Check
-
Delhi air pollution: ‘గ్రాప్-4’ అమలును పర్యవేక్షించిన మంత్రి.. అధికారులకు సూచనలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.గ్రాప్ విధానంలోని ఫేజ్-4 అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్- ఫోర్, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. #WATCH | Delhi Environment Minister Gopal Rai says, "AAP govt is continuously working to mitigate the level of pollution in Delhi. Entry has been banned for those vehicles which cause pollution, as Grap 4 is implemented. Today, we have received several complaints that vehicles… https://t.co/Y5mm2frQYN pic.twitter.com/2DZEbtsuFV— ANI (@ANI) November 22, 2024రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
ఒక్క క్లిక్తో ఆధార్ సెంటర్ లొకేషన్ తెలుసుకోండిలా
మీకు దగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మ్యాప్లో ఆధార్ సెంటర్ లొకేషన్ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్ మ్యాప్ నావిగేష్ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్తో సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్కు ‘భువన్ ఆధార్’ అని పేరు పెట్టారు.దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్ఆర్ఎస్సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్ మ్యాప్ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్డేట్ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్ ఆధార్’ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్ను ప్రతీ 15 రోజులకు అప్డేట్ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. #BhuvanAadhaarPortal #EaseOfLivingBhuvan Aadhaar Portal is facilitating Ease of Living by routing easy navigation to your nearest #authorized #Aadhaar Centre.To locate your nearest #AadhaarCentre visit: https://t.co/3Kkp70Kl23 pic.twitter.com/e7wEar5WXi— Aadhaar (@UIDAI) August 21, 2024 -
కళ్లు చెదిరే చీర అందాలు... ప్రేమమ్ బ్యూటీ (ఫొటోలు)
-
పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ!
పిల్లులను చాలామంది ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. అయితే పిల్లులను ప్రభుత్వ విధుల్లో వినియోగించే దేశమొకటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశంలో పిల్లులు ఏ పనులు చేస్తాయి? ఈ వివరాలు మీ కోసం.. పిల్లులను ప్రభుత్వ కార్యకాలాపాల్లో వినియోగించే దేశం ఇజ్రాయెల్. ఇక్కడి రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్లో పిల్లుల జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపధ్యంలో వాటిని రైల్వే స్టేషన్ విధులలో నియమించింది. ఈ పిల్లులు ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాయి. మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ పిల్లులకు టిక్కెట్లను తనిఖీ చేయడంపై శిక్షణ ఇస్తుంది. ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే, ఆ పిల్లులు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ పిల్లులకు ఆహారంతోపాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు. రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు. ఇజ్రాయెల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వేశాఖ విధుల్లో వినియోగిస్తోంది. దీనివలన ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతోంది. శిక్షణ పూర్తయిన పిల్లులను విధుల్లో నియమిస్తారు. ఈ పిల్లులకు టిక్కెట్ చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్ఫారందాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
ఆన్లైన్లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత
జహీరాబాద్/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
TS: టికెట్ దక్కని సిట్టింగ్లకు ‘పవర్’ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి నెల రోజులు కావస్తోంది. మరో నాలుగు నియోజకవ ర్గాలు జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఇచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీ నామా చేయడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థులను బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రాథోడ్ బాపూరావు (బోథ్), భేతి సుభాష్రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), రాములు నాయక్ (వైరా), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి) టికెట్ దక్కకున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ పార్టీ కేడర్ను సమన్వయం చేస్తున్నారు. అధికారాలకు కత్తెర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజ కవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరును సీఎం కె.చంద్రశేఖర్రావు మదింపు చేశారు. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ అభ్యర్థి ఇద్దరూ క్షేత్రస్థాయి లో పర్యటనలు చేస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయా నికి గురవు తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరిగేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం చేస్తుందనే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ అధికారిక అభ్యర్థితో కలిసి పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులోభాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అందే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దనే సంకేతాలు స్థానిక నేతలకు వెళ్లాయి. మరోవైపు అధికారిక యంత్రాంగానికి కూడా ఇదే తరహా సంకేతాలు అందినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయ నిరాకరణ ఎదురవు తోంది. స్థానిక నేతలు, పార్టీ కేడర్ ఒకరొకరుగా అధికారిక అభ్యర్థికి చేరువవుతుండగా, అధికార కార్యకలా పాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మారు తోంది. దీంతో తమను అధికార కార్యకలాపాలకు దూరంగా పెట్టడంపై టికెట్ దక్కని సిట్టింగులు అసంతృప్తికి లోనవుతున్నారు. వేములవాడ చెన్న మనేని రమేశ్ బాబును వ్యవసాయ రంగ ప్రధాన సలహా దారుగా నియమించడంతో ఆయన నియోజకవర్గానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకపోయినా ఆయన నియోజకవర్గంలో విస్తృ తంగా పర్యటించగా తాజాగా పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజీ కుదిరింది. రాజయ్యకు ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు దూరం పాటిస్తున్నారు. -
ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలకు చెక్
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక దృష్టి సారించడం ఫలితాలనిస్తోంది. గత నెలలో 159 బాల్య వివాహాలను నివారించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలను నివారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అక్షయ తృతీయ, శ్రావణ, మాఘ మాసాలు మొదలైన శుభ సందర్భాల్లో బాల్య వివాహాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు జారీచేసిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 15–18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 15–21 సంవత్సరాల వయస్సు గల బాలురను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్స్, ఇంటర్, ఇతర దూరవిద్య కార్యక్రమాల్లో చేర్పించాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల బయట ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించాలని, బాల్య వివాహాల నివారణతో పాటు బాలల హక్కులు, బాలల రక్షణ సమస్యలపై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
భార్య చెక్కులతో తమాషాలా?
కర్ణాటక: భార్యకు చెప్పకుండా బ్లాంక్ చెక్కు ఉపయోగించి రుణం పొందడం ఆమెను మానసిక ంగా హింసించడంతో సమానమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం ఆధారంగా దంపతుల కు కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను ఎత్తి చూపింది. గతంలో కుటుంబ న్యాయస్థానం భార్య పిటిషన్ మీద విడాకులు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ మండ్య జిల్లా హొనగానహళ్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్కుమార్ ఏ.పాటిల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది, భార్యను ఆమె భర్త బలిచ్చే గొర్రెగా చేశారని అభిప్రాయపడింది. అతని పిటిషన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. భార్యను భర్త మానసిక హింసకు గురిచేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. భార్యకు చెందిన చెక్కులను దుర్వినియోగం చేయడంపై పిటిషనర్ స్పందించడం లేదు. ఇదంతా కూడా భార్యను ఇబ్బంది పెట్టడం అని అర్థమవుతుంది. ఆ చెక్కుల ద్వారా అప్పులు చేయడం క్రిమినల్ కేసులతో కూడిన బెదిరింపులను మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది. అంతేకాకుండా భర్త నడవడికతో భార్య అవమానం, మానసిక హింసను అనుభవించారు. ఈ అంశాన్ని కుటుంబ న్యాయస్థానం కూలంకుషంగా పరిశీలించి తీర్పును ప్రకటించిందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం అన్ని ఆధారాలను పరిశీలించి న్యాయసమ్మతమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి లోపదోషాలు కనిపించలేదని న్యాయస్థానం తెలియజేసి, పిటిషన్ సస్పెండ్ చేయాలని ఆదేశించింది. -
సరిహద్దుపై నిఘా ఏర్పాటు చేయాలి
మంచిర్యాల:రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ముందస్తుగా సరిహద్దు పోలీసు అధికారులు ఇప్పటి నుంచే సరికొత్త విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ఆరు జి ల్లాల ఎస్పీలతో రామగుండం పోలీసు కమిషనరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మద్యం అమ్మకాలు, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు ప్రాంతాల గుర్తింపు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్ ఏరియా డామినేషన్ తదితర 13రకాల అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి జిల్లా డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్, కుమురంభీమ్ జిల్లా ఎస్పీ సురేష్కుమార్, జగి త్యాల ఎస్పీ భాస్కర్, భూపాలపల్లి జ్లిల్లా ఎస్పీ కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టీ.కర్ణాకర్రావు, సరి హద్దు ప్రాంతాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్ప్యాక్లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్వేర్ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా: హాట్ టాపిక్గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్ఝన్వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్టాపిక్గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్ఝన్వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్జున్వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్గా ర్యాంక్ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్ఝన్వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్ఝన్ వాలా అందుకున్నారు -
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
సీఎం జగన్ చిత్రపటానికి మహిళల పాలాభిషేకం
-
రెండు ఇష్యూలకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్అండ్బీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు సెబీ ఈ నెల 3న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్ సంస్థ 3ఐ గ్రూప్.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్కు చెక్ పెట్టింది. రూ. 1,330 కోట్ల కోసం ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ ప్రాస్పెక్టస్లను సెబీ తిప్పి పంపింది. ఎయిరాక్స్ నేలచూపు మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ భరత్ కుమార్ జైస్వాల్, ఆషిమా సంజయ్ జైస్వాల్ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్ఏ ఆక్సిజన్ జనరేటర్ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. -
నీటి వృథాకు సెన్సర్తో చెక్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్ఆర్ ఫేజ్–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు. అలారం మోతతో అప్రమత్తం ఫిల్టర్బెడ్ల నుంచి రిజర్వాయర్లకు శుద్ధి చేసిన జలాలను పంపింగ్ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది. అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సంబంధిత మేనేజర్తోపాటు రిజర్వాయర్ ఇన్చార్జికి సైతం ఫోన్కాల్ వెళ్తుంది. రిజర్వాయర్ నిండింది అంటూ వాయిస్కాల్ వెళ్తుంది. వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అయ్యే వరకు వాల్వ్ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది. నీటి వృథాను అరికట్టండి నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్ క్లీనింగ్, గార్డెనింగ్ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు) -
'చెక్కు' చోరుడు
కందుకూరు: కొరియర్ సర్వీసుల్లో వచ్చే బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు, డీడీలు వంటివి దొంగిలించడం, వాటిని మాన్యుపులేట్ చేసి బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో నగదు కొట్టేయడం అలవాటుగా చేసుకున్న మోసగాడు చివరికి కటకటాల పాలయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసం ఉంటున్న తిరుపతికి చెందిన గాలి చేతన్చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. కందుకూరుకు చెందిన రమాదేవి అనే మహిళ తనకు తెలిసిన వి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కెనరా బ్యాంకు చెక్బుక్ నుంచి రూ.2 లక్షలకు చెక్కు రాసి ఇచ్చింది. ఈ చెక్కును వెంకటేశ్వర్లు తన యూనియన్ బ్యాంకు అకౌంట్ ద్వారా మార్చుకునేందుకు స్థానిక బ్యాంకులో ఇచ్చాడు. ఆ చెక్కును వెరిఫికేషన్ చేసి పాస్ చేసేందుకు కందుకూరు బ్రాంచ్ అధికారులు ఒంగోలు బ్రాంచ్కు ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా గత నెల 28న పంపారు. కొరియర్ బాయ్ డెలివరీ చేసే సమయంలో చేతన్ చౌదరి ఆ చెక్కును దొంగిలించాడు. చెక్కులో వి.వెంకటేశ్వర్లు పేరును మిస్టర్ వెంకటేశ్వర్లుగా మార్పు చేశాడు. తర్వాత తనకు తెలిసిన అల్లరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చేత ఒంగోలు కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి, రూ.2 లక్షల చెక్కును మార్చి నగదు డ్రా చేసుకున్నాడు. మరోవైపు వి.వెంకటేశ్వర్లు యూనియన్ బ్యాంకులో తాను చెక్కు ఇచ్చి పది రోజులైనా తన అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించాడు. దీంతో మేలుకున్న బ్యాంకు అధికారులు ఈ నెల 14న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగడంతో చేతన్చౌదరి మోసాలు వెలుగుచూశాయి. చేతన్ను అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.40 వేల నగదు, పెద్ద ఎత్తున చెక్కుబుక్లు, డీడీలు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో చేతన్ గత రెండేళ్లలో చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ఒంగోలులలో మోసాలకు పాల్పడి దాదాపు రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
పన్ను కట్టే విధమెట్టిదనిన...
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి. ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్మెంట్ అని అంటారు. ఈ అసెస్మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు. ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి. ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి. -
సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం
హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు -
అనంతపురంలో కబ్జాదారులకు చెక్
-
పాము విషంతో కరోనాకు చెక్!?
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రారంభ దశలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని బ్రెజిల్లోని పరిశోధకుల బృందం తేల్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్మెడికల్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం అణువులు జరారాకుసు పిట్ విషం ద్వారా ఉత్పత్తైన అణువు కోతి కణాలలో వైరస్ సామర్థ్యాన్ని 75శాతం నిరోధించింది. జరారాకుసో విషంలో ఉండే పెప్టైడ్ అణువులు వైరస్లో రెట్టింపవుతున్న ముఖ్యమైన ప్రోటీన్ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని సావోపౌలో బుటాంటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో రాయిటర్స్తో చెప్పారు. అంతేకాదు ఈ పెప్టైడ్ అణువులను ల్యాబ్ల్లోనూ అభివృద్ధి చేయవచ్చని గైడో తెలిపారు. బ్రెజిల్ అడవుల్లో జరరాకుసోను వేటాడటానికి బయలుదేరిన వ్యక్తుల పట్ల ఆయన అందోళన వ్యక్తం చేశారు. వారు ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కానీ పద్ధతి ఇది కాదనీ, కేవలం విషంతోనే కరోనాను నయం చేయలేమనేది గుర్తించాలన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నారు. కాగా బ్రెజిల్లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు సుమారు రెండు మీటర్ల పొడవు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. -
ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్గౌడ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్గౌడ్ పేర్కొన్నారు. -
OTT: ఐదు సినిమాలు నేడే విడుదల!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. జనాలు కూడా కొత్త చిత్రాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయా? అని ఈ రోజు కోసం తెగ ఎదురుచూసేవాళ్లేవారు. కానీ కరోనా పుణ్యమా అని అన్ని రోజులూ ఆదివారాలే అయిపోయాయి. థియేటర్లకు కూడా హాలీడేస్ వచ్చేశాయి. కానీ ప్రేక్షకుడికి అందించే వినోదానికి మాత్రం బ్రేక్ రాలేదు. సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్లు, థియేటర్లు కాకపోతే ఓటీటీలు.. ఇలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త దారుల్లో పయనిస్తోంది చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో నేడు(మే 14) ఐదు సినిమాలు ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో చదివేయండి.. విజయ్ సేతుపతి తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ సేతుపతి. తెలుగులో విలన్, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన సేతుపతి ఇందులో హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నేటి నుంచి ప్రసారం కానుంది. కర్ణన్ తమిళ హీరో ధనుష్ నటించిన కర్ణన్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో నేటి నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. సినిమా బండి ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సినిమా బండి. ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయగా నేటి నుంచి ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చెక్ యంగ్ హీరో నితిన్ ఖైదీగా, ప్రియా వారియర్ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్గా కనిపించింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్ నెక్స్ట్ యాప్లో స్ట్రీమింగ్ కానుంది. బట్టల రామస్వామి బయోపిక్కు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేయగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జీ 5లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇక రామ్గోపాల్ వర్మ డీ కంపెనీ సినిమా కూడా ఓటీటీలో వస్తోంది. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాధే సినిమా నిన్నటి నుంచే జీ 5లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. -
Its Official: చెక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
గతేడాది భీష్మతో హిట్టు కొట్టిన యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్తో అభిమానుల ముందుకొచ్చాడు. కానీ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ జనాలకు కొత్తదనాన్ని పంచింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 14 నుంచి సన్ నెక్స్ట్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో ప్రేయసిగా, రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాదిగా నటించారు. సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్ భయంతో థియేటర్లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే సన్ నెక్స్ట్ యాప్లో చూసేయొచ్చు. Youth Star @actor_nithiin 's #Check ♟️ will be Streaming on @sunnxt from May 14th. A @yeletics' s Film.#CheckOnSunnxt @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @ShakthisreeG @HaricharanMusic @ShreeLyricist @BhavyaCreations @adityamusic pic.twitter.com/k2Ok60xjll — BARaju (@baraju_SuperHit) May 12, 2021 చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ -
హర్ట్ అయిన రకుల్.. ప్రమోషన్లకు దూరం!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా. ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ -
‘చెక్’ మూవీ రివ్యూ
టైటిల్ : చెక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్ నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి సంగీతం : కల్యాణీ మాలిక్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటర్ : అనల్ అనిరుద్దన్ విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో. భీష్మ కంటే ముందు నితిన్ చేసిన లై, చల్మోహన్రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్ తీసుకొన్న నితిన్.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్. భీష్మతో పాటు చెక్ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చోరకళ(దొంగతనం) కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే... భారత్లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్ చెస్ చాంపియన్ షిప్ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. చెస్లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్ గేమ్ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ నటీనటులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. ఒక చెస్ చాంపియన్ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. గత చిత్రాలకు బిన్నంగా ఇందులో గ్లామర్కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్ మానస పాత్రలో హవాభావాలు అద్భుతంగా పండించింది. ఇక నితిన్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్కు ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఎస్పీ పాత్రలో సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు.. అవి అందించే ఎమోషన్లు ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్ గేమ్ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్లను రివీల్ చేయకుండా నార్మల్గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్లన్నీ సెకండాఫ్లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ చాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోంది. అయితే హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫి బాగుంది. జైలు సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. అనల్ అనిరుద్దన్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి ప్లస్ పాయింట్స్ కథా, కథనాలు నితిన్, సాయిచంద్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ సెకండాఫ్లో కొన్ని సాగతీత సీన్లు క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ ‘చెక్’ మూవీ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్లోని ఓ రోమాంటిక్ సన్నివేశం చిత్రీకరణలో నితిన్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వెనకాలే ప్రియా ప్రకాశ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది. ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్ చేసింది. కాగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్కు జోడిగా ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రిత్ సింగ్లు కథానాయికలుగా నటించారు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?! -
ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్: జూనియర్ ఎన్టీఆర్
సినిమా హిట్టు కాలేదంటే కథ బాగోలేదని దర్శకుడిని నిందించలేం. ఎందుకంటే ఫ్లాప్ అయిందన్నా, యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నా దానికి బోలెడు కారణాలు ఉంటాయి. వైవిధ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్ హీరోగా, ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 26న) విడుదల కానుంది. ఈ సందర్భంగా చెక్ యూనిట్కు ఆల్ద బెస్ట్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వినూత్నమైన కథలతో అలరించే చంద్రశేఖర్ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు. చెక్ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. Always been a fan of Chandu @yeletics 's unique themes and storytelling. #Check looks super interesting. Best wishes to Chandu, @actor_nithiin and the whole team for the release tomorrow pic.twitter.com/RRwtQmSIVk — Jr NTR (@tarak9999) February 25, 2021 చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ కాలంతో పాటు వెళ్లడమే మంచిది: చంద్రశేఖర్ యేలేటి -
ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా!
‘‘చెక్’ సినిమాకి ముందు చంద్రశేఖర్ యేలేటిగారు ఓ లైన్ చెప్పారు. రెండు నెలలు స్క్రిప్ట్పై పని చేశారు కూడా. అయితే అది వర్కవుట్ కాదనిపించింది. ఆ తర్వాత ‘చెక్’ కథతో ముందుకెళ్లాం. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘చెక్’ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► వరుసగా మూడు ఫ్లాప్లు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) వచ్చాయి. దీంతో తర్వాత చేసే సినిమాల్లో ఒకటి కమర్షియల్, మరొకటి వైవిధ్యమైన చిత్రం అయితే బాగుండు అనుకున్నాను. అందుకే ‘భీష్మ, చెక్’ సినిమాలు ఒప్పుకున్నాను. ‘భీష్మ’ తర్వాత ‘చెక్’ రిలీజ్ చేద్దామనుకున్నాం.. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ► నేనిప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ చిత్రంలో నా నటన చాలా బాగుంటుంది. సినిమా ప్రివ్యూ చూసిన వంద మందిలో అందరూ బాగుందని అభినందించారు. పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ‘చెక్’ ఉంటుంది. ఒక పాట మినహా మొత్తం కథే ఉంటుంది. ప్రేక్షకులకు మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది. ► కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కమర్షియల్ సినిమాల బడ్జెట్కి నిర్మాతలు వెనకాడరు. ‘చెక్’లాంటి వైవిధ్యమైన సినిమాకి ఖర్చు పెట్టిన ఆనంద్ ప్రసాద్గారు గ్రేట్.. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయనకి డబ్బులు బాగా రావాలి. ‘నితిన్ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తాడు’ అని ‘చెక్’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిగారి నుంచి నాకు కాంప్లిమెంట్ రావడం హ్యాపీ. నా తొలి చిత్రం ‘జయం’ తర్వాత ఎక్కువ టేకులు తీసుకున్నది ‘చెక్’ చిత్రానికే. మొదట్లో ఓ వారంపాటు ఒక్కో సీన్స్ కి 10 నుంచి 15 టేకులు తీసుకున్నాను. ఆ తర్వాత డైరెక్టర్ పల్స్ పట్టుకుని ఆయనకు నచ్చినట్టు చేశా. ► ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అయింది. ఇప్పటికీ లవర్ బోయ్ ట్యాగ్లైన్ నాకు నచ్చదు. గతంలో కథల ఎంపికలో తప్పు చేశాను. ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నాను. ► 2020 చాలామందికి వరస్ట్ అయితే నాకు గుడ్. ‘భీష్మ’ సినిమా హిట్ అయింది. షాలినీతో పెళ్లయింది. యాక్టర్ ఫ్యామిలీకి, డాక్టర్ ఫ్యామిలీకి బాగా సింక్ అయింది. గతంలో జలుబో, దగ్గో, జ్వరమో వస్తే హాస్పిటల్కి వెళ్లేవాణ్ణి.. ఇప్పుడేమో మా మావయ్య– అత్తయ్యలకు ఫోన్ చేసి, ఏ మందులు వేసుకోవాలో అడుగుతున్నాను (నవ్వుతూ). ► ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ మంగళవారమే పూర్తయింది. మేర్లపాక గాంధీతో ‘అంధా ధున్ ’ రీమేక్ సినిమా చేస్తున్నా. ‘పవర్పేట’ సినిమా మేలో స్టార్ట్ అవుతుంది.. డిసెంబరులో మొదటి పార్ట్ విడుదలవుతుంది.. అది హిట్ అయితే రెండో పార్ట్ ఉంటుంది.. లేకుంటే లేదు. నా సినిమాల్లో ‘సై’కి సీక్వెల్ చేయొచ్చు.. ‘చెక్’ సినిమాకి కూడా సీక్వెల్ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కల్యాణ్గారితో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. -
రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్
'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి వినూత్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చెక్. ఈ సినిమా టీజర్ చూడగానే థియేటర్కు వెళ్లి సినిమా చూడాలనిపించిందని, కథాంశం అంత వైవిధ్యంగా ఉందని టాప్ డైరెక్టర్ రాజమౌళే కితాబిచ్చారంటే ఈ టీజర్ జనాలను ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..' పాట ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో తన ప్రియురాలు ప్రియా ప్రకాశ్ వారియర్ను చూడలేకుండా ఉండలేకపోతున్నానని పాడుతున్నాడు నితిన్. అక్కడేమో ప్రియా తన అందంతో హీరోనే కాదు కుర్రకారును కూడా తన వెంటపడేలా చేస్తోంది. ఈ సాంగ్ ప్రోమో రిలీజైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో #PriyaPrakashVarrier అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ సినిమాలో రకుల్ కన్నా ఫ్లాష్బ్యాక్లో వచ్చే ప్రియానే బాగుందంటున్నారు కొందరు నెటిజన్లు. చెక్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ప్రియా వచ్చీరావడంతోనే రకుల్ను డామినేట్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవకముందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందచందాలు, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా తర్వాత ప్రియాకు తెలుగులో ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి! కాగా చెక్ సినిమాలో ప్రియా హొయలను చూడాలన్నా, ఉగ్రవాదిగా నితిన్, లాయర్గా రకుల్ ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలన్నా ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే! చదవండి: కాలంతో పాటు వెళ్లడమే మంచిది: దర్శకుడు హైదరాబాద్లో పవన్ షూటింగ్.. భారీ సెట్ -
‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ హద్దుల్ని చెక్ చెరిపేస్తుందనుకుంటున్నాను
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగానే థియేటర్కి వెళ్లి సినిమా చూసేయాలనిపించింది. కథాంశం వైవిధ్యంగా ఉంది. మాస్ సినిమా, క్లాస్ సినిమాకు ఉన్న హద్దుల్ని ఈ సినిమా చెరిపేస్తుందనుకుంటున్నాను. వైవిధ్యమైన సినిమాను కూడా ప్రేక్షకులు ఓ మాస్ సినిమాలా ఆదరిస్తారనుకుంటున్నాను. నితిన్ అన్ని రకాల సినిమాలు చేయగలడనిపించుకుంటున్నాడు’’ అన్నారు. ‘‘చెక్’ పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా నటన వేరేలా ఉంటుంది. నాకు వచ్చిన నటనను మార్చుకుని కొత్తగా నేర్చుకుని ఈ సినిమా చేశాను. యేలేటిగారు ఈ సినిమాకు చాలా డబ్బులు రావాలి అన్నారు. తప్పకుండా వస్తాయి. ఈ సినిమాకి కల్యాణీ మాలిక్ మ్యూజిక్ పెద్ద బలం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎవ్వర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ‘‘రెండు సక్సెస్ల (ఓ పిట్ట కథ, మిడిల్ క్లాస్ మెలోడీస్) తర్వాత మూడో చిత్రంతో వస్తున్నాం. నితిన్కి గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, దర్శకులు గోపీచంద్ మలినేని, వెంకీ కుడుముల, నటుడు సంపత్ మాట్లాడారు. -
కాలంతో పాటు వెళ్లడమే మంచిది
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు. ► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్ని మైండ్లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది. ► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్బ్యాక్లో వస్తుంది. ► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి. ► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను. -
15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా
‘‘నా కెరీర్లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ సినిమాలు చాలా ఉన్నాయి. ‘చెక్’ లాంటి యునిక్ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్ యేలేటిగారు చెప్పిన 15 నిమిషాల కథ విని సినిమా చేసేందుకు ఒప్పుకున్నా’’ అని హీరో నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియిర్ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ సినిమా కోసం ఫిజికల్గా చాలా కష్టపడ్డా. అవుట్పుట్ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ–‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తన తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్’ సినిమా కథ. ఇంతకుముందు నితిన్తో ఓ కథ అనుకుని సెకండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. తను లేకపోతే ‘చెక్’ సినిమా లేదు’’ అన్నారు. ‘‘మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ‘చెక్’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ‘‘ఈ సినిమాలో నటించడం పద్మ అవార్డు అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అన్నారు నటుడు సాయిచంద్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్, ప్రియా ప్రకాశ్ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?!
యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య. సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్చరణ్) -
నితిన్ ‘చెక్’ విడుదల తేదీ ఖరారు
యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్ దే’, ‘చెక్’, అంధాధున్ రీమెక్లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. -
చెక్ మాస్టర్
ఆదిత్య ఓ అద్భుతమైన చెస్ ప్లేయర్. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ ౖజñ ల్లో చిక్కుకున్నాడు. ఈ చెస్ ప్లేయర్ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం విడుదల చేశారు. చెస్ ప్లేయర్ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
చెక్ ఫస్ట్ గ్లింప్స్: దేశ ద్రోహిగా మారిన నితిన్
గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రంగ్ దే’ మార్చి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘చెక్’ ఫస్ట్ గింప్స్ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు. ‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్ ఆనంద్, కస్పరోవ్ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన సంపత్ రాజ్.. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్ని హేళన చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే.. ఒక తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని శిక్ష అనుభవిస్తాడని, దాని నుంచి ఎలా బయటపడ్డారనేది కథలో చూపించనున్నారు. జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది. మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న సినిమా 'చెక్' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి. -
చివరి షెడ్యూల్లో చెక్
నితిన్ హీరోగా రకుల్ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్’. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్ ఈ నెల పదో తేదీన హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్ప్రీత్, సంపత్రాజ్, సాయిచంద్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను, ప్రీ లుక్ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ : సొమ్ము మాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఎస్బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ (క్లోన్) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్ హోం (ఎస్బీఐయేతర) చెక్కుల క్లియరింగ్పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన ఉద్యోగులకు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్ కు చెందిన ఎస్బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్ వాదించింది. ప్రోటోకాల్ను అనుసరించడంలో ఎస్బీఐ విఫలమైందని, తాము పోగొట్టుకున్ననగదును జమ చేయాలని బ్యాంకును కోరింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా), ముంబైలో ఎస్బీఐ నాన్-హోమ్ శాఖల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది. బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్ను సంప్రదించాలని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే రూ. 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేస్తుంది. -
బుల్లెట్పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
1.86 కోట్ల నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే రూ.1,86,44,340 డబ్బు పట్టుబడింది. దీంతో ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు రూ.9,66,26,006కు చేరింది. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాల సంఖ్య 8,463కు చేరుకోగా, 39 ఆయుధాల లైసెన్స్లను రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ రూ.53 లక్షలకు, ఆభరణాల విలువ రూ.2.66 కోట్లకు చేరింది. -
చెక్కేస్తారా?
-
మా డబ్బులు ఎక్కడ?
ప్రకాశం, కురిచేడు: ఆవులమంద బ్యాంకులో తాము తీసుకున్న రుణాల కిస్తీలు, పొదుపు డబ్బుల కిస్తీలు జమ కాలేదని మండలంలోని పడమరనాయుడుపాలెం, వీవై కాలనీకి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు 45 గ్రూపులకు చెందిన 400 మంది సభ్యులు బ్యాంకు ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్యాంకు నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. వివరాలు.. బ్యాంకు పరిధిలోని పడమర నాయుడుపాలెం గ్రామానికి చెందిన పల్లె రవీంద్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బుజినెస్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాడు. రవీంద్ర గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 31వ తేదీ ఐనవోలు మేజర్లో శవమై తేలాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపేసి కాలువలో పేడాశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంటుగా పనిచేస్తుండటంతో నాయుడుపాలెం, వల్లేల యానాదికాలనీకి చెందిన మహిళలు డ్వాక్రా రుణాలతో పాటు పొదుపు నగదు తమ ఖాతాల్లో జమ చేయమని నగదు అతనికి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రవీంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలువురు డ్వాక్రా మహిళలు తమ ఖాతాల్లో నగదు జమైంది.. లేంది చెక్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్ డ్వాక్రా మహిళల సూచన మేరకు ఖాతాలు చెక్ చేయడంతో నగదు జమకానట్లు తేలింది. దీంతో నాయుడుపాలెం, వీవై కాలనీ గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులు బాంకు ఎదుట క్యూ కట్టారు. మేనేజర్ నగదు కోసం మార్కాపురం వెళ్లగా గ్రూపుల సభ్యులు మాత్రం బ్యాంకు ఎదుట బైఠాయించారు. ఎవరికి వారు తాము చెల్లించిన మొత్తాలు నీటిపాలైనట్లేనా? అని ఆందోళనకు దిగారు. బ్యాంకులో తీసుకున్న పొదుపు రుణాలు చెల్లించినట్లు రవీంద్ర తమ తీర్మానాల పుస్తకంలో ఒక వైపు రాసి ఉన్నాడు. కానీ ఆ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఏయే ఖాతాల్లో ఎంతమేరకు నిధులు జమ కాలేదోనని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేయడం బ్యాంకు సిబ్బందికి సాధ్యం కాలేదు. సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు గోల్మాల్లై ఉండోచ్చని మహిళలు చెబుతున్నారు. సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు బయటపడతాయి. గతంలో కూడా బ్యాంకులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగి ఉండటం, ఆ విషయాన్ని ఖాతాదారులు మరువక ముందే అదే తరహాలో మరో అవినీతి విషయం బయట పడటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నగదు వసూలుకు ఎవరినీనియమించలేదు: డ్వాక్రా మహిళల వద్ద రుణాలు, పొదుపు డబ్బులు వసూలు చేసేందుకు ఎవరినీ నియమించలేదు. బిజినెస్ కరస్పాండెంట్కు పొదుపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఆ ట్యాబ్లో ఆప్షన్ కూడా లేదు. ఓడీ ఖాతాలు కావడంతో ఎన్పీ అయితేనే వాటిని పరిశీలిస్తాం. గేదెల రుణాలు ఎక్కువగా ఎన్పీ అవుతున్నాయి. వాటి వసూలుకే మాకు సమయం సరిపోతోంది.శేషారావు, బ్యాంకు మేనేజర్ -
రుణం చెక్ ఇచ్చే వరకూ నిద్రపోను!
ఒంగోలు టూటౌన్: ఎస్ఎస్ఎఫ్డీసీ రుణం కోసం నెత్తుటి ధారతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారుడి వ్యవహారం స్థానిక ప్రగతి భవన్లో శుక్రవారం కలకలం రేపింది. కార్యాలయ మెట్లపై నుంచి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం లోపల వరకు రక్తం ధార పడటంతో ప్రగతి భవన్కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందారు. స్థానిక గద్దలగుంటకు చెందిన ఎం.జమదగ్ని 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డీసీ కింద రుణం మంజూరైంది. లబ్ధిదారుడు శుక్రవారం ఉదయం ఎస్సీ ఈడీ జయరామ్ను కలిశాడు. క్యాంపునకు వెళ్లి వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ పరిశీలించి రుణం చెక్ మంజూరు చేస్తామని ఆయన లబ్ధిదారుడితో చెప్పారు. తనకు తిరిగే ఓపిక లేదని, చెక్ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి లబ్ధిదారుడిని వారించినా వినిపించుకోలేదు. చేతికి ఉన్న సెలైన్ ప్యానల్కు మూత పెట్టుకోకుండా అడ్డం తిరుగుతున్నాడు. కానిస్టేబుల్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్ కూడా అతడిని గంటకుపైగా వారిస్తున్నా వినలేదు. విషయం తెలుసుకున్న గద్దలగుంట యువకులు, బంధువులు వచ్చి జమదగ్నిని బలవంతంగా తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. -
ఆకతాయిలకు..చెక్
భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్లో కాకినాడ స్మార్ట్సిటీలో ఈవ్టీజింగ్ నివారణకు జిల్లా పోలీస్ విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్ ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. జేఎన్టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎస్పీ విశాల్గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్కు ఫోన్ ద్వారాగానీ, ‘షీటీమ్కేడీఏ’ ఫేస్బుక్ అడ్రస్కు, వాట్సాప్ నంబర్ 94949 33233కు మెసేజ్ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్ కళాశాల కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్ షీటీమ్స్ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు. ముందుగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్ సాగింది. ఈ రన్లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. -
చంచల
కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్లోనే ఆఫీస్ మెయిల్స్ చెక్ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్ కట్చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్.. హెల్ప్..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం. ‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్ సెక్షన్కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్ మేనేజర్.‘అది అలా వుంచండి సార్.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్ షేక్లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్ మేనేజర్. ఆ రోజు రాత్రి... బ్యాంక్ మేనేజర్ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్ మీద గ్లాస్ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్ మేనేజర్ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి.. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది సహాయం కోరింది. అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్ సైరన్ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్ మేనేజర్ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. - మోహనారుద్ర -
మరో నకిలీ మాస్టర్ అరెస్టు
♦ ఇప్పటి వరకు ఐదుగురు గుర్తింపు ♦ రూ.1.60 కోట్ల మేర కుంభకోణం ♦ మిగిలిన వారిని త్వరలో ♦ పట్టుకుంటాం : విజిలెన్స్ సీఐ పామర్రు : విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో మరో నకిలీ పింఛన్ మాస్టర్ దొరికారని విజిలెన్సు సీఐ ఎన్.శ్రీసాయిఅపర్ణ తెలిపారు. పామర్రుశివాలయం వీధిలో నివసించే నకిలీ మాస్టర్ యండూరి సాయిబాబుని ఆమె గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ ఎస్పీ రవీంద్రనాథ్, డీఎస్పీ పాల్తో కూడిన టీమ్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల విభాగంలో సర్వీసు చేయకుండా, ఉద్యోగ విరమణ పొందినట్లు డాక్యుమెం ట్లను తయారుచేసి, 15 ఏళ్లుగా పింఛన్పొందుతున్న వారి కోసం దాడులు నిర్వహిస్తున్నామని తెలి పారు. పామర్రుకు చెందిన యండూరి సాయిబాబు గతంలో హనుమంతపురంలో ఉండి నాలుగేళ్ల క్రితం నుంచి పామర్రులోని పెదమద్దాలి రోడ్డులోని శివారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఆయన హోమియో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. రిటైర్డు హెచ్ఎం కె.రంగరామానుజాచార్యులు 17 ఏళ్ల క్రితం ఆటోలో పరిచయమయ్యాడని, అతనే తన ఇంటికి వచ్చి పెన్షన్ పత్రాలు తయారు చేసి వాటిపై సంతకాలు చేయించి ప్రతినెలా పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారని సాయిబాబు తెలిపారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ సౌకర్యాలు, గ్రాట్యుటీకి సంబంధించిన పెద్ద మొత్తాలను మొవ్వ ట్రజరీ కార్యాలయంలో క్యాషియర్ నుంచి తీసుకునేలా చేశారని, ఇందుకు గానూ రంగరామానుజాచార్యులకు నెలకు పెన్షన్ నుంచి 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు సాయిబాబు తెలిపారని చెప్పారు. సాయిబాబు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో సెంకటరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001 అక్టోబర్లో ఉద్యోగవిరమణ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని, నవంబర్ నుంచి ప్రతి నెలా పింఛన్ సాయిబాబు పొందుతున్నాడని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు సాయిబాబు రూ.38 లక్షల వరకు పెన్షన్గా తీసుకున్నట్లు తేలిందన్నారు. సాయిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి పెన్షనర్ బుక్, బ్యాంకు అకౌంట్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, సాయిబాబుకు రూ.31,344 పింఛన్ వస్తోందని పేర్కొన్నారు. ఆర్ఆర్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు ఐదుగురు నకిలీ టీచర్లను అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటికి రూ.1.60 కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. స్వచ్ఛందంగా ముందుకురావాలి రంగరామానుజాచార్యుల వలలో పడి, అక్రమంగా పింఛన్ పొందుతున్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, వివరాలు తెలియజేస్తే తక్కువ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలి పారు. విజయవాడ ఏలూరు రోడ్డు, వినాయక థియేటర్ వద్ద గల విజిలెన్సు ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలపాలని సూచించారు. కార్యాలయం ఫోన్ నంబరు 0866–2453757లో కూడా వివరాలు తెలపొచ్చని పేర్కొన్నారు. రామానుజాచార్యులు కుమార్తె ద్వారా నకిలీ సర్టిఫికెట్ట్లు రంగరామానుజాచార్యులు కుమార్తె కె.పద్మలత పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా నకిలీ విశ్రాంత ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను గజిటెడ్ హోదాలో అందజేస్తున్నట్లు సమాచారం ఉన్నదని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలిపారు. దాడిలో విజిలెన్సు ఎస్ఐ సత్యనారాయణ, వీఆర్వో లంకపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. -
మీ పాన్ యాక్టివ్గా ఉందా? చెక్ చేశారా?
న్యూఢిల్లీ: నకిలీ పాన్ నంబర్ల ఏరివేతలో ప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇప్పటికే దాదాపు 11లక్షలకు పైగా పాన్ కార్డులు రద్దయ్యాయి. జులై 27, 2012 నాటికి 11,44,211 నకిలీ ప్యాన్ కార్డులను క్యాన్సిల్ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్ తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మన పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. 1. ఆదాయం పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్-www.incometaxindiaefiling.gov.in ను సందర్శించండి 2. హోమ్ పేజీలో, 'సర్వీసులు' అనే టాబ్ క్రింద, 'నో యువర్ పాన్' క్లిక్ చేయండి. 3. పేరు, జెండర్, మతం, జనన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 'సబ్ మిట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. 4. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒక-టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వేలిడేట్ అనే బటన్ క్లిక్ చేయండి. 5. దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్లయితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్'అన్న సందేశం వస్తుంది. పాన్ ఆధార్ లింకింగ్ విషయానికి వస్తే...ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ద్వారా చాలా సులువుగా ఆధార్తోను పాన్ లింక్ చేయవచ్చు. incometaxindiaefiling.gov.in. లాగిన్ అయ్యి లేదా డైరెక్టుగా లింక్ ఆధార్ అంటే.. పాప్ అప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ నిర్దేశిత కాలంలో ఆధార్ నెంబర్, పాన్ నంబర్ ఎంట్రీ చేయాలి. కాప్చాకోడ్ను ఎంటర్ చేసిన లింక్ఆధార్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, ఆధార్, పాన్తో సరిపోలితే వెంటనే ఆధార్తో పాన్ విజయవంతంగా అనుసంధాన మైనట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. లేదా ఎస్ఎమ్మెస్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. UIDPAN స్పేస్ , 12 అంకెల ఆధార్ నంబర్... స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి తే567678 or 56161 నెంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. దీన్ని నిర్ధారిస్తూ మన మొబైల్కు ఒక సందేశం వస్తుంది. దీంతో కీలకమైన ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తవుతుంది. కాగా ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్తో పాన్ అనుసంధానం తప్పనిసరి. అలాగే ఆగస్టు 31 లోపు ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దవుతాయని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
కోటి ఎకరాల మాగాణం చారిత్రక కర్తవ్యం
► నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో మంత్రి హరీశ్రావు ► ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలి ► తప్పుడు కేసులపై కోర్టులో సమర్థంగా వాదించాలి ► ఉన్నతాధికారులతో 10 గంటలపాటు సమీక్ష సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలతో సాధించి తెచ్చుకున్న తెలంగాణను కోటి ఇరవై లక్షల ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న చారిత్రక కర్తవ్యమని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం, అన్ని స్థాయిల సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. నీటిపారుదలశాఖ ముందున్న లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, పనుల పురోగతిపై ఇంజనీర్లతో హరీశ్రావు శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం 2.30కు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సుమారు 10 గంటలపాటు సాగింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నుంచి గతేడాది 35 వేల ఎకరాలు సాగులోకి తేవడంతో జరుగుతున్న రివర్స్ వలసలను మంత్రి ప్రస్తావించారు. ఉపాధి కోసం హైదరాబాద్ తదితర నగరాలకు గతంలో కుటుంబాలతోపాటు వలస వెళ్లిన ఆందోల్, పుల్కల్ ప్రాంతాలకు చెందిన 759 మంది రైతులు... సింగూరు నీళ్లు పొలాల్లోకి చేరడంతో తిరిగి సొంత గడ్డకు వాపసు వచ్చేశారన్నారు. ఇంతకు మించిన ఆనందం నీటిపారుదలశాఖకు ఇంకేమి ఉంటుంద న్నారు. దేవాదుల, ఏఎంఆర్పీ, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల మేర భూసేకరణ సమస్యలు ఉన్నాయని, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల వల్ల వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నామని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు గ్రీన్ ట్రిబ్యునల్లో, హైకోర్టులో తప్పుడు కేసులు వేయిస్తున్నా యని తెలిపారు. ఈ కేసులను సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రజాప్రయోజనాల గురించి బలంగా వాదించాలని ఇరిగేషన్ లీగల్ టీమ్ను ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కరించుకొని త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్సీలు మురళీధర్, విజయ ప్రకాశ్, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, అటవీశాఖ కన్సల్టెంట్ సుధాకర్ సహా 15 మంది చీఫ్ ఇంజనీర్లు, లీగల్ సెల్ అధికారులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ వద్దు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సాగునీటి పనులు, భారీ నిర్మాణాలపై నిరంతరం తనిఖీ అవసరమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇంజనీర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, వివిధ సాగునీటి పనులపై వచ్చే ఆరోపణలు, ఇతర విచారణల కోసం క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడరాదని క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల నిర్వహణ, డ్యామ్ల రక్షణ, భద్రతపై విస్తృతంగా చర్చించారు. డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలపై సెంట్రల్ డిజైన్స్ సి.ఈ. నరేందర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
ప్రైవేటుకు చెక్
► అనుమతి నిరాకరణ ► వైద్య సీట్ల భర్తీ లేనట్టే ► వందలాదిగా తగ్గనున్న సీట్ల సంఖ్య నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలకు కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ చెక్ పెట్టింది. మూడు కళాశాలలకు రెండేళ్లు, ఓ కళాశాలకు ఓ సంవత్సరం వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వందలాదిగా వైద్య సీట్ల సంఖ్య తగ్గనుంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 22 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ఈనెల తొమ్మిదో తేదీన పుదుకోట్టైలో ప్రారంభం కానుంది. మొత్తంగా మూడు వేలసీట్లు ఉండగా, పదిహేను శాతం కేంద్ర కోటాకు ఇది వరకు అప్పగించే వాళ్లు. మిగిలిన సీట్లను ప్లస్టూ మార్కుల ఆధారంగా వైద్య విద్యా విభాగం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగేది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలు, మరికొన్ని ప్రైవేటు కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్లు వైద్యవిద్యా విభాగం భర్తీ చేయడం జరిగేది. అయితే, ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన దృష్ట్యా, ఈ సీట్ల భర్తీ పర్వం మీద గందరగోళం బయలు దేరింది. నీట్ వ్యవహారం కోర్టుకు చేరడంతో వైద్య విద్యా సీట్ల భర్తీ మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెడుతూ, కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆయా కళాశాలల్లో మౌలిక వసతుల కరువు, విద్యా బోధనలో నాణ్యత తగ్గుముఖం, పరిశోధనా కేంద్రాలు అంతంత మాత్రమే...ఇలా పలు కారణాలను చూపుతూ ఆ కళాశాలలకు ఈ ఏడాది సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యారు. నాలుగుకు అనుమతి నిరాకరణ : ఇటీవల భారత వైద్య విద్యా కౌన్సిల్ నిర్వహించిన పరిశీలన, తనిఖీల్లో ఆయా కళాశాలల్లో కరువైన వసతులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెట్టారు. ఇందులో మూడు కళాశాలలు రెండేళ్ల పాటు సీట్ల భర్తీ చేసుకునేందుకు వీలు లేకుండా కొరడా ఝుళిపించారు. ఇక, ఓ కళాశాలకు మాత్రం ఈ ఏడాది బ్రేక్ వేశారు. ఇందులో కాంచీపురంలోని అన్నై వైద్య కళాశాల, మేల్ మరువత్తురు ఆది పరాశక్తి వైద్యకళాశాల, మాత వైద్య కళాశాలలు 2017–18, 2018–19 సంవత్సరాలకు వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరించారు. కోయంబత్తూరులోని కర్పుగం కళాశాలకు ఓ ఏడాది పాటు బ్రేక్ వేశారు. ఒక్కో కళాశాలలో సరాసరిగా రెండు వందల సీట్ల వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రసుత్తం పడ్డ బ్రేక్తో రాష్ట్రంలో ఈ ఏడాది 800 వంద వరకు సీట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అసలే నీట్ పుణ్యమా తమ సీట్లు, ఇతరరాష్ట్రాల విద్యార్థులు ఎక్కడ తన్నుకు వెళ్తారోనన్న ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతున్న నేపథ్యంలో, తాజా ఉత్తర్వులతో వందలాదిగా సీట్లు తగ్గడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఒక్కో వార్డును, వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించామని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
దుగ్గొండి, చెన్నారావుపేట(నర్సంపేట): స్థానిక ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పరీక్షా కేంద్రాల ఇన్చార్జిలకు సూచించా రు. ఎస్సై భాస్కర్రెడ్డి, పరీక్షా కేంద్రం సీఎస్లు సాల్మన్, రజాక్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావు పేట మం డలంలోని అమీనాబాద్ మోడల్స్కూల్, సిద్ధార్థ హైస్కూల్, జెడ్పీ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఈఓ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈ లక్ష్మీనారాయణ, సీఎస్ కొమ్మాలు, సీసీ రవిచంద్ర, రవికుమార్ పాల్గొన్నారు. -
ఏ అధికారంతో ఈ తనిఖీలు?
హాస్టళ్లలో టీఎన్ఎస్ఎఫ్ హంగామా తమను కలవాలంటూ వార్డెన్లపై ఒత్తిళ్లు ‘చినబాబు’ చెప్పాడంటూ జులుం విశాఖపట్నం: సంక్షేమ హాస్టళ్లపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నేతలు జులుం చెలాయిస్తున్నారు. లేని అధికారాలను అందిపుచ్చు కుని ఏకంగా తనిఖీలకే తెగబడుతున్నారు. చినబాబు (సీఎం తనయుడు లోకేష్) పేరు చెప్పి నానా హంగామా చేస్తున్నారు. వీరంతా ‘చంద్రన్న సంక్షేమ వసతి గృహాల సముద్ధరణ’ పేరుతో హాస్టళ్లకు వెళుతున్నారు. జిల్లాలో పలు బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లపై పడుతున్నారు. అక్కడ హాస్టల్ వార్డెన్లకు దడ పుట్టిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకుని తనకు నివేదించాలంటూ లోకేష్ టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను ఆదేశించినట్టు వారు చెబుతున్నారు. దీంతో 26 మంది సభ్యులు గల వీరు జిల్లాలో నాలుగైదు బృందాలుగా ఏర్పడి హాస్టళ్లకు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలంటూ రహస్యంగా వెళ్లి హడావుడి చేస్తున్నారు. తాము వసతి గృహాలు ఎలా ఉన్నాయో పరిశీలించి లోకేష్తో పాటు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని, అందుకే వచ్చామని చెబుతుండడంతో వార్డెన్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆయా హాస్టళ్లలో పరిశుభ్రత, ఆహారం, మెనూ, మరుగుదొడ్లు తదితర సమస్యలపై వీరు ఆరా తీస్తున్నారు. పిల్లలకు పెట్టే ఆహారాన్ని వీరు రుచి చూస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి పూట వారితో సహపంక్తి భోజనాలు చేసి అక్కడే బస చేస్తున్నారు. వారితో ఫొటోలు కూడా దిగుతున్నారు. హాస్టళ్లలో సమస్యలపై ఫొటోలు తీస్తున్నారు. ఆయా హాస్టళ్లలో ఏవో లోపాలుండడం వల్ల వీరు తమ గురించి ఎలాంటి నివేదికలు ఇస్తారోనని వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి ‘ఘన స్వాగతం’ పలుకుతూ ప్రత్యేక అతిథులుగా రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారు. మరోవైపు కొంతమంది హాస్టళ్లకు తాము తనిఖీలకు వస్తున్నట్టు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. దీంతో ఆయా వార్డెన్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడమేగాక ఆ రోజు విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. విద్యార్థులను సమస్యలు చెప్పవద్దని కోరుతున్నారు. వార్డెన్లకు హుకుంలు.. ఎక్కడైనా వీరు తనిఖీలకు వెళ్లినప్పుడు సంబంధిత వసతి గృహం వార్డెన్ అందుబాటులో లేనిపక్షంలో ఉన్నతాధికారులకంటే గట్టిగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ వార్డెన్కు ఫోన్ చేసి తమను కలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులైతే హాస్టల్ పిల్లల వద్దకు వెళ్లి వారిని పొంతనలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం కాలేజీ హాస్టల్లో ఎంపీసీ విద్యార్థుల వద్దకు వెళ్లి మీరు భవిష్యత్లో ఏమి కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఇంజినీర్లు కావాలనుకుంటున్నామని చెప్పగా, డాక్టర్లు ఎందుకు కావాలనుకోవడం లేదని ప్రశ్నించేసరికి ఆ విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిని బట్టి వీరికి ఎలాంటి అవగాహన ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలోని మరోక హాస్టల్కు వెళ్లిన బృంద సభ్యులు తనిఖీ చేసి వచ్చారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో బృందంలోని ఒక సభ్యుడు తరచూ తనను కలవాలంటూ ఫోన్లో ఆదేశాలు జారీ చేస్తున్నాడు. లేనిపక్షంలో మీ గురించి సీఎంకు, లోకేష్కు నివేదిక పంపిస్తామని బెదిరిస్తున్నాడు. ఇలా టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్లో కొందరు అదుపు తప్పి నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటిదాకా తాము జిల్లా, నగరంలోని 25 హాస్టళ్లను తనిఖీ చేసినట్టు ఈ బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి చెప్పాడు. ఈ హాస్టళ్లలోని పరిస్థితులను కొద్దిరోజుల్లోనే సీఎంతో పాటు లోకేష్కు నివేదిస్తామని వివరించాడు. -
చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి జైలు శిక్ష
రంగారెడ్డి : చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నేరం రుజువైనందున సంవత్సరం జైలు శిక్షతోపాటు రూ.85వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన వనం సత్యనారాయణ అదే ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీహరి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2015 ఏప్రిల్లో సత్యనారాయణ నుంచి శ్రీహరి రూ.70 వేలు అప్పుగా తీసుకొని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత డబ్బు చెల్లించమని శ్రీహరిని కోరగా రూ.70వేలకు ఆంధ్రా బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్కు చెందిన చెక్కులను సత్యనారాయణ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొత్తపేట బ్రాంచ్లో జమ చేయగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ శ్రీహరి డబ్బులు చెల్లించకపోవడంతో సత్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పు చెప్పారు. -
ఎక్స్పో్లజివ్ గోడౌన్స్ తనిఖీ చేసిన కంట్రోలర్
యెటింక్లయిన్ కాలనీ : జీడీకే–5వ గని సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఎక్స్పో్లజివ్ గోడౌన్ ను కంట్రోలర్ ఆఫ్ ఎక్స్పో్లజివ్ డీకేపాండే గురువారం తనిఖీ చేశారు. ప్రస్తుతం వకీల్పల్లిగని సమీపంలోని గోడౌన్ ను నూతనంగా నిర్మిస్తున్న కట్టడాల్లోకి మార్చేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్పో్లజివ్ఆఫ్కంట్రోలర్ నూతన నిర్మాణాలు పరిశీలించారు. కంట్రోలర్ వెంట ఆర్జీ–2 ఎస్ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేశ్, సివిల్ ఎస్ఈ శ్రీనివాస్, ఎక్స్పో్లజివ్ స్టోర్స్ ఇన్ చార్జి మూర్తి, సెక్యూరిటీ అధికారి జానకిరాం తదితరులున్నారు. -
మెక్కింది కక్కించరేం!
అక్రమాల పుట్టల ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అవినీతి తేలినా రికవరీ లేదు రూ.4.08 కోట్లకు రాబట్టింది రూ.1.77 కోట్లే.. పదును లేని ఆయుధంగా రెవెన్యూ రికవరీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి.. ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో దశాబ్దకాలం క్రితం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి అధికారులకు కల్పతరువుగా మారింది. పని చేయకున్నా.. చేసినట్లుగా లెక్కలు చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సామాజిక తనిఖీల్లో రూ. కోట్లలో అవినీతి బయటపడుతున్నా నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు అవినీతికి పాల్పడిన సిబ్బంది వేతనాల్లో కోత విధించడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి చెందాల్సిన రూ.కోట్లు రాకుండా పోతున్నాయి. తొమ్మిది విడతల్లో జరిగిన సామాజిక తనిఖీల ఆధారంగా బయటపడిన అవినీతి, అక్రమాలు, రికవరీపై ’సాక్షి’ ఫోకస్..– వివరాలు 2లోu ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 721 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,302 ఆవాస ప్రాంతాల్లో 4,67,858 మంది ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏటా సగటున రూ.300 కోట్ల పనులు జరుగుతాయి. గడిచిన దశాబ్దకాలంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సామాజిక తనిఖీల్లో రూ.4.08 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు తేల్చగా.. ఇప్పటివరకు రూ.1.77 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. సామాజిక వనరుల కోసం చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరగడం, పనుల్లో నాణ్యత లోపించడం, చేయని పనులు చేసినట్లుగా చూపి బిల్లులు పొందడం, ఉపాధి కూలీల సొమ్ము నొక్కెయడం జరిగింది. 2015లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఓ స్వతంత్య్ర పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో 50 శాతం ఉపాధి హామీ లబ్ధిదారులు తమ వేతనాలు, వసూల్కు లంచాలు చెల్లిస్తున్నానే ఆశ్చర్యకర విషయం బయటపడింది. జరగని పనులు జరిగినట్లు, చనిపోయిన వారిని ఉపాధి కూలీలుగా చూపడం, సామాజిక తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడం వంటి కారణాలతో ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతుంది. ఇదిలా ఉండగా గత దశాబ్దకాలంగా ఉపాధి హామీలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పైస్థాయి ఉద్యోగులు ఎవరినీ విధుల నుంచి తొలగించ లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 133 మంది విధుల నుంచి తొలగించారు. తొలగించిన వారిలో ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఓలు మాత్రమే ఉన్నారు. మండల స్థాయిలో సరిగ్గా పర్యవేక్షణ జరపాల్సిన ఎంపీడీలు.. తప్పు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు 13 మంది ఎంపీడీఓలు తప్పు చేసినా.. వారికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఫలితాలు లేని తనిఖీలు ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల పురోగతి నాణ్యత పరిమాణాలు చూడ్డానికి జరుగుతున్న సామాజిక తనిఖీలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఆ ఏడాది చేసిన పనులను పరిశీలించిన తరువాత చివరి రోజు జరిగే ప్రజావేదికకు ప్రజలే లేకుండా పోతున్నారు. అలాగే సామాజిక తనిఖీల ద్వారా జరిగిన అవినీతి కూడా బయటకు రావడం లేదు. 10వ తరగతి, ఇంటర్ చదివిన వారితో తనిఖీలు చేయించడం వల్ల కూడా అక్రమాలు వెలుగులోకి రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. మరో పక్కా సామాజిక తనిఖీలకు విచ్చల విడిగా ఖర్చు అవుతోంది. అవినీతి సొమ్మును సిబ్బంది నుంచి కక్కించే ప్రయత్నం అధికారులు చేయడం లేదు. రెవెన్యూ రికవరీ చట్టం ఉన్నా అది పదును లేని ఆయుధంగా మారింది. -
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నూతన విధానం
అనంతపురం అర్బన్ : భూముల రిజిస్ట్రేషన్లలో వివాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. రిజిస్ట్రేషన్ కు ముందే భూములను సబ్డివిజన్ చేయడం ఇందులో కీలకాంశం. ఈ విధానం అమలుకు తొలిదశగా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేశారు. ఈ విధానం ఇక్కడ తీసుకొస్తే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అమలు చేసిన జిల్లాగా అనంతపురం నిలుస్తుంది. రిజిస్ట్రేషన్ కన్నా ముందే సబ్డివిజన్ నూతన విధానం కర్ణాటక తరహాలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ముందే రెవెన్యూ యంత్రాంగం భూమికి సంబంధించి సబ్డివిజన్ పూర్తి చేస్తుంది. విక్రయదారులు ఇద్దరూ సర్టిఫైడ్ స్కెచ్ పొందిన తరువాతే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. సర్వే చేయడం ద్వారా విక్రయించే వ్యక్తికి క్షేత్ర స్థాయిలో ఎంత భూమి ఉంది.. తనకు ఉన్నదానినే విక్రయించేందుకు సిద్ధపడ్డాడా, లేదా అనేది స్కెచ్ ద్వారా తెలుస్తుంది. భూమి విస్తీర్ణం, దాని హద్దులు (చెక్బందీ) సర్టిఫైడ్ స్కెచ్లో ఉంటాయి. ప్రస్తుతం భూ విస్తీర్ణం, చెక్బందీతో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విక్రయదారుడు చూపిన విస్తీర్ణం క్షేత్ర స్థాయిలో లేకపోతే వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా భాగపరిష్కార ఆస్తులను లేదా ఉన్న భూమిలో కొంత భాగాన్ని అప్పటికే విక్రయించిన సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలు చేసిన వారు క్షేత స్థాయిలోకి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి వివాదాలు కోర్టుల పరిధిలో చాలానే ఉన్నాయి. మొదటి విడతగా ఐదు మండలాల్లో... నూతన విధానాన్ని మొదటి విడతగా ఐదు మండలాల్లో ప్రారంభించనున్నారు. అనంతపురం రెవెన్యూ డివిజన్లో శింగనమల మండలం, ధర్మవరం డివిజన్లో చెన్నే కొత్తపల్లి, పెనుకొండ డివిజన్లో మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లో రాయదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లో బుక్కపట్నం మండలాలను ఎంపిక చేశారు. -
ఇటు పాత రూ.కోట్లు అటు నకిలీ నోట్లు
ఎండాడ చెక్పోస్టు వద్ద రూ.కోటి పాత నోట్లు పట్టివేత సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు వుడా కాలనీ మురుగునీటిలో నకిలీ నోట్ల బస్తాలు ఏరుకోవడానికి ఎగబడిన జనం రంగంలోకి ఐటీ అధికారులు విశాఖపట్నం/పీఎం పాలెం/మధురవాడ : అర్ధరాత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే పోలీసుల కళ్లు చెదిరిపోయారుు. కోటి రూపాయల నగదు చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే డబ్బు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో డబ్బుల బస్తాలు మురుగు కాలువలో దర్శనమిచ్చారుు. వాటిని గమనించిన స్థానికులు అందినకాడికి పట్టుకుని పరుగుతీశారు. ఇంకా ఏమైనా మిగిలిపోయాయోమోనని కొందరు మురుగుకాలువలో దేవులాడారు. చివరికి కేవలం ఐదు నోట్లు దొరికారుు. అవి కూడా నకిలీవని తెలిసి అవాక్కయ్యారు. నగరంలో బుధవారం జరిగిన ఈ రెండు సంఘటనలు పెద్ద నోట్ల రద్దుతో ’నల్ల’ పాములు బయటకొస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు నగరంలో నకిలీ నోట్ల చెలామణీకి అద్దం పట్టారుు. రాత్రివేళ వాహనంలో తరలింపు ఒడిశాకు చెందిన ప్రీతమ్కుమార్ బారిక్, తమిళనాడుకు చెందిన వెంకటపతి ఒ.డి.5 09ఇ-1199 నంబరు గల బొలోరా వాహనంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి మీదుగా రూ. కోటి రూపాయలు పాతనోట్లు తమ వెంట తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆనందపురం ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఎండాడ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న బొలోరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200 బండెల్స్ పాత ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు (వాటి విలువ రూ. కోటి) కనిపించారుు. వెంటనే కారు డ్రైవర్ను, అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం నగరమంతా దావానలంలా వ్యాపించింది. కానీ పోలీసులు మాత్రం అత్యంత గోప్యత పాటించారు. రాత్రి వరకూ వివరాలు వెల్లడించలేదు. కాగా పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తాము త్రివేణీ ఎర్త్ అనే ప్రైవేటు సంస్థ ప్రతినిధులమని మెకానికల్, డీజిల్ ఫైర్ పార్టులకు చెల్లింపుల కోసం ఈ సొమ్ము తరలిస్తున్నామని వారిలో ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన విషయంలో ఈ నగదు చెల్లించాల్సి వచ్చిందని మరో వ్యక్తి పోలీసులకు వివరించారు. వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపేణా లావాదేవీలు జరగడం అంటూ ఉండదని, చెక్కు, డీడీ రూపంలో చెల్లింపులు ఉంటాయనే కోణంలో రికార్డులు చూపమని పోలీసులు వారిని అడిగారు. చూపిస్తామంటూ సాయంత్రం వరకూ కాలం గడిపినా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయారు. నగదుకు సంబంధించి వారు సరైన ఆధారాలు చూపలేకపోయారని, దాంతో కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. మరోవైపు ఐటీ ప్రతినిధులు ఈ ఉదంతంపై ఆరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నివేదికను సీఐ వారికి అందజేశారు. మురుగు కాలువలో నకిలీ నోట్లు జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో బుధవారం ఉదయం దొంగనోట్లు కలకలం రేపారుు. ఉదయం 6గంటల సమయంలో మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డులో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద మురుగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు బస్తాలతో రు.500 నోట్లు పడేసి పరారయ్యారు. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏరుకోవడానికి జనం పరుగులు తీశారు. మోకాలు లోతు నీటిలో సైతం నోట్ల కోసం వెతికారు. అవి దొంగనోట్లు అని తెలిసినా వెతుకులాట ఆపలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇవి చెల్లని నోట్లు అని అందరినీ చెదరగొట్టారు. అరుుతే సుమారు కోటి రూపాయలు విలువ చేసే నోట్లు బస్తాలతో పడేశారని, కొందరు వీటిని పట్టుకెళ్లిపోయారని, చాలా నోట్లు ఈ కాలువలో కొట్టుకు పోయాయని పుకార్లు షికారు చేశారుు. ఈ విషయంమై పీఎంపాలెం సీఐ లక్ష్మణమూర్తి వివరణ కోరగా నోట్లు ఎవరు పడేశారో, ఎంత మొత్తం అనే విషయాలు తెలియదన్నారు. అరుుతే అవి దొంగనోట్లు అని భావిస్తున్నామని తెలిపారు. -
ఉపాధి హామీలో అవినీతి
► పనులు తక్కువ కొలతలు ఎక్కువ ► ధర్మారంలో రూ.68875, ► సైదాబాద్లో రూ.64877 రికవరీ జమ్మికుంట రూరల్ : ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించగా సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 9వ, విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక జరిగింది. పలు గ్రామాలలో తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిపాదనలు చూపిన ఆధారాలను తనిఖీ బృందం బయట పెట్టింది. మండల స్థారుు అధికారుల పర్యవేక్షణ కొరవడడడంతో ఫీల్డు అసిస్టెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ధర్మారం గ్రామంలో వరద కాల్వ నిర్మాణ పనుల్లో తక్కువ పనికి ఎక్కువ ప్రతిపాదనలు తయారు చేయడంతో రూ.68875లను,సైదాబాద్లో బినామీ పేర్లతో సొమ్మును కాజేయగా రూ.64,877లను రికవరీకి సిద్ధం చేశారు. కనగర్తి గ్రామంలో గ్రామ ఫీల్డు అసిస్టెంట్ తన భర్తకు 84రోజుల పని దినాలు కల్పించి రూ.9991లను పొందినట్లు గుర్తించారు. దగ్గరి బంధువులకు మాత్రమే పని దినాలు కల్పించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వంతడుపుల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి జాబ్కార్డు ఇవ్వడాన్ని, వరద కాల్వ నిర్మాణంలో తక్కువ కొలతలను గుర్తించారు. వావిలాల ఫీల్డు అసిస్టెంట్ను తొలగించాలని పలువురు గ్రామస్తులు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును అధికారులకు అందజేశారు. లక్ష్మాజిపల్లి సీఎస్పీ లావణ్య రూ.16 వేలను ఇప్పటికీ కూలీలకు చెల్లించలేదని గుర్తించగా చర్యకు నిర్ణరుుంచారు. ఎంపీడీవో పనితీరుపై డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రావు అసహనం వ్యక్తం చేశారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో మొత్తం 32 గ్రామాలు ఉండగా సోమవారం రాత్రి వరకు 15 గ్రామాల పనితీరుపై ప్రజావేదిక జరిగింది. మిగతా గ్రామాల ప్రజావేదిక బుధవారం జరగనుందని అధికారులు తెలిపారు. ఎంపీపీ గంగారపు లత, ఏపీడీ రాంరెడ్డి, ఎంపీడీవో రమేష్, ఏపీవో రాణి, అసిస్టెంట్ విజిలెన్స అధికారి కొమురయ్య, స్టేట్ మానిటరింగ్ అధికారి అశోక్కుమార్, ఎస్ఆర్పీలు నవీన్, అనిల్కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
‘గ్రూప్-2’ ప్రశాంతం
-
‘గ్రూప్-2’ ప్రశాంతం
‘గ్రేటర్’లో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగారుు. ఎక్కువ మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థినీ తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల ఐరీస్ను తీసుకున్నారు. కొందరి ఐరీస్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యారుు. పరీక్ష సమయం అరుుపోతుండటంతో ఐరీస్ నమోదు ఆపేసి నేరుగా హాల్లోకి పంపేశారు. కొందరు అభ్యర్థినులు తమ పసిబిడ్డలతో పాటు పరీక్ష కేంద్రానికి వచ్చారు. చిన్నారులను తండ్రి, అమ్మమ్మ వంటి వారు ఆడిస్తుండగా తల్లులు పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఒకరిద్దరు అభ్యర్థులు పరీక్ష మొదలయ్యే ముందు హడావుడిగా రాగా.. మరికొందరు పరీక్ష ప్రారంభానికి ముందు వరకూ కూడా కేంద్రం పరిసరాల్లో పుస్తకాలతో కుస్తీపడుతూ కనిపించారు. -
ఆదాల, అజీజ్కు ఆనం చెక్
ఎస్సీ సబ్ప్లాన్ పనులు తమ చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహం కాంట్రాక్టర్లతో నేరుగా ఆనం సోదరుల చర్చలు తమ వారినీ రంగంలోకి దించి లెస్కు టెండర్లు దాఖలు చేయించేందుకు నిర్ణయం ఈ పనులతో సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో పట్టు పెంచుకునే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి – నెల్లూరు నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో తమ పట్టు పెంచుకోవడానికి ఆనం సోదరులు మళ్లీ రంగంలోకి దిగారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ 42 కోట్లతో నిర్మించనున్న పనులను ఆయుధంగా మలుచుకుని తమ ప్రత్యర్థులు ఆదాల ప్రభాకర్రెడ్డి, అజీజ్కు చెక్ పెట్టడానికి వ్యూహ రచన చేశారు. శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో జరిగిన రాజకీయ కుప్పి గంతుల తర్వాత నెల్లూరు టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన మేయర్ అబ్దుల్ అజీజ్ నగరంలో తన పట్టు పెంచుకోవడానికి ఉవ్విళ్లూరారు. సామాజక సమీకరణలో వచ్చే సారి తనకు అవకాశం రాకపోదా అనే ఆశతో పనిచేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కార్పొరేషన్ మొత్తం పరిధిలో తన వారిని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రూరల్ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్రెడ్డితో విబేధాలకు దిగారు. ఈ పరిణామాలు నడుస్తున్న తరుణంలోనే ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం నెల్లూరులో అందరికంటే ఎక్కువ అజీజ్కే ఆందోళన కలిగించింది. తనను గట్టిగా వ్యతిరేకించే ఆనం కుటుంబం తానున్న పార్టీలోకే వస్తే తనను మడిచేస్తారనే ఆందోళన ఆయనలో వ్యక్తం అయ్యింది. కొంత కాలం పాటు లోలోన ఉన్న విబేధాలు ఇటీవల బహిర్గతం అయ్యాయి. ఆక్రమణల కూల్చి వేత సమయంలో ఆనం వివేకానందరెడ్డి నేరుగా మేయర్ మీద దాడికి దిగారు. అజీజ్ కూడా గట్టిగానే ఎదురు దాడి చేశారు. ఈ వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టేలా తయారు కావడంతో హై కమాండ్ రంగంలోకి దిగడంతో వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆనంతో ఎప్పకైనా ఇబ్బందే అనే అభిప్రాయంతో మేయర్ అజీజ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డితో స్నేహం ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని రూరల్నియోజక వర్గంలో ఆదాలకు మేయర్, సిటీ నియోజక వర్గంలో మేయర్కు ఆదాల సహరించుకునేలా రాజీ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయం తెలిసుకున్న ఆనం సోదరులు అటు ఆదాల, ఇటు అజీజ్కు ఒకే సారి చెక్ పెట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. రూ 42 కోట్ల పనులతో ఆధిపత్యం కార్పొరేషన్ పరిధిలో 8 ప్యాకేజీల కింద రూ 42 . 21 కోట్లతో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల కింద చేపట్టే పనుల్లో పూర్తిగా తన ముద్రే ఉండాలని మేయర్ అజీజ్ వ్యూహరచన చేశారు. కాల్వలు, సిమెంటు రోడ్లు, తారు రోడ్ల పనులు మొత్తం తాను చెప్పిన వారికే దక్కేలా టెండరు నిబంధనలు తయారు చేయించారనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్, ఆర్ అండ్బి శాఖలు పెట్టే టెండర్ నిబంధనలను తొలిసారి కార్పొరేషన్ పనుల్లో అమలు చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా రాజకీయం నడిపారు. ఈ పనులకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆనం సోదరులు తమ మద్దతు దారులైన పెద్ద కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. మేయర్ ప్రతి పనికీ తక్కువతో టెండర్లు దాఖలు కాకుండా ఏర్పాటు చేయించుకున్నందున ప్రతి పనికీ 10 శాతం తక్కువతో టెండర్లు దాఖలు చేయాలని తమ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన సుమారు 10 మంది కాంట్రాక్టర్లతో ఆనం సోదరులు నేరుగా మాట్లాడారని సమాచారం. తాము చెప్పిన వారికే పనులు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఒక వైపు తమ మద్దతు దారులైన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి తక్కువతో టెండర్లు దాఖలు చేయించడం, ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన వారిని తమ దారిలోకి తెచ్చుకుని అజీజ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇక పోతే రూరల్ నియోజక వర్గ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లతోనేరుగా మాట్లాడి పనులు తమ చేతుల్లోకి తెచ్చుకుంటే ఆదాల ఆధిపత్యానికి కూడా చెక్ పెట్టే వ్యూహం అమలు చేశారు. తమ నియోజక వర్గంలో చేయబోతున్న పనులకు సంబంధించి ఆనం సోదరులు కాంట్రాక్టర్లతో మాట్లాడటం పట్ల ఆదాల ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టబోయే పనులు అగ్రవర్ణనేతల మధ్య రాజకీయ పో రాటానికి అస్త్రాలుగా మారడంపై అటు అధికార వర్గాలు, ఇటు టీడీపీ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. -
కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) : ఓఎన్జీసీ కృష్ణా–గోదావరి బేసిన్ కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆ బేసిన్ హెడ్ ఫార్వర్డ్బేస్ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్పష్టం చేశారు. బేసిన్ మేనేజర్ మేనేజర్ డాక్టర్ పి.చంద్రశేఖరన్ నేతృత్వంలో సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని 46 పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆర్వో ప్లాంట్ల స్థాపనకు రూ.60 లక్షల చెక్కులను శుక్రవారం బేస్ కాంప్లెక్స్లో ప్రధానోపాధ్యాయులకు ఆయన అందించారు. కామరాజు మాట్లాడుతూ నిర్వహణపరమైన సవాళ్లను ఆధునిక సాంకేతికతో ఎదుర్కొంటూ, భద్రతలో రాజీపడకుండా పనిచేస్తున్నామన్నారు. -
గ్యాస్ ‘గమనించండి’
► సిలిండర్ సీల్ను తనిఖీ చేయండి ► బరువుందా తెలుసుకునేందుకు తూకం వేయించండి ► అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి కొవ్వూరునగర్లో నివాసముంటున్న వెంకటేశ్ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరి చేసేందుకు బాయ్స్ తీసుకొచ్చారు. దానికి సీల్ లేదు. సీల్ ఎందుకు తొలగించారని బాయ్స్ను అడిగితే, వాచర్ లికేజీ ఉందేమోనని చెక్ చేసేందుకు సీల్ తొలగించామని చెప్పి సిలిండర్ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే సిలిండర్ నిర్ణీత బరువు లేదు. స్పింగ్ త్రాసు బాయ్స్ వెంట తెచ్చుకోకపోవడంతో తూకం వేయించుకోలేక పోయాడు. అనంతపురం అర్బన్ : వంట గ్యాస్ సిలిండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా..? గ్యాస్ నిర్ణీత బరువు ఉందా లేదా...? అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ సిలిండర్లు సీల్ తొలగించి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో డెలివరీ బాయ్స్ చేతి వాటం ప్రదర్శిస్తూ సిలిండర్ నుంచి గ్యాస్ తస్కరించే అవకాÔ¶ ం లేకపోలేదు. ప్రధానంగా విద్యావంతులు కాని వారికి ఇలాంటి సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సీల్ ఉందా లేదో చూసుకోండి గ్యాస్ సిలిండర్ నాబ్కు సదరు కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ని ఒకసారి చూడండి. అది ఊడిపోయినట్లు ఉంటే తీసుకోవద్దు. దానికున్న సీల్ తొలగించడం నేరం. అలా డెలివరీ బాయ్స్ తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్ తొలగించి సిలిండర్ సరఫరా చేసినట్లయితే తక్షణం అధికారులు ఫిర్యాదు చేయండి. స్రింగ్ త్రాసు తప్పని సరి వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్ వెంట తప్పని సరిగా స్పింగ్ త్రాసు ఉండాలనేది నిబంధన. గహ అవసర సిలిండర్లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్ త్రాసు ద్వారా తూకం వేసి వినియోగదారునికి దాని బరువును చూపించి ఇవ్వాల్సి ఉంది. మీరు అందజేసిన సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లండి. లీకేజి చెక్ చేయించుకోవాలి సిలిండర్కు రెగ్యులేటర్ అమర్చే నాబ్లోని వాచర్ కొన్ని సందర్భాల్లో పాడై ఉంటుంది. అలాంటి వాటికి రెగ్యులేటర్ బిగించిన వెంటనే గ్యాస్ లికవుతుంది. సిలిండర్ తీసుకున్న వెంటనే స్వయంగా సీల్ తీసేసి వాచర్ చెక్ చేయించుకోవాలి. గ్యాస్ లికవుతున్నట్లు గుర్తిస్తే తక్షణం వాచర్ వేయించుకోవాలి. ఫిర్యాదు చేయండి కంపెనీ వేసిన సీల్ లేకుండా గ్యాస్ సిలిండర్ సరఫరా చేసినప్పుడు. లేదా తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరించినప్పుడు వెంటనే మీరు జిల్లా పౌర సరఫరాల అధికారి ఫోన్ 8008301418 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సీల్ తీసి డెలివరీ చేస్తే చర్యలు గ్యాస్ సిలిండర్కుS కంపెనీ వేసే సీల్తోనే డెలివరీ చేయాలి. అలా చేయలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ తప్పని సరిగా తమ వెంట స్పింగ్ త్రాసు ఉంచుకోవాలి. సిలిండర్ డెలివరీ చేసేప్పుడు తూకం వేసి వినియోగదారునికి అందజేయాలి. – ప్రభాకర్రావు, డీఎస్ఓ -
బీబీనగర్లో సేల్స్టాక్స్ అధికారుల తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని పూసల గోదాములో శనివారం భువనగిరికి చెందిన సేల్స్టాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించకుండా ఓç ³రిశ్రమ నుంచి అక్రమంగా ముడి సరుకును తీసుకువచ్చి గోదాములో ఉంచి రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అధికారులు గోదాముకు చేరుకొని రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోని రికార్డుల్లో నమోదు చేయకుండా, పన్ను చెల్లించకుండా గోదాముల్లో నిల్వ ఉంచిన అయిల్ తయారీకి ఉపయోగించే 3వేల టన్నుల డీ అయిల్డ్ కిక్ బస్తాలు, 630టన్నుల సన్ప్లై పౌడర్ బస్తాలు, 6లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను గుర్తించినట్లు ఏఎస్టీఓ విజయ్కుమార్ తెలిపారు. దీంతో స్టాక్ వేసి ఉన్న 3బ్లాక్ల గోదాములను సీజ్ చేశామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంత వరకు సరుకును తరలించకూడదని సంబంధిత వ్యక్తికి సూచించి గోదాం ఇన్చార్జీగా ఉన్న నగేష్కు నోటీస్ అందజేశారు. యజమానిపై చర్య తీసుకోవాలి మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ నుంచి ముడి సరుకును కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా తప్పుడు బిల్లులతో సరుకును తరలించే యత్నం చేస్తున్న సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ బాధిత కార్మికులు డిమాండ్ చేశారు. ఆనంద్ సాల్వెక్స్లో పని చేసిన తమకు వేతనాలను చెల్లించకుండా యాజమాన్యం పరిశ్రమను మూసి వేసి ఇతర వ్యక్తులకు ప్రొడక్షన్ను విక్రయించిదని, దీంతో వారు పన్ను చెల్లించకుండా స్టాక్ను తరలించే యత్నం చేస్తున్నారని అధికారులకు విన్నవించారు. -
25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు టౌన్: మైదుకూరు మండలం వనిపెంట ఫారెస్ట్ పరిధిలోని కండ్రగుండలు సమీపంలో ఆదివారం రాత్రి వనిపెంట రేంజ్ అధికారి స్వామివివేకానంద దాడులు నిర్వహించి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వామి వివేకానంద తెలిపిన వివరాల మేరకు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో ట్రాక్టర్తో పాటు 25 దుంగలను స్వాధీనం చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ బండి కిషోర్ను అరెస్ట్ చేశామన్నారు. మరికొంతమంది నిందితులు పరారైనట్లు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
చెల్లని చెక్కు కేసుల్లో నిందితుడికి జైలు
విజయవాడ లీగల్ : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు, రూ.రూ.2,60, 000 జరిమానా విధిస్తూ ఒకటవ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. నగరంలోని రామలిం గేశ్వరనగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద అదే ప్రాంతానికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి 2013, డిసెంబర్ ఒకటో తేదీన రూ.2,50,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే క్రమం లో శ్రీనివాసరెడ్డి 2014, మే 8వ తేదీన రూ. 2.50లక్షలకు చెక్కు ఇచ్చాడు. అయితే అతని బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కు చెల్లలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. మరో కేసులోనూ శ్రీనివాసరెడ్డికి శిక్ష మరొకరికి కూడా చెల్లని చెక్కు వచ్చిన కేసులో గుర్రాల శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడం తో ఆరు నెలలు జైలుశిక్షతోపాటు రూ.2,30, 000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సూర్యారావుపేటకు చెందిన బి.రాజు వద్ద శ్రీనివాసరెడ్డి 2013, మే 5న రూ.2.50లక్షలు అప్పు తీసుకున్నాడు. అతనికి కూడా చెల్లని చెక్కు ఇచ్చాడు. రాజు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువైంది. న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
పాత కేసులను పరిష్కరించాలి
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ కర్నూలు(లీగల్): పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టీస్ నౌషద్ అలీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వినియోగదారుల ఫోరంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, వాటి పెండింగ్ కాల పరిమితిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి అధ్యక్షురాలు ఎస్.నజీరున్నిసా పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఏర్పాటు చేయాలని జిల్లాలోని వినియోగదారుల సంఘాల నాయకులు, కక్షిదారులు ఆయన విజ్ఞానపత్రం ఇచ్చారు. -
గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన
పాన్గల్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం సమీపంలో మార్కెట్ గోదాం నిర్మాణం చేపట్టేందుకు శనివారం మార్కెంటింగ్ శాఖ ఈఈ రామారావు, ఏఈ శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. రూ.3కోట్లతో గోదాం నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకుగాను స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. గుట్ట మాదిరిగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మట్టిని తొలగించి చదును చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వారి వెంట కాంట్రాక్టర్ తిరుపతయ్యసాగర్ ఉన్నారు. -
బైనామాల చెక్మెమోలు అప్లోడ్ చేయాలి
వీసీలో జేసీ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్ : సాదాబైనామాలకు సంబంధించి ఫీల్డ్ చెక్ మెమోలు వారం రోజుల్లో ఆప్లోడ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాదాబైనామాల ప్రగతి, కల్యాణలక్ష్మి, భూదాన్ల్యాండ్ల ప్రగతిపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాదాబైనామాల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ, చెక్ మెమోల ఆన్లైన్ నోటిసుల జారీని వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామాలకు వెళ్లి సాదాబైనామాల కింద అందిన దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. చెక్ మెమోలను ఆన్లైన్ చేయడంలో అలసత్వం వద్దని, నోటీస్ జనరేట్ చేసిన అనంతరం చెక్మెమోను ఆన్లైన్ చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపిన భూముల మ్యుటేషన్లో వారం రోజుల్లోపు ప్రగతి కనబరచాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వెళ్తున్న నిత్యావసర వస్తువులను రేషన్దారులు విక్రయిస్తే వారిపై 17బీ, డీలు, అట్టి వస్తువులు కొనుగోలు చేసిన వారిపై 17ఈ, 6ఏ కేసులను బుక్ చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు అక్టోబర్ నుంచి మొదలవుతుందని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎయిర్ టెల్ మరో భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4 జీ సేవల ఆవిష్కరణతో ప్రముఖ టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్, ఐడియాతోపాటూ, వోడాఫోన్ డేటా చార్జీలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకనే ప్రయత్నం చేస్తున్న భారతి ఎయిర్ టెల్ తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4 జీ సేవల ధరను భారీగా తగ్గించేసింది. ఈ స్పెషల్ స్కీం కింద ధరలను 80 శాతం తగ్గించింది. కేవలం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికి ఢిల్లీలో ఉన్న ఈ ఆఫర్ ఈనెల (ఆగస్లు) 31 కల్లా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందనీ, భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా), అజయ్ పూరి చెప్పారు అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 12 నెలల వరకు వర్తించనుంది. ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
సీసీ కెమెరాలతో చోరీలకు చెక్
విజయవాడ : జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను ఎంచుకుని చోరీలకు పాల్పడే ఘరానా దొంగలు కృష్ణా పుష్కరాలకు వచ్చారు. అయితే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడి అధికారులు వారికి చెక్ పెట్టారు. ఇందుకు అధికారులకు సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగపడ్డాయి. ఎంతోమంది అంతర్రాష్ట్ర దొంగలు, నేరస్తులను అవి పట్టిచ్చాయి. వారి వద్ద ఉన్న ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. సోమవారం సీసీఎస్ పోలీసులు 27మంది అంతరాష్ట్ర నేరస్తులను పలు కేసుల్లో అరెస్టు చేశారు. చోరీల వివరాలు.. ∙ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్కు చెందిన నిందితులు వసంత, మంజుల, మరేశ్వరి, తారా, గాంధీ వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఈనెల 12న పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో నాంతాడును, 14న అదే ప్రదేశంలో వేరొక మహిళ మెడలో చైనును కట్టర్ సహాయంతో కత్తిరించారు. ∙ఒడిశా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన మీనాక్షి దాస్, దుర్గా దాస్, రాధికా దాస్, సంగీతా దాస్లు ముఠాగా ఏర్పడి ఈనెల 15న కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడలో బంగారం చైను కట్టర్ సహాయంతో అపహరించారు. ఇదే ముఠా 17 న పద్మావతి ఘాట్లో ఏమరుపాటుగా ఉన్న మహిళ చేతి సంచి లాక్కుని అందులో ఉన్న బంగారం నాంతాడును అపహరించారు. ∙ఒడిస్సా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన ప్రియ దాస్, పార్వతీ దీస్, గాయత్రీ దాస్, గోవింద్ దాస్లు వేరొక ముఠాగా ఏర్పడి ఈనెల 13న పద్మావతి ఘాట్లో ఒక దొంగతనం, 18 న బస్టాండ్ వద్ద ఒక బ్యాగును దొంగిలించారు. అలాగే 19 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కట్చేశారు. ∙ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన సవీద్ అక్తర్, షాబద్జీలు ఈనెల 15 న పద్మావతి ఘాట్లో ఒక వ్యక్తి బట్టలు విప్పి స్నానానికి వెళ్ళగా బట్టలను అపహరించుకుపోయారు. ∙తెలంగాణా రాష్ట్రం హైదారబాద్కు చెందిన ముట్టాబత్తి పుష్ప, పూజ ఈ నెల 14 న కృష్ణవేణి ఘాట్లో ఓ యాత్రికుని సెల్ఫోన్, రూ.15వేల నగదు అపహరించారు. 18 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కూడా వారు అపహరించారు. ∙మెదక్కు చెందిన ఐదాకుల వెంకటమ్మ, తెలుగు లక్ష్మి, గారడి వెంకటేష్ ఒక ముఠాగా ఏర్పడి 14 న పద్మావతి ఘాట్లో ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాల సంచిని అపహరించారు. వారే 17న బస్టాండ్ వద్ద మరో మహిళ నుంచి సెల్ఫోన్, రూ.1000 నగదును చోరీ చేశారు. ∙వైజాVŠ కు చెందిన ఎండీ బాబ్జీ, మానుపాటి శివ, బాలంకి శ్రీను 13న కృష్ణవేణి ఘాట్లో, 14న పద్మావతి ఘాట్లో, 16న ఒన్టౌన్ రాజస్థాన్ స్కూలు సమీపంలో మూడు దొంగతనాలకు పాల్పడి మనీపర్సు, బ్యాగులు అపహరించారు. అదే విదంగా విజయవాడకు చెందిన కూరగంటి హోసన్న, దారుకోటయ్య, వైజాగ్కు చెందిన కట్టుమూరి అప్పారావు వేరొక బ్యాచ్గా ఏర్పడి 17, 18, 19 మూడు దొంగతనాల్లో మనీపర్సులు, బ్యాగులు అపహరించారు.