Asia Cup 2018
-
ఫైనల్లో యువ భారత్
ఢాకా: కుర్రాళ్ల బౌలింగ్ ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టు ఆసియాకప్ అండర్–19 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్లో మోహిత్ జాంగ్రా (3/25), సిద్ధార్థ్ దేశాయ్ (3/35), హర్‡్ష త్యాగి (2/29) అద్భుతంగా రాణించడంతో సెమీస్లో భారత్ 2 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. మొదట భారత్ 49.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (37), అనుజ్ (35), సమీర్ (36), ఆయుశ్ బదోని (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లామ్ 3, మృత్యుంజయ్ చౌదరి, రిషద్, తౌహిద్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 46.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటైంది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... షమీమ్ (59), అక్బర్ అలీ (45)ల పోరాటంతో కాసేపు గెలుపుదారిలో నడిచింది. అయితే స్పిన్నర్ త్యాగి 139 స్కోరు వద్ద అక్బర్ను, 147 పరుగుల వద్ద మృత్యుంజయ్ (2)ను ఔట్ చేసి మ్యాచ్ను భారత్వైపు తిప్పేశాడు. షమీమ్ను అజయ్ ఔట్ చేయడంతో బంగ్లాకు ఓటమి ఖాయమైంది. చివరి ఐదు వికెట్లను బంగ్లాదేశ్ 31 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. -
‘అందుకే విశ్రాంతి తీసుకున్నా’
రాజ్కోట్: ప్రత్యర్థి బౌలర్లకు దొరకని సమాధానంగా మారాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతమున్న ఏ ఇతర బ్యాట్స్మన్ రాణించని చోట ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఘనతలన్నీ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లికి చెందుతాయి. ఇంగ్లండ్లో అసాధారణ రీతిలో చెలరేగి ఆడిన కోహ్లికి ఆసియా కప్ ముందు విమర్శల సెగ తగిలింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్కు తాను ఆడనని, విశ్రాంతి అవసరమని తెలపడంతో క్రీడా పండితులు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి వివరణ ఇవ్వగా, తాజాగా విరాట్ కోహ్లి స్పందించాడు. (కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) ‘ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాను. అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగా. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్కు విశ్రాంతినిచ్చారు. అంతేకాని ఆసియ కప్ మీద చిన్నచూపు కాదు. విశ్రాంతి అనంతరం కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుంది ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ భావన తప్పు. ఆడిన మ్యాచ్ల్లో పరుగులు సాధించకపోతే ఆ ఆటగాడికి ఎలాంటి వర్క్లోడ్ ఉండదు. మ్యాచ్లు ఎక్కువ ఆడినంత మాత్రాన వర్క్లోడ్ అనిపించదు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వర్క్లోడ్ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతాం. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్లలో వర్క్లోడ్ ఎక్కువగా అనిపించింది’.అంటూ విరాట్ కోహ్లి విశ్రాంతి గురించి వివరణ ఇచ్చాడు. ఇక కోహ్లి గైర్హాజర్తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా? కోహ్లికి రెస్ట్.. రోహిత్కు పగ్గాలు -
‘సచిన్ క్రికెట్ దేవుడే.. కానీ ధోని మాత్రం..’
ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచులో మిస్టర్ కూల్ ధోనిని ఔట్ చేయడం ద్వారా తన చిరకాల కోరిక నెరవేరిందని హాంగ్కాంగ్ బౌలర్ ఇహ్సాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. త్వరలోనే తన కెరీర్ గురించి ఓ పుస్తకం రాయబోతున్నానని, అందులో ఎక్కువ భాగం ధోని గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ ఆఫ్ స్పిన్నర్. బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఇహ్సాన్... ‘ సచిన్ క్రికెట్ దేవుడు అయితే ఎంఎస్ ధోని క్రికెట్ కింగ్. వీరిద్దరిని ఒక్కసారైనా అవుట్ చేస్తే చాలు నా కెరీర్ పరిపూర్ణమైనట్లే అని భావించాను. అయితే సచిన్ను అవుట్ చేసే అవకాశం నాకు లభించలేదు. ఆసియా కప్ పుణ్యమాని ధోనిని పెవిలియన్కు పంపే అదృష్టం నాకు దక్కింది. అది నాకెంతో గర్వకారణం. ఈ విషయాలన్నీ నా పుస్తకంలో రాసుకుంటాను. నా మనువలకు కూడా ఇదంతా తెలియాలి కదా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా హాంగ్కాంగ్ తరపున ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 29 వికెట్లు తీశాడు. ఆసియా కప్లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచులో ధోనిని డకౌట్గా పెవిలియన్కు పంపించి వార్తల్లో నిలిచాడు. అయితే స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ధోనిని అవుట్ చేసిన ఇహ్సన్ ఖాన్ ఓ స్కూలు టీచర్ అన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ధోనితో ఇహ్సన్ ఖాన్ -
కోహ్లిపై బంగ్లా ఫ్యాన్స్ ప్రతీకారం
ఢాకా: బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. భారత్తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ను థర్డ్ అంపైర్ స్టంపౌట్గా ప్రకటించడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా బంగ్లా ఫ్యాన్స్ ఏకీపారేశారు. తమ సెంచరీ హీరో లిటన్ దాస్ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే టైటిల్ చేజారిందని బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. అందులో లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేశారు. దాన్ని ఎలా ఔటిస్తారో వివరణ ఇవ్వాలంటూ ఐసీసీని నిలదీస్తూ ఓ నోట్ను కూడా ఆ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. క్షమాపణలు చెప్పి, ఆ థర్డ్ అంపైర్పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే వెబ్సైట్ను మళ్లీ హ్యాక్ చేస్తామని హెచ్చరించారు. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని కోరారు. ఈ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ నమోదు చేసిన లిటన్ దాస్(121) కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లాడు. బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్పై కాలు పెట్టాడు. కానీ అప్పటికే ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ లిటన్ దాస్ను ఔట్గా ప్రకటించాడు. అదే సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్మన్కు అనుకూలంగా ఇవ్వకపోవడాన్ని బంగ్లా ఫ్యాన్స్ ప్రశ్నిస్తురు. అసలు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ నిబంధనను థర్డ్ అంపైర్ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ చివరి బంతి వరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లే తమ జట్టు ఓడిపోయిందని బంగ్లా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లి వెబ్సైట్లో హ్యాకర్స్ పోస్ట్ చేసిన ఫొటో -
‘కోహ్లి.. కోహ్లియే కానీ రోహిత్ కెప్టెన్సీ సూపర్’
ఇస్లామాబాద్ : ఆసియాకప్లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గైర్హాజరీతో సారథ్య బాథ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఖలీజ్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లే. అతని విషయంలో చాలెంజ్ చేయలేరు. కానీ అతను లేకుండా భారత జట్టు ఆసియాకప్లో అదరగొట్టింది. విరాట్ మూడో నెంబర్ బ్యాట్స్మన్గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఆసియాకప్లో రోహిత్ అద్బుతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. మైదానంలో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతని కెప్టెన్సీ రోజు రోజుకు మెరుగైంది. ఐపీఎల్లో కూడా అతని కెప్టెన్సీ చూశాను. ఆటగాళ్ల సొంత నిర్ణయాలను అనుమతిస్తాడు. వారికనుగుణంగా ఆడే స్వేచ్ఛను ఇస్తాడు. రోహిత్ ఓ అద్బుత కెప్టెన్.’ అని యూనిస్ కొనియాడాడు. (చదవండి: కెప్టెన్గా కోహ్లి పనికిరాడా?) ఆసియాకప్ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు. ‘భారత్ నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన జట్టు. ఈ జట్టులో వరల్డ్ క్లాస్ ఓపెనర్స్ ఉన్నారు. రోహిత్, ధావన్లు ప్రతిసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థులకు కష్టంగా ఉంటుంది. భారత్ విజయాల పట్ల నేనేం ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే భారత్ ఓ పెద్ద దేశం. ఆదేశంలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ప్రాంతానికి క్రికెట్ విస్తరించింది. భారత పేస్ బౌలర్లు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. వారంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారికి ఐపీఎల్ మంచి అవకాశాలను ఇచ్చింది. భారత్లో క్రికెట్ వేదికలు చాలా మార్పును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ ఎంతో మంది యువఆటగాళ్లను పరిచయం చేసింది.’ అని తెలిపాడు. ఇక యూనిస్ అంతర్జాతీయ క్రికెట్లో 789 వికెట్లు పడగొట్టాడు. (చదవండి: కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) -
సెమీస్లో యువ భారత్
సవర్ (బంగ్లాదేశ్): అండర్–19 ఆసియా కప్లో యువ భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 45.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (93 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోని (66 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. 14 పరుగులకే 3 వికెట్లు్ల కోల్పోయిన యువ భారత్ను యశస్వి ఆదుకున్నాడు. సిమ్రన్ సింగ్(17)తో నాలుగో వికెట్కు 62 పరుగులు, ఆయుశ్ బదోనితో ఐదో వికెట్కు 80 పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా, కైస్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 45.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రియాజ్ హుస్సేన్ (92 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్ (30 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. సిద్ధార్థ్ దేశాయ్ (4/37), హర్‡్ష త్యాగి (3/40), సమీర్ చౌదరి (2/18) ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్ తలపడతాయి. -
క్రికెట్ వద్దు.. 21 ఏళ్లకే ఆటకు గుడ్బై
క్రికెటర్ కావడం అతని కల కాదు. అయినా, దేశం తరపున ఆడడానికి చదువుకు రెండేళ్లు స్వస్తి పలికి మరీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మామూలుగా అయితే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఎవరైనా క్రికెటర్గా కొనసాగడానికే మొగ్గుచూపుతారు. కానీ, హాంగ్కాంగ్కు చెందిన 21 ఏళ్ల కుర్రాడు క్రిస్టోఫర్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్ననాటి కల విమాన పైలట్ కావడం కోసం క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. బ్యాట్స్మన్, వికెట్కీపర్గా సేవలందిస్తున్న కార్టర్ 2015 నవంబర్లో హంగ్కాంగ్ క్రికెట్ జట్టుకి ఎంపికయ్యాడు. మూడేళ్ల తన కెరీర్లో 11 వన్డేలు, 10 టీ20ల్లో ఆడాడు. వన్డేల్లో 114 (బెస్ట్ 43) పరుగులు, టీ20ల్లో 55 (బెస్ట్ 17) పరుగులు చేశాడు. ఇదిలాఉండగా.. క్రిస్టోఫర్ ఇటీవల జరిగిన ఆసియాకప్ టోర్నీలో కూడా పాల్గొన్నాడు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో హాంగ్కాంగ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. హాంగ్కాంగ్లో జన్మించిన కార్టర్ పెర్త్ (ఆస్ట్రేలియా)లో పెరిగాడు. అడిలైడ్లో 55 వారాల పైలట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. మరో ఏడాదిలో క్రిస్టోఫర్ తన డ్రీమ్లో ‘తేలియాడ బోతున్నాడు’. -
కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: ఇటీవల యూఏఈ వేదిక జరిగిన ఆసియాకప్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్ ఇవ్వడంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే దానిపై వివరణ ఇచ్చిన రవిశాస్త్రి.. ‘ కోహ్లి చాలా అలసిపోయాడు. శారీరకంగా చూస్తే కోహ్లి పరిస్థితి ఒక ఎద్దులా మారిపోయింది. దాంతో కోహ్లి విశ్రాంతి అనివార్యమైంది. ఒకవేళ ఆసియాకప్లో అతను ఆడితే అది తీవ్రమైన ప్రభావం చూపేది. గత కొంతకాలంగా విరామంగా లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లి మరింత తాజాగా ఫీల్డ్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే అతనికి విశ్రాంతినిచ్చాం. ఇక్కడ కోహ్లికి ఒక్కడికే కాదు.. మిగతా ఆటగాళ్ల విషయం కూడా అదే పద్ధతిని అవలంభిస్తున్నాం. పేసర్లు బూమ్రా, భువనేశ్వర్ కుమార్లకు సైతం విశ్రాంతి అవసరమని భావించే వారిని విండీస్తో టెస్టు సిరీస్ నుంచి పక్కకు పెట్టాం. విరామం లేకుంగా క్రికెట్ ఆడేవారు మరింతగా రాటుదేలాలంటే విశ్రాంతి అనేది అనివార్యం’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. -
ఆసియాకప్ విజయంపై కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ సాధించడం పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు విజేతగా నిలవడం అరుదైన విజయమని అభివర్ణించారు. భారత జట్టు ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
యువ భారత్ శుభారంభం
ఢాకా: ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించిన భారత్... రికార్డు స్థాయిలో ఏడోసారి కప్ను ముద్దాడిన మరుసటి రోజే యువ భారత జట్టు అండర్–19 ఆసియా కప్లో శుభారంభం చేసింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం నేపాల్ అండర్–19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత అండర్–19 జట్టు 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ సిమ్రన్ సింగ్ (82; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో భీమ్ షార్కి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 36.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్‡్ష త్యాగి, సిద్ధార్థ్ దేశాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా మన్దీప్కు 2 వికెట్లు దక్కాయి. యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా నేడు యూఏఈతో భారత్ తలపడనుంది. -
సమాధానం లభించలేదు
ఓపెనర్గా, మూడో స్థానంలో అంబటి రాయుడు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. కానీ ఆ రెండు స్థానాల్లో మున్ముందు అతనికి అవకాశమే లేదు. మూడు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన దినేశ్ కార్తీక్ ఐదు ఇన్నింగ్స్లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు. సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నా, కేదార్ జాదవ్ బ్యాటింగ్ సత్తా బయట పడనే లేదు. అతిథి పాత్రలో రాహుల్ ఒకే మ్యాచ్కు పరిమితం కాగా, మనీశ్ పాండే వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వృథా చేసుకున్నాడు. ఆసియా కప్లో అజేయ ప్రదర్శనతో చాంపియన్గా నిలవడంతో సమష్టి పాత్ర కనిపిస్తున్నా... టోర్నీకి ముందు తీవ్రంగా చర్చ జరిగిన మిడిలార్డర్ సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా నాలుగు, ఆరు స్థానాల్లో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు. సాక్షి క్రీడా విభాగం:‘జట్టులో కొందరు ఆటగాళ్లు నాలుగు, ఆరు స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నారని చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. రాబోయే మరికొన్ని టోర్నమెంట్లలో వారి ప్రదర్శన తర్వాతే ఆయా ఆటగాళ్లు ఏమాత్రం పనికొస్తారని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది’ అని ఆసియా కప్ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య తాజా పరిస్థితిని సూచిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు నాలుగు, ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దాని కోసం పోటీ పడుతున్న బ్యాట్స్మెన్పై అనూహ్యంగా వేటు వేయకుండా వీలైనన్ని అవకాశాలు కల్పిస్తానని చెప్పిన తాత్కాలిక కెప్టెన్ తన మాట నిలబెట్టుకున్నాడు. అయితే తుది ఫలితం మాత్రం అతను అనుకున్న విధంగా రాలేదని అర్థమవుతోంది. కీలక మ్యాచ్లలో భారత టాప్–3 (కోహ్లి వచ్చాక) విఫలమైతే పరిస్థితి ఏమిటనే దానికి మాత్రం పరిష్కారం ఆసియా కప్లోనూ లభించలేదు. బంగ్లాదేశ్తో ఫైనల్లో 223 పరుగులను అందుకునేందుకు మన జట్టు తడబడ్డ తీరు ప్రపంచకప్ దిశగా సన్నద్ధమవుతున్న సమయంలో హెచ్చరికలాంటిదే. గెలిపించేదెవరు? రోహిత్, ధావన్, కోహ్లి సమష్టిగా విఫలమైతే భారత జట్టు పరిస్థితి ఏమిటనేదానికి అతి పెద్ద ఉదాహరణ గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ మ్యాచ్లో ఈ ముగ్గురు 0, 21, 5 పరుగులు చేశారు. జట్టు చిత్తుగా ఓడి పాక్కు ట్రోఫీ అప్పగించింది. అది అరుదైన సందర్భమే కావచ్చు కానీ నాటి నుంచి కూడా మన మిడిలార్డర్ తడబాటు జట్టుకు సమస్యగానే మారింది. నాలుగు నుంచి ఏడు స్థానాల వరకు ఫలానా ఆటగాడు బలంగా నిలబడిన గెలిపించగలడు అని ఎవరినీ నమ్మలేని స్థితి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ నుంచి గణాంకాలు చూస్తే మన మిడిలార్డర్ (ఆటగాళ్లు మారినా) పరుగుల స్కోరింగ్ రేటు 4.82 మాత్రమే. ప్రపంచ కప్ ఆడబోతున్న మొత్తం పది జట్లలో మనకంటే అధ్వాన్నంగా (4.66) అఫ్గానిస్తాన్ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఆసియా కప్ వరకు చూస్తే మన అంబటి రాయుడు అందరికంటే కాస్త మెరుగ్గా కనిపించాడు. హాంకాంగ్, అఫ్గానిస్తాన్లపై అతను అర్ధ సెంచరీలు చేశాడు. ఫైనల్లో మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దినేశ్ కార్తీక్ వరుసగా చేసిన స్కోర్లు 33, 31 నాటౌట్, 1 నాటౌట్, 44, 37 అతనిపై నమ్మకం పెంచలేకపోతున్నాయి. నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో సిక్సర్తో తన అంతర్జాతీయ కెరీర్కు మళ్లీ ఊపిరి పోసిన కార్తీక్ ఆ తర్వాత ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇంగ్లండ్లో వైఫల్యంతో టెస్టుల్లో తన స్థానాన్ని పంత్కు చేజార్చుకున్న అతని వన్డే కెరీర్ కూడా ఇప్పుడు ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. ఏదోలా ఫైనల్ను జాదవ్ ముగించగలిగినా, అతని ఫిట్నెస్ కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. ఐపీఎల్లో గాయపడిన తర్వాత సుదీర్ఘ సమయం ఎన్సీఏలో గడిపి ఫిట్గా తిరిగొచ్చిన అతను మళ్లీ కండరాల నొప్పితో ఇబ్బంది పడటం ఫిజియో పనితీరుపై కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత తాను ప్రధానంగా బ్యాట్స్మన్ను అని స్వయంగా చెప్పుకున్న జాదవ్ ప్రస్తుతం ప్రత్యేక శైలి బౌలర్గానే జట్టులో ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప బ్యాట్స్మన్లా కాదు. ధోని పరిస్థితి ఏమిటి? ఆసియా కప్కు ముందే ఐదో స్థానం గురించి రోహిత్ స్పష్టత ఇచ్చేశాడు. అది ధోని కోసమేనని అర్థమైపోయింది. కానీ ఈ టోర్నీలో ధోని ఆట చూస్తే అతని వీరాభిమానులు కూడా ‘సమయం వచ్చేసింది’ అని భావిస్తున్నట్లుగా అనిపించింది. నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి అతను 77 పరుగులే చేశాడు. ప్రతీ పరుగు కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో ఫైనల్లో మరోసారి కనిపించింది. కేవలం 62.09 స్ట్రైక్ రేట్ ఉండటం, 124 బంతులు ఆడితే మొత్తంగా 6 ఫోర్లు తప్ప ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం ధోని స్థాయి మాత్రం కాదు. కచ్చితంగా ప్రపంచ కప్ వరకు ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో 327 వన్డేల అనుభవజ్ఞుడు మిడిలార్డర్లో ఇలా ఆడితే కష్టమే. ఇక అన్ని ఫార్మాట్లకు తగిన విధంగా అద్భుతమైన ఆట ఉన్నా కేఎల్ రాహుల్ను మిడిలార్డర్లో మాత్రం ఆడించలేమని ఈ టోర్నీ ద్వారా మేనేజ్మెంట్ తేల్చేసినట్లుంది. అందుకే ఒక్కసారి కూడా మిడిల్లో ఆడించే ప్రయత్నం చేయలేదు. ఇతర ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న మ్యాచ్లో ఓపెనర్గా అతను 60 పరుగులు చేసినా అవి అతనికి ఎలాగూ టాప్–3లో అవకాశం కల్పించలేవు. మనీశ్ పాండే వ్యథ మరో రకం. దేశవాళీ అద్భుత ప్రదర్శనతో జట్టులోకి రావడం, ఆపై సుదీర్ఘ కాలం బెంచ్పై ఉండటం, ఏదో పుష్కరానికి ఒకసారి మ్యాచ్ దక్కితే పరిస్థితులను అర్థం చేసుకునేలోపే లేదంటే ఒత్తిడిలో ఔట్ కావడం రొటీన్గా మారింది. నిజానికి పై అందరికంటే అసలైన మిడిలార్డర్ బ్యాట్స్మన్గా పాండేకే ఎక్కువ గుర్తింపు ఉంది. తన కెరీర్ 18 ఇన్నింగ్స్లలో అతను 4, 5, 6 స్థానాల్లోనే ఆడాడు. కానీ అతనికి వరుసగా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కొత్తగా ప్రయత్నిస్తారా... నిజాయితీగా చెప్పాలంటే ఆసియా కప్ను మన బౌలర్లు గెలిపించారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు దాదాపు ప్రతీ మ్యాచ్లో ప్రత్యర్థికి భారీ స్కోరుకు అవకాశం లేకుండా చేశారు. అందు వల్లే బ్యాట్స్మెన్ పని కొంత సులువుగా మారింది. ప్రతీ సారి టాప్–3నే మ్యాచ్లు గెలిపించడం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత తొందరగా మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందే. ఇప్పటి వరకు ప్రస్తావించిన పేర్లే కాకుండా మరోసారి అజింక్య రహానే కూడా పోటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. దూకుడు తక్కువ కాబట్టి వన్డేలకు పనికి రాడంటూ ప్రస్తుతానికి అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. కానీ ఇంగ్లండ్ పిచ్లపై మిడిలార్డర్లో ఇన్నింగ్స్ను నడిపించాలంటే సాంకేతికంగా బలమైన బ్యాట్స్మన్ అవసరం. అది రహానేలో ఉంది. నిజంగా సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తే వచ్చే సిరీస్నుంచే అతడిని ఎంపిక చేసి వరుసగా ఆడించాలి. వీరందరినీ కాదని దేశవాళీలో మెరుగ్గా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్లాంటి వారిని కూడా ప్రయత్నిస్తారా అనేది రాబోయే వెస్టిండీస్ సిరీస్లో కొంత వరకు తేలుతుంది. దినేశ్ కార్తీక్ స్థానంలో రెగ్యులర్ బ్యాట్స్మన్గా ఆడగల సత్తా రిషభ్ పంత్లో కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచినా మిడిలార్డర్ సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందనేది వాస్తవం. నేనూ ధోనిలాంటివాడినే: రోహిత్ శర్మ దుబాయ్: తొలిసారి వన్డే కెప్టెన్గా వ్యవహరించిన టోర్నీలోనే రోహిత్ శర్మ భారత జట్టుకు టైటిల్ అందించాడు. ఆసియా కప్లో విజేతగా నిలిచిన అనంతరం అతను మాట్లాడుతూ మైదానంలో ప్రశాంతంగా వ్యవహరించే విషయంలో తాను ధోనినే అనుకరిస్తున్నట్లు చెప్పాడు. ‘కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకుండా కొంత సమయం తీసుకోవడం ఇన్నేళ్లుగా నేను ధోనిలో చూశాను. నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను కూడా ముందుగా ఆలోచించి ఆ తర్వాతే స్పందిస్తాను. వన్డేల్లో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. అతని నాయకత్వంలో చాలా కాలం ఆడాను.నాకు ఎప్పుడు సలహాలు, సహకారం కావాలన్నా అందించేందుకు అతను ఎప్పుడూ ముందుంటాడు’ అని రోహిత్ వెల్లడించాడు. మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ కెప్టెన్సీ అవకాశం దక్కినా ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు తాను సిద్ధమని రోహిత్ స్పష్టం చేశాడు. ‘కచ్చితంగా. ఇప్పుడే మేం విజయం సాధించాం. ఇకపై కూడా ఎప్పుడు కెప్టెన్సీ అవకాశం లభించినా నేను రెడీ’ అని అతను వెల్లడించాడు.కొన్నాళ్ల క్రితమే రోహిత్ నాయకత్వంలో భారత్ టి20 టోర్నీ నిదాహస్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. -
పూర్తిస్థాయి కెప్టెన్సీకి సిద్ధం : రోహిత్
దుబాయ్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్గా ఆసియాకప్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో భారత్ మూడు వికెట్లతో నెగ్గి ఏడోసారి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడుతున్నారు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తన కెప్టెన్సీ అచ్చు ధోనిలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘ధోనికి కెప్టెన్గా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అవన్నీ నాలో కూడా ఉన్నాయి. మైదానంలో ఎలా మెలగాలో ధోనీ నుంచే నేర్చుకున్నా. ఒత్తిడి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పింది ఆయనే. ధోనితో కలిసి ఆడిన ప్రతిసారి ఆయన మైదానంలో ఎలా మెలుగుతున్నారో బాగా గమనించేవాడిని. ఇప్పటికీ అదే పని చేస్తున్నా. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపే చాకచక్యం నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అతని కెప్టెన్సీలో మేం ఎన్నో మ్యాచ్లు ఆడాం. మేం ఎప్పుడు ధోనిబాయ్ నుంచి ఎదో ఒకటి నేర్చుకుంటాం. ఎందుకంటే అతనో గొప్ప కెప్టెన్. ఏమైన సందేహాలు, ప్రశ్నలు ఉంటే వాటికి అతనెప్పుడు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉంటాడు.’ అని తెలిపాడు. ఇక రోహిత్ కెప్టెన్సీ రికార్డు అద్బుతంగా ఉంది. అతని సారథ్యంలో భారత్ నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్ గెలిచింది. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మూడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దమేనా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ‘మాకు కేవలం గెలుపే కావాలి. కెప్టెన్సీ అవకాశం వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాను.’ అని తెలిపాడు. ఇక నెం 4, నెం6 స్థానాల్లో ఎవరు కుదురుకోలేదని రోహిత్ అంగీకరించాడు. ‘ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తుండటంతో నాలుగు, ఆరు స్థానాల ఎంపిక కోసం ఇంకొన్ని మ్యాచ్లు అవసరం. ప్రస్తుతం అయితే ఇది సరైన సమయం కాదు. ప్రపంచకప్ వరకు మాకు స్పష్టత వస్తోంది. జరగబోయే టోర్నీలు మాకు అనుకూలమైనవే. ఏ ఆటగాళ్లను ఆడించాలి అనేది మేనేజ్ మెంట్ చూసుకుంటుంది’ అని తెలిపాడు. యువజట్టుగా ఈ టైటిల్ను గెలవడం సంతోషాన్నించిందని చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లు స్థిరంగా రాణించారని కొనియాడాడు. -
బుమ్రా ఎందుకిలా చేశాడు?
దుబాయ్: తనను పరిహాసం చేసిన పోలీసులకు ఆటతోనే బదులిచ్చాడు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ముగిసిన ఆసియాకప్లో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు. పోస్టర్లపై తనను అవమానించిన వారికి తగిన విధంగా జవాబిచ్చాడు. @traffic_jpr well done Jaipur traffic police this shows how much respect you get after giving your best for the country. pic.twitter.com/y0PU6v9uEc — Jasprit bumrah (@Jaspritbumrah93) June 23, 2017 అసలేం జరిగింది? గతేడాది పాకిస్తాన్తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బుమ్రా నోబాల్ వేయడంతో పాక్ బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుమ్రా నోబాల్తో బతికిపోయిన అతడు సెంచరీ(114)తో చెలరేగాడు. తుదిపోరులో 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి టీమిండియా టైటిల్ చేజార్చుకుంది. సీన్ కట్ చేస్తే బుమ్రా నోబాల్ ఫొటోను జైపూర్ ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్గా వాడుకున్నారు. ‘లైను దాటకండి. లైను దాటితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’ని ఈ ఫొటోలో హోర్డింగ్లు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లకు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థమైందని అప్పట్లోనే ట్విటర్లో బుమ్రా ఆవేదన వెలిబుచ్చాడు. ఇప్పుడేమైంది? బంగ్లాదేశ్ను ఓడించి ఆసియా కప్ను టీమిండియా కైవశం చేసుకుంది. ట్రోఫి పట్టుకుని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన తనను అవమానించిన వారికి బుమ్రా బదులిచ్చాడు. ‘కొంత మంది తమ సృజనను సైన్ బోర్డుల మీద చూపించడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఇదే నా సమాధానం’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా జరిగిన ఆసియా కప్లో నాలుగు మ్యాచ్లు ఆడిన బుమ్రా 16 సగటుతో 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంతో తనవంతు పాత్ర పోషించాడు. Some people love to use their creativity on the sign boards. Hope this one fits there as well!! 😁💪#Champions#AsiaCup2018 #lionalwaysroars🦁 pic.twitter.com/VWiJidwmaA — Jasprit bumrah (@Jaspritbumrah93) September 28, 2018 -
క్రికెట్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాకప్ టైటిల్ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ చివరి బంతికి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆసియా’ మనదే) Congratulations to Team India on the spectacular win over Bangladesh for the #AsiaCup2018. You make us proud. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2018 -
టీమిండియా తొలి వికెట్ తీసిన తర్వాత..
దుబాయ్: ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ను ఔట్ చేసినప్పుడు లేదా మ్యాచ్లో విజయం సాధించిన సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆనందం పట్టలేక నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా నాగిని డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయాక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని లంక, భారత్ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. అయితే, తాజాగా మరోసారి బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం ఆసియాకప్ ఫైనల్లో భారత ఓపెనర్ ధావన్ క్యాచ్ను సౌమ్య సర్కార్ అందుకున్న అనంతరం బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ నాగిని డ్యాన్స్ చేశాడు. భారత్ తొలి వికెట్ను తొందరగా తీశామన్న ఆనందంలో నజ్ముల్లా నాగిని డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో స్టేడియంలో బంగ్లా అభిమానులు సైతం నాగిని డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్కు మూడు, కేదార్ జాదవ్కు రెండు వికెట్లు దక్కగా బుమ్రా, చాహల్లకు తలో వికెట్ లభించింది. ఆ తర్వాత భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. చివరిబంతి వరకూ పోరాడిన భారత్ ఎట్టకేలకు గెలిచి ఊపిరి పీల్చుకుంది. -
ధావన్ ఔట్.. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్
-
హవ్వా.. అది అవుటా?
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. అయితే, ఈ మ్యాచ్లో సెంచరీ నమోదు చేసిన బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్(121)ను మూడో అంపైర్ స్టంపౌట్గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్లో కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లిన లిటన్ దాస్ బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్పై కాలు పెట్టాడు. అప్పటికే ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో నిర్ణయం మూడో అంపైర్కు వెళ్లడంతో చాలాసేపు రీప్లేలో చూసినా స్పష్టత కనిపించలేదు. పలు కోణాల్లో పరిశీలించిన తర్వాత లిటన్ దాస్ను ఔట్గా ప్రకటించారు. ప్రధానంగా లిటన్ కాలి వేళ్లు లైన్ వెనకభాగంలో ఉన్నట్టు కనిపించకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో అతన్ని ఔట్గా ప్రకటించడంతో టీమిండియా కాస్త ఊపిరిపీల్చుకుంది. అదే సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్మన్కు అనుకూలంగా ఇవ్వకపోవడంపై బంగ్లా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ నిబంధనను థర్డ్ అంపైర్ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాగా మారిందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఐసీసీ అంటే బీసీసీఐలాగా మారిందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. కాలు స్పష్టంగా లైన్పై ఉన్నా కూడా ఔట్గా ప్రకటించడం దారుణమని మరొక నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇలా లిటన్ దాస్ ఔట్పై ట్విటర్లో విమర్శల వెల్లువెత్తుతున్నాయి. -
జడేజా ఔటైతే భారత్ నెగ్గేది కాదు..
న్యూఢిల్లీ : ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠకర ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి ఏడోసారి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడని అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కీలక సమయంలో జడేజా(23;33 బంతుల్లో) భువనేశ్వర్(21;31 బంతుల్లో) తో కలిసి ఏడో వికెట్కు 45 పరుగులు జోడించాడు. ఈ టోర్నీలో అటు బంతి, ఇటు బ్యాట్తో మెరిసిన జడేజాను జట్టులో కొనసాగించాలని అజారుద్దీన్ ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. ‘రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయవద్దు. ఆసియాకప్లో బ్యాటింగ్, బౌలింగ్తో అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్లో జడేజా త్వరగా పెవిలియన్ చేరుంటే.. భారత్ మ్యాచే నెగ్గేది కాదు. అతను భారత జట్టు 11 మంది సభ్యుల్లో ఎప్పుడు ఒకడే.’ అని తెలిపాడు. సూపర్-4లో బంగ్లాదేశ్పైనే జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే. (మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్) ఇక చివర్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్న జాదవ్ బ్యాటింగ్ చేయడాన్ని కూడా అజారుద్దీన్ కొనియాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసించాడు. అతను చాలా కూల్గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో బంగ్లా కెప్టెన్ మొర్తజా చెప్పినట్టే ఆ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో 6 పరుగుల అవసరం కాగా.. గాయంతోనే జాదవ్, కుల్దీప్ సాయంతో మ్యాచ్ను గెలిపించాడు. చదవండి: ‘ఆసియా’ మనదే -
ఎంఎస్ ధోని మరో రికార్డు
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున అత్యుత్తమ కెప్టెన్గా, గొప్ప ఫినిషర్గా ఖ్యాతి సాధించిన ఎంఎస్ ధోని.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మందిని పెవిలియన్కు పంపిన తొలి ఆసియా వికెట్ కీపర్గా రికార్డు సాధించాడు. శుక్రవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ధోని ఈ రికార్డు సాధించాడు. టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బంగ్లాదేశ్ను బ్యాటింగ్ను ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ 43వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో బంతికి బంగ్లా కెప్టెన్ మొర్తజా స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. కుల్దీప్ వేసిన బంతిని మొర్తజా ఎదుర్కొనేందుకు ప్రయత్నించగా అది కాస్తా ధోని చేతికి చిక్కింది. వెంటనే ధోనీ బంతిని వికెట్లకు కొట్టడంతో మోర్తజా స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 800 మంది డిస్మిసల్స్లో ధోని భాగస్వామ్యమ్యాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక ఔట్లలో పాలు పంచుకున్నతొలి ఆసియా వికెట్ కీపర్గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇక్కడ ఓవరాల్గా మార్క్ బౌచర్ (998-దక్షిణాఫ్రికా), గిల్క్రిస్ట్ (905-ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో ఉండగా, ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ధోని చేసిన ఔట్లలో 616 క్యాచ్లు ఉండగా, 184 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో స్టంపింగ్స్లో ధోని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్
దుబాయ్: ఆసియాకప్లో మరోసారి విజేతగా నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తుది పోరులో మిడిల్ ఆర్డర్దే కీలక పాత్రగా రోహిత్ పేర్కొన్నాడు. తమ జట్టు ఒత్తిడిలో పడ్డ సమయంలో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు ఆకట్టుకుని విజయం ఖాయం చేశారన్నాడు. ఓవరాల్గా చూస్తే తమ ఫినిషింగ్ లైన్ అద్భుతంగా ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘ ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా చూస్తే తొలి 10 ఓవర్లలో బంగ్లా ఆటగాళ్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే బంతి కాస్త పాత బడిన తర్వాత స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని ముందే ఊహించాం. మేము ఏదైతే అనుకున్నామో.. అదే జరిగింది. క్రమేపీ బంగ్లాను భారీ స్కోరు చేయకుండా పైచేయి సాధించాం.ఇక్కడ జట్టుగా సమష్టి కృషి లేకపోతే టైటిల్ను గెలవడం అంత ఈజీ కాదు. ఈ టైటిల్ సాధించడంలో క్రెడిట్ అంతా మొత్తం జట్టుదే. ఈ తరహా జట్టు ఉన్నప్పుడు కెప్టెన్ పాత్ర అనేది సులభతరంగానే ఉంటుంది. మిగతా 10 ఆటగాళ్ల వల్లే నేను మంచి కెప్టెన్గా కనబడుతున్నా. టోర్నీ ఆద్యంతం మా వాళ్లు అసాధారణంగా రాణించారు. అదే సమయంలో మాకు మద్దతు కూడా విశేషంగా లభించింది. భారత్కు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు. ‘ఆసియా’ మనదే -
మళ్లీ టైటిల్ సాధించిన భారత్
-
ఆసియాకప్లో భారత్ ఘనవిజయం
-
‘ఆసియా’ మనదే
ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్ను అందుకోగా... మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. దుబాయ్: భారత జట్టు విజయానికి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్ జాదవ్ క్రీజ్లో ఉన్నాడు. అంతా భారత్కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ఈ స్థితిలో డ్రామా మొదలైంది. ధోని ఔట్ కాగా, జాదవ్ కండరాలు పట్టేయడంతో పెవిలియన్కు వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే జడేజా, భువనేశ్వర్ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్బై ద్వారా సింగిల్ రావడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, జాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. శతక భాగస్వామ్యం... కెరీర్లో 17 వన్డేలు ఆడితే సగటు 14.06 కాగా అత్యధిక స్కోరు 41 మాత్రమే ఉన్న బ్యాట్స్మన్ ఒకరు... 16 వన్డేల్లో ఏనాడూ ఆరో స్థానం కంటే ముందుగా బ్యాటింగ్కు దిగని ఆటగాడు మరొకరు... వీరిద్దరిని ఆసియా కప్ ఫైనల్లో ఓపెనర్లుగా పంపి బంగ్లాదేశ్ సాహసం చేసింది. అయితే ఇది అద్భుత ఫలితాన్నిచ్చింది. లిటన్ దాస్, మెహదీ హసన్ (59 బంతుల్లో 32; 3 ఫోర్లు) కలిసి భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో దాస్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత చహల్ ఓవర్లో కూడా రెండు భారీ సిక్సర్లు కొట్టిన దాస్ 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 52 పరుగుల వద్ద మిడ్ వికెట్లో చహల్ క్యాచ్ వదిలేయడంతో దాస్ బతికిపోయాడు. ఇదే జోరులో ఓపెనింగ్ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. గత 27 వన్డేల్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 20 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 116 పరుగులకు చేరింది. స్పిన్నర్ల జోరు... బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ నుంచి మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తన తొలి ఓవర్లోనే మెహదీ హసన్ను ఔట్ చేసి కేదార్ జాదవ్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కైస్ (2)ను చహల్ ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. బంగ్లా ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్ (5) పేలవ షాట్కు వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లోనే జడేజా అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యానికి మిథున్ (2) రనౌటయ్యాడు. మహ్ముదుల్లా (4) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. 31 పరుగుల వ్యవధిలో బంగ్లా 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్ (45 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు దాస్కు అండగా నిలిచాడు. అయితే కుల్దీప్ వరుస ఓవర్లలో దాస్, మొర్తజా (7)లను ధోని స్టంపౌట్ చేయడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. దాస్ స్టంపింగ్ సందేహాస్పదంగా కనిపించినా చివరకు థర్డ్ అంపైర్ ఔట్గానే ప్రకటించారు. ఇన్నింగ్స్లో తొలి 100 పరుగులు చేసేందుకు 17.5 ఓవర్లు మాత్రమే తీసుకున్న బంగ్లాకు తర్వాతి 100 పరుగులు చేసేందుకు 26.5 ఓవర్లు పట్టడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. సమన్వయ లోపంతో ముగ్గురు ఆటగాళ్లు రనౌట్ కావడం విశేషం. గెలిపించిన జడేజా, భువనేశ్వర్... సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే పది పరుగులు రాబట్టి భారత్ శుభారంభం చేసింది. కానీ టోర్నీలో తొలిసారి 50 పరుగుల లోపే మొదటి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ (15) వెనుదిరగ్గా, అంబటి రాయుడు (2) విఫలమయ్యాడు. మరోవైపు రోహిత్ మాత్రం దూకుడు కొనసాగిస్తూ భారీ షాట్లు ఆడాడు. అయితే అర్ధ సెంచరీకి చేరువైన సమయంలో మరోసారి పుల్ షాట్కు ప్రయత్నించి డీప్ స్క్వేర్లెగ్లో క్యాచ్ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ (37; 1 ఫోర్, 1 సిక్స్), ధోని కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. తాను ఎదుర్కొన్న 23వ బంతికి ధోని తొలి ఫోర్ కొట్టాడు. ధోనితో నాలుగో వికెట్కు 14 ఓవర్లలో 54 పరుగులు జోడించిన అనంతరం కార్తీక్ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే ముస్తఫిజుర్ చక్కటి బంతికి ధోని కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్ కూడా గాయంతో తప్పుకోవడంతో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే జడేజా, భువనేశ్వర్ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత్ను విజయానికి చేరువ చేశారు. ►అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది నాకౌట్ మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ►ఆసియా కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్ మన్గా లిటన్ దాస్ గుర్తింపు పొందాడు. గతంలో జయసూర్య (శ్రీలంక–125; భారత్పై కరాచీలో 2008)... ఫవాద్ ఆలమ్ (పాక్–114 నాటౌట్; శ్రీలంకపై మిర్పూర్లో 2014)... తిరిమన్నె (శ్రీలంక–101; పాక్పై మిర్పూర్లో 2014)... ఆటపట్టు (శ్రీలంక–100; పాక్పై ఢాకాలో 2000) ఈ ఘనత సాధించారు. ►ఇంగ్లండ్ తర్వాత (194; విండీస్పై 1979 వరల్డ్ కప్ ఫైనల్) ఓ టోర్నీ ఫైనల్లో తొలి వికెట్కు 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి తక్కువ స్కోరుకే ఆలౌటైన రెండో జట్టుగా బంగ్లాదేశ్ (222) నిలిచింది. ►అంతర్జాతీయ క్రికెట్లో 800 ఔట్లలో పాలుపంచుకున్న మూడో వికెట్ కీపర్గా, ఆసియా నుంచి తొలి కీపర్గా ధోని నిలిచాడు. బౌచర్ (దక్షిణాఫ్రికా–998), గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా–905) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఆసియాకప్ ఫైనల్: భారత్ లక్ష్యం 223
దుబాయ్ : భారత్తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ 223 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లా బ్యాట్స్మెన్లో ఓపెనర్ లిటన్ దాస్ 121(117 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్స్లు), మెహ్దీ హసన్(32), సౌమ్య సర్కార్లు(33) మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, జాదవ్ రెండు వికెట్లు తీయగా, చహల్, బుమ్రాలు ఒక వికెట్ తీశారు. బంగ్లా బ్యాట్స్మెన్లో ముగ్గురు రనౌట్లు కావడం విశేషం. లిటన్ దాస్ ఒక్కడే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఊహించని రీతిలో ఓపెనర్స్ శుభారంభం అందించారు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(32) సాయంతో తొలి వికెట్కు 120 పరుగులు జోడించాడు. 27వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. కానీ ఈ ఆరంభాన్ని బంగ్లా మిగతా బ్యాట్స్మెన్ అందిపుచ్చుకోలేకపోయారు. భారత బౌలర్ల సహనానికే పరీక్ష మారిన లిటన్ దాస్- మెహ్దీ హసన్ జోడిని పార్ట్టైం బౌలర్ జాదవ్ విడదీసాడు. మెహ్దీ హసన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది. ఈ క్రమంలో లిటన్ దాస్ 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతో కెరీర్లోనే తొలి సెంచరీ సాధించాడు. ఆ వెంటనే మహ్మదుల్లా(4)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్ బాధ్యాతాయుతంగా ఆడాడు. కానీ లిటన్ దాస్, కెప్టెన్ మొర్తాజాలను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ధోని సాయంతో ఇద్దరిని స్టంపౌట్ చేసి పెవిలియన్కు చేర్చాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన నజ్ముల్ ఇస్లాం(7)ను సబ్స్ట్యూట్ ఫీల్డర్ మనీష్ పాండే రనౌట్ చేశాడు. చివర్లో సౌమ్య సర్కార్ (33) కూడా రనౌట్ కాగా.. మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన రుబెల్ హొస్సెన్(0)ను బుమ్రా క్లీన్బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 48.3 ఓవర్లలో 222 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. -
ఆసియాకప్: లిటన్ దాస్ సెంచరీ
దుబాయ్ : భారత్తో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ శతకం సాధించాడు. 87బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేశాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన లిటన్ దాస్.. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(32) సాయంతో తొలి వికెట్కు 120 పరుగులు జోడించాడు. 27 వన్డేలనంతరం బంగ్లా ఓపెనర్స్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పడం విశేషం. అనంతరం మెహ్దీ హసన్ను పార్ట్టైం బౌలర్ జాదవ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కైస్(2), ముష్ఫికర్ రహీమ్ (5), మహ్మద్ మిథున్ (2)ల వికెట్లను బంగ్లాదేశ్ వరుసగా కోల్పోయింది. -
ఆసియాకప్: బంగ్లా ఓపెనర్స్ అదుర్స్
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అర్థ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఓపెనర్స్ మంచి శుభారంభం అందించారు. గత మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్స్ ఈ మ్యాచ్లో మెరిసారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ క్రమంలో 33 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెహ్దీ హసన్(25) కూడా నిలకడగా ఆడుతూ లిటన్కు అండగా నిలుస్తున్నాడు. దీంతో 15 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్ 86/0 -
ఆసియాకప్ ఫైనల్ : బంగ్లాదే బ్యాటింగ్
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ ఛేజింగ్కే మొగ్గు చూపాడు. గత అఫ్గాన్ మ్యాచ్ సందర్భంగా విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు తుదిజట్టులోకి వచ్చారు. రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్. పరుగులు చేయడం ముఖ్యమే. కానీ ఫీల్డింగ్ మా జట్టుకు కలిసొస్తుంది. ఇప్పటికే మేం చేజింగ్లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం. దురదృష్టవశాత్తు యువ ఆటగాళ్లు ఒకే మ్యాచ్ ఆడగలిగారు.’ అని తెలిపాడు. బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. మోమినుల్ హక్ స్థానంలో నజ్ముల్ ఇస్లామ్ తుది జట్టులోకి వచ్చాడు. బంగ్లా కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ..‘ఫైనల్ చేరిన క్రెడిట్ అంతా మా ఆటగాళ్లదే. కొన్ని మ్యాచుల్లో వారి ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ రోజు చివరిబంతి వరకు పోరాడుతాం. మా జట్టులో స్పిన్నర్ లేడు. దానికోసం జట్టులోకి నజ్ముల్ ఇస్లామ్ను తీసుకున్నాం. మాకు మంచి అవకాశం ఉంది. వారిది నెం1 జట్టు. వాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఇది మేం అందిపుచ్చుకుంటే మాకు అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ నెగ్గాలని భారత్ భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సంచలనం సృష్టించాలని బంగ్లా భావిస్తోంది. తుది జట్లు భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ ఇస్లామ్, ముష్ఫికర్, మొహమ్మద్ మిథున్, ఇమ్రుల్ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ -
ఆఖరి బంతి వరకు పోరాడుతాం: బంగ్లా కెప్టెన్
దుబాయ్ : ఆసియాకప్ ఫైనల్లో విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడుతామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా స్పష్టం చేశాడు. మరికొద్ది క్షణాల్లో ఈ భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ సమరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మొర్తజా మాట్లాడుతూ.. గాయాలతో ఒక్కొక్క ఆటగాడు దూరం కావడంతో మేం కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఈ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. మా ఆటగాళ్లకు ఇది ఓ పాఠంలాంటిది. మేం ఖచ్చితంగా చివరి బంతి వరకు పొరాడాలని మా యువ ఆటగాళ్లకు బోధపడిందనుకుంటున్నాను. షకీబ్- ఇమామ్లు లేకపోవడం మాకు కష్టమే. ఈ టోర్నీ ఆరంభం ముందు షకీబ్ 50 శాతమే ఫిట్గా ఉన్నాడు. తొలి మ్యాచ్ నుంచే తమీమ్ జట్టులో లేడు. కానీ మా ఆటగాళ్లు నిరుత్సాహపడలేదు. గ్రూప్ దశలో అఫ్గాన్, సూపర్-4లో భారత్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికి మేం పోరాడుతాం. ఇప్పటివరకూ మా ఆటతీరుతో మేం గర్వపడ్డాం. అయితే టీమిండియా ఎంతో బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లో ఆ జట్టుతో మేం ఎలా పోరాడతాం అన్నదే ఇక్కడ ప్రధానం. ఆసియా కప్లో టీమిండియానే ఫేవరెట్.. అందుకే మేం మానసికంగా బలంగా ఉండి.. చివరి బంతి వరకూ పోరాడాలి’ అని బంగ్లా సారథి పేర్కొన్నాడు. గాయాలతో బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్లను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక భారత్తో 34 వన్డేలాడిన బంగ్లాదేశ్ కేవలం 5 సార్లు మాత్రమే గెలిచింది. -
బుమ్రాను చూసి నేర్చుకోవాలి
క్రికెట్ అభిమానుల్లో ఎక్కువ మంది ఆశించిన లేదా ఊహించిన ఫైనల్ కాదిది. అయితే ఫైనల్ చేరేందుకు బంగ్లాదేశ్కు అన్ని విధాలా అర్హత ఉంది. భారత్ గనక ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఇక్కడ కూడా ఆశ్చర్యకర ఫలితం రావచ్చు. అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత మళ్లీ కోలుకొని పట్టుదలతో బంగ్లాదేశ్ ఆడిన తీరు ప్రశంసనీయం. సమష్టితత్వంతో పాటు సానుకూల దృక్పథంతో వారు పాకిస్తాన్తో ఆడారు. ఫలితంగా సెమీఫైనల్లాంటి మ్యాచ్లో చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మష్రఫ్ మొర్తజా తన ఫీల్డింగ్ ఏర్పాట్లు, బౌలింగ్ మార్పులతో సమర్థంగా జట్టును నడిపించాడు. సహచరులు కూడా దానికి తగిన రీతిలో స్పందించారు. ముష్ఫికర్ అద్భుతంగా ఆడుతుండగా మిథున్ కూడా ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో వీరిద్దరి భాగస్వామ్యం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనే తత్వం కనిపించింది. దురదృష్టవశాత్తూ ముష్ఫికర్ సెంచరీ కోల్పోయాడు. ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్తో బౌలింగ్ ప్రారంభించి మష్రఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వేగంగా ప్రత్యర్థినుంచి మ్యాచ్ను లాక్కునే సత్తా ఉన్న ఫఖర్ను ఔట్ చేసి మెహదీ తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆసి యా కప్లో ఫఖర్ ఫామ్ పేలవంగా ఉండటం వల్ల పాక్కు సరైన ఆరంభాలు లభించలేదు. సరిగ్గా ఇదే విషయంలో భారత్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తూ తొలి పది ఓవర్లలోనే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీస్తున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ వీరిద్దరు కొడుతున్న షాట్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ప్రత్యర్థి బౌలర్లను ఒక వైపు జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరో వైపు మెరుపు షాట్లతో చెలరేగుతున్న తీరును చూసి తీరాల్సిందే. ఇక్కడి స్పిన్ పిచ్లను భారత స్పిన్నర్లు సమర్థంగా ఉపయోగించుకొని ప్రత్యర్థి మిడిలార్డర్లో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా కట్టి పడేశారు. జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్ నోబాల్ వేయకుండా ఉండే విధంగా అతను తన రనప్ను మార్చుకున్న తీరు చూస్తే తప్పులు సరి దిద్దుకునేందుకు అతను ఎంత శ్రమిస్తాడో అర్థమవుతుంది. నోబాల్ వేయకుండా ఉండే విషయంలో జడేజా, చహల్ కూడా బుమ్రాను చూసి నేర్చుకోవాలి. చురుకైన ఫీల్డింగ్ కూడా భారత జట్టు ఫైనల్ చేరడానికి ఒక కారణం. ఇప్పుడు కావాల్సిందల్లా ఇదే జోరును మరొక రోజు కొనసాగించి ఆసియా కప్ను మన ఖాతాలో వేసుకోవడమే. -
ఏం చేసినా రాణించలేకపోయాను!
దుబాయ్: ఆసియా కప్లో పరుగుల వరద పారిస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంగ్లండ్ టూర్ వైఫల్యంపై నోరు విప్పాడు. ఐతే అక్కడ విఫలమైనంత మాత్రాన సిగ్గుపడాల్సిన పని లేదన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో ఘోరంగా విఫలమవడంతో వెస్టిండీస్తో జరిగే సిరీస్లో అతని ఎంపిక ప్రశ్నార్థకమైంది. అయితే తాజా దూకుడుతో మళ్లీ సెలక్షన్ ట్రాక్లో పడ్డాడు. ‘దేనికైనా ప్రదర్శనే కీలకం. అది బాగుంటే అన్ని కలిసొస్తాయి. ఇప్పటి ఫామ్తో టెస్టుల్లో స్థానం దక్కేదుంటే దక్కుతుంది. లేదంటే లేదు. రెడ్ బాల్తో ఆడినా... వైట్ బాల్తో ఆడినా... నాకున్న బ్యాటింగ్ పరిజ్ఞానంతో రాణిస్తాను’ అని డాషింగ్ ఓపెనర్ ధావన్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటన గురించే మాట్లాడితే... అక్కడ పూర్తిగా విఫలమయ్యానన్న సంగతి తనకు తెలుసన్నాడు. ‘నాకంటే సహచరులే బాగా ఆడారు. అంత మాత్రాన విపరీతంగా చింతించాల్సిన పనిలేదు. ఆసియా కప్లో వైట్ బాల్తో చక్కగా ఆడుతున్నా. భిన్నమైన పరిస్థితుల్లో భిన్నమైన ప్రణాళికలతో ఆడతాం. కొన్నిసార్లు మన ప్రణాళికలు పనిచేస్తాయి. ఇంకొన్ని సార్లు చేయవు’ అని శిఖర్ వివరించాడు. ఆసియా కప్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ బలమైన జట్టే అయినా బంగ్లాదేశ్ ఈ టోర్నీలో బాగా ఆడిందన్నాడు. ‘మేటి జట్లపై అద్భుతంగా ఆడిన బంగ్లాను అభినందించాల్సిందే. చెమటోడ్చి ఫైనల్ చేరడం గొప్పవిషయం. అయితే మేజర్ ఈవెంట్లలో టైటిల్ సాధించేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు’ అని ఈ ఓపెనర్ అన్నాడు. విరాట్ కోహ్లి లేకపోవడంతో సీనియర్ ఓపెనర్లయిన తమపై అదనపు ఒత్తిడి ఉంటుందని తాను భావించడం లేదని శిఖర్ ధావన్ అన్నాడు. మిడిలార్డర్కు, మిగతా బ్యాట్స్మెన్కు అవకాశమివ్వాలని అఫ్గానిస్తాన్తో మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పాడు. -
కొట్టేస్తారా ఏడో సారి!
నిన్న మొన్నటి ఉత్కంఠభరిత నిదహాస్ ట్రోఫీ ఫైనల్ను మరువకముందే... భారత్–బంగ్లాదేశ్ మధ్య మరో ఆఖరి పోరాటం. బలాబలాలను బేరీజు వేసినా, ఆటతీరును అంచనా కట్టినా పటిష్ఠంగా కనిపిస్తున్న టీమిండియా...! అవకాశం చిక్కితే సంచలనం సృష్టించగల బంగ్లా...! దుబాయ్ వేదికగా దుమ్మురేపేదెవరో...? కప్పును ఒడిసిపట్టేదెవరో...? దుబాయ్: సాదాసీదాగా సాగుతూ వచ్చిన ఆసియా కప్ తుది అంకానికి చేరింది. భీకర ఆటతీరుతో అదరగొడుతున్న భారత్ను... పడుతూ లేస్తూ వచ్చిన బంగ్లాదేశ్ శుక్రవారం జరిగే తుది సమరంలో ఢీ కొట్టనుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ బలాబలాల రీత్యా చూస్తే ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరెట్. ప్రధాన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి లేకున్నా మన జట్టు ఎదుట నిలవడం బంగ్లాకు సవాలే. అయితే, సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న మొర్తజా సేనను తక్కువ అంచనా వేస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన అతి విశ్వాసానికి పోకుండా ఆడితే చాలు. తద్వారా ఆసియా కప్ ఏడోసారి భారత్ ఖాతాలో చేరిపోతుంది. వన్డే కెప్టెన్గా ఓ మేజర్ టోర్నీ నెగ్గిన ఘనత రోహిత్ సొంతమవుతుంది. ‘మిడిల్’ ఒక్కటే బెంగ కోహ్లి లేకున్నా రోహిత్, ధావన్ల అద్భుత ఫామ్తో బ్యాటింగ్లో భారత్కు లోటు తెలియలేదు. వన్డౌన్లో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ సైతం తమవంతు పాత్ర సమర్థంగా పోషించారు. కానీ, ప్రధాన ఆందోళనంతా మిడిల్ ఆర్డర్ గురించే. భారత్ను ఎప్పటినుంచో ఇబ్బందిపెడుతున్న 5, 6 స్థానాల సమస్యకు ఈ టోర్నీ సైతం పరిష్కారం చూపలేకపోయింది. ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్ కీలక సమయంలో విఫలమవుతున్నారు. ఈ కారణంగానే అఫ్గానిస్తాన్తో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ ‘టై’ అయింది. అయితే, ఫైనల్కు పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగుతున్నందున ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక బౌలింగ్లో భువనేశ్వర్, బుమ్రా తమ స్థాయికి తగ్గట్లుగా రాణించారు. టోర్నీలో ఏ బ్యాట్స్మెనూ వారిని ఎదుర్కొని పరుగులు సాధించలేకపోయారు. ఆల్రౌండర్ జడేజాకు తోడుగా చహల్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటారు. ముందుగా బ్యాటింగ్కు దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి అందుకోలేనంత లక్ష్యాన్ని నిర్దేశించడం, బౌలింగ్కు దిగితే లక్ష్యం 250 మించకుండా ఉండేలా చూసుకోవాలి. గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న ఐదుగురు ఆటగాళ్లు ఫైనల్లో బరిలో దిగడం ఖాయం. అతడిని ఆపాలి... బంగ్లాదేశ్ టోర్నీలో ఇక్కడివరకు వచ్చిందంటే అది పూర్తిగా ముష్ఫికర్ రహీమ్ ఘనతే. కీలక ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, షకీబుల్ దూరమైనా జట్టును అతను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఓపెనర్లు లిటన్ దాస్, సౌమ్య సర్కార్ సహా బ్యాట్స్మెన్ అంతా విఫలమవుతున్నా యువ ఆటగాడు మొహమ్మద్ మిథున్తో కలిసి ముష్ఫికర్ పోరాడుతున్నాడు. పాకిస్తాన్తో సూపర్ ఫోర్ మ్యాచ్లో ఈ ఇద్దరి భాగస్వామ్యమే ఫలితాన్ని మార్చింది. ఫైనల్లోనూ బ్యాటింగ్ భారమంతా వీరిపైనే పడనుంది. సీనియర్ బ్యాట్స్మెన్ మహ్ముదుల్లా, ఇమ్రుల్ కైస్ రాణిస్తే అదనపు బలంగా మారుతుంది. మరో వైపు బౌలింగ్లో పేసర్ ముస్తఫిజుర్ లయ అందుకోవడం బంగ్లాకు అనుకోని వరం. అతడితో పాటు కెప్టెన్ మొర్తజా, రూబెల్ హుస్సేన్లతో జట్టు పేస్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. మెహదీ హసన్ మెరుగ్గానే ఉన్నా... గత మ్యాచ్లో షకీబ్ లోటు కనిపించింది. దీంతో పార్ట్ టైమర్ మహ్ముదుల్లాపై ఆధారపడాల్సి వచ్చింది. మ్యాచ్ సాగే కొద్దీ నెమ్మదించే దుబాయ్ పిచ్లపై... భారత్ వంటి నాణ్యమైన స్పిన్ వనరులున్న జట్టును ఎదుర్కొనడం సవాలే. ఏదేమైనా బ్యాట్స్మెన్ అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఫైనల్లో టీమిండియాను నిలువరించడం బంగ్లా శక్తికి మించిన పనే. ►ఆసియా కప్లో ఫైనల్కు చేరడం బంగ్లాదేశ్కిది మూడోసారి. 2012లో పాకిస్తాన్ చేతిలో, 2016లో (టి20 ఫార్మాట్) భారత్ చేతిలో ఓడింది. ►భారత్ ఇప్పటివరకు ఆరుసార్లు (1984, 1988, 1990–91, 1995, 2010, 2016) ఆసియా కప్ను గెల్చుకుంది. 1997, 2004, 2008లలో రన్నరప్గా నిలిచింది. పిచ్–వాతావరణం దుబాయ్లో 40 డిగ్రీలకు తక్కువ కాకుండా ఎండ కాస్తోంది. ఈ నేపథ్యంలో విపరీతమైన వేడిమిని తప్పించుకునేందుకు టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్కే మొగ్గుచూపొచ్చు. టోర్నీలో పిచ్ల తీరు చూస్తే 250పై స్కోరే భారీగా కనిపిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, ముష్ఫికర్, మొహమ్మద్ మిథున్, ఇమ్రుల్ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ -
పాక్ ఓటమి.. సెహ్వాగ్ ట్వీట్
దుబాయ్: చిన్న జట్లను తక్కువగా అంచనా వేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆసియాకప్లో బుధవారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. చాలా మంది ఊహించినట్టుగా ఫలితం రాలేదన్నాడు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అభిమానులు కోరుకున్నట్టుగా జరగలేదు. ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయని చాలా మంది ఊహించారు. కానీ అలా జరగలేదు. ఈరోజు బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. ముష్ఫికర్, మిథున్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా, మెహిదీ సత్తా చాటారు. పాకిస్తాన్కు అదృష్టం కలిసిరాలేద’ని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆసియాకప్లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని రంగాల్లో పాక్ జట్టు విఫలమైందన్నాడు. కుర్రాళ్లతో కూడిన జట్టు గత టోర్నమెంట్లో బాగా ఆడిందని, దీంతో అంచనాలు పెరిగాయన్నాడు. పాకిస్తాన్ జట్టు పుంజుకోవాలంటే ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించాడు. బంగ్లాదేశ్ టీమ్కు అభినందనలు తెలిపాడు. No one is an underdog. Not quite what fans would have wanted, many had anticipated an India vs Pak final but Bangladesh were just superb on the day, The 5 M’s Mushfiqur, Mithun, Mustafizur ,Mahmudullah & Mehidy had brilliant performances and hard luck to Pakistan. #BANvPAK — Virender Sehwag (@virendersehwag) September 26, 2018 -
ధోని ఖాతాలోకి ‘అనుకోని’ ఘనత
దుబాయ్: ఆసియా కప్లో భాగంగా అఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని అనుకోకుండా టీమిండియాకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్తో టీమిండియా తరుపున 200 వన్టేలకు నాయకత్వం వహించిన ఘనత మిస్టర్ కూల్కు దక్కింది. అయితే అఫ్గాన్తో మ్యాచ్లో జార్ఖండ్ డైనమెట్ ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్ చేసింది. టీమిండియాకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్కుడిగా (37ఏళ్ల 80రోజులు) మిస్టర్ కూల్ అనుకోని రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్( 36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని సవరించాడు. ఇక ఓవరాల్గా టీమిండియాకు (మహిళల మరియు పురుషుల) నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 ఏళ్ల 184 రోజులు) తొలి స్థానంలో నిలవగా, ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ( ఊరించి... ఉత్కం‘టై’ ) 2017 ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం తాజాగా ఆసియా కప్లో భాగంగా అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ‘టై’ గా ముగియడంతో ధోనితో సహా అభిమానలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేఎల్ రాహుల్ రివ్యూ వృథా చేయడం, ఒక్క పరుగు తీస్తే జట్టు విజయం సాధించే దశలో 140 వన్డేల అనుభవం వున్న రవీంద్ర జడేజా నిర్లక్ష్యంగా ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్ టోర్నీ ఫైనల్లో శుక్రవారం బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్దమైంది. చదవండి: బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా : ధోని -
ఫైనల్లోకి బంగ్లాదేశ్
-
37 పరుగుల తేడాతో పాక్పై బంగ్లాదేశ్ విక్టరీ
-
జరిమానా కోరుకోను...
దుబాయ్: అఫ్గాన్తో మంగళవారం నాటి మ్యాచ్లో అంపైరింగ్ పొరపాట్లపై స్పందించేందుకు ఎంఎస్ ధోని నిరాకరించాడు. ఈ మ్యాచ్లో ధోని, దినేశ్ కార్తీక్లను ఎల్బీగా ప్రకటించడం అంపైరింగ్ లోపాలను ఎత్తిచూపింది. అయినా, వీటిపై మాట్లాడనని ధోని పేర్కొన్నాడు. ‘మ్యాచ్లో జరిగిన కొన్ని ఘటనలపై స్పందించి జరిమానాకు గురికాదల్చుకోలేదు’ అని అతడు వివరించాడు. అఫ్గానిస్తాన్ బాగా ఆడిందని, ఈ పిచ్పై 250 మంచి స్కోరే అని పేర్కొన్నాడు. గెలవకున్నా, ఫలితం పట్ల సంతృప్తి చెందినట్లు తెలిపాడు. -
సమీక్షకు వెళ్లకపోయుంటే...
దుబాయ్: సూపర్–4లో భాగంగా అఫ్గానిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తాను డీఆర్ఎస్ కోరకుండా ఉండాల్సిందని ఓపెనర్ కేఎల్ రాహుల్ అం టున్నాడు. మ్యాచ్లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా రాహుల్ సమీక్ష కోరి దాన్ని వృథా చేశాడు. ఈ ప్రభావం కీలక సమయంలో కనిపించింది. రివ్యూలు లేకపోవడంతో ధోని, దినేశ్ కార్తీక్లు అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి కట్టుబడి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రాహుల్పై విమర్శలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ... బంతి వికెట్కు దూరంగా వెళ్తుందని భావించడంవల్లే రివ్యూకు మొగ్గినట్లు వివరించాడు. ఇకపై మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ ఉదంతం చెబుతోందని పేర్కొన్నాడు. -
భళా... బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్లో 2016నాటి ఫైనల్ మ్యాచ్ పునరావృతం కానుంది. వరుసగా రెండో సారి తుది పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్లాంటి చివరి సూపర్–4 పోరులో గెలుపుతో బంగ్లాదేశ్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (116 బంతుల్లో 99; 9 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, మొహమ్మద్ మిథున్ (84 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 144 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (105 బంతుల్లో 83; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముస్తఫిజుర్ రహమాన్ (4/43) పాక్ను దెబ్బ తీశాడు. భారీ భాగస్వామ్యం... పాక్ లెఫ్టార్మ్ పేసర్లు జునైద్, షాహిన్ ఆఫ్రిది (2/47) ఆరంభంలో బంగ్లాను బెంబేలెత్తించారు. వీరిద్దరి జోరుకు ఆ జట్టు 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సౌమ్య సర్కార్ (0), లిటన్ దాస్ (6)లను వరుస ఓవర్లలో జునైద్ ఔట్ చేయగా, అద్భుత బంతితో మోమినుల్ (5)ను ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ ముష్ఫికర్ జట్టును ఆదుకున్నాడు. మిథున్ అతనికి అండగా నిలిచాడు. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తరహాలోనే ఈ జోడి మరోసారి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పాక్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, కెప్టెన్ సర్ఫరాజ్ వ్యూహలోపాలు కూడా బంగ్లాకు కలిసొచ్చాయి. ఈ క్రమంలో ముందుగా ముష్ఫికర్ 68 బంతుల్లో, ఆ తర్వాత మిథున్ 66 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మిథున్ను ఔట్ చేసి హసన్ అలీ ఈ జోడీని విడదీశాడు. కైస్ (9) ఎక్కువ సేపు నిలబడలేదు. సెంచరీకి చేరువైన సమయంలో కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడిన ముష్ఫికర్ దురదృష్టవశాత్తూ ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ఆఫ్రిది బౌలింగ్లో దూరంగా వెళుతున్న బంతిని ఆడి కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ టోర్నీలో రెండో సెంచరీ అవకాశం చేజారింది. ఆ తర్వాత మహ్ముదుల్లా (25) ఫర్వాలేదనిపించినా... లోయర్ ఆర్డర్ ప్రభావం చూపలేకపోయింది. 42 పరుగుల వ్యవధిలో బంగ్లా చివరి 5 వికెట్లు కోల్పోయింది. తడబడుతూనే... సాధారణ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కూడా సరిగ్గా బంగ్లాలాగే ఆరంభమైంది. ఆ జట్టు 18 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్ జమాన్ (1)ను తొలి ఓవర్లోనే మెహదీ హసన్ వెనక్కి పంపగా... ముస్తఫిజుర్ తన వరుస రెండు ఓవర్లలో బాబర్ ఆజమ్ (1), సర్ఫరాజ్ (10)ల ఆట ముగించాడు. ఇలాంటి స్థితిలో ఇమామ్, షోయబ్ మాలిక్ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే బంగ్లా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్లో కూడా చురుగ్గా ఉండటంతో పరుగులు అతి కష్టంగా వచ్చాయి. వేలికి గాయంతో ఈ మ్యాచ్లో కీలక ఆటగాడు షకీబుల్ హసన్ దూరమైనా ఆ జట్టు పార్ట్ టైమ్ బౌలర్లు చక్కగా రాణించారు. ఇమామ్, మాలిక్ మూడో వికెట్కు 16.4 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే జోడించగలిగారు. మిడ్ వికెట్లో కెప్టెన్ మొర్తజా అద్భుత క్యాచ్ పట్టడంతో మాలిక్ ఇన్నింగ్స్ ముగియగా... భారంగా ఆడిన షాదాబ్ (24 బంతుల్లో 4) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇమామ్ ఉల్ హఖ్ మాత్రం తన పోరాటం కొనసాగించాడు. అతనికి కొద్దిసేపు ఆసిఫ్ అలీ (47 బంతుల్లో 31; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే రెండు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని లిటన్ దాస్ స్టంపౌట్ చేయడంతో పాక్ మ్యాచ్పై ఆశలు కోల్పోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అఫ్గాన్ అద్భుత పోరాటం.. మేటిజట్లకు దీటైన జవాబు!
ఆసియా కప్ ప్రారంభానికి ముందు అందరి దృష్టి భారత్–పాక్ పోరాటం గురించే. కొంతలో కొంత బంగ్లాదేశ్ గురించో, శ్రీలంక గురించో చర్చించుకున్నారు తప్ప అఫ్గానిస్తాన్ను ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద జట్లతో తలపడుతూ 50 ఓవర్ల పాటు నిలవగలిగే సత్తా ఉందా అనే అనుమానాలూ వ్యక్తమమయ్యాయి. కానీ, ఇప్పుడు చూస్తే ఆసియా కప్లో భారత్ తర్వాత మెరుగైన జట్టుగా అఫ్గానే కనిపించింది. సాక్షి క్రీడా విభాగం : ఇంతకాలం ఒకరిద్దరు ఆటగాళ్ల మెరుపులతో, అది కూడా టి20ల్లోనే సంచలన జట్టుగా పేరు తెచ్చుకున్న అఫ్గానిస్తాన్... తాజా ఆసియా కప్ ప్రదర్శనతో వన్డేల్లోనూ తమను ఇంకెంత మాత్రం తీసిపారేయలేరని చాటింది. ఓవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ గెలుపు కోసం ఆపసోపాలు పడుతుంటే, అఫ్గాన్ మాత్రం స్థిరమైన ఆటతో ఆకట్టుకుంది. భయం లేని ఆటతో లీగ్ దశను అలవోకగా ముగించి ఔరా అనిపించింది. సూపర్–4 లోనూ దీటుగానే ఆడినా, ఫినిషింగ్ లోపంతో ఫైనల్ గడప తొక్కలేకపోయింది. అయినప్పటికీ భారత్తో ఆఖరి మ్యాచ్లో పట్టు విడవకుండా ఆడి ‘టై’గా ముగించింది. ఓ విధంగా ఆ జట్టు స్థాయికిది విజయం కిందే లెక్క. కీలక సమయంలో కొంత అదృష్టం తోడై... ఒత్తిడిని ఎదుర్కొనగలిగి ఉంటే అఫ్గాన్ తొలిసారి ఆసియా కప్ తుది పోరుకు చేరి ఉండేది. ఆకట్టుకుంది... భారత్ సంగతి వదిలేస్తే ఆసియా కప్లో శ్రీలంక ముందే జారిపోయింది. బంగ్లాదేశ్ పడుతూ లేస్తోంది. పాకిస్తాన్ ఎప్పటిలాగే అనిశ్చితితో కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్ మాత్రం అన్నింటా ఆకట్టుకుంది. ప్రారంభం నుంచే అన్ని మ్యాచ్ల్లోనూ నిర్ణీత ఓవర్లు ఆడటంతో పాటు సగటున 250 స్కోరు చేసింది. లీగ్ దశలో పరుగుల పరంగానూ (లంకపై 91, బంగ్లాపై 136) భారీ తేడాతో గెలి చింది. టాపార్డర్లో షెహజాద్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీతో పాటు లోయరార్డర్లో రషీద్ ఖాన్, నైబ్ సత్తా చూపారు. బంగ్లాదేశ్పై 8వ వికెట్కు రషీద్–నైబ్ల 95 పరుగుల భాగస్వామ్యం అఫ్గాన్ బ్యాటింగ్ లోతెంతో చాటింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంగళవారం భారత్పై షెహజాద్ విధ్వంసక శతకం సాధించిన తీరు ముచ్చట గొలిపింది. వైవిధ్యమైన స్పిన్ కారణంగా అఫ్గాన్ను అంతా బౌలింగ్ బలం ఉన్న జట్టుగానే పరిగణిస్తున్నారు. కానీ, ఆ జట్టులోని ఆటగాళ్లు మేటి బ్యాట్స్మెన్తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా లీగ్లు ఆడటంతో వారి మానసిక స్థైర్యంతో పాటు బ్యాటింగ్ సామర్థ్యమూ మెరుగైంది. ఇందులో ముఖ్య పాత్ర కోచ్ ఫిల్ సిమ్మన్స్దే. బౌలింగ్లో పటిష్ఠంగా ఉన్నా, బ్యాటింగ్లో మెరుగు పడాల్సిన అవసరాన్ని సిమ్మన్స్ గుర్తించాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎలాగో అతడు బ్యాట్స్మెన్కు నేర్పాడు. దాని ఫలితమే... ఆసియా కప్లో కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సహా షెన్వారీ, నైబ్, రహ్మత్ షా, షాహిదిల ఇన్నింగ్స్లు. టోర్నీలో వీరంతా కనీసం ఒక అర్ధ శతకం సాధించడం విశేషం. అడపాదడపా విజయాలు సాధించినా, పెద్ద జట్లు పాల్గొనే టోర్నీల్లో అఫ్గానిస్తాన్ ఎలా ఆడుతుందో అనే దానిపై ఇప్పటి వరకు అనుమానాలుండేవి. ఆసియా కప్తో వాటికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా వన్డేల్లో మరో బలమైన జట్టు తయారవుతోందని తేలింది. అయితే, ఈ క్రమంలో అఫ్గాన్కు కావాల్సింది నిలకడ, అనుభవం. ఒత్తిడిని తట్టుకుంటూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపైనా మెరుగైన ఆట కనబర్చాల్సి ఉంది. ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్లు కాకుండా... ఆసాంతం సాధికారికంగా సాగే బ్యాటింగ్ కావాలి. ఇప్పటికి 250కి అటుఇటుగా పరుగులు చేయడమే ఆ జట్టుకు పెద్ద స్కోరవుతుంది. మరింత ముందుకెళ్లాలంటే కనీసం 300కు దగ్గరగా అయినా రావాలి. అప్పుడే, విదేశాల్లోనూ విజయాలు సాధ్యమవుతాయి. -
బంగ్లాతో మ్యాచ్: పాకిస్తాన్ లక్ష్యం 240
అబుదాబి : ఆసియాకప్లో భాగంగా ఫైనల్ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్కు బంగ్లాదేశ్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బౌలర్ జునైద్ ఖాన్ (4/20) దాటికి బంగ్లా 239 పరుగులకు ఆలౌట్ అయింది. ముస్తాఫికర్ రహీమ్ 99(116 బంతుల్లో 9 ఫోర్లు), మహ్మద్ మిథున్ 60(84 బంతులు, 4 ఫోర్లు), మహ్మదుల్లా (25)లు రాణించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కష్టాల్లో ఉన్న బంగ్లాను రహీమ్, మిథున్లు ఆదుకున్నారు. ఈ క్రమంలో రహీమ్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ నాలుగు, సహీన్ షా అఫ్రిది, హసన్ అలీ రెండు వికెట్లు తీయగా షాదబ్కాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుందన్న విషయం తెలిసిందే. -
మ్యాచ్ టై అయిందని..తండ్రి ఎంత ఓదార్చిన!
-
‘ఏడవకురా చిన్నోడా.. మనం ఫైనల్ గెలుస్తాం’
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా మంగళవారం భారత్-అఫ్గానిస్తాన్ మ్యాచ్లో ఓ భావోద్వేగపు సన్నివేశం చోటుచేసుకుంది. అసాంతం అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో క్రికెట్పై అభిమానులకు ఉన్న ప్రేమ ఏంటో ప్రతిబింబించింది. ఇటీవలె హాంకాంగ్తో మ్యాచ్ సందర్భంగా ఓ పిల్లోడు తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని ఔటయ్యాడని.. ఏడుస్తూ మారం చేయడం మనమంతా చూశాం. అచ్చు అలాంటి సీన్ నిన్నటి మ్యాచ్లోనూ రిపీట్ అయింది. దాదాపు భారత్ గెలుపు కాయమనుకున్న తరుణంలో జడేజా ఔటవ్వడం.. మ్యాచ్ టై కావడం ఓ సిక్కు పిల్లాడు తట్టుకోలేకపోయాడు. ఓవైపు మైదానంలో అఫ్గాన్ ఆటగాళ్లు గెలిచామనే సంతోషంతో సంబురాలు చేసుకుంటుంటే.. మరోవైపు గ్యాలరీలో ఈ చిన్నోడు మాత్రం కళ్లలోంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నాడు. పక్కనే ఉన్న తన తండ్రి ఎంత ఓదార్చిన ఆ చిన్నోడు మాత్రం తన బాధను ఆపుకోలేకపోయాడు. టీవీల ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు ఇది చూసి అయ్యో అని బాధపడ్డారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ చిన్నోడు ఓదారుస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆ అబ్బాయిని చూస్తే బాధేస్తుంది. కానీ ఈ రోజు ఇది ఓ అందమైన క్షణం’ అని ఒకరు..ఈ మ్యాచ్ను ఎప్పటికి మరిచిపోలేరని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం ‘ఏడవకురా చిన్నోడా.. మనం ఫైనల్ గెలుస్తాం’ అని ట్వీట్ చేశాడు. Koi na putt Rona Nahi hai final aapa jittange 🇮🇳🇮🇳😘 pic.twitter.com/fjI0DWeBoy — Harbhajan Turbanator (@harbhajan_singh) September 25, 2018 This little kid crying after the match gets tied has to be the cutest moment of the day 😭❤️ #INDvAFG pic.twitter.com/dXXMW7q6Xf — Harsh Mittal (@Bhand_Engineer) September 25, 2018 -
బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా : ధోని
దుబాయ్ : మైదానంలో ఎప్పుడూ మిస్టర్ కూల్గా వ్యవహరించే టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి కోపమొచ్చింది. ఆసియాకప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తనదైన కెప్టెన్సీతో భారత్కు ఎన్నో విజయాలు అందించిన ధోని.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో బౌలర్లను అంతగా అనుమతించడు. అయితే, ఫీల్డర్ను తను చెప్పిన చోట కాకుండా.. వేరే చోటుకు మారుస్తున్న కుల్దీప్పై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ చేస్తావా..! లేదా మరో బౌలర్ని పిలవాలా..!’అంటూ వ్యాఖ్యానించాడు. ఇది అక్కడున్న మైక్రోఫోన్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : ‘ధోనిని ఔట్ చేసింది రాహులే’) మిస్టర్ కూల్కి కోపం తెప్పించిన కుల్దీప్పై కామెంట్ల వర్షం కురుస్తోంది. ధోనికే ఫీల్డర్ను ఎక్కడ పెట్టాలో చెప్తావా.. అనుభవించు అంటూ పలువురు చమత్కరిస్తున్నారు.ఎంతో సాఫ్ట్గా, కూల్గా కనిపించే ధోనీ మైదానంలో ఆటగాళ్ల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటాడు. వాళ్లపై తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తుంటాడు. గతంలోనూ ఓసారి శ్రీశాంత్కు ధోనీ ఇలాగే వార్నింగ్ ఇచ్చాడు. ‘ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్ఫ్రెండ్ లేదు.. కొంచెం ఇక్కడ ఫీల్డింగ్ చెయ్’. అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ధోని ఈ మ్యాచ్కు కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. కాగా, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు చివరి ఓవర్లో విజయానికి భారత్కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. (చదవండి : ఊరించి... ఉత్కం‘టై’) Kuldeep Yadav asking Dhoni to change fielder's location Dhoni : "Bowling karega ya bowler change kare". 😂😂#INDvAFG #AsiaCup2018 pic.twitter.com/mlYzatzKAS — Amit Jaiswal 🗣️ (@iamamitjaiswal) September 25, 2018 -
భళారే అఫ్గాన్ భళా !
దుబాయ్ : ఆసియాకప్లో అఫ్గానిస్తాన్ ప్రదర్శన ఔరా అనిపించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో బలమైన భారత్ను ఓడించినంత పనిచేసింది. ఓటమి అంచుల్లో ఉన్న ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా చివరి వరకు పోరాడి మ్యాచ్ను కాపాడుకుంది. భారత్తోనే కాకుండా టోర్నీ అద్యాంతం తమ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ ఆటతో తమది పసికూన జట్టు కాదని క్రికెట్ను శాసించే దేశాలను హెచ్చిరించింది. అఫ్గాన్ ఆటగాళ్ల ప్రదర్శనకు మాజీ క్రికెటర్లు, అభిమానులు సలాం కొడుతున్నారు. ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత్తో డ్రా అంటే గెలిచినట్టేనని, భారత అభిమానులే కొనియాడుతున్నారు. (చదవండి: నేను రివ్యూకు వెళ్లాల్సింది కాదు) ‘క్రికెట్లోనే ఇదో గొప్ప మ్యాచ్. వరల్డ్ క్లాస్ జట్టు అయిన భారత్పై అఫ్గానిస్తాన్ ప్రదర్శన అత్యద్భుతం. మహ్మద్ షజాద్ శతకానికి అర్హుడే. అఫ్గాన్ ఆటగాళ్ల పురోగతి అద్భుతం. యావత్ క్రికెట్ ప్రపంచం చూడాల్సిన మ్యాచే’- షాహిద్ అఫ్రిదీ (పాకిస్తాన్ మాజీ క్రికెటర్) ‘అఫ్గాన్కు ఇదో ప్రత్యేకమైన రోజు. భారత్పై డ్రా సాధించడం.. ప్రతి ఆఫ్గాన్ ఆటగాడికి ఓ మైలురాయి కాకుండా గర్వకారణం కూడా. అఫ్గాన్ జట్టులో ఎదో ప్రత్యేకత ఉంది’-వీవీఎస్ లక్ష్మణ్ ‘దీనికి అఫ్గాన్ ఆటగాళ్లు అర్హులే. మ్యాచ్ డ్రా అయింది కానీ వారి ప్రదర్శనను చూసి నమ్మలేకపోతున్నా. అఫ్గాన్ గర్వించాల్సిందే. వారు నిజమైన విన్నర్స్’- కైఫ్ This must be a special day for @ACBofficials . Securing a tie against Team India is a monumental achievement and every Afghanistan player can be very proud of their grit and fight. There is something special in this Afghanistan team, have been most impressivein Asia Cup #INDvAFG — VVS Laxman (@VVSLaxman281) September 25, 2018 Afghanistan captain Asghar Afghan "When you tie a match against a team like India, it means you won" #INDvAFG #Asiacup2018 — Saj Sadiq (@Saj_PakPassion) September 25, 2018 Such a great game of cricket 🏏 !! An outstanding performance by team Afghanistan 🇦🇫 @ACBofficials against the world class indian team !! @MShahzad077 a well deserved 💯 !! https://t.co/CEIZ1MHJuz — Shahid Afridi (@SAfridiOfficial) September 25, 2018 (చదవండి: ఊరించి... ఉత్కం‘టై’) -
ధోని చమత్కారం
దుబాయ్: తాను జరిమానా ఎదుర్కొవడానికి సిద్ధంగా లేనని మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని చమత్కరించాడు. అఫ్గానిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్ ఫలితంపై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘ఛేజింగ్లో మేము ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్ల నుంచి శుభారంభం లభించినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్ది బౌలర్లకు పిచ్ అనుకూలంగా మారింది. ఎవరో ఒకరు బాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు మేము పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. సరిపడా స్పిన్నర్లు కూడా లేరు. సీమర్లు స్వింగ్ చేయలేకపోయారు. దీంతో ఆరంభంలో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నామ’ని తెలిపాడు. రనౌట్లు, మరికొన్ని అంశాలు(తప్పుడు ఎల్బీ నిర్ణయాలు) కారణంగానే మ్యాచ్ను ఫలితం తేలకుండా ముగించాల్సి వచ్చిందన్నాడు. వాటి (అంపైర్ల నిర్ణయాలు) గురించి మాట్లాడి జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదని సరదాగా అన్నాడు. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు చాలా బాగా ఆడారని కితాబిచ్చాడు. ఈ పిచ్లో 250 పరుగులు చాలా మంచి స్కోరని, ఈ మ్యాచ్ను బాగా ఆస్వాదించామని పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్ బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా ఉందని ధోని మెచ్చుకున్నాడు. -
నేను రివ్యూకు వెళ్లాల్సింది కాదు: రాహుల్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో పసికూన అఫ్గానిస్తాన్ బలమైన భారత్ను ఓడించినంత పనిచేసిన విషయం తెలిసిందే. సులువుగా గెలవాల్సిన ఈ మ్యాచ్ అంపైర్ తప్పిదాలతో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు అసలు సిసలు క్రికెట్ మ్యాచ్ రుచి చూపించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం అభిమానులు ఎవరికి తోసిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ‘ఛ.. ధోని, కార్తీక్లు కొద్దిసేపు క్రీజులో ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు.. అంపైర్ తప్పుడు నిర్ణయం సవాల్ చేసే అవకాశం లేకపోయే.. అసలు కేఎల్ రాహుల్ ఎందుకు ఉన్న ఒక్క రివ్యూ వృథా చేశాడు.’ అని అతనిపై నిందేస్తున్నారు. ధోని ఔట్ కావడానికి కూడా రాహులే కారణమంటూ మండిపడుతున్నారు. (చదవండి: ‘ధోనిని ఔట్ చేసింది రాహులే’) మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను రివ్యూకు తీసుకోవాల్సింది కాదని చెప్పుకొచ్చాడు. ‘ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను. అలా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను. మేం బాధపడటం లేదు బంతి నెమ్మదిగా స్పిన్ అవుతోంది. ఇది మిడిలార్డర్ బ్యాట్స్మెన్కు చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కూడా దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడాడు. కేదార్ జాదవ్తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో జడేజా,దీపక్ చహల్ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఓపెనర్గా బరిలోకి దిగినప్పుడే మిడిలార్డర్పై ఒత్తిడి లేకుండా చేయాలనుకున్నాను’ అని తెలిపాడు. చివరి ఓవర్లో విజయానికి భారత్కు 7 పరుగులు కావాలి. క్రీజ్లో జడేజా ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా అఫ్గాన్ సంచలనం జడేజాను బోల్తా కొట్టించాడు. జడేజా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ కావడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. (చదవండి: ఊరించి... ఉత్కం‘టై’) -
‘ధోనిని ఔట్ చేసింది రాహులే’
దుబాయ్: ఆసియా కప్లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే విజయం టీమిండియాదే అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఓటమి అంచులదాకా వెళ్లి స్కోర్ సమంచేసి ‘టై’ తో సంతృప్తి పడింది. అయితే మ్యాచ్ టై కావడానికి, ధోని ఔట్ కావడానికి ఓపెనర్ కేఎల్ రాహులే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు కదా, మరి ఫ్యాన్స్ ఎందుకు విమర్శిస్తున్నారనుకుంటున్నారా.. రివ్యూను వృథా చేయడమే రాహుల్ చేసిన పొరపాటు. అఫ్గాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్కు ప్రయత్నించి రాహుల్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే దీనిపై అనుమానంగానే రివ్యూకి వెళ్లాడు. కానీ క్లియర్గా రాహుల్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో భారత్ ఉన్న ఒక్క రివ్యూ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అహ్మదీ బౌలింగ్లో అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికి రివ్యూ లేకపోవడంతో ధోని మైదానాన్ని వీడాల్సివచ్చింది. అయితే రివ్యూ మిగిలివుంటే ధోని అవుటయ్యేవాడు కాదని, మ్యాచ్ టై గా ముగిసేది కాదని అభిమానుల వాదన. అయితే ఇంగ్లండ్ సిరీస్లోనూ రివ్యూ సరిగ్గా ఉపయోగించకుండా వృథా చేశాడని నెటిజన్లు గుర్తుచేశారు. రాహుల్ డీఆర్ఎస్ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడని, దీనిపై అతడికి ధోనితో ప్రత్యేక క్లాస్లు చెప్పించాలని కామెంట్ చేస్తున్నారు. ఎంఎస్ ధోని 200వ వన్డేకు నాయకత్వం వహిస్తున్న మ్యాచ్ గెలవకుండా అడ్డుకుంది రాహులే అని మరికొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరు ఔటయ్యారంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఊరించి... ఉత్కం‘టై’ -
టీమిండియాతో పోలికా.. వద్దు: భజ్జీ
ముంబై: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా దాయాది దేశమైన పాకిస్తాన్పై రెండు అపురూప విజయాలు సాధించింది. దీంతో రోహిత్ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్లను సీనియర్ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆసియా కప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్లు సెంచరీలు చేసి విజయం సులభం చేశారన్నారు. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ సారథి ఎంఎస్ ధోని అనుభం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. పాకిస్తాన్ జట్టులో షోయబ్ మాలిక్ మినహా ఎవరూ గొప్పగా రాణించటం లేదని భజ్జీ వివరించాడు. ‘రోహిత్ క్లాస్ ఆటగాడు, ధావన్ ప్రతిభావంతుడు. బుమ్రా, భువనేశ్వర్లు వంటి సమర్థవంతమైన ఆటగాళ్లు ఉండటంతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. అనుభవం కలిగిన ధోని ఉండటం ప్రధాన బలం. అందుకే ఆసియా కప్ గెలిచే అర్హత ఒక్క టీమిండియాకు మాత్రమే ఉంది. చిరాకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియాను పోల్చవద్దు. రెండు జట్ల మధ్య చాలా తేడా ఉంది. పాకిస్తాన్ గెలవడానికి ఆడదు.. కేవలం ఆడుతుంది. ఆదివారం మ్యాచ్లో టాస్ గెలిచి విశ్వాసంతో బ్యాటింగ్ ఎంచుకున్నపాక్.. మాలిక్ మినహా ఎవరూ పోరాడే ప్రయత్నం కూడా ప్రదర్శించలేదు. ప్రసుత పాక్ జట్టు టీమిండియాకు పోటీనే కాదు.అంటూ హర్భజన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది: హర్భజన్ -
‘టై’గా ముగిసిన భారత్, అఫ్గానిస్తాన్ పోరు
-
ఊరించి... ఉత్కం‘టై’
దుబాయ్: చివరి ఓవర్లో విజయానికి భారత్కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్ ఈ మ్యాచ్లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్ సగర్వంగా ఆసియా కప్ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్కు 110 పరుగులు జోడించారు. నేడు జరిగే చివరి సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో ఆడుతుంది. రాణించిన నబీ... అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచిన అంశం ఓపెనర్ షహజాద్ అద్భుత బ్యాటింగ్. టాప్–6 లో మిగతా ఐదుగురు విఫలమైన చోటు అతనొక్కడే మెరుపు ప్రదర్శనతో జట్టును నడిపించాడు. దీంతో పాటు చివర్లో నబీ ఆడిన ఇన్నింగ్స్ అఫ్గాన్కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనుభవం తక్కువగా ఉన్న భారత పేసర్లు తడబడటంతో షహజాద్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 పరుగుల వద్ద మిడాఫ్లో సునాయాస క్యాచ్ను రాయుడు వదిలేయడంతో బతికిపోయిన షహజాద్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది. అయితే స్పిన్నర్లు రంగప్రవేశం చేసి మరో ఎండ్లో అఫ్గాన్ లైనప్ను దెబ్బ తీశారు. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అహ్మదీ (5), రహ్మత్ (3)లను జడేజా ఔట్ చేయగా... వరుస బంతుల్లో హష్మతుల్లా (0), అస్గర్ (0)లను కుల్దీప్ పెవిలియన్ పంపించాడు. అయితే షహజాద్ మాత్రం జోరు తగ్గించలేదు. తన ధాటిని కొనసాగించిన అతను చహర్ బౌలింగ్లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి 88 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 131 కాగా, షహజాద్వే 103 పరుగులు ఉండటం అతని బ్యాటింగ్ దూకుడును చూపిస్తోంది. ఎట్టకేలకు జాదవ్ ఈ మెరుపు బ్యాటింగ్కు ముగింపు పలికాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాఫ్లో క్యాచ్ ఇవ్వడంతో షహజాద్ ఆట ముగిసింది. అయితే మరో ఎండ్లో నబీ కూడా ధాటిని ప్రదర్శించాడు. 45 బంతుల్లోనే అతనూ హాఫ్ సెంచరీ సాధించి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి పది ఓవర్లలో అఫ్గానిస్తాన్ 63 పరుగులు చేసింది. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు కొత్త ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, రాయుడు అఫ్గాన్ బౌలర్లపై చెలరేగారు. 10 పరుగుల వద్ద రాయుడుకు అదృష్టం కలిసొచ్చింది. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే అవకాశం కనిపించినా... అఫ్గాన్ జట్టు రివ్యూ కోరకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు దూసుకుపోయారు. ముఖ్యంగా గుల్బదిన్ వేసిన 4 ఓవర్ల స్పెల్లో భారత్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు రాబట్టింది. ముందుగా 43 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయిన అతను వెనుదిరిగాడు. తర్వాతి బంతికే హాఫ్ సెంచరీని చేరుకున్న రాహుల్ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ధోని (8) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అహ్మదీ బౌలింగ్లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా... భారత్ అప్పటికే రివ్యూ కోల్పోవడంతో మరో అవకాశం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్స్టంప్కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. పాండే (8) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జాదవ్ (19) రనౌట్ కాగా, కార్తీక్ (66 బంతుల్లో 44; 4 ఫోర్లు) కూడా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత అనుభవం లేని భారత బ్యాటింగ్ తీవ్ర ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. -
చెలరేగిన షెజాద్.. భారత్ లక్ష్యం 253
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ 124(116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లు) శతకంతో చెలరేగాడు. షెజాద్కు తోడు మహ్మద్ నబీ 64(56 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్కు 253 పరుగుల లక్ష్యం నమోదైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్కు మంచి శుభారంభం అందింది. షెజాద్ వచ్చిరాగానే భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్వే 60 పరుగులు ఉండటం గమనార్హం. అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5)ని బోల్తాకొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0)ల వికెట్లను వరుసగా కోల్పోయింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఓవైపు వికెట్లు పడుతున్న షేజాద్ దాటిగా ఆడుతూ.. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో కెరీర్లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. ఈ తరుణంలో తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న దీపక్ చహర్, నయీబ్(15) వికెట్ను పడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీ సైతం ఫోర్లు, సిక్స్లతో చెలరేగాడు. కష్టంగా మారిన సెంచరీ హీరో షేజాద్ వికెట్ను పార్ట్టైం బౌలర్ కేదార్ జాదవ్ పడగొట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జద్రాన్(20)ను జడేజా పెవిలియన్కు చేర్చాడు. వేగంగా ఆడే క్రమంలో నబీ(64) సైతం క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివర్లో రషీద్ ఖాన్(12), అలామ్(2)లు వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడటంతో అప్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, చహర్, జాదవ్లు తలా ఓ వికెట్ తీశారు. -
కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ : రాక్స్టార్స్ను తలిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటిపై ఎన్ని టాటూలు ఉన్నాయ్? అవి ఏంటో తెలుసా..? తెలియాలంటే మాత్రం ఈ వార్త చదవాల్సిందే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ప్రసారమైన మెగా ఐకాన్స్ ఎపిసోడ్లో కోహ్లే ఈ పచ్చబొట్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘చిన్నతనం నుంచే పచ్చబొట్లు వేసుకునే అలవాటు ఉంది. తరువాత ఈ టాటులు మనకు ఎదో సొంత గుర్తింపునిస్తాయని అర్థమైంది. నా మోచితిపై ఉన్న లార్డ్ శివ టాటూ నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో ప్రతిబింబిస్తోంది.’ అని తెలిపారు. ఇలా తన ప్రయాణంలోని విజయాలకు చిహ్నంగా కోహ్లి మొత్తం 9 పచ్చబొట్లు పొడిపిచ్చుకున్నాడు. మూడేళ్లప్పుడే క్రికెట్కు పరిచయం చేసిన తన తల్లిదండ్రులపై తనకున్న ప్రేమకు చిహ్నంగా ప్రేమ్, సరోజ్ పేర్లను టాటులుగా మజిల్స్పై వేసుకున్నాడు. తన ఆరాధ్యదైవమైన లార్డ్ శివ పచ్చబొట్టును మోచేతిపై, దీని పక్కనే 22 అడుగుల పిచ్కు చిహ్నంగా ఓ మఠం గుర్తును పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు. వన్డే, టెస్ట్ అరంగేట్ర మ్యాచ్లో అందుకున్న క్యాప్ నెంబర్స్ 175, 269 నెంబర్లను, తన దూకుడుకు చిహ్నంగా ట్రైబల్ టాటూను వేసుకున్నాడు. తన జన్మ రాశి అయిన వృశ్చిక రాశిని తెలియజేసేలా జోడియాక్ స్టైల్లో కుడి మజిల్పై స్కార్పియో అని రాయించుకున్నాడు. ఎడమ చేతిపై జపనీస్ సమురై అనే పెద్ద టాటూను న్యాయం, ధైర్యం, దయాగుణం, సభ్యత, గౌరవం, భక్తి, నిజాయితీలకు చిహ్నంగా, కుడి భుజంపై దేవుడి కన్నును టాటుగా వేయించుకున్నాడు. దేవుడి కన్ను టాటూ తనకు ప్రత్యేకమని తెలిపాడు. దీనిపైన ఓం గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. ఈ పదాన్ని ప్రపంచంలోనే అందరూ ఒకేలా పలుకుతారని చెప్పుకొచ్చాడు. కోహ్లి టాటూ చిత్రాలు కోసం కింది స్లైడ్ షోను క్లిక్ చేయండి -
సంచలనం: భారత్పై అఫ్గాన్ ఓపెనర్ సెంచరీ
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ సంచలన బ్యాటింగ్తో సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో కెరీర్లో 5వ శతకం పూర్తిచేసుకున్నాడు. వచ్చిరావడంతోనే దాటిగా ఆడిన ఈ అఫ్గాన్ ఓపెనర్ ఫోర్లు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. అనంతరం భారత స్పిన్నర్ల దాటికి అఫ్గాన్ 17 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయినా చెక్కుచెదరని షెజాద్ తన దూకుడు కొనసాగించాడు. 90 పరుగులనంతరం కొంత నెమ్మదిగా ఆడిన ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్పై సెంచరీ సాధించిన తొలి అఫ్గాన్ బ్యాట్స్మన్గా షెజాద్ గుర్తింపు పొందాడు. -
అఫ్గాన్ దూకుడు.. బ్రేకేసిన బౌలర్లు
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ (56; 43 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికిది వరుసగా రెండో అర్ధశతకం కావడం విశేషం. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్వే 60 పరుగులు ఉండటం గమనార్హం. అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5) బోల్తాకొట్టించాడు. ధోని మార్క్ కీపింగ్తో జావెద్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ మిస్.. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. ఇక కుల్దీప్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయ్యింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో భారత్కు మహేంద్రసింగ్ ధోని సారథిగా వ్యవహరిస్తుండటం విశేషం. మరోవైపు షెజాద్ దాటిగా ఆడుతూ సెంచరీ చేరువగా ఉన్నాడు. -
మళ్లీ ధోని కెప్టెన్ అయ్యాడోచ్..
దుబాయ్: సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎస్ ధోని మరొకసారి టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఆసియాకప్లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగానే టాస్కు టీమిండియా తరపున ఫీల్డ్లోకి ధోని రావడంతో స్టేడియంలో ఒకింత ఆశ్చర్యం నెలకొనగా, మరొకవైపు మంచి జోష్ కనిపించింది. ఈ మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లకు విశ్రాంతి నివ్వడంతో ధోనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పింది టీమిండియా మేనేజ్మెంట్. దాంతో కెప్టెన్సీలో ‘డబుల్ సెంచరీ’ కొట్టనున్నాడు ధోని. ఇప్పటివరకూ 199 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించిన ధోని.. తాజా మ్యాచ్తో మరో అరుదైన మార్కును చేరబోతున్నాడు. గతంలో ధోని సారథ్యంలో భారత్ జట్టు 199 వన్డేలకు గాను 110 గెలవగా, 74 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. కాగా, 97 మ్యాచ్ల్లో ధోని టాస్ గెలవడం ఇక్కడ మరో విశేషం. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన అస్ఘార్ అఫ్గాన్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటికే భారత్ ఫైనల్కు చేరగా, అఫ్గాన్ పోరు నుంచి నిష్క్రమించింది. దాంతో ఇరు జట్లుకు ఇది నామమాత్రపు మ్యాచ్. ఆ క్రమంలోనే భారత జట్టు ప్రయోగాలకు సిద్ధమైంది. దీంతో జట్టులోకి కేఎల్ రాహుల్, మనీష్ పాండే, దీపక్ చాహర్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్లు వచ్చారు. భారత తుది జట్టు: కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, సిద్దార్థ్ కౌల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ అఫ్గాన్ తుది జట్టు: మొహ్మద్ షహజాద్, జావెద్ అహ్మాదీ, రెహ్మాత్ షా, హస్మతుల్లా షాహిది, అస్ఘార్ అఫ్గాన్, నజీబుల్లా జద్రాన్, మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయిబ్, అలమ్, ముజిబ్ ఉర్ రహ్మాన్ -
ధోనిని చూసే కెప్టెన్సీ నేర్చుకున్నా: కోహ్లి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని నుంచే నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. ఓ ఇంట్వర్వూలో మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోని నుంచే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి ధోనితో ఎప్పుడూ ఆట గురించే మాట్లాడుతుంటాను. నేను వైస్ కెప్టెన్ కాకముందే అతనితో నా సలహాలు సూచనలు పంచుకునేవాడిని. నాకు ఆట గురించి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. అందుకే కెప్టెన్సీని ఎంతో ఆస్వాదిస్తాను. ఆటలో చేజింగ్ అంటే ఇష్టపడతాను. ఆట జరుగుతున్నంత సేపు నా మెదడుకు పనిపెడుతూనే ఉంటాను. ధోని నుంచి ఎంతో నేర్చుకున్నాను. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు దగ్గరగా అతని ఆటతీరును పరిశీలించేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు.. కోహ్లికి వికెట్ల వెనక ఉండి తనవంతు సహకారం అందిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారమే ధోని ఓ సీనియర్గా తన సలహాలు, సూచనలందిస్తూ కోహ్లి అండగా నిలుస్తున్నాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్లో తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ధోని సలహాలు, సూచనలతోనే విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే. -
మా కెప్టెన్కు బుర్ర కూడా లేదు..!
దుబాయ్: ఆసియా కప్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే భారత-పాకిస్తాన్ జట్ల గురించి చర్చ మొదలైంది. ఈ ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం తప్పదని అంతా భావించారు. కానీ ఈ పోరాటంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ఇలా టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడుతున్నారు.ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనే కెప్టెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆసియా కప్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. సర్ఫరాజ్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అతనికి ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా లేదు. అసలు అతనికి బుర్రే లేదు. అతను క్రికెట్కు సరిపోడు' అని ఒక అభిమాని విమర్శించగా, ‘సర్ఫరాజ్ ఓవర్రేటెడ్ ప్లేయర్. పాక్ జట్టుకు గతంలో ఎంపిక కూడా కాలేదు’ అని మరొకరు విమర్శించారు. ‘అత్యంత సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్ ఒకరు. అతని కెప్టెన్సీని ఇక మేం అంగీకరించం’ మరొక అభిమాని మండిపడగా, ‘భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది అత్యంత అవమానకర ఓటమి. ఫైనల్స్లో సర్ఫరాజ్ను చూడాలనుకోవడం లేదు’ అని మరో పాక్ అభిమాని అసహనం వ్యక్తం చేశారు. -
‘మా జట్టుకు ఓటమి భయం పట్టుకుంది’
దుబాయ్: ప్రస్తుత ఆసియాకప్లో టీమిండియాతో తలపడిన రెండు సందర్భాల్లోనూ పాకిస్తాన్ను ఘోర పరాజయం వెక్కిరించింది. దాంతో పాకిస్తాన్ కోచ్ మికీ ఆర్థర్ తమ జట్టు పేలవ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. భారత్పై పాక్ ఆటతీరు పట్ల పెదవి విరిచిన ఆర్థర్.. తమ జట్టు చేసిన చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని విమర్శించాడు. ‘మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించింది. మా ఆటగాళ్లకు ఓటమి భయం పట్టుకుంది. క్రికెట్ జట్టుగా మేం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సి ఉంది’ అని ఆర్థర్ తెలిపాడు. ‘భారత్లో చాలా మంచి ఆటగాళ్లున్నారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆదివారం జరిగిన మ్యాచ్లో అదే జరిగింది. బ్యాటింగ్లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు, బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలి. మాకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇలాంటి వికెట్పై ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తే ఆధిపత్యం చెలాయిస్తారు. మేం వాస్తవికంగా ఆలోచించాలి. అద్భుతమైన భారత జట్టు చేతిలో ఓడాం. మా ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు కనబడుతున్నారు’ ఆర్థర్ ఎద్దేవా చేశాడు. చదవండి: మరీ ఇంత దారుణంగా ఓడిపోతారా? -
ఆసియాకప్లో ఫిక్సింగ్ కలకలం!
దుబాయ్: ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేగింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ను స్పాట్ ఫిక్సింగ్ చేయమని కొంతమంది బుకీలు కలిశారు. ఈ విషయాన్ని షహజాద్.. టీమ్ మేనేజ్మెంట్కు తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) యాంటీ కరెప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది. వచ్చే నెల్లో షార్జాలో జరుగనున్న అఫ్గాన్ ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్జాద్ తెలిపాడు. దీనిపై అలెక్స్ మార్షల్ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. ‘షహజాద్ను ఫిక్పింగ్కు పాల్పడమని కొంతమంది కలిసిన ఘటన వెలుగు చూసింది. అది అఫ్గాన్ టీ20 లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు ప్రేరేపించారు. కాగా, దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది’ అని మార్షల్ తెలిపారు. -
వెల్డన్ టీమిండియా: కోహ్లి
న్యూఢిల్లీ: ఆసియాకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టును రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభినందించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. టీమిండియా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా తన ట్వీటర్ అకౌంట్లో జట్టుకు అభినందనలు తెలియజేశాడు. ప్రధానంగా సూపర్ -4 స్టేజ్లో పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని కోహ్లి ప్రస్తావిస్తూ.. ‘వెల్డన్ బాయ్స్. మ్యాచ్ను చాలా ఎంజాయ్ చేశా. ఇదొక అద్భుత విజయం’అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను 237 పరుగులకే కట్టడి చేసిన భారత్..ఆపై 39.3 ఓవర్లలో విజయాన్ని అందుకుని ఫైనల్కు చేరుకుంది. భారత్ విజయంలో శిఖర్ ధావన్(114), రోహిత్ శర్మ(111)లు కీలక పాత్ర పోషించారు. ఈ జోడి మొదటి వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. -
జైత్రయాత్ర కొనసాగాలి
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దుమ్మురేపుతున్న భారత్ ఆసియా కప్లో మరో విజయంపై కన్నేసింది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని టీమిండియా... మంగళవారం జరిగే సూపర్–4 పోరులో అఫ్గానిస్తాన్తో ఆడనుంది. వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత్కు, రేసులో లేని అఫ్గాన్కు ఇది నామమాత్రమైన పోరు. ఈ మ్యాచ్లో ఓడితే భారత్కు పోయేది, గెలిస్తే అఫ్గాన్కు వచ్చేదీ ఏమీ లేదు. అయితే ఫైనల్కు ముందు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ భారత్కు ఉపయోగపడుతుంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు అవకాశముంటుంది. మరోవైపు సూపర్–4లో ఆడిన రెండు మ్యాచ్లూ ఓడిన అఫ్గానిస్తాన్ విజయంతో ఊరట పొందాలని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమే అయినా భారత్పై సత్తాచాటేందుకు అఫ్గాన్ తహతహలాడుతోంది. బెంబేలెత్తించే బౌలింగ్... ఒక్క హాంకాంగ్తో మ్యాచ్లోనే భారత బౌలింగ్ గతి తప్పింది. అయితే ఆలస్యంగానైనా ఆ జట్టు పని పట్టారు భారత బౌలర్లు. ఆ తర్వాత ప్రతీ మ్యాచ్లోనూ ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నువిరిచారు. దీంతో భారత్ భారీ విజయాలను సాధిస్తూ వచ్చింది. ఈ టోర్నీలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు నిలకడగా బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ను రెండుసార్లు కట్టడి చేశారు. బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అందరికంటే మెరుగ్గా బుమ్రా సగటున 3.37 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీయగా, భువనేశ్వర్ 4.08 సగటుతో 6 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లిద్దరూ ఐదేసి వికెట్లు చేజిక్కించుకున్నారు. చాన్నాళ్ల తర్వాత వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రభావం చూపాడు. మిడిలార్డర్పై దృష్టి... భారత టాపార్డర్ జోరు అసాధారణం. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఎలాంటి బౌలింగ్నైనా తుత్తునీయలు చేస్తున్నారు. మరీ ప్రత్యేకించి శిఖర్ టాప్ ఫామ్లో ఉన్నాడు. రెండు సెంచరీలతో 327 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ సెంచరీ, అర్ధసెంచరీలతో 269 పరుగులు చేశాడు. వీరిద్దరి ప్రదర్శనతో మిడిలార్డర్కు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. వీళ్లలో అంబటి రాయుడు (116 పరుగులు) కాస్త ఎక్కువగా క్రీజ్లో నిలిచాడు. ఓపెనర్ల ప్రదర్శనతో మిగతావాళ్లలో ఎవరూ ఆ మాత్రం ఆడే అవకాశం పొందలేకపోయారు. ఈ టోర్నీలో లీగ్, సూపర్–4లో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లాడినా... దినేశ్ కార్తీక్ 78 బంతులు, ధోని 40 బంతులు, కేదార్ 27 బంతులే ఎదుర్కొన్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అయిన వీరు ఎదుర్కొన్న బంతులు తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ఏమంత గట్టి ప్రత్యర్థి కాదు కాబట్టి మిడిలార్డర్ బ్యాటింగ్ ప్రాక్టీస్కే టీమ్ మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఫైనల్ ఒత్తిడిని తట్టుకొని రాణించే వీలు ఈ ప్రాక్టీస్ కల్పిస్తుంది. ఫైనల్లో అందరూ బ్యాట్ ఝళిపించేందుకు అవకాశముంటుంది. బంగ్లాతో మ్యాచ్లో రోహిత్ మాజీ కెప్టెన్ ధోనికి ఇలాంటి చాన్సే ఇచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దింపాడు. ప్రయోగాత్మకంగానైనా మిడిలార్డర్కు ప్రమోషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఆకట్టుకున్న అఫ్గాన్... ఈ టోర్నీలో నిష్క్రమణకు సిద్ధమైన అఫ్గానిస్తాన్ ఓవరాల్గా ఆకట్టుకుంది. ఆదివారం బంగ్లాదేశ్ను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇదే ఉత్సాహంతో ఇపుడు అజేయమైన భారత్ను ఓడించి టోర్నీని విజయంతో ముగించాలని ఆశిస్తుంది. ప్రస్తుత అఫ్గాన్ జట్టు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో సమతౌల్యంతో ఉంది. టాపార్డర్లో షహజాద్, ఎహ్సానుల్లా, హష్మతుల్లా స్థిరంగా ఆడుతున్నారు. కెప్టెన్ అస్గర్, నబీ కూడా బ్యాటింగ్ భారాన్ని సమర్థంగా మోస్తున్నారు. బౌలింగ్లో అదరగొడుతున్న రషీద్ ఖాన్ బ్యాటింగ్లోనూ అడపాదడపా ఆదుకుంటున్నాడు. ముజీబ్, ఆలమ్ నైబ్లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగల సమర్థులు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ను ఓడించేందుకు ఈ ప్రదర్శన సరిపోదనే చెప్పాలి. సర్వశక్తులు ఒడ్డినా... ప్రతిఘటించగలదేమో కానీ ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోవచ్చు. ►మరో నాలుగు వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కెప్టెన్సీ నుంచి మాథ్యూస్కు ఉద్వాసన
కొలంబో: ఆసియా కప్లో పేలవ ప్రదర్శన కనబరిచిన శ్రీలంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్పై వేటు పడింది. వన్డే, టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి మాథ్యూస్ను తప్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దుబాయ్, అబుదాబిల్లో జరుగుతున్న ఆసియా కప్లో లంక అనూహ్యంగా తక్కువ ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన కోసం అతని స్థానంలో దినేశ్ చండిమాల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే అతను టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఇక మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత రెండేళ్లలోనే లంక బోర్డు వన్డేల్లో ఆరు మంది కెప్టెన్లను మార్చింది. టెస్టుల్లో, టి20ల్లో నలుగురు చొప్పున కెప్టెన్లను మార్చింది. వన్డేల్లో అసలు స్థిరమైన నాయకత్వమే లేకుండా తరంగ, మాథ్యూస్, కపుగెడెర, మలింగ, తిసారా పెరీరా, చండిమాల్లను తరచూ మార్చేసింది. బలిపశువును చేశారు... ఆసియా కప్ వైఫల్యానికి తనను ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేయడం అన్యాయమని మాథ్యూస్ ఆరోపించాడు. ఆ టోర్నీలో అంతా విఫలమైనపుడు తాను మాత్రం చేయగలిగేదేమి లేదని అన్నాడు. తాజా పరిస్థితులపై కలత చెందానని రిటైర్మెంట్ ప్రకటిస్తానని బోర్డును ఉద్దేశించి హెచ్చరించాడు. -
ఉదాసీనత లేకుండా ఆడాలి
వరుసగా రెండు మ్యాచ్లను చివరి ఓవర్లో చేజార్చుకున్న అఫ్గానిస్తాన్ జట్టు ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అసలే జోరు మీదున్న భారత్తో నేడు జరిగే చివరి సూపర్–4 మ్యాచ్లో అఫ్గానిస్తాన్ పోటీనిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే ఫైనల్ అవకాశాలు లేని అఫ్గానిస్తాన్ ఈ మ్యాచ్లో గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే తమ పోరాటపటిమతో అభిమానుల మనసులు గెల్చుకునే అవకాశం వారి ముంగిట ఉంది. ఎన్నో అవరోధాలను అధిగమించి అఫ్గానిస్తాన్ క్రికెట్ ఈస్థాయికి చేరుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఆటగాళ్ల హావభావాలు చూస్తుంటే భావోద్వేగాలు దాచుకోకుండా ఆటను ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తోంది. ఫీల్డింగ్లో పొరపాట్లు జరిగినపుడు, క్యాచ్లు వదిలేసినపుడు మరీ నిరాశ చెందకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. జట్టుగా ఆడే క్రికెట్లో బరిలో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లూ ఒకేసారి విజయవంతం కాలేరనే విషయం తెలుసుకోవాలి. పొరపాట్లకు కుంగిపోకుండా వాటిని సరిదిద్దుకొని మళ్లీ మంచి ప్రదర్శన చేయాలనే దృక్పథం ఉన్న జట్లకు తొందరగానే మంచి ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లయివ్ లాయిడ్ తమ జట్టు సభ్యులెవరైనా ఫీల్డింగ్లో తప్పిదాలు చేస్తే మైదానంలో ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించేవారు కాదు. 90వ దశకంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇలాగే వ్యవహరించింది. ప్రస్తుతం భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడు. భారత ఫీల్డర్లు పొరపాట్లు చేసినపుడు రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేయకుండా, కాస్త నవ్వి భావోద్వేగాలను దాచుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కెప్టెన్ ప్రశాంతంగా ఉంటే పొరపాటు చేసిన ఫీల్డర్పై అదనపు ఒత్తిడి ఉండదు. రోహిత్ శర్మ–శిఖర్ ధావన్ ఓపెనింగ్ జోడీ జోరు చూస్తుంటే ఐదో నంబర్ తర్వాతి బ్యాట్స్మెన్ ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. భారత బౌలర్లు కూడా అద్భుతంగా వేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్ నామమాత్రపు మ్యాచ్లో ఉదాసీనతకు చోటివ్వకుండా ఆడుతుందని.. క్లీన్స్వీప్తో ఆసియా కప్ను ముగిస్తుందని ఆశిస్తున్నాను. -
షోయబ్ జీజూ(బావ)..ఒకసారి ఇటు చూడవా
-
షోయబ్ మాలిక్ను బావా అంటూ..
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూపర్-4 స్టేజ్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఫీల్డింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్ అభిమానులు ‘షోయబ్ జీజూ(బావ).. ఒకసారి ఇటు చూడవా’ అంటూ కేకలు వేశారు. షోయబ్ ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి కేకలు విని షోయబ్ వెనక్కి తిరిగి వారికి హాయ్ చెప్పారు. అభిమానులు ‘బావ’ అంటూ కేకలు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ట్విటర్లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫఖర్ జమాన్పై జోక్సే జోక్స్!
దుబాయ్ : పాకిస్తాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఫఖర్ వినూత్నంగా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ వేసిన 14వ ఓవర్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై సందిగ్ధం వ్యక్తం చేస్తూ నాన్ స్ట్రైకర్ను అడగ్గా అతను ఏం చెప్పకపోవడంతో ఫఖర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్కు తాకిందని తేలింది. అప్పీల్కు వెళితే ఫఖర్ బతికిపోయేవాడు. దీంతో అభిమానులు కిందపడిపోయిన ఫఖర్ సీన్పై ఫన్నీ మేమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ‘ఫఖర్.. ధావన్ కోసం పిచ్ శుభ్రం చేస్తున్నావా?’ అని ఒకరు.. ఫఖర్ను వెంటనే జింబాంబ్వే పంపించాలని మరొకరు కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్ చేయమంటే ఫఖర్ మాధురీ దీక్షిత్లా డ్యాన్స్ చేస్తున్నాడని, స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ఫఖార్ తనవంతు కృషిచేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో నెగ్గితే పాక్ ఫైనల్లో మరోసారి భారత్తో తలపడనుంది. Rt for Fakhar Zaman Like for Madhuri Dixit.#INDvPAK #PAKvIND #AsiaCup2018 pic.twitter.com/2D1CPzWHSH — Keshav (@Keshav65391027) September 23, 2018 Fakhar clearing pitch for Dhawan 😂 pic.twitter.com/ylilkrKBWj — Nepali Lad (@iamimmorrtall) September 24, 2018 Fakhar Zaman lbw pic.twitter.com/HtK1305M7d — Khurram Siddiquee (@iamkhurrum12) September 23, 2018 -
నన్ను బలి పశువును చేశారు: మాథ్యూస్
కొలంబో: తనను శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై ఏంజెలో మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో తమ జట్టు లీగ్ దశ నుంచే నిష్ర్కమించడాన్ని సాకుగా చూపుతూ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. శ్రీలంక జట్టు ఓవరాల్ ప్రదర్శనకు తనను బలి పశువును చేశారని మాథ్యూస్ విమర్శించాడు. ‘ఆసియాకప్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లపై శ్రీలంక పేలవ ప్రదర్శనకు నన్ను బలి పశువును చేశారు. నన్ను కెప్టెన్సీ నుంచి ఉన్నపళంగా తప్పించారు. ఈ విషయంలో నన్ను ఒక్కడ్నే బాధ్యున్ని చేయడం సబబేనా’ అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు మాథ్యూస్ లేఖ రాశాడు. అయితే దీన్ని లంక బోర్డు సమర్ధించుకుంది. దినేశ్ చండీమాల్కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలోనే మాథ్యూస్ను తప్పించినట్లు పేర్కొంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న సందర్భంలో కెప్టెన్ను మార్చినట్లు బోర్డు తెలిపింది. -
మరీ ఇంత దారుణంగా ఓడిపోతారా?
దుబాయ్: ఆసియాకప్లో టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలుకావడంపై వకార్ యూనిస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా, సూపర్-4లో సైతం అదే ఆట తీరును పునరావృతం చేయడంపై వసీం అక్రమ్ విమర్శలు గుప్పించాడు. ‘ప్రతీ విభాగంలోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన చేసింది. ఫలాన దాంట్లో పాకిస్తాన్ మెరుగైన ఆట తీరు కనబరిచింది అని చెప్పుకోవడానికి లేదు. ఇది మొత్తంగా దారుణమైన ప్రదర్శన. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకుంది. ఇది పాకిస్తాన్ హోంగ్రౌండ్. అటువంటప్పుడు పాక్ ఛేజింగ్ చేస్తేనే ఫలితం మరొకలా ఉండేది. ఆటలో గెలుపు-ఓటముల అనేవి సహజం. కానీ ఇంత దారుణంగా ఓడిపోతారా. ఆసియాకప్లో ఈ తరహా ప్రదర్శనను పాక్ నుంచి ఆశించలేదు. ఒక పాకిస్తానీ మాజీ ఆటగాడిగా చెబుతున్నా. ఇది పాకిస్తాన్ అన్ని విభాగాల్లో విఫలమై ఓటమి చెందడం చాలా నిరాశను కల్గించింది. ఇదొక బోరింగ్ గేమ్. మొత్తం దేశాన్నే నిరాశపరిచారు’ అని అక్రమ్ విమర్శించాడు. మరొకవైపు భారత్ జట్టులో కీలక ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేకుండానే వరుస విజయాలు సాధించడాన్ని అక్రమ్ కొనియాడాడు. పాక్ను ‘శత’కొట్టారు -
మరొకసారి ధోని రివ్య్యూ సిస్టమ్..
-
ఎంఎస్ ధోని మరొకసారి..
దుబాయ్: డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అని తరచు వినిపిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. డీఆర్ఎస్ను ఇలా ధోనికి ఎందుకు ఆపాదించారంటే ఇందులో అతను ఎక్కువగా సక్సెస్ సాధించడమే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్లో ధోని మరోసారి డీఆర్ఎస్ విషయంలో విజయం సాధించాడు. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిదో ఓవర్ను చాహల్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతి పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ను ప్యాడ్లను ముద్దాడింది. ఫ్రంట్ ఫుట్ ఆడే క్రమంలో ఆ బంతి ఇమామ్ ప్యాడ్ను తాకుతూ ఆఫ్ స్టంప్ మీదకు వెళుతున్నట్లు కనబడింది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ నిరాకరించాడు. దాంతో రోహిత్ను రివ్యూకు వెళదామంటూ ధోని తలతో సైగ చేశాడు. ఇక్కడ రోహిత్ రెండో ఆలోచన లేకుండా రివ్యూ కోరడంతో ఇమాముల్ హక్ ఔటయ్యాడు. ఆ బంతి మిడిల్ స్టంప్ వికెట్లను తాకుతున్నట్లు రివ్యూలో తేలడంలో ఇమాముల్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో 24 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ను కోల్పోయింది. ఎంతో నిశిత దృష్టి ఉంటే కానీ అటువంటి ఔట్ల విషయాలను సవాల్ చేయలేం. కానీ ధోని మరోసారి డీఆర్ఎస్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అందుచేత ధోనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మాజీ క్రికెటర్లు, అభిమానులు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొనియాడుతున్నారు. ‘అంతటి సూక్ష్మ బుద్ధితో రోహిత్ను రివ్యూకు వెళ్లమని చెప్పడం ధోనికే చెల్లింది. నిజంగా ధోని జీనియస్’ అని గావస్కర్ కొనియాడాడు. మరొకవైపు ట్వీటర్ వేదికగా ‘ధోని రివ్యూ సిస్టమ్’పై ప్రశంసలు కురుస్తున్నాయి. -
రోహిత్-ధావన్ల రికార్డులు
దుబాయ్: టీమిండియా వన్డే ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు పలు ఘనతల్ని సాధించారు. ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో రోహిత్(111 నాటౌట్)-ధావన్(114)ల జంట తొలి వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఛేజింగ్లో తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని సాధించిన భారత జోడిగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే 2009లో హామిల్టన్లో న్యూజిలాండ్పై గంభీర్-సెహ్వాగ్ జోడి సాధించిన 209 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అధిగమించారు. మరొకవైపు వన్డేల్లో తొలి వికెట్కు ఎక్కువసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో భారత్ జోడిగా రోహిత్-ధావన్ల జోడి నిలిచింది. ఇక్కడ సచిన్-గంగూలీ(21సార్లు) తొలి స్థానంలో ఉండగా, రోహిత్-ధావన్ల జోడి(13సార్లు) రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా తొలి వికెట్కు ఎక్కువసార్లు 100కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన నాలుగో జోడీగా రోహిత్–ధావన్లు గుర్తింపు పొందారు. అదే సమయంలో పాకిస్తాన్పై ఒకే మ్యాచ్లో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం ఇది మూ డోసారి. గతంలో 2006 షార్జాలో సచిన్ (118), సిద్ధూ (101); 2005లో కొచ్చిలో సెహ్వాగ్ (108), ద్రవిడ్ (104) ఈ ఘనత సాధించారు. ఒకే మ్యాచ్లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఏడోసారి. గతంలో సచిన్–గంగూలీ మూడుసార్లు (1998లో శ్రీలంకపై; 2001లో దక్షిణాఫ్రికాపై; 2001లో కెన్యాపై), సెహ్వాగ్–గంగూలీ (2002లో ఇంగ్లండ్పై), సెహ్వాగ్–సచిన్ టెండూల్కర్ (2003లో న్యూజిలాండ్పై), రహానే–ధావన్ (2014లో శ్రీలంకపై) ఒక్కోసారి ఇలా చేశారు. కాగా, వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ రికార్డుల కెక్కాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లోనే(181) ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదవ బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా(150 ఇన్నింగ్స్ల్లో), విరాట్ కోహ్లి(161), ఏబీ డివిలియర్స్ (166), సౌరవ్ గంగూలీ (174) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాక్ను ‘శత’కొట్టారు -
పాక్ను ‘శత’కొట్టారు
పాకిస్తాన్పై గెలుపంటే ఇంత సులువుగా ఉంటుందా అనిపించిన మ్యాచ్ ఇది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా శిక్షించిన పోరు ఇది. ముందుగా చక్కటి బౌలింగ్తో తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఆపై బ్యాటింగ్లో అవధులు లేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సాధించిన అలవోక విజయం ఇది. ఛేదనలో రోహిత్, ధావన్ ఆట చూస్తే వీరిద్దరు కలిసి స్నేహపూర్వక మ్యాచ్ ఆడుతున్నట్లే కనిపించింది తప్ప చిరకాల ప్రత్యర్థితో పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. భారత ఓపెనర్లు పోటీ పడి సెంచరీలు సాధించిన వేళ పాక్ బౌలర్లు బేలగా ప్రేక్షకులుగా మారిపోయి బంతులు వేయాల్సిన లాంఛనాన్ని పూర్తి చేయడమే కనిపించింది. సూపర్–4లో మరో అలవోక విజయంతో ఆసియా కప్ ఫైనల్కు అర్హత సాధించిన టీమిండియా ప్రత్యర్థి... మళ్లీ పాకిస్తానా, బంగ్లాదేశా అనేది ఆ రెండు జట్లు తేల్చుకోవాల్సిందే. దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ ఆదివారం జరిగిన సూపర్–4 మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (90 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ సర్ఫరాజ్ (66 బంతుల్లో 44; 2 ఫోర్లు) రాణించాడు. బుమ్రా, కుల్దీప్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 238 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (100 బంతుల్లో 114; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ రోహిత్ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్కు 33.3 ఓవర్లలో 210 పరుగులు జోడించి గెలుపును ఖాయం చేశారు. ప్రాధాన్యత లేని తమ చివరి సూపర్–4 మ్యాచ్లో భారత్ మంగళవారం అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. సెంచరీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ఫఖర్ జమాన్ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్), ఇమామ్ ఉల్ హఖ్ (10) జాగ్రత్తగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. నాలుగో ఓవర్లో గానీ ఆ జట్టు తొలి బౌండరీ కొట్టలేకపోయింది. ఆ తర్వాత చహల్ తన తొలి ఓవర్లోనే ఇమామ్ను ఎల్బీగా ఔట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించాడు. ముందుగా అంపైర్ తిరస్కరించినా, రివ్యూలో భారత్ ఫలితం సాధించింది. కొద్దిసేపటికి కుల్దీప్ పాక్ను దెబ్బ తీశాడు. షాట్ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్కు తాకిందని తేలింది. అప్పీల్కు వెళితే ఫఖర్ బతికిపోయేవాడు! తర్వాతి ఓవర్లోనే సింగిల్కు అవకాశం లేని చోట పరుగుకు ప్రయత్నించి బాబర్ ఆజమ్ (9) రనౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో మాలిక్, సర్ఫరాజ్ కలిసి పాక్ను ఆదుకున్నారు. మాలిక్ 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే చక్కటి బంతితో సర్ఫరాజ్ను కుల్దీప్ పెవిలియన్ పంపించడంతో 107 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం భువనేశ్వర్ ఓవర్లో పాక్ ఏకంగా 22 పరుగులు రాబట్టి దూకుడు ప్రదర్శించింది. ఈ ఓవర్లో మాలిక్ ఒక ఫోర్ కొట్టగా, ఆసిఫ్ అలీ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) వరుస బంతుల్లో 6, 4, 6 బాదాడు. అయితే లెగ్సైడ్ వెళుతున్న బుమ్రా బంతిని ఆడబోయి ధోనికి క్యాచ్ ఇవ్వడంతో మాలిక్ ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాతి ఓవర్లోనే ఆసిఫ్ను చహల్, షాదాబ్ (10)ను బుమ్రా ఔట్ చేశారు. ఇద్దరూ ఇద్దరే... సాధారణ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ల సొగసైన బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి రెండు ఓవర్లు మాత్రమే కాస్త జాగ్రత్తగా ఆడినట్లు కనిపించిన ధావన్, రోహిత్ ఆ తర్వాత కనువిందైన షాట్లతో చెలరేగిపోయారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఫ్రిది బౌలింగ్లో రోహిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను కవర్స్లో ఇమామ్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రోహిత్ దూకుడును కొనసాగించాడు. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. కనీస స్థాయిలో కూడా లేని బౌలింగ్కు చెత్త ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో పాక్ నిస్సహాయంగా ఉండిపోయింది. 81 పరుగుల వద్ద మళ్లీ క్యాచ్ వదిలేయడంతో రోహిత్కు మరో లైఫ్ లభించింది. నువ్వా నేనా అని పోటీ పడిన శతక పరుగులో ధావన్ ముందంజంలో నిలిచాడు. ఆఫ్రిది బౌలింగ్లో ఫోర్తో 95 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. ఇక మమ్మల్ని ఔట్ చేయడం మీ వల్ల కాదన్నట్లుగా ధావన్ రనౌట్గా వెనుదిరగడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత మాలిక్ బౌలింగ్లో స్క్వేర్ లెగ్ దిశగా ఆడి రోహిత్ తన శతకం పూర్తి చేసుకున్నాడు. రాయుడు (12 నాటౌట్)తో కలిసి అతను మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ ఉల్ హఖ్ (ఎల్బీ) (బి) చహల్ 10; ఫఖర్ జమాన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 31; బాబర్ ఆజమ్ (రనౌట్) 9; సర్ఫరాజ్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 44; షోయబ్ మాలిక్ (సి) ధోని (బి) బుమ్రా 78; ఆసిఫ్ అలీ (బి) చహల్ 30; షాదాబ్ ఖాన్ (బి) బుమ్రా 10; నవాజ్ (నాటౌట్) 15; హసన్ అలీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–24; 2–55; 3–58; 4–165; 5–203; 6–211; 7–234. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–46–0; బుమ్రా 10–1–29–2; చహల్ 9–0–46–2; కుల్దీప్ 10–0–41–2; జడేజా 9–0–50–0; జాదవ్ 3–0–20–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 111; శిఖర్ ధావన్ (రనౌట్) 114; రాయుడు (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 1; మొత్తం (39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 238. వికెట్ల పతనం: 1–210. బౌలింగ్: ఆమిర్ 5–0–41–0; షాహిన్ అఫ్రిది 6–0–42–2; హసన్ అలీ 9–0–52–0; నవాజ్ 7–0–35–0; షాదాబ్ ఖాన్ 8–0–54–0; షోయబ్ మాలిక్ 4.3–0–14–0. ► ఛేజింగ్లో భారత జట్టుకు తొలి వికెట్కు అత్యధికంగా 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జంటగా రోహిత్ శర్మ–శిఖర్ ధావన్ నిలిచారు. గంభీర్–సెహ్వాగ్ (209 పరుగులు; హామిల్టన్లో ► న్యూజిలాండ్పై 2009లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్–ధావన్ అధిగమించారు. ► వన్డేల్లో తొలి వికెట్కు ఎక్కువసార్లు 100కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన నాలుగో జోడీగా రోహిత్–ధావన్ (13 సార్లు) గుర్తింపు పొందారు. తొలి మూడు స్థానాల్లో సచిన్–గంగూలీ (21 సార్లు–భారత్), గిల్క్రిస్ట్–హేడెన్ (16 సార్లు–ఆస్ట్రేలియా), గ్రీనిడ్జ్–హేన్స్ (15 సార్లు–వెస్టిండీస్) జోడీలు ఉన్నాయి. ► పాకిస్తాన్పై ఒకే మ్యాచ్లో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం ఇది మూ డోసారి. గతంలో 2006 షార్జాలో సచిన్ (118), సిద్ధూ (101); 2005లో కొచ్చిలో సెహ్వాగ్ (108), ద్రవిడ్ (104) ఈ ఘనత సాధించారు. ► వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ రికార్డుల కెక్కాడు. ► ఒకే మ్యాచ్లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఏడోసారి. గతంలో సచిన్–గంగూలీ మూడుసార్లు (1998లో శ్రీలంకపై; 2001లో దక్షిణాఫ్రికాపై; 2001లో కెన్యాపై), సెహ్వాగ్–గంగూలీ (2002లో ఇంగ్లండ్పై), సెహ్వాగ్–సచిన్ టెండూల్కర్ (2003లో న్యూజిలాండ్పై), రహానే–ధావన్ (2014లో శ్రీలంకపై) ఒక్కోసారి ఇలా చేశారు. హసన్ అలీ -
సెంచరీలతో కదంతొక్కి..
దుబాయ్: ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ బ్యాట్స్మన్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు సెంచరీలతో కదంతొక్కి తియ్యటి విజయాన్ని అందించారు. పాక్ విసిరిన 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి భారత్ చేధించింది. శిఖర్ ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ కాగా.. రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాట్స్మన్లలో షోయబ్ మాలిక్ 78, సర్ఫరాజ్ అహ్మద్ 44, ఆసిఫ్ అలీ 30, ఫఖర్ జమాన్ 31 మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేయగలిగారు. భారత్ బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వేగంగా పరుగులు చేసిన శిఖర్ ధావన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో గెలిచిన భారత్ ఫైనల్కు అర్హత సాధించింది. -
భారత్ శుభారంభం
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటున్నారు. శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతుండగా, రోహిత్ క్రీజ్లో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓపెనింగ్ జోడీ మరికొద్ది ఓవర్లు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటే భారత్ ఆసియా కప్లో పాక్పై మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. -
ఆసియాకప్: భారత్ లక్ష్యం 238
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ (78), సర్ఫరాజ్ అహ్మద్ (44), ఫకార్ జమాన్ (31), అసీఫ్ అలి(30)లు రాణించడంతో ఆ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. ఆదుకున్న మాలిక్- సర్ఫరాజ్.. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో సర్ఫరాజ్ (44)ను ఔట్ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే పాక్ షోయబ్ మాలిక్, అసిఫ్ అలీల వికెట్లు కోల్పోయింది. అసిఫ్ అలీ(30)ని క్లీన్ బౌల్డ్ చేసిన చహల్కు ఇది వన్డేల్లో 50వ వికెట్ కావడం విశేషం. చివరి ఓవర్లో బుమ్రా షాదాబ్(10)ను ఔట్ చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో చహల్, కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. -
పాక్ కెప్టెన్ హాఫ్ సెంచరీ మిస్
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. ఆదుకున్న మాలిక్- సర్ఫరాజ్.. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో సర్ఫరాజ్ (44)ను ఔట్ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీతో షోయబ్ మాలిక్ (73 నాటౌట్) పోరాడుతున్నాడు. -
రషీద్ ఖాన్ మ్యాచ్ ఫీజులో కోత
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 మ్యాచ్లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముగ్గురు ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ ఆల్రౌండర్ హసన్ అలీతో పాటు అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గర్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు లెవల్–1 నిబంధనను అతిక్రమించినందుకు గాను వారి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక్కో డీ మెరిట్ పాయింట్ను కేటాయించింది. రషీద్, హసన్లకు డీ మెరిట్ పాయింట్లు లభించడం ఇదే తొలిసారి కాగా... అస్గర్కు రెండోసారి. అతను 24 నెలల వ్యవధిలో మరోసారి నిబంధనలను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ నిషేధం పడనుంది. అఫ్గాన్ ఇన్నింగ్స్లో 33వ ఓవర్ వేస్తున్న పాక్ ఆల్రౌండర్ హసన్ అలీ ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్మన్ హష్మతుల్లా వైపు బంతి విసిరగా... ఆ తర్వాత 37వ ఓవర్లో అఫ్గాన్ కెప్టెన్ అస్గర్... బౌలింగ్ చేయడానికి వెళ్తున్న హసన్ను కావాలనే భుజంతో ఢీకొట్టాడు. ఇక స్పిన్నర్ రషీద్ పాక్ బ్యాట్స్మన్ ఆసిఫ్ అలీని ఔట్ చేశాక అభ్యంతరకరంగా అతన్ని సాగనంపాడు. వీటిపై ఐసీసీ చర్యలు తీసు కుంది. మ్యాచ్ అనంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను అంగీకరించారు. -
ఫలితాన్ని ఊహించడం కష్టం
ఆసియా కప్లో భారత జట్టు మంచి నియంత్రణతో ముందుకు సాగుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అనామక హాంకాంగ్పై చెమటోడ్చి గెలిచాక జట్టు దృక్పథంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. పేసర్లు లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేస్తుండటంతో... ప్రత్యర్థి బ్యాట్స్మెన్ సులువుగా షాట్లు ఆడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక స్పిన్నర్లు ఊరించే బంతులతో బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టిస్తున్నారు. కేదార్ జాదవ్ తన బౌలింగ్ యాక్షన్తో ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇలాంటి బౌలింగ్ దాడికి జడేజా తోడవడంతో సెలక్టర్లకు జట్టు ఎంపికలో మరింత వెసులుబాటు కల్పించినట్లైంది. ఇక్కడి పిచ్లపై స్లో బౌలర్లు మరింత ప్రభావం చూపుతారని గుర్తించిన కెప్టెన్ రోహిత్ శర్మ వారిని చక్కగా వినియోగించుకుంటున్నాడు. టెస్టు జట్టు నుంచి తనను పక్కనపెట్టడం తప్పని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తూ... తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. రోహిత్–ధావన్ జంట ప్రపంచంలోనే విధ్వంసక ఓపెనింగ్ జోడీ. ఈ ఇద్దరు పరస్పర సమన్వయంతో ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఆడుతున్నారు. మూడో స్థానంలో రాయుడు ఆకట్టుకుంటుంటే... నాలుగో స్థానం ధోని, కార్తీక్ల మధ్య మారుతూ వస్తోంది. అఫ్గానిస్తాన్పై చివరి క్షణాల్లో సాధించిన విజయం పాక్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో గెలవడం జట్టుకు బలాన్నిస్తుంది. భారత్, అఫ్గాన్లతో మ్యాచ్ల్లో ఆ జట్టుకు శుభారం భాలు లభించలేదు. వరుస మ్యాచ్ల వైఫల్యాల తర్వాత నేటి మ్యాచ్లో ఫఖర్ జమాన్ చెలరేగాలని ఆ జట్టు ఆశిస్తుంది. అదే జరిగితే రోహిత్ సేనకు కష్టాలు తప్పకపోవచ్చు. అనుభవం ఎంత మేలు చేస్తుందో అఫ్గాన్తో మ్యాచ్లో షోయబ్ మాలిక్ మరోసారి నిరూపించాడు. పాక్ బ్యాట్స్మెన్ భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే టీమిండియా ఇదివరకంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య పోరు. ఈ మ్యాచ్లో కచ్చితమైన ఫలితాన్ని ముందుగా ఎవరూ ఊహించలేరు. -
దాయాదుల 'సూపర్' పోరు
హాంకాంగ్తో మ్యాచ్ మేలుకొలిపిందో లేక పట్టుదలే పట్టాలెక్కించిందో గానీ భారత్ ఇప్పుడు ఆసియా కప్లో అజేయశక్తి. ఒక్కరి మీదే ఆధారపడటంలేదు. అరకొర ప్రదర్శనతోనే గట్టెక్కడంలేదు. అంతా కలిసి కదం తొక్కుతున్నారు. ప్రత్యర్థి జట్టును రఫ్ఫాడిస్తున్నారు. టీమిండియా అసాధారణ ఫామ్ ప్రత్యర్థి శిబిరాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా సూపర్–4లో దాయాది పాకిస్తాన్ను మళ్లీ దంచేందుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి అదరగొడుతున్న భారత్ ఆసియా కప్లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. సూపర్–4లో భాగంగా ఆదివారం దాయాదుల సమరం జరుగనుంది. ఈ టోర్నీలో తిరుగులేని జట్టేదైనా ఉందంటే అది రోహిత్ సేనే. ఇప్పటిదాకా ఈ జట్టుకు సాటి వచ్చే ప్రత్యర్థే లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ మ్యాచ్లోనూ సమష్టి ఫలితాలే. ప్రతీ ఒక్కరిలోనూ విజయకాంక్షే. ఇవన్నీ టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాయి. ఇప్పుడు భారత్కు ఎదురుపడటమంటే ఓటమితో దిగాలు పడటమనే విషయం ప్రత్యర్థి టీమ్ మేనేజ్మెంట్లకు అర్థమైపోయింది. కాబట్టే ఏ వ్యూహంతో బరిలోకి దిగాలో వాళ్లకు అంతుబట్టడం లేదు. ఇక్కడ భారత్ ఆడిన మ్యాచ్లు, గెలిచిన తేడాను చూస్తే... కచ్చితంగా ఎవరైనా హడలిపోవాల్సిందే. ఈ జోరు చూస్తుంటే రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేని జట్టే ఇలా వుంటే ఇక అతడు కూడా ఓ చెయ్యేస్తే... మిగతా జట్ల పరిస్థితి ఏంటా అని సగటు క్రీడాభిమాని భావించవచ్చు. రోహిత్ బృందానికి ఆరంభంలో ఒక్క హాంకాంగ్ మినహా ఏ జట్టూ కనీసం ఎదురునిలువ లేకపోయింది. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. కసిదీరా కలివిడిగా... రోహిత్ సేన ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఎవరెదురైనా ఓడించేందుకు సిద్ధంగా ఉంది. అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. హాంకాంగ్తో కష్టపడ్డ భారత్ అటుపై ఇక ఏ జట్టుతోనూ చెమట చిందించకుండానే గెలిచింది. రసవత్తరం అవుతుందనుకున్న ఇండో–పాక్ గ్రూప్ దశ మ్యాచ్ కూడా టీమిండియా జోరు ముందు తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏ విభాగాన్ని చూసినా, ఏ ఆటగాడి సత్తాను పరిశీలించినా భారత్ ఇప్పుడు అసాధారణ జట్టు. సూపర్ ఫామ్లో ఉన్న ఈ జట్టును ఓడించడం చాలా కష్టం. టాపార్డర్లో ధావన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్లో సెంచరీ బాదిన శిఖర్ గత రెండు మ్యాచ్ల్లోనూ 46, 40 పరుగులు చేశాడు. ఓపె నింగ్లో అతనితోపాటు కెప్టెన్ రోహిత్ కూడా టచ్లోకి వచ్చాడు. పాక్, బంగ్లాదేశ్లపై అర్ధసెంచరీలతో సత్తాచాటుకున్నాడు. మిడిలార్డర్లో రాయుడు, దినేశ్ కార్తీక్లు బాగా ఆడుతున్నారు. ప్రమోషన్తో ధోని కూడా... గత మ్యాచ్లో ప్రమోషన్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోని కూడా ఇప్పుడు ఫామ్లోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్తో కలిసి మూడో వికెట్కు విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధనాధన్ మెరుపులు లేకపోయినా దడదడలాడిస్తున్న నాయకుడికి అండగా నిలిచాడు. ప్రత్యర్థి జట్ల తక్కువ స్కోర్లతో లోయర్ మిడిలార్డర్లో కేదార్ జాదవ్లాంటి బ్యాట్స్మెన్కు చెప్పుకోదగ్గ అవకాశం రాలేదు. కానీ హాంకాంగ్తో మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే తొలి మ్యాచ్ మినహా ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో తమ ప్రతాపం చూపారు. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, అవకాశం దక్కించుకున్న ఖలీల్ అహ్మద్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్... అందరూ కలిసి ప్రత్యర్థి ఇన్నిం గ్స్ను నిలువునా కూల్చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా గాయంతో ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా వస్తూనే స్పిన్ బౌలింగ్తో పరిమిత ఓవర్లకు పనికొస్తానని తన ప్రదర్శనతో చాటాడు. ఆత్మరక్షణలో పాక్... ఈ టోర్నీలో మూడు మేటి జట్లలో శ్రీలంక లీగ్లోనే నిష్క్రమించింది. ఇక మిగిలిన జట్లలో భారత్కు పోటీ ఇస్తుందనుకున్న పాకిస్తాన్ లీగ్ మ్యాచ్లో చేతులెత్తేసింది. టీమిండియా జోరుకు తలవంచింది. అయితే లీగ్లో ఇతర జట్లపై గెలిచి ముందంజ వేసిన ఈ జట్టు తమ తొలి సూపర్–4లో అఫ్గానిస్తాన్ను కష్టమ్మీద ఓడించింది. ఇప్పుడు పటిష్టమైన భారత్నూ ఓడిస్తే ఫైనల్ బెర్త్పై ధీమాతో ఉండొచ్చని భావిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్ లైనప్తో భారత్ను ఢీకొనడం అంత సులభమేమీ కాదు. గత మ్యాచ్లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని పాక్ చివరి ఓవర్లో అధిగమించింది. టాపార్డర్లో బాబర్ ఆజమ్ ఒక్కడే ప్రతీ మ్యాచ్లోనూ స్థిరంగా ఆడుతున్నాడు. హాంకాంగ్, భారత్, అఫ్గానిస్తాన్పై అతను వరుసగా 33, 47, 66 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్కు దిగిన రెండుసార్లూ (6, 8 పరుగులు) విఫలమయ్యాడు. బౌలింగ్లో ఒక్కో మ్యాచ్లో ఒకరిద్దరు హిట్టయ్యారు. ఉస్మాన్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, మొహమ్మద్ నవాజ్ పాకిస్తాన్ బౌలింగ్ను నడిపిస్తున్నారు. భారత బౌలింగ్తో పోలిస్తే పాక్ పేస్ దళం అంత పటిష్టంగా ఏమీ లేదు. ఇలాంటి నిలకడలేని బ్యాటింగ్, బౌలింగ్తో భారత్ను ఓడించాలంటే పాకిస్తాన్ శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కోసం కొత్త పిచ్ను ఉపయోగించనున్నారు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి దృష్ట్యా స్పిన్నర్లే ఎక్కువ ఓవర్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాయుడు, ధోని, కార్తీక్, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. పాకిస్తాన్: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్, హారిస్ సొహైల్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, నవాజ్, హసన్ అలీ, ఉస్మాన్, షాహీన్ ఆఫ్రిది. ►అబుదాబిలో నేడు జరిగే మరో ‘సూపర్–4’ మ్యాచ్లో బంగ్లాదేశ్తో అఫ్గానిస్తాన్ ఆడనుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
మాలిక్లో ధోని కనిపించాడు: పాక్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్ : ఆసియాకప్లో భాగంగా అఫ్గానిస్తాన్ జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ ఆటతీరు టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనిని తలపించిందని ఆ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో కడదాక నిలిచిన మాలిక్ హాఫ్ సెంచరీతో పాక్కు విజయం అందించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. మూడు బంతుల్లో ఎలాంటి తడబాటు లేకుండా ఒక సిక్స్, ఫోర్ బాది విజయాన్నందించిన మాలిక్పై వసీం అక్రమ్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: ధోని కెప్టెన్సీ.. షకీబ్ బలి) ‘అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని షోయబ్ మాలిక్ అఫ్గానిస్తాన్ మ్యాచ్తో మరోసారి నిరూపించాడు. మాలిక్, ధోనిలా ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేశాడు. తన ముఖంలో ఎలాంటి హావాభావాలు లేకపోవడంతో అసహనంతో బౌలర్కు ఏం చేయాలనో అర్థం కాలేదు. అద్భత బ్యాటింగ్’ అని ట్వీట్ చేశాడు. (చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్..) Experience has no substitute... Shoaib Malik proved it against a spirited Afghanistan .Did a Dhoni like finish ... when Malik faced a bowler, he had no expression on his face and that frustrates a bowler becos he doesn’t know what to expect... wonderful knock @realshoaibmalik — Wasim Akram (@wasimakramlive) September 22, 2018 -
అతిగా ప్రవర్తించిన ఆటగాళ్లకు జరిమానా
అబుదాబి : ఆసియాకప్లో భాగంగా శుక్రవారం అప్గనిస్తాన్-పాకిస్తాన్ల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లను గుర్తించిన మ్యాచ్ రిఫరీ వారి మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తూ.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా వేశారు. వేర్వేరు సందర్భాల్లో క్రీడా నియమావళిని అతిక్రమించిన పాకిస్తాన్ పేసర్ అలీ హసన్తో పాటు, అఫ్గాన్ సంచలనం రషీద్ఖాన్, కెప్టెన్ అస్గర్ అప్గన్లపై ఈ జరిమాన పడింది. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ 33వ ఓవర్లో హస్మతుల్లా షాహిదీను అలీ హసన్ వ్యక్తిగతంగా దూషించాడు. 37వ ఓవర్లో హసన్ వికెట్ల మధ్య పరుగు తీస్తుండగా అస్గర్ అఫ్గన్ ఉద్దేశపూర్వకంగా హసన్ను తన భుజంతో ఢీకొట్టాడు. మరోవైపు పాక్ బ్యాట్స్మన్ ఆసిఫ్ అలీని ఔట్ చేసిన తరువాత రషీద్.. తన చేతి వేళ్లతో అసభ్యకర రీతిలో బ్యాట్స్మన్కు వీడ్కోలు పలికాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనలపై విచారణ జరిపిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను ఒప్పుకున్నారు. దీంతో వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. -
ధోనిని ఔట్ చేసింది ఓ స్కూల్ టీచర్ తెలుసా?
దుబాయ్: హాంకాంగ్ స్పిన్నర్ ఇహ్సన్ ఖాన్ ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అయితే 322 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడిన అనుభవం వున్న సీనియర్ ఆటగాడిని డకౌట్ చేసి వార్తల్లో నిలిచాడు ఇహ్సన్. ఆ అవుటైంది టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని. ఆసియా కప్లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్లో పసికూన హాంకాంగ్పై కష్టపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారత సారథి రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిలను ఇహ్సన్ ఔట్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. అయితే మ్యాచ్ అనంతరం హాంకాంగ్ ఆటగాళ్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి సందడి చేశారు. అయితే ఇషాన్ మాత్రం మోడ్రన్ క్రికెట్లో తన అభిమాన ఆటగాడు ధోనితో ముచ్చటించాడు. అయితే స్పిన్ బౌలింగ్ ఆడటంలో దిట్ట అయిన ధోని, రోహిత్లను బోల్తా కొట్టించిన ఇహ్సన్ ఓ స్కూల్ టీచర్. ధోని అమోఘం.. ‘ధోని అపరమేధావి, క్రీడా విలువలు పాటించే నికార్సయిన ఆటగాడు. తనక బౌల్ చేశాక నాకు బంతి బ్యాట్కు తగిలిన శబ్దం రాలేదు. కానీ కీపర్ అప్పీల్ చేస్తే నేను కూడా అరిచా. అంపైర్ కూడా ఆలోచనలో ఉండగానే.. ధోని పెవిలియన్ బాట పట్టాడు. ధోని వెనుదిరిగాక నీకు ఎలాంటి శబ్దమైనా వినిపించిందా అని అంపైర్ అడిగాడు. కానీ, ధోని నాకేం తెలియదని అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూసుంటే నాటౌట్గా ప్రకటించేవాడే. నిజాయితీగా ఆడే ధోని అంపైర్ తన నిర్ణయం ప్రకటించక ముందే వెనుదిరిగాడు. ఇది అసలైన క్రీడా స్పూర్తి అంటే. భారత డ్రెస్సింగ్ రూమ్లో ధోని నాకు ఎన్నో సలహాలు, సూచనలు చేశాడు. అవి తనకెంతో ఉపయోగడతాయి. స్కూల్ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా. ఆసియా కప్లో జరిగిన ఎన్నో విషయాలు నా స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటా’ అంటూ ఇహ్సన్ తెలిపాడు. హాంకాంగ్కు సహకరించండి.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ దేశంలో క్రికెట్ అభివృద్దికి సహకరించాలని ఇహ్సన్ కోరాడు. తమ దేశంలో ఒకేఒక అంతర్జాతీయ మైదానం, మరో రెండు చిన్న మైదానాలు ఉన్నాయని తెలిపాడు. కానీ అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా లేవని వివరించాడు. తమకు సహకారమిస్తే క్రికెట్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆరంగేట్ర మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసిన 23వ ఆటగాడిగా ఈ స్పిన్నర్ రికార్డు సృష్టించాడు. ఇహ్సన్ స్వస్థలం పాకిస్తాన్లోని పెషావర్. అండర్-15,19 క్రికెట్లో పాక్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. కానీ 2012లో హాంకాంగ్కు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడ్డాడు. దేశం మారిన క్రికెట్ను వదలకుండా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడే అవకాశం టోర్నీ నిర్వాహకులు తనకు ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతానని తెలిపాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్..
అబుదాబి: ఆసియాకప్లో భాగంగా సూపర్-4లో అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మూడు బంతులు మిగిలి ఉండగా పాక్ గెలుపొందింది. ఆఖరి ఓవర్ను అందుకున్న అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ అలమ్ బౌలింగ్లో షోయబ్ మాలిక్ సిక్స్, ఫోర్ కొట్టి పాక్కు విజయం ఖాయం చేశాడు. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో మాలిక్ సమయోచితంగా ఆడి జట్టును గెలిపిస్తే, తన బౌలింగ్ కారణంగా జట్టు పరాజయం పాలుకావడాన్ని అఫ్తాబ్ అలమ్ జీర్ణించుకోలేపోయాడు. మ్యాచ్ అనంతరం అలమ్ మోకాళ్లపై కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లతో మాలిక్-హసన్ అలీలు కరాచలనం చేసే క్రమంలో అలమ్ తన రెండు చేతుల్ని అడ్డం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో అలమ్ను ఓదార్చడం మాలిక్ వంతైంది. కాసేపు గ్రౌండ్లో అలమ్ కూర్చుండిపోగా అతని భుజాలపై చేయి వేసి ధైర్యం చెప్పాడు మాలిక్. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాలిక్.. ఇలా ప్రత్యర్థి ఆటగాడ్ని ఓదార్చి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో షోయబ్ మాలిక్ అజేయంగా నిలిచి 51 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఆ తర్వాత చెమటోడ్చిన పాకిస్తాన్ కడవరకూ పోరాడి విజయాన్ని అందుకుంది. పాక్ను గెలిపించిన మాలిక్ -
ధోని మాస్టర్ ప్లాన్.. షకీబ్ అవుట్
-
కన్నీళ్లు పెట్టుకున్న అఫ్గాన్ ప్లేయర్
-
ధోని కెప్టెన్సీ.. షకీబ్ బలి
దుబాయ్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని చాలా రోజులు అవుతున్నా.. తన మార్క్ కెప్టెన్సీని మాత్రం ప్రేక్షకులు మిస్సవ్వడం లేదు. కెప్టెన్సీ పదవి వదులుకున్నా ఓ సీనియర్ ఆటగాడిగా ధోని జట్టులో అవసరమైనప్పుడు తన సూచనలు, సలహాలతో ఆటగాళ్లకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ధోని మరోసారి తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. తన అనుభవం జట్టుకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పకనే చెప్పాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాకు, తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మకు తన వ్యూహాలతో అండగా నిలిచాడు. (చదవండి: జడేజా ‘సూపర్’ 4) బంగ్లాదేశ్ కీలక బ్యాట్స్మన్, ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను పెవిలియన్ చేర్చడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. జడేజా వేసిన తొలి ఓవర్లోనే షకీబ్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో స్లిప్లో ఉన్న ధావన్ను స్క్వేర్ లెగ్కు మార్చాలని ధోని, రోహిత్కు సూచించాడు. వెంటనే రోహిత్ ఫీల్డింగ్ మార్చగా.. ఆ మరుసటి బంతికే షకీబ్.. ధావన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ధోని వ్యూహం ఫలించింది. ఇక ధోని మార్క్ కెప్టెన్సీ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ దూరం కావచ్చు కానీ.. తనలోని సారథ్య లక్షణాలు మాత్రం కోల్పోలేదని..దటీజ్ ధోని అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్లతో ఘనవిజయం సాధించి విషయం తెలిసిందే. (చదవండి: ధోనిని ఔట్ చేసింది ఓ స్కూల్ టీచర్ తెలుసా?) -
ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు: జడేజా
దుబాయ్: దాదాపు 480 రోజుల తర్వాత టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకుని అద్భుతమైన బౌలింగ్తో చెలరేగిపోయిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. తన ప్రదర్శనపై ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉంటానన్నాడు. ఆసియాకప్లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై జడేజా మాట్లాడుతూ.. ‘ నా పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకుని ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నేను ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఏమి చేయగలను అనే విషయంలో ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేనే చాలెంజ్’ అని జడేజా పేర్కొన్నాడు. వచ్చే వరల్డ్కప్లో స్థానంపై అడిగిన ప్రశ్నపై జడేజా స్పందిస్తూ.. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదన్నాడు. ఆ మెగా టోర్నీ నాటికి తామింకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉందని, అప్పటి పరిస్థితుల్ని జట్టు కూర్పు ఉంటుందన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా తాజా సిరీస్పైనే ఉన్నట్లు తెలిపాడు. జడేజా ‘సూపర్’ 4 -
ధావన్ అరుదైన ఘనత
దుబాయ్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్లో నాలుగు క్యాచ్లు పట్టి ఆ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ధావన్ నాలుగు క్యాచ్లను పట్టాడు. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ క్యాచ్లను ధావన్ అందుకున్నాడు. ఫలితంగా వన్డే మ్యాచ్లో నాలుగు క్యాచ్లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ధావన్ చేరిపోయాడు. గతంలో సునీల్ గావస్కర్ (పాక్పై షార్జాలో; 1985), అజహరుద్దీన్ (పాక్పై టొరంటోలో; 1997), సచిన్ టెండూల్కర్ (పాక్పై ఢాకాలో; 1998), రాహుల్ ద్రవిడ్ (విండీస్పై టొరంటోలో; 1999), మొహమ్మద్ కైఫ్ (శ్రీలంకపై జొహన్నెస్బర్గ్లో; 2003), వీవీఎస్ లక్ష్మణ్ (జింబాబ్వేపై పెర్త్లో; 2004) ఈ ఘనత సాధించారు. అయితే ఒక వన్డే మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఘనత దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ పేరిట ఉంది. 1993లోవ వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో రోడ్స్ ఐదు క్యాచ్లు పట్టాడు. చదవండి: జడేజా ‘సూపర్’ 4 -
‘అందుకు కారణం ధోనినే’
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే తన ఆటతీరు మెరుగైందని కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో కేదార్ జాదవ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే.దుబాయి వేదికగా బుధవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్ (3/23) మ్యాజిక్కు మిడిలార్డర్ చెల్లచెదురైన సంగతి తెలిసిందే. అయితే, తన విజయం వెనుక మాజీ కెప్టెన్ ధోని పాత్ర కీలకమని అన్నాడు. స్వదేశంలో 2016లో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఎంఎస్ ధోని తన చేతికి బంతిని ఇవ్వడం కెరీర్నే మార్చివేసిందని చెప్పాడు.కేదార్ జాదవ్ మాట్లాడుతూ ‘గతంలో నా ఫోకస్ అంతా బ్యాటింగ్పైనే ఉండేది. నాపై నాకు అంత నమ్మకం ఉండేది కాదు. రెండేళ్ల కిందట కివీస్తో జరిగిన సిరీస్తో నా దశ తిరిగింది. బౌలింగ్ చేయాలంటూ ధోనీ బంతిని అందించడం నా జీవితాన్నే మార్చేసింది. నాపై నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని అన్నాడు. ‘ఆత్మ విశ్వాసంతో ఆడుతున్నా. వికెట్ టు వికెట్ బంతులు సంధించి ఫలితాలు సాధిస్తున్నాను. ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే నా ఆటతీరు మెరుగైంది. పూర్తి స్వేచ్ఛగా క్రికెట్ను ఆస్వాదిస్తున్నాను. కేవలం రెండు ఓవర్లకు మించి ఎక్కువ ఓవర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేయను’ అని జాదవ్ చెప్పాడు. -
భారత్ సునాయాస గెలుపు
-
బంగ్లాపై భారత్ ఘనవిజయం
-
పాక్ను గెలిపించిన మాలిక్
అబుదాబి: వరుస విజయాలతో ఆసియా కప్ గ్రూప్ ‘బి’లో టాపర్గా నిలిచిన అఫ్గానిస్తాన్ శుక్రవారం జరిగిన సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్ ఎదుట నిలువలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సత్తా చాటినా... బౌలింగ్లో అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. 258 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అధిగమించింది. షోయబ్ మాలిక్ (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) చివరి వరకు క్రీజులో నిలిచి పాకిస్తాన్ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు ఇమాముల్ హఖ్ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (94 బంతుల్లో 66; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 154 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పాక్ కష్టాల్లో పడినట్లు కనిపించినా... ఆఖర్లో మాలిక్ పాక్ను గట్టెక్కించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజీబ్ (2/33), రషీద్ ఖాన్ (3/46) ఆకట్టుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిదీ (118 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత పోరాటానికి కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ (56 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3, అరంగేట్ర లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ ఆఫ్రిది 2 వికెట్లు పడగొట్టారు. అదరగొట్టిన అస్గర్, హష్మతుల్లా ఆసియాలోనే అత్యుత్తమ బౌలింగ్ వనరులు ఉన్న పాకిస్తాన్... మ్యాచ్ ప్రారంభంలో తమ స్థాయికి తగ్గట్లే విజృంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ వరుస ఓవర్లలో ఓపెనర్లు షహజాద్ (20), ఎహ్సానుల్లా (10)లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత రహమత్ షా (36; 2 ఫోర్లు)తో కలిసి హష్మతుల్లా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడీ మూడో వికెట్కు 63 పరుగులు జోడించాక నవాజ్ బౌలింగ్లోనే రహమత్ షా వెనుదిరిగాడు. ఆ తర్వాతే అసలు ఆట ప్రారంభమైంది హష్మతుల్లాతో జత కలిసిన కెప్టెన్ అస్గర్ ముందు ఆచితూచి ఆడినా... కుదురుకున్నాక భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 99 బంతుల్లో 94 పరుగులు జతచేశారు. ఆ తర్వాత ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హష్మతుల్లా చివరి వరకు నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించాడు. చివరి 10 ఓవర్లలో అఫ్గాన్ 87 పరుగులు సాధించింది. ఆడుతూ పాడుతూ... పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్కు గురైంది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఫఖర్ జమాన్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇమామ్, బాబర్ ఆజమ్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 154 పరుగులు జోడించి గెలుపు బాట పరిచారు. స్కోరు వేగం పెంచే క్రమంలో ఇమామ్ రనౌట్గా వెనుదిరగ్గా... బాబర్ను రషీద్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత సోహైల్ (13), సర్ఫరాజ్ (8), నవాజ్ (10) ఔటైనా... మరోవైపు చివరిదాకా పోరాడిన షోయబ్ మాలిక్ జట్టుకు విజయాన్నందించాడు. ఆదివారం జరిగే సూపర్–4 మరో మ్యాచ్లో బంగ్లాదేశ్తో అఫ్గాన్ ఆడుతుంది. -
జడేజా ‘సూపర్’ 4
ఆసియా కప్లో టీమిండియాకు మరో ఏకపక్ష విజయం. పాకిస్తాన్తో జరిగిన గత మ్యాచ్ తరహాలోనే ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సాగిన సూపర్–4 పోరులో బంగ్లాదేశ్ను భారత్ చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆపై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యం చేరింది. పునరాగమనంలో జడేజా స్పిన్ మాయాజాలానికి భువీ, బుమ్రా అండగా నిలవగా... బ్యాటింగ్లో తనకు అలవాటైన రీతిలో రోహిత్ శర్మ అర్ధసెంచరీతో మ్యాచ్ను ముగించాడు. ఇక ఆదివారం మళ్లీ పాత ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరుకు భారత్ ‘సై’ అంటోంది. దుబాయ్: భారీ విజయంతో భారత్ సూపర్–4 దశను మొదలు పెట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్ మిరాజ్ (50 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/29) చెలరేగగా, భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. బంగ్లా ఏకంగా 190 డాట్ బంతులు (31.4 ఓవర్లు) ఆడిందంటే భారత బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా సాగిందో అర్థమవుతుంది. అనంతరం భారత్ 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీతో మెరవగా, శిఖర్ ధావన్ (47 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), ధోని (37 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించారు. శనివారం విశ్రాంతి దినం తర్వాత రేపు జరిగే తర్వాతి పోరులో పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది. పేసర్ల జోరు... భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి జట్టుకు శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో లిటన్ దాస్ (7)ను భువీ ఔట్ చేయడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. మరో నాలుగు బంతులకే నజ్ముల్ (7)ను బుమ్రా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత బంగ్లా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా జడేజా దెబ్బకు జట్టు కుప్పకూలింది. 23 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 65/5 స్కోరుతో బంగ్లా కష్టాల్లో ఉన్న సమయంలో మహ్ముదుల్లా (51 బంతుల్లో 25; 3 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకునే ప్రయత్నం చేసినా అదీ ఎక్కువ సేపు సాగలేదు. మొసద్దిక్ (12)తో కలిసి 36 పరుగులు జోడించిన తర్వాత మహ్ముదుల్లాను భువీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. రీప్లేలో బంతి బ్యాట్కు తగిలినట్లు స్పష్టంగా కనిపించినా... బంగ్లా అప్పటికే రివ్యూ కోల్పోవడంతో బ్యాట్స్మెన్కు మరో అవకాశం లేకుండా పోయింది. మరో మూడు బంతులకే జడేజా బౌలింగ్లో మొసద్దిక్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో మెహదీ హసన్, కెప్టెన్ మొర్తజా (32 బంతుల్లో 26; 2 సిక్సర్లు) కలిసి పోరాడారు. చహల్ బౌలింగ్లో మెహదీ రెండు సిక్సర్లు బాదగా... భువనేశ్వర్ ఓవర్లో మొర్తజా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే తర్వాతి బంతికే అతను ఔట్ కావడంతో 66 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. మరో ఆరు పరుగులకే బంగ్లా తర్వాతి రెండు వికెట్లు కోల్పోయింది. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు కోటా పూర్తిగా వేయడంతో గత మ్యాచ్లో చెలరేగిన కేదార్ జాదవ్ అవసరమే భారత్కు రాలేదు. రాణించిన ధావన్... స్వల్ప ఛేదనలో భారత్కు ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించారు. రోహిత్, ధావన్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే తొలి వికెట్కు 61 పరుగులు జత చేసిన తర్వాత ధావన్ను ఔట్ చేసి షకీబ్ ఈ జోడీని విడదీశాడు. మరోవైపు జోరు పెంచిన రోహిత్... షకీబ్ బౌలింగ్లో భారీ సిక్సర్తో 63 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వన్డౌన్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు (13) ఎక్కువ సేపు నిలవలేదు. క్యాచ్ కోసం ముష్ఫికర్ చేసిన అప్పీల్ను అంపైర్ తిరస్కరించినా... రివ్యూకు వెళ్లిన బంగ్లాదేశ్ సానుకూల ఫలితం సాధించింది. ఈ దశలో రోహిత్, ధోని చకచకా పరుగులు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్కు 64 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. ఘన పునరాగమనం గత ఏడాది జూలైలో రవీంద్ర జడేజా భారత్ తరఫున ఆఖరిసారిగా వన్డే బరిలోకి దిగాడు. కింగ్స్టన్లో వెస్టిండీస్తో జరిగిన ఆ మ్యాచ్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. అంతకుముందు రెండు వన్డేల్లో కూడా సరిగ్గా అదే ప్రదర్శన. అంతే... ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో జడేజాపై సెలక్టర్లు నమ్మకం కోల్పోయారు. ముందుగా కాస్త విశ్రాంతి అంటూనే మెల్లగా తప్పించేశారు. వరుసగా ఏడు వన్డే సిరీస్లలో అతని పేరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఆసియా కప్ జట్టులో కూడా అతని పేరు లేదు. జడేజా ఆఖరి మ్యాచ్ తర్వాతి నుంచి బుధవారం పాక్తో మ్యాచ్ వరకు భారత్ 27 వన్డేలు ఆడింది. కెప్టెన్ కోహ్లి అండగా చహల్, కుల్దీప్ జట్టులో పాతుకుపోవడంతో ఇన్ని మ్యాచ్లలో జడేజా అవసరమే గుర్తుకు రాలేదు. అయితే అదృష్టం అతడిని మళ్లీ మరో ఆటగాడి గాయం రూపంలో పలకరించింది. పాండ్యా గాయం కారణంగా అతను టీమ్లోకి వచ్చాడు. దుబాయ్ పిచ్ అదనపు పేసర్కంటే మూడో స్పిన్నర్కే అనుకూలంగా కనిపిస్తుండటంతో నేరుగా తుది జట్టులో చోటు ఖాయమైంది. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని అతను బ్రహ్మాండంగా వాడుకున్నాడు. తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. అదే తరహా కచ్చితత్వం, నియంత్రణతో కూడిన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచాడు. చకచకా నాలుగు వికెట్లు పడగొట్టి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2014 ఆగస్టు తర్వాత జడేజా ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్లలో అవకాశం దక్కని జడేజా... అశ్విన్ గాయంతో చివరి టెస్టులోకి వచ్చి 7 వికెట్లు, అర్ధ సెంచరీతో సత్తా చాటినట్లుగా ఇప్పుడు వన్డేల్లో కూడా అదే తరహాలో చేసి చూపించాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో జడేజా తొలి ఓవర్లో షకీబ్ (17) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే రోహిత్, ధోని వ్యూహం మార్చి ఫీల్డర్ను పెట్టడంతో నేరుగా అతను స్క్వేర్లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత చక్కటి బంతితో మిథున్ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిథున్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. తన తర్వాతి ఓవర్లో ముష్ఫికర్ (21)ను కూడా పెవిలియన్ పంపించిన జడేజా... మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ బౌలింగ్కు దిగి తన ఆఖరి ఓవర్లో మరో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాతవన్డే మ్యాచ్ ఆడాను. ఎక్కడైనా నాదైన ముద్రచూపించాలని భావించా. ఎప్పుడు అవకాశంలభించినా నా సామర్థ్యానికి తగినట్లుగా అత్యుత్తమప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా అనిపిస్తోంది. కుల్దీప్, చహల్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచడం వల్ల నేను వికెట్లు తీయడం సులువైంది. ప్రతీ మ్యాచ్లో నా బాధ్యత నెరవేర్చాలి. పాకిస్తాన్తో పాటు తర్వాతి మ్యాచ్లలో కూడా రాణించాలని పట్టుదలగా ఉన్నా. – రవీంద్ర జడేజా ►వన్డే కెరీర్లో రవీంద్ర జడేజాకిది పదో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. నాలుగేళ్ల తర్వాత మరోసారి అతనికి ఈ పురస్కారం లభించింది. చివరిసారి అతను 2014లో ఢాకాలో జరిగిన ఆసియా కప్లో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఈ అవార్డు దక్కించుకున్నాడు. ►ఒకే వన్డే మ్యాచ్లో నాలుగు క్యాచ్లు పట్టిన ఏడో భారతీయ ఫీల్డర్గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. గతంలో సునీల్ గావస్కర్ (పాక్పై షార్జాలో; 1985), అజహరుద్దీన్ (పాక్పై టొరంటోలో; 1997), సచిన్ టెండూల్కర్ (పాక్పై ఢాకాలో; 1998), రాహుల్ ద్రవిడ్ (విండీస్పై టొరంటోలో; 1999), మొహమ్మద్ కైఫ్ (శ్రీలంకపై జొహన్నెస్బర్గ్లో; 2003), వీవీఎస్ లక్ష్మణ్ (జింబాబ్వేపై పెర్త్లో; 2004) ఈ ఘనత సాధించారు. -
జడేజా తిప్పేశాడు.. భువీ కూల్చేశాడు
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ 174 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. చాలా కాలం తర్వాత భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా (4/29) బంతితో మెరిసాడు. జడ్డు మాయాజాలానికి, భువనేశ్వర్ (3/32), బుమ్రా (3/37)ల పేస్ తోడవ్వడంతో బంగ్లా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్మెన్ మెహిదీ హసన్ మిర్జా(42), మొర్తజా(26), మహ్మదుల్లా(25), ముష్ఫికర్ రహ్మాన్(21)లవే టాప్ స్కోర్ కావడం విశేషం. అంతకు మందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ను భువీ, బుమ్రాలు దెబ్బతీశారు. వరుస ఓవర్లలో ఓపెనర్లు లిటన్ దాస్(7), నజ్ముల్లా హుస్సెస్ (7)లను పెవిలియన్ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్లు ఆచితూచి ఆడుతూ బంగ్లాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ జడేజా షకీబ్ అల్ హసన్(17) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. మరికొద్ది సేపటికే మిథున్ (9), క్రీజులో కుదురుకున్న ముష్పికర్ రహీమ్లను సైతం జడేజా ఔట్ చేయడంతో బంగ్లా 65కే 5 కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. మెహ్దీ హసన్ ఒంటరి పోరాటం.. ఒకవైపు వికెట్లు కోల్పోతున్న మెహ్ది హసన్ ఒంటి పోరాటం చేశాడు. దీంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మొర్తజా, హసన్లు కొంత భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు భువవేశ్వర్ మొర్తజాను ఔట్ చేయగా.. మెహదీ హసన్(42), ముస్తాఫిజుర్ రహ్మన్(3)లను బుమ్రా పెవిలియన్ చేర్చడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. -
ఆసియాకప్: కష్టాల్లో బంగ్లాదేశ్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాను భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలు దెబ్బతీశారు. వరుస ఓవర్లలో ఓపెనర్లు లిటన్ దాస్(7), నజ్ముల్ (7)లను పెవిలియన్ చేర్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్లు ఆచితూచి ఆడుతూ బంగ్లాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ జడేజా షకీబ్ అల్ హసన్(17) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. మరికొద్ది సేపటికే మిథున్ (9), క్రీజులో కుదురుకున్న ముష్పికర్ రహీమ్(21)లను సైతం జడేజానే ఔట్ చేయడంతో బంగ్లా 65కే 5 కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. -
‘పాక్కు భయపడే కోహ్లి పారిపోయాడు’
ముంబై: భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ విశ్రాంతిని కల్పించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం ఆసియాకప్లో పాక్ను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కోహ్లి పారిపోయాడని ఘాటుగా విమర్శించాడు. ఈ వ్యాఖ్యలను భారత సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. గత బుధవారం పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఛానెల్ చర్చకార్యాక్రమంలో గంభీర్, తన్వీర్ అహ్మద్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి భయపడే ఆసియాకప్కు దూరమయ్యాడని నాకు అనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అతను లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లోనే వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఆ నొప్పితోనే తన ఆటను కొనసాగించాడు. అదే నొప్పితో టెస్ట్ సిరీస్లో సైతం రాణించాడు. ఈ లెక్కన అతని గాయం అంత పెద్దది కాదనిపిస్తోంది. ఆసియాకప్ కూడా ఆడటం అతనికేం అంత కష్టం కాదు. కానీ ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్తో రెండు మూడు సార్లు తలపడనుందన్న విషయం కోహ్లిని కలవరపెట్టింది. దీంతో అతను ఈ టోర్నీలో పాల్గొనకుండా పారిపోయాడు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై గంభీర్ వెంటనే స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లి ఇప్పటికే 35 నుంచి 36 సెంచరీలు చేశాడు. కోహ్లి గురించి మాట్లాడుతున్న ఈ పెద్దమనిషి(తన్వీర్) కోహ్లి సెంచరీలు చేసినన్ని అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఆడలేదు’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ డిస్కషన్ హాట్ టాపిక్ అయింది. కోహ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తన్వీర్పై కోహ్లి, భారత అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో రాణించిన కోహ్లి వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలోపెట్టుకుని టీం మేనేజ్మెంట్ అతనికి ఆసియాకప్ నుంచి మినహాయింపునిచ్చింది. -
ఆసియాకప్ : బంగ్లాదే బ్యాటింగ్
దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ మాట్లాడుతూ..‘ఇక్కడ కొన్ని మ్యాచ్లు ఆడాం. ఫ్లడ్ లైట్స్ కింద ఆడటమే ఇక్కడ బెటర్.. దీంతో ఛేజింగ్కు మొగ్గుచూపుతున్నాం’ అని తెలిపాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హర్ధిక్ పాండ్యా ఈ సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. దీంతో పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వచ్చాడు. ఇక బంగ్లాదేశ్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. పాక్తో గెలిచి రోహిత్ సేన ఉత్సాహంగా ఉండగా.. అఫ్గానిస్తాన్తో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి టైటిల్ రేసుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తుంది. విశ్రాంతి లేకుండా బరిలోకి దిగడం బంగ్లాదేశ్కు ప్రతికూలం కానుంది. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, మోమినుల్ హక్, షకీబ్, మిథున్, మçహ్ముదుల్లా, మొసద్దిక్ హొస్సేన్, హసన్ మిరాజ్, రుబెల్ హొస్సేన్, నజ్ముల్, అబు హైదర్. -
బంగ్లా.. ఇప్పుడు నాగినీ డ్యాన్స్ చేయరేం?
అబుదాబి: ఆసియాకప్లో బంగ్లాదేశ్పై అఫ్గానిస్తాన్ సంచలన విజయం నమోదుచేసిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ పోరులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్ను ఆల్రౌండ్ ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో అఫ్గాన్ 136 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బంగ్లా ఆటగాళ్లను ఆటపట్టిస్తున్నారు. ‘ఇప్పుడు నాగినీ డ్యాన్స్ చేయరేం?, అయ్యో.. బంగ్లా ఓడింది.. మేం నాగిని డ్యాన్స్ మిస్సయ్యాం. డియర్ బంగ్లాదేశ్.. ప్రతిరోజు నాగుల పంచమి ఉండదు.. నాగిని డ్యాన్స్ కంటే క్రికెట్ స్కిల్స్ మెరుగుపరుచుకోండి’ అనే కామెంట్స్తో ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్.. ఫేమస్ అయిన విషయం తెలిసిందే. శ్రీలంకపై గెలిచిన ఆనందంలో అప్పుడు బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్తో మైదానంలో చిందేశారు. ఇక బంగ్లాదేశ్ నేడు భారత్తో తలపడనుంది. #Banvsafg where is the nagin dance. — Prranab kumar Roy (@PrranabRoy) September 21, 2018 Dear Bangladesh, Every day is not 'Nag Panchami' so work hard to sharp your cricketing skills not your 'Nagin Dance Skills. — ASHISH (@ashishtambe2007) September 21, 2018 This picture truly describes the condition of Bangladeshi fans after this shocking defeat. 😂 I want to ask them..... "Where is your Nagin Dance?" Ok I got the answer. You guys will Photoshop your victory. #BANvAFG pic.twitter.com/F76fGFxcGv — Tanisha Gupta (@Tanisha2409) September 20, 2018 -
భారత జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్ ఫ్యాన్స్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ను 162 పరుగులకే కట్టడి చేసి, ఆపై విజయాన్ని సునాయాసంగా అందుకుంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు ఫీల్డ్లోకి వెళ్లిన తర్వాత తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, భారత జాతీయ గీతం రన్ అవుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం అందుకు తమ శృతిని జత చేశారు. పలువురు పాక్ అభిమానులు నిలబడి మరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపైభారత జాతీయ పలువురు భారత నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరొకవైపు దీనికి సంబంధించి వీడియో వైరల్గా మారింది. -
జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్
-
బంగ్లా పై అఫ్గాన్ ఘనవిజయం
-
హార్దిక్ పాండ్యా ఔట్
దుబాయ్: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్కు దూరమయ్యాడు. పాకిస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో వెన్నునొప్పితో కుప్పకూలిన అతను టోర్నీనుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పాండ్యా స్థానంలో పేసర్ దీపక్ చహర్ను ఎంపిక చేశారు. మరో వైపు పాక్తో పోరులో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ కూడా టోర్నీకి దూరం కాగా, అతని స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో అతడిని కూడా స్వదేశం పంపిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు... మరో పేసర్ సిద్ధార్థ్ కౌల్ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు గురువారం భారత జట్టుతో చేరారు. -
‘సినిమా ఇంకా ఉంది’
ఆసియా కప్ను మళ్లీ నిలబెట్టుకునే క్రమంలో పాకిస్తాన్పై సాధించిన సాధికార విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేయడం ఖాయం. హాంకాంగ్లాంటి అసోసియేట్ జట్టుపై చెమటోడుస్తూ దాదాపు 100 ఓవర్ల పాటు మైదానంలో గడపాల్సి వచ్చినా పాక్పై చూపించిన ఆట అద్భుతం. పాండ్యా గాయం మాత్రమే భారత్ను కలవరపరిచే అంశం. అతని స్థానంలో ఎవరికి ఆడిస్తారనేది చూడాలి. పాకిస్తాన్పై, అంతకుముందు హాంకాంగ్పై ప్రదర్శనను బట్టి చూస్తే తాను ఆల్రౌండర్ పాత్రకు సరిగ్గా సరిపోతానని కేదార్ జాదవ్ నిరూపించాడు. ప్రత్యర్థులు అతడిని తక్కువగా అంచనా వేశారా లేక అతని బౌలింగ్ శైలికే ఆశ్చర్యపోయారా తెలీదు కానీ మొత్తానికి తన జట్టు తరఫున అతను సత్తా చాటాడు. ప్రధాన బౌలర్లు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే కెప్టెన్కు జాదవ్ మంచి ప్రత్యామ్నాయం కాగలడు. ధావన్, రోహిత్ ఫామ్లోకి రావడం భారత్ను సంతోషపెట్టే విషయం. దూకుడైన ఆరంభం లభిస్తే ఆ తర్వాత భారీ స్కోరు సాధిం చడం సులువవుతుంది. రాయు డు కూడా మంచి టచ్లో కనిపిస్తుండగా డైరెక్ట్ త్రోతో అతను షోయబ్ మాలిక్ను రనౌట్ చేసిన తీరు పాకిస్తాన్ చివర్లో చెలరేగిపోకుండా చేసింది. గత ఏడాది కాలంగా భారత పేస్ బౌలింగ్ దళం ఎంతో ఎదిగిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగలమని నిరూపించింది. తీవ్రమైన ఎండలు ఉన్న ఎడారిలో కూడా వారి ప్రదర్శన అభినందనీయం. భారత్, పాక్ మధ్య మ్యాచ్ గురించి భారీగా అంచనాలు పెరిగిపోతుంటే మరో వైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్వంటి జట్లను తేలిగ్గా చూసే ప్రమాదం పొంచి ఉంటుంది. హాంకాంగ్తో మ్యాచ్ అనుభవం తర్వాత భారత్ మళ్లీ తప్పు చేయలేదు. టోర్నీలో ప్రతీ మ్యాచ్ నెగ్గాలనే పట్టుదల కనబరుస్తూ పాక్పై గెలిచి చూపించింది. శ్రీలంకపై విజయంపై వన్డేల్లో తమ ఆట ఎలాంటిదో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నిరూపించాయి. అఫ్గానిస్తాన్ ఒక వేళ ముందుగా బ్యాటింగ్కు దిగి 250 పరుగుల వరకు చేస్తే ఇక్కడి పిచ్లపై వారి స్పిన్నర్లు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. విరిగిన చేత్తోనే బ్యాటింగ్కు వచ్చిన తమీమ్ ఇక్బాల్ను చూస్తే బంగ్లాదేశ్ కూడా ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతుంది. పాకెట్ డైనమో ముష్ఫికర్ రహీమ్ మ్యాచ్ మ్యాచ్కూ మెరుగవుతున్నాడు. అటాకింగ్తో పాటు తక్కువ స్కోరును కూడా కాపాడుకోగలిగే బౌలింగ్ వనరులు ఆ జట్టుకు ఉన్నాయి. పాకిస్తాన్ను ఓడించడంతో భారత్ అన్ని జట్లకంటే పై స్థాయిలో కనిపించడం వాస్తవమే కానీ ‘సినిమా ఇంకా మిగిలే ఉంది’ అని మరచిపోవద్దు! -
జోరు కొనసాగాలి
ఆసియా కప్ ‘సూపర్’ అంకానికి చేరింది. టోర్నీ ఫేవరెట్ భారత్ను2012, 2016 ఫైనలిస్ట్ బంగ్లాదేశ్ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. శ్రీలంకను ఓడించిన ఉత్సాహాన్ని అఫ్గానిస్తాన్నీరుగార్చిన నేపథ్యంలో మేటి జట్టయిన భారత్ను ఢీకొట్టాలంటే బంగ్లాదేశ్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే! దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇప్పుడు ‘సూపర్–4’ ఫైట్ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్తో తలపడనుంది. అనామక హాంకాంగ్పై చాలాకష్టంగా గెలిచిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అలవోక విజయాన్ని సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ తమకన్నా మెరుగైన శ్రీలంకను చిత్తు చేసింది. ఆల్రౌండ్ నైపుణ్యంతో ఉన్న ఈ జట్టు గతంలో భారత్కు కీలక మ్యాచ్ల్లో గట్టి షాక్లనే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన అనవసర అగచాట్లు పడకుండా ఉండాలంటే మ్యాచ్ ప్రారంభం నుంచే జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే హాంకాంగ్తో తొలిపోరులో చెమటలు కక్కిన భారత బృందం ఎలాగోలా గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఇక్కడ అలాంటి అవకాశం బంగ్లాకు ఇస్తే టీమిండియాకు షాక్ తప్పదు. దీంతో రోహిత్ అలసత్వానికి తావివ్వకుండా కడదాకా స్థాయికి తగ్గ ఆటతీరును కొనసాగించాల్సిందే. బ్యాటింగే బలంగా... భారత జట్టు మరోసారి సమష్టితత్వంతో చెలరేగేందుకు సిద్ధమైంది. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో టాపార్డర్ చెలరేగగా, మిడిలార్డర్ తడబడింది. లేదంటే 300 పరుగుల స్కోరును అలవోకగా అధిగమించేది. ఇక పాక్తో జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్లో మిడిలార్డర్కు అవకాశం దక్కలేదు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఓపెనర్ ధావన్ నిలకడగా ఆడగా, పాకిస్తాన్తో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, రాయుడు టచ్లోకి వచ్చారు. ధోని, జాదవ్లు ఇంకా తమ బ్యాటింగ్ సత్తాను చూపాల్సివుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో మనీశ్ పాండే లేదంటే జడేజా ఆడే అవకాశముంది. బౌలింగ్ విభాగంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలిద్దరూ పాక్ పనిపట్టారు. జాదవ్ కూడా మెరిశాడు. స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు కూడా హాంకాంగ్తో జరిగిన పోరులో ఆలస్యంగానైనా సత్తాచాటారు. కానీ పాకిస్తాన్తో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో వీళ్లిద్దరి స్పిన్ కీలకమయ్యే అవకాశముంది. భారత్ ఫామ్ దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ సేన దుర్బేధ్యంగా కనిపిస్తోంది. పోటీనివ్వగలదా... వన్డేల్లో బంగ్లాదేశ్ రాటుదేలింది. ఇటీవల స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఉరిమే ఉత్సాహంతో మొర్తజా సేన ఈ టోర్నీలో ఆకట్టుకుంది. అయితే బ్యాటింగ్ కంటే బౌలింగే బంగ్లా ఆయుధమైంది. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో ముష్ఫికర్ రహీమ్, మొహమ్మద్ మిథున్ మినహా ఇంకెవరూ పట్టుమని 15 పరుగులైనా చేయలేకపోయారు. అలాంటి పరిస్థితిలో పోరాడే లక్ష్యాన్ని నిలబెట్టిన ఘనత కచ్చితంగా బౌలర్లదే. బంతిని అందుకున్న ఆరుగురు బౌలర్లు వికెట్లు తీశారు. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లోనూ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించారు. షకీబుల్, అబు హైదర్, రూబెల్ హుస్సేన్ అఫ్గానిస్తాన్ టాప్, మిడిలార్డర్ను దెబ్బతీశారు. అయితే రషీద్ ఖాన్, గుల్బదిన్ నైబ్ల అజేయ భాగస్వామ్యం వల్ల అఫ్గానిస్తాన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. ఆ రెండు జట్ల కంటే భారత్ బలమైన ప్రత్యర్థి. అడపాదడపా వికెట్లతో, లేదంటే ఒకటి రెండు అర్ధసెంచరీలతో రోహిత్సేనను ఓడించడం కష్టం. ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్, బౌలర్లు అందరూ రాణిస్తేనే టీమిండియాపై ప్రభావం చూపగలుగుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, మనీశ్ పాండే/ జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, మోమినుల్ హక్, షకీబ్, మిథున్, మçహ్ముదుల్లా, మొసద్దిక్ హొస్సేన్, హసన్ మిరాజ్, రుబెల్ హొస్సేన్, నజ్ముల్, అబు హైదర్. ►సా. గం.5 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం ►నేడు జరిగే మరో సూపర్ 4 మ్యాచ్లోపాకిస్తాన్తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది -
అఫ్గాన్ అదరహో
అర్ధ సెంచరీ, 2 వికెట్లు, డైరెక్ట్ త్రోతో రనౌట్...తన బర్త్డేను రషీద్ ఖాన్ అద్భుతంగా మలచుకున్నాడు. స్టార్ బౌలర్గా ఇప్పటికే గుర్తింపు ఉన్న ఇతను మెరుపు హాఫ్ సెంచరీతో బ్యాట్స్మన్గా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించాడు. టీనేజర్గా అనేక సంచలనాలు సాధించిన రషీద్... ఆ దశను దాటి సరిగ్గా 20వ పడిలోకి ప్రవేశించిన రోజు తన జట్టుకు బంగ్లాదేశ్పై అద్భుత విజయాన్ని అందించాడు. శ్రీలంకను చిత్తు చేసి ఘనంగా కనిపించిన బంగ్లా... అఫ్గాన్ పట్టుదలకు తలవంచింది. అబుదాబి: ఆసియా కప్లో అఫ్గానిస్తాన్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోరులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్ను ఆల్రౌండ్ ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో అఫ్గాన్ 136 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 255 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (58; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుల్బదిన్ నైబ్ (42 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. జట్టు స్కోరు 160/7 వద్ద క్రీజులోకి వచ్చిన రషీద్, నైబ్తో కలిసి బ్యాట్ ఝళిపించాడు. ఇద్దరు అభేద్యమైన ఎనిమిదో వికెట్కు 9.1 ఓవర్లలో 95 పరుగులు జోడించారు. బంగ్లా ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద మొదలైన బంగ్లా వికెట్ల పతనం క్రమం తప్పకుండా సాగింది. టాపార్డర్లో షకీబుల్ హసన్ (32), మిడిలార్డర్లో మహ్మూదుల్లా (27; 2 ఫోర్లు), మొసద్దిక్ హొస్సేన్ (20 నాటౌట్, 2 ఫోర్లు) కాసేపు బ్యాటింగ్ చేశామనిపించారు. రషీద్తో పాటు గుల్బదిన్ నైబ్ 2 వికెట్లు తీయగా, అఫ్తాబ్ ఆలం, ముజీబుర్ రహమాన్, మొహమ్మద్ నబీ, రహ్మత్ షా తలా ఒక వికెట్ తీశారు. ఈ గ్రూపులో లంక ముందే నిష్క్రమించగా, టాపర్గా అఫ్గాన్, రెండో జట్టుగా బంగ్లాదేశ్ ‘సూపర్–4’కు చేరాయి. ►అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు (112) తీసిన బౌలర్గా మొహమ్మద్ నబీ (111)ని అధిగమించి రషీద్ఖాన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. -
‘చాహల్ నిజంగా జెంటిల్మన్’
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో అద్బుతమైన ఆటతీరుతోనే కాదు.. మంచి మనసుతోనూ అభిమానుల హృదయాలు గెలుచుకోవచ్చని నిరూపించాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్. ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్, కేదార్ జాదవ్లో పోటీ పడి వికెట్లు తీయలేకపోయిన ఒక సూపర్బ్ క్యాచ్తో ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో చాహల్ చూపిన క్రీడా స్పూర్తికి యావత్ క్రీడా అభిమానులు, నెటజన్లు ఫిదా అయ్యారు. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 42.4 ఓవర్ బౌలింగ్ చేస్తున్న చాహల్ పాక్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖాన్ షూ లేస్ కట్టి అతడికి సహాయం చేశాడు. ప్రస్తుతం చాహల్ పాక్ బ్యాట్స్మన్కు షూలేస్ కట్టిన ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు చహల్ను అభినందిస్తున్నారు. క్రీడా స్పూర్తిని చాటిన మణికట్టు మాంత్రికుడు నిజంగా జెంటిల్మన్, హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న ఆటలో ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోకుండా ఆటలకు ఉన్న గౌరవాన్ని కాపాడారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో చాంపియన్ ట్రోఫీలో పాక్పై టీమిండియాకు ఎదురైన పరాభవానికి ఈ విజయం కాస్త ఉపశమనం కలిగించింది. -
మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్..
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడి టోర్నీ నుంచి వైదొలగగా, ఇప్పుడు మరో ఇద్దరు భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్లు సైతం గాయం కారణంగా ఆసియాకప్కు దూరమయ్యారు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్షర్ పటేల్ ఎడమచేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో అక్షర్ చేతి వేలికి స్కాన్ చేసిన తర్వాత గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో అతను పూర్తి సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న బీసీసీఐ.. తొడ కండరాల గాయంతో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఆసియాకప్కు దూరమైనట్లు తెలిపింది. హాంకాంగ్తో మ్యాచ్లో శార్దూల్ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సిద్దార్థ్ కౌల్లు తదుపరి సిరీస్లో ఆడతారని పేర్కొంది. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చాహర్ను జట్టులోకి తీసుకున్నారు. -
గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారు: వకార్
దుబాయ్: ఆసియాకప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురై చిత్తు కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. ఇక్కడ టీమిండియా ఒత్తిడిలోకి వెళుతుందని అనుకుంటే, పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం తనకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందన్నాడు. ‘ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్లను పాకిస్తాన్ కోల్పోయింది. గత కొంతకాలంగా యూఏఈ అనేది పాకిస్తాన్కు సొంత వేదికగా ఉంది. అదే సమయంలో దుబాయ్లో విపరీతమైన వేడి వాతావరణం మధ్య భారత్ ఎక్కువగా మ్యాచ్లు కూడా ఆడలేదు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత్కు ఇక్కడకు వచ్చింది. పాక్తో మ్యాచ్కు ముందు రోజు హాంకాంగ్పై భారత్ చెమటోడ్చి గెలిచింది. ఇవన్నీ పాక్కు అనుకూలంగా మారతాయని అనుకున్నా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొత్తంగా తమ జట్టే చిత్తుగా ఓడిపోయింది. ఎటువంటి పోరాటం చేయకుండానే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక గోల్డెన్ చాన్స్ను పాకిస్తాన్ కోల్పోయింది. నా వరకూ అయితే భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య చివరిగా జరిగిన రసవత్తరమైన మ్యాచ్ ఏదైనా ఉందంటే, అది 2011లో మొహాలీలో జరిగిన వరల్డ్కప్ సెమీ ఫైనల్ మ్యాచే’ అని వకార్ తెలిపాడు. -
రోహిత్ @ 294
దుబాయ్: ఆసియాకప్లో టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. బుధవారం దుబాయి వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ రోహిత్ శర్మకు 294వ అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు సాధించిన రోహిత్ శర్మ తన అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్యను 294కు పెంచుకోవడం మరో విశేషం. ఇప్పటివరకూ రోహిత్ శర్మ 185 వన్డేలు, 25 టెస్టులు, 84 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇక్కడ వన్డేల్లో సాధించిన సిక్సర్ల సంఖ్య 176 కాగా, టెస్టుల్లో 29 సిక్సర్లు సాధించాడు. ఇక ఇంటర్నేషనల్ టీ20ల్లో 89 సిక్సర్లను రోహిత్ కొట్టాడు. పాకిస్తాన్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్పై భారత జట్టు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. -
పాకిస్తాన్పై భారత్ కొత్త రికార్డు
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ను 162 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. ఆపై లక్ష్యాన్ని 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఒక కొత్త రికార్డును భారత్ నమోదు చేసింది. ఇది బంతుల పరంగా చూస్తే భారత్కు అతి పెద్ద విజయం. ఇంకా 126 బంతులు(21 ఓవర్లు) ఉండగానే భారత్ గెలుపును సొంతం చేసుంది. దాంతో పాక్పై గతంలో 105 బంతులు ఉండగా సాధించిన విజయాన్ని టీమిండియా తాజాగా సవరించింది. 2006లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 105 బంతులు మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది. ఇదే ఇప్పటివరకూ భారత్కు పాక్పై భారీ విజయం కాగా, ఇప్పుడు దాన్ని తిరగరాస్తూ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1997లో 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 92 బంతులు ఉండగా విజయాన్ని సాధించింది. ఈ మూడు బంతులు పరంగా చూస్తే పాక్పై భారత్ సాధించిన అతిపెద్ద విజయాలుగా ఉన్నాయి. చదవండి: తొలి దెబ్బ మనదే -
టీమిండియాపై ప్రశంసలు..
దుబాయ్: ఆసియాకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పనిపట్టింది టీమిండియా. బౌలింగ్తో పాక్ ఆటగాళ్లను బెంబేలెత్తించి.. బ్యాటింగ్తో రెచ్చిపోయి పాక్పై భారీ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ 162 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన భారత్.. మరో 21 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన చూసి ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా భారత ఆటగాళ్లపై ట్వీటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘మంచి విజయం సాధించారు. కంగ్రాట్స్ ఇండియా. జట్టు సమగ్ర కృషి చాలా బాగుంది. ఈ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించారు’ అని సెహ్వాగ్ అభినందించగా, ‘24 గంటల్లోనే రెండు వన్డే మ్యాచ్ల్లో భారత్ విజయం. ఇది సాధ్యమవుతుందని ఎవరైనా ఊహించారా? చాలా బాగా ఆడారు’ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ‘కంగ్రాట్స్ ఇండియా. బౌలర్లు, బ్యాట్స్మెన్ అంతా కలిసి చక్కటి ప్రదర్శన చేశారు’ అని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ‘అంత వేడిలో వెనువెంటనే రెండు మ్యాచ్లు.. ప్రతిధ్వనించే విజయాలు.. బౌలర్లు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రోహిత్ సమర్థంగా జట్టును నడిపించాడు. కంగ్రాట్స్ టీమిండియా’ అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందించగా, ‘ అద్భుతంగా ఆడారు.. కంగ్రాట్స్ టీమిండియా’ అని రైనా పేర్కొన్నాడు. -
పాక్పై భారత్ ఘనవిజయం
-
ధోని వీరాభిమాని!
హాంకాంగ్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ధోని డకౌట్గా వెనుదిరిగిన సమయంలో ఒక కుర్రాడి హావభావాలు చూశారా! తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అతను తన అసహనాన్ని ప్రదర్శించాడు. తాను కూర్చున్న కుర్చీని కూడా దాదాపు విరగ్గొట్టినంత పని చేసిన అతను ధోని ఔట్ కాగానే స్టాండ్స్లో ఎక్కడికో వెనక్కి వెళ్లిపోయి కూర్చున్నాడు. స్టార్ స్పోర్ట్స్ కూడా పదే పదే ఈ అబ్బాయి ఉద్వేగంగా అరుస్తున్న దృశ్యాలను చూపించింది. మ్యాచ్ ముగిశాక అతను స్థానిక మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లు కూడా అతడిని స్టూడియోకు పిలిపించి ‘అంత కోపం ఎందుకు’ అనే శీర్షికతో కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఆ అబ్బాయి పేరు కోటమర్తి ఆద్రిత్. వయసు 9 ఏళ్లు. స్వతహాగా వికెట్ కీపర్ బ్యాట్స్మన్. ధోనికి వీరాభిమాని. దుబాయ్లో స్వయంగా ధోని నెలకొల్పిన అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. తొలిసారి ధోని మ్యాచ్ను ‘లైవ్’గా చూసేందుకు వచ్చాడు. అయితే 3 బంతుల్లోనే తన ఆనందం ఆవిరి కావడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నాడు! -
తొలి దెబ్బ మనదే
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాభవానికి ఏడాది తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థికి సొంత మైదానంలాంటి ఎడారి గడ్డలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. ముందుగా చక్కటి బౌలింగ్తో పాకిస్తాన్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా, ఆ తర్వాత అలవోక బ్యాటింగ్తో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్లో దాయాదుల మధ్య జరిగిన తొలి పోరులో రోహిత్ సేనకే విజయం దక్కింది. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. వచ్చే ఆదివారం సూపర్–4 దశలో రెండు జట్లు మరోసారి పోరుకు ‘సై’ అంటున్నాయి. సంచలనాలు లేకపోతే ఫైనల్లో కూడా మళ్లీ తలపడే అవకాశం ఉండటంతో ద్వైపాక్షికం కాని మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో ప్రస్తుతానికి పాక్పై భారత్దే 1–0తో పైచేయి అయింది. దుబాయ్: ఆసియా కప్ తొలి మ్యాచ్లో హాంకాంగ్తో తడబడిన భారత్ తర్వాతి రోజే అసలు సమరంలో తమ పూర్తి సత్తాను ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (62 బంతుల్లో 47; 6 ఫోర్లు), షోయబ్ మాలిక్ (67 బంతుల్లో 43; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (3/13), కేదార్ జాదవ్ (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (54 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది. కీలక భాగస్వామ్యం... హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన భువనేశ్వర్ ఈసారి భారత్కు అదిరే ఆరంభాన్ని అందించాడు. పాక్ ఓపెనర్లను వరుస ఓవర్లలో అతను పెవిలియన్ పంపించాడు. ఇమామ్ (2), ఫఖర్ జమాన్ (0) ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. బుమ్రా తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్లుగా ముగించడం విశేషం. ఈ దశలో ఆజమ్, మాలిక్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లే ముగిసేసరికి పాకిస్తాన్ 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఫీల్డర్ల వైఫల్యాలు వీరికి కలిసొచ్చాయి. పాండ్యా బౌలింగ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాలిక్ ఇచ్చిన క్యాచ్ను ధోని... 37 వద్ద భువనేశ్వర్ వదిలేశారు. జాదవ్ జాదూ... ఎట్టకేలకు కుల్దీప్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతను వేసిన చక్కటి బంతికి ఆజమ్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఆజమ్, మాలిక్ మూడో వికెట్కు 82 పరుగులు జోడించారు. దీని తర్వాత పాక్ పతనం మొదలైంది. జాదవ్ బంతికి భారీ షాట్ ఆడబోయిన సర్ఫరాజ్ (6)ను అద్భుత క్యాచ్తో మనీశ్ పాండే వెనక్కి పంపగా... లేని సింగిల్ కోసం ప్రయత్నించిన మాలిక్ను రాయుడు డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. ఆసిఫ్ (9), షాదాబ్ (8) వికెట్లు కూడా జాదవ్ ఖాతాలోకే వెళ్లాయి. చివర్లో అష్రఫ్ (21), ఆమిర్ (18 నాటౌట్) పోరాటంతో ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. 77 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 8 వికెట్లు పడ్డాయి. నిలకడగా... లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం లభించింది. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత రోహిత్, ధావన్ బ్యాట్ ఝళిపించారు. ఆమిర్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, ఉస్మాన్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు ధావన్ కూడా చకచకా పరుగులు సాధించాడు. హసన్ ఓవర్లో మరో భారీ సిక్సర్ కొట్టిన రోహిత్, అదే ఓవర్లో ఫోర్తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే షాదాబ్... రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరిగాడు. అయితే అంబటి రాయుడు (31 నాటౌట్; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. షేక్ కోసం ప్రసారం ఆపేసి... ఏదైనా మ్యాచ్ మధ్యలో టోర్నీతో సంబంధం ఉన్న ప్రముఖులతో మాట్లాడించడం తరచుగా జరిగేదే. కానీ బుధవారం స్టార్ అన్ని హద్దులు దాటేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ సందేశం వినిపించడం కోసం మ్యాచ్ ప్రసారాన్నే ఆపేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా వేసిన 8వ ఓవర్ ప్రసారం కాలేదు. పాండ్యాకు గాయం... 18వ ఓవర్లో ఐదో బంతిని వేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. తీవ్రమైన వేడికి, కండరాలు పట్టేయడం వల్ల అతను ఇబ్బంది పడ్డాడని ముందుగా అనుకున్నారు. అతడిని స్ట్రెచర్పై మైదానం బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. బీసీసీఐ ఆ తర్వాత అధికారిక వివరణ ఇచ్చింది. పాండ్యా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. నడవగలిగే స్థితిలో ఉన్నాడని, అతని గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. భారత్ ఇన్నింగ్స్లో పాండ్యాకు బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. మనీశ్ పాండే సూపర్ క్యాచ్... భారత జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలపరంగా చూస్తే మనీశ్ పాండే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. బుధవారం అతను దానిని మళ్లీ నిరూపించాడు. పాండ్యా గాయం కారణంగా పెవిలియన్ చేరగా... అతని స్థానంలో మనీశ్ సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్కు వచ్చాడు. జాదవ్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఇచ్చిన క్యాచ్ను వైడ్ లాంగాన్ బౌండరీ వద్ద అతను అద్భుతంగా అందుకున్నాడు. బంతిని అందుకునేందుకు ముందుగా తన కుడి వైపు చాలా దూరం పరుగెత్తిన పాండే అదే ఊపులో క్యాచ్ పట్టేశాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడం కష్టం కావడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ లోపలికి వచ్చి అతను క్యాచ్ను పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఈ తరహా క్యాచ్లు చాలా కనిపించినా అంతర్జాతీయ మ్యాచ్లలో అరుదనే చెప్పవచ్చు. పాక్పై భారత్ మరో 126 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇన్నింగ్స్లో మిగిలిన బంతులపరంగా చూస్తే పాక్పై భారత్కు ఇదే అతి పెద్ద గెలుపు. -
పాక్పై భారత్ ఘనవిజయం
దుబాయ్: ఆసియాకప్లో పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం సాధించింది. పాక్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాట్స్మన్లలో బాబర్ ఆజమ్ 47(62 బంతులు), షోయబ్ మాలిక్43(67 బంతులు)లు రాణించారు. కేదార్ జాదవ్, భువనేశ్వర్లు చెరో మూడు వికెట్లు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ ఎలాంటి తడబాటుకు గురికాకుండా టార్గెట్ను 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్ శర్మ52(39 బంతులు), ధావన్46(54 బంతులు), రాయుడు31 నాటౌట్(46 బంతులు), కార్తీక్31 నాటౌట్(37 బంతులు) రాణించారు. -
ఆసియాకప్ : 162కే పాక్ ప్యాకప్
దుబాయ్ : ఆసియాకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఆటగాళ్లు చెలరేగారు. బౌలింగ్, ఫీల్డింగ్తో పాక్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టారు. పార్ట్టైం బౌలర్ కేదార్ జాదవ్ (3/23), పేసర్లు భువనేశ్వర్(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో పాక్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. భువనేశ్వర్ దెబ్బకు ఆదిలోనే ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(2), ఫఖర్ జమాన్(0)ల వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్ (47)ను కుల్దీప్ ఔట్ చేసి విడదీశాడు. భారత అద్భుత ఫీల్డింగ్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(6)ను మనీష్ పాండే అద్భుత క్యాచ్తో పెవిలియన్ పంపించగా.. అంబటి రాయుడు సూపర్ త్రో తో షోయబ్ మాలిక్(43)ను రనౌట్ చేశాడు. దీంతో పాక్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే జాదవ్ అసిఫ్ అలీ(9), షాదాబ్ఖాన్ (8)లను ధోని అద్భుత కీపింగ్ సాయంతో పెవిలియన్కు చేర్చాడు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్కు అష్రఫ్, మహ్మద్ అమిర్ సాయంతో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అష్రఫ్(21)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. చివర్లో భువనేశ్వర్ హసన్ అలీ(1), బుమ్రా ఉస్మాన్ఖాన్ను గోల్డెన్ డక్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో కేదార్ జాదవ్ 3, భువనేశ్వర్ 3, కుల్దీప్ 1, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. -
వారెవ్వా.. పాండే సూపర్ క్యాచ్!
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా దాయాదీ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే అద్భుత క్యాచ్తో ఔరా అనిపించాడు. కేదార్ జాదవ్ వేసిన 25 ఓవర్ ఐదో బంతిని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్ను దాటి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత ఫీట్తో మైదానంలోని ప్రేక్షకులు.. ఆటగాళ్లు థ్రిల్ అయ్యారు. దీంతో సర్ఫరాజ్ (6) పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో లేని పాండే ఆల్రౌండర్ హర్ధిక్ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో ఫీల్డింగ్కు వచ్చాడు. రాయుడు అద్భుత త్రో.. క్రీజులో పాతుకుపోయి.. అప్పటికే ఓ లైఫ్ దక్కించుకొని ప్రమాదకరంగా మారుతున్న మాలిక్(43)ను అంబటి రాయుడు అద్బుత ఫీల్డింగ్తో పెవిలియన్ చేర్చాడు. జాదవ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి మాలిక్ (43) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. రాయుడు విసిరిన బంతి డైరెక్ట్గా వికెట్లను తాకడం విశేషం. దీంతో పాక్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే అసిఫ్ అలీ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. -
పాండే సూపర్ క్యాచ్!
-
పాక్తో మ్యాచ్: భారత్కు ఎదురుదెబ్బ
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా దాయాదీ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ మధ్యలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. 18వ ఓవర్ వేసిన పాండ్యా ఐదో బంతి వేస్తుండగా.. వెన్ను పట్టేసింది. దీంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే భారత ఫిజియోలు మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. నొప్పితో విలవిలలాడుతున్న పాండ్యాను స్ట్రెచర్ సాయంతో మైదానం బయటకు తీసుకెళ్లారు. దీంతో ఈ ఓవర్ చివరి బంతిని రాయుడు వేసాడు. పాండ్యా గాయం భారత్కు ప్రతి కూలం కానుంది. అతని గాయం.. భారత బౌలింగ్, బ్యాటింగ్ల విభాగాలపై దెబ్బపడనుంది. ఇక అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ను భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లిద్దరిని ఇమామ్ ఉల్ హక్(2), ఫఖర్ జమాన్(0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో పాక్ మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అజమ్(47)ను కుల్దీప్ ఔట్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 21.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసిది. క్రీజులో మాలిక్(35), సర్ఫరాజ్ అహ్మద్(0)లు ఉన్నారు. -
ఆసియాకప్: పాక్దే బ్యాటింగ్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కే మొగ్గు చూపాడు. ఇక భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఖలీల్ అహ్మద్, శార్ధుల్ టాకుర్ స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యాలు జట్టులోకి వచ్చారు. పాక్ ఎలాంటి మార్పుల్లేకుండా హాంకాంగ్తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నామని భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు. అయినప్పటికి ఛేజింగ్ను స్వీకరిస్తున్నామని, నిన్న హాంకాంగ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగే చేశామన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇరు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లి గైర్హాజరితో బరిలోకి దిగుతున్న భారత్ ఎలాగైనా మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. గత కొన్ని రోజులుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న పాక్ ఈ మ్యాచ్ను సైతం గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లురుతోంది. తుది జట్లు భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, ధోని, కార్తిక్, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్,బుమ్రా, చహల్, కుల్దీప్ పాకిస్తాన్: ఇమామ్, ఫకార్, బాబర్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, షాదాబ్, ఫహీమ్, ఆమిర్, హసన్, ఉస్మాన్ ఖాన్ -
ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది: హర్భజన్
ముంబై: భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్( 2007) ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన తుదిపోరులో పేసర్ శ్రీశాంత్ అద్భుత క్యాచ్తో భారత్ ప్రపంచకప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాచ్ను శ్రీశాంత్ వదిలేసి ఉంటే అతనిపై చేయిచేసుకునేవాడినని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఇండియా టుడే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కలగలేదని అభిప్రాయపడ్డాడు. ‘అదో అద్భుత సందర్భం. ఆ ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి.. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అనిపించలేదు. ఈ విజయంతో భారత్ చేరుకున్నప్పుడు ముంబై వీధుల్లో జనాలు నిలబడి స్వాగతం పలకడం ఇంకా కళ్ల ముందే కదలుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి వాంఖెడే స్టేడియం చేరుకోవడానికి 6 గంట ల సమయం పట్టింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీశాంత్ ఆ క్యాచ్ను అందుకోవడం నిజంగా లక్కే. మిస్బా తన షాట్ను సరిగ్గా ఆడలేదు. ఆ అవకాశాన్ని శ్రీశాంత్ అందిపుచ్చుకున్నాడు. ఒకవేళ శ్రీశాంత్ ఆ క్యాచ్ వదిలేసి ఉంటే.. ఈ టోర్నీ అనంతరం ఐపీఎల్లో జరిగిన ఘటన ముందే చోటుచేసుకునేది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. 2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్ సహనం కోల్పోయి శ్రీశాంత్పై మైదానంలోనే చేయిచేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్ మ్యాచ్ భారత్-పాక్ అభిమానులు మరిచిపోలేరు. ఇరు జట్లను కడదాక ఊరించిన విజయం చివరకు భారత్ వశం అయ్యింది. -
దాయాదుల పోరు : సోషల్ మీడియాకు బై చెప్పిన సానియా
దుబాయ్ : క్రికెట్లో ఫేవరెట్ జట్లంటే ముందు వినిపించే పేరు భారత్ - పాకిస్తాన్. అభిమానులనే కాక యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది దాయాదుల పోరే. ఇతర దేశాతో తలపడినప్పుడు వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా పాక్ తలపడినప్పుడు మాత్రం మనోళ్లు కేవలం భారతే గెలవాలని ఆకాంక్షిస్తారు. ఆటగాళ్లు కూడా పాక్తో మ్యాచ్ అంటే సాధరణం కంటే కాస్తా ఎక్కువ టెన్షనే పడతారు. కానీ ఇప్పుడు అభిమానులు, క్రికెటర్ల కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. సానియా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సానియాను ‘మీరు ఏ జట్టుకు మద్దతు తెలుపుతారు’ అన్ని ప్రశ్నించారు. అందుకు సానియా కాస్తా భిన్నమైన సమాధానం ఇచ్చారు. తాను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ వియషం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రారంభం కావడానికి 24 గంటలు కూడా లేదు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే అడ్డమైన చెత్తవాగుడు వినాల్సి వస్తది. ఇదంతా వింటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా జబ్బు పడాల్సిందే. మరి ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ మీరంతా ఒకటి గుర్తుంచుకొండి. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే’ అంటూ ట్వీట్ చేశారు. దుబాయ్ వేదికగా.. ఈరోజు సాయంత్ర 5గంటలకు భారత్-పాక్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. Soo less than 24hrs to go for this match,safe to sign out of social media for a few days since the amount of nonsense thts gonna b said here can make a ‘regular’ person sick ,let alone a pregnant one🙄Later guys!Knock yourselves out!BUT remember-ITS ONLY A CRICKET MATCH! Toodles! — Sania Mirza (@MirzaSania) September 18, 2018 -
ఆసియా కప్: హాంకాంగ్పై భారత్ గెలుపు
-
రోహిత్, ఆమిర్ల పోరు చూడాల్సిందే!
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈ పోరులో ఉత్కంఠకు లోటు ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ పర్యటనలో చెలరేగిన కోహ్లి గైర్హాజరు, భారత్ వరుసగా రెండు మ్యాచ్లు ఆడుతుండటం, ఇక్కడి ఎడారి వాతావరణంలో తీవ్రమైన వేడి వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్లుగా భారత్ ఆరంభం అదిరిపోవాలి. కానీ ఇంగ్లండ్లో విఫలమైన మన ఆటగాళ్లు ఎంత తొందరగా కోలుకొని గాడిలో పడతారనేది కీలకం. చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ధోని, రోహిత్, భువనేశ్వర్లాంటి వాళ్లు నేరుగా మ్యాచ్ బరిలోకి దిగి రాణించడం అంత సులువు కాదు. ఇక్కడి వేడి అన్నింటికంటే పెద్ద సమస్య. ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘ స్పెల్లు బౌలింగ్ చేసిన మన పేసర్లు కూడా ఇక్కడ అదే తరహాలో బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం. రెండేసి, మూడేసి పరుగులు తీయడం కూడా బ్యాట్స్మన్ శక్తిని పూర్తిగా హరించివేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టోర్నీలో డబుల్ సెంచరీ సాధించడం మాత్రం అసాధ్యమని తేలిపోయింది. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించడం వల్ల మానసికంగా పాకిస్తాన్దే పైచేయి. ఆ మ్యాచ్లో పాక్ ఓపెనర్లు, ఆరంభ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో భారత్ను చిత్తు చేశారు. ఎమిరేట్స్ కూడా పాకిస్తాన్ను సొంత మైదానంలాంటిది కాబట్టి ఇక్కడి పరిస్థితులపై భారత్కంటే వారికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆ జట్టు ఇటీవలి ఫామ్ కూడా చాలా బాగుంది. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉండటంతో పాటు వారి ఫీల్డింగ్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్పగా కనిపిస్తోంది. టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన సత్తా ఏమిటో ఇక్కడి చూపించాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. అయితే అటు వైపు మొహమ్మద్ ఆమిర్ సిద్ధంగా ఉన్నాడు. ఫుట్వర్క్ మెరుగ్గా ఉండని రోహిత్ను చక్కటి స్వింగ్తో తొలి రెండు ఓవర్లలోనే వెనక్కి పంపాలని అతను భావిస్తూ ఉండవచ్చు. దీనిని అధిగమించగలిగితే రోహిత్ను అడ్డుకోవడం చాలా కష్టం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ తర్వాత పాకిస్తానీ ఫఖర్ జమాన్ అతి వేగంగా దూసుకొచ్చాడు. మరోసారి అతని ఆట కీలకం కానుంది. ప్రతిభ గల పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు, భారత స్పిన్నర్లకు మధ్య జరిగే ఆసక్తికర పోరును చూడాల్సిందే. అయితే ఎప్పటిలాగే ఎవరు గెలుస్తారనేది ఈ మ్యాచ్లో అంచనా వేయడం కష్టమే. -
హమ్మయ్య... గెలిచాం
హాంకాంగే కదా అని ఆదమరిస్తే... ఏం జరుగుతుందో భారత్కు తెలిసొచ్చింది. అందుకేనేమో ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు’. కూన జట్టేగా అని తేలిగ్గా తీసుకున్న రోహిత్ సేనను 34 ఓవర్లపాటు పరుగుల వేటాడించి... ఆఖరిదాకా ఆటాడించింది హాంకాంగ్! ఇక తలవంపు, పరాభవం ఖాయమనుకున్న దశలో బౌలర్లు కళ్లు తెరిచారు. లేదంటే ఇంకో ఏడేనిమిది ఓవర్ల పాటు ఓపెనర్లు నిలిచుంటే హాంకాంగ్ చేతిలో కంగుతినడం ఖాయమయ్యేది. మొత్తానికి ఏదోలా గెలిచి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. పాకిస్తాన్తో మ్యాచ్ ఫలితం లేకుండానే భారత్ సూపర్–4కు అర్హత సాధించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన హాంకాంగ్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. దుబాయ్: భారత్ చేసిన స్కోరు 285/7. ఏ లెక్కన చూసిన హాంకాంగ్కు ఇది కొండంత లక్ష్యం. కానీ హాంకాంగ్ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్లిద్దరు భారత బౌలింగ్ను తుత్తునీయలు చేసేశారు. మ్యాచ్ను దాదాపు లాగేసుకున్నంత పనిచేశారు. చివరకు ఖలీల్ అహ్మద్ పేస్, కుల్దీప్, చహల్ల మణికట్టు మాయాజాలం భారత్ పరువును నిలబెట్టాయి. భారత ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ మ్యాచ్లో టీమిండియా 26 పరుగుల తేడాతో హాంకాంగ్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మంగళవారం టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 116 పరుగులు జోడించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. నిజాకత్ ఖాన్ (115 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అన్షుమన్ రత్ (97 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్) మొత్తం భారత శిబిరాన్నే వణికించారు. ఆలస్యంగానైనా మేల్కొన్న భారత బౌలింగ్ దళంలో కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్, చహల్ మూడేసి వికెట్లు తీయగా, కుల్దీప్కు 2 వికెట్లు దక్కాయి. శతక భాగస్వామ్యం... ఇంగ్లండ్తో టెస్టుల్లో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ మరోసారి తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి చెలరేగిపోయాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేసిన రోహిత్ శర్మ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే మూడో స్థానంలో అవకాశం అందుకున్న రాయుడు దానిని చక్కగా ఉపయోగించుకున్నాడు. అయితే వీరిద్దరి శతక భాగస్వామ్యాన్ని నవాజ్ విడదీశాడు. ఆ తర్వాత చకచకా పరుగులు సాధించిన ధావన్ 105 బంతుల్లో సెంచరీ సాధించాడు. వెంటవెంటనే... ధావన్కు మరో ఎండ్లో దినేశ్ కార్తీక్ (38 బంతుల్లో 33; 3 ఫోర్లు) నుంచి సహకారం లభించింది. ధాటిగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్కు 68 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. అయితే ఒక్కసారి ధావన్ వెనుదిరిగాక భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కించిత్ షా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పాయింట్లో క్యాచ్ ఇవ్వడంతో ధావన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ధోని (0), కార్తీక్, భువనేశ్వర్ (9), శార్దుల్ (0)లను హాంకాంగ్ వెనక్కి పంపింది. 42 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. మరో ఎండ్లో కేదార్ జాదవ్ (27 బంతుల్లో 28 నాటౌట్; 1 సిక్స్) పట్టుదలగా నిలబడటంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో భారత్ 48 పరుగులే చేసింది. వేగంగా మొదలైంది... భారత్ విధించిన లక్ష్యం ఆషామాషీ లక్ష్యం కాదు. క్రికెట్ కూన హాంకాంగ్కు ఇది కష్టసాధ్యమైంది. కానీ ఆ జట్టు ఓపెనర్లు నిజాకత్ ఖాన్, అన్షుమన్ సులువుగా ఆడేశారు. బౌండరీతో మొదలైన ఇన్నింగ్స్ను వేగంగా పరుగు పెట్టించారు. భారత బౌలర్లు, ఫీల్డర్లు గుక్కతిప్పుకోకుండా ధాటిగా కదం తొక్కారు. చూస్తుంటే ఇదో అనామక మ్యాచ్గా, ఆడేది హాంకాంగ్లా అస్సలు అనిపించలేదు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఫోర్తో శ్రీకారం చుట్టిన నిజాకత్... ఓవర్ ఓవర్కు ధాటిని, ఎదురుదాడిని అంతకంతకు పెంచాడు. ఇదే వీరవిహారంతో అతను 45 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ల జోరుకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో భారత్ కంటే ముందుగా 18వ ఓవర్లో (17.4)నే జట్టు స్కోరు వంద దాటింది. టీమిండియా 20వ ఓవర్లో (19.4) వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ టైమ్ బౌలర్లతో పాటు, పార్ట్టైమ్ బౌలర్లను ప్రయోగించినా ఓపెనింగ్ జోడీని విడదీయలేకపోయాడు. మరో ఓపెనర్ అన్షుమన్ కూడా 75 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఓవర్లు గడుస్తున్న కొద్తీ ప్రత్యర్థి జట్టు స్కోరు పెరుగుతుందే తప్ప వికెట్లయితే రాలడం లేదు. ఇది రోహిత్ శిబిరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. హంకాంగ్ జట్టేమో అలవోకగా 30.3 ఓవర్లలో 150 పరుగుల్ని చేసింది. ఊపిరి పోసిన కుల్దీప్... సగటున ఓవర్కు 5 పరుగుల చొప్పున అజేయంగా సాగుతున్న ఇన్నింగ్స్కు ఎట్టకేలకు కుల్దీప్ తెరదించాడు. జట్టు స్కోరు 174 పరుగుల వద్ద కెప్టెన్ అన్షుమన్... రోహిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో సెంచరీకి చేరువైన నిజాకత్ ఆట కూడా ముగిసింది. పరుగు వ్యవధిలో ఖలీల్ అహ్మద్ వేసిన తర్వాతి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. 175 పరుగుల వద్ద క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లిద్దరు నిష్క్రమించడంతో భారత శిబిరంలో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. కాసేపటికి ఖలీల్ బౌలింగ్లో కార్టర్ (3) నిష్క్రమించగా, సిక్సర్లతో జోరుమీదున్న బాబర్ హయత్ (18; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను చహల్ పెవిలియన్ బాటపట్టించాడు. ఈ రెండు క్యాచ్ల్ని కీపర్ ధోని అందుకున్నాడు. తర్వాత చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతుల మధ్య అంతరం పెరగడంతో ఒత్తిడిలో హాంకాంగ్ చిత్తయింది. ఖలీల్ అహ్మద్@222 హాంకాంగ్తో జరిగిన మ్యాచ్తో 21 ఏళ్ల లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డే బరిలోకి దిగిన 222వ ఆటగాడిగా ఖలీల్ నిలిచాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినా (2 మ్యాచ్లే) అత్యంత ప్రతిభావంతుడిగా దేశవాళీ క్రికెట్లో గుర్తింపు లభించడంతో ఖలీల్కు తొందరగానే అవకాశం లభించింది. భారత అండర్–19 జట్టు సభ్యుడిగా పరిచయమైన ఖలీల్... ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో ఎదిగాడు. ఒకప్పుడు ఖర్బూజా పండ్లకు దేశంలోనే ప్రఖ్యాతి చెందిన రాజస్తాన్ రాష్ట్రంలోనే టోంక్ అతని స్వస్థలం. భారత్ ‘ఎ’ తరఫున గత 9 మ్యాచ్ల్లో అతను కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టని మ్యాచ్ లేకపోవడం విశేషం! నిలకడగా 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఖలీల్ భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ను ఆదర్శంగా భావిస్తాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఐపీఎల్లో రెండు సీజన్లలో జహీర్ దగ్గరే బౌలింగ్ మెరుగుపర్చుకున్న ఖలీల్... గత ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఆడుతూ భువనేశ్వర్ సూచనలతో మరింత రాటుదేలినట్లుగా చెబుతాడు. -
ఆసియాకప్: హాంకాంగ్ లక్ష్యం 286
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా హాంకాంగ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమీండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శతక్కొట్టడంతో భారత్ పసికూనకు 286 లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ మిడిలార్డర్ మరోసారి విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్ రోహిత్ శర్మ (23) నిరాశ పరిచనప్పటికి ధావన్, అంబటి రాయుడు సాయంతో ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 116 పరుగులు జోడించిన అనంతరం రాయుడు (60) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్తో ధావన్ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 13 ఫోర్లతో కెరీర్లో 14 సెంచరీ సాధించాడు. అనంతరం రెండు సిక్స్లు బాది దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ (127) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని డకౌట్గా నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ వెంటనే దినేశ్ కార్తీక్(33) కూడా ఔటవ్వడంతో భారత్ పరుగుల వేగం నెమ్మదించింది. చివర్లో చెలరేగిన హాంకాంగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (9), శార్ధుల్ ఠాకుర్(0)లను పెవిలియన్ చేర్చారు. దీంతో ఆచితూచి ఆడుతూ కేదార్ జాదవ్(25 నాటౌట్) వికెట్లు పడకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. -
ఆసియాకప్ డిజిటల్ హక్కులు యప్ టీవీ సొంతం
దుబాయ్ : ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. ఆసియాకప్-2018 టోర్నీ ప్రత్యేక డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో పాటు యూరప్లోని అన్నిదేశాల్లో ఈ టోర్నీ మ్యాచ్లను యప్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్, భారత్, శ్రీలంక, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీ సెప్టెంబర్ 28న ముగుస్తోంది. -
ఆసియాకప్: ధావన్ ధనాధన్ సెంచరీ
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా పసికూన హాంకాంగ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన ధావన్ ఎట్టేకేలకు ఫామ్లోకి వచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (23) వికెట్ను త్వరగా కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో ధావన్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 116 పరుగులు జోడించిన అనంతరం రాయుడు (60) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్తో ధావన్ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 13 ఫోర్లతో కెరీర్లో 14 సెంచరీ సాధించాడు. అనంతరం రెండు సిక్స్లు బాది దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ (127) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 241/3 కాగా క్రీజులో కార్తీక్(28), ధోని(0)లున్నారు. -
టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన హాంకాంగ్
దుబాయ్:ఆసియాకప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ అన్షుమాన్ రాత్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించి టోర్నీలో ఘనమైన ఆరంభాన్నివ్వాలని భారత్ భావిస్తోంది. భారత్, హాంకాంగ్ పదేళ్ల క్రితం ఇదే ఆసియా టోర్నీలో ఒకే ఒకసారి తలపడ్డాయి. నాటి మ్యాచ్లో భారత్ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. బలా బలాలను చూస్తే ప్రత్యర్థికంటే అందనంత ఎత్తులో ఉన్న భారత్కు విజయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే బుధవారం పాకిస్తాన్తో తలపడాల్సి ఉన్న రోహిత్ సేనకు... హాంకాంగ్తో మ్యాచ్ వార్మప్గానే ఉపకరిస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా లెఫ్టార్మ్ మీడియం పేసర్ ఖలీల్ అహ్మద్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతనికి భారత తుది జట్టులో చోటు దక్కింది. -
టీమిండియాకు కోహ్లి విషెస్
న్యూఢిల్లీ: ఆసియాకప్లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ను పసికూన హాంకాంగ్తో తలపడనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. హాంకాంగ్పై భారీ విజయాన్ని సాధించి ఘనమైన ఆరంభాన్నిచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఆసియాకప్ నుంచి టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. వరుస సిరీస్లతో అలసిపోయిన కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగా భారత క్రికెట్ జట్టుకు కోహ్లి విషెస్ తెలియజేశాడు. ‘ఆసియాకప్ వంటి ఒక సూపర్ సిరీస్లో తలపడుతున్న భారత జట్టుకు అభినందనలు’ అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఈ టోర్నీలో కోహ్లి గైర్హాజరీతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఆసియాకప్లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా చేయడం ఇదే తొలిసారి. -
భారత్-పాక్ మ్యాచ్కు దావూద్ అనుచరులు?
దుబాయ్: భారత్-పాక్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ఈ క్రమంలో మ్యాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందే స్టేడియంలోని టిక్కెట్లన్నీ అమ్ముడుపోతాయి. ఆసియా కప్లో భాగంగా బుధవారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు కూడా వస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీషు మీడియా కథనాన్ని ప్రచురించింది. దాంతో ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దృష్టిసారించాయి. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు, అతని కుటుంబ సభ్యులు వస్తున్నట్లు ఈ ఆరు ఏజెన్సీలు వెల్లడించడం గమనార్హం. ఇండో-పాక్ మ్యాచ్ గురించి ఓ కీలక సమాచారం ఇంటెలిజెన్స్ గ్లోబల్ నెట్వర్క్కు అందింది. మరొకవైపు డీ గ్యాంగ్తో సన్నిహితంగా ఉండే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారని వాళ్లకు సమాచారం తెలిసింది. దీనిలో భాగంగా పలు దేశాలకు చెందిన నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. -
మెంటార్గా ఎంఎస్ ధోని..!
దుబాయ్: టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల్ని తప్పుకున్న తర్వాత కూడా జట్టును గైడ్ చేస్తూ విజయాల్లో ఎంఎస్ ధోని ముఖ్యభూమిక పోషిస్తూనే ఉన్నాడు. జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లి దగ్గర్నుంచి, ఆటగాళ్ల వరకూ ధోని సలహాల్ని తీసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. ఇదిలా ఉంచితే, ఆసియాకప్లో భాగంగా హాంకాంగ్తో తొలి మ్యాచ్ ఆడబోతున్న క్రమంలో ధోని మెంటార్ అవతారమెత్తాడు. భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది ఇంకా యూఏఈకు చేరుకోకపోవడంతో జట్టును దగ్గరుండి చూసుకునే బాధ్యత ధోనిపై పడింది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నప్పటికీ, యువ క్రికెటర్లను సానబట్టే పనిలో పడ్డాడు ధోని. ప్రధానంగా ప్రాక్టీస్ సెషన్లో అవీష్ ఖాన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, సిద్దార్థ్ కౌల్, నదీమ్, మయాంక్ మార్కేండ్లు.. భారత బ్యాట్స్మన్కు బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేస్తూ కనిపించాడు ధోని. ఒకవైపు తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే బౌలర్లకు కొన్ని టిప్స్ చెప్పడం ఆకట్టుకుంది. సమస్యను సవాల్గా స్వీకరించే ధోని.. ఒక సీనియర్ క్రికెటర్గా తన బాధ్యతను గుర్తించి ఇలా మెంటార్ పాత్రలో కనిపించడం మరొకసారి అతని ప్రత్యేకతను చాటింది. -
పాకిస్తాన్ జట్టే ఫేవరేట్: మంజ్రేకర్
న్యూఢిల్లీ: ఆసియాకప్లో భారత్ ప్రధాన పోటీదారుగా ఉన్నా.. టైటిల్ మాత్రం పాకిస్తాన్ గెలిచే అవకాశాలున్నాయని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో పాక్ తరచూ ఆడుతుండడం ఆ జట్టుకు అనుకూలించనుందని చెప్పాడు. ‘అనూహ్యంగా పుంజుకునే జట్లలో పాక్ ఒకటి. కానీ విరాట్ లేకపోవడంతో భారత్ బాగా బలహీన పడింది’ అని వివరించాడు. విరాట్ కోహ్లి లేకపోతేనేం.. విరాట్ కోహ్లి లేకపోయినా టీమిండియా ఉత్తమ జట్టేనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. దాయాది పాకిస్తాన్తో బుధవారం జరిగే ఆసియా కప్ సమరంలో కోహ్లి గైర్హాజరు భారత్పై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయని చెప్పాడు. విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘విరాట్ ఉన్నాడా లేడా అన్నది ముఖ్యం కాదు. అతడు లేకపోయినా భారత్ గట్టి జట్టే. ఆసియాకప్లో అత్యంత సక్సెస్ఫుల్ జట్టు టీమిండియా’ అని సౌరవ్ పేర్కొన్నాడు. -
టీమిండియాపై గెలవాలంటే..
దుబాయ్: ఆసియాకప్లో టీమిండియాపై గెలవాలంటే తమ జట్టు అన్ని అంశాల్లోనూ మెరుగవ్వాల్సి ఉందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశాడు. ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం తర్వాత తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు. వాటిని భారత్తో మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ‘హాంకాంగ్ మ్యాచ్లో మేమింకా మెరుగవ్వాల్సిన అంశాలను పరిశీలించా. టోర్నీలో అందరికన్నా ముందంజలో నిలవాలంటే మేం తొమ్మిది లేదా పది వికెట్ల తేడాతో గెలవాల్సి ఉంది. మేం కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం. హాంకాంగ్పై మంచి విజయమే సాధించాం. కానీ భారత్పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. కోహ్లి లేకపోయినా భారత్ జట్టు అత్యుత్తమంగానే ఉంది. కోహ్లి లేడనే విషయాన్ని పక్కకు పెట్టే బరిలోకి దిగుతాం. భారత్ను ఓడించాలంటే సమష్టి ప్రదర్శన తప్పదు’ అని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. -
అదరగొట్టిన అఫ్గానిస్తాన్
-
కోహ్లికంటే రోహిత్ అదృష్టవంతుడా!
ఆసియా కప్ను మాత్రమే కాకుండా ఇటీవలి ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోల్పోయిన అభిమానుల విశ్వాసాన్ని కూడా గెలుచుకునే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగు తోంది. మన జట్టు ఏదో అద్భుతం చేస్తుందంటూ ఇంగ్లండ్ పర్యటనపై ఉంచిన అంచనాలు దెబ్బ తినడంతో మెల్లగా మబ్బులు వీడిపోయాయి. ఆసియా కప్లో అద్భుతంగా ఆడితే ఆ గాయాలు మరచిపోయేలా చేయడంతో పాటు భారత క్రికెట్పై ఆసక్తి తగ్గిపోయిన వారిని కూడా మళ్లీ ఇటు వైపు చూసేలా చేయవచ్చు. హాంకాంగ్తో జరిగే తొలి మ్యాచ్ తర్వాతి రోజు పాకిస్తాన్తో పోరుకు ముందు మంచి వార్మప్గా చెప్పవచ్చు. భారత్ వరుసగా రెండు రోజులు మ్యాచ్లు ఆడాల్సి రావడం, అదీ రెండో రోజు పాకిస్తాన్తో తలపడే విధంగా నిర్వాహకులు అసలు షెడ్యూల్ను ఎలా తయారు చేశారో అర్థం కావడం లేదు. అయితే దాని గురించి ఏమీ చేయలేం. క్వాలిఫయింగ్ టోర్నీలో తమకంటే బలమైన జట్లను ఓడించి హాంకాంగ్ ఈ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు భారత్పై కాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. భారత జట్టు కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ముఖ్యం గా రోహిత్ తన ఖాతాలో మరో ఒకట్రెండు సెంచరీలు చేర్చుకో వాలని భావిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచేందుకు పక్కనే ధోని ఉండటం కూడా రోహిత్ అదృష్టం. సాధారణంగా ఇండియా జట్టు ఆకర్షణ అంతా బ్యాటింగ్లోనే కనిపిస్తుంది. కానీ ఈసారి బౌలింగ్లో ఉన్న వైవిధ్యం కూడా ఆకట్టుకునేలా చేస్తోంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ వేర్వేరు శైలిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒకరిని మరొకరు ప్రోత్స హించుకునే తీరు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తమ బ్యాట్స్మెన్ ఎక్కువసేపు క్రీజ్లో గడపాలని కోరుకుంటుంది కాబట్టి అవకాశం లభిస్తే భారత్ తొలుత బ్యాటింగ్కే మొగ్గు చూపుతుంది. అయితే తర్వాతి రోజే పాకిస్తాన్తో ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్ను వీలైనంత తొందరగా ముగించి ప్రధాన పోరు కోసం తమ శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అది జరగాలంటే భారత్ టాస్ నెగ్గాలి. ఈ విషయంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
శ్రీలంక ఔట్
అబుదాబి: క్రికెట్ కూనల దెబ్బకు శ్రీలంక తలవంచింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో లీగ్ దశలోనే వెనుదిరిగింది. లంకను తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చితక్కొడితే... సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అదరగొట్టింది. దీంతో 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట అఫ్గానిస్తాన్ 249 పరుగులు చేసి ఆలౌటైంది. రహ్మత్ షా (72; 5 ఫోర్లు) రాణించాడు. తిసారా పెరీరా 5 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడింది. చెరో విజయంతో గ్రూప్ ‘బి’ నుంచి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సూపర్–4 దశకు అర్హత సాధించాయి. రహ్మత్ షా అర్ధసెంచరీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రికెట్ కూనను టాపార్డర్ బ్యాట్స్మెన్ నిలబెట్టారు. ఓపెనర్లు షహజాద్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇహ్షానుల్లా (45; 6 ఫోర్లు) తొలి వికెట్కు 57 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు. తర్వాత రహ్మత్ షా అఫ్గాన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. 63 బంతుల్లో మూడు బౌండరీల సాయంతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న రహ్మత్ షా... హస్మతుల్లా షాహిది (37; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్కు 80 పరుగులు జోడించాడు. తర్వాత 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు రెండో బంతి నుంచే కష్టాలు మొదలయ్యాయి. కుశాల్ మెండిస్ (0)ను ముజీబ్ డకౌట్ చేశాడు. తర్వాత తరంగ (36; 3 ఫోర్లు), డిసిల్వా (23; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా... అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ ఎల్బీడబ్ల్యూ (బి) ధనంజయ 34; ఇహ్షానుల్లా ఎల్బీడబ్ల్యూ (బి) ధనంజయ 45; రహ్మత్ షా (సి) తిసారా పెరీరా (బి) చమిర 72; అస్గర్ ఎల్బీడబ్ల్యూ (బి) జయసూర్య 1; షాహిది (బి) తిసార పెరీరా 37; నబీ (సి) తిసారా పెరీరా (బి) మలింగ 15; జద్రాన్ (బి) తిసారా పెరీరా 12; గుల్బదిన్ నయీబ్ (సి) ధనంజయ (బి) పెరీరా 4; రషీద్ ఖాన్ (బి) తిసారా పెరీరా 13; ఆఫ్తాబ్ నాటౌట్ 7; ముజీబ్ (బి) తిసారా పెరీరా 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 249. వికెట్ల పతనం: 1–57, 2–107, 3–110, 4–190, 5–203, 6–222, 7–227, 8–242, 9–249, 10–249. బౌలింగ్: మలింగ 10–0–66–1, చమీర 10–2–43–1, తిసారా పెరీరా 9–0–55–5, ధనంజయ 10–0–39–2, డిసిల్వా 5–0–22–0, జయసూర్య 6–0–22–1. శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ మెండిస్ ఎల్బీడబ్ల్యూ (బి) ముజీబ్ 0; తరంగ (సి) అస్ఘర్ (బి) నయీబ్ 36; డిసిల్వా రనౌట్ 23; కుశాల్ పెరీరా (బి) రషీద్ ఖాన్ 17; ఏంజెలో మాథ్యూస్ (సి) రషీద్ ఖాన్ (బి) నబీ 22; జయసూర్య రనౌట్ 14; తిసారా పెరీరా (బి) నయీబ్ 28; షనక (బి) ముజీబ్ 0; ధనంజయ (బి) నబీ 2; మలింగ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ ఖాన్ 1; చమీర నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్) 158. వికెట్ల పతనం: 1–0, 2–54, 3–86, 4–88, 5–108, 6–143, 7–144, 8–153, 9– 156, 10–158. బౌలింగ్: ముజీబ్ 9–1–32–2, ఆఫ్తాబ్ ఆలమ్ 7–0–34–0, నయీబ్ 8–0–29–2, నబీ 10–1–30–2, రషీద్ ఖాన్ 7.2–0–26–2. -
నేడు వార్మప్..రేపు అసలు పోరు!
ఎడారి దేశంలో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు చేరుతున్నాయి. వేడితో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటన అనంతరం తిరిగొచ్చిన కొందరు ఈ ఎండలకు ఇంకా అలవాటు పడే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలో భారత జట్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరుసగా రెండు రోజులు అంతర్జాతీయ వన్డేలు ఆడాల్సి వస్తోంది. ఆసియా కప్లో భాగంగా నేడు తొలి మ్యాచ్లో హాంకాంగ్తో తలపడనున్న టీమిండియా, రేపు రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పసికూన హాంకాంగ్తో పోరుకు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి పాక్తో మ్యాచ్కు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్: భారత్, హాంకాంగ్ పదేళ్ల క్రితం ఇదే ఆసియా టోర్నీలో ఒకే ఒకసారి తలపడ్డాయి. నాటి మ్యాచ్లో భారత్ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. బలా బలాలను చూస్తే ప్రత్యర్థికంటే అందనంత ఎత్తులో ఉన్న భారత్కు విజయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే బుధవారం పాకిస్తాన్తో తలపడాల్సి ఉన్న రోహిత్ సేనకు... హాంకాంగ్తో మ్యాచ్ వార్మప్గానే ఉపకరిస్తుంది. ఈ పోరులో టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేదే ప్రధానాంశం. మిడిలార్డర్ ఖాయం చేసేందుకు... వచ్చే వరల్డ్ కప్కు ముందు భారత్కు తుది జట్టు విషయంలో ఇంకా స్పష్టత రాని అంశం మిడిలార్డర్ గురించే. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ ‘4, 6 స్థానాల కోసం జట్టులో గట్టి పోటీ ఉంది. తమ చోటు ఖాయం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అందరూ ప్రతిభావంతులే. ఆయా స్థానాల గురించి ఈ టోర్నీ తర్వాత మరింత స్పష్టత వస్తుంది’ అని చెప్పాడు. అంటే ఐదో స్థానంలో ధోని ఆడటం ఖాయమైపోయింది. ఆల్రౌండర్గా ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉంటాడు. మూడో స్థానంలో ఈ టోర్నీ వరకు ఎవరైనా ఆడినా అది కోహ్లి స్థానం మాత్రమే. మిడిలార్డర్ కోసం ఇప్పుడు రాహుల్, కార్తీక్, జాదవ్, రాయుడు, మనీశ్ పాండే పోటీ పడుతున్నారు. గాయంతో జాదవ్, అనూహ్య రీతిలో రాయుడు ఇంగ్లండ్ టూర్కు దూరం కాగా... తాజాగా దేశవాళీ వన్డే ఫామ్తో పాండే కూడా నేనున్నానంటూ సిద్ధమయ్యాడు. జాదవ్ పార్ట్టైమ్ స్పిన్ అతనికి అదనపు బలం కానుంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్తో పోరులో ఎవరు జట్టులోకి వస్తారో చూడాలి. మరో వైపు పాక్తో మ్యాచ్కు ముందు బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రోహిత్ పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. భువనేశ్వర్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేస్తున్నాడు. స్పిన్లో చహల్, కుల్దీప్లకు తోడుగా అక్షర్కు చాన్స్ దక్కవచ్చు. మరోవైపు తొలి మ్యాచ్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్ ఇక్కడైనా కాస్త పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. భారత్లాంటి జట్టుపై సంచలన విజయానికి దాదాపుగా ఆస్కారం లేకపోయినా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచవచ్చు. పాకిస్తాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్పైనే ఈ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నారు. పొడిగా ఉండే వికెట్పై స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1 లో ప్రత్యక్ష ప్రసారం -
అదరగొట్టిన ఆఫ్గాన్ బ్యాట్స్మెన్
అబుదాబి: బ్యాట్స్మన్ సమష్టిగా రాణించడంతో ఆఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంకకు 250 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ సారథి అస్ఘర్ ఆఫ్గాన్ నమ్మకాన్ని బ్యాట్స్మెన్ నిలబెట్టారు. తొలుత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 57 పరుగుల జోడించిన అనతరం ఓపెనింగ్ జోడిని లంక స్పిన్నర్ అఖిల ధనుంజయ విడదీశాడు. మహ్మద్ షాజాద్(34; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్)ను వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా(72; 90 బంతుల్లో 5ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఇషానుల్లా జనత్( 45; 65 బంతుల్లో 6 ఫోర్లు) లంక బౌలర్లకు పరీక్ష పెట్టారు. రెండో వికెట్కు అర్దసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి ధనుంజయ విడదీశాడు. టాపార్డర్ బ్యాట్స్మన్ శుభారంబాన్ని అందించినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ భారీ స్కోర్ చేయటంలో విఫలమయ్యారు. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. లంక పేసర్ తిశార పెరీరా ఐదు వికెట్లు తీసి మిడిలార్డర్ను కుప్పకూల్చాడు. మిగతా లంక బౌలర్లలో ధనుంజయ రెండు వికెట్లు తీయగా, మలింగ, చమీరా, జయసూర్య తలో వికెట్ సాధించారు. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 262 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 124 పరుగులకే ఆలౌటై 137 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
‘కోహ్లి లేకున్నా బాధ లేదు’
కోల్కతా: టీమిండియా సారథి, ప్రధాన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో పాకిస్తాన్తో తలపడే భారత జట్టుకు కలిగే నష్టమేమి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఓ ప్రోమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆసియా కప్లో దాయాది దేశంపై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. కానీ ఈ సారి ఆసియాకప్లో ఇరుజట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్ సిరీస్ల దృష్ట్యా సెలక్టర్లు విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చినప్పటికీ రోహిత్ సేన బలంగానే ఉందన్నారు. పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో ఇంకాస్త మెరుగుపడాలని సూచించారు. చాంపియన్ ట్రోఫిలో పాక్పై టీమిండియా ఓడిపోయిందని, కానీ ఆ ప్రభావం ప్రస్తుత టోర్నీలో రోహిత్ సేనపై ఉండదని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అన్ని రంగాల్లో బలంగానే ఉందన్నారు. టీమిండియా ఆసియా కప్ను అత్యధికంగా ఆరు సార్లు గెలువగా, పాకిస్తాన్ కేవలం రెండు సార్లే గెలిచిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆసియాకప్లో రోహిత్ సేన తొలి మ్యాచ్ మంగళవారం హాంగ్కాంగ్తో తలపడిన మరుసటి రోజే(బుధవారం) దాయాది దేశమైన పాకిస్తాన్తో తలపడనుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పసికూన హాంగ్కాంగ్పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కోహ్లి, యూనిస్ ఖాన్ల తర్వాతి స్థానంలో..
దుబాయ్: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్గా రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్..మరో ఘనతను కూడా సాధించాడు. ఆసియాకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీమ్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రహీమ్(144) భారీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించడమే కాకుండా, ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియాకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(183) తొలి స్థానంలో ఉండగా, యూనిస్ ఖాన్(144) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రహీమ్ నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్(143)ను రహీమ్ అధిగమించాడు. చదవండి: సూపర్ ముష్ఫికర్ -
టీమిండియా క్రికెటర్లకు చీఫ్ సెలక్టర్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు లభిస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని తొలగించడానికి ఇక వెనుకాడబోమని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ హెచ్చరించాడు. భారత క్రికెట్ సత్తాను పరీక్షించేందుకు ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఒకవేళ ఆ అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడంలో ఎవరైతే విఫలమవుతారో వారిపై వేటు తప్పదనే సంకేతాలు పంపాడు. తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై తాము దృష్టిపెట్టాల్సివుంటుందని ఎంఎస్కే తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్కు తనకు సంతోషాన్ని కల్గించిందన్నాడు. ‘ నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగ్ నైపుణ్యంపై నాకెప్పుడూ ఎలాంటి అనుమానమూ లేదు. అతడి వికెట్ కీపింగే మెరుగుపడాలి’ అని అన్నాడు. ఆసియాకప్లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్తో సిరీస్లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తామని ప్రసాద్ చెప్పాడు. భారత్-ఏ తరఫున, దేశవాళీ మ్యాచ్ల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్కు త్వరలోనే అవకాశం వస్తుందని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ఆసియాకప్లో భారత జట్టు.. తన ఆరంభపు మ్యాచ్ను మంగళవారం హాంకాంగ్తో ఆడనుంది. -
ఆసియాకప్: పాకిస్తాన్ బోణి
-
ఆసియాకప్: 116కే హాంకాంగ్ ప్యాకప్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో పసికూన హాంకాంగ్ 116 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ల దాటికి హాంకాంగ్ బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్ జట్టులో కేడీ షా (26), అయిజాజ్ ఖాన్(27)లదే టాప్ స్కోర్ కావడం విశేషం. పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాన్ మూడు, హసన్ అలీ, షాదాబ్ ఖాన్లు రెండేసి వికెట్లు తీయగా.. అష్రాఫ్ ఒక వికెట్ పడగొట్టాడు. -
అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్ ఎందుకు?
దుబాయ్: ‘అందరివాడు మహేంద్ర సింగ్ ధోని ఉండగా టెన్షన్ ఎందుకు దండగా’ అంటున్నాడు.. హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు. యోయో టెస్ట్ అర్హత సాధించి ఆసియాకప్ టోర్నీకి ఎంపికైన ఈ హైదరాబాదీ మీడియాతో మాట్లాడాడు. ‘విరాట్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. కానీ ట్రోఫీ గెలిపించగల నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంతకు ముందు జట్టుకు నాయకత్వం వహించిన అందరివాడు ధోని అండగా ఉంటాడు. ఈ సీజన్లో రాణించేందుకు అతడు నాకు ఎంతో సాయం చేశాడు’ అని రాయుడు చెప్పుకొచ్చాడు. 2019 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకోని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కోసం చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మిడిలార్డర్లో తన స్థానం పదిలపరుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే నేను మిడిలార్డర్ బ్యాటింగ్ గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా సత్తా చాటేందుకు దొరికిన అవకాశం ఇది. మిడిలార్డర్ గురించి ఆలోచిస్తూ నాపై అనవసర ఒత్తిడి పెంచుకోలేను. ప్రస్తుతం జట్టులో ఎవరూ ప్రపంచ కప్ గురించి ఆలోచిస్తున్నారని అనుకోవడం లేదు. ఇప్పుడు మేం ఆసియాకప్ ఆడుతున్నాం.’ అని వ్యాఖ్యానించాడు. ఇక భారత్ మంగళవారం హాంకాంగ్తో తొలి మ్యాచ్ ఆడునుంది. ఆ మరుసటి రోజే దాయదీ పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. దీనిపై రాయుడు మాట్లాడుతూ.. ‘ఇది మాకో ప్రతికూలంశం అవుతుందని అనుకోవడం లేదు. కొంచెం కష్టమైనా మేం మరుసటి రోజు మ్యాచ్ ఫ్రెష్గా బరిలోకి దిగుతాం’ అని తెలిపాడు. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమవ్వడం చిరాకు పెట్టిందని, తిరిగి ఆసియాకప్కు ఎంపికవ్వడం సంతోషానిచ్చిందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఈసారి తాను ఐపీఎల్ బాగా ఆడానని, కీలకమైన అంశం ఏంటంటే వయసుతో సంబంధం లేదన్నాడు. ఫిట్గా ఉంటే చాలని రాయుడు పేర్కొన్నాడు. -
ఆసియా కప్: బంగ్లాదేశ్ బోణీ
-
సూపర్ ముష్ఫికర్
బంగ్లా బెబ్బులి శివాలెత్తింది. సింహళీయుల్ని చిత్తుచిత్తుగా ఓడించి ఆసియా కప్లో శుభారంభం చేసింది. మొదట వెటరన్ పేసర్ మలింగ పేస్ పదునుకు ఎదురొడ్డి నిలిచింది. బ్యాటింగ్లో ముష్ఫికర్ రహీమ్ సెంచరీ, మొహమ్మద్ మిథున్ అర్ధ సెంచరీతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను ఒడ్డున పడేస్తే... తర్వాత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్మెన్ ఆటల్ని సాగనివ్వలేదు. పది ఓవర్లలోపే 4 కీలక వికెట్లు తీశారు. 25 ఓవర్లకే 8 వికెట్లను పడేసి ఘోరపరాజయాన్ని ఖాయం చేశారు. దుబాయ్: ఆసియా కప్ మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగింది. మేటి జట్లకు మేం ఏమాత్రం తీసిపోమని బరిలో ఉన్న జట్లను హెచ్చరించింది. శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 137 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముష్ఫికర్ రహీమ్ (150 బంతుల్లో 144; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు. మొహమ్మద్ మిథున్ (68 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. సరిగ్గా ఏడాది తర్వాత వన్డే ఆడిన లసిత్ మలింగ 4 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దిల్రువాన్ పెరీరా చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ కాగా, మొర్తజా, ముస్తఫిజుర్ రహమాన్, మెహిదీ హసన్ మిరాజ్ తలా 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్లో హాంకాంగ్తో పాకిస్తాన్ తలపడుతుంది. ముష్ఫికర్ భారీ సెంచరీ... లసిత్ మలింగ ధాటికి చెల్లాచెదురైన బంగ్లా ఇన్నింగ్స్కు ముష్ఫికర్ రహీమ్ మూలస్తంభంలా నిలిచాడు. తొలి ఓవర్ వరుస బంతుల్లో లిటన్ దాస్ (0), షకీబ్ (0)లను మలింగ డకౌట్ చేశాడు. తర్వాత ఓవర్లోనే ఓపెన్ తమీమ్ ఔట్ కాకుండానే క్రీజు నుంచి ఔటైపోయాడు. గాయంతో రిటైర్ట్హర్ట్గా వెనుదిరిగాడు. దీంతో 3 పరుగులకే టాపార్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్లో కూర్చున్నారు. ఈ దశలో రహీమ్, మొహమ్మద్ మిథున్లిద్దరు మలింగ పేస్కు ఎదురునిలిచి జట్టును ఆదుకున్నారు. 13 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. వీళ్లిద్దరు పాతుకుపోవడంతో మరో ఆరు ఓవర్లకే (19.3) వంద పరుగులు దాటింది. మిథున్ 52 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) బంతుల్లో... ముష్ఫికర్ 67 (3 ఫోర్లు, 1 సిక్స్) బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అలా 25 ఓవర్ల దాకా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు కుదుటపడిన దశలో మలింగ మళ్లీ బంగ్లాదేశ్ను కుదిపేశాడు. ఇన్నింగ్స్ 26వ ఓవర్లో ధాటిగా ఆడుతున్న మిథున్ను, తన తదుపరి ఓవర్లో మొసద్దక్ హొస్సేన్ (1)లను ఔట్ చేశాడు. దీంతో 142 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయిన బంగ్లాను మరోసారి ముష్ఫికర్ చివరి వరుస బ్యాట్స్మెన్ అండతో నిలబెట్టాడు. మెహదీ హసన్ మిరాజ్ (15), కెప్టెన్ మొర్తజా (11), ముస్తఫిజుర్ రహమాన్ (10)లు చేసింది తక్కువ పరుగులే అయినా... ముష్ఫికర్ రహీమ్కు అండగా నిలిచారు. దీంతో అతను 123 (7 ఫోర్లు, 1 సిక్స్) బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ముష్ఫికర్ శివమెత్తాడు. 229 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోగా... గాయంతో రిటైర్ట్హర్ట్ అయిన తమీమ్ క్రీజులోకి వచ్చాడు. నిజానికి అతను బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉన్నా... అతని అండతోనే ముష్ఫికర్ సిక్సర్లు, ఫోర్లతో కేవలం తొమ్మిది బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 261 పరుగుల వద్ద చివరి వికెట్గా నిష్క్రమించాడు. వాళ్లు కొడితే... వీళ్లేమో వరుస కట్టారు... ఆరంభం చెదిరినా.. బంగ్లా ఇన్నింగ్స్ను ఇద్దరంటే ఇద్దరే నిలబెట్టారు. కానీ ఆరంభం అదిరినా... శ్రీలంక ఇన్నింగ్స్ను ఏ ఒక్కరూ కాపాడలేకపోయారు. తరంగ సిక్స్, ఫోర్తో తొలి ఓవర్లో 13 పరుగులు, రెండో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి కానీ చివరి బంతికి కుశాల్ మెండిస్ (0)ను ముస్తఫిజుర్ డకౌట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి లంక పతనం ప్రారంభమైంది. మరుసటి ఓవర్లోనే జోరు మీదున్న తరంగ, కాసేపటికే డిసిల్వా (0), ఇంకాస్త ముందుకెళ్లగానే కుశాల్ పెరీరా (11) పెవిలియన్ చేరడంతో 38 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ముస్తఫిజుర్, మొర్తజా, మిరాజ్ తలా ఒక చేయి వేయడంతో ఇదంతా 9.2 ఓవర్లకే జరిగిపోయింది. ఈ వికెట్ల పతనానికి స్వల్ప విరామం దొరికింది. మళ్లీ 17వ ఓవర్ నుంచే లంక కష్టాలు మొదటికొచ్చాయి. దీంతో వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దిల్రువాన్ పెరీరా, లక్మల్ (20) నిలబడినా బంగ్లా బౌలర్లతో ఎంతోసేపు తలబడలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ నాటౌట్ 2; లిటన్ దాస్ (సి) మెండిస్ (బి) మలింగ 0; షకీబుల్ (బి) మలింగ 0; ముష్ఫికర్ (సి) మెండిస్ (బి) తిసారా పెరీరా 144; మిథున్ (సి) దిల్రువాన్ పెరీరా (బి) మలింగ 63; మహ్మూదుల్లా (సి) డిసిల్వా (బి) అపొన్సో 1; హొస్సేన్ (సి) దిల్రువాన్ పెరీరా (బి) మలింగ 1; మెహదీ హసన్ (సి అండ్ బి) లక్మల్ 15; మొర్తజా (సి) తరంగ (బి) డిసిల్వా 11; రూబెల్ హొస్సేన్ ఎల్బీడబ్ల్యూ (బి) డిసిల్వా 2; ముస్తఫిజుర్ (రనౌట్) 10; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–1, 2–1, 2–3, 3–134, 4–136, 5–142, 6–175, 7–195, 8–203, 9–229, 10–261. బౌలింగ్: మలింగ 10–2–23–4, లక్మల్ 10–0–46–1, అపొన్సో 9–0–55–1, తిసారా పెరీరా 7.3–0–51–1, దిల్రువాన్ పెరీరా 3–0–25–0, ధనంజయ డిసిల్వా 7–0–38–2, షనక 3–0–19–0. శ్రీలంక ఇన్నింగ్స్: తరంగ (బి) మొర్తజా 27; మెండిస్ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్ 0; కుశాల్ పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్ 11; ధనంజయ డిసిల్వా ఎల్బీడబ్ల్యూ (బి) మొర్తజా 0; మాథ్యూస్ ఎల్బీడబ్ల్యూ (బి) రూబెల్ హొస్సేన్ 16; షనక (రనౌట్) 7; తిసారా పెరీరా (సి) రూబెల్ హొస్సేన్ (బి) మెహదీ హసన్ 6; దిల్రువాన్ పెరీరా (స్టంప్డ్) లిటన్ దాస్ (బి) మొసద్దక్ హొస్సేన్ 29; లక్మల్ (బి) ముస్తఫిజుర్ 20; అపొన్సో (సి) సబ్–నజ్ముల్ హొస్సేన్ (బి) షకీబ్ 4; మలింగ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 1; మొత్తం (35.2 ఓవర్లలో ఆలౌట్) 124. వికెట్ల పతనం: 1–22, 2–28, 3–32, 4–38, 5–60, 6–63, 7–69, 8–96, 9–120, 10–124. బౌలింగ్: మష్రఫే మొర్తజా 6–2–25–2, ముస్తఫిజుర్ 6–0–20–2, మెహదీ హసన్ మిరాజ్ 7–1–21–2, షకీబ్ 9.2–0–31–1, రూబెల్ హొస్సేన్ 4–0–18–1, మొసద్దక్ హొస్సేన్ 3–0–8–1. 1: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (144). శ్రీలంక కీపర్ సంగక్కర (121; బంగ్లాదేశ్పై 2008లో) పేరిట ఉన్న రికార్డును రహీమ్ సవరించాడు. 6:ఆసియా కప్లో సెంచరీ చేసిన ఆరో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్. గతంలో సంగక్కర నాలుగు సెంచరీలు చేయగా... రాహుల్ ద్రవిడ్, ధోని, ఉమర్ అక్మల్, అనాముల్ హక్ ఒక్కో సెంచరీ సాధించారు. 1: ఆసియా కప్ వన్డే టోర్నీలోని ఓ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోని తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడటం ఇదే మొదటిసారి. 2: ఆసియా కప్ చరిత్రలో శ్రీలంకతో 13 సార్లు ఆడిన బంగ్లాదేశ్కు కేవలం ఇది రెండో గెలుపే. ఓవరాల్గా శ్రీలంకతో 45 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్కిది ఏడో విజయం మాత్రమే. -
భారత జర్నలిస్ట్పై పాక్ క్రికెటర్ ఫైర్
దుబాయ్: భారత జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నపై పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అసహనం వ్యక్తం చేశాడు. ఇమామ్.. పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్లోనే శ్రీలంకపై సెంచరీ సాధించి ఈ ఓపెనర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. గతేడాది అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇమామ్ ఇప్పటికే వన్డేల్లో 4 సెంచరీలు సాధించాడు. ఆసియాకప్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఇమామ్ను.. ఓ భారత జర్నలిస్ట్ ‘మీ మామ ఇంజుమామ్ ఉల్ హక్ చాలా సేపు నిద్రపోయేవాడు. నీవు కూడా అతనిలా నిద్రపోతావా?’ అని సరదగా అడిగాడు. దీనికి ఆగ్రహానికి లోనైన ఇమామ్.. ‘మా మామ చాలసేపు పడుకుంటాడని నీకెలా తెలుసు? నీవేమైనా ఆయనతో పడుకున్నావా?’ అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న జర్నలిస్ట్లు అవాక్కయ్యారు. సరదాగా అడిగిన ప్రశ్నకు ఇంత సీరియస్ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఆసియాకప్లో ప్రతి మ్యాచ్ తనకు ముఖ్యమేనని, భారత్తో మ్యాచ్ తనకేం ప్రత్యేకం కాదని ఈ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ‘అన్ని మ్యాచ్లు సమానమే. అది హాంకాంగ్ అయినా భారతైనా ఒక్కటే. ప్రతీ ప్రత్యర్థిని ఒకేలా చూస్తాం. అలానే వ్యూహాలు రచిస్తున్నాం. కేవలం భారత్తో మ్యాచ్పైనే దృష్టి పెట్టలేదు. కానీ భారత్ ఓ బలమైన జట్టు. కోహ్లి గైర్హాజరీతో వారిని ఢీకొట్టడం ప్రత్యేకం.’ అని ఈ ఎడమచేతివాటం బ్యాట్స్మన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇమామ్ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. తన మామ ఇంజుమామ్ వల్లే తనకు జట్టులో చోటు దక్కిందన్న మీడియా విమర్శలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంజుమామ్ తనకు మేనమామ కావడం తన తప్పు కాదని స్పష్టం చేశాడు. విమర్శలును తన బ్యాట్తోనే సమాధానం చెప్పానని, ఆసియాకప్లో సైతం రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఆసియా సమరం ఆరంభం
దుబాయ్: ఆసియా కప్ వన్డే టోర్నీ ఆరంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్లో భాగంగా గ్రూప్-బీలో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2016లో బంగ్లాదేశ్ ఫైనల్కు చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుర్రాళ్లతో కూడిన బంగ్లా జట్టును ఎదుర్కోవడం లంకేయులకు సవాల్తో కూడుకున్నదే. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీలో లంక బరిలో దిగుతోంది. కీలక ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరమవడం లంకకు పెద్ద ఎదురుదెబ్బ. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లసిత్ మలింగా తుది జట్టులోకి రావడం లంకేయులకు కలిసొచ్చే అంశం. చివరిసారిగా బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్లో జరుగుతోంది. భారత్ తన తొలి మ్యాచ్ మంగళవారం (18న) హాంకాంగ్తో తలపడనుంది. మరుసటి రోజే దాయదీ పాకిస్తాన్ ఢీకొట్టనుంది. -
ఆసియాకప్ కన్నా వెస్టిండీస్ టూర్ ముఖ్యమా?
ముంబై: ఆసియాకప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంపై భారత సెలక్టర్లను మాజీ క్రికెటర్, సెలక్టర్ సందీప్ పాటిల్ తప్పుబట్టాడు. వెస్టిండీస్ పర్యటన కన్నా ఈ టోర్నీ ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుందని, ఈ మ్యాచ్ భారత అభిమానుల సెంటిమెంట్కు సంబంధించినదని పేర్కొన్నారు. ‘ఓ మాజీ క్రికెటర్గా.. సెలక్టర్గా బిజీ షెడ్యూల్తో ఆటగాళ్లపై ఉన్న ఒత్తిడి గురించి నాకు తెలుసు. కానీ కోహ్లిని ఆసియాకప్కు ఎంపిక చేసి విండీస్ పర్యటనకు విశ్రాంతి ఇవ్వాల్సింది. ఆసియాకప్లో భారత్ పాక్ను ఢీకొట్టనుంది. ఇది యావత్ భారత ప్రజానీకానికి ప్రత్యేక మ్యాచ్. భావోద్వేగంతో కూడుకున్న మ్యాచ్. రెండు జట్లు తమ బెస్ట్ ప్లేయర్స్తో బరిలోకి దిగాలి. కానీ కోహ్లికి విశ్రాంతివ్వడం బాలేదు. ఇక సెలక్టర్లకు ఏ టోర్నీకి ప్రాధాన్యమో ఇవ్వాలో అన్న విషయం తెలియాలి. ముఖ్యంగా ఏ టోర్నీలో ఏ ఆటగాళ్లను బరిలోకి దింపాలి. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలో తెలిసుండాలి. వెస్టిండీస్పై గెలవడం కన్నా ఆసియాకప్ గెలవడమే ముఖ్యం. 30 మంది ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్నప్పుడు కోహ్లి ఒక్కడిపైనే ఎందుకు ఒత్తిడి పడుతోంది. అందరికి సమానంగా అవకాశాలు ఇవ్వాలి. రోహిత్ శర్మకు అంతగా సమయం లేదు. జట్టు కూర్పుపై, వ్యూహాలపై అతనే త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి.’ అని పాటిల్ అభిప్రాయపడ్డాడు.