-
నిశ్చితార్థం రద్దయిందని ఘోరం
యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్ను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు. ఏడాది నుంచి ప్రేమ హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్ బైకులో ఎక్కించుకొని స్కూల్ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశి్చతార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మారి్పంచారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు. ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి హత్య గురించి విచారించారు. -
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చిన 'వరహారూపం' సింగర్
ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. 'వరహారూపం' పాటతో యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించిన ఈమె.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్లో వచ్చే 'వరహారూపం' పాటనే గుర్తొస్తుంది. ఒరిజినల్గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు గానీ ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీ లలిత. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక్క పాటతో ఈమె తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడురాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది..ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్ని ఆకట్టుకుంటోంది.ఇకపోతే శ్రీ లలిత కుటుంబానికి సంగీత నేపథ్యమే. తాత ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులే. మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీ మీద పద్యం చెప్పమని అడిగితే.. 'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా 15కి పైగా రియాలిటీ షోల్లో శ్రీ లలిత పాల్గొంది. ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడటం విశేషం. (ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన) View this post on Instagram A post shared by Srilalitha Bhamidipati (@srilalithabhamidipati) -
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ను తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్కి ఇషితా కుమార్తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకున్నాడు. తనతో పాటు తొలి సినిమాలో హీరోయిన్గా చేసిన రహస్య గోరఖ్నే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కిరణ్-రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో రహస్య.. కిరణ్తో ఆరేళ్ల ప్రేమ గురించి బయటపెట్టింది. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్.. 'రాజావారు రాణిగారు' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ తర్వాత రహస్య.. నటనని పక్కన పెట్టేసింది. కిరణ్ అబ్బవరం మాత్రం పలు చిత్రాల్లో నటించి హీరోగా కాస్తంత పేరు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇద్దరిలో వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిశ్చితార్థంతో వీళ్ల ప్రేమ నిజమేనని అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) ఈ క్రమంలోనే తాజాగా కిరణ్-రహస్య నిశ్చితార్థం.. హైదరాబాద్లో మార్చి 13న జరిగింది. ఇది అయిన ఓ రోజు తర్వాత అంటే మార్చి 14న కిరణ్తో తన ప్రయాణం గురించి ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. 'ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం. ప్రేమలో పడ్డాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్కి వెళ్లాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఏదైతేనేం మనది అద్భుతమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర్వస్వం కిరణ్ అబ్బవరం' అని రహస్య గోరఖ్ రాసుకొచ్చింది. అయితే వీళ్ల పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
Kiran Abbavaram Engagement Photos: గ్రాండ్ కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం!
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్స్క్రీన్లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్కు వెళ్లేవారు. తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న మన యంగ్ హీరోకు ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. #TFNReels: Visuals from the engagement ceremony of @Kiran_Abbavaram & @rahasya_gorak!💍💕#KiranAbbavaram #RahasyaGorak #TeluguFilmNagar pic.twitter.com/HdVJmyV9mC — Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2024 -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
Varalaxmi Sarathkumar Engagement: బాయ్ ఫ్రెండ్తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
-
సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ
ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం? (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొనసాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. గతంలో హీరో విశాల్తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని నెలల గ్యాప్లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. నికోలయ్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) -
జూనియర్ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్గా పని చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్ పీఎస్కు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్ఐ అరుణ్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్ ఫోన్లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్ చేశాడు. అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్కు ఫోన్ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే గతేడాది నవంబరులోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి నిశ్చితార్థం చేసుకుంది. ఏంటి రెండు సార్లు చేసుకుందా అనుకుంటున్నారా? నిజమే, ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత) ఉత్తరాది సినిమాల్ని ఓటీటీల్లో చూసేవారికి మరాఠీ హీరోయిన్ పూజా సావంత్ కాస్త పరిచయమే. ఎందుకంటే డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2010 నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 20కి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది. అలాంటిది గతేడాది నవంబరు చివర్లో ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. కాకపోతే అప్పుడు నిశ్చితార్థం ఎక్కడో ఐలాండ్లో జరగ్గా.. ఇప్పుడు మాత్రం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరిగింది. అబ్బాయి విషయానికొస్తే.. ఇతడి పేరు సిద్దేశ్ చవన్. ఆస్ట్రేలియాలో ఓ ఫైనాన్స్ కంపెనీకి ఇతడు ఓనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశారు. అయితే త్వరలోనే పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. సహా నటీనటులు అందరూ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరోలతో కలిసి మూవీస్ చేసింది. మంచి పేరు సంపాదించింది. ఇకపోతే గత నాలుగేళ్లుగా ఓ నటుడితో డేటింగ్ చేస్తోంది. వీళ్ల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు. కాకపోతే చాలా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఈమెకు పెళ్లెప్పుడు? దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లోనే తీన్మార్, అలా మొదలైంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది. చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీలోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఇదే టైంలో బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్తో రిలేషన్లో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితమే రూమర్స్ వచ్చాయి. అయితే డేటింగ్ నిజమే అని క్లారిటీ ఇచ్చేలా కలిసి చాలా చోట్ల కృతి-పులకిత్ జంటగా కనిపించారు. మరి వీళ్ల పెళ్లెప్పుడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లకు ఎండ్ కార్డ్ వేస్తూ నిశ్చితార్థం చేసేసుకున్నారు. అయితే కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిన విషయం బయటపడింది. అలానే వీళ్ల పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని అంటున్నారు. పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
చెల్లి ఎంగేజ్మెంట్ లో డాన్స్ తో దుమ్ములేపుతున్న సాయి పల్లవి!
-
బిగ్ బాస్ శోభాశెట్టి ఎంగేజ్మెంట్ అప్డేట్
-
చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్తో దుమ్మురేపిన సాయిపల్లవి!
హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్తో అదరగొట్టేసింది. చాలారోజుల తర్వాత స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈమె అభిమానులు అయితే డ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. చెల్లి నిశ్చితార్థం సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించింది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోకపోయేసరికి ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిందని, యాక్టింగ్ పక్కనబెట్టేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ తమిళంలో ఓ మూవీ, తెలుగులో 'తండేల్' చేస్తుందనేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇకపోతే సాయిపల్లవి కంటే చెల్లి పూజా కన్నన్ పెళ్లికి రెడీ అయిపోయింది. సంక్రాంతి టైంలో ప్రియుడి వినీత్ని పరిచయం చేసిన ఈమె.. తాజాగా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఈ వేడుకలో అందరితో కలిసి సాయిపల్లవి క్రేజీగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దిగువనే ఉంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) ♥️ pic.twitter.com/OKc2gqzCDg — Sai Pallavi (@Sai_PallaviFans) January 21, 2024 -
సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి
బిగ్బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
సాయి పల్లవి ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట వివాహా వేడుకలు మొదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్ పెళ్లి వివాహం త్వరలో జరగనుంది. తన స్నేహితుడు వినీత్ను ఆమె పెళ్లాడనుంది. కొన్నేళ్లుగా పూజ, వినీత్ ప్రేమయాణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే వీరి వివాహం జరగనుంది. (ఇది చదవండి: ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్పై ప్రశంసలు.. ఎందుకంటే?) ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్కు ముందు జరిగిన సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇన్స్టాలో షేర్ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. సాయిపల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్లరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement