Central Health Department
-
భారత్ లో చైనా వైరస్.. HMPV కలకలం
-
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
వామ్మో మంకీపాక్స్!.. భారత్లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
భద్రం... బీ కేర్ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు..కేంద్ర అలర్ట్
-
COVID-19: మరో 6,155 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 31,194కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 4,47,51,259కు చేరాయి. అదే సమయంలో మరో 11 మంది బాధితులు చనిపోవడంతో మొత్తం మరణాలు 5,30,954కు పెరిగినట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07% కాగా, రికవరీ రేటు 98.74%గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63గా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరించింది. -
కొత్తగా 3,824 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత వారంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో గత వారంలో 132 కరోనా కేసులు నమోదు కాగా, మార్చి 15తో ముగిసిన వారంలో ఆ సంఖ్య 267కి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణకు సూచించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం కూడా ఉన్నట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో గురు వారం 27 కరోనా కేసులు నమోద య్యాయి. అంతకుముందు రోజు బుధ వారం ఏకంగా 54 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది. -
భారత్లోకి సూపర్ వేరియెంట్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలికేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది. అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే అమెరికాలో గత అక్టోబర్లో న్యూయార్క్లో ఈ వేరియెంట్ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్బీబీ.1.5ని సూపర్ వేరియెంట్ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’ అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్ హెచ్చరించా రు. సింగపూర్లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి. ఏమిటీ ఎక్స్బీబీ.1.5? ఒమిక్రాన్లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచ్చింది. బీక్యూ, ఎక్స్బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్బీబీ.1.5 వచ్చింది. ఎక్స్బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు. మనకు ముప్పు ఎంత? ఎక్స్బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్ గగన్దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్లో ఒమిక్రాన్ వేరియెంట్ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్ మోడల్లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది. లక్షణాలివే..! ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్గా తేలితే క్వారంటైన్కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్పోర్ట్లో భారత్కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్లో అడుగుపెట్టారు. టెస్ట్కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్కు ఈ ఏడాది నవంబర్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
ఆరిపోతున్న ప్రాణదీపాలు.. ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక..
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిలో ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక అనేకమంది యువ వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016 నుండి 2020 మధ్య కాలంలో 18 నుండి 30 సంవత్సరాల వయస్సులో వివిధ రకాల వృత్తుల్లో ఉన్న 3,100 మంది పలు సమస్యలతో ఆత్మహత్య చేసుకోగా.. ఇందులో ఎక్కువమంది వైద్యులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. అదే కాలంలో వివిధ వయస్సుల వారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలోనూ వైద్య విద్యార్థులున్నారని తెలిపింది. సూపర్ స్పెషాలిటీ చేస్తేనే.. వైద్య విద్య పూర్తిచేస్తే జీవితంలో హాయిగా స్థిరపడిపోవచ్చనే భావన ఉంది. కానీ వాస్తవం అందరు మెడికల్ విద్యార్థుల విషయంలో ఒకేలా లేదు. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయగానే స్థిరపడిపోయినట్లు కానేకాదు. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థిరపడాలంటే 15 ఏళ్లు.. ఎంబీబీఎస్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు కోర్సులు పూర్తి చేసే సరికి పదేళ్లు దాటుతుంది. అది కూడా సకాలంలో పీజీ సీటొస్తేనే. లేకుంటే అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. తర్వాత బయటకు వచ్చి స్థిరపడే సరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అంటే వైద్య వృత్తిలో స్థిరపడాలంటే మొత్తంగా 15 ఏళ్లు పడుతుందన్న మాట. మరోవైపు లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తర్వాత మళ్లీ కోట్లల్లో డబ్బులు పెడితేనే పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చదవగలిగే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పీజీ సీటు రాక.. ఇటు ఎంబీబీఎస్తో ఏమీ చేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో యోగాను ప్రవేశపెట్టి, విద్యార్థుల్లో ఒత్తిడిని, నిరాశను తగ్గించేందుకు ప్రయత్నిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. విదేశీ గ్రాడ్యుయేట్లు ఇక్కడి పరీక్షలో ఫెయిల్! ఇక్కడ సీట్ల కొరతతో వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో మెడిసిన్ చదువుతుండగా, దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్ష పాసయ్యేవారు 20 శాతం కూడా మించడం లేదు. ఈ ఏడాది జూన్లో జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో కేవలం 2,348 మంది మాత్రమే పాసయ్యారు. ఓ జర్నల్ ప్రకారం.. వైద్యుల ఆత్యహత్యకు దారితీస్తున్న పరిస్థితులు.. ►ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మూడింట ఒక వంతు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు కాగా మిగిలినవారు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఉంటున్నారు. అనేక ఒత్తిళ్ల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పీజీలో ఆర్థిక భారం, వృత్తి పరమైన ఒత్తిడి, వివాహ సమస్యలు వంటివి కారణాలుగా ఉన్నాయి. ►ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన ఆత్మహత్యలే 60 శాతం వరకు ఉంటున్నాయి. ►ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది యువతుల తల్లిదండ్రులు వీరిపై ఆసక్తి చూపించడం లేదు. ►కొందరు ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. దీంతో వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో వారిలో ఒత్తిడి పెరుగుతోంది. ►ఎంబీబీఎస్ వైద్యులు కేవలం కేర్టేకర్ల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇది వారిని కుంగుబాటుకు గురిచేస్తోంది. ►పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. వారి చిన్నప్పటి క్లాస్మేట్స్ కొందరు ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే లక్షల్లో సంపాదిస్తుండటం వారిలో ఆత్మన్యూనతా భావన కలిగిస్తోంది. ప్రతి ఆత్మహత్య వెనుక 20 ప్రయత్నాలు ఆత్మహత్య రిస్క్ వైద్యుల్లోనే ఎక్కువ. ఏటా దేశంలో లక్ష మంది వైద్యుల్లో 40మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య వెనుక సగటున 20 ప్రయత్నాలు ఉంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య ఒత్తిడి, నిరాశతోనే.. ఎంబీబీఎస్ తర్వాత పీజీలో తామనుకున్న స్పెషలైజేషన్లో సీటు రాకపోవడంతో చాలామంది వైద్య విద్యార్థులు డిప్రెషన్లోకి పోతున్నారు. ఆ సీట్లు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్తో బతకలేరు ఈ రోజుల్లో ఎంబీబీఎస్తో బయట బతికే పరిస్థితి లేదు. తప్పనిసరిగా పీజీ చదివితేనే భవిష్యత్తు ఉంది. అయితే ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ ఉన్నా, పీజీ సీట్లు ఆ మేరకు లేవు. దీంతో చాలామంది వైద్య నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇలాంటి కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ కార్తీక్ నాగుల, రాష్ట్ర అధ్యక్షుడు, జూడాల సంఘం -
కోవిడ్ వ్యాక్సిన్ @ 200 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది. -
14 దేశాలు, 100కిపైగా కేసులు
వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్పై పడుకున్నా సోకుతుంది. చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. -
కరోనా కాలర్ ట్యూన్లు తక్షణమే ఆపేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది. వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి. -
కరోనా అప్డేట్: కొత్తగా మరో 67,597 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
మరో 1,07,474 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1,07,474 కోవిడ్–19 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే మరో 865 మంది వైరస్ కాటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కు, మరణాల సంఖ్య 5,01,979కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం... కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.90 శాతం ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 95.91 శాతమని ఆరోగ్య శాఖ ప్రకటించింది. -
భారత్లో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే.. కారణమిదే!
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్వేవ్తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు. దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు. టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్లో ఉందని చెప్పారు. -
దేశంలో 6 లక్షలకు క్రియాశీలక కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు భారీగా పెరిగి 6 లక్షల సమీపానికి చేరుకున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 96.98 శాతానికి తగ్గడం కూడా యాక్టివ్ కేసుల్ని పెంచేసింది. ప్రస్తుతం 5,90,611 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం 4,72,169 ఉన్న యాక్టివ్ కేసులు ఒక్క రోజులోనే 1,18, 442లు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరుకుంది. ఇక సాంకేతికంగా ఒమిక్రాన్ కేసులు 3,623 ఉన్నప్పటికీ మొత్తం కేసుల్లో అగ్రభాగం అవే ఉండవచ్చునని అంచనాలున్నాయి. ► పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందున్న వేళ లోక్సభ, రాజ్యసభ సిబ్బంది 400 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జనవరి 4–8 మధ్య వరకు పార్లమెంటు సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 400 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. ► కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపునిచ్చినట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వారు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. ► ఢిల్లీలో రోజుకి 20వేలకు పైగా కేసులు వస్తున్నప్పటికీ లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తే లాక్డౌన్ అవసరం ఉండదన్నారు. ► మహారాష్ట్రలో అత్యధికంగా 41 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని సవరించింది. జిమ్స్, బ్యూటీ సెలూన్లను 50% సామర్థ్యంతో జనవరి 10 అర్ధరాత్రి నుంచి నడుపుకోవచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది. ► పంజాబ్లో ఆక్సిజన్ అవసరం ఉన్న కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాడు 62 మందికి కృత్రిమ శ్వాస అందిస్తే, శనివారానికి వారి సంఖ్య 226కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ వెల్లడించింది. నలుగురు సుప్రీం జడ్జీలకు కరోనా అత్యున్నత న్యాయస్థానంలో కూడా కరోనా కలవరం రేపుతోంది. సుప్రీంకోర్టుకి చెందిన నలుగురు న్యాయమూర్తులు, 5% సిబ్బందికి కరోనా సోకినట్టుగా కోర్టు అధికారులు వెల్లడించారు. సుప్రీంలోని 32 మంది న్యాయమూర్తులకు గాను నలుగురికి, 3 వేల మంది సిబ్బందిలో 150 మందికి కరోనా సోకినట్టుగా తెలిపారు. -
కరోనా కేసులు లక్ష దాటేశాయ్
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 214 రోజుల తర్వాత రికార్డు స్థాయిలో మళ్లీ లక్షకి పైగా కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే 1,17,100 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3,007 వచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు లక్షకు పైగా కేసులు రావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకుంది. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు రావడం 120 రోజుల తర్వాత ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 302 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74% ఉంటే, గతవారం రోజుల పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. గత ఏడాది జూన్ 7న దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 17,335 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 17.73 శాతానికి పెరిగింది. ఇటలీ నుంచి అమృత్సర్కు శుక్రవారం వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రోమ్ నుంచి వచ్చిన ఈ విమానంలో 285 మందికి పాజిటివ్ వస్తే, మరో 50 మంది కోవిడ్ పరీక్ష ఫలితం ఇంకా తెలియాల్సి ఉందని అమృత్సర్ ఎయిర్పోర్టు డైరెక్టర్ వి.కె.సేథ్ చెప్పారు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండడంతో అస్సాం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకోని వారు బహిరంగ ప్రదేశాలకు రాకూడదని ఆదేశించింది. హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్లోకి టీకా రెండు డోసులు తీసుకోని వారికి అనుమతిస్తే ఆయా యాజమాన్యాలకు రూ.25,000 జరిమానాగా విధిస్తామని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ @150 కోట్లు భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. శుక్రవారం నాటికి దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్ టీకా పంపిణీ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ఎన్నో జీవితాలను కాపాడినట్లయిందన్నారు. దేశంలోని అర్హుల్లో 91% మంది కనీసం ఒక్క డోసు టీకా వేయించుకోగా, 66% మందికి రెండు డోసులు పూర్తయిందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్లో అర్హులైన 22% మంది బాలబాలికలు టీకా వేయించుకున్నారని చెప్పారు. ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోస్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదని, నేరుగా, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం స్పష్టంచేసింది. -
వాయువేగంతో ఒమిక్రాన్.. ఒకే రోజు 65శాతం జంప్
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ వాయువేగంగా విస్తరిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే కరోనా కేసులు దాదాపు 65 శాతం పెరిగిపోయాయి. సోమవారం 37,379 కేసులు నమోదైతే, ఆ తర్వాత 24 గంటల్లో ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరగడం ఆందోళనను పెంచుతోంది. డిసెంబరు 30న 1.10 శాతంగా ఉన్న దేశ సగటు పాజిటివిటీ రేటు వారం తిరిగేసరికి 4.18 (జనవరి 5) శాతానికి చేరుకోవడం గమనార్హం. ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు మించిపోయాయి. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరుకున్నట్టు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. డిసెంబర్ 15న ఆయనకు కరోనా సోకగా జన్యుక్రమ విశ్లేషణ నివేదికలో ఒమిక్రాన్ సోకిందని డిసెంబర్ 25న వచ్చిన నివేదికలో తేలింది. అప్పటికే ఆయనకు జరిపిన పరీక్షల్లో రెండుసార్లు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా తగ్గాక ఆ వృద్ధుడికి న్యుమోనియా సోకడంతో ప్రాణాలు కోల్పోయాడని ఉదయ్పూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ ఖరాడి చెప్పారు. ప్రికాషన్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ నగరాలపై కరోనా పడగ విప్పడంతో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడి వయసు ఉండి ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడేవారు ప్రికాషనరీ డోసు తీసుకోవాలని పేర్కొంది. అంతకు ముందు రెండు డోసులు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నారో అదే వ్యాక్సిన్ తీసుకోవాలని, వేరే కంపెనీది తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రికాషనరీ డోసుని జనవరి 10 నుంచి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ స్పష్టం చేశారు. తమిళనాడు, హిమాచల్లో నైట్ కర్ఫ్యూ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షల్ని కఠినతరం చేసింది. గురువారం రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా వెల్లడించింది. జనవరి 9 ఆదివారం రోజంతా సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించింది. అటు హిమాచల్ప్రదేశ్లో కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ర్యాలీలను, మహిళల నాలుగు మారథాన్లను రద్దుచేసుకుంది. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి సమీక్షించాలని పీసీసీలకు సూచించింది. -
కరోనా కేసుల్లో పెరుగుదల.. జాగ్రత్త సుమా!
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
9 నెలల తర్వాతే బూస్టర్
న్యూఢిల్లీ: దేశంలోని 15–18 ఏళ్ల గ్రూపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ‘ప్రికాషన్ డోస్’గా ఇచ్చే మూడో డోస్ టీకాపైనా మరింత స్పష్టత నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘15ఏళ్లు ఆపై వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2007, అంతకంటే ముందే పుట్టిన వారు అర్హులవుతారు. దేశంలో 15–18 ఏళ్ల గ్రూపు వారికి కోవాగ్జిన్ టీకా(అత్యవసర వినియోగానికి) ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది’అని వివరించింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్–డీ వ్యాక్సిన్ను 12–18 ఏళ్ల వారికి వాడటానికి ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతులు లభించినా.. ఈ టీకాను ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకు కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. అదేవిధంగా, ‘ప్రాధాన్యతాక్రమం ప్రకారం హెల్త్కేర్ వర్కర్లు (హెచ్సీడబ్ల్యూలు), ఫ్రంట్లైన్ వర్కర్లు (ఎఫ్ఎల్డబ్ల్యూలు), 60 ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్కు అర్హులు. జనవరి 3వ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయి ఉండాలి’అని ఆ మార్గదర్శకాల్లో వివరించింది. ‘కోవిన్ యాప్ నుంచి వీరు టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. కోవిన్ యాప్ నమోదైన రెండో డోస్ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోస్కు అర్హత లభిస్తుంది. 9 నెలలు/39 వారాల గడువు ముగిసిన వారి రిజిస్టర్ మొబైల్ నంబర్కు మెసేజీ అందుతుంది. ఆన్లైన్తోపాటు ఆన్సైట్లోనూ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేడు రాష్ట్రాలతో భేటీ ప్రికాషన్ డోస్, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్గా సమావేశం జరపనుంది. -
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధిక కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం సహాయ బృందాలను పంపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్ల్లో కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడంతో నిపుణుల బృందాలను పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3–5 రోజులుండి రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయని తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్, తగినన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపడంపై ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. కోవిడ్ నిబంధనల అమలు, ఆస్పత్రుల్లో పడకల వివరాలు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లభ్యత, టీకా కార్యక్రమంపై సమీక్ష చేస్తాయి. ఆవివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాయి. ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని ఎక్కడా ఉత్సవాలు జరపకూడదని కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ముంబైలో రాత్రి పూట ఐదుగురికి మించి గుమికూడడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్లో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శనివారానికి 415కు చేరింది. వీరిలో 115మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర(108)లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ(79), గుజరాత్(43), తెలంగాణ(38), కేరళ(37), తమిళనాడు(34), కర్ణాటక(31) ఉన్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 7,189 కరోనా కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 58వ రోజు కూడా కొత్త కేసులు 15వేలకు లోపు నమోదు కావడం విశేషం. అదేవిధంగా మొత్తం యాక్టివ్ కేసులు 77,032కు చేరాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇది 0.22 శాతానికి సమానం. -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం
న్యూఢిల్లీ: సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. ‘బ్రిటిష్ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్ గవర్నెన్స్లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’అని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ నిర్ణయంతో మరణించిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మేలు కలుగుతుందన్నారు. అలాగే అవయవదానం చేయాలనుకునే వారి నుంచి అవయవాలు తీసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా భవిష్యత్తులో నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. -
పెరిగిన కరోనా మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కారణంగా ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్కరోజులో మహమ్మారి కారణంగా 666 మంది మృతి చెందారు. కేరళ ప్రభుత్వం గతంలో సంభవించిన 292 మరణాలను తాజాగా నమోదుచేయడంతో ఈ పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,53,708కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728కి తగ్గగా, గత 24 గంటల్లో 16,326 కొత్త కేసుకోవిడ్–19, మరణాలు, కేంద్ర ఆరోగ్య శాఖలు నిర్ధారణయ్యాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్లో101.30 కోట్ల టీకా డోస్లు ఇచ్చారు. -
కరోనా కొత్త కేసులు 14,146
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 229 రోజుల కనిష్టానికి పడిపోవడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 3,40,67,719కు చేరుకుంది. శనివారం 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 14,146 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇక కరోనా యాక్టివ్ కేసులు రెండు లక్షలకు దిగువకి తగ్గిపోయాయి. ప్రస్తుతం 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇప్పుడేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఒక్క రోజులోనే యాక్టివ్ కేసులు 5,786 తగ్గాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.57 శాతం ఉన్నాయి. ఇక కోవిడ్ రికవరీ రేటు 98.10 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారినపడి మరో 144 మంది మరణించారు. దీంతో మొత్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 4.52,124కి చేరుకుంది. కోవిడ్ టీకా డోసుల పంపిణీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శనివారం ఒక్కరోజే 41,20,772 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 97 కోట్లను దాటేసింది. కరోనా మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.50 వేల సాయం లక్నో: కోవిడ్–19 మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయం అందించే విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కరోనా ఆర్థిక సాయం పంపిణీకి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. -
97.23 కోట్ల డోసులను దాటిన వ్యాక్సినేషన్ డ్రైవ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో 97.23 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో ఇచి్చన 8,36,118 డోసులతో కలిపి మొత్తం డోసుల సంఖ్య 97.23 కోట్ల డోసులను (97,23,77,045) అధిగమించింది. గత 24 గంటల్లో 17,861 మంది రోగులు కోలుకున్న తర్వాత మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 3,33,99,961 కు పెరిగింది. అదే సమయంలో దేశవ్యాప్త రికవరీ రేటు 98.08 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 15,981 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 8 రోజులుగా దేశంలో 20వేల కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,632కు చేరింది. ఇది 218 రోజుల కనిష్ట స్థాయిగా ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు 24 గంటల్లో మొత్తం 9,23,003 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 59 కోట్ల కరోనా టెస్ట్లు చేశారు. అదే సమయంలో వారపు పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. గత 113 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. కాగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. -
ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి
న్యూఢిల్లీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధ్యమైనంత వరకు జనం గుమికూడే చోటుకు వెళ్లొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆన్లైన్ పద్ధతుల్లోనే షాపింగ్ చేసుకోవాలని కోరింది. మహమ్మారి సెకండ్వేవ్ ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయని గుర్తు చేసింది. ‘‘ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, ఏమరుపాటు తగదు. మహమ్మారి ఇంకా మనమధ్యే ఉంది. అప్రమత్తంగా లేకుంటే అనుకోకుండా పరిస్థితి విషమించవచ్చు’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మీడియాతో అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%కి మించి ఉందన్నారు. దేశంలోని అర్హులైన 71% మంది కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా వేయించుకోగా, వీరిలో 27% మందికి రెండు డోసులు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత లేనే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ రోజువారీ కరోనా కేసులు 4.5–5 లక్షల వరకు పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 8.36 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 1.35 లక్షల ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
తప్పనిసరి జాబితాలోకి కొత్తగా 39 రకాల ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరి జాబితాలో కొత్తగా 39 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చేర్చారు. ప్రజారోగ్యంలో నిత్యం వినియోగించే ఔషధాలనే తప్పనిసరి జాబితాలో చేరుస్తుంటారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్ లిస్టింగ్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్– 2021ను విడుదల చేసింది. దీంతో ఈ మందులను అనేక కంపెనీలు తయారు చేయడానికి, వాటి ధరలు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఈ జాబితాలో ఎక్కువగా క్యాన్సర్, షుగర్ నియంత్రణ, యాంటీబయాటిక్స్ వంటి మందులున్నాయి. అయితే ఇప్పటికే జాబితాలో ఉన్న 16 రకాల ఔషధాలను తీసేశారు. మార్పులు, చేర్పుల తర్వాత తప్పనిసరి జాబితాలో ప్రస్తుతం 874 మందులున్నాయని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్య పరిరక్షణకు తప్పనిసరైతేనే... దేశంలో 1996లో తొలిసారి తప్పనిసరి మందులజాబితాను తయారు చేయగా, 2015లో విధివిధానాలను రూపొందించారు. ఈ జాబితాలో చేర్చాల్సిన మందుకు లైసెన్స్ ఉండాలి. సంబంధిత జబ్బు ప్రజారోగ్య సమస్యగా ఉండాలి. ఇప్పటికే అందులో ఉన్న మందు నిషేధానికి గురైనా, రియాక్షన్లు వచ్చినా ఆ జాబితా నుంచి తీసేస్తారు. ప్రస్తుతం జాబితాలో చేర్చిన మందుల్లో ప్రధానంగా క్యాన్సర్, టీబీ, ఆస్తమాకు సంబంధించిన కొన్ని రకాల స్టెరాయిడ్స్, పొగ సంబంధిత ఉత్పత్తుల వాడకాన్ని మాన్పించేవి, విషవిరుగుడు మందులు, లేబొరేటరీలో తయారు చేసిన ఇన్సులిన్ మందు, యాంటీవైరల్స్, యాంటీ పారసైట్స్, గర్భధారణ నియంత్రణ మందులు, రోటావైరస్ వ్యాక్సిన్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.50 వేల వరకు ధర కలిగిన గుండెపోటు మందులు.. ప్రధానంగా గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పలుచపరిచే మందు, హెచ్ఐవీ, హెపటైటిస్–బి, యాంటీ ఫంగల్ సంబంధించిన మందులను తప్పనిసరి జాబితాలో చేర్చారు. ఈ జాబితా నుంచి తీసేసినవాటిల్లో బీపీ మందు ఎటినలాల్, బ్లీచింగ్ పౌడర్, యాంటీబయోటిక్కు చెందిన ఎరిత్రోమైసిన్, గర్భధారణను నియంత్రించే కొన్ని రకాల మందులున్నాయి. జాబితాలో చేర్చిన మందును ఐదేళ్లపాటు కొనసాగించాలి. చిన్న, చిన్న విషయాలకు తొలగించకూడదు. దీంతో కంపెనీలు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తాయి. భారాన్ని తగ్గించేందుకే ప్రజారోగ్య పరిరక్షణకు వినియోగించే మందుల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి మందుల జాబితాలో చేరుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... దేశంలో మందులపై పెట్టే ఖర్చులో 90 శాతం మేర ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఆ భారాన్ని తగ్గించేదిశగా మనదేశం 2015 నుండి మందుల జాబితాను క్రమబద్ధీకరిస్తోంది. ఈ ఏడాది అలాంటివాటిలో ఇన్సులిన్, క్యాన్సర్, హెచ్ఐవీ మందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మందులు ధరలు నియంత్రణ జాబితాలోకి వస్తే ప్రజలపై భారం కొంత తగ్గుతుంది. –డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
‘ఈ–సంజీవని’లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలీ మెడిసిన్ సేవ ఈ–సంజీవనిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని సేవలకు సంబంధించి 1.2 కోట్ల సంప్రదింపులు పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్..ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్– హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (ఏబీ–హెచ్డబ్ల్యూసీ), ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలు కలిపి 37,04,258 సంప్రదింపులతో తొలిస్థానంలో నిలిచిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 వేల హబ్లు, 28 వేల స్పోక్లను ఏర్పాటు చేసింది. ఏపీ తరువాత ఈ–సంజీవని అందించిన రాష్ట్రాల్లో కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్ (13,28,889), గుజరాత్ (4,60,326), మధ్యప్రదేశ్ (4,28,544), బిహార్ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. -
తప్పదనుకుంటే టీకాలూ తప్పనిసరే
న్యూఢిల్లీ: పండగల సీజన్లో వైరస్ వ్యాప్తి ఉధృతిని అడ్డుకునేందుకు పౌరులు తమ వంతు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ హితవు పలికింది. పర్వదినాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని భావించే వారు ఖచ్చితంగా రెండు డోస్లు(ఫుల్ వ్యాక్సినేషన్) తీసుకోవాలని కేంద్రం సూచించింది. మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమనిబంధనలను పాటించాలని సలహా ఇచ్చింది. వారపు పాజిటివిటీ రేటు కాస్తంత తగ్గినా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించింది. ఆగస్ట్ చివరి రోజుల్లో వారపు పాజిటివిటీ రేటు 39 జిల్లాల్లో ఇంకా ఏకంగా 10 శాతం పైనే నమోదైందని ఆందోళన వ్యక్తంచేసింది. మరో 38 జిల్లాల్లో 5–10 శాతానికి చేరుకుందని పేర్కొంది. ‘వచ్చే పండగల సీజన్లో కరోనా మూడో వేవ్ ముంగిట మనం ఉండబోతున్నామనే భయాలు ప్రజల్లో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసందోహం ఉండే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లడాన్ని ప్రజలు మానుకోవాలి. ఖచ్చితంగా వెళ్తామని నిర్ణయించుకునే వారు రెండు డోస్లు తీసుకోవాలి. సమూహాలకు ప్రాధాన్యతనివ్వకుండా వారి వారి ఇళ్లల్లోనే పండగలు చేసుకుంటే ఉత్తమం’ అని కేంద్రం హితబోధ చేసింది. దేశంలో దాదాపు 300కుపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా కేంద్రం గుర్తుచేసింది. -
రెండు నెలల గరిష్ట స్థాయికి కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఎప్పుడూ నమోదుకానంతటి స్థాయిలో గురువారం ఒక్క రోజే 47,092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు.మరో 509 మంది కోవిడ్తో మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.8 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటిదాకా 66.30 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది. అర్హుల్లో సగం మందికిపైగా టీకా కరోనా టీకా తీసుకోవడానికి అర్హులైన వారిలో 54 శాతం మందికి కనీసం ఒక డోస్ టీకా ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. అర్హులైన జనాభాలో 16 శాతం మందికి రెండు డోస్లు ఇచ్చినట్లు పేర్కొంది. సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, హిమాచల్లో యుక్తవయసు వారందరికీ కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ఆగస్ట్ నెల చివరి ఏడు రోజుల్లో సగటున రోజుకు 80.27 లక్షల టీకాలు ఇచ్చామన్నారు. దేశంలోని మొత్తం హెల్త్కేర్ వర్కర్లలో 99 శాతం మందికి ఒక టీకా, 84 శాతం మందికి రెండు డోస్లు ఇచ్చారు. -
దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉంది: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉందని కేంద్రం పేర్కొంది. కేరళలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళలోనే సగం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పండగల నేపథ్యంలో సెప్టెంబరు, అక్టోబరులో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. రెండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్ -
34,457 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్లో శనివారం 34,457 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,23,93,286కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,61,340కు పడిపోయింది. గత 151 రోజుల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.12 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 375 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,33,964కు చేరుకుంది. శుక్రవారం 17,21,205 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 1.98గా నమోదైంది. దేశంలో నేటికి 50,45,76,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,15,97,982కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.54గా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 57.61 కోట్ల డోసుల టీకాలు వేశారు. -
36,083 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్లో ఆదివారం 36,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,21,92,576కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,85,336కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.20 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 493 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,225కు చేరుకుంది. శనివారం 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 1.88గా నమోదైంది. దేశంలో నేటికి 49,36,24,440 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.46గా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 54.38 కోట్ల డోసుల టీకాలు వేశారు. -
తెలంగాణలో 80% యాంటిజెన్ పరీక్షలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలో కాస్త నిర్లక్ష్యం కనిపిస్తోంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్న నిబంధనను వైద్య ఆరోగ్య అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన వాటిలో 80 శాతంపైగా యాంటిజెన్ పరీక్షలే. కేవలం 17.51 శాతానికే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు పరిమితమైనట్లు ఇటీవల విడుదల చేసిన నివేదికలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,35,67,447 యాంటిజెన్ పరీక్షలు చేయగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య 23,76,131కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుత ఆగస్టులో 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మరీ ఘోరంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అత్యంత తక్కువగా చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం.. గత నెల 4 నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత తక్కువగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఈ కాలంలో నారాయణపేటలో 14,350 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 10 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. మిగిలివన్నీ యాంటిజెన్ పరీక్షలే. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఇదే కాలంలో 38,249 పరీక్షలు చేస్తే, అందులో 61 మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,35,305 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 352 మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు. అదనంగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలు పెట్టినా రాష్ట్రంలో నెల క్రితం అదనంగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కువ మందికి ఆ టెస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుంది. కొత్తవాటితో రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ కేంద్రాల సంఖ్య 31కి చేరుకుంది. కానీ చాలా జిల్లా ఆసుపత్రుల్లో వీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. -
ఇక వాట్సాప్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్ నుంచి సర్టిఫికెట్ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్ పొందవచ్చు. వాట్సాప్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్ ఎంపీ ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఇలా.. ► మైగవ్ కరోనా హెల్ప్డెస్క్ వాట్సాప్ నెంబర్ 9013151515ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ► కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్లో లేదా కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ను ఇందుకు ఉపయోగించాలి. ► వాట్సాప్లో కాంటాక్టు లిస్టులోని మైగవ్ నెంబర్పై క్లిక్ చేసి, చాట్ బాక్సులో covid certificate లేదా download certificate అని టైప్ చేయాలి. ► రిజిస్టర్డు ఫోన్ నంబర్కు ఆరు ఆంకెల ఓటీపీ వస్తుంది. ► చాట్ బాక్సులో ఓటీపీని ఎంటర్ చేయాలి. ► కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్క ఫోన్ నెంబర్తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకొని ఉంటే.. వారందరి పేర్ల జాబితాను వాట్సాప్ మీకు పంపిస్తుంది. వారిలో ఎవరెవరి సర్టిఫికెట్లు కావాలని మీరు కోరుతున్నారో అడుగుతుంది. ► ఎంతమంది సర్టిఫికెట్లు కావాలో సూచిస్తూ ఆ సంఖ్యను ఎంటర్ చేయాలి. కొన్ని సెకండ్లలోనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వాట్సాప్ చాట్ బాక్సులో ప్రత్యక్షమవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
వ్యాక్సిన్స్ @ 46 కోట్ల డోసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 46 కోట్ల మైలురాయి దాటింది. 54,94,423 శిబిరాల ద్వారా మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,81,263 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 37,291 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 97.37% అయింది. కాగా గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 41,649 కొత్త కేసులు నమోదయ్యాయి. 34 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,920 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. -
కోవిడ్తో క్షయకు అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల ఒక వ్యక్తి క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది. ‘కోవిడ్ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్ నిర్ధారణ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది. -
కాలుష్యంతో కరోనా ముప్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయట! ఎందుకంటే అక్కడ కాలుష్యం అధికం కాబట్టి. కాలుష్య సూచి ‘పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5’కు ఎక్కువగా గురయ్యేవారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, పుణే, అహ్మదాబాద్, వారణాసి, లక్నో, సూరత్ తదితర 16 పెద్ద నగరాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అధికం కావడంతో పీఎం 2.5 ఉద్గారాలు భారీస్థాయిలో వెలువడుతున్నాయని, కరోనా వ్యాప్తికి ఇవి కూడా కారణమని అధ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం మనిషిలో రోగ నిరోధక శక్తిని హరిస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్కళ్ యూనివర్సిటీ–భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ–పుణే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా, ఐఐటీ–భువనేశ్వర్కు చెందిన పరిశోధకులు çకలిసి దేశవ్యాప్తంగా 721 జిల్లాల్లో అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 5 వరకూ ఆయా నగరాల్లో కాలుష్య ఉద్గారాలు, గాలి నాణ్యత, కోవిడ్–19 పాజిటివ్ కేసులు, మరణాల సమాచారాన్ని క్రోడీకరించారు. పీఎం 2.5 ఉద్గారాలకు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పునకు, తద్వారా మరణాలకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లలో వంట, ఇతర అవసరాల కోసం జీవ ఇంధనాలను మండించడం కూడా ఉద్గారాలకు కారణమవుతోందని తెలిపారు. మరో 46,617 పాజిటివ్ కేసులు: దేశంలో 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59,384 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.01%కి పెరిగింది. అదే సమయంలో ఒక్క రోజులో 843 మరో మంది మరణించడంతో మొత్తం మరణాలు 4,00,312కు పెరిగాయి. అలాగే, యాక్టివ్ కేసులు మరింత తగ్గి 5,09,637కు చేరాయి. 6 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు: కేరళ, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గకపోవడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఆయా రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి చొప్పున నిపుణులు ఉంటారంది. ఈ బృందాలు కరోనా నియంత్రణ చర్యల అమల్లో సహకరిస్తాయని తెలిపింది. రెండో వేవ్ ముగిసిపోలేదు దేశంలో కరోనా ఆంక్షలు తొలగించడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా, కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కరోనా నియంత్రణ చర్యలు కొనసాగించాలని, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పుడే అస్త్రసన్యాసం చేస్తే కరోనా వ్యాప్తికి మళ్లీ జీవం పోసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో జూన్ 23 నుంచి 29 దాకా వారం రోజులపాటు కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే నమోదయ్యిందని గుర్తుచేశారు. కరోనా వ్యాక్సినేషన్లో వేగం పెంచినట్లు తెలిపారు. గర్భిణులూ కోవిడ్ టీకాకు అర్హులే దేశంలో గర్భవతులు కూడా ఇకపై కోవిడ్ టీకా తీసుకోవచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భవతులను కూడా టీకాకు అర్హులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. గర్భిణులు ఇకపై కోవిన్ యాప్లో నమోదు చేసుకుని లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ టీకా వేయించుకోవచ్చని వివరించింది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. -
దేశంలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45 వేల నమూనాలను పరీక్షించగా ఈ డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూశాయని, మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు ఉన్నాయని తెలిపింది. ఈ పరివర్తనకు సంబంధించి చాలా తక్కువ కేసులు ఉన్నాయని చెబుతూ ఇవి పెరిగే ధోరణిని చూపిస్తుందని చెప్పలేమని స్పష్టం చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో 20, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైందని విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ‘డెల్టా ప్లస్ మ్యుటేషన్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు గుర్తించాం. ఏ జిల్లాలో గానీ ఇది పెరుగుతున్న ధోరణిని చూపిస్తుందని చెప్పలేం‘అని సింగ్ తెలిపారు. డెల్టాలో కనిపించే ట్రాన్స్మిషన్ వేరియంట్ను ఈ వేరియంట్లో కూడా గమనించవచ్చని వివరించారు. దేశంలో కరోనా వైరస్ యొక్క జన్యు పరిణామ క్రమ విశ్లేషణలో ఎన్సీడీసీ పాల్గొంటోందని తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ డెల్టా వేరియంట్ను అదనపు మ్యుటేషన్తో సూచిస్తుందని సింగ్ చెప్పారు. బి.1.617.2.1 గా పరిగణిస్తారని, డెల్టా వేరియంట్కు కె.417ఎన్ జన్యు వేరియంట్ కలవడం వల్ల డెల్టా ప్లస్ అయ్యిందని వివరించారు. కె.417ఎన్ బీటా వేరియంట్లో కూడా ఉండడంతో ఇది ప్రాముఖ్యత కలిగి ఉందని వివరించారు. డెల్టా ప్లస్ వేరియంట్ను ప్లస్ గుర్తుతో సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీని అర్థం వ్యాప్తి తీవ్రత ఎక్కు వనో లేదా మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంద నో కాదు. అలాంటి శాస్త్రీయ ఆధారాలు తేలితే కచ్చితంగా తెలియజేస్తాం..‘అని ఆయన వివరించారు. డెల్టా వేరియంట్ వల్లే.. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లలో పాజిటివ్ నమూనాల్లో 50 శాతానికి పైగా నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉందని ఆయన తెలిపారు. ‘ఈ నేపథ్యంలో రెండో వేవ్ సమయంలో ఉప్పెనలా వచ్చిన కేసులు ఈ వేరియంట్ వల్లే అన్న నిర్ణయానికి వచ్చాం’అని సింగ్ వివరించారు. కొత్త కేసులు 51,667 దేశంలో 24 గంటల్లో కొత్తగా 51,667 కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,01,34,445కు చేరుకున్నాయని తెలిపింది. అదేవిధంగా, ఒక్క రోజులో ఈ మహమ్మారితో 1,329 మంది చనిపోగా మొత్తం మరణాలు 3,93,310కి చేరుకున్నాయి. అత్యధిక స్థాయి నుంచి 88% తగ్గుదల హా కోవిడ్ 19 కేసుల్లో దేశంలో అత్యధికంగా మే 7న 4,14,188 కొత్త కేసులు నమోదవగా, క్రమంగా తగ్గుతూ జూన్ 25 నాటికి 51,667 కేసులు నమోదయ్యాయి. అంటే మే 7 నుంచి జూన్ 25 నాటికి కొత్త కేసుల్లో 88 శాతం తగ్గుదల కనిపించింది. ► వారం రోజుల్లో కొత్త కేసుల నమోదులో సగటున రోజుకు 24 శాతం మేర తగ్గుదల నమోదైంది. మే రెండో వారంలో 6.7 శాతం తగ్గుదల, మూడో వారంలో 22.3 శాతం తగ్గుదల, నాలుగో వారంలో 23.3% తగ్గుదల, మే 29 నుంచి జూన్ 4 మధ్య 33.1% తగ్గుదల, జూన్ 5–11 మధ్య 31.3% తగ్గుదల, జూన్ 12–18 మధ్య 30.3%, గత వారం 23.8% తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుంది. అయితే ఇందుకు వీలుగా కోవిడ్ కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది. ► మే 4న దేశవ్యాప్తంగా 531 జిల్లాల్లో వందకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యేవి. జూన్ 2 నాటికి కేవలం 262 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యేవి. జూన్ 23 నాటికి ఇలా వందకు పైగా నమోదవుతున్న జిల్లాల సంఖ్య 125కు తగ్గింది. వీటిలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోని జిల్లాలే ఉన్నాయి. ► యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మే 10న అత్యధికంగా 31.3 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 6.13 లక్షలకు తగ్గింది. ఇదేస్థాయిలో మే 3వ తేదీన 81.8 శాతం ఉన్న రికవరీ రేటు క్రమంగా 96.7 శాతానికి చేరుకుంది. ► పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 30–మే 6 మధ్య అత్యధికంగా పాజిటివిటీ రేటు 21.6 శాతం ఉండగా, జూన్ 24 నాటికి అది 3.1 శాతానికి చేరుకుంది. ‘డెల్టా ప్లస్’పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ డెల్టా ప్లస్ కేసులు గుర్తించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో బంధం ఏర్పర్చుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకోవడం వంటి లక్షణాలున్నాయన్నారు. -
3% దిగువకు పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019గా ఉంది. మరో 1,647 మంది కోవిడ్తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. రికవరీ రేటు 96.16 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 2.98 శాతంగా నమోదైంది. గత 24 గంటలలో 97,743 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 39 కోట్లకు చేరువైంది. రికవరీల సంఖ్య 2,86,78,390కి పెరిగింది. ఇప్పటి వరకూ 27,23,88,783 డోసుల టీకాలిచ్చారు. -
పసి ముఖానికి ముసుగు తొడగాలా?.. వద్దా? తెలుసుకోండి
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి. ఆ కథేంటో చూద్దాం.. కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్కు టీకా లేదు. కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్ఎస్వీ డేంజర్గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది. అందుకే సడలించారా? పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు. స్కూలుకు పోవచ్చా? చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది. మూడు అడుగుల దూరం! టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు. చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్కేర్ వర్కర్స్ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, హెల్త్ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్ 22న ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్ 29న నోటిఫై చేశామని లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్ కేర్ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చదవండి: సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి -
మేలో మరణమృదంగం
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్వేవ్లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం కేసుల్లో 31.67 శాతం కొత్త కేసులు ఒక్క మే నెలలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల్లో తేలింది. 2.8 కోట్లకు మించిన కేసుల్లో 31.67 శాతం అంటే 88.82 లక్షల కొత్త కేసులు మే నెలలో నమోదయ్యాయని గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో ఇప్పటిదాకా 3,29,100 మంది కోవిడ్తో ప్రాణాలుకోల్పోగా ఒక్క మే నెలలోనే 1,17,247 మంది చనిపోయారు. అంటే మొత్తం మరణాల్లో 35.63 శాతం మరణాలు ఒక్క మే నెలలోనే సంభవించాయి. రోజువారీగా నమోదైన కొత్త కరోనా కేసుల సంఖ్య సైతం మే నెలలోనే నమోదైంది. మే 7వ తేదీన దేశంలోనే రికార్డుస్థాయిలో 4,14,188 కొత్త కేసులొచ్చాయి. ఒక్కరోజులో అధిక కోవిడ్ బాధితుల మరణాలు సైతం మే నెలలోనే సంభవించాయి. మే 19వ తేదీన ఏకంగా 4,529 మంది కోవిడ్కు బలయ్యారు. మే 10న యాక్టివ్ కేసుల సంఖ్య సైతం గరిష్టస్థాయిలో 37,45,237గా నమోదైంది. -
44 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు జాడలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు 44 రోజుల తరువాత అత్యల్పంగా నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసులు తగ్గుతున్న క్రమంలోనే వరుసగా 12 రోజులుగా కొత్త కేసులు 3 లక్షలలోపే ఉంటున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,660 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 2,75,55,457కు, మరణాల సంఖ్య 3,18,895కు చేరింది. 90.34%కి చేరిన రికవరీ రేటు కరోనా బారిన పడిన 2,59,459 మంది రోగులు గత 24 గంటల్లో కోలుకున్నారు. రికవరీ రేటు దేశంలో ప్రస్తుతం 90.34%గా ఉంది. రోజువారీ రికవరీలు పెరుగుతూ, 15 రోజులుగా కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,48,93, 410కు చేరి, మరణాల రేటు 1.16 శాతానికి పెరిగింది. ప్రస్తుతం, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా నమోదైంది. మే 10వ తేదీన యాక్టివ్ కేసులు అత్యధికంగా నమోదు కాగా, అప్పటి నుంచి కేసుల్లో తగ్గుదల నమోదు చేసుకుంటోంది. గత 24 గంటల్లో 76,755 కేసులు తగ్గాయి. 9 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు 24 గంటల్లో మొత్తం 20,70,508 కోవిడ్ శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల మొత్తం 33.9 కోట్లు దాటాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచగా రోజువారీ పాజిటివిటీ 9 శాతానికి చేరింది. నాలుగు రోజులుగా పాజిటివిటీ రేటు 10% లోపే ఉంది. మరోవైపు దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. తక్కువ సమయంలో 20 కోట్ల మైలురాయి దాటటంలో అమెరికా తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది. -
ఆ గ్రూప్ వారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇకపై 18–44 ఏళ్ల వయసు వారు ఆన్సైట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు నమోదులేకుండానే ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వచ్చి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగే ఈ ఆన్సైట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం కేవలం ప్రభుత్వ సీవీసీల్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ డోస్ల వృథాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 18–44 ఏళ్ల వయసు వారికి ఆన్సైట్ సదుపాయం కల్పించడం, వారికి అపాయింట్మెంట్తోపాటు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తుది నిర్ణయం తీసుకోవాలని, వారిదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ గ్రూప్ వారికి సరిపడ డోస్లు లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో చాలా వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. డోస్లు లేకున్నా ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అవకాశమిస్తే ఈ గ్రూప్ వారు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పోటెత్తే ప్రమాదముంది. రాష్ట్రాలకు భారీగా డోస్లు పంపకుండానే, ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఈ గ్రూప్ వారి వల్ల పెరిగే భారీ రద్దీని అరికట్టేందుకే గతంలో కేంద్రప్రభుత్వం ఆన్లైన్ అపాయింట్మెంట్ను మాత్రమే అమలుచేసిన సంగతి తెల్సిందే. ప్రైవేట్ ఆధ్వర్యంలో నిడిచే సీవీసీల్లో గతంలో మాదిరి∙ముందస్తుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్కు అనుగుణంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ను అమలుచేయాలి. వేరే గ్రూప్ వాళ్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని డోస్లు తీసుకోవాల్సిన రోజున కొందరు రాకపోవడంతో డోస్లు వృథా అవుతున్నాయి. డోస్ల వృథాకు సంబంధించిన నివేదికలను కేంద్రం పరిశీలించింది. వృథాను అరికట్టేందుకే పరిమిత సంఖ్యలో 18–44 వయసు వారికీ ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ నిబంధన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. -
ఏడో రోజూ రికవరీలే అధికం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 2,76,110 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు పెరిగింది. తమిళనాడులో అత్యధికంగా ఒక్క రోజులో 34,875 కేసులు రాగా, కర్ణాటకలో 34,281 నమోదయ్యాయి. మరో సానుకూల పరిణామంగా వరుసగా నాలుగు రోజులుగా కొత్త కేసులు రోజుకు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. దేశంలో మరో 3,69,077 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,23,55,440కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా 3,874 మంది మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల తర్వాత తొలిసారిగా దేశంలో కోవిడ్తో మరణించి వారి సంఖ్య 4వేల కన్నా తక్కువగా నమోదైంది. కొత్తగా నమోదైన మరణాల్లో 72.25 శాతం మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,87,122కు చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,29,878కు తగ్గింది. రోగుల రికవరీ రేటు 86.74 శాతం ఉండగా, దేశంలో మరణాల రేటు 1.11 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం గడిచిన 24 గంటల్లో 20,55,010 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. భారత్లో ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు జరగటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 13.44 శాతంగా నమోదైంది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 18,70,09,792కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద దాదాపు రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు ఉన్నాయని, మరో మూడ్రోజుల్లో మరో 26 లక్షల డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. -
పెరుగుతున్న మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది మూడోరోజు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కు పెరిగింది. 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,529 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,83,248కు పెరిగింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,89,851 కరోనా రోగులు కోలుకున్నారు. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,19,86,363కు పెరిగింది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,26,719కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులో 69.02 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 20,08,296 పరీక్షలు చేపట్టారు. ఇది అంతర్జాతీయ రికార్డు. భారత్లో ఒకే రోజు ఇంత ఎక్కువ కరోనా టెస్ట్లు చేయడం ఇదే తొలిసారి. గత వారంతో పోలిస్తే భారత్లో 13 శాతం తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రోజూ రెండు లక్షలకు మించి కొత్త కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ తొలిస్థానంలో ఉందని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. -
16.98%కి పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. శనివారం కొత్తగా 3,11,170 కేసులు వచ్చాయి. అయితే గడిచిన 25 రోజుల్లో ఇవే అత్యల్పం కావడం గమనార్హం. అలాగే మే 3వ తేదీన ఏకంగా 24.47 శాతం ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.98 శాతానికి పడిపోయింది. అలాగే యాక్టివ్ కేసులు తగ్గడం కూడా ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 55,344 యాక్టివ్ కేసులు తగ్గాయి. 3.62 లక్షల మంది కోలుకున్నారు. గడిచిన ఆరురోజుల్లో కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవడం ఇది ఐదోసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 14.66 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, మరాణాలు మాత్రం నాలుగు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,11,170 కొత్త కేసులు నమోదు కాగా, 4,077 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 2,07,95,335 ఉండగా... గడిచిన 24 గంటల్లో 3,62,437 మంది కోలుకున్నట్లు పేర్కొంది. కోలుకున్న వారిలో అధికశాతం ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాల్లో (71 శాతం) ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఆదివారానికి 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీటిలో 74.69 శాతం కేసులు ఏపీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. పాజిటివిటీ రేటు 16.98 శాతానికి తగ్గిందని తెలిపింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. మూడో దశ టీకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇచ్చిన డోసులు 18.22 కోట్లు దాటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాల్లో 66.76 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాలు ఉన్నట్లు పేర్కొంది. 18 నుంచి 44 వయసు వారు 5,62,130 మందికి గడిచిన 24 గంటల్లో టీకా అందించామని తెలిపింది. దీంట్లో ఏపీలో 3443 మంది, తెలంగాణలో 500 మందని ఉన్నారని వివరించింది. టీకాలు ప్రారంభించిన 120 రోజున.. మే15న 17,33,232 డోసులు పంపిణీ జరిగిందని దీంట్లో 11,30,928 మందికి తొలి డోసు, 6,02,304 మందికి రెండో డోసు అందించినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక (41,664), మహారాష్ట్ర (34,848), తమిళనాడు (33,658)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 960 మంది, కర్ణాటకలో 349 మంది ఉన్నట్లు తెలిపింది. -
గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే... ► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి. కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ► ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్ సెంటర్లో ఐసోలేషన్ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్ పాటించాలి. ► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలి. ► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి. ► ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి. ► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు, మోడరేట్ కేసుల వారిని డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి. ► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పకుండా చేయాలి. ► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో 30 పడకలుండాలి. గిరిజన ప్రాంతాల్లో.... గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో.... ► ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి. కోవిడ్–కేర్ కార్యక లాపాల్లోనూ కీలకపాత్ర పోషించాలి. ► మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్కేర్ సెంటర్లతో అనుసంధానించాలి. ► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. -
Corona Vaccine: కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేరుగా దిగుమతికీ వెసులుబాటు విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది. తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది. 3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం కోవాగ్జిన్ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్ను లైవ్ వైరస్ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు. -
కరోనా..మరో ప్రపంచ రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు 4 లక్షల మందికిపైగా కరోనా సోకినట్లు నిర్ధారణయింది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,14,91,598కి చేరుకుంది. దీంతోపాటు, ఒక్క రోజులో 3,915 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,34,083కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 853 మంది మరణించారు. పది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. పది రోజుల్లో మొత్తం 36,110 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం అమెరికాలో 10 రోజుల్లో 34,798 మంది, బ్రెజిల్లో 32,692 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం యాక్టివ్ కేసులు 36,45,164కు చేరుకున్నాయి. కేవలం 10 నగరాల్లోనే 25% యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో అత్యధికంగా బెంగళూరు అర్బన్లో 9.13%, పుణేలో 3.16%, ఢిల్లీలో 2.49%, అహ్మదాబా§ద్లో 1.82%, చికిత్స పొందుతున్న రోగులున్నారు. గత 24 గంటల్లో 81.95% రికవరీ రేటుతో 3,31,507మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,76,12,351కు చేరుకుంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో 24 గంటల్లో 23,70,298 వ్యాక్సిన్ డోస్లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 16,49,73,058 వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు అందించారు. మరోవైపు కరోనా సంక్రమణను గుర్తించేందుకు గురువారం ఒక్కరోజులోనే 18,26,490 శాంపిల్స్ను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17,35,07,770 కోవిడ్ వ్యాక్సిన్ డోస్లను ఉచితంగా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
కరోనా కరాళ నృత్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో మరోసారి పెరగడం ఆందోళనకు కలిగిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,82,315 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య.. అమెరికాలో రోజువారీగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. గత 24 గంటల్లో 3780 మంది రోగులు మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 2,26,188కు చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 3,38,439 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,69,51,731 కు పెరిగింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34,87,229కు చేరుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 16,04,94,188 వ్యాక్సిన్ డోస్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 17,02,42,410 డోసులు ఉచితంగా అందించింది. -
సమృద్ధిగా ఆక్సిజన్.. సరఫరానే సమస్య
అమెరికన్ రాక్ బాండ్ గాయకుడు పియర్ల్ జామ్ 2009లో పాడిన పాట శీర్షిక పేరు జస్ట్ బ్రీత్ ఇప్పుడు మనం జీవిస్తున్న యుగ సందర్భానికి సరిగ్గా సరిపోయే పేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమవుతున్న కోవిడ్–19 ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని స్తంభింపజేసింది. కోవిడ్–19 సాంక్రమిక వ్యాధి. ప్రధానంగా ఊపిరి ఆడనివ్వకుండా చేసి మరణానికి కారణమవుతుంది. ఆసుపత్రుల్లో కొత్త రకం వైరస్కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైద్య అవసరాలకోసం ఆక్సిజన్ కీలకం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి విషమించిన రోగులకు జీవనదానమిచ్చి ప్రాణాలను కాపాడుతున్నది ఆక్సిజన్ మాత్రమే. కరోనారోగుల్లో 80 శాతం మందికి స్వల్ప మాత్రంగా లక్షణాలు కనీకనిపించని విధంగా పొడసూపుతుండగా మిగిలిన 20 శాతమంది రోగులకు ఆక్సిజన్ మద్దతు అవసరమవుతోంది. అసాధారణమైన కేసుల్లో రోగులకు వెంటిలేటర్లు కూడా వాడుతున్నారు. భారత్లో విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్–19 రోగులకు తక్షణం వైద్యపరమైన ఆక్సిజన్ను అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే పద్ధతులపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమలకు చెందిన సభ్యులతో భారత్లో పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తిదారులు, అనుబంధ పరిశ్రమలతో కూడిన జాతీయ ప్రాతినిధ్య సంస్థ అఖిల భారత ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏఐఐజీఎమ్ఏ)కు ఏప్రిల్ 1న కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తరం పంపింది. భారత్లో, ప్రపంచంలోని అత్యంత ప్రధాన ఆక్సిజన్ తయారీ సంస్థలకు చెందిన 270మంది సభ్యులు ఈ సంస్థలో ఉంటున్నారు. వీటిలో చాలా కంపెనీలు వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేస్తుం డగా, కొన్ని కంపెనీలు ద్రవ ఆక్సిజన్ను తయారు చేస్తున్నాయి. దేశంలో వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ఔషథ ప్రామాణిక నియంత్రణా సంస్థ (సీడీఎస్సీఓ) కలిసి వైద్యపరమైన ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరాను నియంత్రిస్తున్నాయి. మెడికల్ గ్యాస్ ఉత్పత్తి, పంపిణీల నిర్వహణకోసం అనేక కేంద్ర సంస్థలతో టాస్క్ఫోర్స్ని ఏర్పర్చారు. వైద్యపరమైన ఆక్సిజన్ నిల్వలను సిద్ధం చేయడానికి కేంద్ర హోంశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కలిసి పలు చర్యలు చేపట్టాయి. ప్రమాణాలు ఏమాత్రం దెబ్బతినకుండా వైద్యప్రయోజనాల కోసం ఆక్సిజన్ తయారీకి గాను పారిశ్రామిక ఉత్పత్తి సంస్థలను అనుమతించారు. భారత ప్రభుత్వం చేపట్టిన అతి గొప్ప చర్యగా దీనికి విస్తృతంగా ప్రశంసలు లభించాయి. దీనివల్ల వైద్య ఆక్సిజన్ కొరత సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, మారుమూల ప్రాంతాల్లోని రోగుల అవసరాలను కూడా తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడింది. లాక్డౌన్ సమయంలో గ్యాస్ సిలిండర్లను తయారుచేసి రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు ఆక్సిజన్ ఉత్పత్తి దారులకు అనుమతించింది. దీంతో గత సంవత్సర కాలంగా దేశంలోని ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులకు తగినంత మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయడానికి వీలయింది. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో తక్షణ ప్రాతిపదికన మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల సేకరణకుగాను సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ బిడ్లను ఆహ్వానించింది. ఏఐఐజీఎమ్ఏ ప్రెసిడెంట్ సాకేత్ టికు అభిప్రాయం ప్రకారం భారత్లో వైద్యపరమైన ఆక్సిజన్ నిల్వలు చాలినంత ఉన్నాయి. లాక్ డౌన్ విధింపుతో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించడంతో వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ గణనీయంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సైతం దేశంలో 80 వేల టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉంటుండగా రోజుకు 700 టన్నుల వైద్యపరమైన ఆక్సిజన్ను ఉపయోగిస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంపై తాము ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని, ఇది కొలిక్కి వస్తే దేశంలోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సమృద్ధిగా సరఫరా చేయగలమని సాకేత్ టికు నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉంటున్నాయి కానీ సరఫరా వ్యవస్థ కారణంగానే కొన్నిచోట్ల కొరత ఏర్పడుతోందని గ్యాస్ వరల్డ్ సంస్థ బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్ కరీనా కోచా అన్నారు. యూరప్, అమెరికాలతో పోలిస్తే ఆక్సిజన్ అవసరమైన కేసులు భారత్లో తక్కువగానే ఉంటున్నాయి. లాక్డౌన్ కారణంగానే రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. అంతే కానీ దేశ ప్రజలు ఆక్సిజన్ కొరతపై భయాందోళనలు అవసరం లేదని ఆమె అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్య అవసరాలకు ఆక్సిజన్ సమస్యే కాదని తేల్చిపడేశారు. పైగా భవిష్యత్ మెడికల్ ఆక్సిజన్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ వినూత్నమార్గాలను అన్వేషిస్తోంది. విశాఖపట్నం పోర్టులో ఒక ఆక్సిజన్ బాటిల్ని ఆరుమంది రోగులకు ఏకకాలంలో సరఫరా చేయగలిగేలా పోర్టబుల్ మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ను రూపొందించారు. ఇప్పుడు దేశానికి తక్షణం వెంటిలేటర్ల అవసరం ఉంది తప్ప ఆక్సిజన్ కొరతే లేదని చెప్పవచ్చు. మహీంద్రా గ్రూప్, మారుతి, హ్యుండయ్ ఇండియా వంటి భారీ సంస్థలు కూడా ఇప్పుడు వెంటిలేటర్ల ఉత్పత్తిలో భాగమవుతున్నాయి. కాబట్టి, ఇకపై ఆక్సిజన్ కొరత సమస్య కాదు. నిఖిల్ నరేన్, సీనియర్ జర్నలిస్ట్ -
కరోనా రికార్డుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టేస్తోంది. కరోనా సంక్రమణ విషయంలో భారత్ గత కొన్ని రోజులుగా ప్రతీ 24 గంటలకు ఒకసారి రికార్డులను బద్దలుకొడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు. వైరస్తో పోరాడి ఆరోగ్యవంతులైన వారి సంఖ్య మొత్తంగా 1,50,86,878కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య 30,84,814. దీంతో దేశంలో రికవరీ రేటు 82.10 శాతానికి, మరణాల రేటు 1.11% పడిపోయాయి. ఢిల్లీలో చికిత్స పొందుత్ను రోగుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 15 కోట్ల డోస్ల వ్యాక్సినేషన్ ఇప్పటివరకు దేశంలో మొత్తం 15 కోట్ల 20 వేల 648 వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించిన మూడో డ్రైవ్ మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ దశలో అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం బుధవారం వరకు భారత్లో కరోనా వైరస్ కోసం మొత్తం 28,44,71,979 శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. -
వ్యాక్సినేషన్పై చేతులెత్తేస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే ఒకటిన ప్రారంభంకానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బందులు తప్పేట్లులేవు. 18 ఏళ్లు వయసు నిండిన వారందరికీ కోవిడ్ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ సరిపడా టీకా డోస్లు లేకపోవడంతో అందరికీ టీకాలు వేయలేమని పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. టీకా డోస్లకు తీవ్రమైన కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమని రాష్ట్రాలు స్పష్టంచేస్తున్నాయి. టీకాల లభ్యతను బట్టే మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గుజరాత్లో మే 1న టీకా ప్రక్రియపై సందిగ్ధత రాష్ట్రంలో టీకాలు తక్కువ మొత్తంలో ఉండటంతో 18 ఏళ్లు నిండిన వారి కోసం ఉద్దేశించిన మే 1న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపై సందిగ్ధత ఏర్పడింది. ‘ ఫార్మా సంస్థల నుంచి టీకాలు అందగానే వ్యాక్సినేషన్ మొదలుపెడతాం’ అని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఫార్మా సంస్థల నుంచి ప్రభుత్వానికి ఇంతవరకు డోస్లు రాకపోవడం గమనార్హం. ఏ తేదీలోగా డోస్లు అందుతాయో, ఏ తేదీన 18–45 గ్రూప్ వారికి టీకాలు వేస్తారనే వివరాలను ఆ ప్రకటనలో పేర్కొనలేదు. టీకా ప్రక్రియు ఇంకా రెండు రోజులే గడువు ఉన్న తరుణంలో మే 1న వ్యాక్సినేషన్ మొదలుకాబోదని అనుమానాలు పెరిగాయి. పంజాబ్లో ఆలస్యంగా.. తమ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసే ప్రక్రియ ఆలస్యంకానుందని పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్సింగ్ సింధు గురువారం వెల్లడించారు. ‘ మా వద్ద సరిపడా టీకాలు లేవు. అదే అసలు సమస్య. కనీసం పదిలక్షల డోస్లు ఉంటే మే 1న వ్యాక్సినేషన్ మొదలు పెట్టవచ్చు. కానీ ఇప్పడన్ని టీకాలు లేవు. అదే తేదీన మొదలవుతుందని చెప్పలేను’ అని బల్బీర్ వ్యాఖ్యానించారు. 30 లక్షల కోవిషీల్డ్ టీకాల కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్కు ఆర్డర్ ఇచ్చామన్నారు. 45 ఏళ్ల లోపు వయసు వారికీ సరిపడా టీకాలు లేవన్నారు. ప్రతీ వారం 15 లక్షల డోస్లు పంపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు. యూపీ గ్లోబల్ టెండర్లు తమ రాష్ట్రంలో ఉచితంగా అందరికీ టీకా నిమిత్తం దాదాపు 5 కోట్ల డోస్లను కొనుగోలుచేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. ‘ సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లకు చెరో 50 లక్షల డోస్ల కోసం ఆర్డర్లు ఇచ్చాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగేందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. టీకాలను వృథా కానివ్వం. వ్యాక్సినేషన్ కేంద్రాల్లోకి టీకా తీసుకునే వారిని మాత్రమే అనుమతిస్తాం. 45 ఏళ్లు పైబడిన వారికీ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది ’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 18–44 ఏళ్ల వారికి టీకాలు కష్టమే 18–44 ఏళ్ల వయసు వారికి ఇచ్చేందుకు సరిపడినన్ని టీకాలు ప్రస్తుతం తమ వద్ద లేవని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టంచేశారు. కావాల్సిన టీకాల కోసం తయారీసంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. ఢిల్లీకి ఎప్పడు టీకాలు సరఫరా చేస్తారనే షెడ్యూల్ను తయారీసంస్థలు ఇంకా చెప్పలేదన్నారు. వేర్వేరు తయారీసంస్థల నుంచి 1.34 కోట్ల టీకాలు కొనాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. -
Corona Deaths in India: 2 లక్షలు దాటిన మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: అవే భయాందోళనలు... అవే హాహాకారాలు.... అవే హృదయ విదారక దృశ్యాలు. గత కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏర్పడ్డ ఆక్సిజన్, ఆసుపత్రి పడకల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. గత 7 రోజులుగా దేశంలో రోజుకి 3 లక్షలకు పైనే కొత్తకేసులు వస్తున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈనెల 21న తొలిసారిగా పాజిటివ్ కేసుల్లో 3 లక్షల మార్క్ దాటిన భారత్లో గత ఏడు రోజుల్లో మొత్తం 23,80,746 కరోనా సంక్రమణ కేసులు, 18,634 మరణాలు నమోదు అయ్యాయి. కాగా గతేడాది నుంచి కరోనా విలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గత వారం గణాంకాల ప్రకారం భారత్ తరువాత స్థానంలో ఉన్న బ్రెజిల్లో 3,98,487 పాజిటివ్ కేసులు, 17,019 మరణాలు రికార్డ్ అయ్యాయి. ఆ తరువాత అమెరికాలో 3,76,618 పాజిటివ్ కేసులు, 4,874 మరణాలు సంభవించాయంటే మనదేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 41.4% కేసులు భారత్లోనే నమోదవ్వడం కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. 10 రాష్ట్రాల నుంచే 73.59 శాతం కేసులు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 3,60,960 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 1,79,86,840కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా కేసులలో 73.59% శాతం కేసులు ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల నుంచి వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,358, ఉత్తర్ప్రదేశ్లో 32,921, కేరళలో 32,819, కర్ణాటకలో 29,744 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరణించిన 3,293మందితో కలిపి కరోనా కారణంగా మరణించిన మొత్తం రోగుల సంఖ్య 2,01,172 కు పెరిగింది. కరోనా గణాంకాల్లో కొత్త కేసులు, మరణాలు ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 29,78,709కు పెరిగింది. దీంతో దేశంలో యాక్టివ్ రోగుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. అదే సమయంలో 2,61,162 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,17,371 మందికి ఈ వ్యాధి నయమైంది. గత ఏడు రోజులుగా ప్రతీరోజు 3 లక్షలకు మించి కొత్త కేసులు నమోదు కావడంతో రికవరీ రేటు 82.54 శాతానికి, మరణాల రేటు 1.12 శాతానికి పడిపోయింది. మంగళవారం 17,23,912 శాంపిల్స్ పరీక్షించగా 3,60,960 మందికి పాజిటివ్గా తేలింది. అంటే 20.9 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకింది. -
కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్కు తీవ్ర ఇక్కట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్రమణకు ముకుతాడు వేసేందుకు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ మూడోదశకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్కు అనుమతించగా... రద్దీ కారణంగా నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్ పోర్టల్ క్రాష్ అయ్యింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్లోనూ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్ సైట్ నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ ట్రాఫిక్ కారణంగా రిజిస్ట్రేషన్కు ప్రజలు ఇక్కట్లు పడ్డారు. రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్ పోర్టల్పై లోడ్ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకోగలిగారు. అయినప్పటికీ వారి ప్రాంతం ఆధారంగా స్లాట్ బుకింగ్కు మాత్రం అవకాశం ఇంకా ఇవ్వలేదు. టీకాల లభ్యత ఉంటేనే... వ్యాక్సిన్ వేయించుకోవాలనుకొనే 18 ఏళ్లు నిండిన వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా మాత్రమే అపాయింట్మెంట్లు లభిస్తాయి. అంటే వ్యాక్సిన్లు లభ్యంగా ఉండి... మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధం గా ఉన్న కేంద్రాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. ఆర్డర్లు పెట్టి నా సరే.. పలు రాష్ట్రాలు, ప్రైవే టు ఆసుపత్రులకు టీకాలు అందడానికి సమయం పడుతుందని ఫార్మారం గ నిపుణులు అంటున్నారు. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకాల లభ్యత లేనందున మే 1 నుంచి 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదనే చెబుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన అనేకమంది సోషల్మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. కోవిన్ పోర్టల్ స్పందించడం లేదని కొందరు, సైట్ క్రాష్ అయ్యిందని మరికొందరు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే కోవిన్ పోర్టల్ పనిచేస్తోందని, సాయంత్రం 4 గంటలకు సైట్లో వచ్చిన చిన్న లోపం పరిష్కారం అయ్యిందని ఆరోగ్య సేతు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు ఒక ట్వీట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు వ్యాక్సినేషన్ సెషన్లను షెడ్యూల్ చేసిన తర్వాత 18+ వారికి వ్యాక్సిన్ అపాయింట్మెంట్లు సాధ్యమవుతాయని సాయం త్రం 4.54 గంటలకు ఆరోగ్యసేతు యాప్ నుంచి ట్వీట్ వచ్చింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్ని క్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించి విషయం తెలిసిందే. మరికొద్ది వారాల్లో స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. సాఫీగానే జరిగాయి: ఆరోగ్యశాఖ ప్రజలు సోషల్మీడియాలో చేసిన ఫిర్యాదులు, మీడియా రిపోర్టులపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు సాఫీగానే జరిగాయని తెలిపింది. తొలిరోజు బుధవారం 4 నుంచి 7 గంటల మధ్యలో 80 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. ఆరంభంలో నిమిషానికి 27 లక్షల హిట్లు వచ్చాయని... తర్వాత ప్రతిసెకనుకు 55 వేల హిట్లు వస్తున్నాయని, కోవిన్ పోర్టల్ సాఫీగా, సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ల వివరాలను కోవిన్ పోర్టల్లో పెడతామని పేర్కొంది. -
కరోనా కాఠిన్యం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్–19 మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య శరవేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ దేశంలో వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో 75.01 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడినవారి సంఖ్య 1,62,63,695కు చేరింది. దేశంలో 24 గంటల్లో మరో 2,263 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఒక్క రోజులో కరోనా సంబంధిత మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,86,920కు చేరుకుంది. రోజువారీ కరోనా సంబంధిత మరణాల్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. 2,027 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 568, ఢిల్లీలో 306 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 83.92 శాతం భారత్లో ప్రస్తుతం 24,28,616 యాక్టివ్(క్రియాశీల) కరోనా కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 14.93 శాతం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,36,48,159కు చేరింది. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. మొత్తం యాక్టివ్ కేసుల్లో 59.12 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఉన్నాయి. బెంగళూరులో 1.37 లక్షలు, పుణేలో 1.17 లక్షలు, ఢిల్లీలో 91 వేలు, ముంబైలో 81 వేలు, నాగపూర్లో 80,924, థానేలో 80,643, లక్నోలో 54,967, నాసిక్లో 46,706, అహ్మదాబాద్లో 36,247, చెన్నైలో 30,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.15 శాతంగా నమోదయ్యింది. భారత్లో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 13,54,78,420కు చేరుకుంది. ఉత్తరప్రదేశ్లో సింగిల్ డే రికార్డు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37,238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 199 మంది బాధితులు మరణించారు. దీంతో యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,13,370కి, మరణాల సంఖ్య 10,737కు చేరుకుంది. -
Covid Cases in India: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రతీరోజు అత్యధిక మరణాల రికార్డును సృష్టిస్తూ, సెకండ్ వేవ్ మరింత ప్రాణాంతకమని రుజువు చేస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,023 మంది కరోనాతో మరణించారు. గత సంవత్సరం కోవిడ్–19 అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో అత్యధిక మరణాలు మంగళవారం సంభవించాయి. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 1,82,570 కు పెరిగింది. మరోవైపు కొత్తగా 2,95,041 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్ కేసుల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,56,16,130. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,57,538 కు చేరింది. మొత్తం వైరస్ సోకిన వారిలో ఇది 13.82 శాతం. దీంతోపాటు కోవిడ్ కొత్త కేసుల్లో 76 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. 85 శాతానికి చేరుకున్న రికవరీ రేటు: గత 11 రోజుల్లో రోజువారీ పాజిటివ్ కేసులు రెండింతలు అయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీన 1.45 లక్షలు ఉన్న పాజిటివ్ రోగుల సంఖ్య, 21వ తేదీ నాటికి 2.95 లక్షలకు చేరుకున్నాయి. దీంతో రికవరీ రేటు ఇప్పుడు 85 శాతానికి తగ్గిపోయింది. గణాంకాల ప్రకారం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కి పెరిగింది. మరోవైపు కరోనా మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.2 శాతానికి పడిపోయినప్పటికీ, ఇది మహారాష్ట్రలో 1.5 శాతం, పశ్చిమ బెంగాల్లో 1.6 శాతంగా ఉంది. మరణాలు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాలు పాక్షిక, పూర్తి లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. 8 రాష్ట్రాల్లోనే 77 శాతం మరణాలు: దేశంలో కరోనా కారణంగా ఒక్కరోజులో మరణించిన 2,023 మందిలో 77.02% మరణాలు 1,556 మంది ఎనిమిది రాష్ట్రాల్లోనే తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలో అత్యధికంగా 519 మంది, ఢిల్లీలో 277, ఛత్తీస్గఢ్లో 191, ఉత్తరప్రదేశ్లో 162, గుజరాత్ 121, కర్ణాటకలో 149, పంజాబ్లో 60, మధ్యప్రదేశ్లో 77 మంది మరణించారు. అలాగే ఆరు రాష్ట్రాల్లో 60 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 62,097, ఉత్తర్ప్రదేశ్లో 29,574, ఢిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794, కేరళలో 19,577, ఛత్తీస్గఢ్లో 15,625 కరోనా పాజిటివ్ కొత్త రోగులను గుర్తించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో భారత్ ముందుంది. ఇటీవల భారీ సంఖ్యలో పెరిగిన పాజి టివ్ కేసులతో భారత్ అమెరికా తరువాత రెండో స్థానంలో ఉం ది. కరోనాకు సంబంధించిన కొ త్త వేరియంట్ల కారణంగా పాజి టివ్ కేసులు పెరుగు తున్నా యని నిపుణులు భావిస్తున్నారు. -
కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో వరుసగా నాలుగో రోజు కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109 కి చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వైరస్ బారినపడి మొత్తం 1,501 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,38,423 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1,28,09,643 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 1,77,150కి చేరింది. దేశంలో ప్రస్తుతం 18,01,316 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 87.23 శాతం కాగా, మరణాల రేటు 1.21 శాతం ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 15,66,394 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 26,84,956 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 12,26,22,590 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. చదవండి: రెమిడెసివిర్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా? పదునెక్కిన కరోనా కోరలు -
పదునెక్కిన కరోనా కోరలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమయ్యింది. వరుసగా మూడో రోజు 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 2,34,692 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. కరోనా కాటుకు తాజాగా 1,341 మంది బలయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,60కు, మొత్తం మరణాల సంఖ్య 1,75,649కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు వరుసగా 38వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం 16,79,740 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 11.56 శాతం. రికవరీ రేటు 87.23 శాతానికి పడింది. ఇండియాలో ఇప్పటిదాకా 1,26,71,220 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.21 శాతంగా నమోదయ్యింది. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీలో పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో చాలా సీరియస్: కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా ఉధృతి మరింత పెరిగింది. రాష్ట్రంలో పరిస్థితి చాలా సీరియస్గా ఉందని సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేదని అన్నారు. రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ తదితర ముఖ్యమైన మందుల కొరత ఉందని అంగీకరించారు. తగినంత ఆక్సిజన్, ఔషధాలు వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్కు విజ్ఞప్తి చేశామని అన్నారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు పడకలు దొరకడం లేదని చెప్పారు. పడకలు ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరించారు. 12.25 కోట్ల టీకా డోసులు పంపిణీ కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 12,25,02,790 కోవిడ్ టీకా డోసులను అర్హులకు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం 92వ రోజుకు చేరిందని, శనివారం ఒక్కరోజే 25.65 లక్షల డోసులు ఇచ్చినట్లు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న వారిలో 4.04 కోట్ల మంది మొదటి డోసు, 10.76 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని స్పష్టం చేసింది. 60 ఏళ్ల పైబడిన వారిలో 4.55 కోట్ల మంది మొదటి డోసు, 38.77 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని వివరించింది. -
ఒక్కరోజులో 2,17,353 కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు. 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే... దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి. 11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు.. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు. యడియూరప్పకు మళ్లీ కరోనా కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్లకూ కరోనా సోకింది. -
ఆక్సిజన్ వృథాను అరికట్టండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వైరస్ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి విషమించి చాలామంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్)కు డిమాండ్ పెరిగింది. చాలా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ దొరక్క బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు వాడకంలో హేతుబద్ధత (రేషనల్) అవసరమని సూచించింది. దేశమంతటా సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజన్ తయారీ యూనిట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7,127 మిలియన్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని గుర్తుచేసింది. గత రెండు రోజులుగా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. త్వరలోనే అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జిల్లా స్థాయి వరకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండ చూడాలని పేర్కొంది. మెడికల్ ఆక్సిజన్ను ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్గఢ్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారు. -
1,31,968 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 1,31,968 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కి చేరుకుంది. ఇక ఒకే రోజు 780 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మొత్త మరణాల సంఖ్య 1,67,642కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల రోజులుగా వరసగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 56,286 కేసులు నమోదు కాగా, ఛత్తీస్గఢ్లో 10,652, ఉత్తరప్రదేశ్లో 8,474 కేసులు నమోదయ్యాయి. వారియర్స్కి కరోనా కాటు కరోనా వారియర్స్నీ ఆ మహమ్మారి వదలడం లేదు. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వారం రోజుల వ్యవధిలో 22 మంది డాక్టర్లు సహా 32 మంది కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 1, 9 మధ్య కాలంలో వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో 25శాతం మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన మర్నాడే నిమ్స్ వైద్యులకూ కరోనా పాజిటివ్గా తేలింది. మహారాష్ట్రలో లాక్డౌన్ తప్పదేమో గత కొద్ది రోజులుగా 50 వేలకు పైగా కేసులతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితులు ముంచుకొస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిపోతూ ఉండడంతో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల్ని పెంచడానికి రెండు నుంచి మూడు వారాలు లాక్డౌన్ విధించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోలేని పక్షంలో పూర్తి స్థాయి లాక్డౌన్ గురించి ఆలోచిస్తామన్నారు. కరోనా రోగులు పెరిగిపోయి, ఆస్పత్రుల్లో పడకలు చాలక, మందులు లేక పరిస్థితులు చెయ్యి దాటిపోతే అప్పుడు లాక్డౌన్ మినహా మార్గం లేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లాకు పాజిటివ్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న రెండు రోజుల్లోనే ఆయనకు వైరస్ సోకింది. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకా ఎగుమతులు ఆపండి కోవిడ్–19 టీకా డోసుల ఎగుమతుల్ని వెంటనే నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రభావిత వర్గాలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన వనరులు టీకా తయారీ సంస్థలకు సమకూర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మన ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ డోసుల్ని ఎగుమతి ఎందుకు చేయాలి ? వాటిని వెంటనే నిలిపివేయండి. వ్యాక్సిన్ అవసరమైన వారందరికీ వెంటనే ఇవ్వడం ప్రారంభించండి’’అని రాహుల్ ఆ లేఖలో డిమాండ్ చేశారు. -
90 వేలకు చేరువలో కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి. ► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. కనిమొళికి కరోనా పాజిటివ్ డీఎంకే లోక్సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. -
మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 72,330 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 22 లక్షల 21వేల 665కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ఒక్క రోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా మరణాలు 459 నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,62,927కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉన్నట్టు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల్లో 4.78శాతంగా ఉంది. 45 ఏళ్ల వయసు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తే కరోనా కేసుల్ని కట్టడి చేయవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి 61శాతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యువతే క్యారియర్లా ? దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి యువతరం క్యారియర్లగా మారుతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రోడ్లపైకొచ్చి స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరుగుతున్న యువతే కారణమన్న అంచనాలున్నాయి. కరోనా సోకినా తమకేం కాదులే అన్న ధీమాతో ఉన్న యువతరం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా తిరుగుతున్నారని, దీంతో వైరస్ వారినేం చేయకపోయినా యువత నుంచే పెద్దవారికి, వ్యాధులున్నవారికి సోకుతోందని న్యూఢ్లిలీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. బ్రిటన్లో క్రిస్మస్ సమయంలో నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం భారత్లో హోలీ పండుగ సమయంలో వచ్చిందని అన్నారు. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడు కేసులు అత్యధికంగా వెలగులోకి వస్తాయని కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు కూడా అయిన డాక్టర్ రణదీప్ చెప్పారు. నగర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడానికి సెంట్రలైజ్డ్ ఏసీలున్న చోట్ల ప్రజలు ఎక్కువ సేపు గడపడమే కారణమని న్యూరో ఎక్విలిబ్రియమ్ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్నీష్ భండారీ అన్నారు. వేసవికాలం వచ్చినప్పటికీ అత్యంత చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ కరోనా ఉధృతిని కట్టడి చేయాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ నెల 30 వరకు సెలవు దినాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో సూచించింది. మార్చి 31న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చించిన అనంతరం గెజిటెడ్ హాలీడేస్ల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరగాలంటే ప్రైవేటు సెక్టార్ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత మొదలైంది. 45 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 6.5కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల్ని ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా 60 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చారు. -
COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 (గురువారం) నుంచే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ బుధవారం రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్పై చర్చించారు. హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్ పోర్టల్లో తప్పుడు, డూప్లికేట్ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ స్టాక్ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వృథాను తగ్గించండి పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్ భూషణ్, డాక్టర్ ఆర్.ఎస్.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ స్టాక్ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కో–విన్, ఈవిన్ పోర్టళ్లలో అప్లోడ్ చేయాలన్నారు. రెండో డోసు ఇచ్చే వరకూ టీకాలను దాడి పెట్టాలన్న ఆలోచన సరైంది కాదని చెప్పారు. కోవిషీల్డ్ షెల్ఫ్లైఫ్ ఇక 9 నెలలు ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్లైఫ్ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఈ టీకాను భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్లైఫ్ అంటారు. ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రస్తుత షెల్ఫ్లైఫ్ 6 నెలలు. తాజాగా డీసీజీఐ దీన్ని 9 నెలలకు పెంచింది. అంటే కోవిషీల్డ్ టీకాను తయారు చేసిన తర్వాత 9 నెలల్లోగా ఉపయోగించవచ్చు. 9% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే కేవలం మహారాష్ట్రలోనే 61 శాతం యాక్టివ్ కేసులు దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్లోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 79.30 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. ఇందులో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త కరోనా కేసుల్లో 84.73 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్లో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది. 6.30 కోట్ల మందికి కరోనా టీకా భారత్లో కరోనా వ్యాక్సినేషన్ వేగం పంజుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది.