Chess Tournament
-
‘పరాయి స్త్రీలను తాకను’.. ఇంత పొగరు పనికిరాదు!
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో(Tata Steel Chess Tournament) ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ యకుబొయేవ్(Nodirbek Yakubboev) వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలి(R Vaishali)తో గేమ్ సందర్భంగా నొదిర్బెక్ ఆమెతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.క్షమించండిఈ నేపథ్యంలో నొదిర్బెక్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచలేదని.. తన వల్ల తెలిసోతెలియకో పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరాడు. అయినప్పటికీ అతడి వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇంత పొగరు పనికిరాదుద్వంద్వ ప్రమాణాలు పాటించే వారు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరంటూ నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రౌండ్లో ఆర్.వైశాలితో నొదిర్బెక్ ముఖాముఖి తలపడ్డాడు. అయితే, ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్బెక్.. గేమ్ ఆరంభం కావడానికి ముందు కర్టెసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాచగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్లుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు.విజయం తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదుఇక ఈ గేమ్లో నొదిర్బెక్పై వైశాలి గెలుపొందింది. గేమ్కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. నొదిర్బెక్ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.పరాయి స్త్రీలను తాకను‘‘ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. క్షమించండి. నాకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తాను.పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. 2023లో దివ్యతో నేను పొరపాటుగా అలా వ్యవహరించాను. ఈరోజు గేమ్ ఆడేటపుడు నా ప్రత్యర్థి బుల్మాగాకు ముందే చెప్పాను.షేక్ హ్యాండ్ నాకు ఇష్టం ఉండదని. తను అందుకు అంగీకరించింది. అయితే, కొంతమంది మర్యాదపూర్వక పలకరింపునకు చిహ్నంగా నమస్తే అయినా చెప్పాలని కోరారు. ఏదేమైనా.. దివ్య, వైశాలిలతో గేమ్లకే ముందే నేను మహిళలతో షేక్ హ్యాండ్కు విరుద్ధం అని చెప్పి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు’’ అని నొదిర్బెక్ వివరణ ఇచ్చాడు. కాగా అంతకుముందు మరో భారత గ్రాండ్మాస్టర్ దివ్యతో గేమ్కు ముందు ఆమె ముంజేయికి ముంజేయి తాకించి.. విష్ చేశాడు. ఇక చెన్నైకి చెందిన చెస్ సంచలనం ఆర్.ప్రజ్ఞానందకు తోడబుట్టిన అక్క వైశాలి అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు గ్రాండ్మాస్టర్లు ప్రస్తుతం టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్తో బిజీగా ఉన్నారు. మరోవైపు.. 23 ఏళ్ల నొదిర్బెక్ 2019లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందగా.. 23 ఏళ్ల వైశాలి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్గా ఇటీవలే చరిత్ర సృష్టించింది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా?A renowned Uzbek chess Grandmaster, Nodirbek, refused to shake hands with India's Women's Grandmaster Vaishali.Does religion influence sports? However, he was seen shaking hands with other female players earlier. pic.twitter.com/fGR61wvwUP— Ayushh (@ayushh_it_is) January 27, 2025 -
చదరంగ కీర్తి.. గుకేశ్ స్ఫూర్తి
సరదాగా స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు చేసే వయస్సులో చెస్లో జగజ్జేతగా నిలిచాడు. 18 సంవత్సరాల అతి పిన్న వయస్సులో కలలో కూడా ఊహించని చరిత్రను తిరగరాశాడు. భారత ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తి చేశాడు. కుర్రాడిగా పావులు కదుపుతూ సీనియర్ క్రీడాకారుడిని ఖంగుతినిపించి ప్రపంచ మేధావుల దృష్టిని ఆకర్శించాడు. అతనెవరో కాదు దొమ్మరాజు గుకేశ్. ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా.. చెస్లో ప్రపంచ చాంపియన్గా నిలిచిన గుకేశ్ గురించే చర్చ. ఈ నేపథ్యంలో గుకేశ్ ఆటలో ఎత్తుగడలు, విజయం సాధించిన తీరు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానుల మనోగతం ‘సాక్షి’ పాఠకుల కోసం. ఆరేళ్లకు ఎలో రేటింగ్రెండు సంవత్సరాలుగా చెస్ నేర్చుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో నిర్వహించిన చెస్ టోర్నీలో ర్యాపిడో విభాగంలో దేశవ్యాప్తంగా 1,485వ ఎలో రేటింగ్ వచ్చింది. మా అమ్మనాన్న చాలా సంతోషపడ్డారు. ఈ రోజు పేపర్లలో గుకేశ్ ఫొటోలు చూపించి, అతని గురించి వివరిస్తుంటే.. నేను కూడా ప్రపంచ విజేత కావాలనే ఆకాంక్ష పెరిగింది. రాంనగర్లోని మాంటిస్సోరి స్కూల్లో 1వ తరగతి చదువుతున్న దేవాన్ష్ రెడ్డి, ఆరేళ్ల వయస్సులోనే జాతీయ స్థాయి రేటింగ్ రావడం విశేషం.–దేవాన్ష్ రెడ్డి, రాంనగర్గుకేశ్ ఆటతీరు నచ్చిందిపదేళ్లుగా చెస్లో శిక్షణ పొందుతున్నాను. చాలా మంది గ్రాండ్ మాస్టర్ల ఆటను చూసేవాడిని. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ టోర్నమెంట్లను చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్, గుకేశ్ స్టైల్ కళ్లు తిప్పుకోకుండా చేసింది. ఆయన ఆడిన టోర్నమెంట్ వీడియోలు చూసూ్తనే ఉన్నాను. ఆయన స్ఫూర్తితో ఉన్నతస్థాయి టోర్నమెంట్లలో విజేతగా నిలిచేందుకు శ్రమిస్తా.– బి.విశ్వజిత్సాయి, హనుమకొండనేనే ఆడినట్లుగా టెన్షన్ పడ్డానుప్రపంచ స్థాయి వేదికగా గుకేశ్ ఆడుతుంటే నేనే అక్కడ కూర్చుని ఆడినట్లుగా టెన్షన్ పడ్డాను. ఆటముగిసే వరకు మా స్నేహితులం ప్రతిక్షణం ఆసక్తిగా వీక్షించాం. నాలుగు గంటలకు పైగా సాగిన ఆ ఆటలో గుకేశ్ విజయం సాధించడం నేను ఎన్నటికీ మరిచిపోలేను. గుకేశ్ ఆట తీరు, ఆయన ఆత్మవిశ్వాసం నాకెంతో స్ఫూర్తిని అందించాయి.– సూర్యప్రతాప్కోటి, 8వ తరగతి, వరంగల్అద్భుత విజయంఅతి చిన్న వయస్సులో గుకేశ్ ప్రపంచ విజేతగా నిలవడం అసాధారణ విషయం. మాలాంటి క్రీడాకారులకు స్ఫూర్తిని అందించాడు. విశ్వవిజేతగా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేశ్ సాధించిన విజయం మాటల్లో చెప్పలేని అద్భుతం. గుకేశ్ ఆట తీరును చాలా సార్లు దగ్గరి నుంచి చూశాను. ప్రపంచ రికార్డు సమయంలో ఆడిన ఆట అందుకు భిన్నంగా ఉంది. వేసే ప్రతి అడుగు ప్రత్యర్థిని ఇరుకున పెట్టేలా ఉంది. గుకేశ్ ఆత్మవిశ్వాసం, ఆట తీరు నాలో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలను నింపాయి.– వేల్పుల సరయు, మొండ్రాయి, వరంగల్, అంతర్జాతీయ క్రీడాకారిణి -
ఆరో రౌండ్లో అరవింద్ చేతిలో అర్జున్ ఓటమి
చెన్నై గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్లో అర్జున్ 48 ఎత్తుల్లో భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరం చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అరవింద్ చేతిలో ఓటమితో అర్జున్ లైవ్ ర్యాంకింగ్స్లో 2801.8 పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్కు పడిపోవడం గమనార్హం. అమీన్–పర్హామ్ (ఇరాన్) మధ్య గేమ్ 37 ఎత్తుల్లో...మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)–అలెక్సీ సరానా (సెర్బియా) మధ్య గేమ్ 31 ఎత్తుల్లో... అరోనియన్ (అమెరికా)–విదిత్ (భారత్) మధ్య గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత అర్జున్, అరోనియన్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోఉన్నారు. అరవింద్, అమీన్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు జరిగే చివరిదైన ఏడో రౌండ్ గేముల్లో లాగ్రెవ్తో అర్జున్; అరోనియన్తో అమీన్; విదిత్తో అలెక్సీ; పర్హామ్తో అరవింద్ తలపడతారు. -
Arjun Erigaisi: ప్రపంచ రెండో ర్యాంకర్గా..
సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్గా అవతరించాడు. రెండో ర్యాంక్లో ఉన్న అమెరికా గ్రాండ్మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్కూ మారుతుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్నే ప్లేయర్ తుది ర్యాంక్గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్లో, ఏడో రౌండ్లో అర్జున్ తన గేమ్లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది. నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్లో అర్జున్ 2799 రేటింగ్తో ప్రపంచ నాలుగో ర్యాంకర్గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్లో నిలుస్తాడు. -
మాస్టర్స్ కప్ చెస్ టోర్నీ విజేత అర్జున్
లండన్: ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ కప్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. 16 మంది క్రీడాకారుల మధ్య నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో అర్జున్ ‘అర్మగెడాన్’ గేమ్లో ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ మాక్సిమి లాషెర్ లగ్రేవ్పై విజయం సాధించాడు. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. తొలి గేమ్ 30 ఎత్తుల్లో... రెండో గేమ్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ను నిర్వహించారు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం అర్మగెడాన్ గేమ్లో తెల్లపావులతో ఆడే ప్లేయర్కు పది నిమిషాలు, నల్లపావులతో ఆడే ప్లేయర్కు ఆరు నిమిషాలు కేటాయిస్తారు. తెల్లపావులతో ఆడే ప్లేయర్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. నల్లపావులతో ఆడే ప్లేయర్ కనీసం ‘డ్రా’ చేసుకున్నా విజేతగా ప్రకటిస్తారు. అర్మగెడాన్ గేమ్లో లగ్రేవ్ తెల్లపావులతో, అర్జున్ నల్లపావులతో ఆడారు. అయితే అర్జున్ ఈ గేమ్ను ‘డ్రా’ చేసుకోకుండా 69 ఎత్తుల్లో లగ్రేవ్ను ఓడించడం విశేషం. సెమీఫైనల్లో అర్జున్ 1.5–0.5తో భారత్కే చెందిన ప్రజ్ఞానందపై, క్వార్టర్ ఫైనల్లో 1.5–0.5తో విదిత్ సంతోష్ గుజరాతిపై, గెలిచాడు. విజేతగా నిలిచిన అర్జున్కు 20 వేల యూరోలు (రూ. 18 లక్షల 25 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా అర్జున్ ఎలో రేటింగ్ 2796 పాయింట్లకు చేరుకుంది. -
ప్రజ్ఞానందకు ఐదు...గుకేశ్కు ఆరు
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ను భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ అజేయంగా ముగించారు. చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్లను కూడా వీరిద్దరు ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఎనిమిదో రౌండ్లోనే టైటిల్ను ఖరారు చేసుకున్న అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోరీ్నలో ప్రజ్ఞానంద, గుకేశ్, వెస్లీ సో 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు ఐదో స్థానం, గుకేశ్కు ఆరో స్థానం, వెస్లీ సోకు ఏడో స్థానం ఖరారయ్యాయి. 6 పాయింట్లతో అలీరెజా ఫిరూజా టైటిల్ను దక్కించుకోగా...5.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) రన్నరప్గా నిలిచాడు. -
24, 25 తేదీల్లో తెలంగాణ అండర్–19 చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో రాష్ట్ర అండర్–19 జూనియర్ చాంపియన్షిప్ జరగనుంది. కూకట్పల్లి ప్రగతినగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. జనవరి 1, 2005న లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. బాలబాలికల విభాగాల్లో వేర్వేరుగా గేమ్లు నిర్వహిస్తారు. బాలికల విభాగంలో టాప్–4లో నిలిచిన ప్లేయర్లు... బాలుర విభాగంలో టాప్–7లో నిలిచిన ప్లేయర్లు జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని టీఎస్సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో ఆడాలనుకునే వారు తమ పేర్లను 7337578899, 7337399299 నంబర్లలో నమోదు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో తెలంగాణ యూత్ బాస్కెట్బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం, మహబూబ్నగర్ జిల్లా బాస్కెట్బాల్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యూత్ అంతర్ జిల్లా చాంపియన్షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 25, 26వ తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం 17 జిల్లా జట్లు పాల్గొంటున్నాయి.ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారులను జాతీయ యూత్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ బాస్కెట్బాల్ జట్టులోకి ఎంపిక చేస్తామని తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్ తెలిపారు. జాతీయ యూత్ చాంపియన్షిప్ పశ్చిమ బెంగాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుంది. గత ఏడాది సూర్యాపేటలో జరిగిన తెలంగాణ యూత్ అంతర్జిల్లా చాంపియన్íÙప్లో మేడ్చల్ మల్కాజిగిరి జట్లు బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. కరాటే కుర్రాళ్ల కిక్ అదిరింది సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్షిప్లో హైదరాబాద్ కుర్రాళ్లు అదరగొట్టారు. టైగర్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. వివిధ విభాగాల పతక విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ పతకాలు: ఈథన్ రాజ్ (అండర్–12 కటా), దక్ష్ (అండర్–8 కటా). రజత పతకాలు: అంకిత (అండర్–10 కటా), సాయాంశ్ (అండర్–12 కటా), కావ్యాంశ్ (అండర్–8 కటా). కాంస్య పతకాలు: అమైర్ (అండర్–8 కటా), కిరణ్య (అండర్–8 కటా), అహ్మద్ (అండర్–6 కటా), శ్రవణ్ (అండర్–12 కటా), నిగ్నేశ్ (అండర్–6 కటా), మాన్విత (అండర్–6 కటా), సాధ్విత (అండర్–12 కటా), కరణ్నాథ్ (అండర్–13 కటా). చాంపియన్స్ వృత్తి, సుహాస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో మహిళల విభాగంలో అంతర్జాతీయ స్విమ్మర్ వృత్తి అగర్వాల్, పురుషుల విభాగంలో సుహాస్ ప్రీతమ్ చాంపియన్స్గా నిలిచారు. సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్పూల్లో జరిగిన ఈ టోర్నీలో వృత్తి నాలుగు ఈవెంట్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వృత్తి 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్లో టాప్ ర్యాంక్లో నిలిచింది. హైదరాబాద్కు చెందిన మైలారి సుహాస్ ప్రీతమ్ 50, 100, 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్స్తోపాటు 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్స్లో విజేతగా నిలిచాడు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం సెక్రటరీ జి.ఉమేశ్, జీహెచ్ఎంసీ ఏడీఎస్ శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. -
అమెరికన్ జట్టు సహ యజమానిగా అశ్విన్
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెస్లో అడుగు పెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్లో ఈసారి కొత్తగా చేరిన అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు అశ్విన్ సహ యజమానిగా ఉన్నాడు. గత ఏడాది పోటీపడిన చింగారీ గల్ఫ్ టైటాన్స్ జట్టు స్థానంలో కొత్తగా అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు వచ్చింది.టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్యసంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది దుబాయ్లో తొలి గ్లోబల్ చెస్ లీగ్ జరిగింది. ఈ ఏడాది టోర్నీకి లండన్ నగరం వేదిక కానుంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఆరు జట్ల మధ్య గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది. ఫైనల్ బెర్త్ ఎవరిదో! మ్యూనిక్: ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్... నిలకడలేమితో సతమతమవుతున్న ఫ్రాన్స్... ‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీ లో ఫైనల్లో చోటు కోసం నేడు తొలి సెమీఫైనల్లో ‘ఢీ’కొననున్నాయి. సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ మూడు గోల్స్ సాధించింది. ‘యూరో’ టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్లు జరిగాయి. నాలుగుసార్లు ఫ్రాన్స్ గెలుపొందగా...ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి, ఒక మ్యాచ్లో స్పెయిన్ నెగ్గింది. తొలి విజయం కోసం... అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో భాగంగా మయన్మార్ జట్టుతో భారత జట్టు రెండు మ్యాచ్లు ఆడనుంది. యాంగూన్లో నేడు జరిగే తొలి మ్యాచ్లో ఆశాలతా దేవి సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.ప్రపంచ ర్యాంకింగ్స్లో 67వ స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు మయన్మార్ జట్టుతో తలపడినా ఒక్కసారీ విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా ఒక మ్యాచ్ను మాత్రం ‘డ్రా’ చేసుకుంది. -
ప్రపంచ రెండో ర్యాంకర్పై ప్రజ్ఞానంద... ప్రపంచ మూడో ర్యాంకర్పై వైశాలి సంచలన విజయాలు
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు, తోబుట్టువులైన ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్’ గేమ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), భారత స్టార్ కోనేరు హంపి మధ్య క్లాసికల్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించగా జు వెన్జున్ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద ‘చెక్’
స్టావెంజర్: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. గతంలో చెస్లోని మూడు ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్) ఏకకాలంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్పై ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు.కార్ల్సన్ సొంతగడ్డలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగం మూడో రౌండ్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ అద్భుతం చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు. గతంలో ఆన్లైన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్సన్పై భారత యువ గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ గెలిచినా... క్లాసికల్ ఫార్మాట్లో మాత్రం ప్రజ్ఞానంద తొలిసారి కార్ల్సన్ను ఓడించాడు. టైమ్ లిమిట్ ఉండని క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్ ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ అయ్యాక అతడిని ఓడించిన రెండో భారతీయ ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. అంతకుముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు. వైశాలి, హంపి గెలుపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మూడో రౌండ్లో వైశాలితోపాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్లలో గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్లో వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 50 ఎత్తుల్లో... హంపి–లె టింగ్లీ (చైనా) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్లు నిర్వహించగా... హంపి తెల్లపావులతో ఆడి 49 ఎత్తుల్లో లె టింగ్లీపై నెగ్గగా... అనా ముజిచుక్తో నల్ల పావులతో ఆడిన వైశాలి 70 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’గా ముగించింది. అర్మగెడాన్ నిబంధనల ప్రకారం నల్లపావులతో ‘డ్రా’ చేసుకున్న ప్లేయర్ను విజేతగా ఖరారు చేస్తారు. -
వైశాలి చేతిలో హంపి ఓటమి
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్ గేమ్లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్ అర్మగెడాన్ గేమ్లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్ లిరెన్ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. -
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్లు నిర్వహించగా... తొలి గేమ్ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్లో, విదిత్ 28వ ర్యాంక్లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్లో, వైశాలి 13వ ర్యాంక్లో ఉన్నారు. -
అర్జున్కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జియాంగ్జి బు (చైనా), యాంగీ యు (చైనా), అర్జున్ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... జియాంగ్జి టైటిల్ గెల్చుకోగా... యాంగీ యు రన్నరప్గా నిలిచాడు. అర్జున్కు మూడో స్థానం ఖరారైంది. ఏడు గేమ్లు ఆడిన అర్జున్ మూడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయాడు. -
విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్కప్-2023 రన్నరప్గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్కప్ టోర్నీలో క్వార్టర్ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023 -
రెండు గేముల్లో ఓడిన హంపి
కోల్కతాలో జరుగుతున్న టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి రెండు గేముల్లో ఓడిపోయి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకుంది. అర పాయింట్తో చివరిదైన పదో ర్యాంక్లో ఉంది. జు వెన్జున్ (చైనా)తో జరిగిన తొలి గేమ్ను 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... ఇరీనా క్రుష్ (అమెరికా)తో జరిగిన రెండో గేమ్లో 48 ఎత్తుల్లో... వంతిక (భారత్)తో జరిగిన మూడో గేమ్లో 24 ఎత్తుల్లో ఓటమి పాలైంది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒక పాయింట్తో 8వ ర్యాంక్లో ఉంది. తొలి రౌండ్ లో దివ్య (భారత్) చేతిలో 57 ఎత్తుల్లో ఓడిన హారిక... నినో బత్సియాష్విలి (జార్జియా)తో 26 ఎత్తుల్లో, సవితాశ్రీ (భారత్)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మూడు రౌండ్ల తర్వాత దివ్యæ, వంతిక 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
అప్పుడే నాకు తెలియకుండా నా ఫోటోలు తీశారు! ఇంకా ఎన్నో గెలవాలి!
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్లో ఫైనల్ చేరిన సంచలనం సృష్టించిన భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రదర్శనపై అతని తల్లి నాగలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. అతని కెరీర్ ఆరంభం నుంచి అన్నింటా తోడుగా ఉంటూ వచ్చిన నాగలక్ష్మి వరల్డ్ కప్లోనూ ప్రజ్ఞానంద వెన్నంటే నిలిచింది. అతను ఫైనల్ చేరడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోందన్న ఆమె... తన కొడుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రపంచకప్లో ప్రజ్ఞానంద ఫైనల్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా క్యాండిడేట్స్కు అర్హత సాధించడం దానిని రెట్టింపు చేసింది. అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. అర్జున్తో క్వార్టర్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తున్నాడనే ఉత్కంఠతోనే అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు తెలియకుండా కొందరు నా ఫోటోలు తీశారు. అవే జనంలోకి వెళ్లాయి. చివరకు ఆ మ్యాచ్లో మా అబ్బాయి గెలిచాడు’ అని నాగలక్ష్మి గుర్తు చేసుకుంది. -
అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
గత మూడు రోజులుగా రెండు దేశాల క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్తో ప్రజ్ఞానంద ఫైనల్ పోరు.. టైబ్రేక్స్లో తేలిన ఫలితం.. ఎట్టకేలకు 18 ఏళ్ల కుర్రాడిపై అనుభవజ్ఞుడైన 32 ఏళ్ల కార్ల్సన్దే పైచేయి అయింది.. జగజ్జేతగా అవతరించిన అతడికే FIDE World Cup దక్కింది. దిగ్గజ ఆటగాడి చేతిలో ఓడితేనేమి.. చిన్న వయసులోనే ఇక్కడి దాకా చేరుకున్న మన ప్రజ్ఞానంద ఎప్పుడో అందరి మనసులు గెలిచేశాడు. పిట్టకొంచెం కూత ఘనం అనే మాటను నిజం చేస్తూ కార్ల్సన్ను ఢీకొట్టడమే గాక విజయం కోసం చెమటోడ్చేలా చేశాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపు కోసం నిరీక్షించేలా చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో పోటీ పడిన ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. కార్ల్సన్ చెస్ లెజెండ్గా అవతరించడంలో అతడి తండ్రి పాత్ర ఉంటే.. చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద ప్రయాణం ఇక్కడిదాకా సాఫీగా సాగడానికి ముఖ్య కారణం అతడి తల్లి! PC: @photochess/FIDE Twitter) చెస్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజ్ఞానంద కళ్లు తన తల్లి నాగలక్ష్మి కోసం వెదుకుతాయి. లేనిపోని హంగూ ఆర్భాటాలతో సందడి చేసే వాళ్లలో ఒకరిగా గాకుండా తమ ఇంట్లోనే ఉన్నంత సాదాసీదాగా.. ఏ హడావుడీ లేకుండా ఓ పక్కన నిలబడి ఉంటారామె! నిండైన చీరకట్టులో అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆమె కనబడగానే ప్రజ్ఞానంద ముఖంలో ఎక్కడాలేని సంతోషం.. గెలిచినా.. ఓడినా సరే! పరిగెత్తుకు వెళ్లి తల్లిని హత్తుకోవడం అతడికి అలవాటు. అతడి కళ్లలో భావోద్వేగపు తాలూకు ఛాయలు.. ఆమె ఆప్యాయపు చూపుల ప్రేమతో అలా చెమ్మగిల్లుతాయి. మ్యాచ్ ఫలితం ఏమిటన్న అంశంతో ఆమెకు సంబంధం లేదు. అసలు ఆ విషయం గురించి కొడుకును ఒక్క మాటా అడగరు! గెలుపోటములతో ఆమెకు పని లేదు. చెస్ బోర్డులోని 64 గడులు, వాటితో వేసే క్లిష్టమైన ఎత్తులు, పైఎత్తులు కూడా ఆమెకు పెద్దగా తెలియదు. మేధావులతో ఢీకొట్టే తన చిన్నారి కుమారుడు ఎలా ఆడుతున్నాడు అన్న విషయమూ ఆమెకు పట్టదు. తన కొడుకుతో తను ఉండాలంతే! ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడికి అండగా నిలబడాలి. తనకు నచ్చినా నచ్చకపోయినా.. కొడుకుతో పాటే ప్రయాణాలు చేయాలి. అతడిని కంటికి రెప్పలా కాచుకోవాలి. ఆ తల్లి మనసుకు తెలిసింది ఇదే! గత దశాబ్దకాలంగా.. చిన్నపిల్లాడి నుంచి.. గ్రాండ్ మాస్టర్గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరేదాకా ఆ మాతృమూర్తి కొడుకు కోసం తన సమయాన్నంతా కేటాయించింది. కుమారుడి విజయాలకు సాక్షిగా గర్వపడే క్షణాలను ఆస్వాదిస్తోంది. ఎక్కడున్నా సరే.. తన అమితమైన ప్రేమతో పాటు కొడుకుకు ఇష్టమైన సాంబార్, టొమాటో రైస్ వడ్డిస్తూ అతడికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఆ తల్లి తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు.. పరోక్షంగా విన్న వాళ్లకూ ‘‘నా విజయాలకు ముఖ్య కారణం మా అమ్మే’’ అన్న ప్రజ్ఞానంద మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు! అక్క చేసిన ఆ పని వల్లే.. చెస్ ప్రపంచంలో భారత్ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజ్ఞానందది సాధారణ కుటుంబం. తండ్రి రమేశ్బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి నాగలక్ష్మి ‘గృహిణి’. ప్రజ్ఞానందకు సోదరి వైశాలి ఉంది. ఆమె కూడా చెస్లో రాణిస్తోంది. చిన్నతనంలో వైశాలి టీవీకే అతుక్కుపోవడం గమనించిన నాగలక్ష్మి ఆమె ధ్యాసను మళ్లించేందుకు చెస్ బోర్డు కొనిచ్చింది. ఆ సమయంలో నాలుగేళ్లన్నరేళ్ల ప్రజ్ఞా కూడా ఆటపై ఆసక్తి కనబరచడంతో కోచింగ్ ఇప్పించారు ఆ తల్లిదండ్రులు. అలా బాల మేధావిగా పేరొందిన ప్రజ్ఞానంద అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. కార్ల్సన్ను ఓడించి ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ 16 ఏళ్ల వయసులో మహామహులకే సాధ్యం కాని రీతిలో కార్ల్సన్ను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు అతడిపై మూడు సార్లు గెలుపొంది చెస్ ప్రపంచానికి కొత్త రారాజు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మక టైటిల్కు అడుగుదూరంలో నిలిచినా ర్యాంకింగ్స్లో టాప్-10 చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నమ్మకంగా చెబుతున్నాడు. PC: Amruta Mokal ఆ తల్లికి ‘భయం’.. అందుకే తండ్రి అలా ఇక నార్వే స్టార్ కార్ల్సన్ విషయానికొస్తే.. ప్రజ్ఞాకు తల్లి నాగలక్ష్మి ఎలాగో.. అతడికి తండ్రి హెన్రిక్ అలాగే! మేనేజర్గా, మార్గనిర్దేశకుడిగా కార్ల్సన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎల్లవేళలా కొడుకుతోనే ఉంటూ అతడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ తల్లి సిగ్రూన్ కెమికల్ ఇంజనీర్. ఆమెకు చెస్ ఆడటం తెలుసు. కానీ ఎప్పుడూ కొడుకు మ్యాచ్లు చూసేందుకు ఆవిడ రాదు. ఒత్తిడిని తట్టుకోవడం... భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సిగ్రూన్ బలహీనురాలు కాబట్టే తానే ఎప్పుడూ కార్ల్సన్ వెంట ఉంటానని ఐటీ కన్సల్టెంట్ అయిన హెన్రిక్ ఓ సందర్భంలో చెప్పాడు. అన్నట్లు ఈ దంపతులకు మాగ్నస్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా పజిల్ ప్రపంచానికి పరిచయస్తులేనండోయ్! -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Minnu Mani: అమ్మానాన్న వద్దన్నారు! పట్టువీడలేదు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్కు ఆమె పేరు He said "Your photo on Twitter was huge!" I said, "It is because you ARE huge!" @rpragchess and his lovely mum are IN THE #FIDEWorldCup2023 FINAL ♥️ pic.twitter.com/2bJP21yBGN — PhotoChess (@photochess) August 21, 2023 -
ప్రజ్ఞానందపై విజయసాయి రెడ్డి ప్రశంసలు
భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందపై వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్కు చేరిన ప్రజ్ఞానందను అభినందించారు. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మనందరినీ గర్వపడేలా చేశాడని కొనియాడారు. వరల్డ్ నంబర్ 3ని ఓడించి.. ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ 1తో పోటీ పడుతున్న ప్రజ్ఞానందకు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా అజర్బైజాన్లోని బకూ వేదికగా టైటిల్ కోసం ప్రజ్ఞానంద- మాగ్నస్ కార్ల్సన్ మధ్య మంగళవారం పోరు ఆరంభమైంది. కాగా అంతకుముందు ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించాడు. తద్వారా ఫైనల్ చేరి.. వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. ఇక భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్గా 18 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. -
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
షార్జా మాస్టర్స్ విజేత అర్జున్
ఆరంభ రౌండ్లలో తడబడ్డా... చివర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రౌండ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 27 ఎత్తుల్లో నోదిర్బెక్ యాకుబోయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత మరో ఏడుగురితో కలిసి అర్జున్ సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు. అయితే తొమ్మిదో రౌండ్లో అర్జున్ గెలుపొందగా... మిగతా ఆరుగురు ప్లేయర్లు తమ గేమ్లను ‘డ్రా’ చేసుకోవడంతో అర్జున్కు టైటిల్ ఖరారైంది. భారత్కే చెందిన దొమ్మరాజు గుకేశ్ ఆరు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా గుకేశ్కు రెండో ర్యాంక్ లభించింది. విజేతగా నిలిచిన అర్జున్కు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 27 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
అర్జున్ శుభారంభం; హారిక గేమ్ ‘డ్రా’
షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన ఈ టోర్నీలో పోలాండ్ గ్రాండ్మాస్టర్ కాస్పెర్ పియోరన్తో జరిగిన తొలి రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 32 ఎత్తుల్లో గెలుపొందాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్, తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేశ్ కూడా తొలి రౌండ్లో గెలిచాడు. వెస్కోవి (బ్రెజిల్)తో జరిగిన గేమ్లో గుకేశ్ 33 ఎత్తుల్లో విజయం సాధించాడు. హారిక గేమ్ ‘డ్రా’ నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది. జర్మనీ ప్లేయర్ దినారా వాగ్నర్తో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్ను తెల్ల పావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
అర్జున్ పరాజయం... గుకేశ్కు రెండో విజయం
మాల్మో (స్వీడన్): టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ తెల్ల పావులతో ఆడుతూ 57 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా రెండో విజయంతో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్లో తమిళనాడుకు చెందిన గుకేశ్ 35 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్మాస్టర్ అభిమన్యు మిశ్రా రెండో రౌండ్లో 43 ఎత్తుల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు పతకం ఖరారైంది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్తో జరిగిన గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుదే చెస్ టైటిల్
అస్తానా: కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు పైచేయి సాధించి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు బ్లిట్జ్ ఈవెంట్లో 38.5–25.5 పాయింట్ల తేడాతో... ర్యాపిడ్ ఈవెంట్లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్ జట్టును ఓడించింది. భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్నిద్జె (జార్జియా), హూ ఇఫాన్ (చైనా), గునె మమద్జాదా (అజర్బైజాన్), సోకా గాల్ (హంగేరి), అఫ్రూజా ఖమ్దమోవా (ఉజ్బెకిస్తాన్), నుర్గుల్ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు. చదవండి: IPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్ -
చాంపియన్ గుకేశ్
Menorca Chess Open 2023- చెన్నై: భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మెనోర్కా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించాడు. స్పెయిన్లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత గుకేశ్తోపాటు మరో తొమ్మిదిమంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... గుకేశ్, ప్రణవ్లకు తొలి రెండు ర్యాంక్లు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్ మధ్య రెండు బ్లిట్జ్ టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్ 1.5–0.5తో ప్రణవ్ను ఓడించి చాంపియన్గా నిలిచాడు. గుకేశ్కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 69 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. తొమ్మిది రౌండ్లలో గుకేశ్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో 11వ ర్యాంక్లో, వుప్పాల ప్రణీత్ 6 పాయింట్లతో 19వ ర్యాంక్లో, రాజా రిత్విక్ 5.5 పాయింట్లతో 37వ ర్యాంక్లో నిలిచారు. -
రిల్టన్ కప్తో పాటు గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు
స్టాక్హోమ్: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్ భారత 79వ చెస్ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందాడు. స్టాక్హోమ్లో జరిగిన రిల్టన్ కప్లో విజేతగా నిలిచిన ప్రణేశ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్మాస్టర్ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు (లైవ్) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో తొలి టోర్నీ అయిన రిల్టన్ కప్లో ప్రణేశ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 9 గేమ్లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్ వద్ద ప్రణేశ్ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. -
I- League: దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ.. టాప్లో శ్రీనిధి డెక్కన్
I-League 2022-23- ఇంఫాల్: భారత దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ ఐ–లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన తొమ్మిదో లీగ్ మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ 1–0 గోల్ తేడాతో నెరోకా ఎఫ్సీ జట్టును ఓడించింది. ఆట 47వ నిమిషంలో సబ్స్టిట్యూట్ రామ్లున్చుంగా శ్రీనిధి జట్టుకు గోల్ అందించాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్లోఉంది. 26న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 26న తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ జరగనుంది. లాల్బహదూర్ స్టేడియంలోని యోగా హాల్ వేదికగా జరిగే అండర్–7, 9, 11, 13, 15, 17, 19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు 7337578899 లేదా 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఎస్సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
నూతక్కి ప్రియాంకకు చేదు అనుభవం.. ఊహించని పరిణామంతో ఇంటికి
చెన్నై: ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్లో ఊహించని పరిణామంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ గేమ్ సందర్భంగా ఆమె ధరించిన బ్లేజర్ జేబులో ఇయర్ బడ్స్ ఉండటంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వేటు వేసింది. 20 ఏళ్ల ప్రియాంకను మిగతా రౌండ్లు ఆడకుండా టోర్నీ నుంచి పంపించింది. అధునాతన సాంకేతిక పరికరాలతో మోసపూరిత ఆట ఆడే అవకాశం ఉండటంతో స్మార్ట్ పరికరాలకు అనుమతి లేదు. ‘ఆమె గేమ్లో చీటింగ్కు పాల్పడలేదు. కానీ నిషేధిత పరికరాలతో హాల్లోకి ప్రవేశించరాదని కఠిన నిబంధనలున్నాయి. వీటిని ఉల్లంఘించడంవల్లే ప్రియాంకపై వేటు వేశాం’ అని ‘ఫిడే’ తెలిపింది. చదవండి: T20 WC- Semi Finalists: ప్రపంచకప్.. సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే! ఇక విజేతగా..: సచిన్ టెండుల్కర్ FIFA U17 Womens World Cup: ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన భారత్ -
వరల్డ్ ఛాంపియన్కు షాకిచ్చిన భారత గ్రాండ్ మాస్టర్
ఎయిమ్చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. 19 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ ఛాంపియన్, నార్వే గ్రాండ్మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ను చిత్తుగా ఓడించాడు. ఈ పోరులో అర్జున్ 54 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించి, గత నెలలో జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్లైన్ టోర్నీలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్.. భారత గ్రాండ్మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్సన్ నాలుగు సార్లు భారత గ్రాండ్మాస్టర్ల చేతిలో ఓడిపోయాడు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్సన్పై విజయం సాధించగా.. తాజాగా అర్జున్ ఇరగైసి కార్ల్సన్కు చుక్కలు చూపించాడు. -
European Chess Club Cup 2022: హరికృష్ణ జట్టుకు యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్లో హరికృష్ణతోపాటు గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్యు ఏఎస్ఈ సూపర్బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
FTX Crypto Cup: కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ విజేత మాత్రం అతడే!
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను మరోసారి ఓడించాడు. సోమవారం నాటి బ్లిట్జ్ టై బ్రేకర్లో విజయం సాధించాడు. అయితే, ఓవరాల్గా టాప్ స్కోరు సాధించిన కార్ల్సన్ టోర్నీ విజేతగా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు పోలాండ్ గ్రాండ్మాస్టర్ జాన్ క్రిస్టాఫ్ డూడాతో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2–4తో ఓడిపోయాడు. నిర్ణీత నాలుగు ర్యాపిడ్ గేమ్ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు రెండు బ్లిట్జ్ గేమ్లను నిర్వహించగా... రెండింటిలోనూ డూడా గెలుపొందాడు. ఈ క్రమంలో ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచారు. అయితే, చివరిదైన ఏడో రౌండ్లో కార్ల్సన్ను ఓడించిప్పటికీ ఓవరాల్గా పాయింట్ల పరంగా వెనుకబడ్డ ప్రజ్ఞానందకు నిరాశ తప్పలేదు. కాగా గత ఆర్నెళ్ల కాలంలో ప్రజ్ఞానంద.. కార్ల్సన్ను ఓడించడం ఇది మూడో సారి కావడం విశేషం. మరిన్ని క్రీడా వార్తలు మెద్వెదెవ్కు చుక్కెదురు సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ మెద్వెదెవ్ (రష్యా) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (8/6), 3–6, 6–3తో టాప్ సీడ్ మెద్వెదెవ్ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్కు చేరాడు. టైటిల్ కోసం ప్రపంచ 152వ ర్యాంకర్ బోర్నా చొరిచ్ (క్రొయేషియా)తో సిట్సిపాస్ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో చొరిచ్ 6–3, 6–4తో తొమ్మిదో ర్యాంకర్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. కాంస్యం కోసం భారత్ పోరు టెహ్రాన్: ఆసియా అండర్–18 పురుషుల వాలీబాల్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 15–25, 19–25, 18–25తో ఆతిథ్య ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు కాంస్యం కోసం జరిగే మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 37–39, 25–22, 25–21, 25–14తో కొరియాను ఓడించి నేడు ఇరాన్తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. -
FTX Crypto Cup: ప్రజ్ఞానంద ఓటమి
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఐదో రౌండ్లో వియత్నాం గ్రాండ్మాస్టర్ క్వాంగ్ లియెమ్ లీ చేతిలో 0.5–2.5తో ఓడిపోయాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన క్వాంగ్ లియెమ్ లీ, ప్రజ్ఞానంద మధ్య తొలి గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. రెండో గేమ్లో క్వాంగ్ 50 ఎత్తుల్లో... మూడో గేమ్లో 43 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్ను నిర్వహించలేదు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత కార్ల్సన్ (నార్వే) 13 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ప్రజ్ఞానంద 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్గా, సీహెచ్ కార్తీక్సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
Norway Chess 2022: ఆనంద్కు మూడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానంతో ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 52 ఏళ్ల ఆనంద్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్, కార్ల్సన్ (నార్వే) 16.5 పాయింట్లతో టైటిల్ను సొంతం చేసుకోగా... మమెదైరోవ్ (అజర్బైజాన్) 15.5 పాయింట్లతో రన్నరప్గా నిలిచాడు. చాంపియన్ కార్ల్సన్కు 7,50,000 నార్వే క్రోన్లు (రూ. 60 లక్షల 36 వేలు), రన్నరప్ మమెదైరోవ్కు 4,00,000 నార్వే క్రోన్లు (రూ. 32 లక్షల 19 వేలు), మూడో స్థానంలో నిలిచిన ఆనంద్కు 2,50,000 నార్వే క్రోన్లు (రూ. 20 లక్షల 12 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
ఆనంద్కు తొలి ఓటమి
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు తొలి పరాజయం ఎదురైంది. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్ను ఆనంద్ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్లో ఫలితం తేలడానికి ‘అర్మగెడాన్’ గేమ్ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్లో సో వెస్లీ 46 ఎత్తుల్లో ఆనంద్ను ఓడించాడు. -
Chessable Masters final: రన్నరప్గా భారత టీనేజ్ సంచలనం
చెన్నై: నిలకడైన ప్రదర్శనతో చెస్ఏబుల్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన భారత టీనేజ్ సంచలనం రమేశ్బాబు ప్రజ్ఞానందకు ఫైనల్లో నిరాశే ఎదురైంది. చైనా గ్రాండ్ మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ డింగ్ లిరెన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. అయినప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థితో పాటు క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రజ్ఞానందను అభినందిస్తూ.. ‘‘నాకసలు మాటలు రావడం లేదు. అతడిని ప్రశంసించేందుకు పదాలు సరిపోవడం లేదు. ప్రాగ్(ప్రజ్ఞానంద) చాలా బాగా ఆడుతున్నాడు. అతడికి ఇప్పుడు కేవలం 16 ఏళ్లే. ఏ ఆటలోనైనా ఇది చాలా చిన్న వయస్సు. అతడికి ఎంతో భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల కంటే చిన్నవయసులో ఈ చెన్నై కుర్రాడు గ్రాండ్మాస్టర్ అయ్యాడు’’ అంటూ కామెంటేటర్, గ్రాండ్మాస్టర్ డేవిడ్ హావెల్ కొనియాడాడు. వెనుకబడి.. తిరిగి పుంజుకుని కాగా ఆర్.ప్రజ్ఞానంద తొలి అంచెలో వెనుకబడ్డాడు. డింగ్ లిరెన్తో జరిగిన తొలి అంచె ఫైనల్లో 1.5–2.5 స్కోరుతో వెనుకబడిపోయాడు. మొదటి రౌండ్లో ఓడిన భారత కుర్రాడు... రెండో గేమ్ గెలిచి స్కోరును సమం చేశాడు. అయితే, వెంటనే చైనా గ్రాండ్మాస్టర్ మూడో రౌండ్లో గెలిచి 2–1తో ఆధిక్యంలో నిలువగా... నాలుగో రౌండ్ డ్రాగా ముగిసింది. మరో నాలుగు గేముల రెండో అంచె ఫైనల్ పోరులో తిరిగి పుంజుకున్న ప్రజ్ఞానంద విజయంతో ముగించాడు. మొదటి సెట్లో 1.5-2.5తో గేమ్ను కోల్పోయిన అతడు.. రెండో సెట్లో 2.5-1.5తో పైచేయి సాధించాడు. ఈ క్రమంలో టై బ్రేకర్ నిర్వహించగా అనువజ్ఞుడైన లిరెన్ విజేతగా అవతరించాడు. 🎉 Congrats to Ding Liren on winning the @chessable Masters! What a performance by the World No. 2. But you gotta give it to the young @rpragchess for putting up a fierce battle.@ginger_gm: "It's been one of the best chess days ever...really high quality chess!" #ChessChamps pic.twitter.com/L0jqjWvRCH — Meltwater Champions Chess Tour (@ChampChessTour) May 26, 2022 Game 4 ends in a draw which means .@rpragchess wins the 2nd match in the @Chessable Masters finals. The winner will now be decided in Blitz. What an incredible performance by Pragg - are we watching a future World Champion in action? ➡️https://t.co/FUqldh5SJT#ChessableMasters pic.twitter.com/jyqxAQm28L — Meltwater Champions Chess Tour (@ChampChessTour) May 26, 2022 -
భారత యంగ్ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం..
భారత యంగ్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద పెను సంచలనం నమోదు చేశాడు. మెల్ట్వాటర్ చాంపియన్స్ చెస్ టూర్.. చెసెబుల్ ఆన్లైన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఫైనల్లో అడుగపెట్టాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో డచ్ గ్రాండ్ మాస్టర అనిష్ గిరిని 3.5-2.5తో ఓడించి చెసెబుల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు గేమ్ల పాటు 2-2తో సమానంగా ఉన్నప్పటికి.. కీలకమైన టై బ్రేక్లో ప్రజ్ఞానంద విజృంభించి అనిష్గిరిపై సంచలన విజయం సాధించాడు. కాగా తొలి గేమ్లో ఓడినప్పటికి ప్రజ్ఞానంద ఫుంజుకొని రెండోగేమ్లో విజయం సాధించాడు. మళ్లీ మూడో గేమ్లో అనిష్ గిరి మొదట ఆధిక్యంలో కనిపించినప్పటికి.. ప్రజ్ఞానంద ఎత్తుకు పై ఎత్తులు వేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కీలకమైన నాలుగో గేమ్లో అనిష్ గిరి విజయం సాధించడంతో 2-2తో మ్యాచ్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్లో 33వ ఎత్తులో అనిష్ చేసిన తప్పు ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. మ్యాచ్ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ప్రజ్ఞా.. ''నాకు ఉదయం 8:45 గంటలకు స్కూల్ ఉంది.. ఇప్పుడు సమయం ఉదయం రెండు దాటింది. స్కూల్కు వెళ్లగలనా'' అంటూ పేర్కొన్నాడు. కాగా ప్రజ్ఞానంద ప్రదర్శనపై కోచ్ ఆర్బీ రమేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ప్రజ్ఞానంద ఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్-2 డింగ్ లిరెన్తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. కాగా డింగ్ లిరెన్.. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ను 2.5- 1.5తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా? చెస్ వరల్డ్ చాంపియన్కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
Superbet Rapid Chess: సూపర్బెట్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ 14 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు. శనివారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక పరాజయం నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో ఆనంద్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. 13 పాయింట్లతో రిచర్డ్ రాపోట్ (హంగేరి) రెండో స్థానంలో, 12 పాయింట్లతో డూడా జాన్ క్రిస్టాఫ్ (పోలాండ్) మూడో స్థానంలో నిలిచారు. నేటి నుంచి బ్లిట్జ్ విభాగంలో టోర్నీ జరుగుతుంది. -
చెస్ వరల్డ్ చాంపియన్కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
చెస్ వరల్డ్ చాంపియన్.. నార్వే గ్రాండ్మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. కార్ల్సన్తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్లో కార్ల్సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు. ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్సన్కు చెక్ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్సన్పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్ స్టేజ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్గా చెస్బుల్ మాస్టర్స్లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్థింగ్స్ మాస్టర్స్లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ప్రపంచ నం.1 ఆటగాడికి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Magnus Carlsen blunders and Praggnanandhaa beats the World Champion again! https://t.co/J2cgFmhKbT #ChessChamps #ChessableMasters pic.twitter.com/mnvL1BbdVn — chess24.com (@chess24com) May 20, 2022 -
Superbet Rapid Chess: ఆధిక్యంలో ఆనంద్
వార్సా (పోలాండ్): సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరు రౌండ్ల తర్వాత ఆనంద్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. శుక్రవారం జరిగిన మూడు గేముల్లో ఆనంద్ రెండు విజయాలు (షెవ్చెంకో, లెవాన్ అరోనియన్), ఒక ‘డ్రా’ (జాన్ క్రిస్టాఫ్ డూడా) నమోదు చేశాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్ కేటాయిస్తున్నారు. -
గుకేశ్ ఖాతాలో ‘హ్యాట్రిక్’ టైటిల్
భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో అంతర్జాతీయ చెస్ టోర్నీ టైటిల్ను సాధించాడు. చెన్నైకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ ఇటీవల లా రోడా ఓపెన్, మెనోర్కా ఓపెన్లలో విజేతగా నిలిచాడు. తాజాగా స్పెయిన్లోనే జరిగిన చెసెబల్ సన్వే ఫార్మెన్టెరా ఓపెన్లోనూ గుకేశ్ చాంపియన్గా అవతరించాడు. నిర్ణీత 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్ ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. -
Dronavalli Harika: ‘గ్రాండ్ స్విస్’లో హారికకు ఐదో స్థానం
Dronavalli Harika Draws 8 Games: లాత్వియాలో ఆదివారం ముగిసిన గ్రాండ్ స్విస్ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. 11 రౌండ్ల ఈ టోర్నీలో హారిక మొత్తం ఏడు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, ఎనిమిది గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చైనా ప్లేయర్ లీ తింగ్జీ (9 పాయింట్లు) టైటిల్ సాధించింది. చదవండి: T20 World Cup 2021: కివీస్ సెమీస్కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు! -
ఆసియా ర్యాపిడ్ చెస్: రాణించిన అర్జున్
సాక్షి, హైదరాబాద్: గోల్డ్మనీ ఆసియా ర్యాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ (జీఎం) అర్జున్ ఇరిగైసి ఆకట్టుకున్నాడు. 16 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు ఐదు రౌండ్ గేమ్లు జరిగాయి. ఇందులో అర్జున్ ఒక గేమ్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయాడు. 2567 ఎలో రేటింగ్ ఉన్న అర్జున్ తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారులకు గట్టిపోటీ ఇచ్చాడు. జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్–2729), ఆధిబన్ (భారత్–2660), డింగ్ లిరెన్ (చైనా–2799)లతో జరిగిన గేమ్లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. రష్యా జీఎం డానిల్ దుబోవ్ (2714)తో జరిగిన గేమ్లో 53 ఎత్తుల్లో గెలిచిన అర్జున్... వ్లాదిస్లావ్ (రష్యా–2704)తో జరిగిన గేమ్లో 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం అర్జున్ 2.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్లో ఉన్నాడు. టోర్నీ రెండో రోజు ఆదివారం మరో ఐదు గేమ్లు జరుగుతాయి. -
హరికృష్ణ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముఖాముఖి అయినా... ఆన్లైన్లో అయినా... క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రస్తుతం ప్రపంచ చెస్ చాంపియన్గా ఉన్న మాగ్నస్ కార్ల్సన్పై ఓ గేమ్లో గెలవడమంటే విశేషమే. సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఆన్లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ సందర్భంగా భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ అద్భుతం చేసి చూపించాడు. బ్లిట్జ్ విభాగంలో భాగంగా ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్తో జరిగిన గేమ్లో హరికృష్ణ తెల్ల పావులతో ఆడుతూ 63 ఎత్తుల్లో గెలుపొంది సంచలనం సృష్టించాడు. 15 ఏళ్ల తర్వాత.... అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం తన కెరీర్లో కార్ల్సన్తో 18 సార్లు తలపడిన హరికృష్ణ కేవలం రెండోసారి మాత్రమే గెలిచాడు. ఈ గేమ్కంటే ముందు ఏకైకసారి 2005లో జూనియర్ స్థాయిలో ఉన్నపుడు లుసానే యంగ్ మాస్టర్స్ టోర్నీలో కార్ల్సన్పై హరికృష్ణ 56 ఎత్తుల్లో గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి గేముల్లో కార్ల్సన్ 10 గేముల్లో... హరికృష్ణ 2 గేముల్లో నెగ్గారు. మిగతా ఆరు గేమ్లు ‘డ్రా’ అయ్యాయి. ఆరో స్థానంలో... సెయింట్ లూయిస్ ఓపెన్ టోర్నీలో భాగంగా బ్లిట్జ్ విభాగంలో తొమ్మిది గేమ్లు ముగిశాక హరికృష్ణ 12.5 పాయింట్లతో ఓవరాల్ ర్యాంకింగ్స్లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. బ్లిట్జ్లో తొమ్మిది గేమ్లు ఆడిన హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడాడు. కార్ల్సన్ (నార్వే), జియోంగ్ (అమెరికా) లపై నెగ్గిన హరికృష్ణ... డొమింగెజ్, సో వెస్లీ (అమెరికా), గ్రిస్చుక్ (రష్యా), అలీరెజా (ఇరా న్) చేతిలో ఓటమి చవిచూశాడు. నకముర (అమె రికా), అరోనియన్ (అర్మేనియా), నెపోమ్నియాచి (రష్యా)లతో గేమ్లను‘డ్రా’గా ముగించాడు. -
నాలుగో స్థానంలో హరికృష్ణ
చెన్నై: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్ విభాగంలో భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత తొమ్మిది పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఏడో గేమ్లో హరికృష్ణ 66 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన ఎనిమిదో గేమ్ను 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ తొమ్మిదో గేమ్లో 69 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో బ్లిట్జ్ విభాగం గేమ్లు జరగాల్సి ఉన్నాయి. బ్లిట్జ్ గేమ్లు ముగిశాక ఓవరాల్ పాయింట్ల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రస్తుతం ర్యాపిడ్ విభాగంలో సో వెస్లీ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
హరికృష్ణకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా క్లాసికల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. స్విట్జర్లాండ్లో సోమవారం జరిగిన క్లాసికల్ విభాగం ఐదో రౌండ్ గేమ్లో హరికృష్ణ 1–0తో పోలాండ్ గ్రాండ్మాస్టర్ రాడోస్లా ఓజాసెక్పై గెలుపొంది చాంపియన్షిప్ రేసులో నిలిచాడు. ఈ గేమ్లో నల్లపావులతో ఆడిన భారత మూడో ర్యాంక్ ప్లేయర్ 50 ఎత్తుల్లో రాడోస్లాను ఓడించాడు. క్లాసికల్ విభాగంలో ఇప్పటివరకు 3 డ్రాలు 2 విజయాలు నమోదు చేసిన హరికృష్ణ ఖాతాలో 12.5 పాయింట్లు చేరాయి. ఓవరాల్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) జాబితాలో 31.5 పాయింట్లతో రాడోస్లా అగ్రస్థానంలో ఉండగా... హరికృష్ణ 28.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. -
విశ్వనాథన్ ఆనంద్ బోణీ
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్, భారత నంబర్వన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుసగా స్విద్లెర్, కార్ల్సన్, క్రామ్నిక్, అనీశ్ గిరి, పీటర్ లెకో, నెపోమ్నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్ ఏడో రౌండ్ గేమ్లో ఇజ్రాయెల్ గ్రాండ్మాస్టర్ గెల్ఫాండ్ బోరిస్పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్లో ఆనంద్ 2.5–0.5తో బోరిస్పై నెగ్గాడు. -
ఆనంద్కు రెండో ఓటమి
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నమెంట్లో భారత దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్ పోరులో ఆనంద్ 1.5–2.5తో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) చేతిలో ఓడాడు. ‘బెస్ట్ ఆఫ్ ఫోర్’ గేమ్స్ పద్ధ్దతిన జరిగిన ఈ మ్యాచ్లో... ఆనంద్ తొలి మూడు గేమ్స్ను ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే చివరి గేమ్లో ఓడటంతో విజయం కార్ల్సెన్ ఖాతాలో చేరింది. తొలి రౌండ్లో పీటర్ స్విడ్లర్ (రష్యా) చేతిలో ఆనంద్ ఓడాడు. మూడో రౌండ్లో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో ఆనంద్ తలపడతాడు. -
హరికృష్ణకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ రెండో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. ఆరు పాయింట్లతో వొజ్తాసెక్ (పోలాండ్) విజేతగా నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ మూడు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. నేటి నుంచి క్లాసికల్ విభాగంలో మరో టోర్నీ మొదలుకానుంది. -
చాంపియన్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన చెస్960 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయంగా ముఖాముఖి పద్ధతిలో జరుగుతున్న తొలి చెస్ టోర్నీ ఇదే కావడం విశేషం. స్విట్జర్లాండ్లోని బీల్ నగరంలో ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ అజేయంగా నిలిచాడు. హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), వొజ్తాసెక్ (పోలాండ్)లతో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... అలెగ్జాండర్ డోన్చెంకో (రష్యా), నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్), రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్), డేవిడ్ గుజారో (స్పెయిన్)లపై విజయం సాధించాడు. జర్మనీకి చెందిన 15 ఏళ్ల గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్ ఐదు పాయింట్లతో రన్నరప్గా నిలువగా... 4.5 పాయింట్లతో వొజ్తాసెక్ మూడో స్థానాన్ని పొందాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ముఖాముఖి టోర్నీని నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఎత్తులు వేసే బోర్డు మధ్యలో ప్రత్యేకంగా అద్దాన్ని అమర్చారు. గేమ్లు కాగానే వేదికను, గేమ్ బోర్డులను శానిటైజ్ చేస్తున్నారు. బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో మరో రెండు టోర్నీలు జరగనున్నాయి. -
హంపి పరాజయం
చైన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల స్పీడ్ చెస్ చాంపియన్ షిప్లో భారత టాప్ ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఆమె 4.5–5.5తో లీ తావో న్యూయెన్ ఫామ్ (వియత్నాం) చేతిలో ఓటమిపాలైంది. అయితే భారత యువ మహిళా గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు సంచలన విజయాన్ని నమోదు చేసింది. బల్గేరియాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ ఆంటోయినెటే స్టెఫనోవాను 6–5తో ఓడించింది. కరోనా కారణంగా ఈ టోర్నీ ఆన్లైన్లో జరుగుతోంది. -
ఒక విజయం... ఒక ‘డ్రా’
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో శుక్రవారం భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2.5–1.5తో విజయం సాధించిన భారత్... ఆ తర్వాత యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్లో పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ తమ గేముల్లో గెలిచారు. ద్రోణవల్లి హారిక తన గేమ్ను ‘డ్రా’గా ముగించగా... విదిత్ ఓటమి చవిచూశాడు. యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తమ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. విదిత్ తన గేమ్లో నెగ్గగా, హరికృష్ణ ఓడిపోయాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్లు ముగిశాక భారత్ నాలుగో స్థానంలో ఉంది. -
నేషన్స్ కప్ చెస్: భారత జట్టుకు నిరాశ
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో బుధవారం భారత్కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓటమి చవిచూసింది. యూరప్తో జరిగిన మూడో రౌండ్లో భారత్ 1.5–2.5తో... అనంతరం చైనాతో జరిగిన నాలుగో రౌండ్లో 1.5–2.5తో ఓడిపోయింది. యూరప్, చైనాతో జరిగిన మ్యాచ్ల్లో భారత్ తరఫున విదిత్ సంతోష్ పరాజయం పాలవ్వగా... విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి తమ గేమ్లను ‘డ్రా’గా ముగించారు. -
‘చెస్’ ఆగిపోలేదు!
మాస్కో: విపత్కర పరిస్థితుల్లోనూ చెస్ మాత్రం ఆగకుండా దూసుకెళుతోంది. 8 మంది ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే ఆడే ‘ది 2020 క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్’ రష్యాలో జరుగుతోంది. ఇది ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో తలపడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీ. ప్రేక్షకులను దగ్గరనుంచి చూసేందుకు అనుమతించకుండా దీనిని నిర్వహిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వీక్షణకు మాత్రం ఢోకా రాలేదు. దీన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు. కొన్ని రోజుల తరబడి కరోనా న్యూస్, న్యూసెన్స్తో విసుగెత్తిపోయేవారు క్యాండిడేట్స్ చెస్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రంగా కరోనాకు పుట్టిల్లయిన చైనా ఆ వైరస్కు విలవిలలాడుతుండగా... అత్యధికంగా క్యాండిడేట్స్ చెస్ చూసేవాళ్లు కూడా చైనా వాళ్లే కావడం విశేషం. ఏకంగా 10 లక్షల మంది చైనీయులు యూ ట్యూబ్లో గత మూడు రోజులుగా చెస్ పోటీలను తిలకిస్తున్నట్లు ‘ఫిడే’ ప్రకటించింది. -
కోనేరు హంపికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో చాంపియన్గా అవతరించిన గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ఆరంభించిన హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నిలో హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. చదవండి: కెయిన్స్ కప్ క్వీన్ హంపి... -
కెయిన్స్ కప్ క్వీన్ హంపి...
తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి కెరీర్లో మరో గొప్ప విజయం చేరింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా అవతరించిన ఈ భారత నంబర్వన్ మహిళా చెస్ స్టార్... తాజాగా అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లోనూ విజేతగా నిలిచింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజా ప్రదర్శనతో హంపి ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకోనుంది. సెయింట్ లూయిస్ (అమెరికా): రెండు నెలల క్రితం ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి... మళ్లీ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇద్దరు మాజీ ప్రపంచ చాంపియన్స్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), ప్రపంచ బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా), మూడుసార్లు యూరోపియన్ చాంపియన్ వాలెంటినా గునీనా (రష్యా)లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో హంపి చాంపియన్గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో పోటీపడిన హంపి నల్లపావులతో ఆడుతూ కేవలం 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి నాలుగు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయింది. 5.5 పాయింట్లతో జూ వెన్జున్ రన్నరప్గా నిలువగా... 5 పాయింట్లతో మరియా ముజిచుక్ మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్మనీతో నిర్వహించిన ఈ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు)... రన్నరప్ జూ వెన్జున్కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు)... మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా ఫలితంతో హంపి 2585 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ లైవ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. చైనా గ్రాండ్మాస్టర్ హు ఇఫాన్ 2658 పాయింట్లతో టాప్ ర్యాంక్లోఉంది. పలువురు మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా రెండు వారాలపాటు ప్రాక్టీస్ చేశాను. వివిధ రకాల ఓపెనింగ్స్ సాధన చేశాను. రెండు నెలల క్రితం నేను సాధించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గాలివాటంగా వచ్చినదేమీ కాదని తాజా ప్రదర్శనతో నిరూపించాను. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత స్వదేశంలో నా ఉద్యోగ సంస్థ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఇంటర్ యూనిట్ టోర్నమెంట్లో పాల్గొంటాను. ఆ తర్వాత మే నెలలో ఇటలీలో జరిగే గ్రాండ్ప్రి టోర్నీలో బరిలోకి దిగుతాను. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడమే నా తదుపరి లక్ష్యం. –‘సాక్షి’తో కోనేరు హంపి -
రాజా రిత్విక్కు తొలి జీఎం నార్మ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ క్రీడాకారుడు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) రాజా రిత్విక్ తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ముందడుగు వేశాడు. గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సాధించే దిశగా 15 ఏళ్ల రాజా రిత్విక్ సాగుతున్నాడు. స్పెయిన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఎలోబ్రెగట్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో మెరుగ్గా రాణించిన రాజా రిత్విక్ తొలి జీఎం నార్మ్ను అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం మూడు విజయాలు, ఆరు ‘డ్రా’లు నమోదు చేసి 6 పాయింట్లతో అతను 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారులతో తలపడిన రిత్విక్ అజేయంగా నిలిచి 26 రేటింగ్ పాయింట్లను సాధించాడు. దీంతో అతని ఖాతాలో ప్రస్తుతం 2407 రేటింగ్ పాయింట్లతో పాటు తొలి జీఎం నార్మ్ వచ్చి చేరింది. ఇందులో ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన రిత్విక్ ఒకరిని ఓడించి మరో ఐదుగురితో తన గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. తొలి గేమ్లో కొరిజే లిలీ (జార్జియా)పై, రెండో గేమ్లో గ్రాండ్మాస్టర్ నర్సిసో డుబ్లాన్ మార్క్ (స్పెయిన్)పై, నాలుగో గేమ్లో ఐఎం సోసా టోమస్ (అర్జెంటీనా)పై గెలుపొందిన రిత్విక్... జీఎం అరిజ్మెండి మార్టినెజ్ జులెన్ లూయిస్ (స్పెయిన్; మూడో గేమ్), జీఎం అలొన్సో రోసెల్ అల్వర్ (స్పెయిన్; ఐదో గేమ్), ఐఎం జనన్ ఎవినీ (స్పెయిన్; ఆరో గేమ్), జీఎం కార్తీక్ వెంకటరామన్ (భారత్; ఏడో గేమ్), జీఎం గుకేశ్ (భారత్; ఎనిమిదో గేమ్), ఏంజెలిస్ సాల్వడర్ (స్పెయిన్; తొమ్మిదో గేమ్)లతో ‘డ్రా’ చేసుకున్నాడు. -
చాంపియన్స్ విశ్రుత్, స్నేహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో కె. విశ్రుత్, బి. స్నేహా చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–17 బాలబాలికల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో 2 పాయింట్లతో విశ్రుత్, భవేశ్, అనికేత్ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో స్నేహా 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అండర్–15 బాలుర విభాగంలో 3.5 పాయింట్లు సాధించిన అజితేశ్ చాంపియన్గా నిలవగా... 3 పాయింట్లతో దైవిక్, వన్‡్ష వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో హరిణి నరహరి (3 పాయింట్లు), సాయి శ్రీయ నాయుడు (2 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) గౌరవ ఉపాధ్యక్షులు కేఏ శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–7 బాలురు: 1. హరిరామ్, 2. ప్రతీక్ రెడ్డి, 3. శ్రీవశిష్ట; బాలికలు: 1. ఐశ్వర్య, 2. శాన్వి, 3. సహస్ర రెడ్డి. అండర్–9 బాలురు: 1. అన్‡్ష నందన్, 2. ఆరుశ్, 3. సాత్విక్; బాలికలు: 1. కీర్తిక, 2. ఆద్య, 3. లహరి. అండర్–11 బాలురు: 1. ఆరుశ్, 2. విశ్వజిత్, 3. అనిరుధ్; బాలికలు: 1. అస్మా, 2. ఫాతిమా, 3. పరిద్యా. అండర్–13 బాలురు: 1. త్రివేద్ రెడ్డి, 2. తుషార్, 3. హిమాకర్; బాలికలు: 1. గీతిక హాసిని, 2. శ్రీయ శర్మ, 3. నేహా. -
13 ఏళ్ల 9 నెలల 28 రోజుల్లో...
న్యూఢిల్లీ: భారత్ నుంచి చెస్లో మరో గ్రాండ్మాస్టర్ (జీఎం) అవతరించాడు. నాగ్పూర్కు చెందిన రౌనక్ సిధ్వాని భారత 65వ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందాడు. ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నీన తొమ్మిదో రౌండ్లో రష్యా గ్రాండ్మాస్టర్ అలెగ్జాండర్ మోతిలెవ్పై రౌనక్ 37 ఎత్తుల్లో గెలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ను ఖాయం చేసుకున్నాడు. రౌనక్ ఖాతాలో ఇప్పటికే రెండు జీఎం నార్మ్లు ఉండటం... తాజా ప్రదర్శనతో అతని రేటింగ్ పాయింట్లు 2500 దాటనుండటంతో అతనికి జీఎం హోదా ఖాయమైంది. ఈ క్రమంలో రౌనక్ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో (13 ఏళ్ల 9 నెలల 28 రోజులు) జీఎం హోదా పొందిన ఏడో ప్లేయర్గా, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ప్రపంచ చెస్లో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన ప్లేయర్ రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది. ఈ జాబితాలో భారత్ నుంచి డి.గుకేశ్ (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు), ప్రజ్ఞానంద (12 ఏళ్ల 10 నెలల 13 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
హరికృష్ణ ముందంజ
ఖాంటీ మన్సిస్క్ (రష్యా): వరుసగా రెండో గేమ్లోనూ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, ప్రపంచ 19వ ర్యాంకర్ పెంటేల హరికృష్ణ ప్రతిష్టాత్మక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. విడాల్ యురీ గొంజాలెజ్ (క్యూబా)తో బుధవారం జరిగిన తొలి రౌండ్ రెండో గేమ్లో హరికృష్ణ 42 ఎత్తుల్లో గెలిచాడు. ఓవరాల్గా 2–0తో నెగ్గి రెండో రౌండ్కు చేరుకున్నాడు. భారత్కే చెందిన ముగ్గురు గ్రాండ్మాస్టర్లు నిహాల్ సరీన్, ఆధిబన్, విదిత్ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. నిహాల్ 2–0తో జార్జి కోరి (పెరూ)పై, ఆధిబన్ 1.5–0.5తో బొనెల్లి (వెనిజులా)పై, విదిత్ సంతోష్ గుజరాతి 1.5–0.5తో అలన్ పిచోట్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. భారత్కే చెందిన సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, సునీల్దత్ నారాయణన్, మురళీ కార్తికేయన్, అరవింద్ చిదంబరం, అభిజిత్ గుప్తా నేడు టైబ్రేక్ గేమ్లు ఆడనున్నారు. -
ఆధిక్యంలో విశ్వక్సేన్, హిమసూర్య
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అండర్–15 చెస్ టోర్నమెంట్లో విశ్వక్సేన్, హిమసూర్య, అజితేశ్ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాలికల విభాగంలో యజ్ఞప్రియ, ప్రణీత ప్రియ, సశ్య సింగారెడ్డి ఉమ్మడిగా దూసుకెళ్తున్నారు. అబిడ్స్లోని తెలంగాణ రాష్ట్ర సంఘం కార్యాలయంలో ఆదివారం ఈ పోటీలు మొదలయ్యాయి. బాలికల విభాగంలో తొలి రోజు రెండు రౌండ్లు, బాలుర విభాగంలో మూడు రౌండ్లు నిర్వహించారు. ఈ మూడు రౌండ్లలోనూ విశ్వక్సేన్, హిమసూర్య, అజితేశ్, హిమాన్షు అగర్వాల్లు గెలుపొందారు. దీంతో వీరంతా మూడేసి పాయింట్లతో ఉన్నారు. మూడో రౌండ్ పోటీల్లో విశ్వక్సేన్ (3)... ప్రద్యుమ్న (2)పై, హిమసూర్య (3)... సాయి రిత్విక్ (2)పై, అజితేశ్ (3)... విశ్వ అలకంటి (2)పై విజయం సాధించారు. బాలికల విభాగంలో జరిగిన రెండో రౌండ్లో యజ్ఞప్రియ (2)... శేషసాయి సర్వేణి (1)పై గెలుపొందగా, మహిత (1)ను ప్రణీత ప్రియ (2) ఓడించింది. సశ్య సింగారెడ్డి (2)... సంకీర్తన (1)పై విజయం సాధించింది. యజ్ఞప్రియ, ప్రణీత, సశ్యలు రెండేసి పాయింట్ల చొప్పున ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సోమవారం మిగతా రౌండ్లు పూర్తయ్యాక విభాగానికి నలుగురు చొప్పున 8 మంది క్రీడాకారుల్ని రంగారెడ్డి జిల్లా చెస్ జట్టుకు ఎంపిక చేస్తారు. -
హరికృష్ణకు రెండో విజయం
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం లిరెన్ డింగ్ (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో హరికృష్ణ 79 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
చాంప్స్ అక్షయ, పవన్ కార్తికేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ చాంపియన్షిప్లో ఎం. అక్షయ లక్ష్మి, జి. పవన్ కార్తికేయ ఆకట్టుకున్నారు. అండర్–7 స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో పవన్ నిర్ణీత 5 రౌండ్లకు గాను 5 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 4 పాయింట్లతో టి. హవీశ్ కోవిధ్, కార్తికేయ నందన్ అశ్విన్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా హవీశ్ రన్నరప్గా నిలవగా... కార్తికేయ నందన్ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల కేటగిరీలో 5 పాయింట్లు సాధించిన అక్షయ లక్ష్మి విజేతగా నిలిచింది. అనయా అగర్వాల్, ఎన్పీ హరిణి వరుసగా రెండు, మూడు స్థానాలను సంపాదించారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన అక్షయ లక్ష్మి, పవన్ కార్తికేయ తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు జాతీయ అండర్–7 చెస్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు. పోటీలో పతకాలు సాధించిన వారిని తెలంగాణ రాష్ట్ర చెస్ సం ఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
హారికకు ఐదో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక నల్ల పావులతో ఆడుతూ 60 ఎత్తుల్లో ఇరీనా క్రుష్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. పది మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో హారిక 4.5 పాయింట్లు సంపాదించింది. ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న ఆమె మరో గేమ్లో గెలిచి, ఒక గేమ్లో ఓడిపోయింది. ఏడు పాయింట్లు సాధించిన వాలెంటినా గునీనా (రష్యా) విజేతగా అవతరించింది. 6.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 5.5 పాయింట్లతో ఇరీనా క్రుష్ మూడో స్థానంలో నిలిచారు. విజేత గునీనాకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 54 వేలు)... రన్నరప్ కొస్టెనిక్కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 40 వేలు)... మూడో స్థానం పొందిన ఇరీనా క్రుష్కు 20 వేల డాలర్లు (రూ. 14 లక్షల 27 వేలు), ఐదో స్థానంలో నిలిచిన హారికకు 9,500 డాలర్లు (రూ. 6 లక్షల 77 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
హారిక తొలి గెలుపు
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ‘డ్రా’ల పరంపరకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయం నమోదు చేసింది. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన హారిక 79 ఎత్తుల్లో గెలుపొందింది. పది మంది క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత హారిక 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), వాలెంటినా గునీనా (రష్యా) ఐదు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
హారిక ఐదో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అనా జటోన్స్కీ (అమెరికా)తో జరిగిన ఐదో గేమ్ను నల్ల పావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత హారిక 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 4.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్ర స్థానంలో ఉంది. -
రన్నరప్ కార్తికేయన్ మురళి
న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్మాస్టర్ కార్తికేయన్ మురళి జిబ్రాల్టర్ అంతర్జాతీయ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచాడు. ఇంగ్లండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల కార్తికేయన్ మురళి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కార్తికేయన్ చివరి ఐదు రౌండ్లలో ఐదుగురు గ్రాండ్మాస్టర్లు లారినో నిటో డేవిడ్ (స్పెయిన్), ఫాబియన్ లిబిస్జెవ్స్కీ (ఫ్రాన్స్), రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్), మాక్సిమ్ మత్లకోవ్ (రష్యా), మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)లను ఓడించడం విశేషం. ఇందులో మమెదోవ్, మాక్సిమ్, లాగ్రెవ్ ఎలోరేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉంది. రన్నరప్గా నిలిచిన కార్తికేయన్కు 20 వేల పౌండ్లు (రూ. 18 లక్షల 61 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 8.5 పాయింట్లతో ఆర్తమియెవ్ వ్లాదిస్లావ్ (రష్యా) చాంపియన్గా నిలిచాడు. 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో ఎనిమిదో స్థానాన్ని సంపాదించాడు. అంతేకాకుండా టోర్నీ మొత్తంలో ఒక్క గేమ్లో కూడా అతను ఓడిపోలేదు. మొత్తం పది గేముల్లో లలిత్ ఎనిమిదింటిని గ్రాండ్మాస్టర్లతో ఆడాడు. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్), సేతురామన్ (భారత్), గవైన్ జోన్స్ (ఇంగ్లండ్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), సో వెస్లీ (అమెరికా), ఇవాన్ సారిచ్ (క్రొయేషియా)లతో ‘డ్రా’ చేసుకోగా... ఇవాన్ చెపరినోవ్ (జార్జియా), అలెగ్జాండర్ ఇండిక్ (సెర్బియా)లపై గెలిచాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి ఆరు పాయింట్లతో 49వ ర్యాంక్లో, ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో 76వ ర్యాంక్లో నిలిచారు. తెలంగాణకు చెందిన గ్రాండ్మాస్టర్ హర్ష భరతకోటి ఆరు పాయింట్లతో 47వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సీఆర్జీ కృష్ణ 5.5 పాయింట్లతో 82వ ర్యాంక్ను పొందాడు. ఇద్దరు గ్రాండ్మాస్టర్లు సేతురామన్ (భారత్), కాటరీనా లాగ్నో (రష్యా)లపై సీఆర్జీ కృష్ణ గెలుపొందినా గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్కు అవసరమైన చివరిదైన మూడో జీఎం నార్మ్ను పొందలేకపోయాడు. టోర్నీ మొత్తంలో 150 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో 94 మంది గ్రాండ్మాస్టర్లు ఉన్నారు. భారత్ నుంచి 26వ మంది పోటీపడ్డారు. -
చాంపియన్ ఆనంద్
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్, హికారు నకముర (అమెరికా) 12.5 పాయిం ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్ను నిర్వహించగా... ఆనంద్ 1.5–0.5తో నకమురను ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. టైబ్రేక్ తొలి గేమ్లో ఆనంద్ 55 ఎత్తుల్లో గెలిచాడు. రెండో టైబ్రేక్ గేమ్ను అతను 72 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నిర్ణీత 18 రౌండ్లలో ఆనంద్ తొమ్మిది విజయాలు సాధించి, ఏడింటిని ‘డ్రా’గా ముగించి, రెండింటిలో ఓడిపోయాడు. విజేతగా నిలిచిన ఆనంద్కు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 41 వేలు) ప్రైజ్మనీ లభించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ 8 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... హరికృష్ణకు ఆరో స్థానం, విదిత్కు ఏడో స్థానం దక్కింది. సూర్యశేఖర గంగూలీ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. -
షాంఘై ఓపెన్ చెస్ టోర్నీ విజేత లలిత్
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. చైనాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ దక్కింది. రెండో స్థానంలో లీ డి... మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు. ఐదు గేముల్లో గెలిచిన లలిత్... నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. -
ఆనంద్కు ఆరో స్థానం
న్యూఢిల్లీ: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో గ్రిష్చుక్ (రష్యా), లాగ్రెవ్ (ఫ్రాన్స్)లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా ఆనంద్కు ఆరో స్థానం లభించింది. గ్రిష్చుక్కు ఐదో స్థానం, లాగ్రెవ్కు ఏడో స్థానం లభించాయి. -
చాంపియన్ హర్షిత్ కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్పోర్ట్స్మీట్లో భాగంగా నిర్వహిచిన చెస్ చాంపియన్షిప్లో హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్ విద్యార్థి పి. హర్షిత్ కృష్ణ చాంపియన్గా నిలిచాడు. మలక్పేట్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అండర్–17 బాలుర విభాగంలో హర్షిత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో అగ్రస్థానం కోసం 4.5 పాయింట్లతో హర్షిత్, వెంకట అరుణ్ (గుంటూరు) పోటీపడగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హర్షిత్ విజేతగా నిలిచాడు. 4 పాయింట్లతో హిమసూర్య (నీరజ్ పబ్లిక్ స్కూల్, అమీర్పేట) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. వినయ్ (గుంటూరు), యుగ్ జైస్వాల్ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, కింగ్కోఠి) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ యు.ఎ. సుందరి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–17 బాలికలు: 1. పి. వేదలత (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. సీహెచ్. శ్రీకరి (జాన్సన్ గ్రామర్ స్కూల్, హబ్సిగూడ), 3. శ్రీద (సెయింట్ పాయ్స్, అల్వాల్). అండర్–19 బాలురు: 1. సత్య దినేశన్, 2. శ్రీరామ్ కుమార్, 3. మోనిక్ దత్తా (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి). బాలికలు: 1. శ్రీ సాయి ప్రణతి (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. తాస్య హర్ష శెట్టి (ఎన్ఏఎస్ఆర్ స్కూల్, ఖైరతాబాద్), 3. రితిష (గీతాంజలి, బేగంపేట్). -
సంయుక్తంగా రెండో స్థానంలో ఆనంద్
ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ చివరిదైన తొమ్మిదో రౌండ్లో సెర్గీ కర్జాకిన్ (రష్యా)పై 32 ఎత్తుల్లో గెలిచాడు. ఆనంద్తోపాటు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), నకముర (అమెరికా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పది మంది గ్రాండ్మాస్టర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానా ఐదు పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. -
ఆనంద్కు తొలి ఓటమి
ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్కు తొలి ఓటమి ఎదురైంది.నార్వేలోని స్టావెంజర్ నగరం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ ఎనిమిదో రౌండ్ గేమ్లో ఆనంద్ 50 ఎత్తుల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి గేమ్లో కర్జాకిన్ సెర్గీ (రష్యా)తో ఆనంద్ తలపడతాడు. ఈ ఓటమి అనంతరం మొత్తం 3.5 పాయింట్లతో పాయింట్లతో ఆనంద్ ర్యాంకు ఐదోస్థానానికి పడిపోయింది. ఆనంద్ తన చివరి రౌండ్లో డింగ్ లిరెన్ (చైనా)తో తలపడతాడు. -
ఇద్దరు జీఎంలను నిలువరించిన అర్జున్
ముంబై: మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్లో గ్రాండ్మాస్టర్ (జీఎం) రాసెట్ జియాత్దినోవ్ను ఓడించిన అర్జున్... ఐదు, ఆరు రౌండ్లలో ఇద్దరు గ్రాండ్మాస్టర్స్తో తలపడి ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను 75 ఎత్తుల్లో... తువాన్ మిన్ త్రాన్ (వియత్నాం)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరో రౌండ్ తర్వాత అర్జున్ ఐదు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తెలంగాణకే చెందిన రాజా రిత్విక్ ఐదో రౌండ్లో ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ నెవ్రోవ్పై 76 ఎత్తుల్లో సంచలన విజయం సాధించగా... ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. రిత్విక్ ఖాతాలోనూ ఐదు పాయింట్లున్నాయి. -
అర్జున్కు ఐదు... హర్షకు ఆరు...
కోల్కతా: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ఎరిగైసి అర్జున్ ఐదో స్థానంలో, హర్ష భరతకోటి ఆరో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో అర్జున్ ఖాతాలో తొలి జీఎం నార్త్ చేరింది. నిర్ణీత 9 రౌండ్లు ముగిశాక అర్జున్, హర్ష మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ద్వారా ర్యాంకింగ్ను వర్గీకరించగా... అర్జున్కు ఐదో ర్యాంక్... హర్షకు ఆరో ర్యాంక్ లభించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్లో హర్ష 52 ఎత్తుల్లో గ్రాండ్మాస్టర్ సందీపన్ చందాను ఓడించగా... ఇంగ్లండ్ గ్రాండ్మాస్టర్ నైజెల్ షార్ట్తో జరిగిన గేమ్ను అర్జున్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
18న ర్యాంకింగ్ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈనెల 18న జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలుంటాయి. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించాలి. -
విజేత విదిత్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్గా అవతరించాడు. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత విదిత్ 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల విదిత్ వచ్చే ఏడాది ఇదే టోర్నీలో ‘మాస్టర్స్’ విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించాడు. మొత్తం 14 మంది పాల్గొన్న చాలెంజర్స్ విభాగంలో 12 మంది గ్రాండ్మాస్టర్లు, ఒకరు మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం), అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విభాగంలో భారత్ తరఫున విదిత్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పాల్గొన్నారు. చివరిదైన 13వ రౌండ్లో జోర్దాన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో తలపడిన విదిత్ 24 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ లో విదిత్ ఐదు గేముల్లో గెలిచి, మిగతా ఎనిమిది గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఐదు పాయింట్లతో హారిక 13వ స్థానంలో నిలిచింది. కార్ల్సన్కు టైటిల్ మరోవైపు ఇదే వేదికపై జరిగిన మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఆరోసారి టైటిల్ గెలుపొందాడు. 14 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్, అనీష్ గిరి (నెదర్లాండ్స్) తొమ్మిది పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్ను నిర్వహించగా కార్ల్సన్ 1.5–0.5తో అనీష్ గిరిని ఓడించాడు. భారత స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. చాలెంజర్స్ టోర్నీలో విజేతగా నిలిచినందుకు వచ్చే ఏడాది కార్ల్సన్, ఆనంద్, కరువానా, అనీష్ గిరి, సో వెస్లీలాంటి మేటి ఆటగాళ్లు పాల్గొనే మాస్టర్స్ విభాగంలో పోటీపడే అవకాశం దక్కింది. ఈ విజయంతోనైనా నాకు స్పాన్సర్లు లభిస్తారని ఆశిస్తున్నాను. – విదిత్ -
ఆనంద్ గెలుపు
విక్ అన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. జోన్స్ గవాయిన్ (ఇంగ్లండ్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్లో ఆనంద్ 40 ఎత్తుల్లో విజయం సాధించాడు. 14 మంది గ్రాండ్మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్ తర్వాత ఆనంద్ 6 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు. -
హారిక ఖాతాలో ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో హారిక 32 ఎత్తుల్లో అమెరికా గ్రాండ్మాస్టర్ జియాంగ్ జెఫ్రీని నిలువరించింది. ఇదే వేదికపై జరుగుతున్న మాస్టర్స్ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 27 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
ఆనంద్ పరాజయం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్కు ఏడో రౌండ్లో ఓటమి ఎదురైంది. రష్యా గ్రాండ్మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో ఆనంద్ పరాజయం చవిచూశాడు. క్రామ్నిక్ 36 ఎత్తుల్లో ఆనంద్ ఆటకట్టించాడు. ఈ రౌండ్ ముగిసేసరికి భారత వెటరన్ గ్రాండ్మాస్టర్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. క్రామ్నిక్ 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.