరోదక విభాగం, దేశీ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, అనుకోని ఉపద్రవం ఎదురైతే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్ బీఐ సమాధానం ఇచ్చినట్లు సీబీఎస్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో రిగ్గింగ్, ఎన్నికల సరళికి సంబంధించిన వెబ్ సైట్ల హ్యాకింగ్ తదితర రూపాల్లోనూ దాడులు జరిగే అవకాశాలున్నట్లు సీబీఎస్ అభిప్రాయపడింది. -
అల్ ఖైదా అధినేత కూతుళ్లను వదిలేసిన పాక్
వాషింగ్టన్: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహిరి ఇద్దరు కూతుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం వదిలిపెట్టింది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని అల్ ఖైదా చెర నుంచి విడిపించింది. ఈ విషయాన్ని అల్ ఖైదా స్వయంగా తన మేగజైన్ అల్-మస్రాలో వెల్లడించింది. ఈ సంఘటన వల్ల దేశంలో టెర్రరిజం ఎంతగా బలపడిందో తెలుస్తోందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కొద్ది వారల క్రితం అల్ ఖైదా-పాకిస్తాన్ లు ఒకరినొకరు చేతులు మార్చుకున్నట్లు మేగజైన్ లో పేర్కొనటం జరిగింది. కాగా జిహాదీలు, అల్ ఖైదా, తాలిబన్లను కయానీ ప్రోత్సహించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కయానీ తనయుడి కోసం జవహరీ కూతుళ్లను వదిలిపెట్టడానికి పాక్ ప్రభుత్వం తొలుత అంగీకరించలేదు. అయితే పెద్ద సంఖ్యలో సంప్రదింపుల అనంతరం అల్ ఖైదాతో పాక్ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఏడాదిలో ముగ్గురు మహిళలు, పిల్లలను పాక్ ప్రభుత్వం అల్ ఖైదాకు అప్పగించింది. -
అల్ ఖైదా అగ్రనేత హతం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అల్ ఖైదా అగ్రనేతను మట్టుబెట్టింది. దేశంలోని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కు చెందిన ముఖ్యనేత నవాజ్ అలియాస్ హఫీజ్ అబ్దుల్ మతీన్ ను సైనిక బలాలు కాల్చి చంపాయి. మరో ఏడుగురు అనుచరులు కూడా ఈ పోరులో హతమయ్యారు. దేశం యొక్క తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని ఒక ప్రధాన జిల్లాలోని నది ఒడ్డున అనుమానిత తీవ్రవాదులు తలదాచుకున్న శిబిరంపై భద్రతాబలగాలు గురువారం అర్ధరాత్రి దాడి చేశాయి. దీంతో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ పోరు నెలకొంది.దీంతో మతీన్ , మరో ఏడుగురు ఉగ్రవాదులను సైన్యం ఖతం చేసింది. ప్రముఖ యూనివర్శిటీపై దాడిచేసేందుకు పథక రచనలో భాగంగా ఉగ్రవాదులు సమావేశమయ్యారని జిన్హువా వెల్లడించింది. నిఘావర్గాల సమాచారంతో , వీరి శిబిరంపై దాడిచేసి ఉగ్రవాదులను కాల్చి చంపాయి. టెర్రరిస్టుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మతీన్ మృతిని ధృవీకరించినట్టు తెలిపింది. వీరిలో 2009లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని పరేడ్ లేన్ బాంబుదాడి ఘటనలో 36 మంది మరణించిన కేసులో, సీనియర్ సైనిక అధికారిని హత్య చేసిన కేసులో నిందితుడైన అల్ ఖైదా కమాండర్ డేరా ఇస్మాయల్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ పరిణామంతో అల్ ఖైదా ప్రతీకార దాడులకు దిగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలను టార్గెట్ గా ఎంచుకోవచ్చనే అంచనా లతో హై అలర్ట్ జారీ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. -
సిరియా ఘర్షణల్లో 73 మంది మృతి
బీరట్: సిరియాలోని అలెప్పో పట్టణంలో భద్రతా దళాలు, అల్ కాయిదా అనుబంధ ఉగ్ర సంస్థల మధ్య జరిగిన భీకర పోరులో 73 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆల్ నుస్రా ఫ్రంట్, దానికి మద్దతిచ్చే ఇస్లాం జిహాదీలు 24 గంటల ఘర్షణల తరువాత ఖాన్ తుమాన్, పరిసర గ్రామాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నాయని తెలిసింది. కనీసం 43 మంది జిహాదీలు, 30 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాయు దాడులకు మేం కారణం కాదు: సిరియా మిలిటరీ టర్కీ సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న 28 మంది పౌరుల మృతికి కారణమైన వాయు దాడుల్లో తమ ప్రమేయం లేదని సిరియా సైన్యం ప్రకటించింది. తిరుగుబాటుదారులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. -
చివరి రోజుల్లో లాడెన్ పట్టుబడతానని భయపడ్డాడా?
వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం. 2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది. లేఖల్లోని అంశాలు : సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు. తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది. తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది. ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు. జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది. -
రైల్వే వెబ్సైట్ను హ్యాక్ చేసిన అల్ కాయిదా!
భారత రైల్వేలకు చెందిన ఓ వెబ్సైట్ను అల్ కాయిదా ఉగ్రవాదులు హ్యాక్ చేయడం సంచలనం రేపింది. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని భుసావల్ డివిజన్కు చెందిన వెబ్సైట్ను ఆల్ కాయిదా టెర్రరిస్టులు హ్యాక్ చేశారు. ఆ సైట్లో 11 పేజీలున్న ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారతీయ రైల్వేకు తొలిసారి ఇలాంటి పరిణామం ఎదురు కావడం ఆందోళన రేపింది. రైల్వేశాఖ వెబ్సైట్ హ్యాకింగ్ ద్వారా విద్రోహ చర్యలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రవాద నేత అసీమ్ ఉమర్ సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. భారత ముస్లింలు జిహాద్ పాఠాలు మర్చిపోతున్నారని... వారికి మళ్లీ పాఠాలు నేర్పి యుద్ధరంగానికి కదిలేలా చేస్తామని ఆ సందేశంలో హెచ్చరించారు. ప్రజలు 'జిహాద్' లో పాల్గొనేందుకు, అమెరికా దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భుసావల్ డివిజన్ వెబ్సైట్కు ట్రాఫిక్ రద్దీ ఎక్కువే. ఈ డివిజన్ పరిధిలో సుమారు 15 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ కాయిదా ఈ చర్యకు పూనుకుందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అసీమ్ ఉమర్ (సనౌల్ హక్) అల్ కాయిదా దక్షిణాసియా విభాగానికి చీఫ్. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అల్ కాయిదాలో చేరిన ఉమర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు. ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షహీద్-ఐ-అమాన్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె ఈ సంచలన వివరాలు తెలిపారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు. 'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అల్ కాయిదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె తెలిపారు. -
వారిని పాక్ ఏమీ చేయదు..
ముంబై దాడుల కేసులో సయీద్, లఖ్వీలపై లష్కరే, అల్ కాయిదా అంచనా: హెడ్లీ ముంబై: ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ఆ దాడుల తర్వాత కొన్ని నెలల్లోలోపు భారత్లో మరో ఉగ్ర దాడికి ప్రణాళిక రచించామని శనివారమిక్కడి కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సోమవారం ప్రారంభమైన అతని వాగ్మూలం శనివారం ముగిసింది. ఈ విచారణను నిందితుడు అబు జుందాల్ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వాయిదా వేసింది. ముంబై దాడుల తర్వాత సయీద్, లఖ్వీల భద్రతపై ఆందోళన చెందానని, దీనిపై లష్కరే కీలక వ్యక్తి సాజిద్ మీర్, అల్ కాయిదా సభ్యుడు అబ్దుల్ పాషా (గతంలో లష్కరే)తో సంప్రదింపులు జరిపానని హెడ్లీ వెల్లడించాడు. హెడ్లీ ఇంకా ఏం చెప్పాడంటే.. ► పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్ఐఏ) లష్కరే సభ్యులను విచారిస్తున్న సమయంలో ‘ఓల్డ్ అంకుల్’(సయీద్), ‘యంగ్ అంకుల్’(లఖ్వీ) ఎలా ఉన్నారని మీర్ను అడిగా. యంగ్ అంకుల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని మీర్ బదులిచ్చాడు. ఓల్డ్ అంకుల్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నాడు. అన్నీ సర్దుకొంటాయంటూ పాషా చెప్పాడు. సయూద్, లఖ్వీలతో పాటు ఇతర లష్కరే సభ్యులపై పాక్ నామమాత్రపు చర్యలే తీసుకుంటుందని పాషా అంతరార్థం. ► ముంబై దాడులు జరిగిన 8 నెలల తరువాత మీర్ నుంచి నాకో మెయిల్ వచ్చింది... ‘ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్’ చేయాలి అని. దీని అర్థం... భవిష్యత్ దాడులకు భారత్లో చోటు వెతకమని! ఈసారి ‘రాహుల్(భట్) సిటీ’లో దాడులు వద్దన్నా. రాహుల్ సిటీ అంటే ముంబై. ► ఇలియాస్ కశ్మీరీ(అల్ కాయిదా) కోరిక మేరకు 2009లో పుష్కర్, గోవా, పుణెల్లో రెక్కీ నిర్వహించా. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పుణెలోని భారత సైనిక దక్షిణ దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించా. ► శివసేన మాజీ సభ్యుడు రాజారామ్ రెగేతో సంబంధాలు ఏర్పరచుకోవాలని మీర్, ఇక్బాల్ నాకు చెప్పారు. 2008 మే 19న ఓ ఇన్వెస్ట్మెంట్ గురించి రెగే మెయిల్ పంపాడు. రాణా ఇన్వెస్ట్మెంట్కు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కానీ ఇక్బాల్ ఉగ్రదాడులకూ సిద్ధంగా లేడు. సైన్యం, పార్లమెంట్కు సంబంధించిన సమాచారం మాత్రమే కావాలన్నాడు. రెగే ఆ పని చేయగలుగుతాడా అని అడిగాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్లను అమెరికాకు పిలవాలని రెగేకు సూచించా. ముంబై దాడులతర్వాత అనేకసార్లు పాక్కు వెళ్లా. కానీ ఎఫ్ఐఏ నన్ను ఎన్నడూ విచారణకు పిలవలేదు. కాగా, కరాచీలోని కంట్రోల్ రూమ్ నుంచి లష్కరే సభ్యులకు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా.. అబె కఫా, మీర్, అబు అల్ కమా గొంతులను గుర్తించగలిగాడు. -
జార్ఖాండ్ లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
-
బర్కినా హోటల్పై ఉగ్ర దాడి
26 మంది మృతి ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగాలో శనివారం ఓ స్టార్ హోటల్పై అల్ కాయిదా ఉగ్రవాదులు తెగబడ్డారు. 26 మంది పౌరులను కాల్చి చంపారు. భద్రతా దళాలు... ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి 126 మందిని వారి చెర నుంచి రక్షించాయి. వీరిలో 33 మంది గాయపడ్డారు. తొలుత స్ప్లెన్డిడ్ ఫోర్ స్టార్ హోటల్, అనంతరం సమీపంలోని కాపుసినో రెస్టారెంట్పై దాడి చేసిన జీహాదీలు అందులోని వారిని బంధించారు. దగ్గర్లోని మరో హోటల్ వైబి నెక్ట్స్లో దాడి కొనసాగుతోందని ఆ దేశ మంత్రి కంపోర్ చెప్పారు. ఫ్రాన్స్ ప్రత్యేక దళాల సహకారంతో తమ భద్రతా దళాలు హోటల్లో గాలిస్తున్నాయన్నారు. దాడి నుంచి తప్పించుకున్నవారిలో కార్మిక శాఖ మంత్రి సవడోగో కూడా ఉన్నారన్నారు. ‘తెల్లవారుజామున హోటల్ ముఖ ద్వారం వద్ద కాల్పుల శబ్దం వచ్చింది.బయటనున్న దాదాపు పది వాహనాలను ఉగ్రవాదులు తగులబెట్టారు. ఆ సమయంలో అంతా నిద్రపోతున్నారు. వారిపై కాల్పులు జరిపారు’ అని యానిక్ చెప్పారు. అల్ కాయిదా అనుబంధ సంస్థ ఇస్లామిక్ మఘ్రెబ్ ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. మృతుల్లో నలుగురు విదేశీయులున్నారు. భారతీయుడు క్షేమం! బుర్కినా ఫాసోలోని హోటల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కిన 126 మంది బందీలలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. భద్రతా దళాల ఆపరేషన్తో ఆ భారతీయుడు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. బుర్కినా ఫాసోలో ఉన్న గౌరవ్ గార్గ్ అనే వ్యక్తి.. తన మిత్రుడు విరాజ్ ఉగ్రవాదులు చొరబడిన స్ప్లెన్డిడ్ హోటల్లో చిక్కుకుపోయినట్టు మొదట ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సైనికుల ఆపరేషన్ తర్వాత అతను క్షేమంగా బయటపడినట్టు వెల్లడించాడు. -
అల్ కాయిదా అన్వర్ ప్రసంగంతో స్ఫూర్తి
సిట్కు తెలిపిన ‘ఐసిస్ త్రయం’లోని మాజ్ హుస్సేన్ సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో చిక్కిన ‘ఐసిస్ త్రయం’లో రెండో వాడైన మాజ్ హుస్సేన్ ఫారూఖ్ సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హుమాయున్నగర్లోని మాజ్ జమాత్ ఏ ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ)కూ అనుబంధంగా పని చేశాడు. ఇతడితో పాటు చిక్కిన ఒమర్ ఫారూఖ్ హుస్సేనీకి సైతం ఈ సంస్థతో సంబంధం ఉంది. మాజ్ తరచుగా తన సెల్ఫోన్లోనే ఇంటర్నెట్ను బ్రౌజ్ చేసేవాడు. ఆన్లైన్లో ఉన్న అల్ కాయిదా కీలక నేత, యమన్కు చెందిన ఇంగ్లిష్ స్కాలర్ అన్వర్ అల్ అల్వాకీ రెచ్చగొట్టే ప్రసంగాలతో స్ఫూర్తి పొంది జిహాదీగా మారాలని నిర్ణయించుకున్నాడు. అల్ కాయిదా సంస్థకు ప్రధాన రిక్రూటర్గా, అధికార ప్రతినిధిగా అన్వర్కు పేరుంది. 2011 సెప్టెంబర్ 30న యమన్లో అమెరికా సేనలు జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించాడు. అయినప్పటికీ ఇప్పటికీ అన్వర్కు చెందిన అనేక ప్రసంగాలు ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో అందుబాటు లో ఉన్నాయి. దీంతో పాటు మాజ్ పాలస్తీనా, గాజా స్ట్రిప్, అఫ్ఘానిస్థాన్, సిరియాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తీవ్ర ఉద్రేకాన్ని పొందేవాడు. సామాజిక సైట్లే వారధి... ఈ నేపథ్యంలో బాసిత్, ఒమర్ ఫారూఖ్లతో కలిసి ఐసిస్, అల్ కాయిదా వంటి సంస్థల్లో చేరాలని ప్రేరణ పొందాడు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్లను తరచుగా ఫాలో అవు తూ... వాటి ద్వారానే అనేక మంది ఐసిస్ సానుభూతిపరులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీనికోసం ఐదు రకాల సోషల్ మీడియాల్లో ఖాతాలు తెరిచాడు. దాదాపు ఆరు నెలలుగా మిగిలిన ఇద్దరితో కలిసి హుమాయున్నగర్లోని తన ఇంట్లో సమావేశాలు నిర్వహించినా... చివరకు నల్లగొండలో జరిగిన కార్యక్రమానికి హాజరైనప్పుడే నాగ్పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని దేశ సరిహద్దులు దాటాలని నిర్ణయించుకున్నారు. మాజ్ 2014లోనూ బాసిత్, అబ్రార్, నోమన్లతో కలసి కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ నలుగురూ కోల్కతా చేరుకున్న తరవాత అక్కడి న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న హోటల్ సిల్వర్లో బస చేశారు. ఈలోపు విషయం గుర్తించిన నగర పోలీసులు కోల్కతా అధికారుల్ని అప్రమత్తం చేయడం, ఫలితంగా పోలీసులకు చిక్కి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం జరిగాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ‘ఐసిస్ త్రయం’ ఈసారి నాగ్పూర్లోని ఏ హోటల్లోనూ బస చేయలేదు. దాదాపు 20 గంటల పాటు ఉన్నా... ఆటోల్లో సంచరిస్తూ, సినిమా లు చూస్తూ కాలక్షేపం చేశామని మాజ్ విచారణలో చెప్పాడు. తనతో పాటు ఒమర్, బాసిత్లకూ ఈ తరహా భావజాలమే ఉందన్నాడు. ఈ త్రయం నగరంలోని మరికొందరితోనూ సంప్రదింపులు జరిపినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారని తెలిసింది. నిందితుల కస్టడీ పిటిషన్పై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం వెలువరించనుంది. మాజ్ ‘ఐడీ’లు ఇవే... జీమెయిల్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్: maazhasan27@gmail.com ఫేస్బుక్, యాహూ: maaz_hunk17@yahoo.com -
పుట్టింది దేశభక్తుల కుటుంబంలో కానీ...
న్యూఢిల్లీ: వారిది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తుల కుటుంబంగా పేరుగాంచింది. కానీ,వారి వారుసుడు మాత్రం మతమౌఢ్యంతో దేశానికే ద్రోహం తలపెట్టాడు. అతడే అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థ ఇండియా విభాగం అథినేత సమాల్ హక్. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాది మహ్మద్ ఆసిఫ్ విచారణలో వెల్లడైన విషయాలు ఇప్పుడు ఇంటలిజెన్స్ వర్గాలను సైతం విస్తుగొలుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ ప్రాంతానికి చెందిన సమాల్ హక్ అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థ భారత ఛీఫ్గా ఉన్నాడని తెలిసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. మౌలానా అసిమ్ ఉమర్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తే సమాల్ హక్ అని తెలిసి వృద్ధ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ దృష్టిలో సమాల్ ఎప్పుడో చచ్చిపోయాడని అతని తల్లి చెబుతుండగా, కొన్ని సంవత్సరాల క్రితమే ఇంటి నుండి వెళ్లిపోయిన అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి ఇర్ఫాన్ ఉల్ హక్ పేపర్లో ప్రకటించడం విశేషం. సమాల్ గురించి అతని తండ్రి మాట్లాడుతూ..'ఎప్పుడూ పుస్తకాలంటే అసహ్యించుకునే సమాల్ ఒక రోజు సడన్గా మదర్సాలో చేరి ఖురాన్, అరబిక్ను అభ్యసిస్తానన్నాడు. అలాగే ఉన్నత చదువులకు మక్కాకు వెళ్తా అని లక్ష రూపాయలు కావాలని అడిగాడు. అయితే ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరాగా ఉండాలని సూచించాం. అయితే మా మాటను వినకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు' అని తెలిపాడు. పాకిస్తాన్కు చేరుకున్న సమాల్ చాలా స్వల్పకాలంలోనే అల్ ఖయిదా ఉగ్రవాద నాయకుడు అల్ జవహరి నమ్మకాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ భారత విభాగానికి నాయకుడిగా నియమించబడ్డాడని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. -
ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ/భువనేశ్వర్: అల్ కాయిదాకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అరెస్టయిన మహమ్మద్ ఆసిఫ్ (41) భారత్లో అల్ కాయిదా (ఏక్యూఐఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా భావిస్తున్నారు. అల్ కాయిదాలో చేరేందుకు యువతను ప్రేరేపించడం, రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కార్యకలాపాలను ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ నుంచి ఆసిఫ్ నిర్వహిస్తున్నాడు. ఒడిశా కటక్లోని జగత్పూర్లో అబ్దుల్ రెహమాన్ను అరెస్ట్ చేశారు. ఆసిఫ్ నుంచి మూడు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, జిహాదీ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. రెహమాన్కు ఒక భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కటక్ దగ్గర్లోని టాంగీ ప్రాంతంలో ఓ మదరసాను నడుపుతున్నట్లు సమాచారం. -
'కొత్త తాలిబన్ చీఫ్ కూడా అక్కడే..'
న్యూఢిల్లీ: ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ అక్తర్ కూడా పాకిస్థాన్లోనే ఉన్నాడని అఫ్గనిస్థాన్ ఉన్నతాధికారులు ఆరోపించారు. పాక్ అధికారుల కనుసన్నల మధ్యనే అతడు తిరుగుతున్నాడని, రాజధాని సమీపంలోనే తలదాచుకుంటున్నాడని పేర్కొన్నారు. పాక్ మాజీ రక్షణ శాఖ అహ్మద్ ముక్తార్ ఓ భారతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ వివరణపట్ల స్పందించిన అఫ్గనిస్థాన్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు తెలుసని, ఆ దేశంలోనే లాడెన్ ఉన్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలని తాము ముందునుంచే చెప్పామని పేర్కొంది. ఒక్క ఒసామానే కాకుండా ఆయన అనంతరం తాలిబన్ చీఫ్గా వచ్చిన ముల్లా ఒమర్ పాక్లోనే తలదాచుకున్నాడని, ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ అక్తర్ కూడా అక్కడే ఉన్నాడని ఇప్పటికైనా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
రోజులు లెక్కపెట్టుకోండి..
'జైళ్లలో దురాగతాలు ఎక్కువైపోయాయి. ఖైదీల కష్టాలు పెరిగాయి. మీ ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. కోర్టులు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. ఇక కాచుకోండి.. మా మిషన్ మొదలైంది.. రోజులు లెక్కపెట్టుకోండి' అంటూ అల్- ఖాయిదా పేరుతో పలువురు జైలు సూపరింటెండ్ లకు బెదిరింపు లేఖలు పంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు కోయంబత్తూరు, తిరుచ్చి, మధురై, వేలూరు జైళ్ల సూపరింటెండ్లకు చేరిన లేఖలపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమది అల్ ఖాయిదా అనుబంధ 'ది బేస్ మూమెంట్' సంస్థ అని పేర్కొంటూ భారతదేశ అసంపూర్ణ చిత్రపటం, కింద ఒసామా బిన్ లాడెన్ ఫొటోతో లేఖను పంపారు. అన్ని లేఖలూ ఇలానే ఉండటం గమనార్హం. పోలీసుల దర్యాప్తులో ఫ్రమ్ అడ్రస్ లు తప్పుడువని తేలిసింది. కాగా, కోయంబత్తూరు పేళుళ్ల కేసులో ప్రధాన నిందితులైన అల్ ఉమా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, మున్నా సహా మరో ముగ్గురిని ఇటీవలే ఈ జైళ్లకు తరలించారు. గతంలో వారు పుళల్ సెంట్రల్ జైలులో ఉండగా.. సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కొని వారిపై దాడిచేసి గాయపర్చారు. దీంతో నిందితులను వేర్వేరు జైళ్లకు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు బెదిరింపు లేఖలు కూడా అవే జైళ్లకు రావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. -
12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో విచిత్రమైన ఘాతుకానికి పాల్పడ్డారు. అల్ కాయిదా, జైష్ అల్ ఇస్లామ్ గ్రూపులకు చెందిన 12 మంది ఉగ్రవాదుల తలలు నరికి చంపేశారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సిరియా రాజధాని డమాస్కస్లో ఈ వీడియో చిత్రీకరించారు. ఈ 12 మందిని ఇంటర్వ్యూ చేసి, కెమెరా ముందు పెరేడ్ చేయించి.. తర్వాత తలలు నరికేశారు. ఇస్లామిక్ స్టేట్ను వ్యతిరేకించిన నేరాన్ని వాళ్లు ఆమోదించారని, అందుకే వాళ్లను ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఒక ముసుగు వ్యక్తి తలలు నరికేశాడని అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది. ఆ వీడియోలో అల్ కాయిదా, జైష్ అల్ ఇస్లామ్ సంస్థలకు చెందినవాళ్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉంటాయి. సిరియా ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇస్లామిక్ స్టేట్కు బద్ధులై ఉండాలన్న సందేశం ఈ వీడియోలో అంతర్లీనంగా కనపడుతుంది. సాధారణంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎప్పుడూ గెడ్డం గీసుకుని కనిపించరు. కానీ ఈ వీడియోలో మాత్రం అతడు నేరుగా కెమెరా ముందు క్లీన్ షేవ్ చేసుకుని కనిపిస్తాడు. -
అల్కాయిదా అగ్ర నేత నాసిర్ హతం
దుబాయి: అల్కాయిదాలో రెండో కీలకమైన నేతగా పేరుపొందిన నాసిర్ అల్-ఉహాయషి అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో మరణించాడు. ఈ విషయాన్ని అల్కాయిదా మంగళవారం నిర్ధారించింది. ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో సతమతమవుతున్న అల్కాయిదాకు ఇటీవలి నెలల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత.. ఆ సంస్థకు అత్యంత భారీ ఎదురుదెబ్బగా నాసిర్ హతమవడాన్ని పరిగణిస్తున్నారు. అరేబియన్ ద్వీపకల్పంలోని అల్కాయిదా(ఏక్యూఏపీ) నాసిర్ మరణాన్ని నిర్ధారిస్తూ.. ఈ నెల 9న అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో అతనితోపాటు మరో ఇద్దరు ముజాహిదీన్లు చనిపోయారని తెలిపింది. కాగా తమ కొత్త అధిపతిగా ఖాసీం అల్ రిమి నియమితుడైనట్టు ఏక్యూఏపీ తెలిపింది. -
అల్ కాయిదా నెంబర్ 2 హతం!
అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో అల్ కాయిదా నెం.2 ఉగ్రవాది హతమయ్యాడు. అల్ కాయిదాకు సంబంధించిన యెమెన్ విభాగానికి నేతృత్వం వహించిన నసీర్ అల్ వహాయిసి మరణించినట్లు జూన్ 14న విడుదలైన వీడియో ప్రకటనలో నిర్ధరించారు. ఒసామా బిన్ లాడెన్ను అమెరికన్ నేవీ సీల్స్ హతమార్చిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదే. అంతర్జాతీయంగా 'జీహాద్' మీద ఆధిపత్యం కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోటీ పడుతున్న తరుణంలో అల్ కాయిదాకు ఇంతటి అగ్రనేతను కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అవుతుందని అంటున్నారు. నసీర్ మరణంతో అతడి స్థానంలో ఖాసిం అల్ రైమి అనే ఉగ్రవాద నాయకుడిని నియమించినట్లు తెలిసింది. ఈ నియామకం విషయాన్ని, నసీర్ మరణాన్ని ప్రకటించిన వీడియోలోనే.. అమెరికా మీద తమ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. అల్ కాయిదా ఆధీనంలో ఉన్న ముకల్లా అనే నగరంలో అమెరికా చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు అనుమానిత అల్ కాయిదా ఉగ్రవాదులు మరణించినట్లు యెమెనీ భద్రతా అధికారులు ఇంతకుముందు తెలిపారు. అయితే, వాళ్లలో అల్ కాయిదాకు చెందిన ఇంత అగ్రనేత ఉంటాడని మాత్రం వాళ్లు కూడా భావించలేదు. ఇక అమెరికన్ అధికారులు కూడా నిజంగా నసీర్ అల్ వహాయిసి మరణించాడో లేదో ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని అంటున్నారు. -
ప్రధాని మోదీపై అల్ఖైదా గురి!
-
వాటికన్ సిటీపై అల్ఖైదా గురి?
క్రైస్తవులకు పరమ పవిత్రమైన వాటికన్ సిటీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా లక్ష్యంగా చేసుకుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లలో దాడులకు కుట్ర పన్నడంతో పాటు అరెస్టయిన నిందితులు వాటికన్ సిటీని కూడా లక్ష్యంగా చేసుకున్నారని కాగ్లియారీ చీఫ్ ప్రాసిక్యూటర్ మౌరో మురా తెలిపారు. ఇటలీలో దేశవ్యాప్తంగా చేసిన సోదాల్లో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరికీ అల్ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఓ ఆధ్యాత్మిక గురువు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లు కాకుండా మరికొందరు ఇప్పటికే అక్కడి నుంచి పారిపోయినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యెమెన్ జైలుపై అల్-ఖయిదా దాడి
ఆడెన్: ఆగ్నేయ యెమెన్ లో అల్-ఖయిదా తీవ్రవాదులు జైలుపై దాడి చేసి 300 మందిని విడుపించుకుపోయారు. వీరిలో అల్-ఖయిదా నాయకుడొకరు ఉన్నారని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. హద్రామావత్ ప్రావిన్స్ లోని జైలులపై దాడి చేసిన తీవ్రవాదులు ఇద్దరు జైలు గార్డులను చంపేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో ఐదుగురు ఖైదీలు మృతి చెందారు. నాలుగేళ్లుగా జైల్లో ఉన్న అల్-ఖయిదా అరబియన్ ద్వీపకల్పం(ఏక్యూఏపీ) టాప్ కమాండర్ ఖలీద్ బాతార్ఫీ ను తీవ్రవాదులు విడిపించుకుపోయారు. 2011-12లో యెమెన్ ప్రభుత్వంతో అల్-ఖయిదా తీవ్రవాదులు జరిపిన ఖలీద్ పోరాటంలో కీలకపాత్ర పోషించాడు. -
అతడు ఉగ్రవాదే
అమెరికాలో పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని అమెరికా ఫెడరల్ కోర్టు ఉగ్రవాదిగా గుర్తించింది. అతడు దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించినట్లు పేర్కొంది. అబిద్ నసీర్(28) అనే పాక్ దేశీయుడు తమ దేశంలోని నిత్యం రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, సబ్ వేలను పేల్చి వేసేందుకు కుట్రలు పన్నినట్లు కోర్టు పేర్కొంది. అతడు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థలో చేరి ఇప్పటికే బ్రిటన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని వివరించింది. 2009 ఏప్రిల్లో మాంచెస్టర్కు వచ్చిన నజీర్ కొన్నాళ్లు రెక్కీ నిర్వహించి పేలుళ్లు జరిపేందుకు వ్యూహం పన్నినట్లు ఆధారాలున్నాయని వెల్లడించింది. పాకిస్థాన్లోని సీనియర్ ఉగ్రవాదుల సూచనలతో మేరకు అతడు పనిచేసినట్లు కోర్టు గుర్తించింది. -
నలుగురు ఉగ్రవాదులు హతం
అమెరికా డ్రోన్ జరిపిన దాడుల్లో నలుగురు అల్ కాయిదాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అమెరికా మానవరహిత యుద్ధ విమానం ఒకటి షాబ్వా ప్రావిన్స్లోని యెమెన్లో శనివారం దాడులు జరపగా దాని ధాటికి ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పేలిపోయి అందులోని నలుగురు మృతి చెందినట్లు సిన్హువా వార్తా పత్రిక తెలియజేసింది. -
సోమాలియాలో తీవ్రవాదుల దాడి: 25 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. హోటల్లపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మొగాదీషు డిప్యూటీ మేయర్తో ఎంపీ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హోటల్పై తీవ్రవాదులు బాంబు దాడి ప్రారంభించగానే కారు బాంబు, ఆత్మాహుతి దాడి చేసుకున్నారని వివరించారు. కాగా సైన్యం ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని... అయితే తీవ్రవాదుల దాడిలో హోటల్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని విశదీకరించారు. శుక్రవారం నేపథ్యంలో హోటల్ లో మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా ప్రార్థనలో ఉన్నారని చెప్పారు. దేశాధ్యక్షుడు భవనానికి సమీపంలో ఈ హోటల్ ఉంది. ఈ దాడికి పాల్పడింది ఆల్ ఖైదా అనుబంధ సంస్థ షిబాబ్ ప్రకటించింది. -
లాడెన్ ఆల్ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆ సంస్థ పేరు మార్చాలనుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వర్గాలు. యూఎస్ సైన్యం చేతిలో లాడెన్ హతమయ్య కొద్ది రోజుల మందు.. ఆల్ ఖైదా సంస్థ పేరు మార్చాలని భావించాడని.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నిస్ట్ బుధవారం వాషింగ్టన్లో వెల్లడించారు. యూఎస్లో డబ్ల్యూటీసీ టవర్పై దాడి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విధ్వంసానికి పాల్పడటంతో లాడెన్ ఆలోచనలో పడ్డాడు. అల్ ఖైదా మారణహోమానికి ప్రతీకగా నిలిచిందని లాడెన్ భావించాడు. ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఖైదాకు మరింతచెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడు... అది కూడా ఇస్లాం మాతానికి చాలా దగ్గరగా ఉండేలా కొత్త పేరు పెట్టాలనుకున్నాడు. ఆ దిశగా ఆలోచనలు చేస్తూ...ఆల్ఖైదా నాయకులతో సమాలోచన చేసేందుకు చర్యలు కూడా చేపట్టాడని ఎర్నెస్ట్ వివరించారు. ఇంతలో లాడెన్ పాకిస్థాన్ అబోటాబాద్లోని బిలాల్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించిన యూఎస్ సైన్యం... 2011, మే 2వ తేదీన అతడి నివాసంపై దాడి చేసి... అతడ్ని అంతమెందించింది. అనంతరం అతడి మృతదేహాన్ని యూఎస్ సైన్యం సముద్రంలో పడి వేసిన విషయం విదితమే.అయితే లాడెన్ను చంపేసిన తర్వాత అతడి నివాసంలో యూఎస్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పలు కీలకమైన పత్రాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను పరిశీలించిన యూఎస్ ఉన్నతాధికారులకు పలు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. -
తీవ్రవాదులను జైలు నుంచి తప్పించిన ఆల్ఖైదా
వాషింగ్టన్: యెమెన్లో ఆల్ ఖైదా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షాబ్వా ప్రావెన్స్లోని జైల్పై శుక్రవారం దాడి చేసి... బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి...తమతో తీసుకు వెళ్లారు. ఈ మేరకు భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. సదరు ఖైదీలంతా మరణశిక్ష పడిన వారని తెలిపారు. సైనిక శిబిరంపై దాడి చేసి రక్తసిక్తం చేసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే యెమెన్లోని తమతమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సౌదీ అరేబియాతోపాటు పలుదేశాలు ఇప్పటికే ప్రకటించాయి. యెమెన్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. -
ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడి: ఏడుగురు మృతి
యెమెన్: దక్షిణ యెమెన్ ఆల్ ఖైదా తీవ్రవాదులు గురువారం పేట్రేగిపోయారు. షబ్వా ప్రావెన్స్లోని బైహన్ పట్టణంలో సైనిక శిబిరాన్ని ఆల్ ఖైదా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఆ కాల్పులు జరిపింది తామేనని ఆల్ ఖైదాకు చెందిన అన్సర్ అల్ షరియా ప్రకటించింది. రాజధాని సనాలో సైన్యం పెత్తనానికి నిరసనగానే ఈ దాడి చేసినట్లు తీవ్రవాదులు ట్విట్టర్లో పేర్కొన్నారు. -
117 మంది తీవ్రవాదుల హతం
డెమాస్కస్: దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలల్లో తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని సైనిక బృందాలు ముమ్మరం చేశాయి. అందులోభాగంగా దాదాపు 117 మంది తీవ్రవాదలను మట్టుబెట్టినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఆల్ ఖైదాలో సంబంధాలు ఉన్న 47 మంది తీవ్రవాదులను మషారా పట్టణంలో చంపివేసినట్లు తెలిపింది. అలాగే దక్షిణ ప్రావెన్స్లోని దర్రార్లో 70 మంది రెబల్స్ను అంతమొందించినట్లు పేర్కొంది. అయితే సిరియా రాజధాని డెమాస్కస్లో శనివారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారని మీడియా వెల్లడించింది. -
ప్రపంచ శాంతికి పక్కలో బల్లెం... ఐఎస్ఐఎస్
కొన్నేళ్లుగా అంతర్జాతీయ తీవ్రవాదానికి అల్ఖైదానే చిరునామా. కానీ ఇప్పుడా స్థానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆక్రమించి, ప్రపంచ శాంతికి పక్కలోబల్లెంలా మారింది. అనతికాలంలోనే ఇంతటి గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం... ఐఎస్ఐఎస్ సాగిస్తున్న దారుణ మారణ కాండలే. అల్ఖైదా పిల్లవేరుగా పుట్టుకొచ్చిన ఈ భూతం ప్రస్తుతం ఇరాక్, సిరియాలకే పరిమితం కాలేదు ప్రపంచాన్నే ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనే లక్ష్యంతో నెత్తుటి కాండకు తెగబడుతోంది. 2014, జూన్ 29... పవిత్ర రంజాన్ (రమాజన్) నెలలోని మొదటి రోజు. అల్లా స్మరణలతో విశ్వశాంతి ఘోష ఓవైపు వినిపిస్తుండగా... మరోవైపు ఇస్లామిక్ రాజ్య అవతరణ ప్రకటన ప్రపంచాన్ని తుళ్లిపడేలా చేసింది. 423 మైళ్లకు విస్తరించిన ఈ కలీఫత్ అబూ బాకర్ ఆల్ బాగ్దాది నాయకత్వాన ఏర్పడింది. ప్రస్తుతానికి సిరియా, ఇరాక్లకే పరిమితమైనప్పటికీ దీనిమూలాలు 1999 నుంచి జోర్డాన్, అఫ్గానిస్థాన్లో ఉన్నాయి. బిన్లాడెన్ ప్రోద్బలంతో అల్ఖైదా ఇన్ ఇరాక్గా ఆరంభమైన ఈ వ్యవస్థ క్రమేణా బలీయమైన శక్తిగా రూపొందింది. సిరియా, ఇరాక్ సరిహద్దులతో కూడిన కొంత ప్రాంతాన్ని తమ రాజ్యంగా ప్రకటించుకొంది. గత 15 ఏళ్లలో వ్యవస్థాపరంగా అనేక మార్పులను సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఏకంగా ఇస్లామిక్ స్టేట్గా ఉనికిని చాటుకుంటోంది. అల్ఖైదా లాంటి తోటి ఉగ్రవాద సంస్థల కంటే బలమైన వ్యూహంతో గట్టెక్కింది. దీని సైనిక బలం 31,000 మంది. వీరిలో సుమారు 25 వేల మంది పూర్తికాల విశ్వసనీయులు. నిరంతర పోరాట స్పృహతో ఈ బలగాలు ఓవైపు ఉగ్రవాదులుగా, మరోవైపు సైన్యంగా పనిచేస్తాయి. అతివాద భావ జాలంతో స్థానికుల్లో ప్రజా స్వామ్యంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని తమకు అనుగుణంగా మార్చుకొని, ఇరాక్, సిరియా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి బీజం వేసి, అవసరమైతే ప్రజల్ని బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. వీరు గెరిల్లా పోరాటంలో సిద్ధ హస్తులు. జాతీయ సైన్యాల్ని, ఇతర వేర్పాటు వాదుల్ని ఓడించడంలో వీరికి వీరే సాటి. షియాలు వర్సెస్ సున్నీలు షియాలు అధిక సంఖ్యలో ఉన్న ఉత్తర ఇరాక్లో అల్ప సంఖ్యాకులైన సున్నీల తిరుగుబాటుతో ఇస్లామిక్ రాజ్య అవతరణకు బీజం పడిందని చెప్పవచ్చు. ఇరాక్ అధినేత షియా తెగకు చెందినవాడు. అతడు సున్నీల న్యాయబద్ధమైన నిరసనలను నిరంకుశంగా అణచివేశాడు. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్ (ఆల్వైట్ తెగ) తన పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటుదారుల్లో కలవరం సృష్టించడానికి వ్యూహాత్మకంగా సున్నీలపై దాడిని ప్రోత్సహించాడు. సౌదీ అరేబియా, అమెరికాలు పరోక్షంగా జీహాదీలకు మద్దతునివ్వడం లాంటి చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మొత్తానికి ఇరాక్, సిరియా దేశాల్లోని సున్నీల్లో ఏర్పడిన అభద్రతాభావం ఈ అతివాద వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాన కారణమయింది. దీని ప్రధాన శత్రువు షియా తెగకు చెందినవారు, క్రైస్తవులు. రెండొందల ఏళ్ల కిందట సౌదీ అరేబియాలో ప్రారంభమైన వాహబిజం ఇస్లామిక్ రాజ్య అజెండా అని చెప్పవచ్చు. వాహబిజపు పునఃసృష్టి (ట్ఛజీఠ్ఛ్టిజీౌ) ఇస్లామిక్ రాజ్యం. 1970లో సంభవించిన ఇరాన్ విప్లవం వాహబిజపు ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఇరాన్లో షియాలు రాజ్యాధికారాన్ని చేపట్టడం, మధ్య ప్రాచ్య దేశాల్లోని సున్నీలకు మింగుడు పడలేదు. బోకొహరం, ఆల్ షహాబ్, అల్ ఖైదా, తాలిబాన్, ఇప్పటి ఐఎస్ఐఎస్... ఇవన్నీ వాహబిజపు వ్యక్తీకరణలు (manifestations). పాముకు పాలుపోసినట్లు ఈ ఉగ్రవాదం అనే విషసర్పానికి పాలుపోసి పెంచింది సౌదీ, ఖతార్ ప్రభుత్వాలు. అయితే చివరికి ఆయా ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నించే స్థాయికి ఇది ఎదుగుతుందని ఊహించలేదు. ఇస్లామిక్ రాజ్యం కేవలం ఇరాక్, సిరియాలను మాత్రమే బలహీన పరచడం లేదు. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను సైతం కబళిస్తుందా? అనే అనుమానం తలెత్తుతోంది. ఐరోపా, అమెరికాలపై దీని ప్రబావమేంటి? దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆకర్షితులవుతున్న యువకులు మొన్నటికి మొన్న మెహదీ మస్రూర్ బిశ్వాస్ (బెంగళూరు) అనే వ్యక్తి ట్విట్టర్ (సామాజిక మాధ్యమం) ద్వారా సామాజిక ఇస్లామిక్ రాజ్య అనుకూల సమాచారాన్ని పంపడం మన భద్రతా వ్యవస్థల్ని ఆందోళనకు గురిచేసింది. అలాగే సిడ్నీలో కొందర్ని బందీలుగా చేసిన వ్యక్తి ఇస్లామిక్ రాజ్య పతాక నమూనాను కలిగి ఉండటం కలకలం రేపింది. కాగా 2015, జనవరి 16న హైదరాబాద్లోని బజార్ఘట్కు చెందిన సల్మాన్ మొహి యుద్దీన్ (32) అనే వ్యక్తి ఐఎస్ఐఎస్లో శిక్షణ పొందేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న విషయం మున్ముందు మన భద్రత వ్యవస్థ ఏమేర జాగురూకతతో వ్యవహరించాలో స్పష్టం చేస్తోంది.ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొందరు యువతీ యువకులు దీనిపట్ల ఆకర్షితులవడానికి సామాజిక, మనస్తత్వ శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. జీహాదీలు పేద, మధ్య, సంపన్న తరగతి నుంచి వస్తున్నారు. ప్రధానంగా అరబ్, ఆసియా దేశాల ముస్లిం యువత దీనివైపు వెళుతున్నారు. పాశ్చాత్య దేశాలకు వలస వచ్చిన అరబ్లు, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఇటీవల ఇస్లామ్ మతంలోకి మారిన వారు కొందరున్నారు. 20వ శతాబ్దం చివరి అంకంలో ఈజిప్టు, అల్జీరియా దేశాల్లో చెలరేగిన హింసాకాండకు కారకులు ఇస్లామిక్ అతివాదులు. పేదరికంలో మగ్గుతున్న యువత మసీదుల్లోని ఇమామ్ల బోధనలకు ప్రేరేపితులై ఇస్లాం మత భావాల పరిరక్షణకు ఉద్యమిస్తున్నారని మేధావుల అభిప్రాయం. ఇస్లామేతరుల్ని హింసించడానికి వెనుకాడటం లేదు. కేవలం పేదరికం, వివక్ష యువతని ఉద్రేకానికి పురిగొల్పుతున్నాయి. అయితే 2001, సెప్టెంబరు 11న న్యూయార్క్లో జరిగిన విధ్వంసకాండ సౌదీ అరేబియాకు చెందిన మధ్య తరగతి, సంపన్న వర్గాలవారి కుట్ర. పైగా ఈ దాడిలో పాల్గొన్నవారు మత ఛాందసులు కారు. అంటే కేవలం పేదరికం, వివక్షలే అతివాద ధోరణికి కారణమని చెప్పడం సమంజసం కాదు. విశ్లేషకుల మాట ఉన్నత విద్య కోసం అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన సౌదీ యువత తమ దేశాన్ని అమెరికా దోచుకుంటుందని, ఇస్లామ్ మతస్థులు వివక్షకు గురవుతున్నారని భావించింది. అందుకు ప్రతీకారంగా 2001, సెప్టెంబర్ 11 దురాగతానికి ఒడిగట్టారు. 2005 జూలైలో లండన్లో జరిగిన విధ్వంస కాండలో దక్షిణాసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన యువత పాల్గొంది. వీరంతా మధ్య తరగతికి చెందిన వారు. అలాగే పాశ్చాత్య సంస్కృతికి బాగా ప్రభావితులైనవారు. వీరికి మత రాజకీయ విషయాలపై అంత ఆసక్తి లేదు. కానీ బ్రిటిష్ దేశస్థుల జాత్యహంకార వైఖరి, విదేశీ సంతతి వివక్షకు గురవడం మొదలైన అంశాలు వీరిలో అసహనాన్ని కలిగించాయని విశ్లేషించారు. యువత జీహాద్ వైపు మళ్లడానికి సామాజిక, రాజకీయ పరిస్థితులు చాలా వరకు కారణం. పాకిస్థాన్, గల్ఫ్, పశ్చిమాసియా దేశాలు, ప్రసార మాధ్య మాలు, విద్యాలయాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామ్ మనుగడకు ఎలా ప్రతిబంధకాలో గోరంతలు కొండంతలు చేస్తున్నాయి. యువతలో ముస్లిమేతర దేశాలపట్ల వ్యతిరేక ధోరణిని కలిగిస్తున్నాయి. దీనికి మతఛాందస వాదులు ఆజ్యం పోస్తున్నారు. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు తమ అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఇస్లామ్ ప్రమాదంలో ఉందంటూ సామాన్య ప్రజానీకం దృష్టిని మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇలా యువతలో గూడుకట్టుకొన్న అసంతృప్తి బహిర్గత మవుతుంది. పోరాటపంథాకు పలు కారణాలు పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న రెండో తరానికి చెందిన ముస్లిమ్ యువత జీహాదీ వైపు ఆకర్షితులవడానికి మరో కారణం.. పరాయీకరణ (alienation). ప్రారంభంలో పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులైన యువత పాశ్చాత్యుల జాత్యహంకార ధోరణి, వివక్షతో విసుగుచెంది, తమ పూర్వ సంస్కృతి (ప్రాచ్య ఇస్లామిక్) పట్ల ఆకర్షితులవుతున్నారు. అలాంటి వారికి జీహాద్ మంచి అనుభూతిని కల్పిస్తుంది. తమను చులకనగా చూస్తున్నవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆకాంక్ష బలీయమవుతుంది. అది అతివాద ధోరణికి దారితీస్తుంది. దీంతో ఏళ్ల తరబడి బందీలుగా ఉంటోన్న తమ సోదరులను విడిపించుకోవాలని, భర్త చనిపోయిన స్త్రీలకు, అనాథలకు జరుగుతున్న అన్యాయానికి బదులు తీర్చుకోవాలని, అందుకు నిరంతర పోరాటం (ఉఛ్ఛీటట ్టటఠజజ్ఛ) కొనసాగించాలనుకుంటారు. ఉగ్రవాదుల ఆత్మీయ పిలుపునకు స్పందిస్తూ ఇస్లామ్కు అంతిమ విజయం లభిస్తుందని, దాన్ని నిజం చేయడానికి ప్రతి ముస్లిమ్ అవసరమైతే ఆత్మార్పణ చేయాలని భావిస్తారు. అలా తాము నమ్మిన ఆశయాల్ని అమలు చేయడానికి, అమరవీరులు కావడానికి వెనకాడరు. ఉగ్రవాదులకు రాజ్యంతో ముఖాముఖీ తలపడటానికి తగిన సాయుధ బలం లేదు. అందువల్ల ఆత్మాహుతి దాడులు (ఠజీఛిజీఛ్ఛీ ్చ్ట్ట్చఛిజుట)ను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సామాజిక మాధ్యమాలైన పేస్బుక్, ట్విట్టర్ లాంటివి విధ్వంసక సంఘటనలకు కావాల్సినంత ప్రచారాన్నిస్తున్నాయి. ఆత్మాహుతికి పాల్పడేవారికి ఆధ్యాత్మిక చింతన కంటే ఒక మంచి లక్ష్యానికి తమ ప్రాణాన్ని అర్పిస్తున్నామనే పారవశ్యపు భావన ఎక్కువగా ఉంటుంది. ఇస్లామిక్ రాజ్య సైనికుల విజయపరంపరలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాని మద్దతుదారులకు మరింత ఉత్తేజాన్నిస్తు న్నాయి. హింస, అమరత్వం ద్వారా విముక్తి లభిస్తుందనే యువతను అటువైపు ఆకర్షిస్తోంది. అసమర్థ పాలన, అవినీతి పరులైన నాయకులు ప్రభుత్వాల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం జీహాదికి మరింత ఉద్దీపిస్తున్నాయి. దానవులా.. మానవులా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇస్లామిక్ స్టేట్ దళాలు సాగిస్తున్న వికృతచేష్టలు మనం మానవులమా? రాక్షసులమా? అనే రీతిలో గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అనతికాలంలో ఐఎస్ఐఎస్ ప్రపంచానికి పరిచయం కావడానికి కారణం ఇలాంటి దారుణాలను ఒడిగట్టడమే. వాటిలో కొన్ని... రాక్లో వైమానిక దాడులు ఆపకపోతే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంద ని హెచ్చరిస్తూ ఇద్దరు అమెరికా జర్నలిస్టుల గొంతులు కోసిన వీడియోను అమెరికా అధ్యక్షునికి పంపిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద కర్కశ శైలితో ప్రపంచం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. ఇరాక్లోని అన్బర్లో 322 మంది ఇరాకి అల్ బు నిమ్ ్రఅనే సున్నీ తెగ ప్రజలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఊచకోత కోసిన ఘటన మానవీయ కోణానికే మాయనిమచ్చ. అల్ బు నిమ్ ్రతెగ ప్రజలు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ నరమేధానికి ఒడిగట్టారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం. 2014 జూన్ ప్రాంతంలో ఉత్తర ఇరాక్లో హింసను ప్రారంభించిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు, అన్బర్ ప్రాంతంలో జరిపిన ఈ మారణహోమంతో అతిపెద్ద రక్తపాతాన్ని సృష్టించారు. మూకుమ్మడి దాడే సరైన మందు ఇస్లామిక్ రాజ్యం ఊహించని రీతిలో తన ప్రభావాన్ని ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. సైనిక, మత, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో అలజడి రేపుతోంది.ఇరాక్లో అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించడంలోను, సిరియాలో అసాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతిపక్షాల మధ్య అనైక్యతను రాజేయడంలోనూ ఇస్లామిక్ స్టేట్ విజయం సాధించింది. దీని వ్యాప్తిని అరికట్టాలంటే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. రాజకీయంగా, దౌత్యపరం గా, ఆర్థిక, మత పరంగా అణచివేత కార్యాచరణకు పూనుకోవాలి. ఇందుకు స్థానికుల చొరవ చాలా అవసరం. అలాగే సిరియా ప్రభుత్వానికి రష్యా, ఇరాన్ దేశాల సైనిక సహాయాన్ని నిలిపివేయడంలో పాశ్చాత్యదేశాలు కృతకృత్యులు కావాలి. శాంతియుత విధానాలతో సిరియా రాజధాని డెమాస్కస్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పడానికి అనుకూల పరిస్థితులు కల్పించాలి. ఇరాక్ ప్రభుత్వానికి అమెరికా షరతులతో కూడిన సాయాన్ని అందించాలి. ఇరాక్ అధ్యక్షునికి షియా వర్గపు సైనిక మద్దతు తగ్గించేలా చూడాలి. ఇరాక్లోని సున్నీ తెగలు, కుర్దీష్ ఉద్యమకారుల మద్దతును కూడగట్టి ఇస్లామిక్ రాజ్య పునాదులను పెకిలించడానికి సంకల్పంచాలి. ఇప్పటికే జర్మనీ ఇస్లామిక్ స్టేట్ తరపున ప్రచార సామాగ్రిని పంపిణీ చేయడం, చిహ్నాలను ప్రదర్శించడంతోపాటు అన్ని కార్యకలాపాల్ని నిషేధించింది. అక్రమ చమురు ఉత్పత్తి, దాని అమ్మకాలు ఇస్లామిక్ రాజ్య ఆదాయ వనరులు. రవాణా, ఇతర ప్రాథమిక వనరులను ధ్వంసం చేయడం ద్వారా దాని ఆదాయ మార్గాలకు గండికొట్టవచ్చు. అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడం ద్వారా ఇస్లామిక్ రాజ్య ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు. ఈ వ్యూహాల్ని ప్రస్తుతం పాక్షికంగా ఉన్నట్లు కాకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలి. ఇస్లామిక్ రాజ్యాన్ని నైతికంగా బలహీన పరచాలంటే ఆ రాజ్య నాయకత్వాన్ని అంతమొందిం చాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చూడాలి. ఇస్లామిక్ రాజ్య అనుబంధ ఖాతాల్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలి. అవే మాధ్యమాల ద్వారా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి. ఇరాక్, సిరియాలో వీలైనంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చేయాలి. లేదంటే మత మౌఢ్యం రూపంలో ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద పెద్దపులి ప్రపంచ మనుగడకే ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ తీవ్రవాద సూచీ ప్రపంచ తీవ్రవాద సూచీ (గ్లోబల్ టైజం ఇండెక్స్) ప్రకారం... 162 దేశాలు ఈ ఉగ్రభూతం నీడలో నలిగిపోతున్నాయి. దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా నాలుగు. వాటిలో 1. తాలిబన్ 2. బోకోహరమ్ 3. ఐఎస్ఐఎస్ 4. అల్ ఖైదా . వీటి బారినపడే 162 దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో ఇరాక్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ ఉన్నాయని నివేదిక తెలిపింది. -
ప్యారిస్ దాడికి పాల్పడింది మేమే
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డో మీద దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ప్రకటించుకుంది. యెమెన్లో అల్ కాయిదా నేతలు యూట్యూబ్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకే ఈ దాడి చేసినట్లు ఆ వీడియోలో తెలిపారు. ప్యారిస్ మీద జరిగిన పవిత్ర యుద్ధానికి అరేబియన్ ద్వీపకల్పంలోని అల్ కాయిదా అల్ జిహాద్ బాధ్యత తీసుకుంటోందని, దైవదూతను దూషించినందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని అల్ కాయిదా యెమెన్ శాఖకు చెందిన నాజర్ అలీ అల్ అన్సీ ఆ వీడియోలో తెలిపారు. -
ఫ్రాన్స్లో హై అలర్ట్
* మరిన్ని దాడులు చేస్తాం: అల్కాయిదా * పారిస్లో ఆదివారం సంఘీభావ ర్యాలీ * హాజరవనున్న జర్మనీ చాన్సెలర్, బ్రిటన్ ప్రధాని, * ఇతర యూరోప్ దేశాల ప్రతినిధులు పారిస్: ఫ్రాన్స్ చరిత్రలో గత బుధ, గురు, శుక్రవారాలు నెత్తుటి మరకలై నిలిచాయి. ఆ దేశంపై మరిన్ని దాడులు చేస్తామని యెమన్లోని ఉగ్రవాద సంస్థ అల్కాయిదా హెచ్చరించింది. చార్లీ హెబ్డొపై దాడి తమ ఆదేశాల మేరకే జరిగిందని ప్రకటించింది. కాగా, ఉగ్రదాడులు ఎదుర్కొన్న ఫ్రాన్స్కు సంఘీభావంగా దాదాపు అన్ని యూరోపియన్ దేశాల నేతలు పారిస్లో ఆదివారం జరిగే సంఘీభావ ర్యాలీలో పాల్గొననున్నారు. పారిస్లో జరిగిన ఘాతుకాన్ని పశ్చిమదేశాలంటే పడని ఉత్తరకొరియా, క్యూబా, ఇరాన్లు సైతం తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్లో ఉగ్రదాడుల నేపథ్యంలో అమెరికా తన పౌరులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించింది. మరిన్ని దాడులు చేస్తామంటూ అల్కాయిదా హెచ్చరికలు చేయడంతో పర్యాటక ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, కీలక ప్రాంతాల్లో భద్రతను ఫ్రాన్స్ మరింత కట్టుదిట్టం చేసింది. వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులపై దర్యాప్తులో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకుంది. ప్రపంచ దేశాల మద్దతు: సూపర్మార్కెట్పై ఉగ్రవాద దాడిని యూదు వ్యతిరేక చర్యగా ఫ్రాంకోయిస్ హోలండ్ అభివర్ణించారు. ఉగ్రవాదులు మత ఛాందసులని, వారికి ఇస్లాం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయిస్ హోలండ్ శనివారం ఉదయం తన మంత్రివర్గంలోని కీలక మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం పారిస్లో జరగనున్న ఉగ్రవాద వ్యతిరేక సంఘీభావ ర్యాలీకి వేలాదిమంది హాజరయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్, జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్లతో పాటు స్పెయిన్, బెల్జియం, పోర్చుగల్, పోలండ్, స్వీడన్,డెన్మార్క్, నార్వే, ఉక్రెయిన్, యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ల ప్రతినిధులు హాజరుకానున్నారు. మహిళా ఉగ్రవాది కోసం గాలింపు.. శుక్రవారం తూర్పు పారిస్లోని సూపర్మార్కెట్లో పలువురిని బందీలుగా పట్టుకుని వారిలో నలుగురిని కాల్చి చంపిన ఉగ్రవాది అమెదీ కౌలిబలితో పాటు ఉన్న మహిళా ఉగ్రవాది హయత్ బౌమెదీన్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో అమెదీ చనిపోగా, ఆమె తప్పించుకుంది. ఆమె వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉండొచ్చని, ఏదో ఒక ప్రాంతంలో ఆమె మరోసారి దాడులకు దిగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూపర్మార్కెట్ను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున సమయంలో మూడేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఒక ఫ్రిజ్లో దాదాపు 5 గంటలపాటు దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఉగ్రవాది అమెదీ సాయంత్రం ప్రార్ధనల కోసం మోకాళ్లపై కూర్చున్న సమయంలోనే ఫ్రాన్స్ కమెండోలు సూపర్మార్కెట్లోకి దూసుకొచ్చారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. సిరియా, మాలిల్లో పశ్చిమదేశాల మిలటరీ చర్యలను అమెదీ తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఆడియోను ఫ్రెంచ్ రేడియో ప్రసారం చేసింది. అమెదీతో పాటు చార్లీ హెబ్డొపై దాడి చేసిన ఉగ్ర సోదరులు చెరిఫ్ కౌచీ, సయీద్ కౌచీలు జీహాదీలుగా ఇప్పటికే నిఘా వర్గాల దృష్టిలో ఉన్నారు. -
యూకేలోనూ ముంబై తరహా దాడులు?
బ్రిటన్లో కూడా భారీ సంఖ్యలో సామాన్యుల ప్రాణాలను బలిగొనేందుకు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటిష్ నిఘా సంస్థ అత్యున్నత అధికారే వెల్లడించారు. ఏదైనా ప్రయాణికుల విమానాన్ని పేల్చేయడం గానీ, ముంబై తరహాలో రద్దీ ప్రదేశాల్లో కాల్పులు జరపడం గానీ, లేదా వాహనాలను ఉపయోగించి హిట్ అండ్ రన్ దాడులు గానీ చేయొచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ రకమైన కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ఎంఐ5 సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ చెప్పారు. ఇటీవలి కాలంలో బ్రిటిష్ పోలీసులు, ఎంఐ5 కలిసి మూడు ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశాయన్నారు. అయితే, ప్రతిసారీ కుట్రలను తాము అడ్డుకోగలమని మాత్రం వీలైనంత వరకు తాము ప్రయత్నం చేస్తూనే ఉంటామని.. అయితే.. వాళ్లు కూడా రాను రాను కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారని పార్కర్ వ్యాఖ్యానించారు. ప్యారిస్ తరహా దాడులకు కొంతమంది ఉగ్రవాదులు పాల్పడతారేమోనన్న అనుమానంతో బ్రిటిష్ పోర్ట్లాండ్ సాయుధ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. లండన్ లోని యూరోస్టార్ టెర్మినల్ వద్ద భద్రత పెంచారు. ఇప్పటికే సిరియా, ఇరాక్ దేశాల నుంచి కొంతమంది బ్రిటిష్ జీహాదీలు స్వదేశానికి తిరిగి వస్తున్నారని, వాళ్లు ఈ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. బ్రిటన్ నుంచి సిరియా వెళ్లిన 600 మంది బ్రిటిష్ వాళ్లలో ఎక్కువ మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలుస్తోంది. -
తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో నిఘా కార్యాలయంపై ఆత్మాహుతి దాడే లక్ష్యంగా చేసుకున్న అల్ ఖైదా తీవ్రవాదుల లక్ష్యాన్ని పాక్ సైన్యం శుక్రవారం భగ్నం చేసింది. ఆ క్రమంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో కమాండర్తోపాటు ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. మృతదేహల వద్ద నుంచి ఆత్మహుతి జాకెట్లతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరాచీలోని కైయమ్మబాద్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది.