CID investigation
-
చికలూరిపేట ICICI బ్యాంకులో సీఐడీ విచారణ
-
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్లో తెలిపింది. -
రాహుల్కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
కొలికపూడి, టీవీ5 సాంబ అరెస్ట్ ?..సీఐడీ విచారణలో కీలక విషయాలు
-
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమ నిధుల తరలింపునకు టీడీపీ ప్రధాన కార్యాలయం కేంద్రబిందువుగా మారిందని సీఐడీ గుర్తించింది. వివిధ కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధులను గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు విశ్వసిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు చంద్రబాబుపై నమోదైన ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హవాలా మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఈ మేరకు సీఐడీ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. దీంతో టీడీపీ ఖాతాల్లో చేరిన నిధుల లోగుట్టును రట్టు చేసే దిశగా సీఐడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. అందులో మొదటగా స్కిల్ స్కామ్ కేసులో కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 18న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హవాలా మార్గంలో రూ.27 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కొల్లగొట్టిన రూ.241 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరినట్టు సీఐడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను డిజైన్ టెక్ వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అందులో రూ.27 కోట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినట్టు సీఐడీ ఇటీవల గుర్తించింది. ఆ నిధులు పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రాథమిక ఆధారాలు సేకరించాక సీఐడీ నెల క్రితం టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు వివరాలు తెలపాలని పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. దీంతో కంగుతిన్న టీడీపీ బ్యాంకు లావాదేవీల వివరాలను తెలిపేందుకు నాలుగు వారాల గడువు కావాలని సీఐడీకి సమాధానం ఇచ్చింది. నాలుగు వారాల గడువు ముగిశాక కూడా టీడీపీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అంటే టీడీపీ బ్యాంకు ఖాతాల్లో చేరిన నిధుల్లో ఏదో గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమైంది. దాంతో సీఐడీ మరింత దూకుడు పెంచింది. టీడీపీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను తెలపాలని టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు పంపింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పేరిట ఆ నోటీసులు జారీ చేసింది. ఇతర కుంభకోణాలపైనా.. నెల క్రితం పోస్టులో పంపిన నోటీసులపై స్పందించని టీడీపీ.. ప్రస్తుతం ప్రత్యక్షంగా పంపిన నోటీసులపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం స్కిల్ స్కామ్కు సంబంధించిన రూ.27 కోట్ల వివరాలే కాకుండా మొత్తం బ్యాంకు లావాదేవీల వివరాలు సీఐడీకి వెల్లడించాల్సిన అనివార్యత ఏర్పడింది. తద్వారా టీడీపీ అక్రమ నిధుల తరలింపు నెట్ వర్క్ గుట్టురట్టు కానుంది. ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఎంతమేర తరలించారో నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
కిలారు రాజేష్ గుండెల్లో వణుకు
తెలీదు.. గుర్తులేదు..ఏమో.. చంద్రబాబు నాయుడి దగ్గరనుంచి కిలారు రాజేష్ వరకు అంతా ఇదే పాట. విచారణాధికారులు ఏ ప్రశ్న వేసినా ఈ మూడే సమాధానాలు. 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఆ లోకేష్ కి సన్నిహితుడు అయిన కిలారు రాజేష్ లు సిఐడీ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదు. సిఐడీ నోటీసులు అందుకున్న వెంటనే అమాతం అదృశ్యమైన కిలారు రాజేష్ నెల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమై నేను విచారణకు సిద్ధమన్నాడు. మొదటి రోజు ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. రెండో రోజు విచారణకు పిలిస్తే వస్తానన్న కిలారు మళ్లీ మాయమయ్యాడు. విజయదశమి పండగ తర్వాత వస్తానంటూ లేఖ పంపాడు. స్కిల్ స్కాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి హవాలా రూపంలో తమ దగ్గరకు రప్పించుకున్న చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 9న అరెస్ట్ అయ్యారు. దానికి నాలుగు రోజుల ముందు హవాలా రూపంలో డబ్బును చంద్రబాబు నాయుడు, నారాలోకేష్ లకు తరలించిన చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లకు సిఐడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందుకున్న రోజునుంచే ఇద్దరూ మాయమయ్యారు. ఒకరు దుబాయ్ కి మరొకరు అమెరికాకి పరారయ్యారని ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమైన కిలారు రాజేష్ తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఏపీలోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఎక్కడికీ పారిపోకపోతే సిఐడీ నోటీసులకు ఇంత వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారణకు హాజరు కాలేదు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలోనే ఉన్నాడా.. లేక లోకేష్ తో పాటు ఢిల్లీలో రహస్య స్థావరంలో తలదాచుకున్నాడా అన్నది కూడా తెలీదు. సరే విచారణకు సిద్ధమంటూ వచ్చాడు కాబట్టి సిఐడీ విచారణ మొదలు పెట్టింది. మొదటి రోజు విచారణ సందర్భంగా సిఐడీ ఏ ప్రశ్న వేసినా సరిగ్గా సమాధానం చెప్పలేదని సమాచారం. ఇంతకాలం ఎక్కడున్నావు అని అడిగితే ఏపీలోనే అన్నాడు. ఏపీలో ఎక్కడ ఉన్నావని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదట. లోకేష్ తో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది అని అడిగితే సమాధానం లేదు. నారా లోకేష్ కు డబ్బు అందించిన విషయంపై అడిగితే ఏం మాట్లాడకుడా మౌనంగా ఉండిపోయాడట. షెల్ కంపెనీల సృష్టికర్త మనోజ్ వాసుదేవ్ పార్ధసాని గురించి అడిగితే అతనెవరో తెలీదన్నాడట. తీరా వాసుదేవ్ -రాజేష్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ చూపించగానే నీళ్లు నమిలి బిక్కమొగం వేశాడట. 25 ప్రశ్నలు సంధిస్తే తెలీదు.. గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చాడట. మొదటి రోజు విచారణ పూర్తికాగానే బయటకు వచ్చిన రాజేష్ తనని రెండో రోజు కూడా విచారణకు రమ్మన్నారని తాను కచ్చితంగా వస్తానని చెప్పాడు. రెండో రోజు ఉదయం రాజేష్ కోసం సిఐడీ పోలీసులు ఎదురు చూస్తోన్న తరుణంలో సిఐడీ వారు అడిగిన డాక్యుమెంట్లు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుందని..దసరా పండగ తర్వాతనే తాను విచారణకు వస్తానని లేఖ పంపాడు రాజేష్. మొదటి రోజు మీడియా ముందు పెద్ద బిల్డప్ ఇచ్చిన రాజేష్ సిఐడీ మొదటి రోజు విచారణతోనే డంగైపోయాడు. తాను తప్పించుకునే పరిస్థితి లేదని అర్ధమైందో ఏమో కానీ.. రెండో రోజు విచారణకు గైర్హాజరయ్యాడు. మళ్లీ లోకేష్ ను కలిసి సిఐడీ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో క్లారిటీ తీసుకున్న తర్వాతనే రాజేష్ సిఐడీ ముందుకు వస్తాడని భావిస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈకేసులో విచారణ ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు సైతం సిఐడీ ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చి విచారణకు ఏ మాత్రం సహకరించలేదని సిఐడీ పోలీసులే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం విచారణలో నారా లోకేష్ కూడా అచ్చం ఇవే సమాధానాలు చెప్పి సిఐడీకి సహకరించకుండా వెళ్లిపోయాడు. ఇపుడు రాజేష్ కూడ అదే తంతు. అంతా కూడా ఒకే స్కూల్లో చదువుకున్నట్లు..ఒకేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందంటున్నారు సిఐడీ పోలీసులు. నెల రోజుల పైగా రాజేష్కు ఇలాంటి సమాధానాలు చెప్పాల్సిందిగా లోకేష్ మంచి ట్రెయినింగ్ ఇప్పించారని అంటున్నారు. - సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
CID విచారణకు కిలారు రాజేష్..బాబు, లోకేష్ గుండెల్లో వణుకు
-
అసైన్డ్ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూదోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీఓ–41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్కు తెలియకుండా.. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ దోపిడీకి వారిద్దరూ కుట్ర పన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా.. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా జీఓ–41ను జారీచేశారని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి.. ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సేల్డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసికూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉంది. సబ్రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని బుకాయిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సీఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు, వారి బినామీ పేర్లను సీఆర్టీఏ రికార్డుల్లో నమోదుచేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకూ భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ–41ను టీడీపీ ప్రభుత్వం జారీచేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ భూదోపిడీకి మూలమైన జీఓ–41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది. కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ.. అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ–41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ–41ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ–41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది. నారా, నారాయణే కుట్రదారులు.. ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ–41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ–41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ–41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ–41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టింది. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
అవినీతి చినబాబు ఆట కట్..సిద్ధంగా ఉండు లోకేశం
-
రెండో రోజు నారాయణ అల్లుడు పునీత్ సీఐడీ విచారణ
-
‘రింగ్’ మాస్టర్ అష్ట వంకర్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఎన్ని వంకర్లు తిప్పారో.. ఆ కేసులో నిందితుడు నారా లోకేశ్ సీఐడీ విచారణలో ప్రశ్నలకు అన్ని వంకర్లు తిరిగారు. చంద్రబాబు కుటుంబం, ఆయన అస్మదీయుల భూముల విలువ అమాంతంగా పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చిన తీరుపై సీఐడీ అధికారులు అడిగిన సూటి ప్రశ్నలకు లోకేశ్ నేల చూపులు చూశారు. తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గ ఉప సంఘం ద్వారానే అక్రమాల కథ నడిపిన తీరును సీఐడీ ఆధారాలతో సహా ముందు పెట్టడంతో బిత్తరపోయారు. హెరిటేజ్ భూముల కొనుగోలు, లింగమనేని కుటుంబం నుంచి క్విడ్ప్రోకో కింద పొందిన కరకట్ట నివాసంపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. విచారణకు సహకరించకుండా దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఈ కేసులో ఏ–14గా ఉన్న లోకేశ్ను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ దర్యాప్తునకు సహకరించకుండా ఉండేందుకు లోకేశ్ అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సిట్ బృందం తమదైన శైలిలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమీప దూరంలో ఉండగా ఆడియో, వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ అధికారులు లోకేశ్ను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అలైన్మెంట్ మార్చాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి కోర్ కేపిటల్పై టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉప సంఘం ద్వారా అక్రమాల కథ నడిపిన తీరుపై సీఐడీ లోకేశ్పై ప్రశ్నల వర్షం కురిపించింది. జూనియర్ మంత్రి అయినప్పటికీ లోకేశ్కు ఉప సంఘంలో స్థానం కల్పించడంపై మొదటగా ప్రశ్నించింది. పేరుకు మంత్రివర్గ ఉప సంఘం అయిన్పటికీ ఇతర సభ్యులకంటే అందులో లోకేశ్, నారాయణదే హవా అని, భూ సమీకరణ, ఇన్నర్రింగ్ రోడ్డుకు భూసేకరణపై వారే కీలకంగా వ్యవహరించినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. వాటిని లోకేశ్కు చూపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చాలని సీఆర్డీఏ అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నించింది. తామేమీ ఒత్తిడి చేయలేదని లోకేశ్ బుకాయించారు. మంత్రివర్గ ఉపసంఘం, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అలైన్మెంట్ను మార్చినట్లు అప్పటి సీఆర్డీఏ అధికారులు వాంగ్మూలం ఇచ్చిన అంశాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో లోకేశ్ షాక్ తిన్నారు. దాంతో ఆయన నోట మాట రాలేదని సమాచారం. వెంటనే తన న్యాయవాదితో సంప్రదించి చెబుతానని చెప్పారు. న్యాయవాదితో మాట్లాడిన తరువాత కూడా ఆయన ఈ అంశంపై సమాధానం దాట వేసేందుకే ప్రయత్నించారు. ముందుగానే సీఆర్డీఏ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖారారు చేయించి, దానినే మాస్టర్ప్లాన్లో చేర్పించి సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా ఆమోదింపజేయడం అంటే అక్రమమే కదా.. అని అధికారులు ప్రశ్నించడంతో లోకేశ్ మౌనంగా ఉండిపోయారు. మంత్రివర్గ ఉప సంఘం వ్యవహారం అంతా బూటకమని, ఆ ముసుగులో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతంగా పెంచుకున్నారని సీఐడీ కీలక ఆధారాలు చూపించడంతో లోకేశ్ నిశ్చేష్టుడయ్యారు. హెరిటేజ్ భూముల అంశంపై అసహనం ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ భూములు కొన్న అంశంపై సీఐడీ సూటి ప్రశ్నలకు లోకేశ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రాంతంలో భూములు కొనాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు వేసిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం తాను హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా లేనని, ఆ విషయాలు తనకు తెలియవని అన్నారు. భూములు కొనాలని తీర్మానించిన సమయంలో మీరే డైరెక్టర్గా ఉన్నారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేయడం గమనార్హం. కరకట్ట నివాసం అంశంపై కస్సుబుస్సు లింగమనేని కుటుంబం నుంచి క్విడ్ప్రోకో కింద పొందిన కరకట్ట బంగ్లాపై సీఐడీ ప్రశ్నించడంతో లోకేశ్ తత్తరపాటుకు గురై అధికారులపై కస్సుబుస్సులాడారు. ఆ ఇంటికి తాము అద్దె చెల్లించామన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆదాయ పన్ను రిటర్న్లను అధికారులు చూపిస్తూ ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా ఏ పత్రాలనైనా సంబంధిత శాఖలను సంప్రదించి తీసుకునే వెసులుబాటు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఉందనే అవగాహన ఆయనకు లేకపోవడం విడ్డూరం. లింగమనేని రమేశ్ ఆ కరకట్ట నివాసాన్ని ఉచితంగా ఇచ్చానని ఓసారి, కాదు దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని మరోసారి చెప్పిన విషయాలను అధికారులు ప్రస్తావించారు. దాంతో అసలు తనకు ఆ కరకట్ట నివాసం గురించి తెలియదని లోకేశ్ బుకాయించారు. మంత్రి హోదాలో మీరు నివసించిన ఇంటి గురించి తెలియదా... అని అధికారులు రెట్టించి అడిగేసరికి సమాధానం దాటవేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణానికి సంబందించి మరికొన్ని కీలక వ్యవహారాలపై లోకేశ్ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. వీలైనంతవరకు దర్యాప్తునకు సహకరించకుండా విషయాన్ని పక్కదారి పట్టించేందుకే యత్నించారు. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని ప్రశ్నించాలని సీఐడీకి సూచించడం హాస్యాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన నిందితుడే ఇతరులను ప్రశ్నించాలని చెబుతుండటం విడ్డూరంగా ఉందని సీఐడీవర్గాలు వ్యాఖ్యానించాయి. అవసరమైతే మరోసారి విచారణకు రావల్సి ఉంటుందని సీఐడీ అధికారులు లోకేశ్కు చెప్పి బుధవారం విచారణ ప్రక్రియను ముగించారు. సంబంధం లేని ప్రశ్నలు వేశారు: లోకేశ్ సీఐడీ అధికారులు తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు వేశారని లోకేశ్ చెప్పారు. రెండో రోజు విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని ఈ విచారణ ద్వారా తనకు తెలిసిందన్నారు. కరకట్ట నివాసానికి తన తల్లి అద్దె చెల్లించారన్నారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్లను అధికారులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. సాక్షి పత్రికలో షేర్లను కొందరు కొన్నట్లుగా తమ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను లింగమనేని కొనలేదని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రశ్నలకు తత్తరపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ పాత్రపై ‘సాక్షి’ ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. సాక్షి పత్రికపై అసత్య ఆరోపణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. కానీ సాక్షి ప్రతినిధులు సూటి ప్రశ్నలు సంధించడంతో తత్తరపాటుకు గురయ్యారు. ఇతర మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోకేశ్తో సాక్షి, ఇతర మీడియా ప్రతినిధుల సంభాషణ ఇలా సాగింది.. సాక్షి: మీరు మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడయ్యాకే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చారని, హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కొన్నారన్న అభియోగంపై మీ స్పందన ఏమిటి? లోకేశ్: మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడిగా నేను ఒత్తిడి చేసి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశానని సీఐడీ అంటోంది. కానీ అది నా శాఖకు ప్రమేయం లేని అంశం. అదే చెప్పా. సాక్షి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉన్న కంతేరు వైపు ఎందుకు మళ్లింది? లోకేశ్: సీఐడీ అధికారులు నాకు బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గూగుల్ మ్యాప్ చూపించి ప్రశ్నించారు. ఆ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని నాకు అర్థమైంది. సాక్షి: క్విడ్ప్రోకో కిందే లింగమనేని మీకు కరకట్ట బంగ్లా ఇచ్చారని సీఐడీ అభియోగం మోపింది కదా? లోకేశ్: మాకు క్విడ్ ప్రోకో అలవాటు లేదు. అలా మా హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. సాక్షి: మరి మీకు మాత్రమే లింగమనేని ఆ కరకట్ట బంగ్లాను ఎందుకు ఇచ్చారు? లోకేశ్: ఆ ఇంటికి మేము అద్దె చెల్లిస్తున్నాం. ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ కూడా రాశాం. సాక్షి: అదే నిజమైతే 2019కు ముందు ఎందుకు అద్దె చెల్లించలేదు? లోకేశ్: (వెంటనే సమాధానం చెప్పలేక మౌనం వహించారు. కాసేపటికి తేరుకుని..) ఆ విషయం నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ ఐటీ రిటర్న్ రికార్డులు సీఐడీకి ఎలా వచ్చాయి? దీనిపై న్యాయపోరాటం చేస్తాం. సాక్షి: మీ సన్నిహితుడు కిలారు రాజేశ్ ఎందుకు పరారయ్యారు? లోకేశ్: ఆయన గురించి నాకేం తెలుస్తుంది? ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు ఇతర మీడియా ప్రతినిధులు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలుకు పంపారు అని మీరు అంటున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించేది కోర్టులు కదా? లోకేశ్: ఈ కేసులో ఎఫ్ఐఆర్ వేసింది జగన్ ప్రభుత్వమే. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. మీడియా ప్రతినిధులు: మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారా? లోకేశ్: నేను ఎక్కడికి వెళ్తానో మీకు చెప్పాలా? అది మీకు అనవసరం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఎక్కడికి వెళ్లినా షెడ్యూల్ ఇస్తా. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
నారాయణ అల్లుడిని విచారిస్తున్న సీఐడీ
-
సీఐడీ విచారణలో నారాయణ అల్లుడు..
-
సిట్ కార్యాలయానికి భయపడుతూ బయల్దేరిన లోకేశ్
-
నారా లోకేశ్ రెండో రోజు CID విచారణ
-
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ విచారణలో లోకేశ్ తడబాటు
-
చంద్రబాబుకు నో రిలీఫ్..!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మాసనం ముందు జాబితా చేస్తామని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్ సంజీవ్ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ సంజీవ్ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు. ఇందుకు అనుమతించిన జస్టిస్ సంజీవ్ఖన్నా కేసును పాస్ ఓవర్ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు. పాస్ ఓవర్తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్కు కొంత సమయం పడుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ విన్నవించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను ట్రయల్ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు. తొలుత జ్యుడీషియల్ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్కుమార్ ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ స్పందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు. సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని పిటిషనర్ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. -
మళ్లీ ఆవు కథే!
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది. వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు. మరింత విచారించాల్సిన అవసరం విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది. ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. -
సీఐడీ లోతైన విచారణ..బాబుకు నో ఛాన్స్..
-
మొదటిరోజు విచారణలో అధికారులకు సహకరించని చంద్రబాబు
-
చంద్రబాబు విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా
-
నేడు మరోసారి చంద్రబాబును విచారించనున్న సీఐడీ
-
తెలీదు.. గుర్తులేదు అంటూ సీఐడీకి సహకరించని చంద్రబాబు
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తొలిరోజు శనివారం విచారించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని రెండ్రోజుల సీఐడీ కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం చంద్రబాబును సెంట్రల్ జైలులోనే కస్టడీలోకి తీసుకుని విచారించింది. న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్లుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా పన్నాగంతో తొలిరోజు విచారణలో ఆయన దాదాపు సగం సమయం వృథా అయ్యేటట్లు చేయగలిగారు. దాంతోపాటు సిట్ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే ఆయన ప్రాధాన్యమిచ్చారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సిట్ అధికారులు పూర్తి సంయమనం, ఓపికతో వ్యవహరించి తొలిరోజు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. సమీపం నుంచి పరిశీలించేందుకు చంద్రబాబు న్యాయవాదులను అనుమతించారు. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కాలహరణం.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్కు సమీపంలోని కాన్ఫరెన్స్ హాలులో సిట్ అధికారులు చంద్రబాబును విచారించారు. అందుకోసం ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతోపాటు మొత్తం 12 మందితో కూడిన సిట్ బృందం శనివారం ఉ.9.30 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అంతకుముందు.. తనను కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీ కావాలని చంద్రబాబు అడిగారు. 20 పేజీల ఆ కాపీని అధికారులు ఆయనకిచ్చారు. దానిని చదివే నెపంతో చంద్రబాబు చాలాసేపు కాలహరణం చేశారు. అయినప్పటికీ సిట్ అధికారులు ఓపిగ్గా వేచి చూసి ఆయన సరే అన్నాకే విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రశ్నావళిలో 30 శాతమే తొలిరోజు.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలక ఆధారాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రశ్నావళిని అనుసరించి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్టుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు అవి సంబంధిత అధికారులను అడగాలిగానీ తనను కాదని వ్యాఖ్యానించారని సమాచారం. కీలక పత్రాలను ఆయన ముందుంచి మరీ వాటిపై ప్రశ్నించినా సరే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రశ్నావళిలోని 30 శాతం ప్రశ్నలను కూడా సీఐడీ అధికారులు అడగలేకపోయారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నది స్పష్టమైంది. అయినప్పటికీ అధికారులు పూర్తి సహనంతో వ్యవహరించి తమ ప్రశ్నలను కొనసాగించారు. ప్రతి గంటకూ ఐదు నిముషాల పాటు విరామం ఇవ్వడంతోపాటు చంద్రబాబు కోరిన అదనపు సమయాల్లోనూ విచారణ ప్రక్రియను నిలుపుదల చేశారు. గంటసేపు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అలా తొలిరోజు నాలుగు దశల్లో విచారించారు. అనంతరం.. చంద్రబాబు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని స్నేహబ్లాక్కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత.. చంద్రబాబు కస్టడీ విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. జైలు లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది ఆక్టోపస్, సివిల్ పోలీసు బృందాలను మొహరించారు. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందం ఫైళ్లు, వీడియో రికార్డింగ్ సామగ్రి మొత్తం తీసుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంది. మీడియాపై బాలకృష్ణ చిందులు.. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి బొక్కా..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. -
చంద్రబాబు సమాధానం చెప్పకపోతే సీఐడీ ప్లాన్ B సిద్ధం
-
చంద్రబాబును ప్రశ్నించేందుకు రెండు సీఐడీ టీమ్ లు
-
విచారణలో సైలెంట్ గా ఉంటే బాబుకే నష్టం..
-
చంద్రబాబు కస్టడీ విచారణలో స్కిల్ స్కాం గుట్టు రట్టు కానుందా..?
-
దొరికిపోయినా బుకాయింపేనా?
సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, ఆధారాలతో సహా పట్టుబడినా.. ఇప్పటికీ తాను తప్పేమీ చేయలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుకాయిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఆర్థిక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టారనడం అవాస్తవమంటూ కొట్టిపారేశారు.కేసు కోర్టు పరిధిలో ఉండగా ఆయన మాట్లాడటం సరికాదన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల మాట్లాడుతూ.. స్కిల్ స్కాంపై సీఐడీ దర్యాప్తులో భాగంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనను అరెస్టు చేశారంటూ చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. అమరావతి భూకుంభకోణం, అసైన్డ్ భూకుంభకోణం, టిడ్కో ఇళ్ల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్నెట్ స్కాం కేసులు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కావని.. రెండేళ్లుగా వాటిపై విచారణ సాగుతోందని స్పష్టంచేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ కుంభకోణాలను ప్రస్తావించామని.. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదంటూ సజ్జల స్పష్టంచేశారు. ఈ కేసులకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నప్పుడు చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు తమ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయని వివరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. కేసుల దర్యాప్తులో సీఐడీకి సరైన ఆధారాలు లభిస్తే.. చంద్రబాబునైన, లోకేశ్నైన, అచ్చెన్నాయుడునైనా విచారణకు పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు విని ఉంటే జగన్పై కేసులు ఉండేవే కాదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టి, కక్ష సాధింపులకు గురిచేసిందనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భావించబట్టే జగన్ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో విచారణకు పీటీ వారెంట్ వేసి ఉంటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి కేసుల్లేవని చంద్రబాబు చెప్పుకోవడం పూర్తి అబద్ధం. అనేక కేసుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకుంటూ ఇంతకాలం తప్పించుకుంటూ వస్తున్నారు. ఏ కేసులో కూడా క్లీన్చిట్ తెచ్చుకోలేదు. గతంలో చంద్రబాబుపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కేసులు పెట్టారు. కానీ.. రాజకీయంగా తేల్చుకుందామని వాటిని వదిలేశారు. ఇక వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేశ్ను చూసి సీఎం జగన్ భయపడాలా? చంద్రబాబు జైలులో ఉంటే తప్పితే ఎన్నికలను ఎదుర్కోలేం అనే భావనలో సీఎం జగన్ లేరు. ఊతకర్రలు లేనిదే ఎన్నికలకు వెళ్లలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినప్పుడు పవన్ కనబడలేదు. ఆయనకు అవసరమైనప్పుడు రాష్ట్రానికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడొచ్చి పవన్ హడావుడి చేశాడు. -
‘ఫైబర్గ్రిడ్’లోనూ అదే స్కిల్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవల్ప్మెంట్, రాజధాని తాత్కాలిక నిర్మాణాల్లో నిధులు కొట్టేయడానికి అనుసరించిన మార్గాన్నే ఫైబర్గ్రిడ్లోనూ టీడీపీ పెద్దలు అనుసరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టులో కూడా యథేచ్ఛగా అవినీతికి తెగబడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు కేటాయించారు. ఈ ప్రజాధనాన్ని అనేక డొల్ల కంపెనీల ద్వారా కొట్టేశారు. ఇందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని వేమూరి తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేర్పించారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పటివరకు ఇన్క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవకుమార్ (ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్కుమార్ రామ్మూర్తి (ఏ–21)లతో పాటు కనుమూరి కోటేశ్వరరావును అరెస్టుచేసింది. ఈ డొల్ల కంపెనీల ద్వారా కాజేసిన సొమ్మును అందుకున్న అసలు వ్యక్తులను అరెస్టుచేసేందుకు సీఐడీ రంగం సిద్ధంచేస్తోంది. నెటాప్స్ ద్వారా ఇలా కొట్టేశారు.. ♦ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. ♦ నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ♦ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీచేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
బాబు చేసింది పెద్ద నేరమే!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఐపీసీ సెక్షన్లు 120–బి: నేరపూరిత కుట్ర 166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 167: పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 420: మోసం చేయడం 465: ఫోర్జరీ చేయడం 468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం 471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ 12(బి)(1): అవినీతికి పాల్పడటం 13(1)(సి)(డి): పబ్లిక్ సర్వెంట్గా ఉండి అవినీతికి పాల్పడడం -
చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి'
సాక్షి, అమరావతి: సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులను ఆ సంస్థ యాజమాన్యం బెదిరిస్తోందా? మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందా? ఇంతగా బరితెగించడం నిజమేనా? దీనిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారా? తదితర ప్రశ్నలన్నింటికీ సీఐడీ విభాగం అవునని స్పష్టం చేస్తోంది. ఘోస్ట్ చందాదారుల పేరిట అక్రమాలకు పాల్పడుతుండటాన్ని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీస్తుంటే బెంబేలెత్తిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని కుండబద్దలు కొట్టింది. చందాదారులు, ఏజంట్లను మోసగిస్తూ మార్గదర్శి భారీగా అక్రమాలకు పాల్పడుతోందని పలువురు బాధితుల ఫిర్యాదుతో విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేటలో తాజాగా ఆ సంస్థపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫకీరప్పతో కలసి విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఘోస్ట్ చందాదారుల పేరిట ఆర్థిక దందా ► మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రతి చిట్టీ గ్రూపులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద రాష్ట్రంలో 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల పేరిట భారీగా ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఆ 3 వేల మందికి తెలియకుండానే వారిని చందాదారులుగా చూపిస్తూ వారి పేరిట అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఇతరత్రా సేకరించిన వారి గుర్తింపు కార్డులతో వ్యవహారం నడుపుతోంది. వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతోంది. ► ఘోస్ట్ చందాదారుల పేరిట చెక్లు జారీ చేస్తున్నప్పటికీ, ఆ చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం వారి వద్దే అట్టిపెట్టుకుంటోంది. ఆ చెక్కుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బ్యాంకులో జమ చేయడం లేదు. ఇదో అతి పెద్ద ఆర్థిక మోసం. అలాంటి 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల్లో వంద మందిని సీఐడీ విచారిస్తోంది. ► దాంతో బెంబేలెత్తిన మార్గదర్శి యాజమాన్యం ఆ ఘోస్ట్ చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని, తర్వాత తాము అన్నీ సెటిల్ చేస్తామని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ తన పీఏ శశికళ ద్వారా చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అక్రమ డిపాజిట్లుగా నల్లధనం ► రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే తిరిగి బుకాయిస్తోంది. రాబోయే నెలలకు చిట్టీ గ్రూపులకు చెల్లించాల్సిన చందాలను అడ్వాన్స్గా జమ చేస్తున్నారని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అసలు చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే చందాదారుల పేరిట నాలుగైదు నెలల ముందే డిపాజిట్లు సేకరించిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. ► చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే ఎవరైనా చందాల మొత్తం చెల్లిస్తారా? ఎవరూ చెల్లించరు కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు దాదాపు 2 వేల మందిలో రూ.కోటికి పైగా విలువైన అక్రమ డిపాజిట్లు చేసిన, చిట్టీ గ్రూపుల్లో చందాదారులుగా ఉన్న వారు ఏకంగా 800 మందికిపైగా ఉన్నారు. చాలా కంపెనీల పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. ► ఆ 800 మందికిపైగా డిపాజిట్దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంత భారీగా డిపాజిట్లు ఎలా చేశారు.. ఆ నిధులు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయనే కోణంలో విచారిస్తోంది. విజయవాడలో ఓ బిల్డర్ ఏకంగా రూ.50 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా ఉన్నారు. ► ఇలాంటి భారీ మొత్తాల డిపాజిట్దారులు, చిట్టీ గ్రూపుల్లో సభ్యుల గురించి ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా సీఐడీ సమాచారమిచ్చింది. అక్రమ డిపాజిట్ల ముసుగులో నల్లధనం చలామణిలోకి తీసుకువస్తున్నారా అన్నది సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఏజంట్లకూ కుచ్చుటోపి ► మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ చందాదారులు, ఏజంట్లను కూడా మోసగిస్తోంది. కుట్ర పూరితంగా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారి ఆస్తులు రాయించుకుంటోంది. దీనిపై చందాదారులు, ఏజెంట్లు, ఘోస్ట్ చందాదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిశీలించి తగిన ఆధారాలు ఉన్న వాటిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. ► విజయవాడలో కోళ్ల ఫారం యజమాని బొండు అన్నపూర్ణా దేవి అనే మహిళను ఏకంగా 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్పించి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కుట్ర పూరితంగా విజయవాడలోని లబ్బీపేట, గుడివాడ మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ష్యూరిటీలు ఇచ్చినా సరే కొర్రీలు వేస్తూ ఆమెను డిఫాల్టర్గా చూపిస్తూ వారి ఆస్తులు కూడా రాయించుకున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఆమె రూ.14 కోట్ల విలువైన 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా ఉన్నారు. ఆమె రూ.8 కోట్లు చందా మొత్తం చెల్లించారు. కానీ చిట్టీ పాట పాడితే ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.48 లక్షలు మాత్రమే. ఇందులో రూ.8 కోట్ల విలువైన 45 చిట్టీ గ్రూపుల్లో ఆమె రూ.1.7 కోట్లు చందా మొత్తంగా చెల్లిస్తే.. చిట్టీ పాట పాడిన తర్వాత ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.8 వేలు. ఆమెను డిఫాల్టర్గా చూపిస్తూ వారి కుటుంబ ఆస్తులు కూడా రాయించుకుంటున్నారు. ► విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన పిలక లలిత కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఆమెను విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఘోస్ట్ చందాదారుగా చేర్చారు. ఆ విషయం తెలిసి ఆమె చిట్ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. అక్కడ ఉన్న పత్రాల్లో ఉన్న సంతకాలు చూసి అవి తాను చేయలేదని ఫోర్జరీ చేశారని తెలిపారు. ► ఆమె చిట్టీ పాడినట్టు.. ఆమెకు చిట్టీ మొత్తం చెల్లించినట్టు కూడా రికార్డుల్లో ఉంది. అందుకు ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేశారు. తనకు తెలియకుండానే తనను చందాదారుగా చేర్చడంతోపాటు తన సంతకాలు ఫోర్జరీ చేయడంపై లలిత కుమారి విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మార్గదర్శి చిట్ఫండ్స్ ఏజెంట్ కె.సంతోష్, సాక్షి సంతకాలు చేసిన జి.నరసింగరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఎండీ శైలజ కిరణ్, ఆమె పీఏ శశికళ, విజయవాడ లబ్బిపేట బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావు, గుడివాడ బ్రాంచి మేనేజర్ వైవీవీడీ ప్రసాద్, పాతూరి రాజాజీ, పాపి నాయుడులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పల్పాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏజంట్నే ఆ సంస్థ మోసం చేసింది. ఏజంట్ సంతకాన్ని బ్రాంచి మేనేజర్ ఫోర్జరీ చేశారు. ఏజంట్ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మా కుటుంబాన్ని దోచేసి రోడ్డున పడేశారు – బోరున విలపించిన బొండు అన్నపూర్ణా దేవి ‘మార్గదర్శి చిట్ ఫండ్స్ మమ్మల్ని పూర్తిగా మోసం చేసి ఆర్థికంగా కుదేలయ్యేట్టు చేసింది. మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మా ఆస్తులు, బంగారం, వృద్ధాప్యంలో అవసరాల కోసం దాచుకున్న మొత్తం అంతా మార్గదర్శి చిట్ ఫండ్స్కు ధారపోశాం. అయినా సరే ఇంకా మమ్మల్ని వేధిస్తూ మిగిలిన ఉన్న ఇంటిని కూడా తీసుకునేందుకు వేధిస్తోంది. మా కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది. నా భర్త ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు. నేను కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. నేను మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఒక గ్రూపులో చందాదారుగా చేరాను. ఆ తర్వాత ఏకంగా 65 గ్రూపుల్లో నన్ను చందాదారుగా చేర్చింది. నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్గా చూపించింది. మా ఆస్తులు తీసుకుంది. నా భర్త జీపీఎఫ్ డబ్బులు కట్టి, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించాం. అయినా సరే ఇంకా బకాయి ఉన్నారంటూ మా ఇల్లు వేలం వేయించారు. మా ఇంటికి వచ్చి అల్లరి చేశారు. మా అమ్మాయి విదేశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది? ఎలా వేలం పాటలో పాల్గొంది? తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది? ఇంత దారుణంగా మార్గదర్శి చిట్ఫండ్స్ మమ్మల్ని మోసం చేసింది. మమ్మల్ని కుట్ర పూరితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం, మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’ రూ.9.43 కోట్ల జగజ్జనని చిట్ ఫండ్స్ ఆస్తులు అటాచ్ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడిన రాజమహేంద్రవరానికి చెందిన జగజ్జనని చిట్ ఫండ్స్కు చెందిన రూ.9,43,52,020 విలువైన స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. వాటిలో భవనాలు, భూములు, ఖాళీ స్థలాలతో కూడిన మొత్తం 12 స్థిరాస్తులను అటాచ్ చేయనుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ ప్రతిపాదనకు హోమ్ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆమోదం కోసం సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. న్యాయస్థానం అనుమతి అనంతరం ఆ ఆస్తులను అటాచ్ చేస్తుంది. -
విశాఖ రీతి సాహ కేసు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: సంచలనంగా మారిన రీతి సాహ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ల పర్వం కూడా మొదలైంది. తాజాగా నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. సాధన హాస్టల్కు చెందిన ఇద్దరు, బైజూస్ యజమాన్యానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి, ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరి నిరక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. వెంకటరామ, కేర్ ఆసుపత్రిలో కూడా సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగాల్ పోలీసులు, సీఐడీ విశాఖలోనే మకాం వేసి దూకుడు పెంచారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు -
మార్గదర్శిలో లోపాలను ప్రభుత్వం ఎత్తు చూపుతుంది
-
నల్ల‘మార్గ’o ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల పుట్టలో దాగిన ‘నల్ల’పాములు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్ఫండ్స్ బెంబేలెత్తుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు. బ్యాంకులను కాదని చిట్టీ కంపెనీలోనా? రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్దారులను సీఐడీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడించాలని మార్గదర్శి చిట్ఫండ్స్ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్ఫండ్స్లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడించేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఇదే తరహా మోసంలో సహారా చైర్మన్కు జైలు శిక్ష బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్ఫండ్స్లో అక్రమ డిపాజిట్దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుకాయించబోయి దొరికిన రామోజీ మార్గదర్శి చిట్ఫండ్స్లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడంలేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది. -
మార్గదర్శిలో ‘నల్ల’ ఇంధనం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రూ.కోటికిపైగా డిపాజిట్దారులకు నోటీసులు మార్గదర్శి చిట్ఫండ్స్లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయ వివరాల పరిశీలన.. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ఫండ్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు. మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి! కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు. మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం మరోవైపు.. హైదరాబాద్లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు. చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
విచారణకు శైలజా కిరణ్ సహకరించలేదు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని, అయినప్పటికీ తాము చట్టానికి లోబడే విచారణ జరుపుతున్నామని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే సీఐడీ విచారణపై నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము శైలజ కిరణ్ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, .ఆమె పట్ల పూర్తి మర్యాదతో వ్యవహరించామని చెప్పారు. ఆమె భోజనం, టీ, మందుల కోసం అవసరమైన ప్రతిసారీ అవకాశం కల్పించామన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయని రవికుమార్ స్పష్టం చేశారు. విచారణ కోసం మంగళవారం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నాం మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయి. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడ వేధించలేదు. మేము వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించి విచారిస్తున్నాం. వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం. నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్లు సమాధానం లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని రవికుమార్ పేర్కొన్నారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ‘‘నిన్న మేము విచారణకు వెళ్లినప్పుడు 10 మంది ని ఆబ్జెక్ట్ చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్ను తీసుకెళ్లొద్దని అభ్యంతరం తెలిపారు. ఎండి శైలజ మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు.ఎండిగా ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండి శైలజ సమాధానం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి ఎదో వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారు. మేము మళ్లీ ఎండి శైలజను విచారణ చేస్తాం. అవసరమైనప్పుడు మళ్లీ రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని రవికుమార్ తెలిపారు. -
నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్ఫండ్స్ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! –సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్రాజు, విచారణ అధికారి రవికుమార్తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ కదా? మీ పేరిటే చెక్ పవర్ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్ తప్పించుకునేందుకు యత్నించారు. విచారణకు సహకరించకుండా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. మళ్లించాం... ఎక్కడికో తెలియదు! మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పడం గమనార్హం. మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. మరోసారి విచారణ విచారణకు శైలజా కిరణ్ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి! మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ రూ.వేల కోట్లను హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్ఫండ్స్ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్ రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. చిట్ఫండ్స్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది. గత డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది. -
‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్కు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లను నిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసిన జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ గత పాలకవర్గ సభ్యుల ఆస్తులను సీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సీఐడీ ఆ దిశగా దూకుడు పెంచింది. నిన్న మొన్నటివరకు మార్గదర్శి కుంభకోణాన్ని ఛేదించడంలో నిమగ్నమైన సీఐడీ ఇప్పుడు తాజాగా ‘జయలక్ష్మి’పై దృష్టిపెట్టింది. కాకినాడ సర్పవరంలోని జయలక్ష్మి మెయిన్ బ్రాంచిలో రెండ్రోజులుగా సీఐడీ బృందం పాత పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్లు వ్యూహాత్మకంగా ముందుగానే అమ్మేసిన ఆస్తుల సీజ్కు రికార్డులను సిద్ధంచేసింది. జామీను దొరక్కపోవడంతో జైలులోనే.. ఏప్రిల్లో కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసి 19,911 మందికి చెందిన రూ.520 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల్లో 29 బ్రాంచీలను ఏర్పాటుచేసి ఈ మోసానికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరి డిపాజిటర్ వరకు న్యాయం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా సీఐడీని రంగంలోకి దించడంతో చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి, 11 మంది సహా డైరెక్టర్లపై కేసులు నమోదుచేయడానికి, ముగ్గురు మినహా అందరినీ అరెస్టుచేయించడానికి వీలు చిక్కింది. ఆంజనేయులు, విశాలాక్షి, డైరెక్టర్లకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను ఇవ్వడానికి ఎవరు ముందుకురాకపోవడంతో వారంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఆస్తులు సీజ్ చేస్తున్న సీఐడీ ఈ క్రమంలో.. గత పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్ల పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పాలకవర్గ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథ్రావు సమక్షంలో సీఐడీ బృందం గురు, శుక్రవారాల్లో కాకినాడ మెయిన్ బ్రాంచిలో రికార్డులను పరిశీలించింది. ఒక్క కాకినాడ జిల్లాలోని ఎనిమిది బ్రాంచీల వివరాలు సేకరిస్తేనే కోట్ల విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తేలింది. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సీఐడీ సీఐ పైడప్ప నాయుడు, ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రికార్డులు, గత పాలకవర్గ సభ్యుల పేరుతో ఉన్న డాక్యుమెంట్లను సేకరించి ఆస్తులను సీజ్ చేసే పనిలో నిమగ్నమైంది. వీటిపై చట్టపరంగా ఆంజనేయులు, విశాలాక్షి సహా డైరెక్టర్లకు ఎటువంటి హక్కుల్లేవని సీఐడీ తేల్చింది. ఆర్నెల్ల ముందు నుంచే అమ్మకానికి ఆస్తులు.. ఇక విశాలాక్షి, భర్త, కుమారులు కలిసి బ్యాంకు బోర్డు తిప్పేయడానికి ఆర్నెల్ల ముందునుంచే తమ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టేశారు. కాకినాడలో ఒక మార్ట్.. రామారావుపేట, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర, స్థిరాస్తులతో పాటు ఎనిమిది ఎకరాల భూమిని కూడా ఆమె విక్రయించినట్లుగా గుర్తించారు. అలాగే, విశాలాక్షి పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న మొత్తం 64 ఆస్తులనూ సీజ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేసినట్లు తేలింది. వాటిలో కాకినాడ ఎస్ఈజడ్లో 30 ఎకరాలు ఉంది. ఇలా కొనుగోలుచేసి తిరిగి అమ్మేసిన ఆస్తులను సీజ్ చేయడంపై సీఐడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు సిద్ధంచేస్తోంది. వారిపై చార్జిషీట్లు కూడా వేయనుంది. సీఐడీ దూకుడుతో వారంతా బయటకు.. బ్యాంకు నుంచి రూ.120 కోట్లు వరకు రుణాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వారంతా ఇప్పుడు సీఐడీ దూకుడుతో బయటకొస్తున్నారు. నోటీసులు తీసుకుని 50 రోజులు దాటినా స్పందించని వారు సీఐడీ జోరుతో రుణాలు జమచేసేందుకు రుణగ్రహీతలు ముందుకొస్తున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా రుణగ్రస్తుల ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా లెక్కతేలింది. 30శాతం తిరిగి చెల్లింపు? ఇక డిపాజిటర్లకు తొలి విడతగా మొత్తం డిపాజిట్లలో 30 శాతం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకల్లా బాధితులకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు 3 కోట్లు వసూలయ్యాయి. డిపాజిటర్లలో 14వేల మంది రూ.లక్ష నుంచి రూ.4 లక్షలలోపు డిపాజిట్ చేసిన వారే. రూ.26 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మూడొంతులు మంది బాధితులు జయలక్ష్మి కుంభకోణం నుంచి బయటపడతారు. మరోవైపు.. సివిల్, అండ్ క్రిమినల్ కేసుల ప్రకారం ముందుకెళ్లే అవకాశముండడంతో జూలై 10 నాటికి జమచేస్తామని రుణాలు తీసుకున్న వారు చెబుతున్నారు. – గంగిరెడ్డి త్రినాథ్రావు, చైర్మన్, కాకినాడ జయలక్ష్మి సొసైటీ -
మార్గదర్శి కేసు: ఈనెల 6న శైలజాకిరణ్ను విచారించనున్న సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఆ నోటీసులపై సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజాకిరణ్ను ఇప్పటికే సీఐడీ హైదరాబాద్లో వారి నివాసంలో వేర్వేరుగా విచారించింది. ఈ కేసులో మరోసారి విచారించాల్సి ఉంటుందని ఆమెకు సీఐడీ విభాగం ఇటీవల సమాచారమిచ్చింది. హైదరాబాద్లో ఆమె అందుబాటులో ఉండే తేదీలు తెలపాలని సూచించింది కూడా. జూన్ 3 తరువాత తాను విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సీఐడీకి తెలిపారు. దీంతో జూన్ 6న హైదరాబాద్లో శైలజాకిరణ్ నివాసంలోనే ఆమెను విచారిస్తామని సీఐడీ నోటీసులిచ్చింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆమెగానీ ఆమె తరఫు న్యాయవాదులుగానీ సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఇటీవల ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆమె విమానాశ్రయానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము -
హెరిటేజ్ పై సీఐడీ ఫోకస్...!
-
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దూకుడును గురువారం మరింతగా పెంచింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా మళ్లింపు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ 2 చెరుకూరి శైలజాకిరణ్కు సహాయకారిగా వ్యవహరించిన మార్గదర్శి చిట్ఫండ్స్ ఏడుగురు కీలక అధికారుల విచారణ చేపట్టింది. ఈ అధికారులు మార్గదర్శి చిట్ఫండ్స్ ఏపీలోని చందాదారుల నిధుల అక్రమ మళ్లింపులో సాధనంలా వ్యవహరించారు. నిధుల మళ్లింపునకు చెక్పవర్ కలిగిన మార్గదర్శి చిట్ఫండ్స్లోని వైస్ ప్రెసిడెంట్లు సీహెచ్ సాంబమూర్తి, రాజాజీ, పి.మల్లికార్జున రావు, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకట స్వామి, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ టి.హరగోపాల్, జనరల్ మేనేజర్లు ఎల్.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావును విచారించి ముఖ్యమైన ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం ప్రకారం సంబంధిత బ్రాంచి మేనేజర్ (ఫోర్మెన్)కు చెక్ పవర్ ఉండాలి. కానీ, మార్గదర్శి చిట్ఫండ్స్లో బ్రాంచి మేనేజర్లకు రూ.500 వరకు మాత్రమే చెక్ పవర్ను పరిమితం చేయడం గమనార్హం. మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్తో పాటు మరో 11 మందికి నిబంధనలకు విరుద్ధంగా చెక్ పవర్ కేటాయించి నిధుల అక్రమ బదిలీకి పాల్పడ్డారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఈ ఏడుగురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టడంతో పాటు వారి స్టేట్మెంట్ సీఐడీ నమోదు చేసుకుంది. ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో ట్విస్ట్.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు! -
ఫింగర్ ప్రింట్స్ కోసం సీఐడీకి అధునాతన కిట్లు
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్లోని ఎల్బీ నగర్ జోన్, సైబరాబాద్లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు. మాస్టర్ ఎక్స్పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్సీఆర్బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్పీబీ) పాల్గొన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాలపై సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి రశీదు డిపాజిట్ల ముసుగులో భారీగా బ్లాక్మనీ మార్పిడి జరిగిందని, ఆ నల్లధనాన్నే తమ సంస్థల్లో పెట్టుబడులుగా రామోజీ తరలించినట్లు సీఐడీ గుర్తించింది. చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సీఐడీ పరిశీలించింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ఫండ్ అక్రమాలు, నిధులు దారిమళ్లింపుపై విచారణ జరుపుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజాకిరణ్పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి.. -
నల్ల ‘మార్గం’లో! పయనించిన మార్గదర్శి.. గుర్తించిన సీఐడీ
సాక్షి, అమరావతి: భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించింది. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ (సీతంపేట), రాజమహేంద్రవరం (శ్యామల థియేటర్ బ్రాంచి), ఏలూరు (నర్సింగరావుపేట బ్రాంచి), విజయవాడ (లబ్బిపేట బ్రాంచి), గుంటూరు (అరండల్ పేట), నరసరావుపేట (సత్తెనపల్లి రోడ్ బ్రాంచి), అనంతపురం (లక్ష్మీనగర్ బ్రాంచి)లోని మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల సోదాల సందర్భంగా గుర్తించినట్లు సమాచారం. ఏటా దాదాపు రూ.600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్లు గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఏటా మార్చి 31న వచ్చినట్లు చూపిస్తున్న దాదాపు రూ.500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచి కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రశీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు మార్గదర్శి చూపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచి కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్లు తెలుస్తోంది. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం, బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ సోదాలు మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. -
మార్గదర్శి హెడ్ ఆఫీస్లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి హెడ్ ఆఫీసులో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏ1 రామోజీ, ఏ2 శైలజను సీఐడీ విచారించింది. అయితే, విచారణలో డాక్యుమెంట్లను చూపేందుకు రామోజీ, శైలజ నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా నగదు మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వైఎస్ ఛైర్మన్, ఫైనాన్స్ డైరెక్టర్లను విచారించిన సీఐడీ.. మరో నలుగురు కీలక ఉద్యోగులను పశ్నించింది. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ, శైలజ, ఉద్యోగుల స్టేట్మెంట్లను సీఐడీ పరిశీలించింది. మార్గదర్శి ఫండ్స్ పెట్టుబడుల రూపంలో ఇతర కంపెనీలకు మళ్లించారు. మార్గదర్శి కస్టమర్ల సొత్తును రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రంగంలో యాజమాన్యం పెట్టుబడులు పెట్టింది. కస్టమర్ల చిట్స్ కోసం సేకరించిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మార్గదర్శి యాజమాన్యం జమ చేసుకుంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఏపీ సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు జరపాలని ఈడీ, సీబీడీటీకీ సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. చదవండి: ‘చెక్కు’తో చిక్కారు!.. -
చట్టాలకు రామోజీ అతీతుడా! చట్టాన్ని ఇప్పుడే తెచ్చినట్లు ‘ఎల్లో’ పెడబొబ్బలు
సాక్షి, అమరావతి: ఇది నా దేశం... అనుకున్న వాళ్లెవరైనా ఇక్కడి చట్టాలను గౌరవించి తీరాలి. ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి. అసలు ఒక వ్యాపారం చేస్తూ... ఆ వ్యాపారాన్ని ఏ చట్టం కింద రిజిస్టర్ చేశారో ఆ చట్టం తనకు తెలియనే తెలియదని... దాన్ని తాను పాటించనని నిస్సిగ్గుగా... నిర్భీతిగా చెప్పే మనుషులను ఏం చేయాలి? తమకు ఏ చట్టాలూ వర్తించవని చెప్పే పెద్ద మనుషుల్ని ఏమనాలి? ఇక్కడైతే చెరుకూరి రామోజీరావు అనో... చెరుకూరి శైలజా కిరణ్ అనో పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి నేటి మార్గదర్శి చిట్స్ వరకూ... మేం డిపాజిట్లు సేకరించలేదని కానీ, మేం నిధులు మళ్లించలేదని గానీ వాళ్లు చెప్పటం లేదు. చట్టప్రకారం అలా చెయ్యకూడదు కదా? అంటే... ఆ చట్టాలేవీ తమకు వర్తించవంటున్నారు. ఆ చట్టాలు తాము పాటించబోమని చెబుతున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో... ఆ కంపెనీ ద్వారా తాము చేసినవన్నీ చట్ట విరుద్ధమైన పనులే అని తేలటంతో... తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా ఆ సంస్థనే మూసేశారు. ఇపుడు ఆ సంస్థే లేదు కదా? అని వాదిస్తున్నారు. ఒక బ్యాంకు తన వద్దకు వచ్చిన డిపాజిట్లను ఇష్టం వచ్చినట్లు సొంత అవసరాల కోసం వాడేయొచ్చా? సొంత కంపెనీల్లోకి మళ్లించొచ్చా? అలా మళ్లిస్తే బ్యాంకు కుప్పకూలిపోదా? కృషి, చార్మినార్.. ప్రుడెన్షియల్ బ్యాంకుల నుంచి బిచాణా ఎత్తేసిన బ్యాంకులన్నీ ఇలా చేసినవే కదా? మార్గదర్శి చిట్స్లో ప్రస్తుతం వేలకోట్ల రూపాయల మనీ లాండరింగ్, అక్రమ నిధుల మళ్లింపు జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రబుత్వం విచారణ జరుపుతోంది. నిజాలు బయటికొస్తున్నాయి. కానీ దీన్ని ఈ నిజాలు వెలుగుచూడకుండా 86 ఏళ్ల రామోజీరావు కొత్త నాటకానికి తెరతీశారు. ‘ఈనాడు’ పత్రికను అడ్డంపెట్టుకుని, తటస్థుల ముసుగులో తన వాళ్లను తెరపైకి తెస్తున్నారు. అడ్డగోలు బుకాయింపులకు దిగుతున్నారు. మార్గదర్శిపై ఏ ఒక్క ఫిర్యాదూ రాలేదు కదా? అలాంటపుడు సీఐడీ విచారణ ఎందుకంటున్నారు. ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి ఇలా చేస్తోందని... తన వాళ్లచేత కేంద్రానికి లేఖలు కూడా రాయిస్తున్నారు. ఇక్కడ మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారు, డిపాజిటర్లు గమనించాల్సింది ఒక్కటే. యావత్తు దేశాన్ని కుదిపేసి దివాలా తీసిన శారదా చిట్ఫండ్స్గానీ, వేల మందిని ముంచేసిన సుదర్శన్ చిట్స్గానీ కూలిపోవటానికి ముందు చాలా బలంగా కనిపించినవే కదా? కూలిపోయేదాకా వాటిపై ఎవ్వరూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదే!!. ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోబట్టే... చట్టాలు ఉల్లంఘిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే అవి కుప్పకూలాయి. వేల మంది దాచుకున్న కష్టార్జితాన్ని స్వాహా చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శి చిట్స్ను... చట్టప్రకారం నడుచుకోవాలని కోరటం తప్పా? చట్టాలను అనుసరించాలని అడగటం నేరమా? ఇదెక్కడి తీరు!!. అయినా డిపాజిట్లు సేకరించకూడదన్న ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఎన్ని ఎన్బీఎఫ్సీలు మూతపడలేదు? కనీసం మార్గదర్శి చిట్ఫండ్స్ ఎన్బీఎఫ్సీ కూడా కాదు. ఒక 50 మంది చిట్ సభ్యులుంటే... ప్రతినెలా ప్రతి ఒక్కరి దగ్గరా సొమ్ములు వసూలు చేసి.. వాటిని చిట్ పాడుకున్న ఎవరో ఒక్కరికి ఆ నెల్లోనే ఇవ్వటం దాని పని. మరి ప్రతినెలా అలా ఎవరి చిట్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తున్నపుడు వేల కోట్ల రూపాయల మిగులు మొత్తాలు దానిదగ్గర ఎలా ఉంటాయి? వాటిని తన సొంత సంస్థల్లోకి మళ్లించే అధికారం ఎవరిచ్చారు? వాటిని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఉల్లంఘనలు కావా? పత్రికాధిపతి... వ్యాపారవేత్త అనే రెండు టోపీల్ని రామోజీరావు ధరిస్తుంటారని... వ్యాపారాల్లో అక్రమాలేవైనా బయటపడినపుడి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోబోయినపుడల్లా... అది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ఎదురుదాడికి దిగుతారని సాక్షాత్తూ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే గతంలో చెప్పింది. గతమంతా రామోజీ చేసింది ఇదే. కాకపోతే ఇపుడలా మాటలు పనిచేయటం లేదు. నమ్మేవారెవరూ లేరు. దీంతో ఆ మాటలు తాను చెప్పకుండా... తటస్థుల ముసుగులో తనకు కొమ్ముకాసే కొందరితో చెప్పిస్తున్నారు. అయినా అక్రమాలు చేస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్పై చర్యలు తీసుకుంటుంటే మధ్యలో ఈ తటస్థులెవరు? వీళ్లేమైనా మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారా? వీళ్లకేం సంబంధం? వీళ్లకసలు అక్రమాలకు పాల్పడుతున్న రామోజీని రక్షించే బాధ్యతను ఎవరిచ్చారు? రామోజీరావా... చంద్రబాబు నాయుడా? ఈ చట్టాలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదే? కేంద్ర చిట్ఫండ్ చట్టం–1982, రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999లను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్టు, అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. చందాదారులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీన్ని వక్రీకరిస్తూ రామోజీరావు మీడియా, చంద్రబాబు పార్టీ గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి ఈ రెండు చట్టాలూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినవేమీ కావు. చిట్ఫండ్ చట్టాన్ని కేంద్రం 1982లో రూపొందించింది. ఇక ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది 1999లో చంద్రబాబు ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే... దాన్ని రామోజీరావుపై వేధింపులుగా వక్రీకరిస్తున్నారు. చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ తరవాత దివాలాయే!! చిట్ఫండ్ చట్టాన్ని, డిపాజిటర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందన్నట్టుగా రామోజీరావు, ఆయన మనుషులు, టీడీపీ ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. సామాన్యుల డబ్బు భద్రంగా ఉండటం కోసం చేసిన ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందో... దేశంలో బట్టబయలైన ఎన్నో చిట్ఫండ్ కుంభకోణాలు, ప్రైవేట్ బ్యాంకుల ఆర్థిక దోపిడీలు నిరూపించాయి కూడా... శారదా చిట్ఫండ్... 4.90 లక్షల కోట్ల భారీ దోపిడీ 2013లో బట్టబయలైన శారదా చిట్ఫండ్ కుంభకోణం దేశంలోనే సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్, అసోం, త్రిపురలలో డిపాజిట్దారుల నుంచి ఏకంగా 4.90 లక్షల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. అధికవడ్డీల ఆశ చూపించి పోంజీ తరహా మోసానికి పాల్పడింది. 2013లో శారదా చిట్ఫండ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏకంగా 17 లక్షల మంది ఆ సంస్థ ఖాతాదారులు నిండా మోసపోయారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా పోంజీ తరహా మోసానికే పాల్పడుతోందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో వెల్లడి కావడం గమనార్హం. రూ.6,380కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే రాష్ట్రంలో వెలుగుచూసిన మరో ఆర్థిక మోసం అగ్రిగోల్డ్. గొలుసుకట్టు తరహాలో 8 రాష్ట్రాల్లో ఏకంగా రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అందులో రూ.3,996కోట్లు డిపాజిట్లు ఆంధ్ర ప్రదేశ్లో సేకరించినవే. ఇష్టం వచ్చినట్లుగా నిధుల్ని మళ్లించి సంస్థ బోర్డు తిప్పేసింది. ఫలితం... కష్టార్జితాన్ని దాచుకున్న 32 లక్షల మంది డిపాజిట్దారులు రోడ్డునపడ్డారు. వారిలో అత్యధికంగా 19.50 లక్షలమంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. అగ్రిగోల్డ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సంస్థకు చెందిన హాయ్లాండ్తోపాటు అమరావతిలో భూములను కొల్లగొట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక దశలవారీగా డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తూ వస్తోంది. పాతికేళ్ల కిందటే... ‘కృషి’ బ్యాంకు చంద్రబాబు సీఎంగా ఉండగా 2001లో కృషి బ్యాంకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఖాతాదారులను బురిడీ కొట్టించింది. అత్యధిక వడ్డీల ఆశ చూపించిన ఈ బ్యాంకు ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు... రూ.35కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ డిపాజిట్లు రూ.100 కోట్లకుపైనే ఉంటాయని సమాచారం. కొసరాజు ఆ నిధులను ఇతర సంస్థల్లోకి అక్రమంగా మళ్లించి చివరికి 2001లో చేతులెత్తేసి విదేశాలకు పారిపోయాడు. ప్రుడెన్షినల్... పాపులర్.. ఏదైనా అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2003లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో వెలుగు చూసిన మరో భారీ ఆర్థిక మోసం... ప్రుడెన్షియల్ బ్యాంకు. ఏకంగా రూ.550 కోట్ల మేర డిపాజిట్దారులను మోసం చేసింది ఆ సంస్థ. ఇక కేరళ కేంద్రంగా డిపాజిట్లు సేకరించిన పాపులర్ ఫైనాన్స్ సంస్థ ఏకంగా రూ.2వేల కోట్లమేర డిపాజిటర్లను మోసం చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 274 బ్రాంచులతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ 2022లో బోర్డు తిప్పేసి డిపాజిటర్లను ముంచేసింది. వీటన్నింటినీ మించిపోయిన మార్గదర్శి... పైన పేర్కొన్న సంస్థలను తలదన్నే రీతిలో మార్గదర్శి చిట్ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని ఆధారాలతో సహా వెల్లడైంది. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత ఏడాది నవంబరు, డిసెంబర్లలో మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. అనంతరం సీఐడీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సోదాల్లోనూ ఈ అక్రమాలు ధ్రువపడ్డాయి. ► రశీదు ముసుగులో అక్రమ డిపాజిట్లు: చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 నుంచి 5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తుస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడం నేరం. మార్గదర్శి చిట్స్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఈ అక్రమ డిపాజిట్లు ఎన్ని వేల కోట్లు అన్నది లెక్కతేలాల్సి ఉంది. ► గతంలో రూ.15వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరణ: మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన నేర చరిత్ర మార్గదర్శి గ్రూపునకు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో హడావుడిగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా సంస్థను మూసివేయడం అంటే ఆధారాలను ధ్వంసం చేయడమే. అది క్రిమినల్ నేరం. ► చందాదారుల సొమ్ము సొంత పెట్టుబడిగా...: మార్గదర్శి చిట్స్కు మూడు అనుబంధ కంపెనీలున్నట్టుగా బ్యాలన్స్ షీట్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడానికే ఈ కథ. ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాకోసం పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. అంటే రామోజీరావు కుటుంబం రూపాయి పెట్టకుండా...చందాదారుల సొమ్ముతోనే సొంత వ్యాపారాలు చేస్తున్నారు. అసలు చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. ► మార్గదర్శి చిట్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెడుతోంది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం. ► రికార్డుల కనికట్టు...: చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ మోసాన్ని కప్పిపుచ్చేందుకు మార్గదర్శి చిట్స్ రికార్డుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతోంది.చందాదారుల సొమ్ము చెక్కుల రూపంలో తమ వద్ద ఉన్నట్టుగా బ్యాలన్స్షీట్లో చూపిస్తోంది. ఏటా మార్చి 31న వందల కోట్ల రూపాయలు చెక్కులు వచ్చినట్టు చూపిస్తోంది. కానీ ఆ చెక్కులు ఎన్నిరోజులైనా క్యాష్ కావు. అంటే... అవి బోగస్ చెక్కులన్నమాట. అప్పటికే ఆ సొమ్మును మనీ లాండరింగ్ చేసేశారన్నది స్పష్టంగా తెలియకమానదు. ఏపీ ప్రజల సొమ్ము... పెత్తనం పక్క రాష్ట్రంలో: రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్కున్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదు. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. రాష్ట్రంలోని మార్గదర్శి ఫోర్మేన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తో సహా ఎలాంటి అధికారాలూ లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి ఎండీ శైలజతో పాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలలయంలోని 11మందికే ఉంది. ఇక్కడి చందాదారుల సొమ్ము భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే... తెలంగాణలో ఉంది కనక అది ఏపీ అధికారుల పరిధిలోకి రాదని చెబుతున్నారు. మరీ ఏపీ చందాదారుల సొమ్ముకు బాధ్యులెవరని అడిగితే... సమాధానం లేదు. ఒక్క బ్యాంకు ఖాతా చాలట...: చిట్ఫండ్ సంస్థలు తాము నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. అన్ని చిట్లకూ ఒకే బ్యాంకు ఖాతా. ఏపీకి సంబంధించి ప్రత్యేక ఖాతా కూడా లేదు. ► ఇదో పోంజీ తరహా స్కామ్: మార్గదర్శి చిట్స్ పోంజీ స్కీమ్కు తక్కువేమీ కాదు. చిట్టీల్లో 30 – 40శాతం టికెట్లు(సభ్యత్వాలు) యజమాన్యానివే. వాటికి తన తరఫున చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. కొత్త చిట్లు, ఇతర చిట్ల నుంచి వచ్చిన సొమ్మును తాము చెల్లించినట్టుగా రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. అంటే... ఏ రోజైనా కొత్తగా వచ్చే చందాదారులు తగ్గినా, కొత్త చిట్లు ఆగినా మార్గదర్శి తన తరఫున చెల్లించాల్సిన చందాను చెల్లించే పరిస్థితి ఉండదు. అప్పుడు చిట్ పాడుకున్నవారికి సొమ్ము చెల్లించే అవకాశమూ ఉండదు. అదేరోజున దివాలా తీసే ప్రమాదం ఉంటుంది. ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్ఫండ్ చట్టంలోని ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. వాటికోసం మార్గదర్శి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. నిధులు మళ్లించామని అంగీకరించిన రామోజీ సీఐడీ దర్యాప్తులో... తాము మార్గదర్శి చిట్స్ నిధులను ఇతర సంస్థలకు మళ్లించామని రామోజీరావే అంగీకరించారు. ఆధారాలతోసహా సీఐడీ అధికారులు ప్రశ్నించేసరికి ఆయన నోటమాట రాలేదు. దాంతో నిధులు మళ్లించింది వాస్తవమేనని అంగీకరిస్తూనే అది తమ ఆర్థిక ప్రణాళిక అన్నట్టుగా బుకాయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావే అక్రమాలు నిజమేనని సమ్మతించిన తరువాత ... మళ్లీ వక్రీకరిస్తూ వితండవాదనలెందుకు? చట్టాలు తమకు వర్తించవన్న శైలజ... మామ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివానన్నట్టుగా ఏ–2 చెరుకూరి శైలజ వ్యవహరించారు. అసలు చిట్ఫండ్ చట్టం తమకు వర్తించదని...తాము పట్టించుకోమని ఆమె సీఐడీ అధికారుల వద్దే వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామన్న ఆమె... పోనీ ఆ చట్ట ప్రకారమైనా అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లించడం నేరమే కదా అని అంటే మాత్రం సమాధానమివ్వలేదు. -
Margadarsi: అవును.. మళ్లించాం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ విచారణలో శైలజా కిరణ్ దాదాపుగా అంగీకరించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు ఇప్పటికే నిధులు మళ్లించామని సీఐడీ విచారణలో పరోక్షంగా అంగీకరించారు. తాజాగా చెరుకూరి శైలజ కూడా నిధులు మళ్లించినట్టు సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దేశంలో చట్టాలకు తాము అతీతం అన్నట్టుగా ఆమె సీఐడీ అధికారుల ఎదుటే అడ్డగోలుగా వాదించడం విస్మయపరుస్తోంది. చిట్ఫండ్స్ వ్యాపారం చేస్తూ కేంద్ర చిట్ఫండ్స్ చట్టం తమకు వర్తించదని దబాయించడం రామోజీరావు, ఆయన కుటుంబం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఐడీ అధికారులకు రికార్డులు చూపించబోమని శైలజా కిరణ్ భీష్మించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజను సీఐడీ అధికారులు గురువారం హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని ఆమె నివాసంలో విచారించారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్, విచారణ అధికారి రవికుమార్లతోపాటు 25 మంది అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించింది. శైలజ తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులతోపాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా విచారణ ప్రక్రియ సమయంలో ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన విచారణ ప్రక్రియను సీఐడీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 75 ప్రశ్నలకు వివరాలు రాబట్టి వాంగ్మూల పత్రంపై శైలజ సంతకం తీసుకున్నారు. గతంలో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా శైలజ నుంచి పలు కీలక విషయాలను సీఐడీ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి... చందాదారుల సొమ్మును మళ్లించాం మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీల్లో సేకరించిన పలు కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సీఐడీ అధికారులు శైలజను విచారించారు. ప్రధానంగా చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత పెట్టుబడులుగా పెట్టడం, మ్యూచ్వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడంపై ప్రశ్నించినట్లు సమాచారం. మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులను రామోజీ గ్రూపునకు చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ (కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నైలలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్ నోట్ నంబర్ 40లో పేర్కొన్న విషయాన్ని ఆమెకు చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఏకంగా 88.5 శాతం వాటా మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిటే ఉంది. ‘‘అవును.. మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులను ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం..’ అని శైలజ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన అభియోగమైన అక్రమంగా నిధుల మళ్లింపునకు సంబంధించి సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్లైంది. కంపెనీల చట్టం అనుసరిస్తామంటూ... అంతలోనే తెలీదంటూ సీఐడీ అధికారులు అదే విషయంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తాము కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామని శైలజ పేర్కొనట్లు సమాచారం. చిట్ఫండ్స్ వ్యాపారానికి కంపెనీల చట్టంతో నిమిత్తం లేదని, అనుసరించాల్సింది కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982 కదా? అని అధికారులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. పోనీ కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నారని భావించినా... ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.5 శాతం వాటాతోపాటు మరో రెండు కంపెనీల్లో మార్గదర్శి చిట్ఫండ్స్ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్లో చూపించారు కదా? అని అధికారులు ప్రశ్నించడంతో అవునని ఆమె సమాధానమిచ్చారు. కంపెనీల చట్టం ప్రకారం 50 శాతానికి మించి వాటా కలిగి ఉంటే అనుబంధ కంపెనీగానే పరిగణిస్తారు కదా? అని తిరిగి ప్రశ్నించగా అందుకు కూడా ఆమె అవుననే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. అంటే మార్గదర్శి చిట్ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు కంపెనీల్లో 88 శాతం పెట్టుబడులు పెట్టి అనుబంధ కంపెనీగా ఉన్నట్టే కదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె మౌనం వహించినట్టు సమాచారం. అటు చిట్ఫండ్స్ చట్టం.. ఇటు కంపెనీల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు ఆమె సమ్మతించినట్టైంది. ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల చెక్కులు.. విచారణ సందర్భంగా సీఐడీ మరో కీలక ఆధారాన్ని సేకరించింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లిస్తున్న రామోజీరావు, శైలజ రికార్డుల్లో మాత్రం చట్టాన్ని ఏమార్చేందుకు యత్నించారని నిరూపితమైంది. 2022 మార్చి 31న రూ.255 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్యాలన్స్ షీట్లో చూపించారు. కానీ ఆ చెక్కులేవీ తరువాత నగదుగా మారినట్లు (ఎన్క్యాష్)గా రికార్డుల్లో లేవని సీఐడీ అధికారులు గుర్తించారు. గరిష్టంగా పది రోజుల్లో చెక్కులను నగదుగా జమ చేస్తామని శైలజ పేర్కొన్నారు. మరి గతేడాది మార్చి 31న వచ్చినట్లు చూపించిన రూ.255 కోట్ల చెక్కులేవీ నగదుగా మారినట్లు రికార్డుల్లో ఎందుకు లేవని సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజ తెల్లమొహం వేశారని సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నా అవి నగదుగా మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఏటా చందాదారులు చెల్లిస్తున్న రూ.వందల కోట్లను మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ నిధులు ఉన్నట్లుగా చూపించాల్సి రావడంతో చెక్కులు వచ్చినట్లు చూపించి కనికట్టు చేస్తోంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో మార్గదర్శి ఆడిటర్ శ్రావణ్ ఇదే విషయాన్ని అంగీకరించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి కానీ.. చూపించను లేని చెక్కులు ఉన్నట్టుగా చూపించి మోసానికి పాల్పడినట్టు నిరూపితం కావడంతో శైలజ షాక్కు గురయ్యారు. దాంతో సీఐడీ అధికారులను పక్కదారి పట్టించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ‘ఆ చెక్కుల సమాచారం అంతా ప్రధాన కార్యాలయంలో ఉంటుంది... నాకు తెలీదు’ అని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించగా ఆమె నిరాకరించారు. పోనీ మార్గదర్శి సిబ్బంది ద్వారానైనా ఆ వివరాలు అందించాలని సూచించగా అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా చెక్కుల రికార్డులు పరిశీలిస్తామని చెప్పినా ఆమె ససేమిరా అన్నారు. అంటే చెక్కుల వివరాలు మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో కూడా లేవా? అని ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చినట్లు సమాచారం. ఏపీ రికార్డులు ప్రత్యేకంగా లేవు చిట్ఫండ్స్ చట్టం ప్రకారం చిట్ఫండ్ కంపెనీలు ఏ రాష్ట్రానికి సంబంధించిన రికార్డులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిర్వహించాలి. అక్కడి చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, చిట్టీల వివరాలు, ఆదాయ– వ్యయాలు, బ్యాలన్స్షీట్ను ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ నిబంధనను మార్గదర్శి చిట్ఫండ్స్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, ఇతర వివరాలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల రికార్డులతో పాటు కలిపి నిర్వహిస్తోంది. మార్గదర్శి చందాదారుల్లో సింహభాగం అంటే 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఉన్నారు. ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. రామోజీరావు కుటుంబానికి చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ రికార్డుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించగా తాము అలాగే రికార్డులు నిర్వహిస్తామని శైలజ చెప్పినట్టు సమాచారం. నీళ్లు నమిలి... నీళ్లు తాగి సీఐడీ అధికారులు నిబంధనలు పాటిస్తూ శైలజా కిరణ్ను విచారించారు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించకపోయినా సరే ఇబ్బంది పెట్టకుండా...ఒత్తిడి చేయకుండా ప్రశ్నలు సంధించారు. గురువారం రోజు మధ్యాహ్నం వరకు సాగిన మొదటి విడతలో చాలా ప్రశ్నలకు నాకు తెలియదు.. గుర్తులేదు...నాకు సంబంధం లేదు అంటూ ఆమె సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. మధ్యాహ్న భోజన విరామం తరువాత సీఐడీ అధికారులు విచారణ జోరు పెంచారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఆమె ముందు ఉంచుతూ ఒక్కొక్క అంశంపై ప్రశ్నించారు. దీంతో శైలజకు నోట మాట రాలేదు. కాదు అని చెప్పేందుకు అవకాశం లేదు. ఎదురుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాంతో చాలా ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆమె పలుసార్లు తనకు దాహం వేస్తోందంటూ బయటకు వెళ్లి వచ్చారు. తమ ఆడిటర్లు, ఇతరులతో సంప్రదించి వచ్చి నాకు తెలియదు.. గుర్తు లేదు అని సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. చూపు సరిగా లేదు.. కనిపించడం లేదు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ల్యాప్టాప్లో సీఐడీ అధికారులు శైలజకు చూపించారు. నిధులు మళ్లించినట్టు అందులో ఉన్న వివరాలను చూపిస్తూ అవి వాస్తవమేనా? అని అడిగారు. అయితే ఆ పత్రాలు తనకు కనిపించడం లేదని... అక్షరాలు చిన్నవిగా ఉన్నాయని ఆమె పేర్కొనడంతో సీఐడీ అధికారులు ల్యాప్టాప్లో ఎన్లార్జ్ చేసి మరీ చూపించారు. ‘నాకు చూపు సరిగా లేదు... ఆ పత్రాల్లో ఏముందో కనిపించడం లేదు’ అని శైలజ పేర్కొనడంతో సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆ పత్రాలు చూపించారు. అవి తనకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పడంతో పాటు అందులో ఏముందో చదివి వినిపించారు. దీంతో తనకు ఏమీ కనిపించడంలేదని తప్పించుకునేందుకు శైలజ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మాకు ఏ చట్టాలు వర్తించవు.. మా చట్టం మాకుంది చందాదారులు చెల్లించిన నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982కు వ్యతిరేకం కదా...! ఆ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం అందుకు రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని తెలుసు కదా..? అని సీఐడీ అధికారులు శైలజను ప్రశ్నించారు. అయితే అసలు చిట్ఫండ్స్ చట్టమే తనకు తెలియదని ఆమె చెప్పడంతో సీఐడీ అధికారులు విస్తుపోయారు. చిట్ఫండ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మీకు అసలు చిట్ఫండ్స్ చట్టమే తెలియదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. చిట్ఫండ్స్ చట్టం– 1982ను తాము అనుసరించబోమని ఆమె సమాధానం ఇవ్వడంతో నివ్వెరపోవడం సీఐడీ అధికారుల వంతైంది. మరి చిట్ఫండ్స్ వ్యాపారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా.. మా చట్టాలు మాకున్నాయి... వాటి ప్రకారం చేస్తున్నాం అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. చిట్ఫండ్స్ కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం 1982లోనే చేసిన చట్టం గురించి కూడా తెలుసుకోకుండా... అసలు ఆ చట్టాన్ని పట్టించుకోకుండా చిట్ఫండ్స్ వ్యాపారం చేస్తున్నామని శైలజ చెప్పడం గమనార్హం. రామోజీ, శైలజను అమరావతిలో విచారిస్తాం ‘మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజను త్వరలో అమరావతిలో మరోదఫా విచారిస్తాం. ఈ కేసులో ఇప్పటికే వారిద్దరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేశాం. వాటిని విశ్లేషించిన అనంతరం మరి కొన్నిసార్లు విచారించాల్సి ఉంటుంది. ఈసారి వారిద్దరూ విచారణ కోసం అమరావతికి రావాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు విచారణ కొనసాగుతోంది. శైలజ ఈ నెల 13న విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు ఇప్పటికే సమాచారమిచ్చాం. ఈదఫా ఆమెను అమరావతిలో విచారిస్తాం’ – అమిత్ బర్దర్, ఎస్పీ, సీఐడీ -
విచారణకు అమరావతి రావాలని మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు అమరావతి సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. అవసరమైతే రామోజీని విచారిస్తామని, ఆయన కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్ను సీఐడీ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్న సీఐడి బృందం శైలజ కిరణ్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేశారు. ఇదిలా ఉండగా, మార్గదర్శి చిట్ఫండ్స్.. కేంద్ర చిట్ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది. -
Margadarsi: నిజమే.. నిధులు మళ్లించాం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు సీఐడీ విచారణను తప్పించుకునేందుకు ఆడిన డ్రామాలు ఫలించలేదు. విచారించాల్సింది తనను కాదని, మార్గదర్శిలో కిందిస్థాయి సిబ్బందినంటూ తప్పించుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలు పారలేదు. తన ఆరోగ్యం బాగా లేదని రామోజీరావు చెబుతున్నవి సాకులేనని ఆయన వ్యక్తిగత వైద్యుడే పరోక్షంగా సమ్మతించడంతో విచారణకు అంగీకరించక తప్పలేదు. చిట్ఫండ్ చట్టం, రిజర్వ్బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ రామోజీరావు సీఐడీ అధికారులు రామోజీరావును హైదరాబాద్లో సోమవారం దాదాపు 8 గంటలపాటు విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కేంద్ర చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధుల మళ్లింపు, రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్ల సేకరణపై ఆధారాలతో విచారించారు. ఈ కేసులో ఏ–2గా ఉన్న రామోజీరావు కోడలు, మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించనున్నారు. అనంతరం కేసు దర్యాప్తులో పురోగతిని సమీక్షించి రామోజీరావు, శైలజను ఆంధ్రప్రదేశ్కు పిలిచి మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రామోజీరావును విచారించిన అనంతరం బయటకు వస్తున్న అధికారులు తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం.. మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు చివరి వరకూ ప్రయత్నించారు. రామోజీరావు, శైలజ హైదరాబాద్లోనే వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. నాలుగు తేదీలు సూచించి వారికి అనువైన రోజు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు కాలయాపన చేశారు. చివరికి మార్చి 3న రామోజీ ఫిల్మ్సిటీలోని తన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని సీఐడీకి తొలుత సమాచారం ఇచ్చారు. తీరా సోమవారం రోజు ఫిల్మ్సిటీలో కాకుండా జూబ్లీహిల్స్లోని తన కోడలు శైలజ కిరణ్ నివాసంలో విచారణకు హాజరవుతానని పేర్కొనగా అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు. ఈ మేరకు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్, విచారణాధికారి రవికుమార్తోపాటు అధికారుల బృందం జూబ్లీహిల్స్లోని శైలజ నివాసానికి ఉదయం 10.30 గంటలకు చేరుకుంది. సీఐడీ అధికారులు రావడమే ఆలస్యం తన ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు సహకరించలేనని రామోజీ పేర్కొన్నారు. అనారోగ్యానికి కారణాలు, నివేదికలు అందచేసి విచారణకు హాజరు కాలేరని ధృవీకరించాలని రామోజీరావు వ్యక్తిగత వైద్యుడిని సీఐడీ అధికారులు కోరారు. దీంతో రామోజీని విచారించవచ్చని, మంచంపై పడుకుని సమాధానాలు ఇస్తారని ఆయన వైద్యుడు చెప్పడంతో అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు. ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, కేసును సక్రమంగా విచారించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక తప్పదని స్పష్టం కావడంతో సీఐడీ అధికారుల విచారణకు రామోజీ సమ్మతించారు. ఆడియో...వీడియో రికార్డింగ్ విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించారు. ఈ ప్రక్రియ మొత్తం రికార్డింగ్ చేశారు. రామోజీ పడుకున్న మంచం సమీపంలోనే వేర్వేరు కోణాల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయనకు కాస్త దూరంగానే సీఐడీ అధికారులు కూర్చున్నారు. విచారణ సందర్భంగా రామోజీరావు చెప్పిన సమాధానాలు, ఆయన హావభావాలు అన్నీ రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ సందర్భంగా సీఐడీ అధికారుల బృందం అక్కడ కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. తమకు కావల్సిన ఆహారం, మంచినీళ్లు అంతా బయట నుంచే తెచ్చుకున్నారు. సహకరించని రామోజీ సీఐడీ అధికారులు విచారణ మొదలు పెట్టిన తరువాత రామోజీరావు సమాధానాలు చెప్పేందుకు చాలాసేపు ససేమిరా అన్నారు. సీఐడీ పరిధినే ప్రశ్నిస్తూ తనను అసలు విచారించడానికే వీల్లేదన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. తాను విచారణ సంస్థలకు అతీతమన్నట్టు మొండిగా వ్యవహరించారు. దీంతో చట్ట నిబంధనలను తెలియచేస్తూ సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియ కొనసాగించారు. చిట్ఫండ్స్లో అక్రమ వ్యవహారాలన్నింటికీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్మెన్), అకౌంటెంట్లదే బాధ్యతని, తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు రామోజీరావు ప్రయత్నించారు. బ్రాంచి కార్యాలయాల్లోనే అన్ని వ్యవహారాలు సాగినందున వారినే ప్రశ్నించాలని మొండికేసినట్లు తెలుస్తోంది. బ్రాంచి మేనేజర్లకు రూ.500కు మించి చెక్పవర్ లేనప్పుడు భారీగా నిధుల బదిలీపై వారిని మాత్రమే ఎలా బాధ్యులను చేస్తామని సీఐడీ అధికారులు ఎదురు ప్రశ్నించడంతో రామోజీరావు మౌనం వహించారు. బ్రాంచిల నుంచి నిధులన్నీ హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలింపుపై కూడా తనకు సంబంధం లేదని రామోజీ వాదించారు. మరి చెక్ పవర్ మార్గదర్శి ఎండీ శైలజ, ప్రధాన కార్యాలయంలోని మరో 10 మంది వద్ద ఎందుకు ఉందని విచారణ అధికారులు ప్రశ్నించడంతో రామోజీ సమాధానం చెప్పలేకపోయారు. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన ఆదాయం అంతా చైర్మన్, ఎండీలుగా వారే ప్రయోజనం పొందుతున్నప్పుడు కేవలం జీతాలకు పనిచేసే మేనేజర్లు ఎలా బాధ్యులవుతారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నిధులు మళ్లింపు, అక్రమ డిపాజిట్లపై.. విచారణలో సీఐడీ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులు అక్రమంగా బదిలీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, రికార్డుల నిర్వహణలో అవకతవకలపై ప్రశ్నించినట్లు సమాచారం. మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలు, బ్రహ్మయ్య అండ్ కో చార్టెడ్ అకౌంటెంట్ శ్రావణ్ ఇచ్చిన వాంగ్మూలం కాపీలను చూపిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసేందుకు రామోజీరావు ప్రయత్నించారు. కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల కాపీలు, బ్యాలన్స్ షీట్ల కాపీలను చూపిస్తూ అధికారులు ప్రశ్నించడంతో ఇక మాట్లాడలేకపోయారని తెలుస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లోని నిధులను ప్రధాన కార్యాలయానికి మళ్లించడం నిజమా.. కాదా? అని సూటిగా ప్రశ్నించడంతో అవునని రామోజీ అంగీకరించాల్సి వచ్చింది. చిట్ఫండ్స్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్వల్ ఫండ్స్, ఇతర షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన ఆధారాలను కూడా సీఐడీ అధికారులు చూపించి ప్రశ్నించగా అదంతా మార్గదర్శి ఆర్థిక ప్రణాళికలో భాగమని రామోజీ చెప్పినట్టు సమాచారం. అంటే చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వాస్తవమే కదా? అని ప్రశ్నించడంతో ఔనని రామోజీరావు అంగీకరించారని సమాచారం. చిట్టీల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రశీదు’ మాత్రమే ఇస్తూ 5శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయంపై కూడా సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు. తాము అట్టిపెట్టుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నాం కదా అందులో అక్రమం ఏముందనీ రామోజీరావు ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వడ్డీ చెల్లిస్తామని చెప్పి నగదును అట్టిపెట్టుకోవడం అంటే అది డిపాజిట్ సేకరణే అవుతుంది కదా... చిట్ఫండ్ కంపెనీలను డిపాజిట్ల సేకరణకు రిజర్వ్బ్యాంకు అనుమతించిందా? అంటే రామోజీరావు స్పందించకుండా మౌనం వహించారని సమాచారం. అంటే మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు నమోదు చేసిన అభియోగాలన్నీ దాదాపు వాస్తవమేనని ఆయన పరోక్షంగా సమ్మతించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు, ఆడిటింగ్ వ్యవహారాలు చూసిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా నిధులు మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్లకు పాల్పడినట్టు సమ్మతించారు. తదుపరి విచారణ ఏపీలో! మార్గదర్శి వ్యవహారంలో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. అందుకోసం రామోజీరావు, శైలజలను త్వరలో ఆంధ్రప్రదేశ్కు రప్పించి విచారించాలని భావిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం(సీన్ ఆఫ్ అఫెన్స్) ఆంధ్రప్రదేశ్ కాగా మన రాష్ట్రంలోని చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు తీరును సమీక్షించిన అనంతరం తదుపరి విచారణ కోసం రామోజీరావు, శైలజలను రాష్ట్రానికి రప్పించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వారు ఎంపిక చేసుకున్న నగరంలో విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. స్టేట్మెంట్ విశ్లేషించాక తదుపరి చర్యలు: అమిత్ బర్దార్, ఎస్పీ ‘మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ వ్యవహారాలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. రామోజీరావును విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేశాం. అది విశ్లేషించాల్సి ఉంది. మార్గదర్శి ఎండీ శైలజను ఈ నెల 6న విచారిస్తాం. కేసులో కనుగొన్న ఆధారాలు, పురోగతిని బట్టి తదుపరి చర్యలు చేపడతాం’ -
Margadarsi: అక్రమాలు నిజం!
సాక్షి, అమరావతి: ప్రతి ఏటా మార్చి 31న రూపొందించే బ్యాలెన్స్షీట్లో... చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అప్పులకు సమానంగా తమ వద్ద వందల కోట్ల రూపాయల చెక్కుల రూపంలో, మరికొన్ని వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. వాటిని తమ ఆస్తులుగా పేర్కొంటున్నారు. మరి ఆ చెక్కుల్ని తదుపరి కాలంలో ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి కదా? ఆ నగదును సంస్థ అవసరాల కోసం ఖర్చు చేయాలి కదా? విచిత్రమేంటంటే అందులో పేర్కొన్న చెక్కుల్లో ఒక్క చెక్కు కూడా తరువాతి కాలంలో సంస్థ ఖాతాలోకి వచ్చిన దాఖలాలు ఉండటం లేదు. నగదు పరిస్థితి కూడా అంతే!!. అంటే ఆ చెక్కులు గానీ, ఆ నగదు కానీ వాస్తవంగా కంపెనీ దగ్గర ఉన్నవి కావన్న మాట!!. వాటిని అప్పటికే వేరే సంస్థల ఖాతాల్లోకో, ఇతరత్రా అవసరాలకో మళ్లించేశారు. కానీ... అవన్నీ తమ వద్దే ఉన్నట్లుగా తప్పుడు బ్యాలెన్స్షీట్ ద్వారా మభ్య పెడుతున్నారు. తమ సంస్థ తగిన ఆస్తులతో బలంగానే ఉన్నదని ఒకవైపు చిట్లు వేస్తున్న చిట్ దారులను, మరోవైపు నియంత్రణ సంస్థలను నమ్మిస్తున్నారు. ఇదీ.. రామోజీరావు నడిపిస్తున్న ‘మార్గదర్శి’ అసలు కథ. మార్గదర్శి సంస్థను ఆడిట్ చేస్తున్న ఆడిటింగ్ సంస్థల ప్రతినిధి నేరుగా దర్యాప్తు సంస్థ ఎదుట అంగీకరించిన వాస్తవం. ఇదే కాదు. తనిఖీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మార్గదర్శిలో... ఎక్కడ ఏ సోదా జరిపినా నివ్వెరపోయే నిజాలే వెలుగుచూస్తున్నాయి. వాస్తవాలను బయటకు వెల్లడించకపోవటం ద్వారా.. చిట్లు వేస్తున్నవారికి తమ సొమ్ము ఎంత భద్రంగా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారు. అంతేకాదు.. డిపాజిట్లు తీసుకోవటాన్ని నిషేధించినా సరే... వాటిని ఇతరత్రా రూపాల్లో తీసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. చట్టాలను పరిహాసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని మార్గదర్శి ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో కంపెనీలో సీఐడీ జరిపిన తనిఖీల్లో వెల్లడైన పలు అక్రమాలు బయటపడ్డాయి. చార్టర్డ్ అకౌంటెంట్కు 14 రోజుల రిమాండ్... మార్గదర్శి చిట్ఫండ్స్ బ్యాంకు లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పలు అవకతవకలున్నట్లు మార్గదర్శి చిట్స్కు ఆడిటర్గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కో ప్రతినిధి సీఐడీ విచారణలో వెల్లడించారు. దాంతో బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా... చందాదారుల సొమ్మును తరలించటం, మ్యూచ్వల్ ఫండ్స్లోను, షేర్లలోను అక్రమంగా పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరించడం చేసినట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బ్రహ్మయ్య అండ్ కో సంస్థ రికార్డులను తనిఖీ చేసి, ఆ సంస్థ సీఏ శ్రావణ్ను విచారించారు. ఈ విచారణలో మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి ఖాతాలు సవ్యంగానే ఉన్నాయని ఏటా ఆడిట్ నివేదిక ఇస్తున్న ఈ సంస్థ... అసలు మార్గదర్శి చిట్స్ బ్యాంకు ఖాతాలు, రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నివేదిక ఇస్తున్నట్లు సదరు చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించటం గమనార్హం. ఇలాంటి డిపాజిట్లు ప్రమాదకరమే? ► చిట్లు వేసేవారిలో కొందరు చిట్ను పాడుకుంటారు కానీ... ఆ డబ్బును తీసుకోవటానికి అవసరమైన ష్యూరిటీలను కంపెనీకి సబ్మిట్ చేయలేరు. మరికొందరైతే రకరకాల కారణాల వల్ల పాడుకున్న మొత్తాన్ని తీసుకోకుండా భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన చిట్ మొత్తానికి సంబంధించి దాన్ని సదరు చిట్ఫండ్ సంస్థ వద్దే వదిలిపెడతారు. ఇంకొందరైతే ఓ రెండు మూడు నెలలు ఉంన్నపుడు చిట్ను పాడుకుని... ఆ మిగిలిన నెలల ఫ్యూచర్ చిట్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని సంస్థ దగ్గరే వదిలేస్తారు. అయితే ఏ చిట్ఫండ్ సంస్థయినా తమ ప్రతి బ్రాంచి కార్యాలయంలోనూ... అక్కడి చిట్టీలకు సంబంధించిన ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా రెండో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుండాలి. ఇలా ఫ్యూచర్ చిట్ల మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఏ ఒక్క బ్రాంచిలోనూ ఇలా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వేరే బ్యాంకు ఖాతా తెరవలేదు. అన్నిచోట్ల నుంచీ ఆ మొత్తాన్ని హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తోంది. దానికో రశీదు ఇస్తూ 4–5 వడ్డీ చెల్లిస్తోంది. ఇది అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయటమే. చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ డిపాజిట్లను గనక ఏ ఆర్బీఐనో జప్తు చేస్తే..? చిట్దారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. అయినా సరే మార్గదర్శి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లు సక్రమమేననే రీతిలో బ్రహ్మయ్య అండ్ కో సంస్థ నివేదిక ఇవ్వటం విస్మయం కలిగించేదే!!. ► ఇక మార్గదర్శి చిట్ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల ఖాతాలు, తమ పెట్టుబడలు వివరాలను బహిర్గతం చేయటం లేదు. గోప్యంగా ఉంచుతోంది. ఇది చిట్ఫండ్ చట్టానికి విరుద్ధం. అయినా సరే బ్రహ్మయ్య అండ్ కో ఇది పట్టించుకోకుండా అంతా సక్రమంగానే ఉందని ఆడిట్ నివేదిక ఇచ్చేస్తోంది. అక్రమాలు వాస్తవమే: బ్రహ్మయ్య సంస్థ సీఏ శ్రావణ్ సీఐడీ దర్యాప్తు సందర్భంగా బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ కీలక విషయాలు వెల్లడించారు. తాము అసలు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక జారీ చేస్తున్నామని అంగీకరించారు. మార్గదర్శి చిట్స్ ఆదాయ– వ్యయాలు, ఆస్తి– అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పలేకపోయారు. ఒక్కో బ్రాంచి బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు చూపిస్తున్న వందల కోట్ల రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తరువాత అవి ఎక్కడికి మాయమయ్యాయి? అనేది ఆయన ఏమాత్రం చెప్పలేకపోయారు. ఆ వివరాలేవీ తనకు తెలియవని ఆయన అంగీకరించారు. -
మార్గదర్శి కేసులో శైలజాకిరణ్కు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ నెల 29 లేదా 31వ తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇళ్లు లేదంటే ఆఫీస్లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది. -
Skill Development Scam: ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్డెవలప్మెంట్ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లో విచారణ విభాగానికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. భాస్కర్ రిమాండ్ను ఏసీబీ కోర్టు సస్పెండ్ చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది హైకోర్టు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. -
తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: సీఐడీ విచారణలో నారాయణ తీరు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు. ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు. ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు. -
టీడీపీ పెద్దల అక్రమాలు బట్టబయలు.. నా‘రాబంధువులే’!
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల్లో వాలిపోయిన భూ రాబందుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బడుగు, బలహీన వర్గాల రైతులను బెదిరించి 932.72 ఎకరాల అసైన్డ్ భూములను పచ్చ గద్దలు కాజేసినట్లు వెల్లడైంది. గ్రామాలవారీగా ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూముల అక్రమాల చిట్టా రట్టైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014– 18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు సీఐడీ దర్యాప్తులో ఆధార సహితంగా, రియల్ ఎస్టేట్ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయి. ఇప్పటివరకు బట్టబయలైన అసైన్డ్ భూములు 932.72 ఎకరాలు. చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్ విలువ ఏకంగా రూ.3,730.88 కోట్లకు పైమాటే! కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తులో మరిన్ని అసైన్డ్ బాగోతాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. కార్యాలయాల వారీగా రికార్డుల పరిశీలన.. రాజధాని అమరావతి ప్రాంతంలో 2014 నాటికి ఎస్సీ, బీసీ రైతుల పేరిట ఉన్న అసైన్డ్ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. సీఐడీ దర్యాప్తులో గుర్తించిన అసైన్డ్ భూముల రికార్డులను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించారు. అమరావతి పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు నిర్ధారించారు. భూ సమీకరణ కోసం ఏర్పాటైన సీఆర్డీఏ కార్యాలయాల వారీగా రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. మొత్తం 23 సీఆర్డీఏ కార్యాలయాల పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణం తరువాత అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ కనీసం రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఆ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932.72 ఎకరాల అసైన్డ్ భూముల మార్కెట్ విలువ రూ.3,730.88 కోట్లకు పైమాటేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం అసైన్డ్ అక్రమాలు రూ.5,600 కోట్లు! సీఐడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అసైన్డ్ భూముల అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలో మొత్తం 1,400 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గతంలోనే సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూముల విలువ రూ.5,600 కోట్లని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘నారా’యణ బంధువులు, బినామీలే.. అసైన్డ్ భూముల అక్రమాల తీగ లాగితే నారా చంద్రబాబు, పొంగూరు నారాయణ బంధువులు, బినామీల ఇళ్లల్లో డొంక కదులుతోంది. బినామీలు, బంధువుల పేరిట అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు, ఆయన సమీప బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ చిరుద్యోగుల పేరిట అసైన్డ్ భూములను కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన 932.72 ఎకరాల అసైన్డ్ భూముల సేల్డీడ్లు, జీపీఏలను సీఐడీ అధికారులు విశ్లేషించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ‘ఎన్స్పైర’లో కీలక ఆధారాలు స్వాధీనం మాజీ మంత్రి పి.నారాయణ కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని ‘ఎన్ స్పైర’ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు బుధవారం ముగిశాయి. కంప్యూటర్ హార్డ్డిస్క్లు, బ్యాంకు ఖాతా లావాదేవీల పత్రాలు, ఇతర కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. మునుముందు మరిన్ని కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. -
‘అసైన్డ్’ ప్లాట్లు అమ్ముతాం! అమరావతిలో పచ్చ గ్యాంగ్ నయా దందా
సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు. ఇదీ ఉద్యమ నేత తీరు.. ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది. రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు. వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్గా మారింది. సీఐడీ దర్యాప్తుతో బెంబేలు అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి. -
వాహనాల అడ్వాన్స్ అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటుగా సీఐడీ విచారణ చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్షించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీ)గా పనిచేస్తున్న వారిలో ఏడాదికాలం సర్వీసును పూర్తి చేసిన వారిని సొంత శాఖలకు వెనక్కు పంపాలని మంత్రి ఆదేశించారు. -
తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది. దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇటూ అటూ బాబు బినామీలే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ను ముందుగానే మాస్టర్ ప్లాన్లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్మెంట్ను డిజైన్ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. చదవండి: ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత -
అయ్యన్నపాత్రుడిని సీఐడీ విచారించుకోవచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి చుక్కెదురైంది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41ఏ నోటీసు ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడిని, ఆయన తనయుడు రాజేష్ను సీఐడీ విచారించుకోవచ్చని తెలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. -
చట్ట ప్రకారమే టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరెస్ట్
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తులో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని సీఐడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసిన ప్రతిసారీ వారిని అధికారులు కొట్టారంటూ దుష్ప్రచారానికి పాల్పడటాన్ని ఖండించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేసినట్టు వెల్లడించింది. ‘గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి భార్య.. అందుకు సహకరించిన ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు.. ఆ మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలిపింది. నరేంద్రబాబు తన ఫోన్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్లు పోస్టు చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పింది. ఆయన్ని విచారించేందుకు ఇంటికి వెళ్లగా ఆయన తన ఫోన్లోని మెసేజ్లను డిలీట్ చేసేందుకు యత్నించారని తెలిపింది. దాంతో ఐపీసీ సెక్షన్ 201ను అదనంగా నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆ ప్రకటనలో సీఐడీ వెల్లడించింది. -
నెటాప్స్ ముసుగులో టెర్రర్ సాఫ్ట్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కీలక పురోగతి టీడీపీ హయాంలో ఇన్క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి ► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. ► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా?
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ ఐటీ విభాగమైన ఐటీడీపీ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్ని బాధ్యుడిగా చేస్తూ సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విజయ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని విజయ్ను ఆదేశించింది. సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది. ఇలాంటి కేసులో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేందుకు నిర్దిష్ట యంత్రాంగం లేదన్న కారణంతో ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతూ కొందరు చెలరేగిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇందుకు హైకోర్టు న్యాయమూర్తులు సైతం బాధితులుగా మారారని తెలిపింది. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వీటిపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీఐడీ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. విజయ్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్తో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. 41ఏ నోటీసు ఇవ్వడానికి పిటిషనర్ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు భయానక వాతావరణం సృష్టించారన్నారు. పిటిషనర్కు మాత్రం నోటీసు ఇవ్వలేదన్నారు. సీఐడీ తరపు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. నోటీసు ఇచ్చేందుకే పోలీసులు పిటిషనర్ ఇంటికి వెళ్లారని చెప్పారు. పిటిషనర్పై పెట్టిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల అరెస్ట్ చేసే అవకాశం లేదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
సీఐడీ విచారణకు హాజరుకాని చింతకాయల విజయ్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్.. సీఐడీ విచారణకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీ దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక ఐ–టీడీపీ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం దీంతో ఆయనపై క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరుకావల్సిందిగా ఈ నెల 1న హైదరాబాద్లోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. కానీ విజయ్ మాత్రం విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు, ఇతర వివరాలు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను విజయ్ తరఫు న్యాయవాదులు సీఐడీ కార్యాలయంలో అందించారు. -
సైకోలా అయ్యన్న తీరు
దేవరాపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైకో చేష్టలు మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. వైఎస్సార్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలను సహించబోమని హెచ్చరించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటంపై సీఐడీ అధికారులు చింతకాయల విజయ్కు 41 ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అయ్యన్న అనుచిత వాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తప్పు చేయకుంటే సీఐడీ విచారణను ఎదుర్కోవాలన్నారు. నర్సీపట్నంలో యువకుడి చేతిలో ఓటమి చెందడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
ఫేక్ పోస్టులపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి : ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు. దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అది ‘ఐ–టీడీపీ’ పనే
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు మంగళవారం ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఐ–టీడీపీ’, మరికొందరిపై ఐటీ(66టి), ఐపీసీ 465, 469, 471, 153(ఎ), 505(2), 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరుతో ఇటీవల ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ మాధవ్ పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో అనంతపురం పోలీసులు విచారించగా, అది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయ్యింది. ఆ మార్ఫింగ్ వీడియోను ఐ–టీడీపీ సోషల్ మీడియా గ్రూప్ తొలుత సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్టు కూడా వెలుగు చూసింది. అది ఒరిజినల్ కానేకాదు.. ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన ‘ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ’ నిర్ధారించినట్టుగా టీడీపీ నేతలు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ మేరకు ఎక్లిప్స్ ల్యాబరేటరీ జారీ చేసినట్టుగా ఓ సర్టిఫికెట్ను కూడా విడుదల చేశారు. కాగా, ఫోరెన్సిక్ సర్టిఫికెట్ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సీడీఐ విభాగాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని సంప్రదించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్ఫోన్లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసిన క్లిప్ను మాత్రమే ప్రసాద్ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్టుగా తెలిపింది. వీడియో కాల్ మాట్లాడుతుండగా మొదట రికార్డు చేసిన వీడియో క్లిప్ను పంపిస్తే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారో లేదో నిర్ధారించగలం తప్ప.. ఇలా ఒక క్లిప్ను మూడో వ్యక్తి సెల్ఫోన్ నుంచి రికార్డు చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సీఐడీ విభాగానికి పంపిన ఈ మెయిల్లో స్పష్టం చేసింది. దాంతో ఎంపీ మాధవ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మార్ఫింగేనన్నది స్పష్టమైంది. వాస్తవానికి ఓ ల్యాబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్ను యథాతథంగా విడుదల చేయాలి. సర్టిఫికెట్లో మార్పులు చేయడం అన్నది చట్ట వ్యతిరేకం. కానీ టీడీపీ నేతలు ఎక్లిప్స్ ల్యాబొరేటరీ సర్టిఫికెట్ను ట్యాంపర్ చేసి మీడియాకు విడుదల చేయడం గమనార్హం. దీనిపై ఎంపీ మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
‘స్కిల్’ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ, ఆయన భార్య నీలం శర్మను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకువచ్చారు. వారిని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానంలో బుధవారం రాత్రి హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్ కంపెనీల ముసుగులో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్ల నిధులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ.. రూ.241 కోట్ల ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు అడ్డదారిలో నిధులు మళ్లించడంలో ఢిల్లీకి చెందిన విపిన్ శర్మ, నీలం శర్మ దంపతులు కీలకంగా వ్యవహరించారు. వారిద్దరూ ఢిల్లీలో ‘ఇన్ వెబ్ సర్వీసెస్’ అనే ఓ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఎస్డీసీ నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు నిధులు చెల్లించింది. ఈ నిధులను సీమెన్స్, డిజైన్ టెక్.. వివిధ షెల్ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి. ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్లతో నిధులు కొల్లగొట్టిన విషయం గతంలోనే వెలుగు చూసింది. ఆ నిధులను సింగపూర్లోని సంస్థలకు తరలించి.. అక్కడి నుంచి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు చేర్చారు. అదే రీతిలో విపిన్ శర్మ, నీలం శర్మలకు చెందిన ఇన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ నుంచి నకిలీ ఇన్వాయిస్లు తీసుకుని ఆ కంపెనీకి రూ.8.50 కోట్లు చెల్లించారు. అందులో తమ కమీషన్గా రూ.7.5 లక్షలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మళ్లీ టీడీపీ ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి ఆ కంపెనీ చేర్చింది. సీఐడీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో డిజైన్ టెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని రూ.23 కోట్లను ఇటీవల సీఐడీ అధికారులు జప్తు చేశారు. చంద్రబాబు ఆదేశాలతో రూ.371 కోట్లు చెల్లింపు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండానే చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ భార్య ఈమె. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కనీసం సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగతా రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్ టెక్ ఖాతాలోకి మళ్లించారు. అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి రూ.241 కోట్లు చేరాయి. తనిఖీల్లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్లు.. కాగా కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవని గుర్తించి ఆ విషయాన్ని ఏపీ ఏసీబీ విభాగానికి తెలిపారు. కానీ అప్పటి టీడీపీ పెద్దలు ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. పైగా ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తెచ్చిన విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్పష్టం చేస్తూ ఏపీఎస్ఎస్డీసీకి ఓ లేఖ రాసింది. తాము అందించిన లైసెన్స్డ్ సాఫ్ట్వేర్కుగాను తమకు రూ.56 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించింది. అంతేగానీ వేల కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. దీంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా రూ.241 కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తేలింది. కుంభకోణం కథ ఇదీ.. 2014–15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు రూ.3,556 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కేవలం కాగితాలపైనే ఓ ప్రాజెక్టును చూపించి ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారు. ఇందులో భాగంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కాన్విల్కర్ కలిశారు. మొత్తం రూ.3,556 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఆ ప్రాజెక్టు వ్యయం రూ.3,556 కోట్లుగా ఎలా నిర్ధారించారని శాస్త్రీయంగా మదింపు చేయనే లేదు. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్తో కలిసి కథ నడిపించారు. -
హీటెక్కిన ఎస్ఐ కొలువుల స్కాం.. సీఐడీ అదుపులో హోంమంత్రి పీఎస్
బనశంకరి(బెంగళూరు): సంచలనాత్మక ఎస్ఐ ఉద్యోగాల కుంభకోణం మరింత వేడెక్కింది. మొన్న అదనపు డీజీపీ అమృత్పాల్ అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా హోంమంత్రి పీఎస్ సీఐడీకి చిక్కాడు. ఈ స్కాంకు సంబంధించి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యక్తిగత కార్యదర్శి గణపతి భట్ను మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులతో అతడు కుమ్మక్కయ్యాడని ఆరోపణలు ఉండగా, సీఐడీ రంగంలోకి దిగింది. ఆరోపణలకు పలు సాక్ష్యాధారాలు లభించడంతో గణపతిభట్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు, బొమ్మై సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసి ప్రాంతానికి చెందిన గణపతిభట్ ఆర్ఎస్ఎస్లో గుర్తింపు పొందాడు. చదవండి: పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు -
రఘురామను విచారించొచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించి, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినందుకు నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై సుమోటోగా నమోదు చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున దర్యాప్తును అడ్డుకోవడంలేదని చెప్పింది. రఘురామకృష్ణరాజు తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్ను మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, మిగిలిన సెక్షన్ల కింద సీఐడీ చేసే దర్యాప్తునకు సహకరించాలని నిందితులను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కేసులో ఏబీఎన్, టీవీ 5 యజమానులపైనా దర్యాప్తు కొనసాగించవచ్చని సీఐడీకి స్పష్టంచేసింది. సీఐడీ చేతిలో ప్రాణహాని ఉందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహంలో విచారించాలని ఆదేశించింది. ఆయన్ని ఇతర నిందితులతో కలిపి విచారించాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. రఘురామకృష్ణరాజు ఎంపిక చేసుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, వీడియో తీయాలని చెప్పింది. కేసుకు సంబంధించిన విషయాలకే విచారణను పరిమితం చేయాలని స్పష్టంచేసింది. ఆయన హృద్రోగి అని చెబుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు చెప్పింది. ఆయన భద్రతా సిబ్బందిని విచారణ ప్రాంగణం వెలుపలి వరకు అనుమతించాలంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చాల్సి ఉన్నందున, దర్యాప్తు పూర్తి చేసిప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలులో ఏదైనా ఉల్లంఘన జరిగితే, అందుకు బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వేదికపై తీవ్ర చర్చ సీఐడీ కేసును కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ రాయ్ బుధవారం మరోసారి విచారించారు. విచారణ కోసం ఓ తటస్థ ప్రాంతాన్ని ఎంపిక చేసి, తమకు చెప్పాలని సీఐడీని, రఘురామకృష్ణరాజును న్యాయమూర్తి ఇంతకు ముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఓ ఫైవ్స్టార్ హోటల్ను ప్రతిపాదించారు. అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను సీఐడీ తరఫు న్యాయవాది వైఎన్ వివేకానంద వ్యతిరేకించారు. న్యాయమూర్తి సైతం ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. పోలీసు అధికారుల మెస్ లేదా దిల్కుషా అతిథి గృహాన్ని వివేకా ప్రతిపాదించారు. పోలీసు అధికారుల మెస్కన్నా అతిథి గృహమే మేలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరకు దిల్కుషా అతిథి గృహాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హింసను ప్రేరేపించేందుకే ఆ వ్యాఖ్యలు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిని, పలు కులాలను అవమానించేలా నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని, ఇది ఐపీసీ కింద నేరమని వివరించారు. ప్రతిపక్ష పార్టీ, రెండు వార్తా చానళ్లతో కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రఘురామకృష్ణరాజుకు పరిపాటిగా మారిందని అన్నారు. రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి డియర్ పాస్టర్స్ అని సంభోధిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిని, ఇతర కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తనని ప్రజలు జోకర్గా భావించి తన వ్యాఖ్యలను పట్టించుకోలేదని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తున్నారని ఏజీ తెలిపారు. ఆయన జోకర్ కావొచ్చునని, పాలన అంటే సర్కస్ మాత్రం కాదని వివరించారు. ఆయనపై నమోదు చేసిన దేశద్రోహం కేసుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని, మిగిలిన నేరాలపై దర్యాప్తు కొనసాగించవచ్చని చెప్పిందన్నారు. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆయన్ని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణకు మించి ఆయన ఇంకా ఎక్కువ రక్షణ కోరుతున్నారని, అందుకు చట్టం అనుమతించదని తెలిపారు. గతంలో విచారణకు వచ్చినప్పుడు సీఐడీ హింసించిందని, అందువల్ల ఇప్పుడు సీఐడీ వద్దకు రాలేనని, తన ఇంటికే అధికారులు రావాలన్న రఘురామకృష్ణరాజు వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ఇంటికి వెళితే, వారిని కాల్చేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించిన ఘనుడని, అందువల్ల ఆయన ఇంటికెళ్లే ప్రసక్తే లేదన్నారు. పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన్ని విచారించే ప్రక్రియను వీడియో తీస్తామని అన్నారు. మరికొందరితో కలిపి ఆయన్ని విచారించాల్సి ఉంటుందని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. సీఐడీ పిలిచిన చోటకి వెళ్లే పరిస్థితి లేదని, మరోసారి దాడి చేయడమో, ఇతర కేసుల్లో అరెస్ట్ చేయడమో చేసే అవకాశం ఉందని అన్నారు. ఆన్లైన్లో లేదా హైదరాబాద్లోని పిటిషనర్ ఇంట్లో విచారణ జరపాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఏజీ వ్యతిరేకించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందన్నారు. అందువల్ల ఆన్లైన్లో విచారించడమా? లేక తటస్థ ప్రదేశంలోనా అన్నది తెలపాలని సీఐడీకి సూచించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
దుష్ప్రచారం చేసిన వ్యక్తిని విచారించిన సీఐడీ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు షేర్ చేసి, వైరల్ చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లా బోరుబద్ర రామాలయం గుడి ప్రాంతానికి చెందిన ఎ.వెంకటేష్ను గురువారం సీఐడీ గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేసే అతను సోషల్ మీడియా ద్వారా పలువురికి పంపించినట్లు గుర్తించారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ గుంటూరు అధికారి ఒకరు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అతనికి సూచించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేసిన పలువురిని గుర్తిస్తున్నామని వివరించారు. -
సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం.. సీఐడీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాలను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేసిన వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ దృష్టికి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ ఫేక్ పోస్టులను వైరల్ చేసిన 12 సోషల్ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదుగురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. -
ఎస్ఐ పరీక్షల స్కాంలో కొత్త కోణం.. కాలువలోకి ఓఎంఆర్ షీట్లు పడేసి..
బనశంకరి(బెంగళూరు): ఎస్ఐ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ అధికారులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసు వెలుగులోకి రాగానే సీఐడీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఓఎంఆర్షీట్లను కాలువలోకి పడేసినట్లు ఎస్ఐ నియామక అక్రమాలతో సంబంధం ఉన్న సీఐడీ కస్టడీలో ఉన్న కలబురిగి నీరావరి శాఖ ఇంజినీర్ మంజునాథ్ నోరువిప్పాడు. అసలైన ఓఎంఆర్షీట్కు, కార్బన్షీట్ను పోల్చి చూస్తే తేడా కనబడటం ఖాయమని భావించిన ఇతడితో డీల్ చేసుకున్న అభ్యర్థులు కార్బన్షీట్ను కలబురిగి నగర శివారులోని కోటనూరు వద్ద పెద్దకాలువలోకి పడేసినట్లు మంజునాథ్ సీఐడీ ముందు నోరువిప్పాడు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం మంజునాథ్ను కాలువవద్దకు తీసుకెళ్లి పరిశీలించారు. కాగా ఈయన ఇంటిలో గతంలో సీఐడీ అధికారులు 12 హాల్టికెట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పోలీసులకు లొంగిపోక ముందు ఇతను తన సెల్ఫోన్ను అళంద తాలూకా అమర్జా డ్యాంలోకి విసిరేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కేసులో ముఖ్యసూత్రధారి అయిన డీఎస్పీ శాంతకుమార్ను సీఐడీ అధికారులు కోర్టులో హజరుపరిచి తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. శాంతకుమార్ 1996 బ్యాచ్ సీఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికై 2006లో ఆర్ఎస్ఐ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. గుల్బర్గాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2007–08 నుంచి నియామక విభాగంలో శాంతకుమార్ మకాంవేశాడు. నియామకాల్లో ఏమిజరుగుతుంది అనేది తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం సీఐ నుంచి డీవైఎస్పీగా పదోన్నతి పొందారు. పీఎస్ఐ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి ఓఎంఆర్షీట్లు దిద్దినట్లు సీఐడీవిచారణలో తేలింది. చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్పై వస్తుంటే అడ్డగించి..