Bitcoin
-
క్రిప్టో సీజ్..'ఓ కొత్త కథ'!
సాక్షి, హైదరాబాద్: నగలు, నగదు, వస్తువులు, వాహనాల సీజింగ్.. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, ఆస్తుల అటాచ్మెంట్.. ఇవన్నీ పోలీసులకు సుపరిచితమే. వీటిలోకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా వచ్చి చేరింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దోచిన సొమ్మును దేశం దాటించేందుకు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరస్తులు పట్టుబడితే వారి నుంచి ఆ క్రిప్టో కరెన్సీని పోలీసులు రికవరీ చేస్తున్నారు. అయితే, క్రిప్టో సీజింగ్ కొత్త కావడంతో పెద్ద ప్రహసనంగా మారింది.పెరుగుతున్న క్రిప్టో సీజింగ్ గెయిన్ బిట్ కాయిన్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత బుధవారం ఐదు రాష్ట్రాల్లో దాడులు చేసి రూ.23.94 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసింది. గోల్డ్ కాస్ట్ సోలార్ స్కామ్లో ఢిల్లీ పోలీసులు గత ఏడాది అక్టోబర్లో రూ.80 లక్షల విలువైన క్రిప్టోను సీజ్ చేశారు. రూ.2.06 కోట్లతో ముడిపడిన ట్రేడింగ్ ఫ్రాడ్ కేసును ఛేదించి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరి 29న రూ.40 లక్షల విలువైన బిట్ కాయిన్లు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే తొలి అధికారిక క్రిప్టో కరెన్సీ/బిట్ కాయిన్ సీజింగ్. సైబర్ నేరాలతో బిట్ కాయిన్స్కు విడదీయరాని బంధం ఉన్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం అత్యవసరంగా మారింది. క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న మోసం సొమ్ము ప్రస్తుతం యాప్ల ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో చాలావరకు చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. నేపాల్, చైనా, ఇండోనేసి యా, దుబాయ్ తదితర దేశాల్లో కూర్చుని, ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారు. ఏజెంట్ల కమీ షన్ పోగా మిగిలిన దోపిడీ సొమ్ము విదేశా ల్లోని ఆ సూత్రధారులకు చేరాల్సిందే. ఒకప్పుడు ఈ లావాదేవీలన్నీ హవాలా రూపంలో జరిగేవి. కొన్ని దేశాలకు హవాలా కష్టసాధ్యం కావడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సూత్రధారులు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి పాత్రధారుల ఖాతాల్లోకి నగదు వెళ్లిన తర్వాత దాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చి తమ వద్దకు వచ్చేలా చేసుకుంటున్నారు. క్రిప్టో వాలెట్స్లో రెండు రకాలుగూగుల్ ప్లేస్టోర్స్, యాపిల్ యాప్ స్టోర్స్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక యాప్స్ ఉన్నాయి. వాలెట్స్గా పిలిచే వీటిని డౌన్లోడ్ చేసుకుని, బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవడం ద్వారా క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలు చేయవచ్చు. ఈ వాలెట్స్లో బినాన్స్, కాయిన్ బేస్ వంటి కస్టోడియన్ వాలెట్స్తో పాటు సేఫ్ పాల్, ట్రస్ట్ వంటి నాన్ కస్టోడియన్ వాలెట్స్ ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ అదీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) అనుమతి తీసుకుని నడిచేవి కస్టోడియన్ వాలెట్స్. అనుమతి లేకుండా నడిచేవి నాన్ కస్టోడియన్ కిందికి వస్తాయి. కస్టోడియన్ వాలెట్స్ ఆపరేట్ చేయడానికి వినియోగదారుడి నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల నమోదు, వర్చువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇలా చేస్తే పోలీసుల దర్యాప్తులో తమ ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నాన్ కస్టోడియన్ వాలెట్స్ వాడుతున్నారు. 12 వర్డ్ పాస్ ఫేజ్ నమూనా అంకెలు, అక్షరాల సమాహారమేబిట్ కాయిన్గా పిలిచే క్రిప్టో కరెన్సీ 25 నుంచి 50 అంకెలు, అక్షరాలతో కూడిన వాలెట్ అడ్రస్ రూపంలో ఉంటుంది. కేవలం ఈ వాలెట్ అడ్రస్ ఆధారంగా క్రిప్టో కరెన్సీ ఏ వాలెట్లో ఉందో గుర్తించడం సాధ్యం కాదు. నిందితుల ఫోన్లో ఆ వాలెట్ ఉండి, అందులో వాలెట్ అడ్రస్ దొరికితేనే ఆ కరెన్సీ, దాని విలువ తెలుస్తుంది. వాలెట్ ఉన్న ఫోన్ను సీజ్ చేసినంత మాత్రాన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు కాదు. ఓ వినియోగదారుడు క్రిప్టో కరెన్సీ వాలెట్ అడ్రస్ను పోగొట్టుకుంటే దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. కస్టోడియన్ వాలెట్స్లో క్రిప్టో కరెన్సీని కేవైసీ ద్వారా, నాన్ కస్టోడియన్ వాలెట్స్లో 12 పదాలతో కూడిన ‘12 వర్డ్ పాస్ ఫేజ్’, ఎంపిక చేసుకున్న ప్రశ్నలు–సమాధానాల ద్వారా రిట్రైవ్ చేసుకోవాలి. ఈ విధానంలో సదరు నాన్ కస్టోడియన్ వాలెట్ 12 పదాలను ఓ వరుస క్రమంలో చూపిస్తుంది. దాన్ని రాసుకుని, రహస్యంగా దాచుకునే వినియోగదారుడు.. అవసరమైనప్పుడు క్రిప్టో కరెన్సీ రిట్రైవ్ చేసుకోవడానికి వినియోగిస్తాడు. ఈ పాస్ ఫేజ్ ఎవరి దగ్గర ఉన్నా... దాన్ని వినియోగించి క్రిప్టో అసెట్స్ను రిట్రైవ్ చేసుకోవచ్చు.సైబర్ ఠాణాలకు అధికారిక వాలెట్స్ ఓ నిందితుడి వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పాస్ ఫేజ్ అతడి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల వద్దా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉంటే నిందితుడిని అరెస్టు చేయగానే వాళ్లు పాస్ ఫేజ్ వినియోగించి ఆ క్రిప్టో కరెన్సీని తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకుని, మరో దాంట్లోకి మార్చేయడం, ఎన్క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా చూసేందుకు దర్యాప్తు అధికారులు అధికారికంగా కస్టోడియన్ వాలెట్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. నిందితుడి వాలెట్లోని క్రిప్టోను ఇందులోకి బదిలీ చేసుకుని న్యాయస్థానానికి సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ వినయ్కుమార్ ఇలాగే రూ.40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేశారు. ఈ కేసుతో వచి్చన అనుభవంతో ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ ఠాణాల్లో ఉన్న ప్రతి టీమ్కు క్రిప్టో వాలెట్స్ ఓపెన్ చేయించారు. భవిష్యత్లో సైబర్ నేరగాళ్ల నుంచి క్రిప్టో కరెన్సీ స్వా«దీనం చేసుకుంటే దాన్ని భద్రపరచడం కోసం వీటిని వినియోగించనున్నారు. -
దుమ్ము రేపుతున్న... ట్రంప్ మీమ్ బిట్కాయిన్
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కూర్చోడానికి ఒక్కరోజు ముందే సొంత (Bitcoin)బిట్కాయిన్ను ట్రంప్ మార్కెట్లోకి తెచ్చారు. $TRUMP పేరిట తెచ్చిన ఈ కాయిన్ (టోకెన్)కు మార్కెట్లో అనూహ్య డిమాండ్ నెలకొంది. ఔత్సాహిత పెట్టుబడిదారులు దాన్ని ఎగబడి కొనుగోలు చేశారు. దాంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ గంటల్లోనే ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వార్తలొచ్చాయి. ‘‘మొత్తంగా 100 కోట్ల టోకెన్లు తెస్తాం. ప్రారంభం రోజున 20 కోట్ల కాయిన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. మూడేళ్లలో దశలవారీగా 80 కోట్ల కాయిన్లను తీసుకొస్తాం’’ అని $TRUMP మీమ్ కాయిన్లను జారీచేసిన వెబ్సైట్ ప్రకటించింది. (Trump)ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ ఈ కాయిన్ విక్రయాల బాధ్యతలను చూసుకుంటోంది. సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ గతంలో ట్రంప్ బ్రాండ్నేమ్తో పాదరక్షలు, సుగందద్రవ్యాలు విక్రయించింది. ట్రంప్ పేరుతో గతంలో బైబిళ్లు, బంగారు బూట్లు, వజ్రాల వాచీలు కూడా అమ్ముడవడం తెలిసిందే. మీమ్ కాయిన్లను సాధారణంగా స్కామర్లు వినియోగిస్తారు. అధిక లాభా లు గడించాలన్న అత్యాశపరులైన పెట్టుబడిదారుల నుంచి సంపదను కాజేసేందుకు వాటిని వాడతారని క్రిప్టో కరెన్సీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యత.. ట్రంప్ యోచన!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ కథనం పేర్కొంది.ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైందిజాతీయ బిట్కాయిన్ నిధియూఎస్లో జాతీయ బిట్కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్కాయిన్లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.బైడెన్ పాలనలో ఒడుదొడుకులుఅధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాయి. -
2024లో 120 శాతం: 2025లో బిట్కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్లో బిట్కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్కాయిన్ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. -
రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు
ఒక బిట్కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్కాయిన్లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్కాయిన్లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్కాయిన్లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్కాయిన్ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.బిట్కాయిన్2010లో ఒక బిట్కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి. -
హార్డ్ డ్రైవ్లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాట
ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్న తరువాత.. దాని విలువ హఠాత్తుగా పెరిగితే, దాని కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తాం. అంతెందుకు జేబులో ఉన్న ఓ వంద రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే మనం ఎక్కడెక్కడ తిరిగామో.. అక్కడంతా వెతికేస్తాం. అయితే ఓ వ్యక్తి వేలకోట్ల విలువ గలిగిన బిట్కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. దాన్ని వెదకడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో.. ఈ కథనంలో చూసేద్దాం.జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2013లో అనుకోకుండా.. 7500 బిట్కాయిన్లు ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. అయితే దాని విలువ ఇప్పుడు 771 మిలియన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 65 వేలకోట్ల కంటే ఎక్కువ.తన హార్డ్ డ్రైవ్ స్థానిక స్థానిక ల్యాండ్ఫిల్ (డంప్యార్డ్) ప్రాంతంలో ఉంటుందని, డ్రైవ్ కోసం త్రవ్వడానికి అనుమతించమని న్యూపోర్ట్, వేల్స్ కౌన్సిల్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అనుమతిస్తే.. బిట్కాయిన్లో 10% లేదా దాదాపు 77 మిలియన్లను స్థానిక కమ్యూనిటీకి విరాళంగా ఇస్తానని పేర్కొన్నాడు.హార్డ్ డ్రైవ్ను వెదకడానికి హోవెల్స్ తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. మొత్తం సమయాన్ని కేవలం ఆ డ్రైవ్ను వెదకడానికే కేటాయించాడు. దీనిని వెదకడంలో అతనికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కూడా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. హోవెల్స్ ల్యాండ్ఫిల్ను శోధించే హక్కు కోసం నగరంపై దావా వేసి 629 మిలియన్ల నష్టపరిహారం కోరాడు.హోవెల్స్ కేసు ఇటీవల న్యాయమూర్తి ముందుకు వచ్చింది. హైకోర్టులో పూర్తిస్థాయి విచారణకు రాకముందే కేసును కొట్టివేయాలని న్యూపోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. ల్యాండ్ఫిల్లోకి వెళ్ళేదంతా కౌన్సిల్ యాజమాన్యంలోకి వస్తుందని చెప్పారు. తవ్వకానికి అనుమతి ఇస్తే సంఘానికి డబ్బు అందజేస్తామని ఇచ్చిన ప్రతిపాదనను.. కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేమ్స్ గౌడ్ కేసీ.. లంచం అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..హోవెల్స్ అభ్యర్థన మేరకు ల్యాండ్ఫిల్ తవ్వకాలు జరిపితే.. పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు. అంతే కాకుండా తవ్వకాలకు అనుమతిస్తే, పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెత్తలో ఉన్న హార్డ్ డ్రైవ్లో డేటా ఉంటుందా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఎవరెన్ని చెప్పినా హోవెల్స్ మాత్రం హార్డ్ డ్రైవ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. -
ఆల్టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్కాయిన్ ఆల్టైమ్ హై రికార్డ్ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్కాయిన్తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
బంగారం Vs బిట్కాయిన్.. ఏది బెస్ట్..?
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్హౌస్ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్కుంద్రా ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్తో బిట్కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్ను దాటి రికార్డ్లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
అమెరికా స్పేస్ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్ కాయిన్లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో బిట్కాయిన్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. స్పేస్ఎక్స్ బిట్కాయిన్ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్కాయిన్ మార్కెట్ క్రాష్ అయ్యింది. 800 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్ఎక్స్ తన బిట్కాయిన్లోని ఇన్వెస్ట్మెంట్లను అమ్మడం బిట్ కాయిన్ మార్కెట్లో అలజడి సృష్టించింది. అయినప్పటికీ, స్పేస్ ఎక్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టప్ మని పేలిన బిట్కాయిన్ బుడగ పలు నివేదికల ప్రకారం, బిట్కాయిన్ బుడగ పేలింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి $26,000 కంటే తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుండి బిట్కాయిన్ 9 శాతం క్షీణించింది. చదవండి👉 : ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే! -
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్కాయిన్ ఈటీఎఫ్లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్లో క్రిప్టో ఎక్సేంజ్లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్ఎక్స్లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్కాయిన్లో లాభం వచ్చి, బిట్ కాయిన్లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్కాయిన్లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్ను ఎక్సే్ఛంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
భారత దేశ చరిత్రలో 90వేల కోట్ల బిట్ కాయిన్ స్కాం..చేసింది ఎవరంటే!
ఈ ఏడాది మార్చి నెలలో భారీ బిట్ కాయిన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్పై కోర్ట్లో కేసు నడుస్తుండగా.. తాజాగా ఆ మొత్తం కుంభ కోణం విలువ సుమారు రూ.90,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు పోంజి స్కాం చేశాడు.ఇక, బిజినెస్ వాడుక భాషలో పూంజి స్కాం అంటే..ఉదాహరణకు..నిందితుడు లక్షమందిని మోసం చేయాలని అనుకుంటే..ఆ డిజిట్కు రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తాడు.ఇందుకోసం తన మాట విని బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పెట్టిన మొత్తాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇస్తాడు. ఆ మాటలు నమ్మిన మదుపర్లు బిట్ కాయిన్లపై భారీగా ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పినట్లుగానే అమాయకులైన ఇన్వెస్టర్లకు మొదట్లో లాభాలు చూపిస్తారు. ఆ లాభాలతో నిందితులకు పబ్లిసిటీ పెరుగుతుంది. దీంతో అనతి కాలంలో స్కాం టార్గెట్ను రీచ్ అవ్వొచ్చు. అలా టార్గెట్ రీచ్ అయితే ఇన్వెస్టర్లకు ఆదాయం చూపించడం మానేస్తారు. ప్రతినెలా డబ్బులే డబ్బులు సేమ్ ఇలాగే పైన అమిత్ భరద్వాజ్ కుంభకోణం విషయంలో జరిగింది. భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్తో 18 నెలల పాటు బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో ఉండగా..ఈడీ బిట్కాయిన్ కుంభకోణానికి పాల్పడిన నిందితుల క్రిప్టో వాలెట్కు యాక్సెస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరుల సహకారంతో అమిత్ భరద్వాజ్ (ఈ ఏడాది జనవరిలో మరణించాడు) 80వేలకు పైగా బిట్కాయిన్లు సేకరించినట్లు తాము నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. రూ.90వేలకోట్ల స్కాం ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిట్కాయిన్ స్కాంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అమిత్ చేసిన పోంజి కుంభ కోణం విలువ రూ.90వేల కోట్లకు పైగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పోంజీ స్కాం సూత్రధారి అమిత్ భరద్వాజ్ మదుపర్ల నుంచి వచ్చిన వేల కోట్లతో 385,000 నుండి 600,000 మధ్య బిట్ కాయిన్లను సేకరించారు. వాటి విలువ సుమారు వన్ ట్రిలియన్ కంటే ఎక్కువేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్కాంలో నిందితుడిపై 40 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 40ఎఫ్ఐఆర్లు ఈడీ విచారణతో బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. మహారాష్ట్ర, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు బిట్ కాయిన్ కుంభ కోణంలో బాధితులు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయారు. దాదాపు ప్రస్తుత బిట్ కాయిన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే? ప్రతి బిట్ కాయిన్ విలువు రూ. 23,57,250గా ఉంది.పూణే పోలీసులు 60వేల మందికి పైగా యూజర్లు, ఐడీ, ఈమెయిల్ అడ్రస్ల ఆధారాలకు అనుగుణంగా ఆ బిట్ కాయిన్ స్కాం రూ.90,500 కోట్లని అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్ట్లను కోరుతున్నారు. చదవండి👉 యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! -
కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు..నష్టం మామూలుగా లేదుగా!
లాభాలే..లాభాలని బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అనుభవంతో పనిలేకుండా, డబ్బులున్నాయని పెట్టుబడులు పెట్టారా? అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు తప్పదిక! మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను రోడ్డున పడేస్తుంది. ఇన్నిరోజులు లాభాలతో ఇన్వెస్టర్లకు స్వర్గదామంగా మారిన బిట్కాయిన్ ఇప్పుడు నష్టాలతో కుదేలవుతుంది. ఇందులో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు (జూన్ 13) జనవరి 2021 తరువాత తొలిసారి 1ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు క్రిప్టో డేటా బ్లాగ్ 'కాయిన్ మార్కెట్ క్యాప్' తెలిపింది. 2021 నవంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, కొత్తగా పుట్టుకొచ్చిన మంకీ పాక్స్ లాంటి వైరస్లు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సెంట్రల్ బ్యాంకుల (మన దేశంలో ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు క్రిప్టో మార్కెట్ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే గత రెండు నెలల వ్యవధిలో ఇన్వెస్టర్లు 1 ట్రిలియన్ వ్యాల్యును కోల్పోయింది. 18నెలల్లో లక్షల కోట్లు ఉఫ్ ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ గడిచిన 18నెలల కాలంలో రోజులో 10 శాతానికి పైగా క్షీణించి, 18 నెలల కనిష్ట స్థాయి $23,750కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం తగ్గింది. చిన్న కాయిన్ ఈథర్ 15 శాతం పైగా పడిపోయి $1,210కి చేరుకుంది. -
యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం!
మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్ను నమ్ముతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. యూట్యూబ్లో ఎలన్ మస్క్ స్కామ్ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్కాయిన్లపై ఎంతమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ రోజుల్లో భారీ లాభాల్ని ఎలా అర్జిస్తామో? వివరిస్తూ ఎలన్ మస్క్కు చెందిన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్కు చెందిన వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఆ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించేది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈజీ మనీ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న సైబర్ నేరస్తులే ఆ వీడియోల్ని టెలికాస్ట్ చేస్తున్నట్లు తేలింది. ఎలన్ మస్క్ వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి కేటుగాళ్లు భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఫేక్ క్రిప్టో ట్రేడింగ్ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. ఎలన్ మస్క్ చెప్పినట్లుగా ఆ వెబ్సైట్లో క్రిప్టో ట్రేడింగ్ నిర్వహిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వొచ్చని నకిలీ యాడ్స్తో ఊదరగొట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ సాయంతో ఎలన్ మస్క్ వీడియోల్ని ప్రసారం చేయడంతో ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా వారం రోజుల వ్యవధిలో బిట్ కాయిన్లపై పెద్దమొత్తంలో 23 ట్రాన్సాక్షన్లు, ఎథేరియంపై 18 ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. ఇలా 243,000 డాలర్లు మోసపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రం ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ క్రిప్టో ట్రేడింగ్ నిజమని నమ్మి ప్రముఖ చిలీ సంగీతకారుడు ఐసాక్ సైతం మోసపోయాడు. లైవ్ స్ట్రీమింగ్ వీడియో లింకుల్ని క్లిక్ చేయడంతో హ్యాకర్లు ఐసాక్ య్యూట్యూబ్ ఛానల్ను హ్యాక్ చేశారు. తాము అడిగినంత ఇస్తే ఛానల్ను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసాక్ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో తన పేరుమీద జరుగుతున్న మోసాలపై ఎలన్ మస్క్ స్పందించారు. తన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వీడియోలతో తన పేరుతో స్కామర్లు అమాయకుల్ని దోచుకుంటున్నారని, అలాంటి స్కామ్ యాడ్స్ను యూట్యూబ్ సంస్థ కట్టడి చేయలేకపోతుందంటూ మండిపడ్డారు. వెంటనే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని ఎలన్ మస్క్ యూట్యూబ్కు విజ్ఞప్తి చేశారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
బిట్ కాయిన్ క్రాష్: మార్కెట్ క్యాప్ ఢమాల్!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్ట్రెండ్ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్చెయిన్ నెట్వర్క్ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్ఆర్పీ కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడీఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద, ప్రధాన టాప్ టోకెన్లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం అయితే యూఎస్డీటీ టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్ట్రెండ్ని, యూఎస్డీసీ స్టేబుల్కాయిన్లు 0.01 శాతం అప్ట్రెండ్ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ సూచించారు. -
క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్కాయిన్..
భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీదే రాజ్యం అంటూ ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా... మరోవైపు చాలా దేశాలు క్రిప్టో లావాదేవీలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో క్రిప్టోలపై అనిశ్చిత్తి పకూర్తిగా వీడటం లేదు. కాగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సైతం డిజిటల్ కరెన్సీపై నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలో లార్జెస్ట్ కాయిన్గా పేరొందని బిట్ కాయిన్ విలువకి భారీ ఎత్తున కోత పడుతోంది. గడిచిన ఐదు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 14 శాతం క్షీణించింది. మే 5న బిట్కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 30.14 లక్షలు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 25.90 లక్షలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా డిజిటల్ ఆస్తుల కంటే రెగ్యులర్ ఆస్తులపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు రెండో అతి పెద్ద డిజిటల్ కాయిన్ అయిన ఈథెరమ్ సైతం తన విలువను గత ఐదు రోజుల్లో 15 శాతం కోల్పోయింది. ప్రస్తుతం ఈథేమర్ విలువ రూ.1.89 లక్షలుగా ఉంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ. 33.64 వేల మేరకు కోత పడింది. చదవండి: భారత్లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! -
'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'!
టెక్నాలజీ! రెండంచుల కత్తి అనేది నూటికి నూరుపాళ్లు నిజం. సవ్యంగా వాడుకోవడం తెలియాలే కానీ అద్భుతాలు చేయోచ్చు. అదే సమయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటే 'కథ వేరేలా ఉంటుంది'. డేటింగ్ యాప్స్ కూడా అంతే! మీటింగ్, డేటింగ్, సింగిల్, మింగిల్ అని మొదలై రియలైజ్ అయ్యేలోపు వీలైనంత సొమ్ము చేసుకుంటాయి. అలా ఓ యువకుడు 'టిండర్' యాప్లో 'జెన్నీ'తో చాట్ చేశాడు. చివరికి తాను జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. నిజానికి ట్విట్టర్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్మీడియా నెట్ వర్క్లు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్నవారిని కూడా ఫ్రెండ్స్గా మార్చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ సోషల్ మీడియాతో పెద్ద మజా ఏముంది. నచ్చితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. మాట్లాడుతారు. స్నేహితుల్లా కనెక్ట్ అవుతారు. అంతకు మించి ఉండే ఛాన్స్ తక్కువ. ఈ పాయింట్తోనే కొత్త కొత్త డేటింగ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన టిండర్ యాప్లో అమెరికాకు చెందిన మైక్ చాట్ చేసి జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము రూ.20లక్షలు పోగొట్టుకున్నాడు. అమెరికాకు చెందిన మైక్ సరదాగా గడిపేందుకు టిండర్ యాప్లో లాగిన్ అయ్యాడు. అంతే అలా లాగిన్ అయ్యాడో లేదో..వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు..'హలో కమాన్ మైక్ మీరు సింగిలా, అయితే మింగిల్ అవ్వండి' అంటూ మెసేజ్ చేసిన జెన్నీకి అడ్డంగా దొరికి పోయాడు. తాను మలేషియాకు చెందిన జెన్నీ'ని అంటూ ఓ యువతి మైక్ను పరిచయం చేసుకుంది. ఆ టిండర్ యాప్ పరిచయం వాట్సాప్కు మారింది. నిమిషాలు, గంటలు కాస్తా రోజులయ్యాయి. పలకరింపులు మారిపోయాయి. ఎంతలా అంటే పేరు ఊరు తెలియకుండానే బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టేంతలా. వాస్తవానికి మైక్కు బిట్కాయిన్లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదు. కానీ జెన్నీ "మైక్ మా మామయ్య ఎంఎన్సీ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్లో పనిచేస్తున్నాడు. బిట్ కాయిన్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో సలహా ఇవ్వడంలో దిట్ట.కావాలంటే నువ్వూ పెట్టుబడులు పెట్టు మైక్. భారీగా లాభాలొస్తాయ్" అంటూ కవ్వించే మాటలతో మెల్లగా ముగ్గులోకి దించింది. జెన్నీ మాట విని చట్టబద్దమైన బిట్కాయిన్ సంస్థలో 3వేల డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. అవి కాస్త పెరగడంతో..యువతి తన ప్లాన్ను మెల్లగా అమలు చేసింది. మైక్ నాకు తెలిసిన సంస్థ ఉంది. అందులో ఆ 3వేల డాలర్లు ట్రాన్స్ఫర్ చేయి. అంతకంతకూ పెరిగిపోతాయి అంటూ నమ్మించింది. అలా జెన్నీ చెప్పిన ఓ ఫేక్ బిట్ కాయిన్ కంపెనీ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టాడు. అవి కాస్తా డబుల్ అవ్వడంతో జెన్నీ మాటమీద నమ్మకంతో రూ.20లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సీన్ కట్ చేస్తే 4నెలల తరువాత బాధితుడి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్సైట్ ఫేక్ అని, జెన్నీ మోసం చేసిందని నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలని మైక్ పోలీసులతో మొరపెట్టుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావడం కష్టమని, టెక్నాలజీ పట్ల, ముఖ్యంగా ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి బిట్కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
బిట్కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్కాయిన్పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్కాయిన్స్, ఎథిరెమ్, లైట్కాయిన్, రిపిల్, డోజీకాయిన్ను భారత్లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్షిప్ను భద్రపరుస్తారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. (చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!) -
క్రిప్టో కరెన్సీ అంటే అంత క్రేజ్ ఎందుకు?
డిజిటల్ ఇండియా..డిజిటల్ ఎకానమీ...డిజిటల్ రుపీ. అంతా డిజిటల్. డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ త్వరలోనే దేశీ డిజిటల్ కరెన్సీని లాంచ్ భారత్లో చేయనుంది. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సికి ఎందుకంత క్రేజ్? ఇక భవిష్యత్తు అంతా క్రిప్టోకరెన్సీలదేనా? క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ రూపంలోనే కనిపించే కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడున్న కరెన్సీలాగే చాలా దేశాల్లో వీటిని లావా దేవీలకు అనుమతి ఇస్తున్నారు. . బిట్కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే. 2011 ఏప్రిల్లో 1 డాలరుగా ఉన్న బిట్కాయిన్ విలువ అదే ఏడాది జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా 2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది. అయితే బిట్ కాయిన్కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో బిట్కాయిన్తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీ మొదలైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లు, ట్రేడింగ్ ఫ్లాట్ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 10,000 డాలర్లకు ఎగిసిన బిట్కాయిన్ 2019లో 7,000 డాలర్లకు పడిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్షోభం, డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో 2020లో బిట్కాయిన్ మళ్లీ దూసుకుపోయింది. 2021లో 70వేల డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను ఊరించడం మొదలు పెట్టింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్కాయిన్ 16శాతం పతనమై దాదాపు సగానికి పడిపోయింది. 2022 ఫిబ్రవరి 1 తరువాత 39వేల డాలర్ల దిగువకు చేరింది. ఇంత ఒడిదుకుల మధ్య ఉన్నా .. ఆదరణ మాత్రం పెరుగుతూనే ఉంది. (Happy Birthday Shekhar Kammula: శేఖర్ కమ్ముల గెలుచుకున్నది ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?) తాజాగా కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి బ్లాక్చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. అంటే భారత్లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశంలో క్రిప్టో ట్రేడింగ్కు అనుమతి ఉంటుందనేసంకేతాలందించారు. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. అనుకున్నట్టుగా ఇండియా డిజిటల్ రుపీని లాంచ్చేస్తే అది ప్రపంచ రికార్డు కానుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ తరహా 'ఈ-క్రోనా' వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, 2014 నుంచి చైనా పీపుల్స్ బ్యాంకు కూడా డిజిటల్కరెన్సీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రధాన నగరాల్లో డిజిటల్ యువాన్ను ట్రయల్ చేస్తోంది. ముఖ్యంగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు హాజరయ్యే అథ్లెట్లు, అధికారులు, జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న మూడు చెల్లింపు పద్ధతుల్లో ఇదొకటి. అయితే సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. మార్కెట్ను ఎలా నియంత్రించాలనుకుంటోంది లాంటి విషయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ తయారుచేస్తుందో చూడాలి. బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, నియంత్రణ,భద్రత లాంటి అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలే బెటర్అని టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఇప్పటికే చెప్పారు. మనీలాండరింగ్, టెర్రరిస్టు కార్యకలాపాలు, డార్క్నెట్ నేరాలు పెరిగిపోతాయని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ముప్పేనని వారెన్ బఫెట్, పాల్ క్రుగ్మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్కాయిన్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్కాయిన్ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్కాయిన్ చేస్తున్న డ్యామేజ్ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
Bitcoin: బిట్కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్కు సాలిడ్గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్కాయిన్కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్లో ప్రపంచంలోనే బిట్కాయిన్ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్ను తాకింది బిట్కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్కాయిన్ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!
మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ఇన్వెస్టర్లు అందరూ విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు(జనవరి 21) భారీగా పతనం అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ 5.97 శాతం తగ్గి రూ.28.44 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. బిట్కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 7.71 శాతం తగ్గి రూ.205,958.68 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది. బైనాన్స్ కాయిన్ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్రింగ్, లైవ్పీర్, యార్న్ ఫైనాన్స్, హార్మొని, ఎన్కేఎన్, కీప్ నెట్వర్క్, అల్గొరాండ్ 13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తల వల్ల క్రిప్టో మైనింగ్ పరిశ్రమకు నిలయమైన రష్యా అన్ని క్రిప్టోకరెన్సీల వినియోగం, మైనింగ్ పై నిషేధాన్ని విధించాలని చూస్తుంది. రష్యాలోని సుమారు 17 మిలియన్ క్రిప్టో వాలెట్లలో 7 ట్రిలియన్ రూబుల్స్ (92 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ Crypto.com, తమ క్రిప్టో కరెన్సీ దొంగిలించినట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఈ వారం కొద్ది సేపు భద్రతల నేపథ్యంలో ట్రెండింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. (చదవండి: రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!) -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్!!
ఓ స్వచ్ఛంద సంస్థ తాము ఎంపిక చేసిన ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు 10వేల డాలర్లు(రూ.7లక్షల పై మాటే) విలువ చేసే బిట్కాయిన్లను ఉచితంగా అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది. అమెరికాకు చెందిన నార్తవెస్ట్ ఆర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్..ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడేవారికి భారీ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు 2020నవంబర్ నుంచి ఫ్రీగా 10 వేలడాలర్లతో పాటు రోడ్ బైక్ లేదంటే మౌంటెన్ బైక్ అందిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి లాభపేక్షలేకుండా ఫ్రీగా అంతపెద్దమొత్తాన్ని ఎలా చెల్లిస్తారనే ప్రశ్నకు సమాధానంగా నార్త్వెస్ట్ అర్కాన్సాస్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. నార్త్వెస్ట్ అర్కాన్సాస్కు వలసల్ని ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని క్రిప్టో హబ్గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోత్సహకాల్ని అందిస్తున్నాం. బ్లాక్చెయిన్పై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలను ఆకర్షించాలనదే మా ఉద్దేశం. ఈ ఆఫర్లో ఎవరైనా పాల్గొనచ్చని కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈఓ నెల్సన్ పీకాక్ తెలిపారు. బ్లూమ్బెర్గ్ నివేదిక సైతం..ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి 50మంది తరలి వచ్చినట్లు తెలుస్తోంది. బిట్కాయిన్ల ఇన్సెంటీవ్లను అందించడం ద్వారా రానున్న రోజుల్లో 7,500 ఓపెన్ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సహాయపడుతుందని కౌన్సిల్ భావిస్తోంది. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు! -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
ఫోటో, వీడియో అమ్మకాలతో సుమారు రూ. 1.8 లక్షల కోట్ల బిజినెస్..! ఎందుకంత క్రేజ్..?
ఫోటోలను, వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) రూపంలో జరిపిన అమ్మకాలు 2021లో భారీ ఎత్తున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణ లభిస్తోంది. తమ అభిమాన వ్యక్తుల వాయిస్ను, వీడియోలను ,ఫోటోలను దక్కించుకునేందుకు ఎన్ఎఫ్టీ ప్రేమికులు కోట్ల రూపాయలను వెచ్చించారు. 25 బిలియన్ డాలర్లకు...! కార్టూన్ ఏప్స్ నుంచి వీడియో క్లిప్ల వరకు అన్నింటీని ఆయా ఎన్ఎఫ్టీ ఔత్సాహికులు 2021లో భారీ ఎత్తున అమ్మకాలను జరిపారు. గత ఏడాదిలో ఎన్ఎఫ్టీ అమ్మకాలు దాదాపు 25 బిలియన్ల (సుమారు రూ. 1,84,690 కోట్లు) డాలర్లకు చేరుకుంది. ఈ ఊహాజనిత క్రిప్టో ఆస్తులపై భారీ ఎత్తున ఆదరణను పొందాయి. ఎన్ఎఫ్టీ మార్కెట్ ట్రాకర్ DappRadar(డాప్రాడర్) డేటా ప్రకారం...2021లో ఎన్ఎఫ్టీల అమ్మకాలు మందగించాయని సూచించింది. గత ఏడాది ఆగస్ట్లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తరువాతి నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో క్షీణించాయి. డిసెంబరులో మళ్లీ పుంజుకుంది. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో బిట్కాయిన్, ఈథర్ విలువ పెరిగినందున ఎన్ఎఫ్టీ అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. 2021లో దాదాపు 28.6 మిలియన్ వాలెట్లు ఎన్ఎఫ్టీలను సేల్ చేయగా, అది 2020లో దాదాపు 5,45,000గా ఉంది పుట్టగొడుగుల్లా ఎన్ఎఫ్టీ కంపెనీలు..! ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీలను నిర్వహించే కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిచాయి. అనేక కళాకారులు తమ చిత్రాలను అమ్ముతూ భారీ ఎత్తున సంపాదించారు. 2021 మార్చిలో ఒక ఎన్ఎఫ్టీ ఏకంగా రూ. 510 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ఆటోమొబైల్, దిగ్గజ మల్టీనేషన్ కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను అమ్మేందుకు సిద్దమయ్యాయి. కొకాకోలా, గుచి లాంటి కంపెనీలు కూడా ఎన్ఎఫ్టీలను విక్రయించాయి. భారత్లో బూమ్..! భారత్లో క్రిప్టోకరెన్సీతో పాటుగా ఎన్ఎఫ్టీపై భారీ ఆదరణే వచ్చింది. అమితాబ్ బచ్చన్, సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, దినేశ్ కార్తీక్, యూవీ, రిషబ్ పంత్ లాంటివారు కూడా తమ ఆడియో, వీడియో, ఫోటోలను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేసేందుకు సిద్దమయ్యారు. ఇక భారత్కు చెందిన మెటాకోవన్ అని పిలువబడే విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్ ఫోటో ఎన్ఎఫ్టీను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే.. -
Bitcoin: భారీగా పడిపోయిన బిట్కాయిన్ ధర..!
ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోతుంది. క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ నేడు 4.9 శాతం క్షీణించి 41,008 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. నాలుగు నెలల క్రితం బిట్కాయిన్ జీవితకాల గరిష్ఠం 69,000 అమెరికన్ డాలర్లకు చేరుకున్నప్పటి నుంచి సుమారు 40 శాతం పడిపోయింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ విలువ సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పడిపోయింది. బైనాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్ఆర్పీ సైతం గత ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశం తర్వాత క్రిప్టోకరెన్సీ ధర భారీగా పడిపోతూ వస్తుంది. వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే ఎక్కువ ఉండొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్లో వెల్లడవ్వడం తాజాగా క్రిప్టో కరెన్సీ పతనానికి దోహదం చేసింది. "క్యూ1 2022లో బ్యాలెన్స్ షీట్ తగ్గించాలనే ఫెడ్ తీసుకున్న నిర్ణయం ఈ పతనానికి ప్రధాన కారణం" అని ఫండ్ స్ట్రాట్ వ్యూహకర్తలు తెలిపారు. వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందన్న అంచనాలు, ద్రవ్యోల్బణ నుంచి రక్షణ, మదుపర్ల పోర్ట్ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడం వంటి పరిణామాలతో బిట్కాయిన్ విలువ గత ఏడాది 60 శాతం మేర పెరిగింది. వీటిలో కొన్ని అంశాల్లో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండడంతో తాజా కొనుగోళ్లకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోల విలువ క్రమంగా పడిపోతున్నట్లు నిపుణులు తెలిపారు. జెఎస్టి క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టాడ్ మొరాకిస్ ప్రకారం.. కజఖ్స్థాన్లోని అశాంతి, అక్కడ గణనీయమైన సంఖ్యలో క్రిప్టో-మైనింగ్ కార్యకలాపాలపై చైనా అణచివేత, విద్యుత్-సరఫరాలో ఇబ్బందులు వంటి కారణాలు కూడా బిట్కాయిన్ ధరను ప్రభావితం చేశాయి. నెట్ వర్క్ కంప్యూటింగ్ శక్తి కొలత అయిన బిట్కాయిన్ హాష్ రేటు(Blockchain.com డేటా ప్రకారం) జనవరి 1న సుమారు 208 మిలియన్ల రికార్డు నుంచి గురువారానికి 176 మిలియన్ టెరాహాషెస్ కు పడిపోయింది. (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
2021లో జరిగిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. 2021లో క్రిప్టో ట్రేడర్స్ పెద్ద ఎత్తున లావాదేవీలను జరిపినట్లు ప్రముఖ గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం ఓకేఎక్స్ఛేంజ్ (OKEx) ఒక నివేదికలో వెల్లడించింది. 21 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు..! ప్రపంచవ్యాప్తంగా ఓకేఎక్స్ఛేంజ్ ప్లాట్ఫాం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ను అనువైన ప్లాట్ఫాంగా మారింది. కేవలం ఈ ప్లాట్ఫాంలోనే 2021లో సుమారు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన 25 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోలావాదేవీలు ఆల్టైం రికార్డుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. 2022 క్రిప్టో భవితవ్యం ఎలా ఉంటుందంటే..! OKEx.com అంచనాల ప్రకారం..2022లో క్రిప్టో మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసించింది. క్రిప్టోకరెన్సీలతో పాటుగా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ప్లాట్ఫామ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. 2022లో పెట్టుబడిదారుల క్రిప్టో పోర్ట్ఫోలియోలో స్టేబుల్కాయిన్లు ప్రముఖ స్థానాన్ని సృష్టిస్తాయని ఓకేఎక్స్ఛేంజ్ తెలిపింది. స్టేబుల్కాయిన్ అనేది యూఎస్ డాలర్ వంటి జాతీయ కరెన్సీ లేదా బంగారం వంటి విలువైన లోహం వంటి అంతర్లీన ఆస్తికి అనుసంధానించబడిన డిజిటల్ కరెన్సీ. ఇక క్రిప్టోకరెన్సీలపై ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నా.... క్రిప్టోకరెన్సీ 2022లో స్థిరమైన ఒడిదుడుకులతో వృద్ధిని సాధిస్తాయని వెల్లడించింది. ఓకేఎక్స్ఛేంజ్ టాప్-5లో ఒకటి..! స్పాట్ అండ్ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ వాల్యూమ్ల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ఓకేఎక్స్ఛేంజ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 20 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్లాట్ఫారమ్ ఓకేఎక్స్ఛేంజ్. 2021లో సుమారు 220 కొత్త క్రిప్టో కరెన్సీలు ఈ ప్లాట్ఫాంలో లిస్టింగ్ అయ్యాయి. చదవండి: The Most Popular Crypto In 2021: అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..? -
2021లో అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్కాయిన్ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్కాయిన్ కాకుండా ఇతర ఆల్ట్ కాయిన్స్ భారీ ఆదరణను పొందాయి. బిట్కాయిన్ కంటే దీనిపైనే..! క్రిప్టోకరెన్సీల్లో బిట్కాయిన్ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్మార్కెట్క్యాప్ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్ కాయిన్ డోజ్కాయిన్కు స్పిన్-ఆఫ్. ఎలన్ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కారణం అదే..! క్రిప్టోకరెన్సీలో బిట్కాయిన్ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్కాయిన్ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్కాయిన్ కంటే ఆల్ట్కాయిన్స్ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్లో ఈ క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. రాబిన్ హుడ్ యాప్లో షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్హుడ్లో జాబితా చేయబడే అవకాశం ఉందనే పుకార్లు ఈ కాయిన్ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్ లో లిస్ట్ చేయాలని ఆన్లైన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. షిబా ఇను కాయిన్ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ కాయిన్బేస్లో లిస్ట్ అయ్యింది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
భవిష్యత్లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే!
భవిష్యత్ అంతా బిట్ కాయిన్లదే. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే కనుమరుగవుతుంది. క్రిప్టో వినియోగం పెరుగుతుంది. సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంటూ ఓ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వరల్డ్ వైడ్గా బిట్ కాయిన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లకు చట్టబద్ధత (అధికారిక కరెన్సీ) కల్పించిన ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె..ఆ కరెన్సీపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగించే కరెన్సీ త్వరలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న 'రియల్ రివల్యూషన్' బిట్కాయిన్ అని బుకెలె ట్వీట్ చేశారు. పైగా బిట్కాయిన్ యుగానికి ఎల్ సాల్వడార్ నాయకత్వం వహిస్తోందని జోస్యం చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు క్రిప్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోంది. అయితే బిట్కాయిన్ల వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రిప్టోతో ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే భవిష్యత్లో వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం ఆగిపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ మెరుగైందని నిరూపించుకోవడమేనని అన్నారు. $400 మిలియన్ డాలర్ల భారం తగ్గించాలనే బిట్ కాయిన్ వినియోగంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నా..ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు మాత్రం..ఆ దేశ ఆర్ధిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి ఆదేశానికి మధ్య జరిగే ఆర్ధిక లావాదేవీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సుమారు 400 మిలియన్ల డాలర్ల అధిక రుసుముల్ని తగ్గించే మార్గాల్ని అన్వేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్లో సెప్టెంబరులో బిట్కాయిన్ను చట్టబద్ధం చేసినప్పుడు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తరుపున మొత్తం 400 బిట్కాయిన్లు, అంతకంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాయిన్ల సంఖ్య 1000కి చేరింది. ఆ బిట్ కాయిన్ల సేకరణ మరింత పెంచేందుకు ఏటీఏం తరహాలో దేశ వ్యాప్తంగా 200 బిట్ కాయిన్ టెల్లర్ మెషీన్లను ఇన్స్టాల్ చేసింది. ఆ మెషిన్ల ద్వారా బిట్ కాయిన్లను కొనుగోలు చేసే పౌరులకు ప్రత్యేకంగా రాయితీలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బుకెలెకు వార్నింగ్ బిట్కాయిన్ బాండ్లతో బిట్ కాయిన్సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు కొద్ది నెలల క్రితం నయిబ్ బుకెలె ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) షాకిచ్చింది. బిట్కాయిన్ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బిట్ కాయిన్ల వల్ల వినియోగదారుల రక్షణ, ఆర్థిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన నష్టాల్ని కలిగిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. అయితే బుకెలే మాత్రం ఐఎంఎఫ్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నారు. బిట్ కాయిన్లతో లాభాల్ని గడిస్తున్నారు. లాభాలు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నా..బిట్ కాయిన్లపై ఆర్ధిక కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశం బిట్కాయిన్లపై ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తుంది. క్రిప్టో కాయిన్ కొనుగోలు చేసే సమయంలో దాని ధర తక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో భారీ లాభాల్ని చవిచూస్తుంది. కానీ దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం బిట్ కాయిన్లపై ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది.లేదంటే కోలుకోలేని నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..! -
భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు..
Man Hires NASA Linked Experts To Find Hard Drive With 7500 Bitcoins: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణ నోచుకుంటుంది. వీటికి అంతస్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్య కారణం ఒకటి ట్యాక్స్ ఫ్రీ, మరోకటి పకడ్బంది భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను బ్లాక్చైయిన్ టెక్నాలజీ ఉపయోగించి చేస్తారు. ఆయా యూజర్లు క్రిప్టోకరెన్సీలను ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీతో భద్రంగా ఒక హర్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవచ్చును. కాగా యూకేకు చెందిన జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని బిలియనీర్ కాకుండా చేసింది. చెత్త బుట్టలో పడేసిన భార్య..! ప్రపంచంలోని అత్యంత దురదృష్టవంతుడు అంటే ఇతడేనెమో...! బహుశా..! 36 ఏళ్ల జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన పొరపాటుతో ఏకంగా 7500 బిట్కాయిన్లను పొగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్కాయిన్ల హార్డ్ డిస్క్ను చెత్త బుట్టలో పడేసింది. ఈ హర్డ్ డిస్క్ను వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు. బిలియనీర్ కావాల్సినోడు.. జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు బిలియనీర్ అవ్వకుండా చేసింది. నేడు 7500 బిట్కాయిన్ల విలువ నేడు ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,404 కోట్లకు సమానం. పొగొట్టుకున్న హర్డ్ డిస్క్ను సంపాదించేందుకు అమెరికా ఒన్ట్రాక్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీరు గతంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమిపై కూలిపోయినప్పుడు నాసాకు సహయాన్ని అందించింది. ఈ హార్డ్ డిస్క్ను పొందేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నాడు జేమ్స్. ఈ హర్డ్ డిస్క్ వెతుకులాటలో ఒన్ట్రాక్ విజయవంతమైతే దానిని క్రాక్ చేయడంతో జేమ్స్ రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి స్ధానిక సౌత్ వేల్స్ పోలీసులు హార్డ్డిస్క్ వెతికేందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. చదవండి: ఇండియన్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..? -
బిట్కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్
క్రిప్టోమార్కెట్లో అతిపెద్ద డిజిటల్ కరెన్సీగా బిట్కాయిన్కి పేరుంది. అలాంటిది బిట్కాయిన్ కంటే.. ఎక్కడో క్రిప్టోకరెన్సీ జాబితాలో అట్టడుగున ఉండే మీమ్ కాయిన్ డోజ్కాయిన్కు ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు ఎలన్ మస్క్. బిలియనీర్ ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ వారి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో టైమ్ ఇంటర్వ్యూలో క్రిప్టోకరెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే ఎలన్ మస్క్.. బిట్కాయిన్ వరెస్ట్ అని, దీంతో పోలిస్తే డోజ్కాయిన్ చాలా బెస్ట్ అని చెప్తున్నాడు. అందుకు కారణాలేంటో కూడా వివరించాడాయన. రోజూవారీ ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే.. డోజ్కాయిన్ను బెటర్ క్రిప్టోకరెన్సీగా అభివర్ణించాడు. ‘బిట్కాయిన్ ట్రాన్జాక్షన్ వాల్యూ తక్కువ. ట్రాన్జాక్షన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఒకానొక స్థాయిలో దాచుకోవడానికి ఇది పర్వాలేదనిపించొచ్చు. కానీ, ప్రాథమికంగా ట్రాన్జాక్షన్ కరెన్సీకి బిట్కాయిన్ ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నాడు ఎలన్ మస్క్. డోజ్కాయిన్ను హైలెట్ చేయడం జోక్గా మీకు అనిపించొచ్చు. కానీ, ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే ఇదే బెస్ట్. బిట్కాయిన్ ఒకరోజులో చేసే ట్రాన్జాక్షన్స్ కంటే డోజ్కాయిన్ చేసే ట్రాన్జాక్షన్స్ ఎక్కువ. పైగా డోజ్కాయిన్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బిట్కాయిన్లలాగా నిల్వ గురించి కాకుండా.. జనాల చేత ఖర్చు చేయిస్తుంది. అలా ఇది ఎకామనీకి మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ విలువ నష్టాల్లోనే నడుస్తోంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్తో పాటు భారత్లో క్రిప్టో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నేపథ్యంలో బిట్కాయిన్ విలువ పడిపోతూ ట్రేడ్ అవుతోంది. Watch: TIME's 2021 Person of the Year @elonmusk discusses cryptocurrency #TIMEPOY https://t.co/FfwEGxW7LX pic.twitter.com/5BXAZky0LS — TIME (@TIME) December 13, 2021 చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! -
కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!
‘ధనమేరా అన్నిటికీ మూలం...ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం’ అంటాడు ఓ సినీకవి. అక్షర సత్యమే. కానీ ఇప్పుడంటే బ్యాంకులు ప్రభుత్వాలు ఇన్ని నోట్లు ముద్రించి.. వాటికి విలువను నిర్దేశిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తువులకు, సేవలకు విలువ కట్టి అంతకు సమానమైన విలువ అని భావించి మార్పిడి చేసుకున్న దశ నుంచి... బంగారం తదితరాలను విలువకు ప్రమాణంగా చేసుకోవడం.. తరువాతి కాలంలో బ్యాంకు నోట్లు.. క్రెడిట్/డెబిట్ కార్డుల వరకూ ధనం అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ క్రిప్టో కరెన్సీ!! బిట్కాయిన్ అనండి.. ఎరిథ్రియం అనండి.. లేదా ఇంకోటి అని పిలవండి... అన్నీ హైటెక్ యుగపు డిజిటల్ టెక్నాలజీ ప్రతిరూపాలే! పలుదేశాల్లో ఇప్పటివకే విస్తృత వాడకంలో ఉన్న ఈ క్రిప్టో కరెన్సీ.. దాంతో చేసే వ్యవహారాలపై దేశాద్యంతం చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారి.. దీని గతం.. వర్తమానం.. భవిష్యత్తులను సమీక్షిస్తే... ఈమధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. తక్కువకాలంలో ఎక్కువ లాభాలకు ఇవి మేలు మార్గాలన్న ప్రచారం జరుగుతోంది. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల మాదిరిగానే క్రిప్టో వ్యవహారాల కోసం ఎక్సే్చంజీలూ పుట్టుకొచ్చాయి. బోలెడన్ని టీవీ, న్యూస్ పేపర్ ప్రకటనలూ కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బే.. అదంతా హైటెక్ వ్యవహారం. మనకర్థం కాదులే అనే వాళ్ల మాటేమో కానీ.. ఈ కథనం పూర్తయ్యేలోపు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థను మీరు ఎంతో కొంత అర్థం చేసుకోవడం గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి మరి.. చిన్నప్పుడు కాగితపు నోట్లతో ఆడుకున్న గుర్తుందా మీకు? క్రిప్టో కరెన్సీ కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. పైగా ఈ కరెన్సీని చూడవచ్చు. వాడుకోవచ్చు కానీ.. అసలు నోట్లు, నాణేల మాదిరిగా ముట్టుకోలేము. పర్సుల్లో దాచుకోలేము. అన్నీ ఇంటర్నెట్లోనే! ఇంకో సంగతి. వంద రూపాయల నోటు విలువ... ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఫలానా క్రిప్టో కరెన్సీకి డిమాండ్ బాగా ఉంది.. కానీ సరఫరా తక్కువ ఉందీ అంటే విలువ పెరుగుతుంది. అలాగే మైనింగ్ పద్ధతి ద్వారా ఒక క్రిప్టో నాణేన్ని ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై కూడా దాని విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా ఒక్కోదాని విలువను నిర్ణయిస్తూంటాయి. డాలర్, యూరో... ఎన్, యాన్, రూపాయిల మాదిరిగానే క్రిప్టో ప్రపంచంలో బిట్కాయిన్, ఎరిథ్రియం, రిపుల్, లైట్కాయిన్, కార్డానో బిట్కాయిన్ క్యాష్ అని బోలెడన్ని వేర్వేరు కరెన్సీలు ఉన్నాయి! ప్రహేళికలు పరిష్కరిస్తే.. కాయిన్ బహుమతులు! రూపాయిలు, డాలర్లంటే.. ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మరి డిజిటల్ కరెన్సీ క్రిప్టో రూకల మాటేమిటి? ఇందుకోసం ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈ–కామర్స్ వ్యవహారాలకు సాధారణ నగదును స్వీకరించి అందులో కొంత భాగాన్ని మనకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తున్నాయి కూడా. ఇంకో పద్ధతి ఏమిటంటే.. అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సృష్టించిన ఒక గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం. దీన్నే మైనింగ్ అంటారు. ఇక మూడో పద్ధతి. ఎవరో మైనింగ్ ద్వారా సంపాదించుకున్న కరెన్సీని ఎక్సే్చంజీల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం. దాని విలువ పెరిగితే మనకూ లాభాలొస్తాయని వేచిచూడటం. అచ్చం స్టాక్ ఎక్సే్చంజీల మాదిరిగా అన్నమాట. మైనింగ్ వ్యవహారం మొత్తం బిట్కాయిన్తో మొదలైనప్పటికీ ఇప్పుడు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలూ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు మొత్తం పనిచేసేది బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే. సమాచారం అత్యంత భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్చెయిన్ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీలను తవ్వి తీసుకునేందుకు మాత్రమే కాకుండా.. ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు. క్రిప్టో కరెన్సీతో లాభాలేమిటి? మోసాలకు తావే లేదు: క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్ వ్యవహారం. పైగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో నడుస్తుంది. కాబట్టి ఇందులో మోసాలకు అస్సలు తావు ఉండదు. చెల్లింపులైనా, ఒప్పందాలైనా డిజిటల్ ప్రపంచపు నెట్వర్క్లో అందరికీ అందుబాటులోనే ఉంటాయి కానీ.. ఏ ఒక్కరు కూడా అందులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ఆ మార్పుకు నెట్వర్క్లోని మిగిలిన వారందరూ ఓకే అనాలి కాబట్టి మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. పైగా మార్పులు చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా డిజిటల్ రూపంలో భద్రంగా నిక్షిప్తమవుతుంది కాబట్టి.. దొంగ ఇట్టే దొరికిపోతాడు!! వ్యక్తిగత వివరాలు భద్రం క్రెడిట్/డెబిట్ కార్డుతో ఏం చేసినా మన కొనుగోళ్ల వ్యవహారాలు మొత్తం అవతలివైపు వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీతో ఈ సమస్య ఉండదు. కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు ‘పుల్’ అంటే డబ్బు కావాలని అడగడం.. అకౌంట్ నుంచి లాక్కోవడం జరగుతుంది. క్రిప్టో వ్యవహారం దీనికి భిన్నం. డబ్బు కావల్సిన వ్యక్తి/సంస్థకు ‘పుష్’ పద్ధతిలో మన అకౌంట్ నుంచి తగిన విలువ మాత్రమే అందుతుంది. మిగిలిన వివరాలేవీ ఉండవు. మధ్యవర్తుల్లేకుండా ఇల్లు, పొలం లేదా ఇంకేదైనా స్థిరాస్తి కొన్నప్పుడు సహజంగా డీలర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు (ఒప్పందం రాసుకునేందుకు) వంటి మధ్యవర్తుల ప్రమేయం వచ్చేస్తుంది. క్రిప్టో వ్యవహారాల్లో వీరి అవసరం ఏమాత్రం ఉండదు. అమ్మే, కొనేవాళ్లు ఇద్దరి మధ్య మాత్రమే వ్యవహారం ఉండిపోతుంది. అదే సమయంలో సాక్షుల మాదిరిగా నెట్వర్క్లోని వారందరూ ఒప్పందాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అందరికీ అందుబాటులో క్రిప్టో వ్యవహారాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 466 కోట్ల మంది ఈ వ్యవహారాలను నడపవచ్చునన్నమాట. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్/డెబిట్ కార్డులు వంటివేవీ లేకుండానే! అంతా ఉచితమే ప్రస్తుతానికి క్రిప్టో వ్యవహారాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి ఛార్జీలూ లేవు. ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యవహారం కావడం దీనికి కారణం. అయితే క్రిప్టో కరెన్సీలను మార్చుకోవడం వంటి విషయాల్లో ఇటీవలే మొదలైన కొన్ని ఎక్సే్చంజీల్లో మాత్రం కమిషన్ల రూపంలో కొంత విలువను చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇబ్బందులేవీ లేవా? బోలెడు. ముందుగా చెప్పుకున్నట్లు క్రిప్టో కరెన్సీ వ్యవహారాలన్నీ ప్రైవేట్ వ్యక్తులతో కూడిన నెట్వర్క్లలోనే జరుగుతూంటాయి. పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు అధికారిక సంస్థలంటూ ఏవీ ఉండవు. దీనివల్ల లాభాలెన్నో... నష్టాలూ అన్నే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది హెచ్చుతగ్గుల గురించి... బిట్కాయిన్ కానివ్వండి, ఇంకో క్రిప్టోకరెన్సీ ఏదైనా కానివ్వండి.. ప్రతిరోజూ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఒక రోజు లక్షల్లో పలికిన క్రిప్టో విలువ మరుసటి రోజే రూపాయిల్లోకి పడిపోవచ్చు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడులతో లక్షలు, కోట్లు ఆర్జించేయవచ్చు అనుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఈ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరికీ మాత్రం కాదు. వందలో 90 శాతం మంది నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని కొంతమంది నిపుణులు చెబుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బోలెడన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉన్న స్టాక్మార్కెట్లోనూ స్కామ్లు జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచం లోనూ మోసగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్కాయిన్ వ్యవహారాలు నడిపేవారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అలాగే 46 శాతం వ్యవహారాలు అక్రమాలకు సంబంధించినవి. మత్తుపదార్థాలు, ఆయుధాల విక్రయం వంటివన్నమాట. అన్ని రకాల క్రిప్టో కరెన్సీలను పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంచుతారన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. బిట్కాయిన్ల సంఖ్య 2.1 కోట్లు మించదని ఇందుకు తగ్గ పద్ధతులు బ్లాక్చెయిన్ అల్గారిథమ్లోనే ఉన్నాయని చెబుతారు. అయితే మఖలో పుట్టి పుబ్బలో చచ్చినట్లు ఇప్పటికే ప్రతిరోజూ కొన్ని కొత్త కరెన్సీలు పుట్టుకొస్తూండగా.. మరికొన్ని గిట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అపరిమిత కాయిన్లు అందుబాటులోకి వస్తే వాటి విలువ పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు తమదైన క్రిప్టో కరెన్సీలు అందుబాటులోకి తెస్తే ప్రైవేటు రంగంలో ఉన్న బిట్కాయిన్, లైట్కాయిన్, డాగే కాయిన్ వంటి వాటి విలువ పడిపోయే అవకాశం ఉంది. పుట్టిందిలా... ఇప్పుడంటే బోలెడన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి కానీ.. ఇదంతా మొదలైంది బిట్కాయిన్తో. 2008 ఆగస్టులో బిట్కాయిన్.ఓఆర్జీ పేరుతో ఓ డొమైన్ నమోదుతో క్రిప్టో వ్యవహారాలకు శ్రీకారం పడింది. అదే ఏడాది అక్టోబరులో సతోషి నకమోటో పేరుతో ఈ వెబ్సైట్లో ఒక లింక్ ప్రత్యక్షమైంది. ‘‘బిట్కాయిన్: ఈ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్’’ శీర్షికతో బ్యాంకుల్లాంటి కేంద్రీకృత వ్యవస్థలేవీ లేకుండా ఇంటర్నెట్, బ్లాక్చెయిన్ టెక్నాలజీల ఆధారంగా డబ్బు ఎలా పంపిణీ చేయవచ్చో వివరించారు. నకమోటో బిట్కాయిన్ సాఫ్ట్వేర్ను అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్కోడ్గా 2009లో విడుదల చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నకమోటో ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది ఒక వ్యక్తి అంటూంటే.. కొందరు వ్యక్తుల బృందమన్నది మరికొందరి అంచనా. 2009 జనవరి మూడున నకమోటో తన సాఫ్ట్వేర్ అల్గారిథమ్ మైనింగ్ ద్వారా బ్లాక్చెయిన్లోని తొలి బ్లాక్ను సిద్ధం చేశారు. ఈ బ్లాక్ను జెనిసిస్ బ్లాక్ అంటారు. ‘ద టైమ్స్’ మ్యాగజైన్లో ప్రచురితమైన ఒక శీర్షికను ఈ బ్లాక్ తాలూకు కాయిన్బేస్లో పొందుపరచారు. తొలి బిట్కాయిన్ వ్యవహారం.. రెండు పిజ్జాల కొనుగోలు 2010లో ఓ కంప్యూటర్ ప్రోగ్రామర్ పదివేల బిట్కాయిన్లతో రెండు పిజ్జాలు కొనుగోలు చేయడం ప్రపంచంలో తొలి క్రిప్టో వ్యవహారంగా నమోదైంది. ఈ రోజుల్లో పదివేల బిట్కాయిన్ల విలువ కొంచెం అటు ఇటుగా నలభై లక్షల రూపాయలు!! అప్పట్లో బిట్కాయిన్ విలువ లక్షల్లోకి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రమైన ఘటనను గుర్తుంచుకునేందుకు ఇప్పటికీ ఏటా మే 22వ తేదీని ‘బిట్కాయిన్ పిజ్జా డే’ గా జరుపుకుంటూంటారు. మైక్రోసాఫ్ట్, హోండిపో, నేమ్చీప్, హోల్ఫుడ్స్, న్యూఎగ్స్, స్టార్బక్స్ వంటి కంపెనీలు, కొన్ని దేశాల బ్యాంకులు కూడా క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల కొనుగోళ్లకు అంగీకరిస్తున్నాయి. బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్ సాల్వడార్. ఈ ఏడాది జూన్ తొమ్మిదిన బిట్కాయిన్ను దేశంలో అన్ని రకాల వ్యవహారాలకూ వాడవచ్చునని ఆ దేశం ప్రకటించింది. ప్రధాన కరెన్సీ ఇప్పటికీ అమెరికన్ డాలరే! బిట్కాయిన్లను వాడుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు ‘వ్యాలెట్లు’ ఉపయోగపడతాయి. యూపీఐ ఆధారిత డిజిటల్ వాలెట్లు గూగుల్పే, ఫోన్ పే, పేటీఎం మాదిరిగా అన్నమాట. నిషేధమా? నియంత్రణా? క్రిప్టో కరెన్సీలపై భారత్లో కొన్నేళ్లుగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. 2016లో వీటిపై పూర్తి నిషేధం విధించగా ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో పరిమిత స్థాయిలో లావాదేవీలు నడిచాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ‘ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బిల్లుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిట్, లైట్ ఎరిథ్రియం వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం ఉంటుందని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై నిషేధం ఉండదని ఒక వర్గం వాదిస్తూండగా... ఇంకోవర్గం వ్యవహారాలను గుర్తించేందుకు వీలైన పబ్లిక్ లెడ్జర్ (పద్దు) లేని క్రిప్టో కరెన్సీలపై మాత్రమే నిషేధం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లు వివరాలు పూర్తిగా తెలిస్తేగానీ అసలు విషయం ఏమిటన్నది స్పష్టం కాదు. దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించే అవకాశం లేదని చెప్పడం గమనార్హం. భారత్లో టాప్–10 క్రిప్టో కరెన్సీలు... బిట్కాయిన్ ఎరిథ్రియం కార్డానో రిపుల్ యూఎస్డీ కాయిన్ పోల్కాడాట్ డాగే కాయిన్ షిబా ఇనూ లైట్కాయిన్ యునీస్వాప్ నవంబరు 2021 నాటికి 7557ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీలు 20,000 + పైగా 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్కాయిన్ ఏటీఎంల సంఖ్య 10.7 కోట్లుభారత్లో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య రూ. 75,000 కోట్లు భారతీయుల క్రిప్టో పెట్టుబడుల మొత్తం నవంబరు 24నాటికి ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ! 2.4 లక్షల కోట్ల డాలర్లు – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
సుడిగాడు.. 2 లక్షల కోట్ల జరిమానా తప్పించుకున్నాడు
Self-Described Bitcoin Creator Must Pay 100 Million Dollars in Suit : బిట్కాయిన్.. క్రిప్టోకరెన్సీలోకెల్లా అత్యంత విలువైన కరెన్సీ. 2008 నుంచి డిజిటల్ మార్కెట్లో ఇది చెలామణి అవుతుండగా.. అసలా ఈ కరెన్సీని కనిపెట్టింది ఎవరై ఉంటారనే చర్చ చాలా ఏళ్ల పాటు కొనసాగింది. ఈ లోపు సతోషి నాకామోటో అనే పేరు తెర మీదకు రాగా.. 2016లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ క్రెయిగ్ రైట్ ఒరిజినల్ సతోషి నాకామోటో తానేనంటూ ఓరోజు తన బ్లాగ్లో రాసుకొచ్చాడు. బిట్కాయిన్ను తానే రూపొందించానని, మారు పేరుతో అదంతా చేశానని సంచలన ప్రకటన విడుదల చేశాడు. అయితే క్రిప్టో కమ్యూనిటీ మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదు. ఈ లోపు ఈ వ్యవహారంలో క్రెయిగ్కు పెద్ద ఝలకే తగిలింది. బిట్ కాయిన్ తయారీలో రైట్కు కంప్యూటర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డేవిడ్ క్లెయిమన్(చనిపోయాడు) సహభాగస్వామిగా సాయం చేశాడని, కాబట్టి, హక్కుల కింద రైట్(సతోషి నాకామోటో) దగ్గర ఉన్న క్రిప్టో సంపదలో(54 బిలియన్ డాలర్ల.. మన కరెన్సీలో దాదాపు 3 లక్షల 80 వేల కోట్లు).. సగం వాటా(దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు) దక్కాలంటూ క్లెయిమన్ కుటుంబికులు (ఎస్టేట్) కోర్టు గడప తొక్కింది. క్రెయిగ్ రైట్ అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు క్రెయిగ్కు భారీ ఊరట లభించింది. తన వ్యాపార భాగస్వామి(మాజీ) కుటుంబానికి బిలియన్ల డాలర్ల కొద్ది క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. మియామీ(వెస్ట్ పామ్ బీచ్) కోర్టులో ఈ పిటిషన్పై మూడు వారాలపాటు వాదనలు జరగ్గా.. సోమవారం మియామీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరూ కలిసి బిట్కాయిన్ను రూపొందించినట్లు స్పష్టమైన ఆధారాల్లేవని, రైట్ తరపు నుంచి బిట్కాయిన్ సంపద ఏదీ కూడా క్లెయిమన్ ఫ్యామిలీకి చెందాల్సిన అవసరం లేదని తీర్పు వెల్లడించింది. డేవిడ్ క్లెయిమన్ (పాత చిత్రం) అయితే డబ్ల్యూ అండ్ కే ఇన్ఫో డిఫెన్స్ రీసెర్చ్ ఎల్ఎల్సీ కి వ్యవహారాలను క్లెయిమన్-రైట్లు సంయుక్తంగా(జాయింట్ వెంచర్) చూసుకున్నారని, ఆ సమయంలో కంపెనీకి చెందిన బిట్కాయిన్ సంబంధిత సంపదను క్రెయిగ్ రైట్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని రుజువైంది. దీంతో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి క్రెయిగ్ రైట్.. 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని(750 కోట్ల రూ. మన కరెన్సీలో) తీర్పు వెల్లడించింది. ఆ డబ్బును క్లెయిమన్ ఎస్టేట్కు కాకుండా డబ్ల్యూ అండ్ కే కు నేరుగా అందించాలని తీర్పు ఇచ్చింది. క్రెయిగ్ రైట్ ఇక ఈ దావా హైప్రొఫైల్ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం.. సతోషి నాకామోటో మిస్టరీ. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం సమయంలో సతోషి నాకామోటో పేరుతో తొమ్మిది పేజీలతో కూడిన ఒక శ్వేతపత్రం విడుదలైంది. కొన్ని నెలలకే ఈ క్రిప్టోకరెన్సీ తయారీ కోసం అవసరమైన సాఫ్ట్వేర్ను రిలీజ్ అయ్యింది. 2011 వరకు బిట్కాయిన్కి ఏకైక కోడర్(కోడింగ్ ఇచ్చిన వ్యక్తి) నాకామోటో ఒక్కడే. అయితే ఆ తర్వాత సతోషి అనే పేరు డిజిటల్ మార్కెట్ నుంచి క్రమంగా కనుమరుగు అయ్యింది. అయితే సతోషి పేరు మీద ఏకంగా 1.1 మిలియన్ బిట్కాయిన్లు (ఇప్పటి విలువ ప్రకారం.. 54 బిలియన్ డాలర్లు.. ) ఉన్నాయి ఇప్పుడు. ఈ తరుణంలో ఒకవేళ రైట్ గనుక కేసు ఓడిపోయి ఉంటే.. సతోషి పేరు హోదాలో క్లెయిమన్ ఎస్టేట్కు భారీగా పరిహారం(27 బిలియన్ డాలర్లు.. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి వచ్చేది. కానీ, రైట్ సుడి బాగుండి కేసు గెలిచాడు. కాబట్టే బతికిపోయాడు. అంతేకాదు బిట్కాయిన్ని తానే సృష్టించానని(సతోషి) కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తాను గనుక కేసు గెలిస్తే.. తన దగ్గర ఉన్న బిట్కాయిన్ సందపతో కొంత ఛారిటీలకు ఇస్తానన్న ప్రకటన కూడా అతనికి అనుకూలంగా తీర్పు రావడానికి ఒక కారణంగా మారింది. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
కుప్పకూలుతున్న క్రిప్టో మార్కెట్.. భారత్ వల్లే!
క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ నడుమ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తు ఆందోళనల నడుమ గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో కరెన్సీలు దారుణమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళన నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెటన్నీ దారుణంగా కుదేలు అయిన వేళ.. క్రిప్టో మార్కెట్ మాత్రం లాభాల బాట నడిచింది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు మార్కెట్ పతనం దిశగా కొనసాగుతోంది. అందుకు కారణం.. క్రిప్టో కరెన్సీ మీద భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే బెంగ. అవును.. క్రిప్టో కరెన్సీపై ప్రత్యేక చట్టం తేవాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్న వేళ.. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ భారీ పతనం చవిచూస్తోంది. ఈ ఏడాది నవంబర్ 10న 69వేల డాలర్ల హై వాల్యూతో ఆల్టైం హైలో బిట్కాయిన్ నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి కరెన్సీ ఇప్పుడు ఏకంగా 31 శాతం పతనం చవిచూసింది. శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 12.50 శాతం పతనంతో ట్రేడ్ అవుతోంది. ఇక ఎథెరియం దాదాపు 10 శాతం, కార్డానో 14 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. టెథెర్ కొంచెం మెరుగైన ఫలితం (3.94 లాభం)తో, యూఎస్డీ కాయిన్ 3.91 శాతం పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ► బిగ్గెస్ట్ గెయినర్: కోక్స్స్వాప్(COX) ► బిగ్గెస్ట్ లాసర్: జెమ్(DGM) గరిష్టంగా పతనం అయ్యింది ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అస్సెట్’గా మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, మనీ లాండరింగ్ను అరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’(పీఎమ్ఎల్ఏ) నిబంధనలను సైతం పొందుపరచనున్నారని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి. ఇక ‘ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుందని, డిజిటల్ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మీమ్ కాయిన్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కొనసాగుతోంది. డోజ్కాయిన్, షిబా ఇను, డోజ్లన్ మార్స్, సామోయెడ్కాయిన్లు కూడా పతనం దిశగానే కొనసాగుతున్నాయని కాయిన్మార్కెట్ క్యాప్ డాట్ కామ్ వెల్లడించింది. ► డోజ్కాయిన్ 4.53 శాతం పతనం అయ్యింది ► షిబా ఇను 4.22 శాతం పతనం అయ్యింది మొత్తంగా ఈ ఉదయానికి క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్(2.43 ట్రిలియన్ డాలర్లు విలువ) 6.16 శాతం పతనం చవిచూసింది. అయితే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 20 శాతం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ పెరిగి.. 137 బిలియన్ డాలర్లపైకి చేరుకుంది. చదవండి: చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్! -
చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్(డిఫై) సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్చైయిన్ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు. చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే బాడ్జర్ డీఏఓ యాప్ను హ్యాక్ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది. Here is the current whereabouts as well as the total loss: $120.3M (with ~2.1k BTC + 151 ETH) @BadgerDAO pic.twitter.com/fJ4hJcMWTq — PeckShield Inc. (@peckshield) December 2, 2021 పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. Badger has received reports of unauthorized withdrawals of user funds. As Badger engineers investigate this, all smart contracts have been paused to prevent further withdrawals. Our investigation is ongoing and we will release further information as soon as possible. — ₿adgerDAO 🦡 (@BadgerDAO) December 2, 2021 బాడ్జర్ డీఏఓ బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్ కాయిన్ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు. (చదవండి: పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..) -
Bitcoin: బిట్కాయిన్పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్కాయిన్ భవితవ్యంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. Parliament Winter Session 2021 సోమవారం మొదలైన విషయం తెలిసిందే. లోక్సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో బిట్కాయిన్కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్’ అని సమాధానం ఇచ్చారు. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్కాయిన్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు నిజం కాదని ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్కాయిన్ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇక ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుందన్న కథనాలు నిజమేనని(వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలు).. ఇందుకోసం 1934 చట్టానికి సవరణలు (డిజిటల్ కరెన్సీని ఫిజికల్ నోట్లతో సమానంగా గుర్తించాలనే!) ప్రతిపాదన ఆర్బీఐ, కేంద్రం ముందు ఉంచిదనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్కాయిన్.. డిజిటల్ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్కాయిన్తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో బిట్కాయిన్ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. చదవండి: బిట్కాయిన్పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్ -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్కాయిన్కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్కాయిన్, ఎథెరియమ్, టెథర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్కాయిన్లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్కాయిన్కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
Bitcoin: బిట్కాయిన్పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్కాయిన్ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్లో యూఎస్ డాలర్తో పాటుగా బిట్కాయిన్కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్కు సూచించింది ఐఎంఎఫ్. బిట్కాయిన్కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్కాయిన్కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్కాయిన్ తయారీ -
వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..!
El Salvador Plans to Build the World's First Bitcoin City: త్వరలో ప్రపంచంలోనే 'బిట్ కాయిన్ సిటీ' నిర్మాణం జరగనుంది. ఇందు కోసం నిర్వాహకులు బిట్ కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే పలు దేశాలు బిట్ కాయిన్ను చట్టబద్ధత చేసే దిశగా అడుగులు వేస్తుండగా.. ఈ దేశం మాత్రం ఏకంగా బిట్కాయిన్ సిటీని నిర్మించడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి సెంట్రల్ అమెరికాకు చెందిన ఎల్ శాల్వడార్ దేశం క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్ శాల్వడార్ దేశం బిట్ కాయిన్ అంశంలో మరో అడుగు ముందుకేసింది. ఎల్ శాల్వడార్ ప్రపంచంలోని మొట్టమొదటి 'బిట్కాయిన్ సిటీ'ని నిర్మించాలని యోచిస్తోంది. దీనికి ప్రారంభంలో బిట్కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సమకూరుతాయని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే చెప్పారు. ఎల్ సాల్వడార్ దేశంలో బిట్కాయిన్ను ప్రోత్సహించే దిశగా అధ్యక్షుడు నయీబ్ బుకెలే కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ అవెర్నెస్ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ముగియనున్న సందర్భంగా ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిట్ కాయిన్ ల కోసం అగ్నిపర్వతం నుంచి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రాంతంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిటీలో విలువ ఆధారిత పన్ను (VAT) మినహా ఎలాంటి పన్నులను ప్రభుత్వం విధించదని చెప్పారు. 'ఈ బిట్ కాయిన్ సిటీని కోసం 2022లో నిధులు సమకూర్చడం ప్రారంభిస్తామని, 2022లో బాండ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బుకెల్తో పాటు బ్లాక్చెయిన్ టెక్నాలజీ ప్రొవైడర్ బ్లాక్స్ట్రీమ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శాంసన్ మోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్ శాల్వడార్ దేశంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేసేందుకు బిట్కాయిన్ మద్దతుతో $1 బిలియన్ బాండ్ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు. -
క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!
Narendra Modi Warns Bitcoin Could Spoil Young Indians Urges Cooperation Of Nations: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై సిడ్నీ డైలాగ్ వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలను చేశారు. తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రమాదమే..! సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ! సిడ్నీ డైలాగ్ సందర్భంగా...పీఏం మోదీ తన ప్రసంగంలో....ప్రపంచ పురోగతి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలపై దృష్టి సారించాలని అన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతికత ఇప్పటికే ప్రపంచ దేశాలకు ప్రధాన సాధనంగా మారిందని వెల్లడించారు. అదే సాంకేతికత పలుదేశాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని తెలిపారు. Take crypto-currency or bitcoin for example. It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands, which can spoil our youth: PM @narendramodi — PMO India (@PMOIndia) November 18, 2021 చదవండి: క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం -
భారీగా పడిపోయిన బిట్కాయిన్ ధర
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్కాయిన్కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. నవంబర్ 8న 67,582.60 డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ ధర నేడు సుమారు 4% కంటే ఎక్కువ 60,718.80 డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో రూ. 3 వేల డాలర్లు పైగా నష్టపోయింది. అలాగే, మార్కెట్ విలువ పరంగా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ 6.18% క్షీణించి $4,291.60 వద్ద ఉంది. అయితే, ఈ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ధర పడిపోవడానికి సరైన కారణాలు కనిపించడం లేదని, చాలా రోజులు నుంచి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ధర గరిష్టానికి చేరుకోవడంతో పెట్టుబడుదారులు లాభాలను వెనక్కి తీసుకోవడంతో క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ధర పడిపోయినట్లు నిపుణులు సూచిస్తున్నారు. బిట్కాయిన్ విలువ జూన్ కంటే రెట్టింపు స్థాయిలో పెరిగింది. (చదవండి: Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) -
క్రిప్టో.. తగ్గేదేలే!
బిట్కాయిన్.. ఎథీరియమ్.. షిబా ఇను, డోజికాయిన్.. ఇన్వెస్టర్ల ప్రపంచం క్రిప్టోల గురించి తెగ చర్చించుకుంటోంది. స్పెక్యులేటివ్ మద్దతుతో ఉన్నట్టుండి ఏదో ఒక క్రిప్టో టోకెన్ 24 గంటల్లోనే వందలు, వేల రెట్లు పెరిగేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలోనూ, ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లలో చెప్పలేనంత ఆసక్తి ఏర్పడుతోంది. క్రిప్టోల గురించి పెద్దగా తెలియకపోయినా.. ఫోన్ నుంచే డిజిటల్గా క్రిప్టో ట్రేడింగ్ ఖాతా తెరిచేసి ఎంతో కొంత పెట్టుబడితో తమ దృష్టిలో పడిన క్రిప్టోను కొనుగోలు చేసే వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. మనదేశంలోనే అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్టుబడులన్నీ క్రిప్టోలను వెతుక్కుంటూ వెళుతున్నాయి. సామాన్య ఇన్వెస్టర్లకే ఈ ధోరణి పరిమితం కాలేదు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి, ఫండ్ మేనేజర్ల వరకు అందరూ క్రిప్టోల్లో పెట్టుబడుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. కాకపోతే, వీటితో ఎలా వేగాలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులకు అర్థం కాకుండా ఉంది. క్రిప్టో కరెన్సీ అంటే..? క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్ ఆస్తులు. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే క్రిప్టో కాయిన్లు, టోకెన్లను క్రిప్టోకరెన్సీలుగా పిలుస్తున్నారు. వీటిని పెట్టుబడి సాధనాలుగాను, ఆన్లైన్లో కొనుగోళ్లకు చెల్లింపుల సాధనాలుగానూ వినియోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ అన్నది భౌతికంగా ఉండదు. డిజిటల్లోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరిగా ఇవి ఫియట్ కరెన్సీలు కావు. ఎవరో ఒకరు నియం త్రించేవి కావు. వీటిపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ ఉండదు. కనుక వీటిని డీసెంట్రలైజ్డ్గా పేర్కొంటారు. ఇంటర్నెట్ వేదికగా యూజర్ల మధ్య ఇవి చెలామణి అవుతుంటాయి. ప్రతీ కాయిన్ లేదా టోకెన్ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ లేదా కోడ్తో రూపొందించబడి ఉంటాయి. కనుక వీటిని ట్రాక్ చేయడం, గుర్తించడం సులభతరం. క్రిప్టోగ్రఫీ, కరె న్సీ రెండింటి కలయికే.. క్రిప్టోకరెన్సీగా వాడుకలోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లు క్రిప్టోగ్రఫిక్ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తుంటాయి. బ్లాక్ చైన్.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్చైన్ వేర్వేరు. క్రిప్టోకరెన్సీల అస్తిత్వానికి బ్లాక్చైన్ టెక్నాలజీ తోడ్పడుతుంది. బ్లాక్చైన్ అన్నది డిజిటల్ లెడ్జర్. మొత్తం కంప్యూటర్ల నెట్వర్క్ పరిధిలో ప్రతి ఒక్క లావాదేవీని రికార్డెడ్గా నిర్వహిస్తుంటుంది. ప్రతీ నూతన లావాదేవీ నెట్వర్క్ పరిధిలోని ప్రతీ భాగస్వామి లెడ్జర్లో నమోదవుతుంది. ఎవరో ఒకరు నియంత్రించేది కాకుండా అవతరించిన సాంకేతికతే బ్లాక్చైన్. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. బ్లాక్చెయిన్ అన్నది సమాచారాన్ని ప్యాకెట్ల రూపంలో కలిగి ఉంటుంది. దీన్ని బ్లాక్లుగా పిలుస్తారు. ఈ బ్లాక్లు ఒక చైన్ (గొలుసుగా)గా అనుసంధానమై ఉంటా యి. ఈ బ్లాక్లతో కూడిన చైన్ను ఎడిట్ చేయడానికి (దిద్దడానికి), మార్చడానికి అవకాశం ఉండదు. ఎంతో పటిష్టంగా ఉంటుంది. బ్లాక్ చైన్లో ప్రతీ లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. బిట్కాయిన్, ఎథీరియమ్ ఇవన్నీ బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా ఏర్పడినవే. కాకపోతే వీటిల్లో ఎథీరియమ్, సొలానా తదితర బ్లాక్ చెయిన్లు.. తమ నెట్వర్క్పై స్మార్ట్ కాంట్రాక్టుల (కోడ్)ను సృష్టించి, నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో నాన్ ఫంగిబుల్ టోకెన్లను ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవచ్చు. ఈ నెట్ వర్క్ల సాయంతో ఎన్నో క్రిప్టో టోకెన్ల సృష్టికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిగాన్ (మేటి క్) అన్నది ఎథీరియమ్ బ్లాక్ చైన్పై ఏర్పడిందే. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18–34 ఏళ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35–44 ఏళ్ల వయసులోపు వారున్నట్టు ఫైండర్స్ క్రిప్టోకరెన్సీ నివేదిక స్పష్టం చేస్తోంది. టెస్లా, ఫేస్బుక్, పేపాల్, వీసా, మాస్టర్కార్డ్, జేపీ మోర్గాన్, మైక్రో స్ట్రాటజీ, బ్లాక్రాక్, ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం, ఈ టెక్నాలజీపై పనిచేయడం మొదలు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్మస్క్ సైతం బిట్కాయిన్, డోజికాయన్ తదితర క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసినట్టు స్వయంగా ప్రకటించారు. ఏది చేస్తే మెరుగు..? క్రిప్టోలను అధికారిక కరెన్సీలుగా ఆమోదించే పరిస్థితి లేదు. పెట్టుబడి సాధనాలుగా వీటిని పరిగణించి, పన్నుల రూపంలో ఆదాయం రాబట్టుకోవాలన్న యోచనను కేంద్రంలోని కొందరు సీనియర్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వినూత్న సాంకేతికతకు దారిచూపుతున్న క్రిప్టోలను పూర్తిగా నిషేధించినట్టయితే భారత్ మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం క్రిప్టోలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టెక్నాలజీపై నిపుణులు, భాగస్వాములతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోలపై ప్రచారం, ప్రకటనలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, క్రిప్టోలను అనుమతించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులకు వీటితో పెద్ద సమస్య వచ్చి పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణల పరిధిలో లేని ఇవి పెట్టుబడి సాధనాలుగా ఆమోదనీయం కాదని ఆర్బీఐ తన అభిప్రాయంగా కేంద్రానికి తెలియజేసింది. క్రిప్టోల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళలను కూడా దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. క్రిప్టో లావాదేవీలపై కఠిన నియంత్రణలు ఉండాలని, లేదంటే ఇంటి పొదుపులు అనియంత్రిత సాధనాల్లోకి మళ్లితే ప్రమాదంలో పడినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. దేశంలో క్రిప్టోల నిషేధం లేదా నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేనందున రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎన్ని క్రిప్టోలు ఉన్నాయి? బిట్ కాయిన్ను మొదటి క్రిప్టోకరెన్సీగా చెబుతారు. 2009లో ఇది ఏర్పడింది. దీని ఆవిష్కర్త సతోషి నకమొటో. ఎవరైనా ఇందులో పాల్గొనే విధంగా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి పరిమితం కాకుండా.. అందరికీ చెందేలా దీన్ని రూపొందించడం విశేషం. క్రిప్టో కరెన్సీ యూనిట్లను మైనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. క్లిష్టమైన మ్యాథమేటికల్ ఆల్గోరిథమ్ల కంప్యూటేషన్తో వర్చువల్ కాయిన్లను మైనింగ్ చేస్తుంటారు. క్రిప్టోలకు సంబంధించి అపరిమిత మైనింగ్కు అవకాశం లేకుండా పరిమితి ఉంటుంది. బిట్కాయిన్లను 21 మిలియన్లకు మించి మైనింగ్ చేయకుండా సతోషి నకమొటో పరిమితి విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 6,000కు పైగా క్రిప్టోలున్నాయని అంచనా. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది ఇప్పటికే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా పెట్టేశారు. క్రిప్టో ఇన్వెస్టర్ల పరంగా భారత్ మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 2.74 కోట్లుగానే ఉంది. మొత్తం జనాభాలో క్రిప్టో ఇన్వెస్టర్ల శాతం (7.30) పరంగా భారత్ ఐదో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ 12.73 శాతంతో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. భారతీయుల క్రిప్టో పెట్టుబడులు సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.75,000 కోట్లు) చేరి ఉంటాయని ఒక అంచనా. మనదేశంలో సుమారు 100కు పైనే క్రిప్టో కాయిన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిట్కాయిన్, ఎథీరియమ్, టెథర్ (యూఎస్డీటీ), షిబా ఇను, డోజికాయన్, పాలీగాన్ (మ్యాటిక్), కార్డనో, సొలాన, పోల్కడాట్, లైట్కాయిన్ వీటికి మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ ఉంది. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్, యునోకాయిన్, కాయిన్స్విచ్ కుబేర్, జెబ్పే సంస్థలు మన దేశంలో క్రిప్టో సేవలు అందిస్తున్నాయి. వీటి ల్లో వ్యాలెట్ను తెరిచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. -
Bitcoin Scam: మాజీ సీఎం సంచలన ఆరోపణలు
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ‘బిట్కాయిన్ స్కామ్’ వ్యవహారం.. విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత ముదురుతోంది. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి మీద తాజాగా సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి. జన ధన్ అకౌంట్లను సైతం హ్యాక్ చేసిన నిందితుడు.. అకౌంట్ల నుంచి 2రూ. చొప్పున.. మొత్తం 6 వేల కోట్ల రూపాయల్ని తస్కరించాడని కుమారస్వామి ఆరోపించారు. అయితే తన దగ్గర పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ విషయమై తనకు సమాచారం అందిందని, కేవలం జన్ ధన్ నుంచే ఈ సొమ్ము మళ్లిపోయిందని వ్యాఖ్యానించారాయన. బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కుమారస్వామి అంటున్నారు. ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు భారత్తో సహా చాలా దేశాల్లో చట్టబద్దత లేదు. ఈ తరుణంలో శ్రీకి నుంచి సుమారు 9 కోట్ల రూపాయల విలువైన బిట్కాయిన్స్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించాడని శ్రీకృష్ణపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బడా నేతలు, పొలిటీషియన్ల పిల్లలు సైతం ఇన్వాల్వ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న క్రమంలో.. ఈ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అయితే బిట్కాయిన్ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని గురువారం ప్రధానితో భేటీ అనంతరం కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై మీడియాకు తెలిపారు. నాలుగో తరగతి నుంచే.. అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు! -
క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
-
Cryptocurrency: పేటీఎం.. బిట్ కాయిన్.. ఏం జరగబోతుంది ?
డిజిటల్ ప్లాట్ఫార్మ్పై ఫైనాన్షియల్ సర్వీసులు అందించే పేటీఎం సంస్థ తన మార్కెట్ను మరింత విస్త్రృతం చేసుకునే పనిలో ఉంది. వివాస్పద క్రిప్టోకరెన్సీ సేవలు దేశంలో ప్రారంభించేందుకు తాము సిద్ధమంటోంది. చాపకింద నీరులా ఆర్థిక రంగంలో ఎక్కువ మందికి అర్థం కాకపోయినా, చాలా మందికి పరిచయం లేకపోయినా సరే చాప కింద నీరులా మార్కెట్లో విస్తరిస్తోంది క్రిప్టో కరెన్సీ, పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీతో పై స్థాయిలో భారీగానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్థిక నిపుణులు, బడా వ్యాపారవేత్తలు సైతం భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ హవా ఉంటుందంటున్నారు. కొందరు పెట్టుబడులు సైతం పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే క్రిప్టోకరెన్సీ విభాగంలో అనేక డిజిటల్ కాయిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బిట్కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్ఆర్పీ, పొల్కడాట్ ఇలా అనేకం ఉన్నాయి. వీటిలో బిట్ కాయిన్ వరల్డ్ వైడ్గా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో బాగా ఫేమస్. ముందుగా బిట్కాయిన్ రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇస్తే బిట్ కాయిన్ ట్రేడింగ్కి తాము సిద్దమేనంటూ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం ప్రకటించింది. ‘ ప్రభుత్వం దృష్టిలో క్రిప్టో కరెన్సీ ఇంకా గ్రే ఏరియాలో ఉంది. ఈ ఏరియా నుంచి తొలగించి, చట్టపరమైన అనుమతులు ఇస్తే ముందుగా బిట్కాయిన్ని పేటీఎంలో అందుబాటులో ఉంచుతాం’ అని పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధుర్ దేవ్రా తెలిపారు. సుప్రీం తీర్పుతో ప్రభుత్వ నిబంధనలకు లోబడని క్రిప్టో కరెన్సీతో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో.. ఈ తరహా లావాదేవీలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2020 మార్చిలో తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లేదు. అయితే ఈ మార్కెట్పై ఉత్సాహం ఉన్న అనేక మంది రిస్క్ తీసుకుని క్రిప్టోపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. రక్షణపై సందేహాలు స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహాణలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరుగుతుంటాయి. ఇందులో మోసాలను అరికట్టి వ్యవస్థ సాఫీగా సాగిపోవడానికి అనుగుణంగా పలు ప్రభుత్వ విభాగాలు పని చేస్తుంటాయి, అయితే సాధారణంగా బిగ్ ప్లేయర్లు మార్కెట్ను ప్రభావితం చేస్తుంటారు. చట్టాలకు చిక్కకుండా నిఘా నేత్రం ఆవల వీరు మార్కెట్ని మానిప్యులేట్ చేస్తారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల ప్రభావం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆజమాయిషీ కూడా ఉండదు. దీంతో ఇందులో పెట్టే డబ్బులకు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా రక్షణ ఉండదు. అందువల్ల క్రిప్టో కరెన్సీ భద్రతపై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి:బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్ కార్డ్ గ్రీన్ సిగ్నల్ -
60 వేల 657 డాలర్లకు చేరిన బిట్ కాయిన్ విలువ
-
బ్లాక్చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్కు భరోసా
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలు! ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించే బ్యాంకింగ్ మొదలు సేవల రంగం వరకూ.. అన్నింటా ఆన్లైన్ కార్యకలాపాలే!! ఇలాంటి పరిస్థితుల్లో.. సదరు లావాదేవీలను పారదర్శకంగా.. ఎలాంటి లోపాలు లేకుండా.. హ్యాకింగ్కు గురికాకుండా నిర్వహించాల్సిన పరిస్థితి! ఇది ప్రత్యేకమైన సాంకేతికతతోనే సాధ్యం! అదే.. బ్లాక్చైన్ టెక్నాలజీ!! అందుకే.. ఇప్పుడు బ్లాక్చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సంస్థలు నైపుణ్యాలున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్లాక్చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి.. ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు.. వినియోగిస్తున్న రంగాలు..అవసరమైన నైపుణ్యాలు.. అందుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. లావాదేవీలు వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తూ.. ఎలాంటి అవకతవకలు జరగకుండా.. హ్యాకింగ్కు గురికా కుండా..సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేదే.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు, భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్లై న్లోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేక రంగాలకు విస్తరించింది. పటిష్ట సైబర్ రక్షణ నిర్దిష్టంగా ఒక లావాదేవీని వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగం, దానికి సంబంధించిన అప్లికేషన్స్పై పెద్ద కస రత్తే జరుగుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పటి ష్టమైన సైబర్ రక్షణ వ్యవస్థగా పేర్కొనొచ్చు. ఏదైనా ఒక విలువైన లావాదేవీని నిర్వహించే సమయంలో.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్కు గురి కాకుండా భద్రత కల్పించే టెక్నాలజీ ఇది. సదరు లావాదేవీ నిర్వహణలో పాల్పం చుకునే వ్యక్తులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరోధించే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్గా ఇది నిలుస్తోంది. వికేంద్రీకృత వ్యవస్థ బ్లాక్ చైన్ టెక్నాలజీ.. వికేంద్రీకృత విధానంలో.. లావా దేవీలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నగదు నిర్వహణ లేదా రుణ మంజూరు వంటి విషయాల్లో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో వ్యక్తి/అధికారి కీలక పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవక తవకలకు ఆస్కారం ఉంటుంది. కానీ అదే లావాదేవీని బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో నిర్వహిస్తే..ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలో భాగస్వా ములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్గా ఏర్పడతా యి. ఒక బ్లాక్లో ఉన్న వారితో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్లో ఏ బ్లాక్లోనైనా.. ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్లో నమోదవుతుంది. ఇది సదరు నెట్వర్క్లో నిక్షిప్తం అవుతుంది. దీంతో..ఏదైనా తేడా వస్తే.. సదరు చైన్లోని వారందరికీ తెలిసిపోతుంది. అం టే.. ఏ స్థాయిలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ సదరు లావాదేవీలో.. ఏదై నా మార్పు చేయాల్సి వస్తే.. సదరు డిస్ట్రిబ్యూటెడ్æనెట్ వర్క్లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్ ‘కీ’ పేరిట పాస్వర్డ్ కేటాయిస్తారు. అన్ని రంగాలకు విస్తరణ వాస్తవానికి బ్లాక్చైన్ టెక్నాలజీని.. దశాబ్ద కాలం క్రితమే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉండవు. అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. దీనికి సంబంధించి సైబర్ దాడుల నుంచి రక్షణతోపాటు, అవకతవకలు జరగకుండా ఈ టెక్నాలజీని వినియోగించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థంగా ఉండ టంతో.. ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ రంగం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ-కామర్స్, మొబైల్ వ్యాలెట్స్, హెల్త్కేర్ విభాగాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానం గా భూముల రిజిస్ట్రేషన్స్లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయం తో.. ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు, ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది. హెల్త్కేర్ రంగంలో.. రోగులకు నిర్వహించే పరీక్షల వివరాలను బ్లాక్చైన్ టెక్నాలజీ విధానంలో నమోదు చేస్తున్నారు. ఫలితంగా పారదర్శకంగా సదరు పరీక్షల నిర్వహణతోపాటు సమయం వృథా కాకుండా.. బ్లాక్ చైన్ టెక్నాలజీ దోహదపడుతోంది. కెరీర్ స్కోప్ ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ ఊపందుకుంది. సంస్థలు ఆన్లైన్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత కోసం బ్లాక్చైన్ టెక్నాలజీ నిపుణులను నియమించు కుంటున్నాయి. 2022 నాటికి అంతర్జాతీయంగా ఐటీ రంగంలోని కొలువుల్లో దాదాపు పదిహేను శాతం బ్లాక్ చైన్ టెక్నాలజీ విభాగంలోనే ఉంటాయని అంచనా. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఆయా రంగాల్లోని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్వేర్స్ను, ప్రోగ్రామ్స్ను రూపొందించడం తప్పనిసరిగా మారు తోంది. ముఖ్యంగా క్రిప్టోగ్రఫీ నెట్వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, గేమ్ థియరీ వంటి వాటికి సంబంధించి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పొందాలి. సాలిడిటీ ప్రోగ్రా మింగ్ నేర్చుకోవడం ద్వారా కూడా అవకాశాలు అందుకునే వీలుంది. కంప్యూటర్ సైన్స్కు అనుకూలం బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగం.. కంప్యూటర్ సైన్స్ విద్యా ర్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్ చైన్ టెక్నాలజీని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రా మింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్స్, జావా, ఆర్, పైథాన్ వంటివి సీఎస్ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో సీఎస్ఈ అభ్యర్థులు బ్లాక్చైన్ రంగంలో రాణించేందుకు వీలుంటుంది. ప్రత్యేక కోర్సులు బ్లాక్చైన్ టెక్నాలజీ నిపుణులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. దాంతో విద్యాసంస్థలు.. బ్లాక్చై న్పై ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–హైదరాబాద్, ఐఐటీ-ముంబై వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ను అందిస్తున్నాయి. అదే విధంగా బ్లాక్చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ సైతం ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగాలు గ్లాస్ డోర్ సంస్థ అంచనాల ప్రకారం-అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ చైన్ రంగంలో ఉద్యోగాలు గత ఏడాది మూడు వందల శాతం పెరిగాయి. మొత్తం ఉద్యోగాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అదే విధంగా లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం-2020లో టాప్ మోస్ట్ జాబ్ సెర్చెస్లో బ్లాక్ చైన్ ముందంజలో నిలవగా.. బ్లాక్ చైన్ డెవలపర్ ఉద్యోగాలు 330 శాతం పెరిగాయి. బ్లాక్ చైన్.. జాబ్ ప్రొఫైల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో.. బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, బ్లాక్ చైన్ యుఎక్స్ డిజైనర్, క్వాలిటీ ఇంజనీర్, కన్సల్టెంట్, బ్లాక్ చైన్ లీగల్ కన్సల్టెంట్, బ్లాక్ చైన్ ఇంజనీర్, అనలిస్ట్,సెక్యూరిటీ మేనేజర్, కమ్యూనిటీ మేనేజర్, జూని యర్ డెవలపర్స్ తదితర జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఉపాధి వేదికలు ఇండియన్ బ్లాక్ చైన్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో.. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్-46 శాతం, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్-12 శాతం, ఎనర్జీ అండ్ యుటిలిటీస్-12 శాతం,హెల్త్కేర్-11 శాతం, ప్రభుత్వ విభాగాలు-8 శాతం, రిటైల్ అండ్ కస్టమర్ సర్వీసెస్-4 శాతం, ఎంటర్టైన్ మెంట్ అండ్ మీడియా-1శాతం మేర అవకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ స్కిల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. దీనికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్పై అవగాహన తప్పనిసరి. ప్రాథమికంగా కోడింగ్ స్కిల్స్, సి++, డాట్ నెట్, ఎక్స్ఎంఎల్, పైథాన్, డెవ్ అప్స్, జనరిక్ ఎస్క్యూ ఎల్, హెచ్టీఎంఎల్, డేటాసైన్స్, నెట్ వర్క్ ప్రొటోకాల్స్, యూఐ డిజైన్ తదితర స్కిల్స్ ఉండాలి. -
బిట్కాయిన్ @ 66,901 డాలర్లు
న్యూయార్క్: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్కాయిన్ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది. గతంలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్కాయిన్ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్ బిట్కాయిన్ స్ట్రాటెజీ వంటి బిట్కాయిన్ ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్ ర్యాలీకి దోహదపడుతోంది. లిస్టింగ్ రోజునే ప్రోషేర్స్ బిట్కాయిన్ ఈటీఎఫ్కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్కాయిన్ డిమాండ్కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్లు నేరుగా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈటీఎఫ్ల వల్ల.. హాట్, కోల్డ్ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. -
క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
క్రిప్టోకరెన్సీపై ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ఏది అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. క్రిప్టోకరెన్సీలోకి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు పలు సూచనలను చేశారు. క్రిప్టోకరెన్సీలో..బిట్కాయిన్, ఈథర్, డోగీకాయిన్స్ ఎక్కువగా లాభాలను తెస్తాయని మార్క్ సూచించారు. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! ‘బంగారం కంటే మెరుగైనది’ బిట్కాయినే అని మార్క్ క్యూబాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బంగారం కంటే బిట్కాయిన్ ఎక్కువ లాభాలను ఇస్తోందని పేర్కొన్నారు. డోగీకాయిన్ అత్యంత శక్తివంతమైన ట్రాన్సక్షన్ రేట్ను కల్గి ఉందని వెల్లడించారు.మీమ్ క్రిప్టోకరెన్సీఐనా డోగీ కాయిన్ టాప్-10 క్రిప్టోకరెన్సీలో నిలిచింది. గతంలో మార్క్ క్యూబాన్ ఎలన్మస్క్తో డోగీకాయిన్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బిట్కాయిన్ దూకుడు..! ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్కాయిన్ ఈ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..! -
Bitcoin: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతుంది. క్రిప్టోకరెన్సీకు భారీగానే ఆదరణ లభిస్తోంది. క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్కాయిన్ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అంతలోనే తిరిగి క్షీణించి 61 వేల డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 60,847.50 వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంతో పోలిస్తే పలు క్రిప్టోకరెన్సీలు 4.52 శాతం లాభపడింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 132.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారిగా 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అదేనెలలో బిట్కాయిన్ సుమారు 53 శాతం మేర పడిపోయింది. దీంతో బిట్కాయిన్ విలువ సుమారు 30 వేల డాలర్లకు చేరుకుంది. తిరిగి ఆర్నెల్ల తరువాత బిట్కాయిన్ మరోసారి 60 వేల మార్కును దాటింది. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు, చైనాలో క్రిప్టోకరెన్సీపై నిర్ణయాలు బిట్కాయిన్ క్రాష్కు కారణాలుగా నిలిచాయి. చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్న్యూస్..! -
క్రిప్టోపై కర్ర పెత్తనం? ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై రాష్ట్రీయ స్వయం సేవక్ కన్నెర్ర చేసింది. దేశంలో క్రమంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని నాగ్పూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు దసరా పండుగ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగం, జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించాలి ‘బిట్ కాయిన్లను ఏ దేశం, ఏ వ్యవస్థ దాన్ని నియంత్రించగలదో నాకు తెలియడం లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాను మించి తాజాగా వెల్లడైన గణాంకాల్లో అమెరికాను మించి ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లలో యూరప్ని సైతం వెనక్కి నెట్టేలా క్రిప్టో ఇండియాలో దూసుకుపోతుంది. యువతలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పట్ల క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో సైతం బిట్కాయిన్, ఈథర్నెట్ తదితర కాయిన్లు వర్చువల్గా చలామనీ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర నిర్థిష్టమైన విధానమంటూ లేదు. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భద్రతపై సందేహాలు సాధారణ మార్కెట్లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో వీటిని శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల మిగిలినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో కరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. అందువల్ల క్రిప్టో ట్రేడ్పై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి :బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు -
‘బిట్కాయిన్ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’
ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీకి దాసోహం అవుతున్న తరుణంలో.. డిజిటల్ కరెన్సీ మీద ఓ బ్యాంకింగ్ దిగ్గజ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్కాయిన్ అనేది చెత్త వ్యవహారం అని, అది ఎందుకు పనికిరాదంటూ వ్యాఖ్యలు చేశారాయన. అమెరికా మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సేవలు అందించే ‘జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సీఈవో జేమీ డిమన్(65) క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్కాయిన్ను విలువ లేని ఇన్వెస్ట్మెంట్గా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా నా దృష్టిలో అదొక నాన్సెన్స్. సీరియస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం మూర్ఖత్వం. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా క్లయింట్లు విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు. వాళ్లు కూడా దీనిని అంగీకరించరు”అంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఈవెంట్లో ఇలా ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారాయన. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన బిట్కాయిన్ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. బిట్కాయిన్లాంటి క్రిప్టోకరెన్సీలను ‘మూర్ఖుల బంగారం’గా అభివర్ణించిన డిమన్.. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన తాము(జేపీ మోర్గాన్) ప్రొత్సహించబోదని, దానిపై ప్రభుత్వాల నియంత్రణ కచ్చితంగా ఉండాలని గతంలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఎదిగిన చైనా.. దానివల్ల పర్యవసనాలు చెడువే జరుగుతున్నాయంటూ ఈమధ్యే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఓవైపు ఎలన్ మస్క్ లాంటి కుబేరులు క్రిప్టోకరెన్సీకి తెగ ప్రమోట్ చేస్తుంటే.. మరోవైపు ఇంకొందరు ధనికులు మాత్రం పూర్తిగా దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. చదవండి: Bitcoin.. సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్కాయిన్..! -
మరో రికార్డును బిట్కాయిన్ నెలకొల్పనుందా...!
Bitcoin Gets Closer To 60000 Dollors: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్భణ పరిస్థితులు...క్రిప్టోకరెన్సీపై చైనా తీసుకున్న నిర్ణయాలు పలు క్రిప్టోకరెన్సీలు ఒక్కసారిగా పతనమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడర్ బిట్కాయిన్ మైనింగ్పై తీసుకున్న నిర్ణయాలు తిరిగి బిట్కాయిన్ పుంజుకునేందుకు దోహదం చేశాయి. చివరి వారంలో బిట్కాయిన్ ఏకంగా 30 శాతం మేర పురోగతిని సాధించింది. దీంతో ఐదెన్నెల్ల గరిష్టానికి బిట్కాయిన్ విలువ చేరుకుంది. 60 వేల డాలర్లకు చేరువలో...! బిట్కాయిన్ విలువ మరో సరికొత్త రికార్డులకు దగ్గరలోనే ఉంది. బిట్కాయిన్ విలువ 60 వేల డాలర్లకు చేరనుంది. మే తర్వాత మొదటిసారి బిట్కాయిన్ 57 వేల డాలర్లు(రూ. 42 లక్షలు) దాటింది. బినాన్స్, కాయిన్మర్కెట్ క్యాప్ వంటి ఎక్సేచేంజ్లో 57, 490 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ ఎక్సేచేంజ్ కాయిన్స్ స్విచ్ కుబేర్లో బిట్ కాయిన్ విలువ 59 వేల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో క్రిప్టోకరెన్సీ ఆల్టైమ్ హై 65 వేల డాలర్లను తాకింది. బిట్కాయిన్ ర్యాలీ ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజుల్లో కొత్త రికార్డును తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈథర్ వంటి క్రిప్టోకరెన్సీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈథిరియం విలువ 3,740 వద్ద ట్రేడవుతోంది. సోమవారం రోజున సుమారు 1.29 శాతం మేర లాభపడింది. అయితే ఈథర్లో స్థిరమైన ర్యాలీ కన్పించడంలేదు. మిగిలిన ఇతర అల్ట్కాయిన్స్ కార్డానో, టెథర్, రిపుల్, పోల్కాడోట్ అన్నీ సగటున 2-3 శాతం మేర తగ్గుతూ కన్పించాయి. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! -
సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్కాయిన్..!
Bitcoin Rises: క్రిప్టోకరెన్సీపై చైనా నిషేధం విధించడంతో ఒక్కసారిగా బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా పలు ఇన్వెస్టర్లు స్టాక్స్, గోల్డ్ వంటి వాటిపై చేయడం మొదలు పెట్టారు. బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీపై మోహం చాటేశారు. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడార్ వంటి దేశాల నిర్ణయం, ఎలన్ మస్క్ అభిప్రాయాలు పలు క్రిప్టోకరెన్సీ పెరుగుదలకు అండగా నిలిచాయి. చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! పుంజుకున్న బిట్కాయిన్..! చైనా నిర్ణయం, అధిక ద్రవ్యోల్భణం వంటివి కాస్త ఒడిదుడుకులను సృష్టించినా...పలు క్రిప్టోకరెన్సీలు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా బిట్కాయిన్ సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గత ఏడు రోజుల్లో బిట్కాయిన్ 30 శాతం కంటే ఎక్కువ పురోగతిని సాధించింది. అక్టోబర్ 6 న బిట్కాయిన్ విలువ సుమారు 54,079 డాలర్లకు చేరింది. బిట్కాయిన్ విలువ ఐదున్నెల్ల గరిష్టానికి చేరుకుంది. క్రిప్టోకరెన్సీ ట్రాకర్ కాయిన్జెక్కో ప్రకారం.. ఇతర డిజిటల్ నాణేలు కూడా భారీగా పెరిగాయి. ఈథర్, బినాన్స్ కాయిన్, సోలానా , డోగ్కోయిన్ విలువ గత ఏడు రోజుల్లో భారీగా పెరిగింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ క్రాకెన్ ప్రకారం, అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్కాయిన్ ట్రేడింగ్ వాల్యూమ్లు ఈథర్ కంటే మూడింట రెండు వంతుల పెద్దవిగా ఉన్నాయి. చదవండి: టీమిండియా స్పాన్సర్కు భారీ షాక్...! -
పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లో జరుగుతాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్చైన్ టెక్నాలజీనుపయోగించి క్రిప్టో లావాదేవీలను జరుపుతుంటారు. బిట్కాయిన్స్ను కల్గిన పలు వ్యక్తులు తమ బిట్కాయిన్ వ్యాలెట్కు పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్కాయిన్ వ్యాలెట్కు శక్తివంతమైన పాస్వర్డ్ సహాయంతో ఇతరులకు బిట్కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! పది లక్షల కోట్ల రూపాయలు గాల్లోనే...! బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం బిట్కాయిన్ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ బిట్కాయిన్ వ్యాలెట్ పాస్వర్డ్ మర్చిపోతే... బిట్కాయిన్లు ఆన్లైన్లో అలానే ఉండిపోతాయి. ది న్యూయర్క్ టైమ్స్ ప్రకారం...దాదాపు 140 బిలియన్ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్కాయిన్ యూజర్లు క్లెయిమ్ చేసుకోలేదని వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 18.6 బిలియన్ బిట్కాయిన్ల మైనింగ్లో 20 శాతం మేర బిట్కాయిన్స్లో ఏలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణస్థితిలో ఉన్నాయని తెలిపింది.ఆయా బిట్కాయిన్ వ్యాలెట్ల యూజర్లు పాస్వర్డ్స్ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్ పేర్కొంది. ఆశాదీపంగా హ్యాకర్లే వారికి దిక్కు...! బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ను మర్చిపోయినా బిట్కాయిన్ యూజర్లకు డార్క్వెబ్లోని ఆన్లైన్ హ్యాకర్లే దిక్కుగా కన్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్కాయిన్ వ్యాలెట్లను యాక్సెస్ చేసేందుకు బిట్కాయిన్ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్కాయిన్ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్ రికవరీ టీమ్ వెల్లడించింది. కాగా బిట్కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై అనేక మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీపై అనేక దేశాలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశ పౌరులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. ఎల్ సాల్వాడార్, పరాగ్వే వంటి దేశాలు బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్దత కల్పిస్తామని పేర్కొన్నాయి. ఈ నిర్ణయంలో పలు క్రిప్టోకరెన్సీలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ గణనీయంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరు వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటిలో బిట్కాయిన్, ఈథిరియం, డాగ్కాయిన్ వంటివి ఎక్కువ ఆదరణను పొందాయి. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు... తాజాగా క్రిప్టోకరెన్సీలకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహంతో ముందుకువస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి బదులుగా సొంత డిజిటల్ కరెన్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీను త్వరలోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో దత్తతలో నైజీరియా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్లను రూపొందించడానికి విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై పనిచేస్తోన్న దేశాల వరుసలో నైజీరియా, ఘనా కూడా చేరాయి. త్వరలోనే ట్రయల్స్...! పలు విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో నైజీరియా, ఘనా దేశాలు డిజిటల్ కరెన్సీ ఏర్పాటులో కీలక అడుగువేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో నైజీరియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గి ఉంది. వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి ‘ఈనైరా’ అనే డిజిటల్ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ‘ఈసేడీ’ డిజిటల్ కరెన్సీలను ట్రయల్ చేయనున్నట్లు సమాచారం. పడిపోతున్న కరెన్సీ విలువ...! గత కొన్ని రోజుల నుంచి నైజీరియా క్రిప్టో కరెన్సీ వాడకంలో బూమ్ కన్పించినా... అక్కడి బ్యాంకులు క్రిప్టోపై బ్యాన్ విధించాయి. నైజీరియన్ పౌరులు ఎక్కువగా క్రిప్టోలో లావాదేవీలను జరుపడంతో నైజీరియన్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో క్రిప్టోకరెన్సీలకు పోటీగా డిజిటల్ కరెన్సీలను తీసుకురావాలని నైజీరియా నిర్ణయించుకుంది. చదవండి: Bitcoin: బిట్కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్బర్గ్ సంచలన ప్రకటన..! -
చైనా దెబ్బకు భారీగా పడిపోయిన బిట్కాయిన్ ధర
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్కాయిన్ కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. సెప్టెంబర్ 20న 43,000 డాలర్లుగా ఉన్న ధర నిన్న ఒక్కసారిగా సుమారు 40000 డాలర్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా డెవలపర్ ఎవర్గ్రాండే సంక్షోభంలో కూరుకు పోవడమే అని నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ మార్కెట్ పై ఈ ప్రభావం కొద్ది రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న ఈటీహెచ్ విలువ కూడా 5.07 శాతం క్షీణించింది. ఎథెరియం బ్లాక్ చైన్ అధికారిక క్రిప్టోకరెన్సీ. ఈథర్ ప్రస్తుత మారకం విలువ సుమారు 3,000 డాలర్లుగా ఉంది. చైనా డెవలపర్ ఎవర్గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్ల సంపదకు గండి కొట్టింది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు.(చదవండి: బిట్కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...!) -
అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ.6 లక్షల నుంచి రూ.216 కోట్లు.!
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, క్రిప్టోకరెన్సీ.. ఇవ్వన్నీ సామాన్య జనాలకు అర్థం కాని సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధిస్తే డబ్బులే..డబ్బులు..! స్టాక్మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలో ప్రావీణ్యం ఉంటే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు లేదా బికారీ కూడా అవ్వచును. స్టాక్మార్కెట్లో పలు కంపెనీల షేర్లు పడిపోతున్నాయనో లేదా నాకు వచ్చిన లాభాలు సరిపోతాయని చెప్పి వెంటనే వెనక్కి తీసుకుంటారు. అలా చేస్తే నష్టాల నుంచి కాస్త ఉపశమనం కల్గిన..చాలా కాలంపాటు షేర్లను వెనక్కి తీసుకోకుండా కొంత కాలం పాటు వేచిచూస్తే భారీ లాభాలనే ఆర్జించవచ్చును. చదవండి: Bitcoin: బిట్కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్బర్గ్ సంచలన ప్రకటన..! ప్రస్తుతం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కంటే క్రిప్టోకరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2009లో మొదలైన క్రిప్టోకరెన్సీలో ఒకటైన బిట్కాయిన్ ప్రస్థానం నేడు గణనీయంగా పెరిగింది. క్రిప్టోకరెన్నీ వచ్చిన తొలినాళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జంకేవారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి 2012లో సుమారు 616 బిట్కాయిన్ టోకన్లను కొన్నాడు. 2012లో బిట్కాయిన్ విలువ సుమారు 13 డాలర్లు(రూ. 978) గా ఉండేది. 616 బిట్కాయిన్ల మొత్తం 8,195 డాలర్లు (రూ. 6 లక్షలు). ఆ వ్యక్తి సుమారు తొమ్మిది సంవత్సరాలు పాటు తన బిట్కాయిన్ వ్యాలెట్ను చూసుకొలేదు. బిట్కాయిన్ ఒక్కసారిగా గణనీయంగా వృద్ధి చెందడంతో...బిట్కాయిన్ వ్యాలెట్ విలువ సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్ల పెరిగింది. బిట్కాయిన్ వ్యాలెట్ను వేరే వ్యాలెట్లోకి మార్చేప్పడు జరిగిన లావాదేవీలను బ్లాక్చైన్. కామ్ నిర్ధారించింది. ఇలాంటి సంఘటన ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టి, ఓపికగా ఉంటే భారీ మొత్తాలు చేతికి వస్తాయనడంలో ఇదొక ఉదాహరణగా చెప్పకోవచ్చునని సోషల్మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
బిట్కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్బర్గ్ సంచలన ప్రకటన..!
గత కొద్ది రోజుల నుంచి బిట్కాయిన్ తీవ్ర అస్థిరతను చవిచూసింది. బిట్కాయిన్కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్కాయిన్కు చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిట్కాయిన్లో అనిశ్చితి నెలకొంది. కాగా ప్రస్తుతం బిట్కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది. తాజాగా బిట్కాయిన్పై బ్లూమ్బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్గ్లోన్ సంచలన ప్రకటన చేశాడు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! ఈ ఏడాది చివర్లో బిట్కాయిన్ విలువ లక్ష డాలర్ల (సుమారు రూ. 73.65 లక్షలు)కు చేరుకుంటుందని తన ట్విట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్కాయిన్ను ఎక్కువ మంది ప్రజలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిట్కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు. బిట్కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను మూలంగా చేసుకొని బిట్కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్కాయిన్ క్రాష్తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తోంది. Can Bitcoin Reach $100,000 in 2021? Five Charts Show Potential - Past #Bitcoin trading trends and the crypto's declining supply vs. mainstream adoption suggest a significant advance in 2021, potentially to $100,000, we believe. pic.twitter.com/0tH7PS7QEI — Mike McGlone (@mikemcglone11) September 16, 2021 చదవండి: Bitcoin: బిట్కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
బిట్కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...!
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే ఠక్కున చెప్పేది బిట్కాయిన్. చాలావరకు క్రిప్టోకరెన్సీల్లో బిట్కాయిన్ ఎక్కువ ఆదరణ లభించింది. ఎల్సాల్వ్డార్, పరాగ్వే వంటి దేశాలు కూడా బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పిస్తానమని వెల్లడించిన విషయం తెలిసిందే. బిట్కాయిన్ను మొదటిసారిగా 2008లో రూపోందించారు. బిట్కాయిన్ మార్కెట్ విలువ 2009లో 0.0094982452 డాలర్ల నుంచి మొదలై నేడు సుమారు 991.2 బిలియన్డాలర్లకు పెరిగింది. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్కాయిన్ ఒక కంటి కనిపించని క్రిప్టోకరెన్సీ. బిట్కాయిన్ను ఎవరు సృష్టించారంటే చెప్పడం చాలా కష్టం. దీన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సతోషి నకమోటో అనే పేరును ఉపయోగించి మొదట చెలామణీ వచ్చింది. సతోషి నకమోటో అనే పేరు ఒక వ్యక్తిదో లేకపోతే కొంతమంది వ్యక్తుల సమూహమో ఎవరీకి తెలియదు. బిట్కాయిన్తెలియరాలేదు. దీన్ని 2008లో రూపొందించారు. తొలి విగ్రహ ఏర్పాటు..! తాజాగా బిట్కాయిన్ సృష్టికర్త సతోషిక నకమోటో తొలి విగ్రహాన్ని గురువారం రోజున హంగేరీలోని బుద్దాపెస్ట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు హజరయ్యారు. ఆవిష్కరణ వేడుకలో "స్టాచ్యూ ఆఫ్ సతోషి" ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు , క్రిప్టో న్యూస్ సైట్ క్రిప్టో అకాడెమియా ఎడిటర్, హంగేరియన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ సీఈవో డెబ్రేక్జెని బర్నబా హాజరయ్యారు. Front of #StatueOfSatoshi pic.twitter.com/LvlDmtio1c — Disclose.tv (@disclosetv) September 16, 2021 చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! -
క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. 2009 నుంచి మొదలైన క్రిప్టోకరెన్సీ ఇంతింతై వటూడింతై అన్న చందంగా పలు క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడు బిట్కాయిన్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఆయా క్రిప్టోకరెన్నీలు పూర్తిగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను, జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కచ్చితంగా వాడాలి. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి. అత్యంత బలమైన కంప్యూటర్లతో సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడంపై విస్తుపోయే విషయాలను ఒక నివేదిక వెల్లడించింది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్కాయిన్ ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రనిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్కాయిన్ మైనింగ్ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్ సెంట్రల్ బ్యాంక్ ఎకనామిస్ట్, రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ మాట్లాడుతూ... ఐఫోన్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పోలీస్తే బిట్కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువ. బిట్కాయిన్ మైనింగ్ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఈ మొత్తం నెదర్లాండ్స్ లాంటి దేశాల ఎలక్ట్రనిక్ వ్యర్థాలకు సమానమని తెలియజేశారు. రానున్న రోజుల్లో బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరగడంతో ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలు అనులోమనుపాతంలో పెరుగుతాయని రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ ఉద్గారాలు వెలువడ్డాయి. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్కాయిన్ కొంపముంచింది..! -
ఆ నిర్ణయం బిట్కాయిన్ కొంపముంచింది..!
గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్కాయిన్తో పాటు ఈథిరియం, డాగీకాయిన్, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్సాల్వాడార్, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్కాయిన్ను లీగల్ టెండర్గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. చదవండి: Afghanistan: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఎల్సాల్వాడార్ ప్రభుత్వం బిట్కాయిన్ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్సాల్వాడర్ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. ఎల్సాల్వాడర్ ప్రభుత్వం సుమారు 550 బిట్కాయిన్లను కలిగి ఉంది. ఈ బిట్కాయిన్స్ సుమారు 26 మిలియన్ డాలర్లతో సమానం. బిట్కాయిన్ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇష్టంగా లేని ఎల్సాల్వాడర్ పౌరులు..! మరోవైపు బిట్కాయిన్ను లీగల్ టెండర్గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్కాయిన్ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్కాయిన్ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్లో, 67.9 శాతం మంది పౌరులు బిట్కాయిన్ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు. నిరసనలతో భారీగా పతనం.. ఎల్ సాల్వడార్ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్ ఆరో తేదిన బిట్కాయిన్ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్కాయిన్ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్కాయిన్ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్కాయిన్ ట్రేడర్స్ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్ మస్క్...! -
Crypto Currency: గజిబిజి గందరగోళం.. ఉద్యోగాలు బోలెడు!
క్రిప్టో కరెన్సీ... ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం.ఇన్వెస్టర్లు క్రమంగా కొత్త తరహా ఆర్థిక వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పది వేల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇండియాలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పుంజుకుంటాయని దీని వల్ల దేశవ్యాప్తంగా పది వేల వరకు నూతన ఉద్యోగాలు సృష్టించడతాయని ప్రముఖ నియామకాల సంస్థ జెనో పేర్కొంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీలో పెద్దగా ఉద్యోగాలు లేవని, కానీ భవిష్యత్తు అలా ఉండబోదంటూ తెలిపింది. యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సైతం క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాయని తెలిపింది. ఇక్కడే ఎక్కువ క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో గుర్గ్రామ్, బెంగళూరు, ముంబైలు ప్రధాన కేంద్రాలుగా మారుతాయంటూ జోనో సంస్థ అభిప్రాయపడింది. దేశంలో క్రిప్టో కరెన్సీలో వచ్చే ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా జాబ్స్ ఈ మూడు నగరాల పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది. నైపుణ్యం తప్పనిసరి క్రిప్టో కరెన్సీలో రంగంలో భారీ వేతనంతో ఉద్యోగం పొందాలంటే సాధారణ మెలకువలు సరిపోవడని జెనో తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిర్వాహణకు అవసరమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, రిపిల్ ఎక్స్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది. క్రిప్టో కరెన్సీ కోడ్లను ఉపయోగిస్తూ గజిబిజిగా గందరగోళంగా ఓ సమాచారాన్ని క్షేమంగా, రహస్యంగా చేర్చడం లేదా భద్రపరచాడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. అదే పద్దతిలో క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2009లో తొలి క్రిప్టో కరెన్సీగా బిట్ కాయిన్ రాగా ఆ తర్వాత వందల కొద్ది బిట్కాయిల్లు చలామనిలోకి వచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు ఆవల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. చదవండి: క్రిప్టో.. కొలువుల మైనింగ్! -
అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!
ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరగుతుందనే భయం అఫ్గన్ పౌరులను వెంటాడుతుంది. మెజారిటీ ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఎటీఎమ్లు మూతపడ్డాయి. అఫ్గన్ పౌరులు తమ బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులను ఉపసంహరించడం కోసం భారీగా క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. స్ధానిక మార్కెట్లో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ తాలిబన్ల రాకతో స్థానిక కరెన్సీ విలువ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఓకవైపు మూసివేసిన దేశ సరిహద్దులతో అఫ్గన్ పౌరులు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల రాకతో అఫ్గన్ పౌరుల జీవితాల్లో ఆర్థిక అస్థిరత నెలకొంది. దేశంలో ఉన్న తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొడానికి, అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్లో ఇప్పటీకి ఎక్కువగా నగదు చెలామణీలో ఉంది. అఫ్గనిస్తాన్లో ఉన్న గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం కోసం..క్రిప్టోకరెన్సీ వాడకాన్ని ఎలా వాడాలనే విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు ఎక్కడా ట్రాక్ చేస్తారనే భయంతో వీపీఎన్, ఐపీలను చేంజ్ చేస్తూ క్రిప్టోకరెన్సీ గురించి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గన్ పౌరులు క్రిప్టోకరెన్సీ గురించి తెలిసిన అఫ్గన్ పౌరులను అడిగిమరి తెలుసుకుంటున్నారు. కాబూల్లో తిరుగుబాటు జరగడానికి ముందు జూలైలో ఆఫ్ఘనిస్తాన్లో “బిట్కాయిన్” “క్రిప్టో” కోసం వెబ్ సెర్చ్లు బాగా పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపించింది. తాజాగా ఇప్పుడు గూగుల్ క్రిప్టోకరెన్సీపై మరింత సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీ స్వీకరణపరంగా అఫ్గనిస్తాన్ 20వ స్థానంలో నిలవడం గమనార్హం. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! -
దూసుకెళ్తున్న క్రిప్టోకరెన్సీ....!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పెరుగుతూనే ఉంది. పలు క్రిప్టోకరెన్సీలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తాజాగా బిట్కాయిన్ శుక్రవారం (ఆగస్టు 13) రోజున 7.07 శాతం పెరిగి 47,587.38 డాలర్ల(సుమారు రూ. 35,31,800) వద్ద స్థిర పడింది. బిట్కాయిన్ సుమారు 3142.93 డాలర్లు వృద్ధి చెందింది. ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ఐనా బిట్కాయిన్ విలువ జనవరి నెలలో సుమారు 27,734 డాలర్ల కనిష్ట స్థాయి చేరుకుంది. ప్రస్తుతం బిట్కాయిన్ 71.6 శాతం వృద్ధి చెంది 47,587.38 డాలర్ల వద్ద స్థిరపడింది. మరో క్రిప్టోకరెన్సీ ఈథిరియం టెక్నికల్ అప్గ్రేడ్స్ చేస్తోన్నందున్న బిట్కాయిన్ ఈ స్థాయిలో గణనీయంగా వృద్ధి చెందిందని పన్టేరా క్యాపిటల్ సీఈవో మోర్హోడ్ పేర్కొన్నారు. ఈథిరియం కూడా సుమారు 7.86 శాతం పెరిగి 3284.18 (సుమారు రూ. 2,43,000) వద్ద స్థిర పడింది. -
అమెజాన్లో పేమెంట్స్ త్వరలో ఇలా కూడా చేయొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ తన వినియోగదారులకు బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలతో భవిష్యత్తులో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. అందుకోసం అమెజాన్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులకు సంబంధించిన బ్లాక్చెయిన్ ప్రొడక్ట్ లీడ్ను, డిజిటల్ కరెన్సీ నిపుణుల బృందాల నియామకం జరపాలని భావిస్తోంది. అమెజాన్ తాజా జాబ్ లిస్ట్ ప్రకారం..డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చెయిన్ టూల్స్కు చెందిన నిపుణులను నియమించుకోనుంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పేమెంట్స్ రోడ్మ్యాప్ను కూడా ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కస్టమర్ అనుభవం, టెక్నికల్ స్ట్రాటజీ, సామర్థ్యాలతో పాటు లాంచ్ స్ట్రాటజీ కోసం క్రిప్టోకరెన్సీ రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)తో సహా ఇతర ప్రొడక్ట్ డెవలపింగ్ కంపెనీలతో అమెజాన్ జత కట్టనుంది. ప్రస్తుతం అమెజాన్ క్రిప్టోకరెన్సీలను చెల్లింపులుగా అంగీకరించలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రస్తుతం బ్లాక్చైన్ సేవలను అందిస్తోంది. గతంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా క్రిప్టోకరెన్సీతో చెల్లింపులను నిలిపివేసిన తిరిగి క్రిప్టోకరెన్సీతో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొన్నాడు. -
అంతా నా ఇష్టం, 7లక్షల కోట్లు ఆవిరి
తన మాటలతో బిజినెస్ ప్రపంచాన్ని శాసించే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లాకు చెందిన కార్లను కొనుగోలు చేసేందుకు బిట్కాయిన్ల(క్రిప్టో)ను అనుమతిస్తున్నట్లు ప్రకటించి మరోసారి హాట్ టాపిగ్గా మారారు. అయితే ఇదే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్లను వ్యతిరేకిస్తూ మే13 ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు బిట్ కాయిన్ విలువ 15శాతం క్షీణించింది 56 వేల డాలర్ల నుంచి ఒక్కసారిగా 46వేల డాలర్లకు పడిపోయింది. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. Tesla & Bitcoin pic.twitter.com/YSswJmVZhP — Elon Musk (@elonmusk) May 12, 2021 తాజాగా క్రిప్టోకి సపోర్ట్ చేస్తూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మేనేజ్మెంట్కు చెందిన 'ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సంస్థ ఆర్థిక సాధికారత సాధనంగా బిట్కాయిన్(Bitcoin as a Tool for Economic Empowerment) అనే అంశంపై చర్చించింది. ఈ చర్చలో పాల్గొన్న మస్క్ బిట్ కాయన్ పై ప్రకటన చేశారు. 7లక్షల కోట్లు ఆవిరి ఏప్రిల్ నెల ప్రారంభంలో 65,000 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ధర.. ఏప్రిల్ 19(సోమవారం) రాత్రి 30వేల డాలర్లకు పడిపోయింది. దీంతో రూ.7 లక్షల కోట్ల (98 బిలియన్ల డాలర్లు) మేరకు నష్టపోయారు. అయితే రెండు రోజుల పాటు అలాగే కొనసాగినా గురువారం మార్కెట్లో 6.3 శాతం పెరగడంతో క్రిప్టో విలువ 31,547.88 డాలర్లకు చేరింది. ఇప్పుడు మరోసారి క్రిప్టో విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో క్రిప్టోవిలువ భారీగా పడిపోయినా ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రకటనతో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా ! -
రంగంలోకి దిగిన ఎలన్ మస్క్..! దూసుకుపోయిన కరెన్సీ విలువ!
వాషింగ్టన్: ఎలన్ మస్క్ ది రియల్ ఐరన్మ్యాన్. లక్షల కోట్లను సంపాదించాలన్నా లక్షల కోట్లను క్షణాల్లో పోగొట్టుకోవాలన్నా టెస్లా సీఈవో, స్పెస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కే సాధ్యం. ఒక ట్విట్ చేస్తే చాలు..అట్టడుగున ఉన్న కంపెనీలను ఎవరు ఊహించని విధంగా కంపెనీలు లాభాలను పొందేలా చేస్తాడు ఎలన్ మస్క్. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ తలరాతను మార్చడంలో మస్క్ పాత్ర వివరించలేనిది. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ఒక్క ట్విట్తో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ మరోసారి దశ తిరిగింది. ఎలన్ మస్క్ శుక్రవారం వేసిన ట్విట్తో డాగీకాయిన్ విలువ సుమారు 8 శాతం మేర దూసుకుపోయింది. డాగీకాయిన్ ఇన్వెస్టర్ మ్యాట్ వాలస్ ట్విట్కు ఎలన్ మస్క్ రిప్లె ఇచ్చాడు. ఎలన్ మస్క్ తన ట్విట్లో..బిట్కాయిన్, ఎథిరియం క్రిప్టోకరెన్సీతో పొల్చితే డాగీకాయిన్కు హై ట్రాన్సక్షన్ రేటు ఉందని తెలిపాడు. అంతేకాకుండా బిట్కాయిన్, ఎథిరియం క్రిప్టోకరెన్సీలకు బహుళస్థాయి లావాదేవీ వ్యవస్థలను కల్గి ఉందని పేర్కొన్నాడు. ఈ క్రిప్టోకరెన్సీలతో ట్రాన్సక్షన్ జరిపితే అధికంగా ఫీజును వసూలు చేస్తోందని తెలిపాడు. డాగీకాయిన్తో లావాదేవీలను జరిపితే తక్కువ టాన్సక్షన్ ఫీజు వసూలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ ట్విట్తో ఒక్కసారిగా డాగీకాయిన్ విలువ 8 శాతం పెరిగింది. కాగా గతంలో ఎలన్ మస్క్ను లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ప్రఖ్యాత హ్యాకర్ గ్రూప్ Anonymous హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎలన్ మస్క్ ను బెదరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.వీడియోలో మస్క్ తన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపిస్తూ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ను హెచ్చరించారు. BTC & ETH are pursuing a multilayer transaction system, but base layer transaction rate is slow & transaction cost is high. There is merit imo to Doge maximizing base layer transaction rate & minimizing transaction cost with exchanges acting as the de facto secondary layer. — Elon Musk (@elonmusk) July 9, 2021 -
క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..!
మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ గత ఏప్రిల్ , మే నెలలో జరిగిన బంగారం దిగుమతులే నిదర్శనం. ఓ వైపు కరోనా మహమ్మారితో సావాసం చేస్తోన్న బంగారం కొనుగోలు తగ్గడం లేదు. ఏప్రిల్, మే నెలలో సుమారు రూ. 51, 439 కోట్ల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. బంగారం నుంచి క్రిప్టోకరెన్సీ వైపు.. ప్రస్తుతం భారత ప్రజలు బంగారంపైనే కాకుండా క్రిప్టోకరెన్సీపై కూడా కన్నేశారు. భారత్లో సుమారు 25 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. అంతే దూకుడుతో భారతీయులు క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్కాయిన్, డాగ్కాయిన్, ఈథర్ క్రిప్టోకరెన్సీలపై విచ్చలవిడిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీపై పరిశోధనలు చేస్తోన్న ప్రముఖ సంస్థ చైనాలిసిస్ ప్రకారం భారత్లో గత సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు 200 మిలియన్ డాలర్ల నుంచి దాదాపు 40 బిలియన్ డాలర్లుకు పెరిగిందని పేర్కొంది. ఇది రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై నిషేధం విధించిన కూడా భారీ ఎత్తులో భారతీయులు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేలచూపులు చూస్తోన్నా..తగ్గేది లేదు..! క్రిప్టోకరెన్సీ గత కొన్ని నెలలుగా నేలచూపులు చూస్తున్న.. భారతీయులు డిజిటల్ కరెన్సీపై ఇన్వెస్ట్చేయడానికి మాత్రం జంకడం లేదు. బంగారంపై కాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేయడానికి భారతీయులు ముందుంటున్నారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్మెంట్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని నమ్ముతున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను గడించవచ్చునని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీ ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకుల నియంత్రిస్తాయి. కానీ క్రిప్టోకరెన్సీ విషయంలో అలా జరగదు. దాని నియంత్రణ పూర్తిగా కొనుగోలు, అమ్మకాలు జరిపే వారి చేతుల్లోనే ఉంటుంది. దీంతో భారతీయులు ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారత్లో ఎక్కువగా 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతి, యువకులే ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని చైనాలసిస్ పేర్కొంది. భారత్లో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్చేంజ్ మార్కెట్లు ఉన్నాయి. చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..! -
బిట్కాయిన్కు మరో దేశం చట్టబద్ధత..!
గత కొన్ని రోజులనుంచి నేల చూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి తాజాగా కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయంతో కొంతమేరకు ఉపశమనం కల్గనుంది. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బిట్కాయిన్కు పరాగ్వే దేశం కూడా చట్టబద్ధతను కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే ఆమోదించినున్నట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం లభిస్తే అధికారికంగా బిట్కాయిన్ను అంగీకరించే రెండో దేశంగా పరాగ్వే నిలవనుంది. పరాగ్వే పార్లమెంట్ సభ్యుడు కార్లిటోస్ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో దేశం మరింత వృద్ధిపథంలోకి నడుస్తోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి పతనమౌతున్న క్రిప్టోకరెన్సీకి ఈ నిర్ణయం కాస్తా ఉపశమనం కల్గుతుందని పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలు బిట్కాయిన్ను స్వీకరించడానికి మరింత ఆసక్తిని చూపిస్తున్నాయి. దీంతో వారి దేశాలు ఇతర దేశాల కంటే ఎక్కువ ప్రయెజనాలతో పాటు, బలమైన ఆర్థిక శక్తిగల దేశాలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని కార్లిటోస్ పేర్కొన్నారు. ఇరాన్లో నిరంతర బ్లాక్అవుట్ కారణంగా గత నెలలో బిట్ కాయిన్ను మూడు నెలలు పాటు నిషేధించింది. బిట్కాయిన్పై ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..! -
Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..!
బిట్కాయిన్ పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. మళ్లీ అంతలోనే రాకెట్లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. పెరిగినా, తగ్గినా ఇన్వెస్టర్లకు నిద్రపోకుండా చేస్తోంది బిట్కాయిన్. ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్ల స్థాయి నుంచి ఏప్రిల్ నాటికి 60,000 డాలర్లకు ఎగిసిన బిట్కాయిన్ మే నెలలో అమాంతం దాని విలువ సగానికి పడిపోయింది. ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ టిమ్ డ్రేపర్ బిట్కాయిన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022 చివరినాటికి బిట్కాయిన్ సుమారు 2,50,000 డాలర్ల (సుమారు రూ. 1.85 కోట్లు)కు చేరుతుందని జోస్యం చెప్పాడు. గత కొన్ని నెలల నుంచి నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీ రానున్న రోజుల్లో తిరిగి మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా దేశాల నుంచి బిట్కాయిన్కు ఆమోదం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎలన్ మస్క్ వరుస ట్విట్లు, చైనా ఆంక్షలతో బిట్కాయిన్ తీవ్ర ఒడిదుడుకలకు గురైన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో బిట్కాయిన్ను ప్రముఖ దిగ్గజ కంపెనీలు చెల్లింపుల కోసం కచ్చితంగా ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం 18 మిలియన్ల బిట్కాయిన్లో చెలామణీలో ఉండగా అది 21 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు. టిమ్ డ్రేపర్ ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్. ట్విటర్, స్కైప్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల తొలినాళ్లలో భారీగా పెట్టుబడులను పెట్టారు. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ వాజిర్ఎక్స్కు ఈడీ నోటీసులు -
Bitcoin:బిట్కాయిన్కు చట్టబద్ధత!
శాన్ శాల్వడార్ (ఎల్ శాల్వడార్): క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్కాయిన్కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిల్చింది. ఎలాంటి లావాదేవీలకైనా ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగించవచ్చని, టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్ శాల్వడార్ వెల్లడించింది. అయితే, తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీగా కొనసాగుతుందని, బిట్కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని పేర్కొంది. ఈ క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, నవకల్పనలు, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్కాయిన్ మారకం విలువపరంగా ఎవరూ నష్టపోయే రిస్కులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చేలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్కు రిజర్వ్ బ్యాంక్ సూచనలు జారీ చేసింది. ఈ తరహా కరెన్సీ లావాదేవీలు జరిపే కస్టమర్లకు సర్వీసులు అందించరాదంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్పై వివరణనిచ్చింది. ఈ సర్క్యులర్ను 2020లో సుప్రీంకోర్టు తోసి పుచ్చినందున అప్పట్నుంచి ఇది అమల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వర్చువల్ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే వారికి సర్వీసులను అందించకుండా ఉండటానికి ఈ సర్క్యులర్ను అడ్డుగా చూపరాదని స్పష్టం చేసింది. అయితే, కస్టమర్ల ఖాతాల వివరాల వెల్లడి (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్ తదితర చట్టాల నిబంధనలను పాటించాలని బ్యాంకులు మొదలైన వాటికి ఆర్బీఐ సూచించింది. చదవండి: విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ.. -
చిన్న ట్వీట్ తో 3వ స్థానానికి ఎలోన్ మస్క్
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. మార్చిలో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం)కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని మస్క్ మే 13న ట్వీట్ చేయడమే. ట్వీట్ చేసిన తర్వాత బిట్ కాయిన్ల షేర్ విలువ 6.2 శాతం తగ్గింది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 42,185 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 8 తర్వాత ఇదే తక్కువ. ఫిబ్రవరి 8న బిట్ కాయిన్ 43,564 డాలర్లు పలికింది. టెక్నాలజీ ఆధారిత స్టాక్స్లో గత ఏడాది కరోనా విజృంభణ కాలంలో టెస్లా షేర్లు దాదాపు 750 శాతం పెరిగిన తర్వాత జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్ నిలిచాడు. కానీ, ఎక్కువ రోజులు ఈ స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా అధిక లాభాలను నమోదు చేయగా, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ కొరత, సాంప్రదాయ వాహన తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య దాని వాటాలు ఐదవ వంతు తగ్గాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. బిట్ కాయిన్లను ఎందుకు అంగీకరించలేదంటే? బిట్ కాయిన్ల తయారీ, లావాదేవీలకు ఫాజిట్ ఫ్యూయల్స్ వాడుతారనే విషయం తెలిసిందే. అందులో ఎక్కువ శాతం బొగ్గు ఉంటుంది. రకరకాల ఇంధనాల వృథా నుంచి బొగ్గు తయారవుతుంది కాబట్టి అందుకే బిట్కాయిన్లను ప్రోత్సహించం అని ట్వీట్లో మస్క్ పేర్కొన్నాడు. ఈ సంవత్సరం మస్క్ సంపాదన 9 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయిందని బ్లూమ్బెర్గ్ తెలిపింది. టెస్లా సీఈఓను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన నికర విలువ సంపాదన భారీగా పెరగింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో తన సంస్థ విలాస వస్తువుల అమ్మకాలు పెరగడంతో 72 ఏళ్ల అతని సంపాదన నికర విలువ 47 బిలియన్ డాలర్ల నుంచి 161.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో జెఫ్ బేజోస్, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, మూడవ స్థానంలో ఎలోన్ మస్క్ నిలిచారు. ఇక తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ ఉన్నారు. చదవండి: ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం! -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ విలువ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో 62 వేల డాలర్ల మార్క్ను దాటి 63,825.56 డాలర్ల రికార్డు ధర పలికింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన బిట్ కాయిన్ ఇప్పుడు ఆ రికార్డును తుడిపేసింది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటే, ఆంతే స్థాయిలో బిట్ కాయిన్ విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుండటంతో దాని విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ చాలా ప్రధానమైనది కాబట్టి దాని విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా 70 నుంచి 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఇక, 2018లో కుదేలైపోయిన బిట్ కాయిన్ గతేడాది కరోనా మహమ్మారి నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 2020 అక్టోబర్లో 12 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ గత నెలలో 60 వేల డాలర్ల మార్కు దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం మన కరెన్సీలో బిట్ కాయిన్ ధర దాదాపు 50 లక్షలకు చేరిపోయింది. టెస్లా కంపెనీ అధినేత ఎలన్మస్క్ పెట్టుబడులు పెట్టడంతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థలు కూడా తమ వినియోగదారుల్ని బిట్ కాయిన్తో లావాదేవీలకు అనుమతించడం బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగిపోవడానికి తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి. చదవండి: డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా? -
రూ.వెయ్యి లాభం.. రూ.3.14 లక్షల నష్టం!
సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్కాయిన్స్పై మోజుతో నగరానికి చెందిన ఓ నిరుద్యోగి సైబర్ నేరగాడి వల్లో పడ్డాడు. తొలుత ఇతడికి రూ.వెయ్యి లాభం వచ్చేలా చేసిన ఆ దుండగుడు ఆపై ఆఫర్స్ పేరు చెప్పి రూ.3.14 లక్షలు కాజేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ మోసం ఎలా జరిగింది ► నగరానికి చెందిన మనీష్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. బిట్కాయిన్స్పై ఆసక్తి ఉన్న ఇతగాడు తన స్మార్ట్ ఫోన్లో బినాన్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ► ఈ యాప్లో ఉండే గ్రూపుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బిట్కాయిన్స్ క్రయ, విక్రేతలు ఉంటారు. ఈ ప్లాట్ఫామ్లోనే మనీష్కు బెంగళూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. ► అతడి నుంచి తొలుత రూ.5 వేలు, రూ.5 వేలు, రూ.13 వేలు వెచ్చించి మూడు బిట్కాయిన్లు ఖరీదు చేశాడు. వీటిని బినాన్స్లోనే విక్రయానికి పెట్టగా మనీష్కు రూ.24 వేలు వచ్చాయి. ఇలా రూ.వెయ్యి లాభం పొందిన ఇతగాడు బెంగళూరు వాసిని పూర్తిగా నమ్మాడు. ► ఆపై చాటింగ్ ద్వారా మనీష్ను సంప్రదించిన బెంగళూరు వాసి ప్రత్యేక ఆఫర్ నడుస్తోందని, రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే ఒక శాతం బిట్కాయిన్ బోనస్గా వస్తుందని నమ్మబలికాడు. ► దీంతో మనీష్ బిట్ కాయిన్ ఖరీదు చేసేందుకు రూ.25 వేలు బదిలీ చేశాడు. అయితే ఆ ఆఫర్ పొందాలంటే మరో రూ.23,526 పంపాలంటూ బెంగళూరు వాసి కోరాడు. ఇలా మొత్తం 15 లావాదేవీల్లో మనీష్ నుంచి రూ.3.14 లక్షలు కాజేశాడు. ► మనీష్ ఈ మొత్తాలను యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలకు బదిలీ ద్వారా పంపాడు. మరో రూ.24 వేలు పంపిస్తేనే ఆఫర్ వర్తిస్తుందంటూ బెంగళూరు వాసి చెప్పడంతో మనీష్కు అనుమానం వచ్చింది. ► తన డబ్బు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆ మొత్తానికి సరిపడా బిట్కాయిన్స్ పంపాలని బెంగళూరు వాసిని పలుసార్లు విజ్ఞప్తి చేశాడు. దీంతో తన వద్ద ఉన్న డబ్బంతా బిట్కాయిన్స్ల్లో ఇరుక్కుందని అతడు చెప్పాడు. ► రూ.20 వేలు పంపిస్తే రూ.1.7 లక్షలు లోన్ తీసుకుని ఆ మొత్తం చెల్లిస్తానని, అంతకు మించి ఇవ్వలేనని బుధవారం స్పష్టం చేశాడు. మళ్లీ గురువారం అడగ్గా... రూ.30 వేలు పంపాలని, రూ.7 లక్షలు రుణం తీసుకుని మొత్తం రూ.3.14 లక్షలు చెల్లిస్తానన్నాడు. ► అతడి గుర్తింపు కార్డులు పంపాలంటూ మనీష్ కోరగా... తనకు లేవని, కుటుంబీకుల పేరుతో కొన్ని పంపాడు. మనీష్ వేరే ఫోన్ నంబర్ నుంచి బినాన్స్ యాప్లోకి ప్రవేశించి బెంగళూరు వాసితో కొత్త వ్యక్తిలా చాటింగ్ చేశాడు. ► తనకు రూ.50 వేల బిట్కాయిన్స్ కావాలని, ఆ మొత్తం పంపడానికి గుర్తింపుకార్డు షేర్ చేయాలని కోరాడు. దీనికి అంగీకరించిన బెంగళూరు వాసి తన ఆధార్ కార్డు ప్రతిని షేర్ చేశాడు. అతగాడు తనను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశాడని గ్రహించిన మనీష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు ప్రారంభించారు. ( చదవండి: వామ్మో.. ‘ఖతర్’నాక్ మోసం! ) -
4.4 కోట్లు కోల్పోయిన ఐఫోన్ యూజర్
ఎక్కువ శాతం యాపిల్ సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే, దీనిని కొనుగోలుచేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, కొన్ని సార్లు హ్యాకర్లు యాపిల్ యూజర్లను కూడా హ్యాక్ చేసి డబ్బు సంపాదిస్తారు. ఇప్పడు అలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఆపిల్ సంస్థ తన ఐఓఎస్ యాప్ స్టోర్లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో ఐఫోన్ వినియోగదారుడు 6,00,000 డాలర్లకు పైగా నష్టపోయాయడు. ఇది మన ఇండియా కరెన్సీలో దాదాపు రూ.4.4 కోట్లకు సమానం. ఫిలిప్ క్రిస్టోడౌలౌ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 17.1 బిట్కాయిన్ల విలువను చెక్ చేయాలని అనుకున్నాడు. దీని కోసం ఐఫోన్ లో వాలెట్ను ఆక్సెస్ చేయడం కోసం అతను ఐఓఎస్ యాప్ స్టోర్లో అచ్చం ఒరిజినల్ యాప్ లాగానే ఉన్న ట్రెజర్ యాప్ ను డౌన్లోడ్ చేశాడు. ఈ యాప్ మోసగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బును కొల్లగొట్టేవారు. ఈ యాప్ యూజర్ల రహస్య వివరాలను నమోదు చేయడానికి మోస పూరితంగా కనిపించేలా రూపొందించారు. అయితే, ఫిలిప్ క్రిస్టోడౌలౌ వెల్లడించిన వివరాల సహాయంతో హ్యాకర్లు 17.1 బిట్కాయిన్లను దొంగలించారు. బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ కావడంతో హ్యాకర్ల పని చాలా తేలిక అయ్యింది. ఆపిల్ సంస్థ ఐఓఎస్ యాప్ స్టోర్లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో తన బిట్కాయిన్లు దొంగలించినట్లు క్రిస్టోడౌలౌ తర్వాత తెలుసుకున్నాడు. దీని విలువ మన దేశంలో సుమారు రూ.4.4కోట్లు. మహమ్మారి కారణంగా నష్టపోయిన తన డ్రై-క్లీనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బిట్కాయిన్లు సహాయపడతాయని ఆశించాడు. కానీ ఇంతలో ఇలా జరిగింది. గూగుల్ ప్లే స్టోర్తో పోలిస్తే ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్ అత్యంత సురక్షితమైనదిగా పేరు ఉంది. చదవండి: వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్ -
డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా?
బిట్ కాయిన్కు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ వంటి వాటి సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. ప్రజలు కూడా బిట్ కాయిన్ రిస్క్ను అర్థం చేసుకోవాలని సూచించారు. డాలర్ లేదా బంగారానికి బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఎప్పటికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు. గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే 60వేల డాలర్లను కూడా దాటి జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద ఉంది. కరోనా కాలంలో రాకెట్ కంటే వేగంతో దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని అన్నారు. వాటి విలువ ఎల్లపుడు అస్థిరతతో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది. చదవండి: రియల్టీ కింగ్ ఎంపీ లోధా -
రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న బిట్కాయిన్
ఒకవైపు భారత్లో క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధమవుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు అంతర్జాతీయంగా బిట్ కాయిన్ రేటు రోజు రోజుకూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తొలి సారిగా 61,000 డాలర్ల స్థాయిని(సుమారు రూ. 43,92,000) తాకింది. కోవిడ్-19 ఉపశమన చర్యల కోసం అమెరికా ప్రభుత్వం 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన దరిమిలా ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలు .. బిట్కాయిన్ వంటి కరెన్సీలకు ఊతమిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో బిట్ కాయిన్ విలువ 1,000 శాతం ఎగిసింది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆఖరు నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న విలువ ఆ తర్వాత ఏకంగా 40,000 డాలర్లకు పెరిగింది. మరికొద్ది రోజుల్లోనే మరో కొత్త గరిష్టం 61,000 డాలర్లకు ఎగిసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్ మస్క్ తదితర దిగ్గజ ఇన్వెస్టర్ల ఊతంతో ఈ ఏడాది ఆఖరు నాటికల్లా బిట్కాయిన్ విలువ ఏకంగా 1,00,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చదవండి: క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు! -
క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దూసుకెడుతున్న బిట్కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై దేశీయంగా మాత్రం కత్తి వేలాడుతోంది. భారత్లో వాటి భవిష్యత్పై అనిశ్చితి కొనసాగుతోంది. ఓవైపు క్రిప్టోకరెన్సీలపై పూర్తి స్థాయిలో నిషేధం ఉండకపోవచ్చంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే వివరణ ఇచ్చినప్పటికీ.. మరోవైపు ఈ కరెన్సీలను నిషేధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందిస్తున్నట్లు సమాచారం. బిట్కాయిన్, డాగీ కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీలను నిషేధించడంతో పాటు ఆయా కరెన్సీల్లో దేశీయంగా ఎవరైనా ట్రేడింగ్ చేసినా, లేదా వాటిని తమ దగ్గర ఉంచుకున్నా జరిమానా విధించే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్లు ప్రకారం క్రిప్టో కరెన్సీలను దగ్గర ఉంచుకోవడం, జారీ చేయడం, మైనింగ్ చేయడం, ట్రేడింగ్ చేయడం, ఇతరులకు బదలాయించడం వంటి లావాదేవీలన్నింటినీ క్రిమినల్ నేరాల పరిధిలోకి తెచ్చే ప్రతి పాదనలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ బిల్లును ప్రవేశపెడితే ఇప్పటికే క్రిప్టోకరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు నష్టపోకుండా తమ పెట్టుబడులను విక్రయించుకుని బైటపడేందుకు ఆరు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. వర్చువల్ కరెన్సీలకు కీలకమైన బ్లాక్చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూనే.. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను మాత్రం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 70 లక్షల ఇన్వెస్టర్లలో టెన్షన్.. దేశీయంగా క్రిప్టో కరెన్సీల్లో దాదాపు 70లక్షల మంది ఇన్వెస్టర్లు సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసి ఉంటారని అంచనా. వర్చువల్ కరెన్సీల విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి ఈ ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. క్రిప్టోలను నిషేధించాలంటూ ప్రభుత్వం కొద్ది నెలలుగా యోచిస్తున్నప్పటికీ.. ఇటీవల నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో కాస్త ఆశలు రేకెత్తించాయి. క్రిప్టో కరెన్సీలు, బ్లాక్ చెయిన్, ఫిన్టెక్ లాంటి వాటికి ప్రస్తుతానికి దారులేమీ మూసేయడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అధికారిక వర్చువల్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుందని, అయితే తమ వరకూ తాము మాత్రం క్రిప్టో కరెన్సీలకు దారులు మూసేయరాదనే విషయంలో స్పష్టతతో ఉన్నామని మంత్రి చెప్పారు. దీనిపై క్యాబినెట్ నోట్ కూడా సిద్ధమవుతోంనది ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించకుండా ట్రేడింగ్ను మాత్రమే నియంత్రించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశలు నెలకొన్నాయి. అయితే, దానికి విరుద్ధంగా పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా బిల్లు రూపొందుతోందన్న వార్తలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయి. ఒకవేళ ఇది చట్టరూపంలో అమల్లోకి వచ్చిన పక్షంలో క్రిప్టోకరెన్సీలను దగ్గర ఉంచుకున్నందుకు కూడా జరిమానా విధించే తొలి పెద్ద దేశంగా భారత్ నిలవనుంది. చైనా కూడా మైనింగ్, ట్రేడింగ్ను నిషేధించినప్పటికీ ఈ వర్చువల్ కరెన్సీలను దగ్గర ఉంచుకున్నందుకు గాను జరిమానాలు విధించడం లేదు. -
బిట్కాయిన్ దూకుడు : ఆల్ టైం రికార్డు
సాక్షి, ముంబై: డిజిటల్ కరెన్సీ రూపమైన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ రికార్డులు సొంతం చేసుకుంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బిట్కాయిన్ తాజాగా మరో ఆల్టైం రికార్డును నమోదు చేసింది. శనివారం తెల్లవారుజామున బిట్కాయిన్ చరిత్రలో తొలిసారిగా, 60,000 డాలర్లను అధిగమించింది. ఇటీవల కరెక్షన్ తరువాత మరింత పుంజుకున్న బిట్ కాయిన్ తాజా రికార్డును నమోదు చేసింది. డేటా ప్లాట్ఫామ్ ట్రేడింగ్ వ్యూ ప్రకారం 60,170 వద్ద ట్రేడవుతోంది. కాగా క్రిప్టోకరెన్సీ గతంలో ఫిబ్రవరి 21 న, 57,432 వద్దకు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా మహమ్మారి-ఉపశమన చట్టంపై సంతకం చేసిన తరువాత ఆర్థిక మార్కెట్లలోనెలకొన్ని ఆశలు ఈ పరిణామానికి దారితీసిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు డాలర్ బలహీన పడటంతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారానికి చెక్పెట్టేలా క్రిప్టో కరెన్సీ పై మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. -
ఒక్క ట్వీట్తో లక్ష కోట్ల నష్టం..!
ఒక్క క్షణం చాలు జీవితం తలక్రిందులు కావడనికి. ప్రధానంగా ఈ మాట స్టాక్ మార్కెట్ లలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ఎలాన్ మస్క్ చేసిన కొన్ని ట్విట్ల కారణంగా స్టాక్ మార్కెట్ ద్వారా లక్షల కోట్లు నష్టపోయాడు. తాజాగా మరోసారి చేసిన ఒక్క ట్వీట్తో లక్ష కోట్లు నష్ట పోయాడు. ఇటీవల బిట్ కాయిన్ విలువ రాకెట్ వేగంగా దూసుకెళ్తుంది. అయితే, బిట్ కాయిన్ షేర్ విలువ పెరుగుతుండడంపై ట్విటర్ లో ఎలాన్ మస్క్ స్పందించారు. "బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా" కనిపిస్తోందని ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు. దీనితో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు(సుమారు లక్ష కోట్లు) కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా కోట్లు నష్టపోవడం మొదటిసారి కాదు గతంలో “టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ” అంటూ చేసిన ట్విట్ కి 14 బిలియన్ డాలర్లు నష్టపోయాడు. That said, BTC & ETH do seem high lol — Elon Musk (@elonmusk) February 20, 2021 -
బిట్కాయిన్లంటూ రూ.10 కోట్ల మోసం?
హుబ్లీ: డిజిటల్ డబ్బు బిట్కాయిన్లపై పెట్టుబడి పెట్టి రూ.లక్షలాది లాభం పొందవచ్చని నమ్మించి హుబ్లీలో మోసగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనం రట్టయింది. వివరాలు.. హుబ్లీ చొరవిఅక్కళ నివాసి వాసప్ప లోకప్ప అనే వ్యక్తికి ఢిల్లీకి చెందిన అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్ తదితరులు పరిచయం పెంచుకున్నారు. స్థానిక చేతన్ పాటిల్ అనే ఏజెంట్ను పెట్టుకుని హుబ్లీ– ధార్వాడ నగరాల్లో ప్రముఖ వ్యాపారులను ఒక హోటల్కు రప్పించుకొని బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే దండిగా లాభాలు పొందవచ్చని బ్రెయిన్వాష్ చేశారు. వ్యాపారి వాసప్ప లోకప్ప రూ.45 లక్షలు ఇచ్చి కొన్ని బిట్కాయిన్ల కొనుగోలు చేశారు. ఆ కాయిన్లను అమ్ముదామని ఖాతాలో చూసుకుంటే ఒక్కటి కూడా లేవు. దీంతో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా హుబ్లీ–ధార్వాడల్లో అనేకమంది నుంచి ఢిల్లీ ముఠా రూ.10 కోట్ల మేర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తన వంటి బాధితులు 40 నుంచి 50 దాకా ఉన్నారని వాసప్ప తెలిపారు. కమ్మరిపేట పోలీసుల్లు ఏజెంట్ చేతన్ పాటిల్, ఢిల్లీ ముఠా కోసం వేట మొదలు పెట్టారు. చదవండి: బిట్కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్కాయిన్
డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్ రికార్డు పరుగు కొనసాగుతోంది. తాజాగా 50,000 డాలర్ల (దాదాపు రూ.36.5 లక్షలు) మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్లో ఒక దశలో 50,515 డాలర్ల స్థాయిని కూడా తాకింది. గడిచిన మూడు నెలల్లోనే బిట్కాయిన్ రేటు 200 శాతం పైగా పెరగడం గమనార్హం. ఏడాది క్రితం దీని విలువ 10.000 డాలర్ల స్థాయిలో ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కంపెనీలు ఈ డిజిటల్ కరెన్స్ వైపు మొగ్గుచూపుతుండటంతో బిట్కాయిన్ భారీగా ర్యాలీ చేస్తోంది. ఎలక్టిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇటీవలే 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే కరెన్సీ కొనుగోలు చేస్తున్నట్లు, కార్ల కొనుగోలుకు బిట్కాయిన్తో కూడా చెల్లింపులు స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో దీనికి మరింత ఊతం లభించింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూ రిడ్జ్ బ్యాంక్ తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్కాయిన్ను కొనుగోలు చేయొచ్చంటూ ప్రకటించింది. ఆ తర్వాత బీఎన్వై మెలాన్ అనే బ్యాంకు కూడా తమ క్షయింట్లకు అందించే సర్వీసుల్లో డిజిటల్ కరెన్సీలను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది.(చదవండి: బిట్ కాయిన్కు కెనడా గ్రీన్ సిగ్నల్) -
బిట్ కాయిన్కు కెనడా గ్రీన్ సిగ్నల్
డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. -
బిట్కాయిన్లో టెస్లా పెట్టుబడి
సిల్వర్స్ప్రింగ్(యూఎస్): ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా.. డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్లో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా త్వరలో ఈ డిజిటల్ కరెన్సీని చెల్లింపులకూ అనుమతించే ప్రణాళికల్లో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం ఉదయం బిట్కాయిన్ విలువ 15 శాతం జంప్చేసింది. 43,000 డాలర్లను తాకింది. ఒక దశలో 43,863 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని చేరింది. హైఎండ్ వాహనాల కొనుగోలుకి బిట్కాయిన్లో చెల్లింపులను అనుమతించే ఆలోచనలో ఉన్నట్లు టెస్లా తాజాగా పేర్కొంది. డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులపై ఆటో దిగ్గజం టెస్లా.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీకి వివరాలు దాఖలు చేసింది. ఇతర ప్రత్యామ్నాయ రిజర్వ్ అసెట్స్ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. -
క్రిప్టో కరెన్సీ చరిత్రలో మరో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలం నుంచి క్రిప్టోకరెన్సీకి సపోర్టర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మొదట ఈ క్రిప్టోకరెన్సీపై చాలా అపోహలు ఉండటం వల్ల దీనిపై ఎక్కువ శాతం మొగ్గు చూపలేదు. అయితే తర్వాత దీనిపై ఉన్న అనుమానులు తొలిగిపోవడంతో క్రిప్టోకరెన్సీకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్స్, డాగీ కాయిన్స్ లావాదేవీల కోసం వాడుతున్నారు. ఇంతకముందు బిట్ కాయిన్ సంచనాలను సృష్టిస్తే, ఇప్పుడు డాగీ కాయిన్ రికార్డు సృష్టిస్తుంది.(చదవండి: అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన హ్యాకర్?) గత 2వారాల నుంచి డాగీ కాయిన్ విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొద్దీ గంటల్లోనే డాగీ కాయిన్ విలువ 5 రెట్లు పెరిగిందని పలు నివేదికలు నివేదిస్తున్నాయి. జనవరి 27 వరకు పైసా కంటే తక్కువ విలువ ఉన్న ఈ కాయిన్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపాయి. జనవరి 27 తర్వాత 500 శాతం పైగా దాని ధర పెరిగినట్లు కాయిన్బేస్ తెలిపింది. బిట్కాయిన్ మాదిరిగానే డాగ్కోయిన్ అనేది కూడా డిజిటల్ నాణెం. ఇది ప్రధానంగా ఇ-లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) It’s inevitable pic.twitter.com/eBKnQm6QyF — Elon Musk (@elonmusk) July 18, 2020 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిల్లీ మార్కస్, జాక్సన్ పామర్ 2013లో దీనిని కనుగొన్నారు. క్రిప్టో కరెన్సీలో ఇది మరో రకం. బ్యాంకింగ్ ఫీజులు లేకుండా తక్షణ చెల్లింపులు చెల్లించేందుకు గాను ఓ వ్యవస్థను సృష్టించాలని ఈ టెక్కీలు అనుకున్నారు. అప్పటికి షిబా ఇను అనే శునకం ఎంతో పాపులర్ సంపాదించింది. అందుకే ఆ కుక్క లోగోను ఈ కాయిన్కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డాగీ కాయిన్ సృష్టించబడింది. మొదట్లో ఈ డాగీ కాయిన్ ను ఎవరు పట్టించుకోలేదు. అందరూ దీనిని ఒక జోక్ గా పరిగణించారు. అయితే కొద్దీ కాలంలోనే దీని విలువ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ డాగీ కాయిన్ కు మంచి విలువ ఉంది. జనవరి 27 తర్వాత 24 గంటలలో భారీ లావాదేవీల కారణంగా డాగ్కోయిన్ 7 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్లో ఉంది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ గతంలో డాగ్కోయిన్ గురించి 2020 జులై 18న ట్వీట్ చేశాడు. -
బిట్కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్కాయన్పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్లెట్లో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్ చేసింది. అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్కాయిన్, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ విధించిన బ్యాన్ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది. (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ) సాధ్యం కాదంటున్న నిపుణులు క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు 'పబ్లిక్' కనుక ఇవి నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతున్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం. ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్బీఐ అధికారిక సమాచారంలో, బిట్కాయిన్ ప్రైవేట్గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్చైన్లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని కాయిన్డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి -
రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బిట్కాయిన్
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. గత వారమే 30 వేల డాలర్లను దాటిన బిట్కాయిన్ ఈ వారం ముగిసే సరికి 40 వేల డాలర్లను తాకింది. 2021లో మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ 5 వేల డాలర్లు పెరిగింది. 2017 నుంచి క్రమంగా పెరుగుతూ పోతున్న ఈ క్రిప్టోకరెన్సీ 2020 డిసెంబర్ 16న మొదటిసారి 20 వెల డాలర్లు నమోదైంది. అప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీ విలువ రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ తో దూసుకెళ్తుంది. డిసెంబర్ 25వ తేదీ నాటికీ 25వేల డాలర్లు, 27వ తేదీ నాటికీ 27వేల డాలర్లకు పైగా చేరుకుంది. 2021 మొదటి వారంలోనే దీనివిలువ సుమారు 30 వేల డాలర్లకు పైగా చేరుకుంది. భవిష్యత్ లో లక్ష డాలర్లకు పైగా చేరుకొనునట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమైంది.(చదవండి: వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్) -
వణికిన ట్విట్టర్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్కాయిన్ వాలెట్లోకి లక్షకు పైగా డాలర్లు సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్కాయిన్ వాలెట్లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారంటే బిట్కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్వర్డ్లు తెలుసుకొని మెసేజ్లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధం: నాస్కామ్
బెంగళూరు: బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ వినియోగం చట్టవిరుద్ధమని, దేశీ చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ వ్యాఖ్యానించారు. యూనోకాయిన్ పేరిట బెంగళూరులో తాజాగా దేశంలోనే తొలి బిట్కాయిన్ ఏటీఎం ఏర్పాటుకావడం.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్, సహ వ్యవస్థాపకుడు హరీశ్ బీవీలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన ఆమె, క్రిప్టోకరెన్సీ ఉపయోగంలో ఉన్నటువంటి సానుకూల అంశాలను వివరించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి తప్పించి చట్టాల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. -
బిట్ కాయిన్ స్కాం : కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ : బిట్ కాయిన్పై ఈ మధ్యన కాస్త మోజు తగ్గింది. బిట్కాయిన్ ట్రేడింగ్లో మోసాలు, కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం, ఆర్బీఐ దీన్ని లీగల్ కరెన్సీగా గుర్తించకపోవడం దీనికి ప్రధాన కారణమైంది. తాజాగా బిట్ కాయిన్ లావాదేవీల కేసులో భాగంగా అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తికి సంబంధించి భారీ మొత్తంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. భరద్వాజ్కు చెందిన భారత్, దుబాయ్లో ఉన్న రూ.42.88 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆస్తులను అటాచ్ చేసుకునే ముందస్తు ఆర్డర్ను ఏజెన్సీ జారీ చేసింది. అటాచ్ చేసుకున్న ఆస్తుల్లో అమిత్ భరద్వాజ్కు దుబాయ్ ఉన్న ఆరు కార్యాలయాలు, భారత్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.42.88 కోట్లగా ఉన్నట్టు ఈడీ పేర్కొంది. భరద్వాజ్ సింగపూర్లో 2015లో మిస్ వేరియబుల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ను సింగపూర్లో ప్రారంభించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ కోసం www.gainbitcoin.comను లాంచ్ చేశారు. బిట్ కాయిన్లు భారత్లో చట్టవిరుద్ధం. పెట్టుబడుల ద్వారా బిట్ కాయిన్లను కొనాలని, ఎక్కువ రిటర్నులు ఆర్జిస్తారని.. భరద్వాజ్, ఆయన టీమ్ ఇన్వెస్టర్లను ఆకర్షించారు. అలా 80వేల బిట్కాయిన్లతో పెట్టుబడులను సేకరించినట్టు ఈడీ పేర్కొంది. కానీ ఇన్వెస్టర్లకు ప్రమాణం చేసిన మాదిరిగా రిటర్నులను చెల్లించకుండా.. క్రిప్టో కరెన్సీ టోకెన్ను ఆఫర్ చేసినట్టు తెలిపింది. అయితే దానికి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఎలాంటి విలువ లేదన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు మోసపోయారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈడీ, గెయిన్బిట్కాయిన్ వెబ్సైట్పై క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. భరద్వాజ్తో మరో ఎనిమిది మందిపై కేసు పెట్టింది. దాదాపు 8000 మంది ఇన్వెస్టర్లు రూ.2000 కోట్ల ఫండ్స్ను కోల్పోయారు. మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈడీ ఈ కేసును దాఖలు చేసింది. పుణే పోలీసులు భరద్వాజ్ను, ఆయన సోదరుడు వివేక్ను అరెస్ట్ చేశారు. -
క్రిప్టోతో చట్టవిరుద్ధ లావాదేవీలు
న్యూఢిల్లీ: బిట్కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీల్లో క్రయ, విక్రయాలను అనుమతిస్తే చట్టవిరుద్ధ లావాదేవీలను ప్రోత్సహించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు ఆర్బీఐ తెలిపింది. ఈ తరహా వర్చువల్ కరెన్సీల వినియోగాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ‘‘క్రిప్టో కరెన్సీలు ప్రభుత్వ ఆమోదం లేనివి. ఎన్క్రిప్షన్ టెక్నిక్లను ఉపయోగించి వీటిని స్వతంత్రంగా నిర్వహిస్తుంటారు. క్రిప్టో కరెన్సీల వ్యవహారాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి త్వరగా నిర్ణయం రావాల్సి ఉంది’’ అని ఆర్బీఐ తరఫు న్యాయవాది శ్యామ్దివాన్... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షతన గల ధర్మాసనానికి నివేదించారు. ఈ విషయంలో దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఆర్బీఐ, కేంద్రం అభ్యర్థన మేరకు స్పందించేందుకు గడువు ఇస్తూ... తుది విచారణను సెప్టెంబర్ 11న చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీలపై పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తమకు బదిలీ చేయాలని, ఇకపై ఈ విషయంలో ఏ పిటిషన్ను స్వీకరించొద్దని సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 17న అన్ని హైకోర్టులనూ ఆదేశించింది. -
క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఆర్బీఐ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో బిట్కాయిన్ విలువ ఒక్కసారిగా పతనమైంది. ఏకంగా రూ. 10 వేల మేర క్షీణించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాం కాయిన్గెకోడాట్కామ్లో ఒక దశలో బిట్కాయిన్ విలువ రూ. 4,58,105 నుంచి రూ. 4,47,998కి పడిపోయింది. క్రిప్టోకరెన్సీలను ఉపయోగించే సంస్థలు, ట్రేడర్లు, వ్యక్తులకు.. సదరు వర్చువల్ కరెన్సీపరమైన సర్వీసులను, వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ రిజర్వ్ బ్యాంక్ జూలై 6న సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు మూడు రోజుల గడువిచ్చింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాంలతో పాటు వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా ఇది శరాఘాతంగా మారింది. బ్యాంకింగ్ మార్గం మూసుకుపోవడంతో క్రిప్టోకరెన్సీపరమైన లావాదేవీలన్నీ తప్పనిసరిగా నగదు రూపంలోనే నిర్వహించాల్సి వస్తుందని.. అది కుదరకపోవచ్చు కనుక మొత్తానికి లావాదేవీలన్నీ నిల్చిపోయే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్బీఐ నిర్ణయం ఏకపక్షమైనదని, రాజ్యాంగవిరుద్ధమని వాదించింది. అయినప్పటికీ.. ఆర్బీఐ ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. -
బిట్కాయిన్లతో.. ఇంటర్నెట్కు ముప్పు: బీఐఎస్
జ్యూరిక్: బిట్కాయిన్ల వంటి డిజిటల్ కరెన్సీలతో ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) హెచ్చరించింది. వీటివల్ల స్టోరేజీతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాలపరమైన సమస్యలు తలెత్తుతాయని ఒక నివేదికలో పేర్కొంది. కంప్యూటర్స్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ డిజిటల్ కరెన్సీల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం స్మార్ట్ఫోన్స్, సాధారణ కంప్యూటర్స్తో పాటు సూపర్ కంప్యూటర్స్కి కూడా అలవి కాని పరిస్థితి తలెత్తుతుందని, ఫలితంగా మొత్తం సర్వర్ల వ్యవస్థ అంతా నిల్చిపోయే ముప్పు ఉందని బీఐఎస్ తెలిపింది. సార్వభౌమ కరెన్సీలకు భిన్నమైన ఈ కరెన్సీలు విశ్వసనీయమైనవి కావని పేర్కొంది. వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులన్నింటికీ సెంట్రల్ బ్యాంకుగా బీఐఎస్ను పరిగణిస్తారు. ప్రస్తుతం 1.7 కోట్ల బిట్కాయిన్లు చలామణీలో ఉన్నాయి. బిట్కాయిన్ల వ్యవస్థలో ఈ సంఖ్య 2.1 కోట్లకు మించడానికి లేదు. కొన్నేళ్ల క్రితం కేవలం కొన్ని సెంట్స్ స్థాయిలో ఉన్న బిట్కాయిన్ విలువ గతేడాది ఆఖర్లో ఏకంగా 19,500 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన వారిని కుబేరులుగా మార్చేసింది. భారత్ సహా పలు దేశాల్లో వీటిపై ఆంక్షలు ఉన్నాయి. -
రాజ్కుంద్రాకు ఊరట..?
సాక్షి ,న్యూఢిల్లీ : బిట్కాయిన్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఈ కేసులో ఊరట లభించేలా ఉంది. కేసులో తొలి చార్జ్షీట్ దాఖలైన క్రమంటో రాజ్కుంద్రాకు వ్యతిరేకంగా నిర్థిష్ట ఆధారాలు లభించలేదని విచారణాధికారి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మనీషా జెందే స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విడిగా విచారిస్తుందని చెప్పారు. కాగా రాజ్కుంద్రాకు గతంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేయడంతో ఇటీవల ఆయన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఈ స్కామ్కు సూత్రధారిగా భావిస్తున్న అమిత్ భరద్వాజ్తో కుంద్రాకు సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బిట్కాయిన్ ఎంటర్ప్రెన్యూర్ పేరిట అమిత్ భరద్వాజ్ 8 వేల మందిని సుమారు రూ. 2 వేల కోట్లకు మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అమిత్ భరద్వాజ్, అతని సోదరుడు వివేక్లను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బిట్కాయిన్ స్కామ్పై రాజ్కుంద్రా భార్య శిల్పాశెట్టి, హైప్రొఫైల్ సెలబ్రిటీలు సన్నీ లియోన్, ప్రాచీ దేశాయ్, ఆరతి ఛబ్రియా, సోనాల్ చౌహాన్, కరిష్మా తన్నా, జరీన్ ఖాన్,నేహా ధూపియా, హ్యూమా ఖురేషీ, నర్గీస్ ఫక్రీ తదితరులను కూడా ఈడీ ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే తొలి బ్లాక్చైన్ టెక్నాలజీ ఫోన్
-
ప్రపంచంలోనే అతి విధ్వంసకర ఫోన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్కు చెందిన సిరిన్ ల్యాబ్స్ విధ్వంసకర ఆవిషర్కరణకు తెర తీసింది. ప్రపంచంలోనే తొలి బ్లాక్చైన్ టెక్నాలజీ ఫిన్నే స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ అనుబంధంతో ఈ బ్లాక్చైన్ స్మార్ట్ఫోన్ను రూపొందిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ ద్వారా బిట్కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీ లావాదేవీలను అతి తక్కువ ఫీజుతో చేసుకోవచ్చని వెల్లడించింది. దీని ధన సుమారు 67,300 రూపాయలుగా ఉండనుంది. సిరిన్ ఫిన్నే స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.2 ఇంచెస్ డిస్ప్లే (18.9) స్నాప్డ్రాగన్ 845ఎస్ఓసీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు ఈ బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ఫోన్లో కోల్ట్ స్టోరేజ్ క్రిప్టో వాలెట్ను కూడా పొందుపర్చింది. తద్వారా ఆటోమేటిగ్గా డిజిటల్స్ టోకెన్స్గా మన మనీని కన్వర్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్ అసెట్స్ను ఆఫ్లైన్లో కూడా స్టోర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉందని సిరిన్ తెలిపింది. -
ఉబెర్ కో ఫౌండర్ సంచలన నిర్ణయం
న్యూయార్క్: ఒకవైపు బిట్కాయిన్పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన, పలురకాల నిషేధం కొనసాగుతోంటే ఉబెర్ కో ఫౌండర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీర్-టు-పీర్ రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్ నెట్వర్క్ సంస్థ ఉబెర్ సహ వ్యవస్థాపకుడు గ్యారెట్ క్యాంప్ త్వరలో కొత్త క్రిప్టోకరెన్సీని లాంచ్ చేయనునున్నారు. యాక్సిలరేటర్ ఫండ్ ఎక్స్పా ఫౌండర్ కూడా అయిన క్యాంప్ ‘ఎకో’ పేరుతో కొత్త బిట్కాయిన్ను అందుబాటులోకి తేనున్నారు. దీన్ని డిజిటల్ గ్లోబల్ కరెన్సీగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగ లావాదేవీలకు ఒక ప్రధాన పేమెంట్ సాధనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్యాంప్తో పాటు ఎక్స్పా అనుబంధంగా ఉన్న కొందరు భాగస్వాములు కూడా ఈ ప్రాజెక్ట్ ఆపరేటింగ్ బడ్జెట్లో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమకూర్చారు. టెక్ క్రంచ్ అందించిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా ఒక ట్రిలియన్ టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిలో సగం ధృవీకరించబడిన అకౌంట్లకు కేటయిస్తారు. మిగిలిన సగంలో 20శాతం విశ్వవిద్యాలయాలు నడుపుతున్న విశ్వసనీయ సంస్థలకు, 10శాతం అడ్వైజర్లకు, 10శాతం వ్యూహాత్మక భాగస్వాములకు కేటాయిస్తారు. ఇక మిగిలిన పది శాతాన్ని నెట్వర్క్ మేనేజ్మెంట్ నిర్వహణ, బాధ్యతలకోసం కొత్తగా ఏర్పాటయ్యే ఇకో ఫౌండేషన్కు కేటాయిస్తారు. 51శాతం సెక్యూరిటీ ఎటాక్స్ను, మోసాలను, ఇతర సమస్యలను తొలగిస్తుందనీ, ఎకోను ఎవరూ విచ్ఛినం చేయలేరని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో ఉండే కొన్ని ప్రధాన సమస్యల్ని అధిగమించాలని భారీ కసరత్తు చేస్తోంది. అదేవిధంగా తమ కొత్త బిట్కాయన్ ఎకోను మరింత యూజర్ ఫ్రెండ్లీ గా రూపొందించాలని భావిస్తోంది. ముఖ్యంగా టెక్నికల్ సామర్ధ్యంతో సంబంధం లేకుండా వెబ్, మొబైల్ యాప్ ప్లాట్ఫారంలలాగా వినియెగారులకు సులభంగా అందుబాటులో ఉండాలని యోచిస్తోంది. టోకెన్ జనరేషన్, ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ సందర్భంలోనూ మరింత శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటోంది. -
భారీగా బ్లాస్ట్ అయిన బిట్కాయిన్
బిట్కాయిన్ భారీగా బ్లాస్ట్ అయింది. నేడు ఏకంగా 20 శాతం మేర కిందకి పడిపోయింది. మూడు నెలల కాలంలో తొలిసారి 6,200 డాలర్ల మార్కు కిందకి వచ్చి చేరింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లలో క్రిప్టోకరెన్సీకి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో దీని విలువ భారీగా కుదేలవుతోంది. నవంబర్ మధ్య నుంచి తొలిసారి ఈ వర్చ్యువల్ కరెన్సీ 6,190 డాలర్లకు పడిపోయిందని బ్లూమ్బర్గ్ రిపోర్టు చేసింది. క్రిప్టోమార్కెట్కు పలు దేశాల నుంచి కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చైనా, రష్యా, దక్షిణ కొరియా లాంటి అతిపెద్ద మార్కెట్ల ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధిస్తున్నాయి. పేమెంట్ సిస్టమ్లో క్రిప్టోకరెన్సీలను వాడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ కూడా ప్రకటించింది. హ్యాకర్లు 530 మిలియన్ డాలర్లు వర్చ్యువల్ కరెన్సీని దొంగలించడంతో, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్పై జపాన్ అథారిటీలు రైడ్ కూడా చేశారు. రుణ భయాలతో పలు కమర్షియల్ లెండర్లు క్రెటిట్ కార్డుల ద్వారా బిట్కాయిన్లను కొనుగోలు చేయడాన్ని కస్టమర్లకు నిరాకరించాయి. యూరప్, జపాన్, అమెరికా సెంట్రల్ బ్యాంకులు కూడా బిట్కాయిన్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో బిట్కాయిన్ భారీగా కిందకి పడిపోతుంది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. -
‘బిట్కాయిన్’ కు బ్యాంకులు షాక్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తల్లో నిలిచిన క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ట్రేడర్లకు మరో షాక్ తగిలింది. దేశీయ టాప్ బ్యాంకులు ప్రధాన ఎక్స్చేంజీలలో బిట్కాయిన్ ఖాతాలను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. జెబ్ పే, యనోకాయిన్, కాయన్ సెక్యూర్, బీటీసీఎక్స్ ఇండియా తదితర టాప్ టెన్ ఎక్స్ఛేంజీలపై దృష్టిపెట్టాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా బిట్కాయిన్ ఖాతాలను నిలిపివేసిన సమాచారం తెలుస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అనుమానాస్పద లావాదేవీలు భారీగా జరిగాయన్న సందేహాల నేపథ్యంలో బ్యాంకులు సంబంధిత చర్యలకు దిగాయని పేర్కొంది. ఎక్స్చేంజీల ద్వారా నిర్వహిస్తున్న అనేక ఖాతాలను, లావాదేవీలను దేశంలోని అగ్ర బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ, యస్ బ్యాంక్తో సహా కొన్ని ఇతర టాప్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజీల ప్రమోటర్ల నుండి సంబంధిత వివరాలను కోరినట్టు కీలక వర్గాల సమాచారం. నగదు ఉపసంహరణలు నిలిపివేసిన కొన్ని ఖాతాల్లో ఇంకా లావాదేవీలు చోటుచేసుకోవడంతో గత నెలరోజులుగా 1:1 రేషియోతో సంబంధిత అదనపు సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపాయి. భారతదేశంలో టాప్ టెన్ ఎక్స్ఛేంజీల మొత్తం ఆదాయం సుమారు 40వేల కోట్ల రూపాయలు ఉండవచ్చునని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నాయి. అయితే ఈ నివేదికలపై బ్యాంకులు ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు బ్యాంకులనుంచి తమకు అలాంటి సమాచారమేమీలేదని, సంబంధిత చర్యల గురించి బ్యాంకులు లేదా ప్రమోటర్లు తమను సంప్రదించ లేదని యునికోయిన్ ప్రమోటర్ సాత్విక్ విశ్వనాథ్ చెప్పారు. కాగా బిట్కాయిన్ ట్రేడింగ్పై ఆదాయపన్ను శాఖ ఇప్పటికే స్పందించింది. పన్నులు చెల్లించాల్సింది వేలమందికి నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
భారీగా పతనమైన బిట్కాయిన్
బిట్కాయిన్ అసలు వ్యవహారం ఇప్పుడిప్పుడే బట్టబయలవుతోంది. రాకెట్ వేగంతో దూసుకుపోయిన బిట్కాయిన్ విలువ వరుసగా కొన్ని వారాల నుంచి నేల చూపులు చూస్తోంది. బుధవారం ట్రేడింగ్లో ఏకంగా 12 శాతం పతనమై, 10వేల డాలర్ల కిందకి పడిపోయింది. డిసెంబర్ నుంచి 10వేల డాలర్లకు కింద ట్రేడవడం, ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్లో ఇది 19,800 డాలర్లగా నమోదైన సంగతి తెలిసిందే. నెల వ్యవధిలో దాదాపు 50 శాతం మేర అంటే ఏకంగా10వేల డాలర్ల విలువ పతనమైంది. బిట్కాయిన్తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా దారుణంగా పడిపోతున్నట్టు తెలిసింది. కాయిన్డెస్క్ న్యూస్ సైట్ ధరల ఇండెక్స్ ప్రకారం ఒక్క బిట్ కాయిన్ విలువ నేడు 9,958 డాలర్లుగా నమోదైంది. దక్షిణ కొరియా, చైనాలాంటి దేశాలు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ను నిషేధిస్తాయన్న వార్తల నేపథ్యంలో వీటి విలువలు పడిపోతున్నట్టు వెల్లడైంది. దొరికినకాడికి అమ్ముకొని బయటపడదామని అందరూ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో దక్షిణ కొరియా ఒకటి. దక్షిణ కొరియానే వీటి ట్రేడింగ్ను నిషేధించడం బిట్కాయిన్ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు రేపుతోంది. క్రిప్టోకరెన్సీలపై వివిధ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత పతమవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చర్యలు కూడా ఊపందుకుంటున్నాయి. గతేడాది బిట్కాయిన్ ఏకంగా 2000 శాతం పెరిగిన విషయం తెలిసిందే. -
జియోకు సొంత క్రిప్టోకరెన్సీ?
న్యూఢిల్లీ: బిట్కాయిన్, ఎథీరియం, రిపుల్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో బడా కంపెనీలు వర్చువల్ కరెన్సీ విభాగంలోకి దిగుతున్నాయి. తమ కస్టమర్ల కోసం బిట్కాయిన్లాంటి సొంత కరెన్సీని రూపొందించే పనిలో పడ్డాయి. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చౌక టారిఫ్లతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... ప్రస్తుతం జియోకాయిన్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. జియోకాయిన్ ప్రాజెక్టుకు స్వయంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ సారథ్యం వహిస్తుండటం గమనార్హం. కాంట్రాక్టులు, సరఫరా మొదలైన కార్యకలాపాల నిర్వహణ కోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారిత అప్లికేషన్స్ను రూపొందించడం జియోకాయిన్ ప్రాజెక్టు లక్ష్యం. పనిలో పనిగా బ్లాక్చెయిన్ ఆధారిత జియోకాయిన్లను కూడా రూపొందించడంపై ఇది దృష్టి పెట్టనుంది. ఇందుకోసం ఆకాశ్ అంబానీ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం సగటు పాతికేళ్ల వయసున్న యాభై మంది నిపుణులను తీసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. వీరంతా ఆకాశ్ అంబానీ సారథ్యంలో వివిధ బ్లాక్చెయిన్ సాధనాలపై పనిచేస్తారు. బ్యాంకులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెండు వర్గాలు తక్కువ వ్యయాలతో ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ బ్లాక్ చెయిన్ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. ఆర్థికపరమైన చెల్లింపులకు సంబంధించి బిట్కాయిన్ మొదలైన కరెన్సీలన్నీ ఇదే ప్రాతిపదికన రూపొందినవే. ఇదే కోవలో తమ కస్టమర్లకు లాయల్టీ పాయింట్స్ లాంటివి జియోకాయిన్ల రూపంలో అందించే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఐవోటీలోకి కూడా జియో...: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) విభాగంలోకి కూడా ప్రవేశించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. ఇందుకు కూడా బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. స్మార్ట్ఫోన్లు, వేరబుల్ డివైజ్లు, గృహోపకరణాలు మొదలైన వాటన్నింటినీ ఒక నెట్వర్క్ కింద ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసే టెక్నాలజీని ఐవోటీగా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో ఇవన్నీ పరస్పరం డేటాను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సందర్భానుసారంగా స్పందిస్తుంటాయి. ఐవోటీలో ఉండే భద్రతాపరమైన రిస్కులకు చెక్ చెప్పేందుకు కూడా బ్లాక్చెయిన్ ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఓవెపు కంపెనీలు కూడా సొంతంగా క్రిప్టోకరెన్సీలను రూపొందించుకోవడంలో నిమగ్నమవుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం వర్చువల్ కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఫొటోగ్రాఫర్లకు కొడాక్ కాయిన్.. ఫొటోగ్రాఫర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ కూడా బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారిత సాధనాలపై పనిచేస్తోంది. ఫోటో గ్రాఫర్లు తమ వర్క్ కాపీరైట్ చౌర్యానికి గురికాకుండా.. రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక బ్లాక్చెయిన్ ఎక్సే్చంజీని రూపొందిస్తోంది. సదరు వర్క్ను ఉపయోగించుకోదల్చుకునే వారు సురక్షితంగా క్రిప్టోకరెన్సీ కొడాక్ కాయిన్ల రూపంలో చెల్లింపులు జరిపేలా ఈ మాధ్యమాన్ని తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం వెన్ డిజిటల్ అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. సొంత క్రిప్టోకరెన్సీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఐపీవో తరహాలో ఈ నెలాఖర్లో ఐసీవో (ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్) కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
చివరకు కన్నీళ్లే!
న్యూయార్క్: ఇన్వెస్ట్మెంట్ గురు.. వారెన్ బఫెట్ బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ లు చివరకు కన్నీళ్లే మిగులుస్తాయని వ్యాఖ్యానించారు. బిట్కాయిన్ ఒక జోక్ అని 2014లోనే ఆయన పేర్కొనడం విశేషం. అప్పటి నుంచి ఇప్పటిదాకా బిట్కాయిన్ వేల రెట్లు పెరిగినప్పటికీ, ఆయన తన దృక్పథాన్ని మార్చుకోలేదు. తనకు కొద్దో, గొప్పో తెలిసిన విషయాలపైనే ఎంతో కొంత గందరగోళానికి గురవుతున్నానని, ఏమీ తెలియని బిట్కాయిన్లో పెట్టుబడి ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీల పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న తరుణంలో బఫెట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
భారీగా పడిపోయిన బిట్కాయిన్
లండన్/టోక్యో : షేర్ మార్కెట్ను తలదన్నుతూ లాభాల్లో దూసుకువెళుతున్న బిట్ కాయిన్... మార్కెట్లను షేక్ చేస్తోంది. గతవారం అత్యధికంగా 20వేల డాలర్లకు అంటే 12లక్షల 80వేలకు చేరిన ఈ కరెన్సీ... ఒక్కసారిగా ఢమాలమని పడిపోయింది. కేవలం ఐదు రోజుల్లోనే మూడో వంతు తన విలువను కోల్పోయిన బిట్కాయిన్, లక్సెంబర్గ్ ఆధారిత బిట్స్టాంప్ ఎక్స్చేంజ్లో 13వేల డాలర్లుగా నమోదైంది. అంటే రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్యలో ట్రేడైంది. ఒకేసారి 20వేల డాలర్ల నుంచి 13వేల డాలర్లకు పడిపోవడంతో, 2013 నుంచి ఇదే అతి చెత్త వారంగా రికార్డైంది. ప్రతి రోజూ కొద్ది కొద్దిగా పడిపోతూ వస్తున్న బిట్ కాయిన్, శుక్రవారం దాని నష్టాలు మరింత పెరిగాయి. 12,560 డాలర్ల కనిష్ట స్థాయిలకు కూడా ఇది పడిపోయింది. ఒక్క రోజులోనే సుమారు 20 శాతం తన విలువను కోల్పోవడం గమనార్హం. వర్చ్యువల్ రూపంలో ఉండే బిట్ కాయిన్ పై.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇండియాలో ఇంకా ఈ కరెన్సీని అధికారికంగా గుర్తించలేదు. చాలా దేశాలు, మార్కెట్ నిపుణులు బిట్కాయిన్పై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇది అంత సేఫ్ కాదంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే క్రిస్మస్, న్యూఇయర్ పండుగలు రావటంతో చాలామంది బిట్ కాయిన్ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగినట్టు విశ్లేషకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో విక్రయాలకు పాల్పడటంతో ధర పడిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు బిట్ కాయిన్ లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సెబీ కూడా హెచ్చరిస్తోంది. బిట్ కాయిన్పై హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలోనే ఈ విలువ ఒక్కసారిగా భారీగా పడిపోయింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. -
మెగాస్టార్ సంపద ఎంత పెరిగిందంటే..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ పెట్టుబడుల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ పెట్టుబడుల ద్వారా ఆర్జనలో కూడా బిగ్ బి అనిపించుకున్నారు. అటు నటలోనూ, ఇటు సంపదని నిర్మించుకోవడంలోనూ మెగాస్టార్గా నిలిచారు. బిగ్ బి కుటుంబానికి చెందిన షేర్ల పెట్టుబడి విలువ రెండున్నర సంవత్సరాలలో భారీ పెరుగుదలను నమోదు చేసింది. రెండు సంవత్సరాల క్రితం 250,000 డాలర్లుగా ఉన్న సంపద కాస్తా ఇపుడు 17.5 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరైజ్డ్ రెమిటన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా విదేశీ కంపెనీలో తొలి ముఖ్యమైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు. తండ్రి-కొడుకు ద్వయం, (అమితాబ్,అభిషేక్)లు మెరీడియన్ టెక్ పిటీ లిమిటెడ్ 250,000డాలర్ల (దాదాపు రూ. 1.57 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఈ స్టాక్ బాగా పుంజుకోవడంతో సంపద 17.5మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.113కోట్లకు) చేరింది. అమితాబ్ ఖాతా ద్వారా 150,000 డాలర్లు, అమితాబ్ , అభిషేక్ల జాయింట్ అకౌంట్ ద్వారా లక్ష డాలర్ల పెట్టుబడులున్నాయని మెరిడియన్ టెక్ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట శ్రీనివాస్ మీనావల్లి ప్రకటించారు. అయితే మెరిడియన్ టెక్ అంత పాపులర్ స్టాక్ కాదు. ఇటీవల మెరీడియన్కు చెందిన జిద్దు.కామ్ను మరో విదేశీ సంస్థ లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు చేసింది. అమెరికన్ స్టాక్మార్కెట్ నాస్డాక్లో లిస్ట్ అయిన రెండు రోజుల తర్వాత ఈ స్టాక్ అనూహ్యంగా లాభపడింది. దీంతో లాంగ్ ఫిన్ కార్ప్ లో బిగ్ బి కుటుంబం షేర్ విలువ అమాంతం పెరిగింది. కాగా 2017, డిసెంబరు లో జిడ్డు.కామ్ బ్లాక్ చైన్ లేదా క్రిప్టోకరెన్సీ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్ ప్రొవైడర్గా స్వయంగా ప్రకటించుకుంది. అంటే క్రిప్టోకరెన్సీ ద్వారా వివిధ ఖండాల్లో సూక్ష్మ రుణాలను అందిస్తుంది. కాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రిప్టోకరెన్సీ మానియా నేపథ్యంలో లాంగ్ఫిన్ స్టాక్ వెయ్యి శాతం కంటే ఎక్కువ లాభపడింది. -
బిట్కాయిన్ ఎక్స్చేంజీల్లో ఐటీ తనిఖీలు
న్యూఢిల్లీ: దేశీ బిట్కాయిన్ ఎక్సేంజీల్లో ఆదాయపన్ను శాఖ బుధవారం ఆకస్మిక తనిఖీలకు దిగింది. అధికార బృందాలు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బిట్కాయిన్ ఎక్స్చేంజి లలో విచారణ నిర్వహించగా, అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐ) జరిపిన లక్షలాది లావాదేవీల సమాచారం వెలుగు చూసింది. బిట్కాయిన్లో ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేతకు సంబంధించి వివరాలు ఆరాతీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బెంగళూరు విభాగం పర్యవేక్షణలో పలు దర్యాప్తు బృందాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, గురుగ్రామ్, ఘజియాబాద్, పుణె తదితర ప్రాంతాల్లోని 9 ప్రధానఎక్స్చేంజి లకు బుధవారం ఉదయం వెళ్లాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 133ఏ కింద ఇన్వెస్టర్లు, ట్రేడర్ల గుర్తింపు వివరాలు, లావాదేవీలు, బ్యాంకు ఖాతాల సమాచారం, ఇతర ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎక్స్చేంజి లకు సంబంధించిన అన్ని ఆర్థిక వివరాలు, డేటాను కూడా సేకరించాయి. ప్రాథమిక సమాచారం మేరకు 20–25 లక్షల వరకు హెచ్ఎన్ఐల సమాచారం లభ్యమైంది. వీటిలో 8–10 లక్షల సంస్థలు లావాదేవీల పరంగా చురుగ్గా ఉన్నట్టు తెలిసింది. -
బిట్కాయిన్పై ఐటీ ఫస్ట్ బిగ్ యాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: సంచలన వర్చ్యువల్ కరెన్సీ బిట్కాయిన్ వ్యవహారంలో దేశంలో తొలిసారి ఐటీ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బిట్కాయన్ ఎక్సేంజ్లపై ఆదాయ పన్ను శాఖ సర్వే నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దాదాపు తొమ్మిది ప్రధాన ఎక్సేంజీల కార్యాలయాలను అధికారులు సందర్శించారు. బెంగళూరుకు చెందిన ఐటీ విభాగం అదికార బృందాలు ఢిల్లీ, బెంగళూరు, ఘజియాబాద్, పునే, హైదరాబాద్, కొచ్చి, గురుగ్రావ్లోని ఎక్సేంజ్లలో బుధవారం తొలి ఉదయం నుంచి ఈ సర్వే చేపట్టారు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 133 ఎ ప్రకారం, పెట్టుబడిదారుల, వ్యాపారుల గుర్తింపు, తీసుకున్న లావాదేవీలు, కౌంటర్పార్టీల గుర్తింపు, సంబంధిత బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం లాంటి ఇతర సమాచారాన్ని సేకరించాయి. కాగా స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్లలో "డిజిటల్ వాలెట్" రూపంలోదాచుకునే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్. భారీ ర్యాలీతో ఈ బిట్కాయిన్ ఇటీవలి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2009లో తొలిసారి దీన్ని సృష్టించగా తాజాగా ఇది 20వేల డాలర్ల మార్క్ దిశగా పరుగులుపెడుతోంది. దీంతొ బిట్కాయిన్ బబుల్పై వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ట్రేడర్లను, వర్చువల్ కరెన్సీల వ్యాపారులను హెచ్చరించింది. మరోవైపు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కరెన్సీ ప్రభావం పై అంచనా, సూచనల కోసం మార్చిలో ఇంటర్ డిసిప్లినరీ కమిటీని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. -
భారతీయులకు ‘ఇండికాయిన్’!?
న్యూఢిల్లీ: ఎవరో సృష్టించిన బిట్కాయిన్ కంటే మనకంటూ సొంతంగా ఓ క్రిప్టోకరెన్సీ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి... ఈ ఆలోచనను ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా వ్యక్తం చేశారు. 200 బిలియన్ డాలర్ల భారీ మార్కెట్ విలువతో ఉన్న క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం కంటే స్వయంగా మనకంటూ క్రిప్టోకరెన్సీని సృష్టించుకోవచ్చుగా అన్నది షా అభిప్రాయం. బిట్కాయిన్పై ప్రస్తుతం ఎంతో ఆసక్తి మన దగ్గరే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది ప్రముఖ విశ్లేషకులు సైతం ఇది ఇంకా భారీగా పెరుగుతుందని అంచనా వేస్తుంటే, పగిలేందుకు సిద్ధంగా ఉన్న బుడగ ఇదన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. అయితే, భారతీయులు సొంతంగా ‘ఇండికాయిన్’ను అభివృద్ధి చేసుకుంటే బిట్కాయిన్ గతంలోకి వెళ్లిపోతుందని నీలేష్ షా అన్నారు. ఇదే కనుక సాకారమైతే బిట్కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఇండికాయిన్ సునాయాసంగా దాటిపోతుందని అభిప్రాయపడ్డారు. విదేశీయులనూ ఆకర్షించొచ్చు... ‘‘బిట్కాయిన్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. నా సూచన ఏమిటంటే 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన క్రిప్టో కరెన్సీలోకి ప్రవేశించడం కంటే మనం సొంతంగా ‘ఇండికాయిన్’ను ఎందుకు ఆవిష్కరించుకోరాదు. బిట్కాయిన్ను పోలిన ప్రోగ్రామ్ను ఇండికాయిన్ కోసం అభివృద్ధి చేయగల కంప్యూటేషనల్ నైపుణ్యాలు మనకున్నాయి. 40 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. మన మధ్య వృత్తాకార ట్రేడింగ్ను సృష్టించుకోగలం. అంతేకాదు విదేశీయులను సైతం ఇండికాయిన్లో పాల్గొనేలా ఆకర్షించొచ్చు. ఒక్కో ఇండికాయిన్ను 20,000 డాలర్లకు తీసుకెళ్లడం ద్వారా 500 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సృష్టించగలం. దీంతో విదేశీయుల చేతిలో ఇండికాయిన్లు, మన దగ్గర వారి డాలర్లు ఉంటాయి’’ అని షా పేర్కొన్నారు. ఒక్క నెలలో మూడింతలు: బిట్కాయిన్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి వెర్రితలలు వేస్తోంది. ఇందుకు నిదర్శనం ఈ క్రిప్టోకరెన్సీ ఒక్క నెలలో మూడు రెట్లు పెరగడమే. చికాగోకు చెందిన డెరివేటివ్ ఎక్సే్చంజ్ సీబోయె తాజాగా బిట్కాయిన్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ఆదివారం నుంచి ప్రారంభించగా, ఒక్కరోజే 20 శాతం వరకు పెరిగిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ ధర 17,000 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది. ఆర్బీఐ హెచ్చరికలు: దేశీయంగా బిట్కాయిన్లపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేసింది. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆర్థిక, నిర్వహణ, చట్టబద్ధమైన, రక్షణకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికింది. బిట్కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల సృష్టి, వాటిని చెల్లింపులకు మాధ్యమంగా వాడుకోవడాన్ని ఏ కేంద్ర బ్యాంకు కూడా ఆమోదించలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. బిట్కాయిన్ అన్నది ఓ బుడగ వంటిదని టెంపుల్టన్ ఈఎం గ్రూపు మార్క్మోబియన్ ఇటీవలే ప్రకటించారు కూడా. త్వరలోనే ‘ఆయిల్కాయిన్’ బిట్కాయిన్లు, క్రిప్టోకరెన్సీల ర్యాలీ ఒకవైపు నడుస్తుంటే... మరోవైపు అమెరికా సర్కారు సైతం ఓ క్రిప్టో కరెన్సీకి ప్రణాళిక రచించింది. నియంత్రణలతో కూడిన డిజిటల్ కరెన్సీ ఆయిల్ కాయిన్లను ప్రవేశపెడుతోంది. వీటికి ధ్రువీకరించిన చమురు ఆస్తులు హామీగా ఉండనున్నాయి. వచ్చే జనవరిలోనే తొలి టోకెన్ విక్రయం జరగనుంది. ఆయిల్కాయిన్ను కొనుగోలు చేయదలిచిన వారు చట్టబద్ధమైన కరెన్సీతో మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ ధర, చట్టబద్ధమైన కరెన్సీలో ఎంతుండాలన్నది అమెరికా అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఆయిల్కాయిన్లకు అమెరికా ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇవి ఎలా పనిచేస్తాయంటే...? ఆయిల్కాయిన్లు టోకెన్ల మాదిరిగా పనిచేస్తాయి. ప్రతీ ఆయిల్కాయిన్ ఒక బ్యారెల్ చమురు విలువకు ప్రతిరూపంగా ఉంటుంది. చలామణిలోకి విడుదల చేసిన ఆయిల్కాయిన్ల విలువ అమెరికాలో అన్ని రకాల చమురు ఆస్తుల విలువకు సమాన స్థాయిలో ఉంటుంది. ఈ డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్న వారు దాన్ని ఆయిల్ బ్యారెల్స్, ఆయిల్కు సంబంధించిన ఆస్తులతోనే మార్చుకోగలరని దీనిపై రూపొందించిన నివేదిక పత్రాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ క్రూడ్ మార్కెట్లో పెరిగే డిమాండ్ను తట్టుకునేందుకే ఆయిల్కాయిన్ల వెనుక ఉద్దేశ్యమని తెలుస్తోంది. బిట్కాయిన్ లాభం చెప్పకుంటే 50% పెనాల్టీ! బిట్కాయిన్ రోజుకో కొత్త శిఖరానికి చేరుతూ రికార్డులను తిరగరాస్తున్న నేపథ్యంలో ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్జించే సంపాదనపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే పన్ను విధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాదిలో 1,400% వరకు పెరిగిన ఈ క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోనికి తెచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. బిట్కాయిన్ లావాదేవీల పర్యవేక్షణ, స్వల్పకాలిక లాభాలను ఆర్జించిన వారిపై 30% పన్ను వేయడం లాంటి అంశాలతో పాటు, ఈ తరహా ఆర్జనను వెల్లడించని వారిపై ఏకంగా 50% పన్ను, జరిమానాను సైతం విధించాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేసి తుది నివేదికను అందించేందుకు ఆర్బీఐ, ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనుంది. క్రిప్టోకరెన్సీ ద్వారా జరిగే మనీల్యాండరింగ్ చర్యలకు అడ్డుకట్టవేయడం, ఇతర దేశాలలో ఈ కరెన్సీపై అమలవుతున్న మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కరెన్సీ ద్వారా ఆర్జిస్తున్న సంపాదనపై పన్ను విధించేందుకు మరో కమిటీని నియమించనుందని తెలుస్తోంది. ఈ కరెన్సీ ద్వారా ఆర్జించిన మొత్తంపై షార్ట్–టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను 30% ఉంటుందని వెల్లడయ్యింది. -
బిట్కాయిన్ ‘ఫ్యూచర్స్’ షురూ..
చికాగో: ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా, బిట్కాయిన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్సే్చంజ్(సీబీఓఈ)లో బిట్కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రేడింగ్ మొదటిరోజే ఫ్యూచర్స్ మార్కెట్లో బిట్కాయిన్ 26 శాతం ఎగిసింది. వాల్యూమ్స్ డీలర్లను అంచనాలను మించడంతో ట్రేడింగ్ను రెండుసార్లు నిలిపేశారు. 15,000 డాలర్ల ధర వద్ద ప్రారంభమైన బిట్కాయిన్ జనవరి ఎక్స్పైరీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ అరంభంలోనే 20 శాతం లాభంతో 18,040 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి, మార్చి ఎక్స్పైరీ కాంట్రాక్టులు 19 వేల డాలర్లకు కూడా చేరాయి. బిట్కాయిన్ ధర 10 శాతం పెరగగానే రెండు నిమిషాల పాటు ట్రేడింగ్ను నిలిపేశారు. మరో 10 శాతం పెరగ్గానే ఐదు నిమిషాల పాటు ట్రేడింగ్ను ఆపేశారు. త్వరలో సీఎంఈ గ్రూప్, నాస్డాక్ ప్యూచర్లలో కూడా బిట్కాయిన్ ట్రేడింగ్ మొదలు కానున్నది. బిట్కాయిన్ స్పాట్ ధరలు కూడా పెరిగాయి. 5 శాతం లాభంతో 16,402 డాలర్లకు పెరిగింది. -
ఇది సగం ర్యాలీయే!
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ బుల్ ర్యాలీ సగంలో ఉందని, ఇది మరో రెండేళ్లు కొనసాగుతుందని టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్ అంచనా వేశారు. ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, కమోడిటీలు... ఈ రెండు అంశాలు మార్కెట్కు రిస్క్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే... మరో రెండేళ్లు బుల్ మార్కెట్టే... ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ బుల్ ర్యాలీ సగం గడిచింది. మరో సగం ముందుంది. మరో రెండేళ్లు అంటే 2019 వరకూ ఈ బుల్ ర్యాలీ కొనసాగుతుంది. జీఎస్టీ ప్రభావంతో రానున్న కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో మోదీ ప్రభ మసకబారినా, మోదీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చినా, మార్కెట్ ర్యాలీకి ఎలాంటి ఢోకా ఉండదని నా అభిప్రాయం. ఎన్నాళ్లగానో ఎదురు చూసిన సంస్కరణలు ఇప్పుడే సాకారమవుతున్నాయి. వీటి కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా, వాటిని పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోంది. దీనికి తోడు భారతీయుల ఆదాయం పెరుగుతోంది. పొదుపు సైతం పెరుగుతోంది. అందుకే ఈ మధ్య ఈక్విటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. ఈ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని నా ఉద్దేశం. ఇది శుభసూచకం కూడా. అయితే అమెరికా ఎప్పుడైనా ఉత్తర కొరియా కవ్వింపులకు దీటుగా జవాబివ్వవచ్చు.. కొరియా క్షిపణులను ఎప్పుడైనా అమెరికా సైన్యం కూల్చేయవచ్చు. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుంది. భారత్పై మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థికాంశాల కారణంగా భారత వృద్ధి జోరు పెరిగే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కూడా భారత మార్కెట్పై మరింతగా పెరగనుంది. పెరుగుతున్న కమోడిటీల ధరలు మాత్రం భారత్పై బాగానే ప్రభావం చూపుతాయి. భారత్లో ఉన్న సానుకూలాంశాల కారణంగా మా పోర్ట్ఫోలియోలో చైనా తర్వాతి స్థానం భారత్దే. ప్రభుత్వ బ్యాంక్ల షేర్లు ఆకర్షణీయం...! ప్రభుత్వ రంగ బ్యాంక్లకు మూలధన నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ బ్యాంక్లకు సానుకూలమైన అంశం. అందుకని ఇన్వెస్ట్మెంట్కు ఈ షేర్లను ఎంచుకోవడం మంచి నిర్ణయం. టెలికంకు డేటా కిక్..: టెలికం షేర్ల భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. రానున్న కాలంలో వివిధ రంగాల్లో డేటా వినియోగం ఊపందుకుంటుంది కనక అది టెలికం కంపెనీలకు కలసివస్తుంది. దాదాపు ప్రతి రంగంలో డేటా వినియోగం జోరు పెరగనుంది. దీనివల్ల మరో మూడేళ్ల వరకూ ఈ రంగం జోరు కొనసాగుతుంది. గతంలో రిలయన్స్ కంపెనీ ఫైబర్ కోసం గుంతలు తవ్వినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలయన్స్ టెలికం రంగంలోకి ప్రవేశిస్తే, అది ఆ కంపెనీకి దీర్ఘకాలంలో మంచి సానుకూలాంశం అవుతుందని అప్పుడే అంచనా వేశా. ఆ ఫలితాలు మనమిప్పుడు చూస్తున్నాం. బిట్ కాయిన్ జోరు బుడగే..! ప్రస్తుత బిట్కాయిన్ జోరు వాపే కానీ, బలుపు కాదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ బిట్కాయిన్ మోజులో ఉన్నారు. ఈ క్రేజ్లో బిట్కాయిన్ ధర అమాంతం పెరిగిపోతోంది, ఈ బుడగ ఎప్పుడో ఒకప్పుడు పగులుతుంది. ప్రస్తుత తరం ఇంటర్నెట్లో పుట్టి, ఇంటర్నెట్లోనే జీవిస్తోంది కనక వారికి ఇంటర్నెట్ ఆధారిత బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలంటే మోజు ఉండడం సహజమే. అందుకే ఇంటర్నెట్ ద్వారా దీని విలువ వేగంగా పెరిగిపోతోంది. బుల్ మార్కెట్ అయినా, బబుల్ అయినా చివరి దశలో ఒక యుఫోరియా ఏర్పడుతుంది. ప్రస్తుతం బిట్కాయిన్కు అలాంటి యుఫోరియానే ఏర్పడింది. పెద్ద పెద్ద సంస్థలు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే.. ధరలు హేతుబద్ధం అవుతాయి. ఈ బుడగ పేలిపోతుంది. -
బిట్కాయిన్ బబుల్ పేలింది
పరుగులు మీద పరుగులుపెడుతూ దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ బబుల్ బ్లాస్ట్ అయింది. నిపుణులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల హెచ్చరికలకు అనుగుణంగానే సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసిన అనంతరం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆసియన్ ట్రేడింగ్లో శుక్రవారం రూ.19వేల డాలర్ల వద్ద ఆల్ టైం హైని తాకింది. వెంటనే 12శాతానికి పైగా నష్టపోయింది. భారీ కొనుగోళ్లతో రూ.19వేల డాలర్లను అధిగమించిన తరువాత రూ.15వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల భారీగా పుంజుకున్న వార్తల్లో నిలిచిన బిట్కాయిన్ ఈ వారంలో 30శాతానికి ర్యాలీ అయింది. కాగా క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఈ అనూహ్య ర్యాలీపై పలువురు మార్కెట్ నిపుణులు, ట్రేడ్ పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిట్ కాయిన్ ట్రేడింగ్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హెచ్చరించింది. సాఫ్ట్వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదని, దీంతో ఇన్వెస్టర్లు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని లేదంటే భారీ నష్టం తప్పదని తెలిపింది. -
బిట్కాయిన్@ 16,000 డాలర్లు
లండన్: క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఇది కీలకమైన 15,000 డాలర్ల స్థాయిని దాటేసింది. గురువారం ఒక దశలో 16వేల డాలర్ల పైన ట్రేడయింది. దీంతో ’బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్న’ బిట్కాయిన్ ఇతర ప్రధాన మార్కెట్లకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం వ్యవధిలోనే 50 శాతం పెరిగి 12,000 డాలర్ల స్థాయిని తాకిన బిట్కాయిన్ అంతలోనే మళ్లీ 16,000 డాలర్లకు ర్యాలీ చేయడం గమనార్హం. ‘ఊహించడానికి సాధ్యంకానంత స్థాయిలో కొత్త ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీని పోగు చేసుకుంటున్నారు. దీంతో బిట్కాయిన్ ప్రస్తుతం బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది‘ అని ఆస్ట్రేలియాకి చెందిన ఏఎస్ఆర్ వెల్త్ సంస్థ సలహాదారు షేన్ చానెల్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విపరీతమైన ఉత్సుకత కాస్త తగ్గితే.. కచ్చితంగా బిట్కాయిన్ విలువ కరెక్షన్కి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్టీసీ)... ఇటీవలే ప్రధాన ఎక్సే్ఛంజీల్లో బిట్కాయిన్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్కి అనుమతించింది. ఇది ఈ కరెన్సీకి మరింతగా ఊతమిచ్చిందని అంచనా. సీబీవోఈ ఫ్యూచర్స్ ఎక్సే్ఛంజీలో ఈ వారాంతం నుంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యూచర్స్ మార్కెట్ షికాగో మర్కంటైల్ ఎక్సే్ఛంజ్లో (సీఎంఈ) డిసెంబర్ 18 నుంచి బిట్కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది. హ్యాకింగ్పై నైస్ హ్యాష్ విచారణ.. దాదాపు 64 మిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 4,700 బిట్కాయిన్లు హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైన ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్లొవేనియాకి చెందిన బిట్కాయిన్ ఎక్సే్ఛంజ్ నైస్ హ్యాష్ వెల్లడించింది. గురువారం ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది. 2009లో తెరపైకి వచ్చిన బిట్కాయిన్ విలువ ఈ ఏడాది తొలినాళ్లలో (జనవరిలో) 752 డాలర్లుగా ఉండేది. నాటకీయ ఫక్కీలో ఇటీవలి కాలంలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాఫ్ట్వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదు. ఈ కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలంటూ దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు చేస్తూనే ఉంది. -
బిట్కాయిన్ @12వేల డాలర్లు
ఒకవైపు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్పై అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు బిట్ కాయిన్ శరవేగంగా పరుగులు పెడుతోంది. తాజాగా మరో ఆల్టైం హైని టచ్ చేసింది. ఇటీవల పదివేల డాలర్ల మార్క్ను టచ్ చేసిన బిట్కాయిన్ మరో గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాదిలో బిట్కాయిన్ భారీ ర్యాలీతో మార్కెట్లను షేక్ చేస్తోంది. వరుస రికార్డు స్థాయియిలను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ ఆన్లైన్ మనీ తొలిసారిగా 12వేల డాలర్ల మైలురాయిని దాటింది. భారీ లాభాలనునమోదు చేస్తున్న బిట్కాయిన్ 12వేల డాలర్ల స్థాయిని తాకిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే బిట్కాయిన్ ట్రేడింగ్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారు. అటు మరో ఏడాదిన్నరలో బిట్కాయిన్ ధర 50వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు చేరుతుందని ఫోరేట్రస్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మాజీ ఫండ్ మేనేజర్ నోవోగ్రాట్జ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. కాగా బిట్కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీలు చాలా రిస్కుతో కూడుకున్న నేపథ్యంలో వీటి ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూజర్లు, ట్రేడర్లను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. బిట్కాయిన్ లేదా ఇతర వర్చువల్ కరెన్సీల (వీసీ) నిర్వహణ, చలామణీకి సంబంధించి ఏ కంపెనీకి కూడా లైసెన్సులు ఇవ్వలేదని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బిట్కాయిన్ ముందు దిగదుడుపే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది బిట్కాయిన్ విరామం ఎరుగకుండా పరుగులు తీస్తుండడంతో దీని మార్కెట్ విలువ భారీ స్థాయికి చేరింది. దేశీ ఆర్థిక వ్యవస్థలను మించిపోతోంది. సోమవారం ట్రేడింగ్లో బిట్ కాయిన్ విలువ 11,000 డాలర్లు దాటేసి ఇంకా ముందుకెళ్లింది. ఈ ఏడాది దీని పెరుగుదల ఇప్పటికే 1000 శాతాన్ని మించిపోయింది. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని బిట్ కాయిన్ల విలువ (మార్కెట్ క్యాప్) 190 బిలియన్ డాలర్లు. ఇప్పటికే ఇది పలు రికార్డులను తిరగరాసేసింది. న్యూజిలాండ్ జీడీపీ కన్నా ఎక్కువే... దక్షిణ పసిఫిక్ దేశం వ్యవసాయం, పర్యాటక రంగాలపై ఆధారపడిన న్యూజిలాండ్ జీడీపీ విలువ 185 బిలియన్ డాలర్లు. ఈ దేశ జీడీపీ కంటే బిట్కాయిన్ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లు ఎక్కువ. అలా గే, ఖతర్, కువైట్, హంగరీ దేశాలూ జీడీపీ విలువ విషయంలో బిట్కాయిన్ కంటే వెనక్కు వచ్చేశాయి. గోల్డ్మ్యాన్ శాక్స్, యూబీఎస్.. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన బ్యాంకులు గోల్డ్మ్యాన్ శాక్స్, యూబీఎస్ల కంటే బిట్కాయిన్ విలువే ఎక్కువ. గోల్డ్మ్యాన్ శాక్స్ గ్రూపు మార్కెట్ విలువ 97 బిలియన్ డాలర్లుగా ఉండగా, యూబీఎస్ గ్రూపు ఏజీ మార్కెట్ విలువ 67 బిలియన్ డాలర్లు. ఈ రెండు బ్యాంకుల మార్కెట్ విలువ కలిపి చూసినా బిట్కాయిన్ కంటే తక్కువే. ఈ డిజిటల్ కరెన్సీ విషయంలో ఆర్థిక సంస్థలు ఒకింత అప్రమత్తంగానే ఉన్నాయి. బిట్కాయిన్ వ్యూహాన్ని రూపొందించడం చాలా తొందరపాటు అవుతుందని గోల్డ్మ్యాన్ సీఈవో లైడ్ బ్లాంక్ఫీన్ పేర్కొనగా... ప్రభుత్వాలు నిషేధించే అవకాశాలు లేవని చెప్పలేం కనక బిట్కాయిన్ను తమ పోర్ట్ఫోలియోలో చేర్చుకోలేమని యూబీఎస్ తెలిపింది. బోయింగ్ కన్నా ఇదే అధికం! ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్ సైతం బిట్కాయిన్ ముందు చిన్నబోవాల్సిందే. బోయింగ్ కంపెనీ మార్కెట్ విలువ 162 బిలియన్ డాలర్లు. కానీ, నిన్నగాక మొన్నొచ్చిన బిట్కాయిన్ ఇన్వెస్టర్లకు విలువైనదిగా మారిపోయింది. చికాగోకు చెందిన బోయింగ్ సంస్థ, వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిరోస్పేస్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 1,40,000 మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. మరో విమానయాన సంస్థ ఎయిర్బస్ ఎస్ఈ మార్కెట్ విలువ సైతం 78 బిలియన్ డాలర్లుగానే ఉంది. మరికొన్ని చిత్రాలివీ... ♦ అమెరికా నౌకదళానికి ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చిన అణుశక్తి ఆధారిత సూపర్ క్యారియర్ (నౌక) గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ ఒక్కో దాని ఖరీదు 13 బిలియన్ డాలర్లు. ఈ రకంగా చూస్తే బిట్కాయిన్ మార్కెట్ విలువతో 14 యుద్ధనౌకలను సమకూర్చుకోవచ్చు. ♦ ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో బిల్గేట్స్, వారెన్ బఫెట్ తప్పకుండా ఉంటారు. వీరు జీవిత కాలం సంపాదించిన మొత్తం కూడా బిట్కాయిన్లో సగమే. గేట్స్ సంపద విలువ 90 బిలియన్ డాలర్లు కాగా, బఫెట్ సంపద విలువ 83 బిలియన్ డాలర్లు. వీరిద్దరి సంపద కలిపినా బిట్కాయిన్తో సరితూగలేదు. -
బిట్కాయిన్ @ 11,000 డాలర్లు
సింగపూర్: వర్చువల్ కరెన్సీల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘బిట్కాయిన్’ బుధవారం తొలిసారిగా 10వేల డాలర్ల మైలురాయిని అధిగమించింది. అదే స్పీడ్లో 11 వేల డాలర్లను కూడా దేటేసింది. ఒకేరోజులో ఈ రెండు మైలురాళ్లను చేరడం విశేషం. తాజా జోరుతో బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరువైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న విలువతో పోలిస్తే(దాదాపు 750 డాలర్లు) బిట్కాయిన్ 10 రెట్లకు పైగా ఎగబాకడం గమనార్హం. డిజిటల్ గోల్డ్గా కూడా అభివర్ణించే బిట్కాయిన్ ప్రస్థానం 2009లో మొదలైంది. ప్రారంభంలో ఒక డాలర్ కంటే తక్కువగా ఉన్న ఈ బిట్కాయిన్కు ఎలాంటి లీగల్ ఎక్సే్చంజ్ రేట్ కానీ, ఏ దేశ కేంద్ర బ్యాంక్ దన్ను కానీ లేదు. కొన్ని స్పెషలిస్ట్ ప్లాట్ఫామ్లపై ట్రేడయ్యేది. కానీ చాలా వేగంగా సాం ప్రదాయ ఇన్వెస్ట్మెంట్స్కు ప్రత్యామ్నాయంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఏడాదిన్నరలో లక్ష డాలర్లకు...! ఎక్సే్చంజ్ దిగ్గజం సీఎంఈ గ్రూప్ గత నెలలో బిట్కాయిన్లో ఫ్యూచర్స్ను ప్రారంభించనున్నామని వెల్లడించడంతో బిట్కాయిన్ జోరు మరింతగా పెరిగింది. కేవలం రెండు వారాల్లో 45 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో దీని విలువ 752 డాలర్లుగా ఉంది. బిట్కాయిన్ జోరు మరింతగా పెరుగుతుందని, ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ఇది 50 వేల నుంచి లక్ష డాలర్లకు పెరుగుతుందని సింగపూర్ శాక్సో బ్యాంక్కు చెందిన క్రిప్టో స్ట్రాటజిస్ట్ కే వాన్–పీటర్సన్ చెప్పారు. కాగా మన కాలానికి సంబంధించి అతి పెద్ద బబుల్గా బిట్కాయిన్ నిలవనున్నదని ప్రముఖ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైక్ నొవొగ్రాజ్ హెచ్చరించారు. కాగా, ఈ వర్చువల్ కరెన్సీని ఫ్రాడ్గా జేపీ మోర్గాన్ ఛేజ్ గతంలో అభివర్ణించింది. చైనా, దక్షిణ కొరియాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. -
బిట్ కాయిన్ దూకుడు..
వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్ పరుగులు పెడుతోంది. 2009లో ప్రవేశపెట్టినప్పుడు అమెరికా డాలర్లో కొన్ని సెంట్లు మాత్రమే పలికిన ఈ డిజిటల్ బంగారం తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం దీని విలువ తొలిసారి పదివేల డాలర్లకు చేరింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్రిప్టో పదివేల డాలర్ల మార్క్ను అధిగమించిన క్రిప్టోకరెన్సీ ఏడాదికాలంలో ఆల్ అసెట్ క్లాసెస్లో నంబర్ వన్ గా నిలిచింది. అంతేకాదు బిలియనీర్ హెడ్జ్ ఫండ్ లెజెండ్ మైక్ నోవోగ్రట్జ్ ప్రకారం బిట్కోయిన్ ధర 2018 నాటికి 40వేలడాలర్ల మార్కుకు చేరుతుంది. డిజిటల్ కరెన్సీ మార్కెట్లో తొలిసారి 10,000 డాలర్ల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో ఆసియాలో 10,379 అమెరికా డాలర్లను తాకింది. ఈ ఏడాది ఆరంభ ధరతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికం. అంటే ఒక బిట్కాయిన్ విలువ భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 లక్షలు. లక్సెంబర్గ్కి చెందిన బిట్స్టాంప్లాంటి మేజర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్పై ఇంకా పదివేల డాలర్లకి చేరలేదు కానీ..స్మాల్ ట్రేడింగ్ ప్లాట్పామ్స్పై ఎక్సేంజ్ వాల్యూ పదివేల డాలర్లపైనే ట్రేడ్ కావడం విశేషం. ‘డిజిటల్ బంగారం’గా భావించే బిట్కాయిన్ను ఎన్క్రిప్షన్, బ్లాక్చెయిన్ డేటాబేస్ ఆధారంగా వినియోగిస్తారు. రహస్య పెట్టుబడిదారులు, ఇతరుల నుంచి గిరాకీ ఉండటంతో అతి తక్కువ కాలంలోనే 2000, 5000, 7500, 10000 డాలర్ల స్థాయిల్ని సులభంగా దాటేసిందని ఎనలిస్టులు అంచనావేశారు. .అయితే ఈ స్థాయిలో అప్రమత్తంగాఉండాలని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. -
డార్క్నెట్లో డ్రగ్స్
ఆర్డర్ చేస్తే పోస్ట్లో గుమ్మం ముందుకు.. - బ్లాటింగ్ పేపర్ రూపంలో వచ్చి చేరుతున్న వైనం - సొమ్మును ‘బిట్ కాయిన్’గా మార్చి అంతర్జాతీయ - మార్కెట్లో డ్రగ్స్ కొనుగోలు - నగరంలో ముఠా గుట్టు రట్టు - ఇద్దరి అరెస్ట్.. - 62 ఎల్ఎస్డీ స్ట్రిప్స్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో చాపకింద నీరులా విస్తరించిన మత్తు దందా కొత్త పంథాలో నడుస్తోంది! డార్క్నెట్లో ఆర్డర్ చేస్తే చాలు.. డ్రగ్స్ వచ్చి డోర్ తడుతున్నాయి. బయటకెళ్లే అవసరం కూడా లేకుండా పోస్ట్లో ఇంటికే వచ్చేస్తున్నాయి. హైదరాబాద్లో తాజాగా ఈ తరహా ఉదంతం బయటపడటం కలకలం రేపుతోంది. నార్కోటిక్ డ్రగ్ నియంత్రణ అధికారులకే దిమ్మ తిరిగే తరహాలో సాగుతున్న ఈ దందా వేళ్లూనుకుంటే ఆపటం ఎవరి తరం కాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో కొన్నాడు.. తర్వాత అమ్మాడు.. గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు మరో డ్రగ్స్ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మూడోకంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం బయటపెట్టింది. వివరాలివీ.. ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన సంతోష్ దీపక్ (22), ఏఎస్రావునగర్కు చెందిన కేపీ అనిరుధ్ (30) లు డార్క్నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి 62 ఎల్ఎస్డీ డ్రగ్ బ్లాటింగ్ పేపర్ వృత్తాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి 200 ఎల్ఎస్డీ డ్రగ్స్ తెప్పించిన సంతోష్ దీపక్... ఇందులోంచి 138 బ్లాటింగ్ పేపర్ వృత్తాలను ఇప్పటికే విక్రయించినట్టు నిర్ధారించారు. వీటిని రాంకోఠిలోని రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులకు రూ.4 వేల చొప్పున అమ్మినట్టు నిందితులు చెప్పినట్టు హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి వెల్లడించారు. సంతోష్ దీపక్ ఇంతకుముందు మహారాష్ట్రలోని నాగపూర్లో ఓ కాలేజీలో చదివేవాడు. అయితే ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని గమనించిన యాజమాన్యం కాలేజీ నుంచి పంపేసింది. అక్కడ్నుంచి అతడు బెంగళూరు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడా అతడిని కాలేజీ నుంచి పంపేశారు. దీంతో హైదరాబాద్కు వచ్చిన సంతోష్ పూర్తిగా డ్రగ్స్కు బానిసగా మారాడు. మొదట్లో ఇతర డ్రగ్స్ ముఠాల వద్ద అడిగినంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసేవాడు. క్రమంగా తానే డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. యాప్.. డిజిటల్ మనీ.. ఇంటర్నెట్పై మంచి పట్టున్న సంతోష్ డార్క్నెట్ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్ను పట్టుకున్నాడు. జబ్పే (జెడ్ఈబీ) పే యాప్ను ఫోన్లో డౌన్లోన్ చేసుకొని దానికి తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశాడు. డ్రగ్ అవసరమైనప్పుడల్లా తన ఖాతాలోని డబ్బును జబ్పే యాప్కు బదిలీ చేసేవాడు. ఈ డబ్బును జబ్పే యాప్ ‘బిట్ కాయిన్’గా మార్చి తిరిగి ఆయనకు ఇచ్చేంది. బిట్ కాయిన్ అంటే ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీలోకైనా మార్చుకోగలిగే డిజిటల్ మనీ అన్నమాట! ఈ డిజిటల్ మనీతో సంతోష్ అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్లో 200 ఎల్ఎస్డీ డ్రగ్స్కు అర్డర్ ఇచ్చారు. ఇవి ఒక కవర్లో రూపంలో (బ్లాటింగ్ పేపర్పై చిన్నచిన్న వృత్తాలుగా) పోస్ట్ ద్వారా సంతోష్ ఇంటికి చేరాయి. ఆ డ్రగ్స్ను విక్రయించేందుకు ఇతడు ఓ కొరియర్ ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కేపీ అనిరుద్ ద్వారా పలువురుకి అమ్మాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ టీం గురువారం ఉదయం వలపన్ని వీరిని పట్టుకుంది. నిందితుల సెల్ఫోన్లలోని కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. అందులోని నంబర్ల వివరాలు బయటికి వస్తే ఎవరెవరు డ్రగ్స్ కొంటున్నారో బయటపడే అవకాశం ఉంది. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ టీం ఏర్పడిన తొలిరోజే వీరు పట్టుబడటం గమనార్హం. డార్క్ వెబ్ అంటే.. ఇది ఇంటర్నెట్లోనే ఇదో ఓ మాయా జగత్తు. సాధారణ సెర్చ్ ఇంజన్లు, సాఫ్ట్వేర్స్లతో దీన్ని చూడలేం. డార్క్ నెట్వర్క్లో సభ్యులుగా ఉన్నవాళ్లు మాత్రమే ఇందులోకి ప్రవేశించగలరు. సెర్చింగ్ కోసం ప్రత్యేకమైన ట్రైజర్లు తప్పనిసరి. ఇందులో సభ్యుడిగా ఉన్నవారు ఒకే ఐడీ, పాస్ వర్డ్తో అన్ని లింక్డ్ సైట్లలోకి ఏకకాలంలో ప్రవేశించవచ్చు. డార్క్నెట్వర్క్లో సభ్యుడిగా చేరగానే చీకటి సామ్రాజ్యంలోని అన్ని నెట్వర్క్ వెబ్సైట్లలో సభ్యుడిగా చేరిపోతారు. నిఘా వర్గాలకు అంత సులువుగా చిక్కని ఈ డార్క్నెట్నే డ్రగ్స్ మాఫియా వినియోగించుకొంటోంది. దీనిద్వారా డ్రగ్స్తోపాటు ఇతర నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలు సాగుతున్నాయని చెబుతున్నారు. బ్లాటింగ్ పేపర్పై వృత్తాలుగా.. గతంలో ఎల్ఎస్డీ (లిసర్జిక్ యాసిడ్ డై ఇథైలమైడ్) లిక్విడ్ను సిరంజీల ద్వారా నరాల్లోకి ఎక్కించుకునేవాళ్లు. అయితే దీంతో నొప్పితో కూడుకొని ఉండటంతో రూటు మార్చారు. ఇందులో భాగంగా ఎల్ఎస్డీ లిక్విడ్ చుక్కను బ్లాటింగ్ పేపర్పై వేస్తారు. ఈ పేపర్ లిక్విడ్ను పీల్చుకొని తనలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. ఎంత కాలమైనా ఆ పేపర్లోనే ఉండిపోతుంది. కాగితంపై డ్రగ్ ఆవరించినంత మేరకు వృత్తాకారంలో గీతలు ప్రింట్ చేస్తారు. డ్రగ్ పరిమాణాన్ని బట్టి ఈ వృత్తాల సైజ్ ఉంటుంది. 125 మైక్రోగ్రామ్ నుంచి 250 మైక్రో గ్రాముల వరకు డ్రగ్ను మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కాగితంపై ఉన్న వృత్తాన్ని (ఒక్కో వృత్తం ఖరీదు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా ఉంది) నాలుగు భాగాలుగా కత్తిరించి అందులోంచి ఒక భాగాన్ని నాలుకపై పెట్టుకొని చప్పరిస్తారు. ఇది ఒకసారి చప్పరిస్తే 8 గంటల వరకు మత్తులో ఉంటారు. -
బిట్కాయిన్పై జైట్లీ సమావేశం
వర్చువల్ కరెన్సీలతో ఎదురయ్యే సమస్యలపై చర్చలు న్యూఢిల్లీ: బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల వల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ మహర్షి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్రాయ్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బిట్ కాయిన్పై చర్చించినప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో బిట్కాయిన్పై దేశీయంగా పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోతుండటంతో దీన్ని ప్రాధాన్య అంశంగా కేంద్రం పరిగణిస్తోంది. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని ఎదుర్కొనే విషయమై చర్యలు సూచించేందుకు గాను ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ ఓ కమిటీని నియమించింది. బిట్కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలను చట్టబద్ధం చేసే విషయంలో గత నెలలో ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా ఆహ్వానించింది. మరోవైపు వర్చువల్ కరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆర్బీఐ సైతం దీనిపై పెట్టుబడి పెట్టేవారిని, ట్రేడర్లను ఇటీవలి కాలంలో పలుమార్లు హెచ్చరించింది కూడా. దేశీయంగా బిట్ కాయిన్లో ట్రేడింగ్కు పలు ఎక్సే్చంజ్లు ఉండగా, ఒక్క ‘జెబ్పే’ సంస్థలోనే రోజూ 2,500 మంది చేరుతుండటం దీనికున్న ఆకర్షణకు నిదర్శనం. ఇటీవల వన్నా క్రై వైరస్తో కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపజేసిన సైబర్ నేరగాళ్లు బిట్కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయడంతో, దాని విలువ అమాంతం పెరగడం తెలిసిందే. -
కొత్త బంగారం.. బిట్కాయిన్
⇒ పసిడి రేటును మించిన వర్చువల్ కరెన్సీ విలువ ⇒ 1,300 డాలర్ల దిశగా పరుగులు.. ⇒ అమెరికాలో ఈటీఎఫ్కు అనుమతులపై ఆశలతో ఊతం ⇒ రిస్కులూ ఉన్నాయంటున్న విశ్లేషకులు భారత్లో బిట్కాయిన్.. భారత్లో ప్రస్తుతం బీటీసీఎక్స్ఇండియా, కాయిన్సెక్యూర్, యునోకాయిన్, జేబ్పే వంటి బిట్కాయిన్ ఎక్సే్చంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు (డీమోనిటైజేషన్కి ముందు).. భారత్లో బిట్కాయిన్ యూజర్ల సంఖ్య సుమారుగా 50,000 పైచిలుకు ఉన్నట్లు అంచనా. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు తర్వాత బిట్కాయిన్ విలువ భారీగా పెరిగింది. గతేడాది అక్టోబర్లో రూ. 40,000 స్థాయిలో ఉన్న రేటు సుమారు రూ. 90,000 స్థాయికి ఎగిసింది. న్యూఢిల్లీ: వర్చువల్ బంగారంగా పేరొందిన బిట్ కాయిన్ ప్రస్తుతం అసలు బంగారాన్ని మించి పరుగులు తీస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో పసిడి ఈ మధ్య కాస్త తగ్గుతుండగా.. దానికి భిన్నంగా బిట్కాయిన్ మాత్రం దూసుకెడుతోంది. గడిచిన కొద్ది ట్రేడింగ్ సెషన్లలో వరుసగా కొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూ.. 1,300 డాలర్ల వైపు వెళుతోంది. కాయిన్డెస్క్ బీపీఐ ఎక్సే్ఛంజ్లో శుక్రవారం ఒక దశలో 1,293 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు అదే సమయంలో ఔన్సు పసిడి ధర 1,227 డాలర్ల దగ్గర తిరుగాడుతుండటం గమనార్హం. 2008లో బిట్కాయిన్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తర్వాత.. వెయ్యి డాలర్ల పైన ఇంత సుదీర్ఘ కాలం ట్రేడవుతుండటం ఇదే తొలిసారి. అమెరికా వ్యాపారవేత్తలు కామెరాన్, టైలర్ వింకెల్వోస్లు తలపెట్టిన తొలి బిట్కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)కి అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర లభించగలదన్న ఆశలు ఈ వర్చువల్ కరెన్సీ వృద్ధికి ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఈటీఎఫ్ లిస్టింగ్కి అనుమతులకు సంబంధించి అనుమతులు ఇచ్చే విషయంపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మార్చ్ 11న తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈటీఎఫ్కు అనుమతులు లభిస్తే.. డిజిటల్ కరెన్సీగా బిట్కాయిన్ ఆమోదయోగ్యత, తదనుగుణంగా విలువ కూడా మరింతగా పెరుగుతుంది. మిగతా దేశాల్లోని మార్కెట్ నియంత్రణ సంస్థలు కూడా ఈ తరహా ఈటీఎఫ్ లిస్టింగ్స్ను పరిశీలించవచ్చు. సురక్షితమైనదేనా ... బిట్కాయిన్ విలువ అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ.. ఇది సురక్షితమైన కరెన్సీయేనా అన్న సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిట్కాయిన్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం ఒక కారణం కాగా, దీని ఆమోదయోగ్యతపై సందేహాలు మరో కారణం. రిస్కుల విషయానికొస్తే.. క్రూడాయిల్, బాండ్ల స్థాయిలో బిట్కాయిన్కూ రిస్కులు ఉంటాయి. హెచ్చుతగ్గుల సంగతి తీసుకుంటే పసిడి రేట్లు సగటున 1.2 శాతం మేర, ఇతరత్రా ప్రధాన కరెన్సీలు 0.5–1.0 శాతం మేర మార్పులకు లోనవుతుంటాయి. అదే బిట్కాయిన్కి సంబంధించి చూస్తే.. 2011లో అమెరికా డాలర్తో పోల్చి చూసినప్పుడు బిట్కాయిన్ హెచ్చుతగ్గుల సూచీ ఏకంగా 16.11 శాతం మేర మారింది. ప్రస్తుతం ఇది 2.25 శాతానికి దిగి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. ఇలా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ధోరణి కారణంగా ఎక్కువగా స్పెక్యులేటర్స్ బిట్కాయిన్స్వైపు ఆకర్షితులవుతుంటారని, దీనితో హెచ్చుతగ్గులు మరింత ఎక్కువవుతుంటాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా సాధారణ ఇన్వెస్టర్లకు దీనిపై నమ్మకం కుదరడం కష్టంగా ఉంటుందని వివరించాయి. ఇక, ఆమోదయోగ్యతపరంగా చూస్తే.. మిగతా కరెన్సీలలాగా అన్ని రకాల ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లకు బిట్కాయిన్లను వినియోగించడం వాడుకలోకి రాలేదు. ఈ నేపథ్యంలో.. రేటుపరంగా పసిడికన్నా ఎక్కువ పలుకుతున్నా బంగారం తరహాలో పెట్టుబడికి సురక్షితమైన సాధనంగా దీన్ని పరిగణించడం తొందరపాటు చర్యే అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇక వింకెల్వోస్ సోదరులు తలపెట్టిన ఈటీఎఫ్ ప్రయత్నాలు ఫలప్రదం కాకపోతే.. బిట్కాయిన్ రేటు మరింత పడిపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ప్రస్తుతం పన్నెండు వందల డాలర్ల పైన ట్రేడవుతున్న బిట్కాయిన్.. ఆ పరిస్థితుల్లో 1,000–1,100 డాలర్ల స్థాయికీ పడిపోయి కొంత కాలం పాటు అక్కడక్కడే తిరుగాడవచ్చని దేశీ బిట్కాయిన్ ఎక్సే్చంజ్ జేబ్పే వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ ఏమంటోంది.. బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ఊతమిచ్చే క్రమంలో వివిధ దేశాల్లో నియంత్రణ సంస్థలు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి. దేశీయంగా ఓవైపు ప్రభుత్వం నగదు వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం బిట్కాయిన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా ఎటువంటి వర్చువల్ కరెన్సీ వాడకానికీ లైసెన్సు ఇవ్వలేదని, ఎవరైనా దీన్ని వాడుతున్న పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదేనంటూ ఈ మధ్యే స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ఎస్ గాంధీ ఇటీవలే హెచ్చరించారు కూడా. నియంత్రణ సంస్థల పరిధిలో లేని ఈ తరహా కరెన్సీల వల్ల ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. అయితే, చైనా, రష్యా, సింగపూర్ తదితర దేశాలన్నీ కూడా ఈ తరహాలోనే ముందుగా హెచ్చరికలు వగైరా చేసినా.. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీని ఎంతో కొంత నియంత్రించే దిశగా మార్గదర్శకాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎంతో కాలం వేచి చూసే ధోరణి అవలంబించడం సరికాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల వీటి గురించి ఎక్కువగా అవగాహన లేని సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
వర్చువల్ కరెన్సీలతో రిస్కులు
⇒ ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ⇒ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై: బిట్కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ హెచ్చరించారు. ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా గాంధీ ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే వర్చువల్ కరెన్సీలకు .. హ్యాకింగ్, పాస్వర్డ్ చౌర్యం, మాల్వేర్ దాడుల ముప్పు కూడా ఉంటుందని గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియంత్రణ వ్యవస్థలు లేవు... వర్చువల్ కరెన్సీలను నియంత్రించేందుకు ఎలాంటి కేంద్రీయ బ్యాంకులు లేవని ఆయన చెప్పారు. కస్టమర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థా వీటికి ఉండదన్నారు. చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాలకు వర్చువల్ కరెన్సీలు ఉపయోగపడుతున్నట్లు అనేక కేసులు కూడా నమోదైనట్లు గాంధీ చెప్పారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారిత బిట్కాయిన్ తదితర వర్చువల్ కరెన్సీలు వేటికైనా ప్రారంభ దశలోనే విశ్వసనీయత ఉంటుందని, తర్వాత దశల్లో కూడా దాన్ని కాపాడుకుంటేనే మనుగడ ఉండగలదని ఆయన చెప్పారు. ‘ప్రారంభ దశలో అడ్వెంచరిస్టులు, రిస్కులు తీసుకునే వారు ఉంటారు. తర్వాత మిగతావారు చేరతారు. రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా క్రమంగా చేరాలంటే వర్చువల్ కరెన్సీకి ఆమోదయోగ్యత ఉంటుందని, కొనసాగుతుందన్న నమ్మకం వారిలో కలగాలి. అప్పుడే ఇటువంటి కరెన్సీలకు మనుగడ ఉంటుంది‘ అని గాంధీ వివరించారు. నియంత్రణ సంస్థల పరిధిలో ఉన్నప్పుడే ఏ కరెన్సీపైన అయినా నమ్మకం ఉంటుందని గాంధీ వివరించారు. కరెన్సీ చలామణీ కనుమరుగు అపోహే... వర్చువల్ కరెన్సీ రాకతో కరెన్సీ చలామణీ పూర్తిగా కనుమరుగవుతుందన్నది అపోహేనని గాంధీ స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు.. ఆర్థిక సేవల పరిశ్రమలో వేగంగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ఆయన చెప్పారు. బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలు కూడా ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని గాంధీ ఈ సందర్భంగా అన్నారు. -
మళ్లీ వెయ్యి డాలర్ల పైకి బిట్ కాయిన్
మూడేళ్లలో తొలిసారి న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ శుభారంభం చేసింది. కాయిన్ మారకం విలువ ఏకంగా 1,000 డాలర్ల పైకి ఎగిసింది. మూడేళ్ల తర్వాత బిట్ కాయిన్ మారకం విలువ వెయ్యి డాలర్ల పైకి ఎగియడం ఇదే తొలిసారి. యూరప్కి చెందిన బిట్స్టాంప్ ఎక్సే్చంజీలో బిట్ కాయిన్ ఒక దశలో 1,022 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. 2013 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మొత్తం మీద 2016లో మిగతా కరెన్సీలన్నింటినీ తోసిరాజని బిట్ కాయిన్ విలువ 125 శాతం ఎగిసింది. చైనా కరెన్సీ యువాన్ బలహీనంగా ఉండటం సైతం దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనా. గణాంకాల ప్రకారం ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అత్యధికంగా చైనాలోనే జరుగుతోంది. 2013లో బిట్ కాయిన్ విలువ ఆల్ టైం రికార్డు 1,163 డాలర్ల స్థాయిని తాకింది. అయితే, ఆ తర్వాత జపాన్కి చెందిన మౌంట్ గోక్స్ ఎక్సే్చంజీలో హ్యాకింగ్ దెబ్బతో 400 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఈ రెండేళ్లుగా బిట్ కాయిన్ విలువ కొంత మేర స్థిరంగా కొనసాగుతోంది. భారత్లో పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాలు.. ఇతరత్రా మిగతా దేశాల్లోనూ నగదు చెలామణీపైనా, పెట్టుబడులపైనా నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక రిస్కు ఉన్నప్పటికీ.. మెరుగైన ప్రత్యామ్నాయ కరెన్సీగా బిట్ కాయిన్ ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
1000 డాలర్ల మార్కును చేధించిన ఆ కరెన్సీ
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అధికార నియంత్రణ సంస్థలేని కరెన్సీగా ప్రాముఖ్యంలోకి వచ్చిన బిట్ కాయిన్ ధర సోమవారం భారీగా ఎగిసింది. మూడేళ్లకు పైగా గరిష్టస్థాయిలో వెయ్యి డాలర్ల మార్కును చేధించింది. 2013 నవంబర్ నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయని కాయిన్ డెస్క్ డేటా రిపోర్టు చేసింది. దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 16 బిలియన్ డాలర్లకు పైగా ఎగిసినట్టు పేర్కొంది. యువాన్ విలువను డీవాల్యుయేషన్ చేయడం, భౌగోళిక అంశాలు, అసెట్ క్లాస్పై పెట్టుబడిదారులు ఎక్కువగా శ్రద్ధ చూపించడం వంటివి బిట్ కాయిన్ విలువను గత కొద్దీ నెలలుగా పైకి పెరగడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఎక్కువగా బిట్కాయిన్లోనే ట్రేడింగ్ జరుపుతున్నారని తెలిసింది. యువాన్ను డీవాల్యుయేషన్ చేయడం మూలధనం నియంత్రణపై ఆందోళనలు రేకెత్తించిందని, దీంతో డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఎంతో సురక్షిత సాధనంగా దీనికి బాగా గుర్తింపు లభిస్తోంది. కేవలం కంప్యూటర్తోనే లావాదేవీలను చకాచకీగా ముగించేయొచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం కూడా దేశీయంగా పెట్టుబడిదారులను ఈ కరెన్సీపై ఎక్కువగా దృష్టిసారించేలా చేసింది. -
డిజిటల్ ప్రపంచంలో హిట్ కాయిన్!
• నోట్ల రద్దుతో బిట్కాయిన్పై పెరిగిన ఆసక్తి • నవంబర్లో రూ.68,000కు ఎగిసిన బిట్కాయిన్ విలువ • దేశంలోని ట్రేడింగ్ ఎక్సే్ఛంజీల్లో పెరిగిన యూజర్ల సంఖ్య • అవకాశాల్ని అందుకోవటానికి బిట్కాయిన్ స్టార్టప్లు • ప్రపంచవ్యాప్తంగా అధికార నియంత్రణ లేని కరెన్సీ ఇదే • బంగారంకన్నా విలువెక్కువ... బంగారమూ కొనుక్కోవచ్చు • ప్రభుత్వాల జోక్యం లేకపోవటంతో సురక్షిత సాధనంగా గుర్తింపు! • వీటిని స్వీకరించటానికి ఓకే అంటున్న ఆన్లైన్ సంస్థలు, దిగ్గజాలు • ఒక బిట్కాయిన్ను 10 కోట్ల ‘సతోషి’లుగా విభజించే అవకాశం • ఎప్పటికైనా గరిష్ఠంగా సృష్టించగలిగేది 2.1 కోట్ల బిట్కాయిన్లనే • వాటిని విడగొట్టగలరు తప్ప మరిన్ని సృష్టించటం అసాధ్యం • దాంతో మున్ముందు విలువ మరింత పెరుగుతుందనే భావన • పెరుగుతున్న ఎక్సే్ఛంజీలు; డిజిటల్ బిట్కాయన్ వాలెట్లు కరెన్సీల్లో ఖరీదైనదేంటి? రోజూ చూస్తుంటాం కనక ఠక్కున డాలరు గుర్తొస్తుంది. కానీ దాని విలువ మనకు కేవలం 68 రూపాయలు. అదే కువైట్ దినార్ అయితే..? దాదాపు 223 రూపాయలు. ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన కరెన్సీ ఇదే అంటారంతా!!. మరి బిట్కాయిన్ సంగతో..? ఒక బిట్కాయిన్ దాదాపు రూ.55,700. అంటే... తులం బంగారంకన్నా కూడా ఎక్కువ. దాదాపు రూ.49,000 పలుకుతున్న కిలో వెండికన్నా కూడా ఎక్కువ. అంతెందుకు!! మన షేర్ మార్కెట్లో అత్యధిక ధర పలికే ‘ఎంఆర్ఎఫ్’ షేరుకన్నా కూడా ఎక్కువ. ఇంకా చిత్రమేంటంటే... 2013 ఆరంభంలో దీని ధర దాదాపు రూ.500 దగ్గరుండేది. కానీ మూడేళ్లలో ఏకంగా 110 రెట్లకుపైగా పెరిగిపోయింది. ఎందుకింతలా పెరిగింది? అసలు బిట్కాయిన్ అంటే ఏంటి? దీన్నెవరు ముద్రిస్తారు? ఎక్కడ కొనాలి? దీని యజమానులెవరు? దీంతో ఏమేం కొనుక్కోవచ్చు? అసలెక్కడ వాడొచ్చు? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానాలే... ఈ ప్రత్యేక కథనం. బిట్కాయిన్ అంటే... డిజిటల్ కరెన్సీ. ఆన్లైన్లో కొని, ఆన్లైన్లో మాత్రమే వాడుకోగలిగే కరెన్సీ. డాలర్, యూరో, మన రూపాయి వంటి కరెన్సీల్లా దీన్నెవరూ ముద్రించరు. ఫెడరల్ బ్యాంకుల మాదిరిగా దీనిపై ఎవరి నియంత్రణా ఉండదు కూడా. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో శక్తిమంతమైన కంప్యూటర్లు, సర్వర్లను ఉపయోగించి దీన్ని సృష్టించే వ్యక్తుల్ని మైనర్స్గా పిలుస్తుంటారు. ఈ మైనింగ్ టీమ్లో ఎవరైనా చేరొచ్చు. ఈ నెట్వర్కే బిట్కాయిన్ లావాదేవీల్ని పారదర్శక పద్ధతిలో బ్లాక్చెయిన్ ద్వారా నమోదు చేస్తుంది. అంటే! బిట్కాయిన్లకు తమ సొంత పేమెంట్ గేట్వే ఉందన్నమాట. అదీ కథ. ధరెందుకు పెరుగుతోంది? బిట్కాయిన్లను జపాన్కు చెందిన సతోషి నకమొతో 2008లో సృష్టించారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్ రూపంలో మార్చుకునే కరెన్సీగా... ఏ నియంత్రణా లేని కరెన్సీగా ఇది చలామణిలోకి వచ్చింది. కాకపోతే దీన్ని ఆన్లైన్ సైట్లు, ఇతర వ్యాపారులు తీసుకోవటం 2009 నుంచీ మొదలయింది. దీంతో బిట్కాయిన్ల ధర ఒకదశలో అమాంతం ఎగసింది. మళ్లీ పడింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపారులంతా దీన్నిపుడు అంగీకరిస్తుండటంతో ధర బాగా పెరుగుతోంది. బిట్కాయిన్ల ధర బాగా పెరగటానికి మరో కారణం కూడా ఉంది. ఎంత మైనర్లయినా... ఎంత శక్తిమంతమైన కంప్యూటర్లయినా ఈ బిట్కాయిన్లను 2.1 కోట్లకు మించి సృష్టించలేవు. అంటే ఏ దశలోనైనా 2.1 కోట్లకన్నా ఎక్కువ బిట్కాయిన్లుండే చాన్సు లేదన్నమాట. కాకపోతే వీటిని ముక్కలు చెయ్యటం మాత్రం వీలవుతుంది. ప్రస్తుతం బిట్కాయిన్ను అత్యంత తక్కువ డినామినేషన్లో... 10కోట్లవ వంతుకు విడగొడుతున్నారు. దీన్ని ‘సతోషి’గా పిలుస్తున్నారు. అంటే... 10 కోట్ల సతోషిలు కలిస్తే ఒక బిట్కాయిన్ అన్నమాట. దీనర్థం ఒక్కటే... కోట్ల కోట్ల సతోషిలు అందుబాటులోకి రావచ్చు. చిల్లర సమస్య కూడా ఉండదు. కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతుందన్నది కాదనలేని నిజం. బిట్కాయిన్లు ఎందుకు ఆకర్షణీయమంటే.. ⇔ దీన్ని ఒక ప్రభుత్వమో, కేంద్రబ్యాంకో నియంత్రించదు. కాబట్టి తాజా నోట్లరద్దు మాదిరిగా ఒక్క ఆదేశంతో వెనక్కి తీసుకోలేరు. నెట్వర్క్లో ఉండే కంప్యూటర్లన్నీ కలసి దీన్ని నియంత్రిస్తాయి. అంటే వికేంద్రీకృత కరెన్సీ అన్నమాట. ⇔ బ్యాంకు ఖాతా అక్కర్లేదు. ఆన్లైన్లో బిట్కాయిన్ అడ్రస్ ఏర్పాటు చాలా తేలిక. మీ పేరు, ఇతర వివరాలు చెప్పకుండా ఆ అడ్రస్లో బిట్కాయిన్లు దాచుకోవచ్చు. లావాదేవీలన్నీ పారదర్శకం కనక... అన్నీ బ్లాక్చెయిన్లో నమోదవుతాయి. ఏ అడ్రస్ ఎవరిదనేది తెలియకపోయినా... దేన్లో ఎన్ని కాయిన్లున్నాయో ఈజీగా తెలుస్తుంది. డబ్బుకు లెక్కుంటుంది. ⇔ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అతివేగంగా లావాదేవీలు జరిగిపోతాయి. లావాదేవీల ఖర్చు అత్యల్పం. ⇔ క్రెడిట్, డెబిట్ కార్డులకొచ్చేసరికి సమాచారమంతా ఆన్లైన్లో ఇస్తాం కనక మోసాలకు కొదవలేదు. బిట్కాయిన్లలో అది దాదాపు అసాధ్యం. ప్రతి వ్యక్తికీ ప్రయివేటు, పబ్లిక్ కీ రెండుం టాయి. పబ్లిక్ కీ అంటే అడ్రస్. అది అందరికీ తెలిసేదే. ప్రయివేటు కీ మాత్రం తనకే తెలుస్తుంది. ఆ రెంటినీ కలిపి లావాదేవీ జరిపితే... క్లిష్టమైన గణితంతో కలసి సర్టిఫికెట్ పుడుతుంది. అప్పుడు సదరు లావాదేవీ అధికారికమవుతుంది. ⇔ బ్యాంకులు మీ ఖాతా కావాలనుకుంటే స్తంభింపజేయగలవు. బిట్కాయిన్ వ్యవస్థలో అలా జరిగే అస్కారం లేదు. ఒక అడ్రస్లో ఎన్ని కాయిన్లున్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అడ్రస్ ఎవరిదనేది తెలియదు. పైపెచ్చు మీరు బిట్కాయిన్లతో ఏది కొన్నా రహస్యంగానే ఉంటుంది. మరి ఈ కాయిన్లు కొనేదెలా? బిట్కాయిన్లను వ్యక్తుల నుంచిగానీ, ఎక్సే్ఛంజీల నుంచిగానీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే వీటిని కొనే ముందు వాలెట్ కొనుక్కోవాలి. వాలెట్లను మీ కంప్యూటర్లో, ఆన్లైన్లో, లేదా హార్డ్ వేర్ రూపంలో అందించే వాల్ట్ రూపంలో ఉంచుకోవచ్చు. తరువాత కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు చాలా సంస్థలు, ఎక్సే్ఛంజీ లున్నా... బిట్స్టాంప్, క్రాకెన్ (అమెరికా), బిట్ఫినెక్స్ (హాంకాంగ్), ఓకే కాయిన్, బీటీసీసీ (చైనా), బీటీసీఎక్స్, కాయిన్ సెక్యూర్ (ఇం డియా) వంటివి ఆయా దేశాల్లో ప్రధానమైనవి. కాకపోతే ప్రతి ఎక్సే్ఛంజీ ఇపుడు ఆయా దేశాల్లోని నిబంధనల మేరకు వ్యక్తుల పాన్ వంటి వివరాలడుగుతోంది. ఇక కాయిన్బేస్, సర్కిల్ వంటి వాలెట్ సంస్థలు కూడా వాలెట్ సేవలతో పాటు ఎక్సే్ఛంజీల మాదిరి కొనుగోలు, అమ్మకం సేవలందిస్తున్నాయి. చాలా దేశాల్లో వీటిని క్రెడిట్, డెబిట్ కార్డులు... మనీ ఆర్డర్లు ఉపయోగించి కొనుగోలు చేసే వీలుంది. విశేషమేంటంటే మీ వాలెట్ డిజిటల్ రూపంలోనే ఉంటుంది కనక ఎప్పటికప్పుడు మారే బిట్కాయిన్ విలువ మీ వాలెట్లోనూ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మీ బిట్కాయిన్ల విలువ కూడా మారుతుంది. మైనింగ్ జరిగేది ఎలా? బిట్కాయిన్లను ఒకరికొకరు పంపించుకోవచ్చు. మరి ఎవరో ఒకరు రికార్డులు నిర్వహించాలి కదా? నిర్ణీత సమయానికి జరిగిన రికార్డులన్నిటినీ తమ కంప్యూటర్ల సాయంతో ఎవరో ఒకరు నిర్వహిస్తారు. దాన్ని బ్లాక్గా వ్యవహరిస్తారు. సదరు బ్లాక్లతో బ్లాక్ చెయిన్ ఏర్పడుతుంది. అది ఆ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవతుంది. కానీ కొత్త లావాదేవీలు నమోదయ్యే కొద్దీ ఇది మరింత పెరుగుతుంది. దాన్నంతటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో యాష్లు, ఇతర సాంకేతిక పదాలుపయోగించి సురక్షితం చేస్తారు. ఇలా బ్లాక్చెయిన్ అప్డేట్ చేసిన మైనర్లకు నజరానాగా 25 బిట్ కాయిన్లు దక్కుతాయి. అది అందరికీ తెలుస్తుంది కూడా. కాకపోతే లావాదేవీలు పెరిగేకొద్దీ... ఇది మరింత సంక్లిష్టంగా మారుతుంటుంది. ఇక బిట్కాయిన్ మైనింగ్కు ఉపయోగించే హార్డ్వేర్ కూడా తేలికదేమీ కాదు. సెకనుకు ఎన్ని ఎక్కువ హ్యాష్లు జనరేట్ చేసే ప్రాసెసర్ అయితే కాయిన్లు పొందేందుకు అన్ని అవకాశాలుంటాయన్న మాట. మామూలు సిస్టమ్లు సెకనుకు 10మెగా హ్యాష్లు జనరేట్ చేసేవైతే... మైనర్లు వాడేవి సెకనుకు 1టెరా హ్యాష్లు జనరేట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. ఇక వీటికయ్యే విద్యుత్ ఖర్చులూ ఎక్కువే. ఇవి కాక ఇంకొన్ని పరికరాలూ ఉన్నాయి. వీటిలో బిట్కాయిన్ మైనింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించటం ద్వారా మైనర్ల టీమ్లో చేరొచ్చు. రోజుల వ్యవధిలో భారీ రాబడులు.. బిట్కాయిన్లలో పెట్టుబడులపై అవగాహన ఉన్న కొందరు ఇన్వెస్టర్లు డీమోనిటైజేషన్ తరుణంలో బాగానే లాభపడ్డారు. కొన్నాళ్ల క్రితం రూ.49,000–51,000 స్థాయిలో కొనుగోలు చేసిన వారు నవంబర్లో రూ.68,000–69,000 స్థాయిలో విక్రయించి లబ్ధి పొందారు. సాధారణంగా ఈక్విటీ, డెట్ ఫండ్స్లో ఏళ్ల తరబడి చేసే ఇన్వెస్ట్మెంట్స్పై చక్రగతిన 25–30 శాతం మేర రాబడులు వస్తుండగా.. కేవలం నెలరోజుల వ్యవధిలోనే బిట్కాయిన్లు 25 శాతం పైగా రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది రూ.55,700 స్థాయిలో కదులుతోంది. ఈ పరిణామాలతో కొత్త ఇన్వెస్టర్లు కూడా వీటి వైపు చూస్తున్నారు. బిట్కాయిన్ స్టార్టప్లకు పండుగ!! పెద్ద నోట్ల రద్దుతో అంతా ప్రత్యామ్నాయా మార్గాలవైపు చూస్తున్న నేపథ్యంలో బిట్కాయిన్ స్టార్టప్లు పండుగ చేసుకుంటున్నాయి. ఈ మధ్య దేశంలో జేబ్పే, ఉనోకాయిన్, కాయిన్సెక్యూర్ వంటి బిట్కాయిన్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘జేబ్పే’లో నవంబర్లో ట్రేడింగ్ పరిమాణం ఏకంగా రూ.120 కోట్ల స్థాయిని తాకింది. అక్టోబర్తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఆదాయం కూడా 25 శాతం పెరిగినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొందరు ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తిగత పెట్టుబడులు జేబ్పే సమీకరించింది. సాధారణంగా ప్రతి నెలా సుమారు 20,000 కొత్త యూజర్లు జేబ్పేలో చేరుతుండగా.. నవంబర్లో ఈ సంఖ్య ఏకంగా 50,000కు పెరిగింది. మొత్తం మీద జేబ్పేలో ప్రస్తుతం 2,50,000 మంది పైచిలుకు యూజర్లున్నారు. మరోవైపు, ఉనోకాయిన్ యూజర్ల సంఖ్య గత నెలలో మూడు రెట్లు పెరిగి 1,20,000కి చేరింది. ట్రేడింగ్ పరిమాణం రెట్టింపై రోజుకు 300 బిట్కాయిన్ల స్థాయికి చేరింది. ఇక, కాయిన్సెక్యూర్ కొత్త యూజర్ల సంఖ్య 300 శాతం పెరిగి 90,000కు చేరింది. దేశీయంగా బిట్కాయిన్ స్టార్టప్లు..: దేశీయంగా సుమారు 20 బిట్కాయిన్ స్టార్టప్లున్నాయి. వీటిలో మూడు మాత్రమే ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించగలిగాయి. ఇందులో జేబ్పే (1 మిలియన్ డాలర్లు), ఉనోకాయిన్ (1.5 మిలియన్ డాలర్లు), కాయిన్సెక్యూర్ (1.5 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఉనోకాయిన్ ఇటీవలే బ్లూమ్ వెంచర్స్, అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ డిజిటల్ కరెన్సీ గ్రూప్ నుంచి నిధులు సమీకరించింది. బిట్ కాయిన్లను దేనికి వాడొచ్చు? ఇప్పుడు కాయిన్బేస్ వంటి వాలెట్లు తమ వాలెట్లోని బిట్కాయిన్లతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. బంగారం బిస్కెట్లను ఆర్డర్ చేస్తే డెలివరీ చేస్తున్నాయి కూడా. ఇక డెల్ వంటి సంస్థలతో పాటు విదేశాల్లోని పలు ఎయిర్లైన్ సంస్థలు కూడా బిట్కాయిన్లను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో షాపింగ్కు వినియోగించే గిఫ్ట్ కార్డులనూ వీటితో కొనొచ్చు. ఇపుడిప్పుడే చాలా ఆన్లైన్, ఆఫ్లైన్ సంస్థలు వీటిని అంగీకరిస్తున్నాయి. కాకపోతే ప్రతి లావాదేవీనీ మైనర్లు ధ్రువీకరిస్తుంటారు. తరువాత బ్లాక్చెయిన్ ఏర్పడుతుంది. దీనికి 10 నిమిషాల వరకూ సమయం పట్టొచ్చు. ఒక బిట్కాయిన్ను 10కోట్ల సతోషిలుగా విడగొట్టే అవకాశముంది కనక ఏ ధరతోనైనా లావాదేవీ చేసుకోవచ్చు. ఇక ఇండియా విషయానికొస్తే పెద్ద ఈ కామర్స్ సంస్థలు.. బిట్కాయిన్ల రూపంలో చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఫ్లయింగ్ స్పాగెట్టీ మాన్స్టర్ వంటి రెస్టారెంట్లు కూడా వీటిని అనుమతించాలని భావిస్తున్నాయి. సప్న బుక్హౌస్, వైకే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫ్లైట్షాప్ వంటి వ్యాపార సంస్థలు ఉనోకాయిన్ ఎక్సే్చంజీ ద్వారా బిట్కాయిన్ల చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. బిట్కాయిన్ను కూడా ఒకరకంగా పసిడి లాంటి పెట్టుబడి సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తుండటం గమనార్హం. -
కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవో
ఇటీవల కుప్పకూలిన బిట్కాయిన్ ఎక్స్ఛేంజ్-మౌంట్గాక్స్ అధిపతికి సంబంధించి మరో బండారం బయటపడింది. ఆన్లైన్ వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై తగలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. కాల్పనిక నగదు (వర్చువల్ కరెన్సీ) పేరిట వినియోగదారుల నుంచి వందలకోట్ల వసూలుచేసిన బిట్కాయిన్ సంస్థ ఇటీవల దివాళా తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వినియోగదారుల ఆన్లైన్ ఖాతాల నుంచి వర్చువల్ నగదు మాయమైన వ్యవహారంలో కంపెనీ సీఈవో కార్పెలస్ హస్తం కూడా ఉందని, అతను మోసపూరితంగా వినియోగదారులకు చెందిన 1.66 లక్షల డాలర్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా అతనిపై మరికొన్ని అభియోగాలు వెలుగుచూశాయి. వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై ఖర్చు చేశాడని, శృంగార సేవలు లభించే కార్యక్రమాల్లో పాల్గొని మహిళలపై అతను ఈ సొమ్ము ఖర్చు పెట్టాడని జపాన్ మీడియా తెలిపింది. 2011-13 మధ్యకాలంలో తనకు చెందిన డజన్ కంపెనీల్లోకి నిధులు మళ్లించిన వ్యవహారంపై కార్పెలస్ మొదట అరెస్టయ్యాడు. అనంతరం విడుదలైన అతన్ని బిట్కాయిన్ డిపాజిట్లను మళ్లించిన వ్యవహారంలో మళ్లీ అరెస్టు చేశారు.