Engineering College
-
విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
మరో 20,000 సీట్లు కావాలి!
సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది దాదాపు 50 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని ఏఐసీటీఈకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాలేజీలు దరఖాస్తులు చేశాయి. తెలంగాణ నుంచి దాదాపు 20 వేల అదనపు సీట్ల కోసం దరఖాస్తులు అందాయి. అయితే సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని, అప్పుడే అనుబంధ గుర్తింపు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏఐసీటీఈకి లేఖ రాసింది. మరోవైపు కారణాలు లేకుండా సీట్ల పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాలేజీలు అంటున్నాయి. ఏఐసీటీఈ వర్గాలు మాత్రం సీట్ల పెంపుపై తమకు అభ్యంతరం లేదని తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచీలో ఉండే అవకాశం ఉంది. దక్షిణాదిలోనే బీటెక్ సీట్లు అధికం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లున్నాయి. దేశంలోని మొత్తం సీట్లలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో 35 శాతం బీటెక్ సీట్లున్నాయి. దేశం మొత్తంలో 14.90 లక్షల బీటెక్ సీట్లుంటే.. తమిళనాడు 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానంలో ఉంది. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండోస్థానంలో, తెలంగాణ 1.45 లక్షల సీట్లతో మూడోస్థానంలో ఉంది. సీట్లు పెంచుకోవడంలోనూ ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేండ్లుగా దేశంలో బీటెక్ సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే 2014 –15తో పోల్చితే సీట్ల సంఖ్య తక్కువగానే ఉండటం గమనార్హం. 2014 –15లో దేశంలో 17.05 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా, 2021–22 వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది.50% మూడు రాష్ట్రాల్లోనే..2024–25 విద్యా సంవత్సరంలో పెరిగిన బీటెక్ సీట్లల్లో 50 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశం మొత్తంగా చూస్తే 50 శాతం సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే పెరిగాయి. తమిళనాడులో 32,856 సీట్లు పెరగగా, ఆంధ్రప్రదేశ్లో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి.జాతీయంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ (ఈవినింగ్ బీటెక్) కోర్సును నిర్వహించేందుకు 400 – 500 విద్యా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ కాలేజీల్లో దాదాపు 40 వేల నుంచి 50 వేల సీట్లు పెరిగాయి.ఈ విద్యా సంవత్సరంలో 2,906 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చింది. 1,256 కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి.జాతీయంగా కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల భర్తీ నిష్పత్తి) 2021–22లో 72 శాతం ఉండగా, 2022 –23కు వచ్చేసరికి 81 శాతానికి పెరిగింది. త్వరలో ఏఐసీటీఈ పరిశీలనతెలంగాణలో 23 ప్రైవేటు కాలేజీలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులను కోర్ గ్రూపుతో కాంబినేషన్గా అందించాలని ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైన మౌలిక వసతులు తమకు ఉన్నాయని దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. వీటిని స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ఏఐసీటీఈ బృందాలు తెలంగాణలో పర్యటించనున్నాయి. -
ఆరోగ్యం బాగాలేదని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
దుండిగల్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం.. దుండిగల్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. శ్రావణి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, రెండు రోజుల క్రితం వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు.అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. -
యాజమాన్య కోటా.. ఇక ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. పారదర్శకత కోసమే.. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్ఆర్ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ.. మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ ప్రతిపాదనలు... » బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం. » ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు. -
‘స్కిట్’ నిలిచేనా?!
అనంతపురం: వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి.. మంచిపేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కాలగర్భంలోకి కలిసి పోకుండా కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా 1997–98 విద్యా సంవత్సరంలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు.మొదట ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్సెస్ కోర్సులకు అనుమతించారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత కొంతకాలానికి సివిల్ ఇంజినీరింగ్ కోర్సుకు కూడా అనుమతిచ్చారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.రూ.750 కోట్ల ఆస్తులురాష్ట్రంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏకైక ఇంజినీరింగ్ కళాశాల కావడం..బోధన బాగా ఉండటం.. మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే స్కిట్కు మంచి ఖ్యాతి వచ్చింది. ప్రధాన బ్రాంచ్ల్లో అదనపు సీట్లు పెంపుదల చేశారు. దీనికి తోడు డిప్లొమో కోర్సులూ నిర్వహించారు. ఆదాయ పెంపుదల ప్రధానం కాకుండా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన ఆశయంతో ఈ కళాశాల అప్పట్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాల ఆస్తుల విలువ రూ.750 కోట్లు ఉంటాయని అంచనా. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతోనే కళాశాల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా నియమ నిబంధనలు రూపొందించారు. ముక్కంటి ఆలయం వారు తొలి కామన్ డిపాజిట్ కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కళాశాల నుంచి వచ్చే ఆదాయమే జీతాలకు, అభివృద్ధి పనులకు సరిపోయేది. 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కళాశాల నిర్వహించారు.ఇప్పటికే రెండు దఫాలు కమిటీ ఏర్పాటుస్కిట్ను జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దఫాలు కమిటీలను నియామకం చేసి, సిఫారసులను బుట్టదాఖలు చేశారు. మరో దఫా కమిటీని నియమించారు. ఈసారైనా ఆచరణ సాధ్యమయ్యేనా? లేక మొక్కుబడిగా కమిటీ వేసి కాలయాపన చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పూర్తిగా జేఎన్టీయూ అనంతపురం పరిధిలోకి తెచ్చి.. గతంలో మాదిరి విద్యార్థుల ఫీజులతోనే కళాశాలను నిర్వహించాలని, స్కిట్లో పనిచేసే ఫ్యాకల్టీని అక్కడికే పరిమితం చేసి జీతాలు చెల్లించాలని, ఉద్యోగులను వర్సిటీ పరిధిలోకి తెస్తే సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు అంటున్నారు. 2013 నుంచి తగ్గుముఖంవిద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం, కళాశాలలో వర్గ రాజకీయాలు అధికం కావడం, రాజకీయ జోక్యం మితిమీరడం వంటి కారణాలతో కళాశాల పతన దిశగా పయనించడం ప్రారంభం అయింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2016 నవంబర్ నాటికి అక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా రూ.25 లక్షల వంతున ముక్కంటి దేవాలయం వారు చెల్లిస్తున్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాలకు ఇప్పటి దాకా దేవాలయం వారు రూ.14 కోట్లు చెల్లించారు. ఈ భారం అధికం కావడంతో రాష్ట్ర దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థితిగతులను అధ్యయనం చేశారు. 2019–20 సంవత్సరంలో పూర్తిగా అడ్మిషన్లు లేవు. అంతకు ముందు సంవత్సరాల్లో చేరిన విద్యార్థులు బీటెక్లో 15 మంది, డిప్లొమోలో 12 మంది ఉన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు కోర్సులు ముగిసి బయటకు వెళ్లిపోతారని, కళాశాలను మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. -
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
రాజ్యమా...సిగ్గుపడు పెను ప్రమాదంలో ఏపీ మహిళల మానప్రాణాలు
-
రహస్య కెమెరాలు.. ఆధారాలు మాయం!.. బయటపడుతున్న గుడ్లవల్లేరు గుట్టు
-
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్రూమ్ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
వీడియోలు లీక్ ఘటన.. పక్కదారి పట్టించే కుట్ర
-
300 మంది అమ్మాయిల వీడియోలు లీకైతే పట్టించుకోము.. ముంబై నటికీ మాత్రం న్యాయం చేస్తాం
-
కళాశాలలో కీచకులు
-
ప్రైవేటు వారి... పాట! ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా
ర్యాంకులతో సంబంధం లేదు.. మెరిట్ మాటే లేదు.. రూల్స్ గీల్స్ జాన్తా నై..లక్షల్లో వసూళ్లు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..ముందే విక్రయాలు.. పేరుకు అడ్మిషన్లు అంటూ ప్రకటనలు..సీట్ల కోసం వెళ్లే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్..సీట్లు లేవని వాచ్మన్లతోనే చెప్పిస్తూ వెళ్లగొడుతున్న తీరు..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వానించాయి. కానీ, దీంతో ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘ఇంకెక్కడి సీట్లు... ఎప్పుడో అయిపోయాయి’ అంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటివేయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందని పేర్కొంటున్నాయి. ఏటా ఇదే దందా.. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వెలువడ్డాకే సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. తొలుత జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే.. ఇంటర్లో మెరిట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలి. యాజమాన్య కోటాలోని 30శాతం సీట్లలో 15శాతం సీట్లను ఇలా భర్తీ చేయాలి. ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’ నిర్ధారించిన మేరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. మరో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు సిఫార్సు చేసిన విద్యార్థులకు (ఎన్నారై కోటా) కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి 5 వేల డాలర్ల ఫీజు (సుమారు రూ.4.2 లక్షలు) వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. బ్రాంచీని బట్టి ఐదారు లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకుని సీట్లను వేలం పాటలో అమ్మేసుకుంటున్నాయి. ఆ విద్యార్థులు మాత్రమే తమ కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారని, వారి మెరిట్ మేరకే సీట్లు ఇచ్చామని చూపుతున్నాయి. మంచి ర్యాంకులు, మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాయి. ఏటా ఈ దందా ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నీట్ మాదిరిగా.. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో దీనిని అడ్డుకున్నాయి. రూ. 1,500 కోట్ల ‘వ్యాపారం’ రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 156 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 1,12,069 సీట్లు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 1.06 లక్షలు. ఈ సీట్లలో 30శాతం యాజమాన్య కోటా కింద కాలేజీలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో సుమారు 20వేల సీట్లు కంప్యూటర్స్, అనుబంధ బ్రాంచీలవే. వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సీట్లను కాలేజీని బట్టి కనిష్టంగా రూ. 8 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20లక్షల వరకూ అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 15వేల సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు రూ.1,500 కోట్ల మేరకు దందా జరిగినట్టు తెలిసింది. ఇంత భారీగా సాగుతున్న అక్రమ వ్యవహారంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ‘సహకారం’ అందిస్తున్న ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా.. ఈ సీట్ల అమ్మకం వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వెళ్లిన వాళ్లను వెళ్లినట్టే వెనక్కి పంపుతూ.. – హైదరాబాద్లోని ఓ రాజకీయ ప్రముఖుడి కాలేజీకి ఒక జేఈఈ ర్యాంకర్ దరఖాస్తుతో వెళ్లాడు. కానీ సీట్లు ఎప్పుడో భర్తీ అయిపోయాయని చెప్తూ.. గేట్ వద్ద నుంచే వాచ్మెన్ వెనక్కి పంపేశాడు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేసేందుకు ఆ విద్యార్థి ఉన్నత విద్యా మండలికి వచ్చాడు. – రంగారెడ్డి జిల్లాలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి వెళ్లాడు. అతడికి ఈఏపీసెట్లో 20వేల ర్యాంకు వచ్చింది. అయితే సీట్లు పెరిగితే అడ్మిషన్ ఇచ్చే విషయం చూద్దామని యాజమాన్యం చెప్పి పంపిందని.. సీఎస్ఈ కోసమైతే రూ.12 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించిందని ఆ విద్యార్థి వెల్లడించాడు. – కౌన్సెలింగ్ సందర్భంగా ఓ విద్యారి్థకి రాష్ట్రంలో టాప్ టెన్లో ఉండే ఓ కాలేజీలో మెకానిక్ బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే సీఎస్ఈ సీటు ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీని కోరగా.. కొత్త సీట్లు వచ్చాక ఇస్తామని, ఇప్పుడే రూ.18 లక్షలు కట్టేస్తే ఖరారు చేస్తామని తేల్చి చెప్పింది. నిబంధనలు విధిగా పాటించాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కాలేజీలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించాలి. ప్రతి కాలేజీ వెబ్సైట్ అందుబాటులో ఉంచాలి. దీనిపై ఇప్పటికే కాలేజీలకు సర్క్యులర్ కూడా ఇచ్చాం. ఎవరికైనా అన్యాయం జరిగితే మండలికి ఫిర్యాదు చేయవచ్చు. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి దోపిడీకి అడ్డుకట్ట వేసేదెప్పుడు? యాజమాన్య కోటా సీట్ల దందాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. యాజమాన్యాలకు కొమ్ముగాయడమే ఈ పరిస్థితికి కారణం. యాజమాన్య కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి. ఈ దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంత అన్యాయమా? ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల వ్యాపారాన్ని అడ్డుకోలేక పోవడానికి కారణాలేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నోటిఫికేషన్ ఇచ్చే నాటికే సీట్లు అమ్మేస్తుంటే అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలి. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశా.. చర్యలు తీసుకుంటారా? శ్రీదేవి విమెన్స్ కాలేజీలో బి కేటగిరీ సీటు కోసం వెళ్లిన యాస శ్రీకీర్తిరెడ్డి అనే విద్యారి్థని యాజమాన్యం లోపలికి కూడా రానివ్వలేదు. ప్రవేశ ప్రకటన ఇచ్చి ఇలా చేయడం దారుణం. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాం. ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. – డాక్టర్ కురువ విజయకుమార్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు -
సీట్లు పెరిగినా.. సీఎస్ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్లో 310 నుంచి 385కు, భిలాయ్లో 243 నుంచి 283కు, భువనేశ్వర్లో 476 నుంచి 496కు, ఖరగ్పూర్లో 1,869 నుంచి 1,889కి, జోథ్పూర్లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్లర్లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్గా.. అమెరికాలోని అయోవా స్టేట్లో రిపబ్లికన్ పార్టీకి మూడు సార్లు చైర్మన్గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ
-
పూర్వ విద్యార్థినిపైలైంగిక దాడికి యత్నం
విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినిపై అదే ప్రాంతంలోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీకి చెందిన ఉత్తరాది కార్మికుడు మంగళవారం లైంగిక దాడికి యతి్నంచాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పార్వతీపురానికి చెందిన ఆమె 2021లో ఇక్కడి కళాశాలలో సీఎస్సీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలను మరో యాజమాన్యం నిర్వహిస్తోంది. కాగా.. సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆమెపై మద్యం సేవించిన కార్మికుడు నిర్మానుష్య ప్రాంతంలో దాడికి యత్నించాడు. ఇది గమనించిన పశువుల కాపరులు(మహిళలు).. ఆమెను రక్షించి తీసుకువెళ్లారు. కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో భీమిలి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను భీమిలి స్టేషన్కు తరలించి.. ఆమెతో పాటు స్థానికులను విచారించారు. వారు చెప్పిన వివరాలతో దాకమర్రి, బోడమెట్టపాలెం పరిసర ప్రాంతాల్లోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీల్లో గాలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమిలి సీఐ డి.రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
ఆంజనేయులు ఎక్కడ?.. బ్రిలియంట్ కాలేజీలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. -
మరోసారి కరీంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి కరీంనగర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. కరీంనగర్లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్ట్ల సంఖ్య 53 కు చేరింది. హైటెక్ మాస్ కాపీయింగ్లో వీరిద్దరూ పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. డీఈఈ పూల రమేష్తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 10 లక్షలకు డీల్ ఖరారవ్వగా, ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం ఒప్పందం కుదిరింది. చెరో రూ.5 లక్షలకు కుదిరిన డీల్ చేసుకున్నట్లు సిట్ విచారణలో బట్టబయలైంది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉంది. చదవండి: TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్. -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యూనివర్శిటి నుంచి అనుమతులు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఉదయం నుంచి కాలేజ్ గేట్ ముందు విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కాలేజ్ యజమాన్యం వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు అక్కడ నుండి కదిలేదు లేదంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్పష్టం చేశారు. కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థి తల్లిదండ్రులు చర్చలు జరిపి అనురాగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చని నచ్చజెప్పారు. దీంతో ప్రత్యేక బస్సులో అనురాగ్ యూనివర్సిటీకి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి గురునానక్ కాలేజ్కు వచ్చి తమకు అక్కడ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ గేటు దుకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు, ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ జార్జ్ చేయడంతో పాటు ధర్నాకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలను అదుపులోకీ తీసుకున్నారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ -
కాలేజీ యజమాని కాంతారావు హత్యకు భాగస్వాముల కుట్ర
-
ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ
సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో వారు ఒప్పందం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. -
బల్లిపడిన ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరువొత్తియూరు: చైన్నె సమీపంలోని పూందమల్లి – ఆవడి రోడ్డులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. యథావిధిగా ఆదివారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించారు. అయితే ఆ ఆహారం తిన్న 30 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను వెంటనే కళాశాల నిర్వాహకులు రక్షించి పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తిరువేర్కాడు పోలీసుల చేపట్టిన దర్యాప్తులో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తేలింది. అలాగే పూందమల్లి రెవెన్యూ శాఖ, ఆహార భద్రత విభాగం అధికారులు కూడా కళాశాల క్యాంపస్కు వెళ్లి సమస్యకు గల కారణాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. -
సీటు.. మహా రేటు!
జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా (‘బి’ కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాను భర్తీ చేయాలి.. కానీ కన్వీనర్ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. మేనేజ్మెంట్ల సీట్ల భర్తీలో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఇవేవీ అమలు లేకుండా ఇష్టానుసారం ప్రవేశాలకు తెరలేచింది. సాక్షి, సిటీబ్యూరో: కౌన్సెలింగ్ కంటే ముందే ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల దందా జోరందుకుంది. ప్రైవేటు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల మధ్యవర్తిత్వంతో సీట్ల రిజర్వేషన్్ ప్రక్రియకు తెరలేచింది. కన్వీనర్ కోటా కటాఫ్ కంటే అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీట్ల టెన్షన్ పట్టుకుంది. ఇదే అంశం ఇంజినీరింగ్ కాలేజీలకు కాసులు కురిపిస్తోంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే పేరొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు నిబంధనలు గాలికొదిలి సీట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. దీంతో కన్వీనర్ కోటా వర్తించని విద్యార్థుల తల్లిదండ్రులకు కన్సల్టెన్సీల ఫోన్ల తాకిడి అధికమైంది. టాప్టెన్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని గాలం వేస్తున్నాయి. ఏకంగా కాలేజీలకు తీసుకెళ్లి సీట్లు రిజర్వ్ చేయించడం బహిరంగ రహస్యంగా తయారైంది. కోర్సుల ఆధారంగా సగటున ఒక్కో సీటుకు రూ.12 లక్షల రూ.25 లక్షల వరకు పలుకుతోంది. కొన్ని కాలేజీలు డొనేషన్ల పేరుతో భారీగా వసూలు సైతం దిగాయి. సీటు రిజర్వేషన్ చేసుకొని మరో 20 రోజుల్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తే సీటు ఇస్తామని స్పష్టం చేస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మొత్తం ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తేనే సీటు, విడతల వారీగా చెల్లిస్తే ఆ డొనేషనన్ పెరుగుతుందని తేల్చి చెబుతున్నాయి. అందులో సైతం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ చెల్లింపులను నిరాకరిస్తున్నాయి. సీటు అంశం మాట్లాడేటప్పుడు మాత్రం యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. సదరు పేరెంట్స్ మొబైల్ ఫోన్లను సెక్యూరిటీలో పెట్టి లోపలికి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాయి. బేరసారాలు ముగియగానే తక్షణమే రూ.50 వేలు చెల్లించి రిజర్వేషన్ చేసుకునే విధంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విడతలుగా కౌన్సెలింగ్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జూనన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరగనున్నది. తొలి విడత కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి, రెండో విడత జూలై 21 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 8, 9 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదలవుతాయి. ఇంజినీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ‘ఎ’ ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సెలింగ్కు సమాంతరంగా ఎంసెట్ కౌన్సెలింగ్ను నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. గతంలోనూ.. ఇంజినీరింగ్ కాలేజీల్లో మెరిట్కు పాతర వేస్తుండగా.. సీట్లు అంగడి సరుకుగా మారాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో సైతం మెరిట్ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్ రాయనివారికి కూడా సీట్ల లభించాయి. ప్రస్తుతం సైతం అదే పునరావృతం కాబోతోంది. టాప్ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా ఉండగా మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన డిమాండ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్న్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని తల్లిదండ్రుల ఆశలు కాలేజీలకు కాసుల పంట పండిస్తోంది. -
కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత
సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు. మూడేళ్ల తరువాత.. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ మోహన్రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో (బీఈ, బీటెక్) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్లలో ఇన్టేక్ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్ బ్రాంచ్ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్ ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) స్కోర్తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో టాప్ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (న్యాక్)లో 3.1 స్కోర్తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్ లేదా ట్వినింగ్ ప్రోగ్రామ్లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్ఎస్ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్ లేదా కౌన్సెలర్ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో పీఎం కేర్ సూపర్ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు. (చదవండి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు ) -
అర్థాంతరంగా ముగిసిన భావి ఇంజినీర్ జీవితం
కాకినాడ రూరల్: నాలుగేళ్ల పాటు బీటెక్ కష్టపడి చదివినా నాలుగు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా ఉండిపోవడం అతనిలో తీవ్ర మానసిక సంఘర్షణ దారి తీసింది. పెరిగిన మనోవేదన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పింది. ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, సర్పవరం పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ గుడారిగుంట శాంతనపూరి కాలనీకి చెందిన గెంగిరి దుర్గారామ్గోపాల్(23)ది చేపల వేట ద్వారా జీవనోపాధి సాగించే కుటుంబం. అతని తండ్రి గతంలో చనిపోగా తల్లీ, అక్క, తమ్ముడు ఉన్నారు. కోరంగి వద్ద గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో దుర్గారామ్గోపాల్ బీటెక్ సివిల్ బ్రాంచ్లో చదివాడు. గత ఏడాది ఇంజినీరింగ్ నాలుగేళ్ల కోర్సు పూర్తయింది. నాలుగు సబ్జెక్టులు బ్యాక్లాగ్గా ఉండిపోయాయి. వారం రోజుల క్రితమే హైదారాబాద్లో ప్రైవేట్ జాబ్లో చేరాడు. ఈ లోగా బ్యాక్లాగ్ పరీక్షలకు నోటిఫికేషన్ రావడంతో ఈ నెల 14వ తేదీ నుంచి జరగనున్న పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దుర్గారామ్గోపాల్ వలసపాకల గ్రామంలోని ఓయో అద్దె గదిని ఆదివారం ఉదయం తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో రాత్రి వరకు ఆరా తీసీ ఓయో గదుల బయట అతని మోటార్ సైకిల్ను గుర్తించి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సోమవారం ఉదయం సర్పవరం పోలీసులు, కుటుంబ సభ్యులు వలసపాకలలోని కృష్ణుడి గుడి సమీపం వద్ద ఓయో రూమ్ తలుపులు తెరిచారు. ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండు రోజు లుగా ఇంటి వద్ద ఉన్న రామ్గోపాల్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్లు ఉండిపోవడంతో వాటి గురించే ఆలోచించేవాడని అతని అక్క మంజూష తెలిపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సాయంత్రం నాలుగు గంటల వరకు రింగ్ అయ్యి ఆగిపోయిందని, తరువాత శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై నాగేశ్వరావు, సిబ్బంది పరిశీలించి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మంజూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సుల కోసం వినతి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నత విద్యామండలి తోడ్పాటు అందించాలని ఆ కాలేజీల కన్సార్టియం విన్నవించింది. యూజీసీ నుంచి వచ్చిన అటానసమ్ స్టాటస్ క్రియాశీలకంగా ఉన్నంత కాలం యూనివర్సిటీలు శాశ్వత గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరింది. విజయవాడలో సోమవారం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూల పరిధిలోని ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కాలేజీల కన్సార్టియం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, కార్యదర్శులు జీవీఎం మోహన్కుమార్, మిట్టపల్లి వి.కోటేశ్వరరావు, ఎన్.సతీష్రెడ్డి, ఇతర ప్రతినిధులు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శాశ్వత గుర్తింపుతోపాటు యూజీసీ నిబంధనలను అనుసరించి యూనివర్సిటీలు అకడమిక్ స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 2035 నాటికి జీఈఆర్ను 50 శాతం మేర సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ప్రస్తుత అటానమస్ కాలేజీలను యూజీసీ, రాష్ట్ర యూనివర్సిటీ చట్టాల నిబంధనల మేరకు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అభివృద్ధి చెందుతున్న అంశాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైనింగ్, వర్చువల్ రియాలిటీలతో నాన్టెక్నికల్ యూజీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. (చదవండి: -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
ఇష్టం వచ్చినట్లు కోర్సుల్లో సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. -
ఇంజనీరింగ్లో పెరిగిన ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ప్రవేశం పెరిగింది. అన్ని దశల ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ ఏడాది కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక రూపొందించింది. దాని ప్రకారం.. 177 కాలేజీల్లో 1.10 లక్షల సీట్లకు సాంకేతిక విద్యా విభాగం కౌన్సెలింగ్ నిర్వహించింది. 2021–22లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేల మంది ఇంజనీరింగ్లోని వివిధ బ్రాంచ్ల్లో చేరగా.. ఈ ఏడాది (2022–23) ప్రవేశాల సంఖ్య 80 వేలు దాటింది. అయినప్పటికీ 30 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది 61,972 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ అయ్యాయి. కంప్యూటర్ కోర్సుల్లోనే పెరుగుదల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సులు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దాదాపు వంద కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 10 వేల సీట్లు తగ్గించుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. ఇప్పుడివన్నీ భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన 61,972 సీట్లలో 45 వేలకుపైగా సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సులవే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ)లో 12,503 సీట్లుంటే, 10,789 సీట్లు భర్తీ అయ్యాయి. మెకానికల్లో 4,653 సీట్లకు గాను 1,249 మంది చేరగా, సివిల్లో 5,060 సీట్లు ఉంటే, ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 1,683 మంది మాత్రమే కావడం గమనార్హం. యాజమాన్య కోటాలోనూ కంప్యూటర్ కిక్ రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్య కోటాలో 30 వేలకు పైగా సీట్లు ఉండగా.. ఇందులోనూ 18 వేల సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. ఈ కోటా కింద ఒక్కో సీటు కనిష్టంగా రూ.8 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకూ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాల వెల్లడి తర్వాత యాజమాన్య కోటా కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎగబడ్డారు. స్పాట్ అడ్మిషన్ల దశలో టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు ఒక్కటీ మిగల్లేదు. ఆఖరి దశలో సీటు పొందాలనుకునే వారు రెండవ ఆప్షన్గా ఎలక్ట్రానిక్స్ను ఎంపిక చేసుకున్నారు. ముందు వరుసలో సీట్లు రిజర్వు చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఇక సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలు తంటాలు పడాల్సి వచ్చింది. ఆఖరి దశలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చాయి. -
ఆధునిక కోర్సుల్లో చేరాలి
నర్సాపూర్ : ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను చదవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఆదివారం నర్సాపూర్లోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో 8వ స్నాతకోత్సవం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కోర్సులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్లతో పాటు పాటు ఫార్మా రంగాలకు మంచి భవిష్యత్ ఉందని, నూతన కంప్యూటర్ కోర్సులను చదవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో బీవీఆర్ఐటీ ఒకటని ఆయన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరిస్తూ విద్యార్థులు మంచి నడవడికతో దేశానికి, సమాజానికి సేవా భావం కల్గి ఉండాలని, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మిప్రసాద్, కాలేజీలోని పలు బ్రాంచ్ల హెచ్ఓడీలు, కాలేజీ డీజీఎం కాంతారావు, ఏఓలు బాపిరాజు, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. -
ఇంజనీరింగ్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్లో కొత్తగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి. కొన్ని కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లు సగానికన్నా తక్కువే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్లో ఉండబోతున్నాయి. మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 17 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి. అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. కౌన్సెలింగ్లో ఏ కాలేజీలు? ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు. ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఫీజులపై పీటముడి ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్మెంట్కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఏ కోర్సులు? ఎన్ని సీట్లు? వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. -
సరికొత్తగా ఇంజనీరింగ్ బోధన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యాబోధనకు కొత్త పాఠ్య ప్రణాళికను పరిచయం చేయబోతున్నారు. ఈ దిశగా ఉన్నత విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఇటీవల కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పనపై వీసీలతో సమావేశం జరిగింది. మారుతున్న ప్రపంచంతో పోటీ పడేలా సాంకేతిక విద్యా బోధన ప్రణాళిక ఉండాలని నవీన్ మిత్తల్ సూచించారు. జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే..: ఇటీవల జేఎన్టీయూ పాలక మండలి సమావేశంలో కొత్త పాఠ్య ప్రణాళికపై చర్చించింది. కొత్త పాఠ్య ప్రణాళికకు ఆమోదం తెలుపుతున్నట్టు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు తాము సిద్ధమని తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలూ ఇదే దారిలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒకేసారి రెండు డిగ్రీలు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యతో పాటు, ఇతర కోర్సులు చేస్తే తప్ప ఉపాధి లభించే అవకాశం కనిపించడం లేదు. చాలామంది ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ నియామకాలు లేకపోతే ఇతర కోర్సులు లేదా మేనేజ్మెంట్ (ఎంబీఏ) కోర్సులు చేస్తున్నారు. అయితే, ఇంజనీరింగ్ చేస్తూనే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసేందుకు వీలుగా వర్సిటీలు తమ బోధన విధానాన్ని మార్చుకోబోతున్నాయి. దీంతో పాటు తమకు నచ్చిన సబ్జెక్టును అదనంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, ఆన్లైన్ ద్వారా చేసేందుకు అనుమతించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ రెండో ఏడాది పూర్తిచేసి, ఆపేస్తే.. దాన్ని డిప్లొమా పూర్తి చేసినట్టు భావించాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలను గ్రేడ్లుగా పరిగణిస్తారు. టెన్త్ వరకూ ఒక గ్రేడ్, ఇంజనీరింగ్, డిప్లొమా వేర్వేరు గ్రేడులుగా ఉంటాయి. ఈ విధానానికి అనుగుణంగా ఇంజనీరింగ్ రెండేళ్లు చేస్తే డిప్లొమా కోర్సుగా భావించాలని జేఎన్టీయూహెచ్ పాలక మండలి నిర్ణయించింది. -
నో సి‘విల్’ .. మెకాని‘కిల్’!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా కంప్యూటర్ కోర్సుల్లో వచ్చిన ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్టీయూహెచ్ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 10 వేలకు పైగా సీట్లకు ఎసరు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్ 6,221, మెకానికల్ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ లేని మెకానికల్, సివిల్ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యార్థుల మాటేమిటి? సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్లో కేవలం సివిల్, మెకానికల్ వంటి కోర్సులు మినహా కంప్యూటర్ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. – డాక్టర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్ఐటీ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్కు చెందిన సాత్విక గౌడ్(19) సీఎంఆర్ఐటీలో బీటెక్ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటోంది. శనివారం రాత్రి డిన్నర్కు పిలిచేందుకు స్నేహితురాలు సాత్విక గదికి వెళ్లగా అప్పటికే ఆమె ఏడుస్తూ కూర్చుంది. దీనిపై స్నేహితురాలు ప్రశ్నించగా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా.. ఏమీ చదవలేదని చెప్పింది. అంతేగాక మమ్మీ కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తెలిపింది. తాను తర్వాత తింటానని చెప్పడంతో మీ రూమ్మెట్స్ లేరు కదా ఒంటరిగా పడుకోవద్దని తన గదికి రావాలని చెప్పి స్నేహితురాలు వెళ్లిపోయింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె కని పించకపోవడంతో స్నేహితులు ఆమె కోసం గాలించారు. బాత్రూమ్ డోర్ తలుపులు కొట్టగా ఎంతకీ తెరుచుకోవపోవడంతో హాస్టల్ వార్డెన్కు సమాచా రం అందించారు. వార్డెన్ సిబ్బంది సాయంతో బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా సాత్విక సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్లో తల్లిదండ్రులకు సారీ చెప్పి.. సాత్విక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు తెలిపారు. ‘నా జీవితాన్ని విడిచిపెడుతున్నాను.. సారీ మమ్మీడాడీ’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. గతంలోనూ తాను సరిగ్గా చదవలేకపోతున్నానని కిటికీలోంచి దూకి చావాలనిపిస్తుందని చెప్పేదని, చదువులో ఇబ్బంది కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిపారు. ఈ నెల 15న తన బంధువుల శుభకార్యం ఉండగా పరీక్షలు రాసి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం కాలేజీ వద్దకు వచ్చిన సాత్విక తల్లిదండ్రులు తాము రాకముందే మృతదేహాన్ని ఎలా మార్చురీకి తరలిస్తారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్ దహనం) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సాంకేతిక విద్యకు చికిత్స అవసరం
సాక్షి, హైదరాబాద్: సాంకేతికవిద్యలో గుణాత్మక మార్పు అవసరమని అఖిల భారత ఉప కులప తుల సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మార్కె ట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలను వెతుక్కునేవాళ్లు కాదని, వ్యవస్థను మార్చేవాళ్లు కావాలని ఆకాంక్షిం చారు. శుక్రవారం ఇక్కడ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ‘ఆఫరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్’అనే అంశంపై అఖిల భారత విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సియంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గరీతిలో నిపుణులు కన్పించడం లేదని, ఏటా 21 లక్షలమంది ఇంజ నీర్లు పట్టాలతో వర్సిటీల నుంచి బయటకొస్తున్నా, వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరా లకు తగ్గ నైపుణ్యం ఉంటోందని అన్నారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ, ఈ స్థాయిలో నిపుణులు లభించడం కష్టమనే అభిప్రా యం వ్యక్తం చేశారు. స్వయంసమృద్ధిని కోరుకుం టున్న భారత్లో ఇంజనీరింగ్ విద్యస్థాయి నుంచే స్టార్టప్స్ను, ఇంక్యుబేటర్స్ను తయారు చేయాలని, ఈ గురుతర బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసు కోవాలని సూచించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి కూడా చిన్నపాటి గ్రామస్థాయి ఉపాధి కోసం వెంపర్లాడటం దురదృష్టకరమన్నారు. గత కొన్నాళ్ళుగా ఉన్నతవిద్యలో, మహిళల భాగస్వా మ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సిం హారెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సాంకేతికవిద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదు స్టార్టప్స్ ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదుగురు స్టార్టప్స్ను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వలమార్పు కన్పిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్లల్లో అనేక మంది గ్రాడ్యుయేట్ స్థాయి వాళ్లే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీంద్ర, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
ఇంజనీరింగ్, ఫార్మాలో ఫీజుల వాత.. 15శాతం వరకు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2022–23 విద్యా సంవత్సరం) 15 శాతం మేర వార్షిక ఫీజులు పెరగబోతున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) ఈ మేరకు అనుమతినివ్వనున్నట్టు సమాచారం. ఏఎఫ్ఆర్సీ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఫీజుల పెంపు కోరుకునే అన్ని కాలేజీలు వచ్చే నెల 28లోగా తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రైవేటు కాలేజీల ఆదాయ వ్యయాలను ప్రతి మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. దీని ఆధారంగా ఫీజుల పెంపుదలకు అనుమతిస్తుంది. రాష్ట్రంలో 2019లో ఈ విధంగా అనుమతినిచ్చారు. దీని కాలపరిమితి 2021–22తో ముగిసింది. దీంతో వచ్చే మూడేళ్ళకు ఫీజుల పెంపును ఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీస వార్షిక ఫీజు రూ.35 వేలు ఉంటే, గరిష్టంగా రూ.1.34 లక్షల వరకు ఉంది. ఎక్కువ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.75 వేలకు పైగానే ఉండటం గమనార్హం. కరోనా కాలం నో కౌంట్ ఏఎఫ్ఆర్సీ ఎప్పటిలాగే కాలేజీల నుంచి మూడేళ్ళ వివరాలు కోరింది. అయితే ఇందులో కేవలం 2019–20 కాలానికి సంబంధించిన వ్యయాన్నే పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 20–21, 21–22 సంవత్సరాల్లో ఎక్కువ కాలం కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి లేబొరేటరీలు, లైబ్రరీలు ఇతర ఖర్చులన్నీ ఉండే అవకాశం లేదు. అయితే కరోనా కాలంలో సరిగా ఫీజులు వసూలు కాలేదనే కాలేజీల వాదనతోనూ కమిటీ ఏకీభవించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ విద్యకు మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నామని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చయిందనే వాదనను తెరమీదకు తేవాలని కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నించాయి. కానీ తరహా దోపిడీపై ‘సాక్షి’ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఫ్యాకల్టీ ముసుగులో అవకతవకలపై దృష్టి కాలేజీల వార్షిక వ్యయంలో సింహభాగం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యాలు దీన్నే ప్రధానంగా ఆడిట్ లెక్కల్లో చూపుతాయి. అయితే లెక్కల్లో చూపించే విధంగా ఫ్యాకల్టీ కాలేజీల్లో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. 2019లో ఒకే అధ్యాపకుడిని రెండు, మూడు కాలేజీలు తమ ఫ్యాకల్టీగా చూపడం గమనార్హం. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) స్క్రూటినీలోనే ఇది బయటపడింది. ఈసారి ఇలాంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. కొన్ని కాలేజీలు బోధన సిబ్బందికి సరిగా జీతాలివ్వడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడిట్ రిపోర్టులో ఎవరికి? ఏ ఖాతా ద్వారా చెల్లించారు? అనేది పరిశీలిస్తే కాలేజీల గోల్మాల్ వెలుగు చూసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా 15 శాతం ఫీజుల పెంపు అంశంపై విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఫీజులు పెంచితే ఉద్యమించక తప్పదు రెండేళ్ళుగా కరోనాతో ప్రజలు అల్లల్లాడి పోతుంటే ఫీజుల పెంచాలనే ఆలోచన ఎంతమాత్రం సహేతుకం కాదు. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన నియంత్రణ కమిటీ, పెంపునకు మార్గం సుగమం చేయడం దారుణం. రెండేళ్ళుగా కాలేజీలే లేనప్పుడు ఖర్చు ఎలా ఉంటుంది? ఫీజులు ఎందుకు పెంచాలి? పెంపు నిర్ణయం తీసుకుంటే ఉద్యమించక తప్పదు. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) సిబ్బంది జీతాల వివరాలు బయటపెట్టాలి కరోనా సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు అర్ధాకలితో అలమటిస్తున్నా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో జీతాలు ఇవ్వలేదు. నిజంగా ఇచ్చి ఉంటే అవి బ్యాంకు ద్వారానే ఇవ్వాలి. కాబట్టి ఆ వివరాలు బయటపెట్టాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కాలేజీల నిర్వహణ ఖర్చుపై ఏఎఫ్ఆర్సీ ఓ నిర్ణయానికి రావాలి. అంతే తప్ప ప్రైవేటు కాలేజీల తప్పుడు లెక్కలను పరిగణనలోనికి తీసుకోకూడదు. – అయినేని సంతోష్కుమార్ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్వేర్లో ఆప్లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్వేర్నే వాడుతోంది. ఆప్లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్వేర్లో లేదని, తప్పులు ఆటోమేటిక్గా గుర్తించే సాఫ్ట్వేర్ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఇంజనీరింగ్లో ఇక నిఖార్సైన బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూహెచ్ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్వేర్ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది. దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్ అటెండెన్స్ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి మోసం... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్ విధిగా పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్లాగ్స్తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్టీయూహెచ్కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది. అలాగే అధ్యాపకుల ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. బయోమెట్రిక్తో ఉద్యోగాలు నిలబడతాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. – అయినేని సంతోష్కుమార్ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు) విద్యార్థులకు మేలు బయోమెట్రిక్ హాజరుతో ఆధార్ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్ను లింక్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్, వీసీ -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
15 నుంచి ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ఉన్నత విద్యా మండలి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. మొద టి దశలో మిగిలిపోయిన సీట్లన్నీ ర్యాంకు ఆధారంగా అర్హులకు కేటాయిస్తారు. ఇందులోనూ సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మొదటి దశలో కన్వీనర్ కోటా ద్వారా సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు అక్టోబర్ 13లోగా అవసరమనుకుంటే సీటు రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్లోకి తీసుకుంటారు. అప్పటికీ భర్తీ కానివి, రెండో దశలోనూ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఖాళీ అయ్యే సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తారు. 31 వేలకు పైగా సీట్లు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 78,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా, 14,847 సీట్లు మిగిలిపోయాయి. తొలి కౌన్సెలింగ్లో అఫ్లియేషన్ పూర్తి చేసుకోలేని కాలేజీలు కూడా ఈసారి అర్హత సాధించాయి. కాబట్టి మొత్తం 31,948 సీట్లను భర్తీ చేయనున్నారు. కం ప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు ఎక్కువగా భర్తీ అయినట్లు సమాచారం. రెండో ప్రధాన బ్రాంచి గా భావిస్తున్న ఈసీఈలో దాదాపు 3 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. సివిల్, మెకానికల్ సీట్లతోపాటు ఐటీ కోర్సుల్లో కూడా ఒక్కో బ్రాంచ్లో దాదాపు వెయ్యి సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. క్లైమాక్స్లో ‘బి’కేటగిరీ ఇంజనీరింగ్ ‘బి’కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 5కల్లా పూర్తి చేయాలని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి గడువు విధించింది. ఆ తర్వాత 15లోగా ఉన్నత విద్యామండలికి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ర్యాంకు ప్రకారమే భర్తీ చేయాలని, ఇలా కాని పక్షంలో ఫిర్యాదు చేయాలని మండలి స్పష్టం చేసింది. అయితే, ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం ఈ సీట్ల కేటాయింపు జరగడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉంటే, ప్రైవేటు కాలేజీలు మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా ముందే మాట్లాడుకున్న వారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో మిగులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 200 సీట్లు మిగిలిపోతున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. ఆ తర్వాతనే జాతీయ కాలేజీలైన ఐఐటీ, నిట్ వంటి వాటిల్లో సీట్లొచ్చి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కాలేజీలు ఇలా మిగిలిపోయిన సీట్లను కూడా సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ కాలేజీలకు భర్తీ చేసే వెసులుబాటు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
కంప్యూటర్ కోర్సులకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు హాట్ కేకుల్లా మారాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్లో విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంచుకున్నారు. ఈ కోర్సుల్లో సీటు పొందిన వారిలో చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 78,270 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి తాజాగా తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించింది. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం 61,169 సీట్లను కేటాయించింది. అయితే సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఏఐ, డేటా సైన్స్కు పోటీ కొత్తగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేథ, కృత్రిమ మేథ మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడ్డారు. ఆప్షన్స్ ఇచ్చిన వారిలో 60 శాతం పైగా ఈ కోర్సులను ఎంచుకున్న వారే ఉన్నారు. ర్యాంకు ప్రకారం ఆయా కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న వారు తిరిగి చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అయితే నచ్చిన కాలేజీలో సీటు రాని కొద్దిమంది రిపోర్టింగ్ చేయలేదు. వారంతా మెరుగైన కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్కు సిద్ధమవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్సీ)లో 18,561 సీట్లు కేటాయిస్తే.. 13,942 మంది రిపోర్టింగ్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో 1,634 సీట్లు ఉంటే, 1,192 మంది ప్రధాన కాలేజీల్లో సీట్లు ఖరారు చేసుకున్నారు. సివిల్లో 3,177 సీట్లు కేటాయిస్తే, 2,312 మంది, మెకానికల్లో 2,550 సీట్లకు 1,826 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. -
పెంచిన ఫీజులను ప్రభుత్వమే భరించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: గుట్టుగా పెంచిన ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజుల వసూళ్లకు తెగబడటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
రూల్స్ అన్నారు.. అనుమతులు ఇచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, రూల్స్ పాటించకపోతే అనుబంధ గుర్తింపే ఇవ్వమని జేఎన్టీయూహెచ్ నిన్నటిదాకా ఊదరగొట్టింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో! బుధవారం ఒక్కరోజే ఏకంగా 108 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 11 కాలేజీలు కూడా కలిపితే, రాష్ట్రంలో 119 కాలేజీలకు అనుమతులు వచ్చేశాయ్. ఇది ఏటా జరిగే తంతు.. అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గతంలోకన్నా భిన్నంగా వ్యవహరిస్తామని తెలిపింది. గత నెల 25వ తేదీన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మీడియాకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాల్కు పీహెచ్డీ, అధ్యాపకులకు ఇతర అవసరమైన అర్హతలు ఉన్నాయా.. లేదా చూస్తామన్నారు. కాలేజీలు గుడ్డిగా అధ్యాపకుల జాబితా పంపితే.. వాళ్లు చదివిన యూనివర్సిటీలకు వెళ్లి మరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. సరైన అర్హతలు లేని అధ్యాపకులతో కాలేజీలు నడిపించే విధానాన్ని మారుస్తామని వీసీ తెలిపారు. అన్ని కాలేజీలను తమ కమిటీ పరిశీలించి, అర్హతలున్నాయని తెలుసుకున్నాకే అఫిలియేషన్ ఇస్తామని ఆయన పదేపదే చెప్పారు. కమిటీ అయితే అన్ని కాలేజీలకు వెళ్లింది. ఈ పరిశీలనలో 90 శాతం కాలేజీల్లో లోపాలున్నాయని, మౌలిక వసతుల్లేవని, అధ్యాకులు నిబంధనల ప్రకారంలేరని గుర్తించినట్టు తెలిసింది. అయితే, కమిటీ పరిశీలించి.. ఇచ్చిన నివేదికను మాత్రం జేఎన్టీయూహెచ్ గోప్యంగా ఉంచింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు కనీసం పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. అంతలోనే ఇన్ని కాలేజీలకు అర్హులైన అధ్యాపకులు ఎలా వచ్చారో? మౌలిక సదుపాయాలు ఎలా సమకూరాయో తెలియదు కానీ.. అఫిలియేషన్ అయితే ఇచ్చేసింది. అనుమతులు సరే.. అధ్యాపకుల సంగతేంటి? అధ్యాపకుల సమస్యలు పట్టించుకోకుండా, ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులివ్వడం దారుణమని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్కుమార్ అన్నారు. చాలా కాలేజీల్లో జీతాలే ఇవ్వడం లేదని, వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో అసలు అధ్యాపకులు ఉన్నారా అనే విషయాన్ని కమిటీ పరిశీలించిందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. -
ఇంజనీరింగ్ సీటు ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్ బుకింగ్ మొదలు కాలేజీలో చేరే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ముందు ఇలా చేయండి ►ఈ నెల 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్ అర్హత పొందిన అభ్యర్థులు ‘ ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn’ పేజీకి లాగిన్ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కాలమ్లోకి వెళ్లాలి. ఎంసెట్ హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష హాల్టికెట్ నంబర్ను నిర్ణీత కాలమ్స్లో నింపాలి. ఇందులోనే ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్ నంబర్ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు. ►ప్రాథమిక సమాచారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్ పరిశీలన తేదీని, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ చేసుకోవచ్చు. పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి? ►మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్, ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్తోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ►సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో పరిశీలన అనంతరం సంబంధిత అధికారి ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు. ఆప్షన్ వేళ కంగారొద్దు... ►వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్ఎంసెట్ పేజీకి మీ యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఎంసెట్ వెబ్ పోర్టల్లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీ కోడ్ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్లో క్లిక్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సబ్మిట్ చేయాలి. ►ఆప్షన్స్ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 13 రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12 తర్వాత సైట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. 15న సీటు ఖరారు... ►సెప్టెంబర్ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్ అయి సీటు వచ్చిందా లేదా? చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును అదే నెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దశ వెబ్ ఆప్షన్కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే అభ్యర్థి కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ షెడ్యూల్.. స్లాట్ బుకింగ్: 30–8–21 నుంచి 9–9–21 ధ్రువపత్రాల పరిశీలన: 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్: 4 నుంచి 13 వరకు తొలి దశ సీట్ల కేటాయింపు: 15–9–21 సెల్ఫ్ రిపోర్టింగ్: 20–9–21 -
ఇంటర్ పాసైతే.. ఇంజనీరింగ్కు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ర్యాంకులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో జనరల్ కేటగిరీకి 45 శాతం, రిజర్వుడ్కు 40 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది. కోవిడ్ పరిస్థితులు, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎంసెట్ పాసైనవారు సులువుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు బుధవారం ఎంసెట్ ఫలితాల వెల్లడి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. మొత్తం 1,64,964 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,47,986 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం లక్షకుపైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30వేల వరకు మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్కు హాజరైన నేపథ్యంలో.. సీట్ల కోసం డిమాండ్ ఉండొచ్చని అంచనా. -
Women Safety Tool: ‘టచ్’ చేస్తే షాకే!
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మహిళలపై నానాటికీ పెరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉమెన్ సేఫ్టీ పరికరాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్కు చెందిన మౌనిక, దివ్య, ఎస్.మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది. విజిటింగ్ కార్డు సైజ్ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్ షాక్ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్ కార్డు సైజ్ బోర్డు, రెండు స్టీల్ పేట్లు, 4 ఓల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్, స్పార్క్ గ్యాప్ కెపాసిటర్, పుష్ ఆన్ స్విచ్ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు. -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
అడవి బిడ్డల చెంతకే చదువులమ్మ
సాక్షి, అమరావతి: ఇంతవరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన ఇంజనీరింగ్, మెడికల్ విద్య ఇక నుంచి గిరిజనులకు కూడా అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ కళాశాలల నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘విజయ’గిరుల్లో విశ్వవిద్యాలయం విద్యా ప్రమాణాల మెరుగు కోసం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటైంది. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, రామభద్రాపురం మండలం కోటక్కి మధ్య సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ నిర్మాణం జరగనుంది. సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలను కలుపుతూ ఈ వర్సిటీ ఉంటుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యూనివర్సిటీ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్లో దీన్ని నిర్వహిస్తున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే కొత్త భవనాల్లోకి విద్యార్థులు ప్రవేశిస్తారు. ఇక్కడ మొత్తం ఏడు కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. మొత్తం 140 సీట్లు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వివరాలివీ... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడిసినల్ కెమిస్ట్రీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (ఎంపీసీ) + ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ మెడిసినల్ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్ బీబీఏ+ ఎంబీఏ (ట్రావెల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), బీఎస్సీ + ఎమ్మెస్సీ జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ టూరిజం, అండ్ హాస్పటాలిటీ మేనేజ్మెంట్. యూనివర్సిటీలో చదువుకునేందుకు గిరిజనులు, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ మాదిరిగానే రిజర్వేషన్లు అమలు చేస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి వర్సిటీ ప్రవేశాలు కల్పించింది. కొత్త భవనాలు వచ్చి పూర్తి సౌకర్యాలు ఏర్పాటైన తరువాత ఇందులో రీసెర్చ్ కోర్స్లు కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ట్రైబల్ యూనివర్సిటీకి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెంటార్గా వ్యవహరిస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అకడమిక్ వ్యవహారాల్లో ఏయూ తన సహాయ సహకారాన్ని అందిస్తోంది. అలాగే, విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండి గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి 105.32 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రూ.153 కోట్లతో నిర్మించనున్న ఈ ఇంజనీరింగ్ కాలేజీ 2021-22 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసీఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కళాశాల జేఎన్టీయూ- కాకినాడకు అనుబంధంగా ఉంటుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చి..శ్రీకాకుళం జిల్లా దాటి విశాఖ జిల్లాకు వెళుతున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తి అయితే ఇక నుంచి ఆ సమస్య కూడా తీరిపోతుంది. మన్యంలోనే మెడికల్ విద్య.. విశాఖ జిల్లాలోని మన్యం విద్యార్థులు మెడికల్ విద్యను తమ ముంగిట్లోనే చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 35.01 ఎకరాల్లో 17 భవనాలు నిర్మిస్తున్నారు. ఈ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి కానున్నాయి. భవన నిర్మాణాలను పరిశీలించి కేంద్రం అనుమతి ఇస్తుంది. అంటే మూడేళ్లలో ఈ కళాశాల అందుబాటులోకి రానుంది. 8 గిరిజన జూనియర్ బాలికల కాలేజీల ఏర్పాటు గిరిజన సంక్షేమ శాఖ ఎనిమిది జూనియర్ కాలేజీలను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కాలేజీలో మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 160 మందిని చేర్చుకుంటారు. ఇవన్నీ బాలికల కాలేజీలు కావడం విశేషం. కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే... 1. శ్రీకాకుళం జిల్లా భామిని, మెలియాపుట్టి 2. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ 3. తూర్పు గోదావరి జిల్లా చింతూరు 4. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కునూరు 5. గుంటూరు జిల్లా బొల్లాపల్లి 6. నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామాల్లో కాలేజీలు నెలకొల్పనున్నారు. రూపుమారిన గిరిజన గురుకులాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకుల విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునికమైన వర్చువల్ తరగతి గదుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా విద్యాసంస్థల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి గిరిజన విద్యలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చింది. అలాగే, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వంటలు చేసి వడ్డించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో వంటగదుల యాంత్రీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది. -
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
-
ఏఐసీటీఈకి ఇంజనీరింగ్ కాలేజీల నివేదికలు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్, 111జీవో పరిధిలో ఉన్న 238 ఇంజనీరింగ్ కాలేజీల్లో శుక్రవారం వరకు లోపాల సవరణకు చేపట్టిన చర్యలపై యాజమాన్యాలు ఇచ్చిన నివేదికలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో లోపాలున్న ఈ కాలేజీలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలనుంచి నివేదికలను తీసుకోవాలని జేఎన్టీయూ ను ఆదేశించింది. దీంతో జేఎన్టీయూ యాజమాన్యాల నుంచి నివేదికలు కోరగా, 86 కాలేజీలే లోపాల సవరణకు చేపట్టిన నివేదికలను అందజేశాయి. అందులో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలు 82 ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కాలేజీలు 4 ఉన్నాయి. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటిపై చర్చించారు. కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఇచ్చిన దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 5 వరకు ఉంది. దీంతో ఆలోగా లోపాల సవరణ నివేదికలను ఏఐసీటీఈకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. -
పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్టేక్) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది. ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు రోజుల్లో గవర్నింగ్ బాడీల నామినీలు ప్రతి కాలేజీ గవర్నింగ్ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ స్పష్టం చేసింది. జేఎన్టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది. కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్ రూపొందించి జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు కష్టకాలం వచ్చింది. 2020–21 విద్యా సంవత్సరంలో వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న.. ఆందోళన మొదలైంది. రాష్ట్రం లోని ఆయా కాలేజీలకు భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా భవనాలను నిర్మించి కొనసాగిస్తున్నాయి. ఈ అంశం పై రెండేళ్ల కిందట అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ యాజమాన్యాలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలిస్తేనే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపు ఇస్తామని తెలిపింది. చివరకు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏఐసీటీఈ ఆ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రెండే ళ్లలో అనుమతులు తెచ్చుకోవాలని చెప్పింది. అయినా యాజమాన్యాలు ఇప్పటికీ అనుమతులు తీసుకోలేదు. ముగిసిన గడువు.. మళ్లీ నోటీసులు.. గతంలో యాజమాన్యాలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఏఐసీటీఈ నిరాకరించడం, దానివల్ల రాష్ట్రంలో 238 కాలేజీల్లో ప్రవేశాలు ఆగిపోతే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో రెండేళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు గత నెలతోనే ముగిసిపోవడంతో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండీఏలోనే అధికం.. అనుమతుల్లేకుండా కొనసాగుతున్న కాలేజీల్లో ఎక్కువ శాతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వాటిల్లోనూ 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 42 కాలేజీలు ఉన్నాయి. 238 కాలేజీల్లో కొన్ని కాలేజీలు గ్రామ పంచాయతీ అనుమతితో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి. ఆ 238 కాలేజీల స్థలాలు, భవనాలు, ఇతర అనుమతుల పత్రాలను తనిఖీ చేసి అక్టోబర్లోపు నివేదిక అందించాలని ఏఐసీటీఈ గత ఏప్రిల్లోనే రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది. అది ఆ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ఇంతవరకు కనీసం వాటిని తనిఖీ చేయలేదు. చివరకు ఆ బాధ్యతను జేఎన్టీయూకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. దీంతో సంబంధిత అనుమతి పత్రాలను అందజేయాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ లేఖలు రాసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. -
ఎస్వీయూలో కలకలం
సాక్షి, చిత్తూరు: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య ఆత్మహత్య క్యాంపస్లో కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, వార్డు వార్డెన్ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన క్యాంపస్లో సంచలనం రేపుతోంది. ఈ ఉద్యోగి తాను చనిపోయే ముందు తన చావుకు కారణాన్ని వీడియోలో రికార్డు చేసి పంపడం పలు ఆలోచనలకు రేకెత్తిస్తుంది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్, మరో ఉద్యోగి తనను ఇబ్బందులకు గురిచేశారని వారిని నమ్మొద్దని, వసతి గృహం జాగ్రత్త అని విద్యార్థులకు తన వీడియో ద్వారా హెచ్చరించారు. అసలేం జరుగుతోంది ? ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల 2017లో వరుస వివాదాల్లో చిక్కుకుంది. గత ఏడాది జూన్లో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ కోర్సు విద్యార్థుల మధ్య గొడవలు పెరగడంతో అప్పటి ప్రిన్సిపల్ పద్మనాభం తన పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ప్రిన్సిపల్గా ప్రదీప్కుమార్ బాధ్యతలు చేపట్టారు. వార్డెన్గా పనిచేస్తూ వచ్చిన చెంగయ్యను తొలగించాలని కోరుతూ ఈఏడాది జూన్లో విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను తొలగించి సత్యనారాయణ మూర్తిని వార్డెన్గా నియమించారు. అయితే ఈ దశలో వసతిగృహంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో స్టోర్ ఇన్చార్జ్గా ఉన్న రామచంద్రయ్యను వేరే చోటికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు వసతి గృహంలో తనపై నిందలు మోపారని వార్డెన్ సూపరింటెండెంట్ మరో ఉద్యోగిని నమ్మొద్దంటూ తాను విడుదల చేసిన వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేయడంతో వార్డెన్తో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళన ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో స్టోర్ ఇన్చార్జ్గా పనిచేస్తూ 10 రోజుల క్రితం అదే వసతి గృహంలో వేరే విధులకు బదిలీ అయిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య(52) మృతిపట్ల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో ఆత్మీయంగా ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య విద్యార్థులను ఎంతో కలతకు గురిచేసింది. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. వార్డెన్, ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్రెడ్డి , యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బి. ఓబుల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రేమ్, సదాశివ, ముని, ప్రభు, మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్ ప్రదీప్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, వార్డెన్ సత్యనారాయణమూర్తి, తమ పదవులకు రాజీనామా చేశారు. ఉద్యోగికి న్యాయం చేయాలి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తూ మృతిచెందిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని టైంస్కేల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి రిజిస్ట్రార్ను కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు టైంస్కేల్ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనకు రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. -
కుక్కల దాడి: ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం
సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా : ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ సెంకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమ్య అనే విద్యార్థిని బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెంకండియర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న రమ్యపై శుక్రవారం కాలేజీలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు కాలేజీలో ఫ్రెషర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చడం విద్యార్థులను షాక్కు గురిచేస్తోంది. రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాలేజీ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. -
ఎందుకిలా చేశావమ్మా?
కురబలకోట (చిత్తూరు జిల్లా): కురబలకోట మండలం అంగళ్లులో ఇంజనీరింగ్ విద్యార్థిని పి.భవ్య (19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. ముదివేడు ఎస్ఐ సుకుమార్ కథనం మేరకు.. కడపకు చెందిన పి.భవ్య మదనపల్లె దగ్గర అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. రెండు నెలల క్రితం కళాశాల దగ్గరున్న ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరింది. అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేది. సోమవారం కూడా హాస్టల్ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు. హాస్టల్ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారీ మమ్మీ.. సారీ డాడీ.. ‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ రీజన్ కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్మెంట్..’’ ‘‘నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’’ (ఇంగ్లిష్లో భవ్య రాసిన సుసైడ్ నోట్ సారాంశం) -
‘సెట్’ ఏదైనా ప్రవేశాలు అంతంతే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వపు తప్పిదాలు ఉన్నత విద్యాకోర్సులకు శాపంగా పరిణమించాయి. కళాశాలలు ఎలాంటి ప్రమాణాలు పాటించకున్నా ప్రతిఏటా కోర్సులు, సీట్లు పెంచుకోవడానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దాంతో కాలేజీల్లో ఉన్నత విద్య నాసిరకంగా మారింది. ఉన్నత విద్యలో ప్రమాణాలు దిగజారడానికి టీడీపీ ప్రభుత్వ పెద్దల అవినీతే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాణాలు లేని కళాశాలల్లోవిద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు మినహా మిగిలిన కాలేజీల్లో చేరికలు పెద్దగా లేవు. తాజాగా ఎంసెట్, ఐసెట్ ప్రవేశాల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. కన్వీనర్ కోటాలోని సీట్లలో దాదాపు సగం వరకు ఖాళీగా ఉండిపోతుండగా, భర్తీ అవుతున్న సీట్లు కొన్ని కాలేజీలకే పరిమితం కావడం గమనార్హం. ఫిర్యాదులు అందినా చర్యలు శూన్యం గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, ఫార్మా కాలేజీలపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. బోధకులు లేకుండానే కాలేజీలు నడిపిస్తున్నారని, కొన్ని కాలేజీల్లో కనీసం తరగతులు కూడా నిర్వహించడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై టీడీపీ ప్రభుత్వం దాదాపు 18 విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. కొన్ని కమిటీలు విచారణ చేసి, నివేదికలు ఇచ్చాయి. అయినా ఒక్క కాలేజీపై కూడా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపానపోలేదు. కేవలం భయపెట్టి డబ్బులు దండుకోవడానికే కమిటీలు ఏర్పాటు చేశారు తప్ప కళాశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు టీడీపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణాలు పెంచేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కసరత్తు ఉన్నత విద్యా రంగం పరిస్థితిని చక్కదిద్దేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏలోనూ అదే తీరు ఇటీవలే ఏపీ ఐసెట్ తుది విడత ప్రవేశాలు ముగిశాయి. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించే కాలేజీలు 457 ఉన్నాయి. వీటిలో 336 ఎంబీఏ కాలేజీల్లో 32,069 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా, 19,891 సీట్లు మాత్రమే నిండాయి. 12,178 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కాలేజీల్లో 11,742 సీట్లు మిగిలిపోగా, యూనివర్సిటీ కాలేజీల్లో 436 సీట్లు మిగిలాయి. 121 ఎంసీఏ కాలేజీల్లో 6,287 సీట్లకు గాను 2,124 సీట్లు భర్తీ కాగా, 4,163 సీట్లు భర్తీ కాలేదు. ఇవి కాకుండా ఈ కాలేజీల్లో ఎంసీఏలోకి లేటరల్ ఎంట్రీ కింద ప్రవేశానికి కేటాయించిన 4,647 సీట్లలో 1,116 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 8 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరకపోగా, 161 కాలేజీల్లో సీట్లు అధికంగా ఉన్నా ఒక్కో కాలేజీలో 50 మంది కూడా చేరలేదు. 100 మంది లోపు చేరిన కాలేజీల సంఖ్య 292. బోధనా సిబ్బంది, ల్యాబ్లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఇంజనీరింగ్, ఫార్మసీలో.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 445 కాలేజీలు ఉండగా, ఇందులో కన్వీనర్ కోటాలో 1,06,203 సీట్లు ఉన్నాయి. ఎంసెట్లో అర్హత సాధించినవారు 1,32,997 మంది ఉన్నా కేవలం 68,658 మంది మాత్రమే కౌన్సెలింగ్కు సుముఖత చూపి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలోనూ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారు 68,071 మంది మాత్రమే. ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసే నాటికి కన్వీనర్ కోటా సీట్లలో 60,315 భర్తీకాగా, ఇంకా 45,888 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇంజనీరింగ్లో యూనివర్సిటీ కాలేజీల్లో 6,022 సీట్లకు గాను 562 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కళాశాలల్లో ఏకంగా 41,023 సీట్లు మిగిలిపోయాయి. ఇక ఫార్మసీలో యూనివర్సిటీ కాలేజీల్లో 253 సీట్లకు గాను కేవలం 50 సీట్లు భర్తీ కాగా, 203 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేట్ ఫార్మా కాలేజీల్లో 142 సీట్లు భర్తీ కాగా, 3,530 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. ఫార్మా–డిలో మొత్తం 587 సీట్లుంటే, భర్తీ అయినవి 17 మాత్రమే. 100 లోపు కూడా సీట్లు భర్తీకాని కాలేజీలు 108 ఉన్నాయంటే విద్యారంగం దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. 10 కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బైపీసీ స్ట్రీమ్లో బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా–డి విభాగాల్లో 8,601 సీట్లకు గాను 653 సీట్లు మిగిలాయి. -
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి దుర్మరణం పాలయ్యాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న తల్లికి తీరని శోకం మిగిల్చాడు. రంగారెడ్డి జిల్లా మంకల్ గ్రామానికి చెందిన బుస్సు నరేందర్రెడ్డి, శైలజ దంపతుల కుమారుడు జగమోహన్రెడ్డి (29). హైదారాబాద్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2012 డిసెంబర్ 30న కెనడా వెళ్లాడు. గత నెల 27 లేదా 28న జగన్ ప్రమాదవశాత్తు టొరంటోలోని ఓ నదిలో పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గమనిం చారు. శవాన్ని వెలికితీసి జేబులో బస్పాసు ఆధారంగా న్యూయార్క్లో ఉండే తమ బంధువుకు సమాచారం అందించారని జగన్ కుటుంబసభ్యులు తెలిపారు. జగన్ తండ్రి గతంలోనే గుండెపోటుతో మృతి చెందగా తల్లి కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. తన ముగ్గు రు పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం జిల్లె లగూడ వివేక్నగర్కు వచ్చింది. కష్టపడి పిల్లలను చదివించింది. కూతురు రాజేశ్వరికి వివాహం కాగా పెద్ద కుమారుడు జగదీశ్రెడ్డి ఓ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నా డు. చిన్న కుమారుడైన జగన్ ఉన్నత చదువుల కోసం 2012లో కెనడా వెళ్లాడు. అప్పుడు వెళ్లిన జగన్..కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడటం తప్ప ఎప్పుడూ ఇండియా రాలేదని తెలిపారు. కొడుకు మృతి వార్త తెలిసిన నాటి నుంచి శైలజ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. కాగా, గురువారం తెల్లవారుజామున 5.30కి జగన్ భౌతికకాయం నగరానికి వస్తుందని మృతుడి సోదరుడు తెలిపాడు. అదే రోజు జిల్లెలగూడలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నాడు. -
ఇంజనీరింగ్ కాలేజ్లో అగ్ని ప్రమాదం
చెన్నై: నగర శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తండలంలోని సవిత ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని బాయ్స్ హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ మొత్తం ఎనిమిది అంతస్తులు ఉండగా.. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హాస్టల్ గదులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల్లో తెలుగువారే అధికం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎట్టకేలకు మోక్షం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనం ఎట్టకేలకు పూర్తయింది. రూ 2.63 కోట్ల వ్యయంతో 2016లో అగ్రిమెంట్ అయిన ఈ భవనంలో ఆరు తరగతి గదులు, ఐదు ల్యాబ్లు, ప్రిన్సిపాల్ గది, ఆఫీస్ గది, స్టాప్రూంలు నిర్మించారు. సరిపడా ల్యాబ్లు లేకపోవడం, వివిధ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. వారం రోజుల్లో నూతన భవనం ప్రారంభం కానుండడంతో కొంత మేర ఊరట కలుగనుంది. క్లాస్ రూంలు దూర విద్యా కేంద్రం భవనంలోనే.. కాకతీయ యూనివర్సిటీలో దూర విద్యాకేంద్రంలోని అకాడమిక్ బ్లాక్లో మహిళా ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. నాలుగు బ్రాంచీలు సీఎస్ఈ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ ఉన్నాయి. ఆ నాలుగు బ్రాంచ్ల్లో సుమారు 1000 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరికి కనీసం 16 తరగతి గదులు అవసరం ఉంది. అయితే 15 గదుల్లో కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా మరికొన్ని ల్యాబ్ల కూడా అవసరం ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్లకోసం ఇప్పటికే క్యాంపస్లోని బయోకెమిస్ట్రీలోని ల్యాబ్లను వినియోగించుకుంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ భవనం వారికి పూర్తిస్థాయిలో సరి పోదు. అందువల్ల దూర విద్యా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అకాడమిక్ బ్లాక్లోనే విద్యార్థినులకు తరగతి గదులను అలాగే వినియోగించుకుంటూ నూతన భవనంలో అని గదులన్నింటిని ల్యాబ్లుగా వినియోగించుకోవాలనేది సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల యోచిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయిలో ఒకే చోట నిర్వహించాలంటే ఈ భవనం పక్కనే మరో భవనం నిర్మిస్తే సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కళాశాల భవనం చుట్టూ ప్రహరీని కూడా నిర్మించలేదు. కొన్ని నిధులు వెచ్చించి ప్రహరీని నిర్మించాలనేది కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ భవనం ప్రారంభోత్సవంతో కొంతమేర మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాబ్ల సౌకర్యం పెరిగి ఎంతో ఉపయోగపడబోతుంది. -
సమస్యలే స్ఫూర్తి..సేవే లక్ష్యం
పలమనేరు : చేయూత లేదని అనాథలు బాధపడకూడదు.. ఆదరణ లేదని వృద్ధులు శోకించకూడదు..విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదు. సమాజంలో ప్రతి మూల ఓ వివక్ష కాని ఓ సమస్య కాని విష వృక్షంలా మారి మనిషి జీవితాన్ని కుదిపేస్తోంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న మహోన్నత ఆశయం కోసం ఓ యువతి తపిస్తోంది. వారి సమస్యలే ఆమెకు స్ఫూర్తి..వారికి సేవ చేయడమే ఆమె లక్ష్యం..విద్యార్థి దశలోనే తనకు చేతనైన సాయం చేస్తూ సమా జ సేవలో ముందున్న ఆమె దృక్పథం నేటి యువతరానికి ఆదర్శం. పలమనేరు మదర్థెరీసా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించి, ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న రోహిత మనగతం ఆమె మాటల్లోనే.. కుటుంబం, చదువు నా పేరు రోహిత.. మాది గంగవరం సమీపంలోని మబ్బువాళ్లపేట. నాన్న వెంకటేశ్వర్లు ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అమ్మ హేమలత గృహిణి. అన్నయ్య రిత్విక్ రోబోటెక్ ఆటోమేషన్లో యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. నా ప్రాథమిక విద్య యూనివర్సల్లో, ఇంటర్ శ్రీవాణిలో సాగింది. ఇంటర్ ఎంపీసీలో 97.3 శాతం మార్కులు సాధించా. విట్, ఎస్ఆర్ఎం, సస్త్ర యూనివర్సిటీల్లో ఫ్రీ సీటు వచ్చింది. కానీ బీటెక్(సివిల్) ఇక్కడి మథర్ థెరీసాలో చదివా. బీటెక్ 86.01 మార్కులు సాధించి జేఎన్టీయూలో టాపర్గా గోల్డ్మెడల్ను పొందా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డులు పొందాను. ఏటా కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ వస్తోంది. పోటీల్లో గెలిచి..పేదలకు పంచి కాలేజీలో ఉన్న దాదాపు 20 ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర కాంపిటీషన్స్కు వెళ్లాను. దాదాపు అన్నింటిలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నా. అందులో ఇచ్చే క్యాష్ ప్రైజ్ను పలమనేరులోని వృద్ధాశ్రమానికి, గ్రామంలోని నిరుపేదలకు ఇచ్చేదానిని. మా తల్లిదండ్రులు కూడా నాకు అండదండగా ఉండేవారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం గంటలకొద్దీ చదవడం ముఖ్యం కాదు. సబ్జెక్ట్పై ప్రాక్టికల్గా పట్టు సాధించాలి. ఇందు కోసం నెట్, యూట్యూబ్ లాంటివి ఎంతో ఉపయోగం. అందుకే నేను బీటెక్లో సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా. సింథెటిక్ పెయింటింగ్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ జేఎన్టీయూ, సౌత్ ఇండియా ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో టాపర్గా నిలిచా. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. 2015లో జిల్లాకు వరదలు వచ్చాయి. కాని కొద్ది రోజులకే మా నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ నీటి కోసం అవస్థలు పడ్డారు. నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్లు, చెరువులు లేకపోవడమే ఇందుకు కారణమనిపించింది. దీంతో ఐదు పంచాయతీల్లో దాదాపు 300 ఎకరాలకు నీరు అందించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాను. ఇందు కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నెలల పాటు శ్రమించి అన్ని వివరాలతో ప్రాజెక్టు సిద్ధం చేసి అధికారులకు 2017 జూన్లో అందజేశా. కానీ నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మంచి చేయాలని ఆశ ఉంటే చాలదు అధికారం కూడా కావాలని అప్పుడే అనిపించింది. కలెక్టర్ అయితే నేను అనుకున్నది చేయగలనని అనిపించింది. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. సంక్పలం నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగా. నాకు ప్రజలు కష్టాలు బాగా తెలుసు. మా నాన్నకు వ్యవసాయమంటే ఇష్టం కావడం వల్ల నాకు కూడా పొలం పనులంటే ఆసక్తి. కూలి పనులకొచ్చేవారి జీవితాల్లో కష్టాలను చూశా. విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదని అనిపించింది. వృద్ధులు, అనాథల అవస్థలను చూశా. వారికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనిపించేది. -
ఇద్దరు బిటెక్ విద్యార్థులు దుర్మరణం..
సాక్షి, రంగారెడ్డి: బైక్పై వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అబ్బులపూర్ మేట్ మండలం కవాడి పల్లిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులని తెలుస్తోంది. మృతులు వైష్ణవి(సీఎస్సీ థర్డ్ ఈయర్) లోకేష్( సెకండ్ ఈయర్)గా గుర్తించారు. ఎదురుగా వస్తున్న ఆటోను, టిప్పర్ తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. తీవ్రగాయాలైన విద్యార్థులు ఘటన స్థలంలోని మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
జై కిసాన్.. జై భారత్..
పశ్చిమగోదావరి: రైతే రాజు అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. రైతు లేనిదే దేశం లేదు. దేశానికి ఆహార అవసరాలు తీర్చే రైతును విస్మరించకూడదు. చదువు ఏదైనా వ్యవసాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ భీమవరం జీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తుందుర్రు గ్రామం వద్ద పొలంలోకి దిగారు. వరినాట్లు వేస్తున్న కూలీలకు కొద్దిసేపు సహాయపడ్డారు. రిపబ్లిక్ డేకి ఇదే మా స్వాగతం అంటూ ఆహ్వానం పలికారు. వారంతా జాతీయతా భావం ఉట్టిపడేలా మువ్వన్నెల రంగు వస్త్రాలు ధరించడం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్ / ఏలూరు -
రెండోసారి గిన్నిస్ రికార్డు
కీసర: అనర్గళంగా గంట 11 నిమిషాల పాటు బోధనలు చేయడం ద్వారా కీసర మండలం భోగారంలోని హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి అరిమండ విజయశారదారెడ్డి గిన్నిస్ రికార్డు సాధించారు. గతంలో 250 మంది విద్యార్థులకు బోధన చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. తాజాగా 400 మంది విద్యార్థులకు మైండ్ఫుల్నెస్ అనే అంశంపై పాఠాలను బోధించడం ద్వారా రెండోసారి రికార్డు సాధించారు. సోమవారం కళాశాలలో ‘లార్జెస్ట్ మైండ్ఫుల్నెస్ లెసెన్’పేరిట ఆమె ఈ కార్యక్రమం నిర్వహించారు. యువకుల మనసుల్లో సద్భావనలు నింపి వారిని సన్మార్గంలో నడిపేందుకే మైండ్ఫుల్నెస్ కార్యక్రమం ఏర్పాటుచేశానని విజయ తెలిపారు. మైండ్ఫుల్నెస్ ధ్రువీకరణకు అవార్డు నిర్వాహకులకు పంపిస్తున్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి జయసింహ ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎ.వరప్రసాద్రెడ్డి, వైస్ చైర్మన్ సిద్దార్ధారెడ్డి విజయశారదారెడ్డిని అభినందించారు. -
ఆన్లైన్లోనే ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2018– 19) ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్–2018ను ఆన్లైన్లోనే చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రోజుకు రెండు సెషన్లుగా ఒక్కో సెషన్లో 30 వేల మందికి పరీక్ష నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్ని రోజుల పాటు పరీక్ష నిర్వహించాలి, ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇక గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినా.. ఆన్లైన్ పరీక్షలకు కంప్యూటర్ ల్యాబ్లు అవసరమైన దృష్ట్యా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో నూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బాధ్యతలను టీఎస్ ఆన్లైన్ ద్వారా టీసీఎస్కు అప్పగించనున్నారని.. టీసీఎస్తో టీఎస్ ఆన్లైన్ ఒప్పందం కుదుర్చుకోనుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విధి విధానాలపై పాత కన్వీనర్లతో కమిటీ ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను వచ్చే నెల 10న ఖరారు చేయనుంది. ఇందుకోసం 2017–18 సెట్స్ నిర్వహించిన ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ కన్వీనర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. విధి విధానాల రూపకల్పన పూర్తయ్యాక వచ్చే నెల 20వ తేదీలోగా ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమావేశమై పరీక్షల నిర్వహణ తేదీల ఖరారు, కన్వీనర్ల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తోంది. ఇక కీలకమైన ఎంసెట్–2018 నిర్వహణ బాధ్యతను మాత్రం జేఎన్టీయూహెచ్కే అప్పగించాలని నిర్ణయించింది. లాసెట్తోపాటు మరికొన్ని సెట్స్ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు రిటైర్ కావడంతో ఈసారి కొత్త కన్వీనర్లను నియమించనుంది. లాసెట్ బాధ్యతలను 2017లో కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లాసెట్ కన్వీనర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎంవీ రంగారావు రిటైర్ కావడం, కాకతీయ వర్సిటీలో లా ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో.. ఆ బాధ్యతలను ఉస్మానియా వర్సిటీకి అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఈసారి సెట్స్ ఫీజులు పెరిగే అవకాశముంది. ఎంత ఫీజు అన్నది సెట్ కమిటీ సమావేశంలో ఖరారు చేస్తారు. జిల్లాల వారీగా అవగాహన మొదటిసారిగా ఆన్లైన్లో ప్రవేశపరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు యాజమాన్యాలే అవగాహన కల్పించనుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విద్యా మండలి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ మాక్ (నమూనా) టెస్టులను నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేస్తారు. ఇక సెట్స్ వెబ్సైట్లలోనూ ఆన్లైన్ పరీక్షల ప్రాక్టీస్ లింకులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
పరీక్ష రాయనివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఘట్కేసర్/కీసర: కళాశాల యాజమాన్యం వేధింపులతో ఓ కాలేజీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్వీ నగర్లో నివాసం ఉండే రావి నాగేందర్రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి(20) ఘట్కేసర్ మండలంలోని అవుశాపూర్ విజ్ఞాన్భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 50 శాతం మాత్రమే హాజరు ఉండటంతో అతన్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ రోజూలాగానే బుధవారం కాలేజీకి బయలుదేరాడు. కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కాగా, గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైలు ట్రాక్పై గుర్తు తెలియని శవం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్గా పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్ ఆత్యహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులది యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని గ్రామం. పిల్లల చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. -
తాకట్టులో ‘విద్యార్హత’!
ఉప్పల్కు చెందిన అభినవ్ గండిపేట్లోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. డిస్టింక్షన్లో పాసయ్యాడు. క్యాంపస్ సెలక్షన్లో విప్రో (చెన్నై)లో ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో కాలేజీకి వెళ్లిన అభినవ్కు చేదు అనుభవం ఎదురైంది. రూ.2.20 లక్షల ఫీజు బకాయి ఉందని, డబ్బులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అభినవ్.. చివరకు సమీప బంధువు వద్ద డబ్బు వడ్డీకి తెచ్చి కాలేజీలో చెల్లించాడు. కేవలం అభినవ్ ఉదంతమే కాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. కొందరు విద్యార్థులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తుండగా.. స్థోమత లేని విద్యార్థులు సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలు పొందలేక, పై చదువులకు వెళ్లలేక సతమతమవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యలో కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పథకం కింద చెల్లింపుల్లో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో విద్యార్థులు సంకట స్థితిని ఎదుర్కొం టున్నారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసినా సర్టిఫికెట్లు పొందలేదు. ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తీసుకోవాలని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. బకాయిలు రూ.1,683.59 కోట్లు.. గత విద్యా సంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.2,424.61 కోట్లు కేటాయించింది. ఇందులో గత రెండు త్రైమాసికాల్లో రూ.741.01 కోట్లు విడుదల చేయగా.. ఇంకా రూ.1,683.59 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఉపకార వేతనాలకు సంబంధించి రూ.506.79 కోట్లున్నాయి. వాస్తవానికి ఉపకార వేతన నిధులను నెలవారీగా విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం అందులోనూ జాప్యం చేస్తోంది. బకాయిల చెల్లింపులు మార్చిలోపు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులపై పలు కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్థులకు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు సర్టిఫికెట్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకోవడంతో తదుపరి చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు వచ్చినప్పటికీ సర్టిఫికెట్లు లేక వాటిని వదులుకుంటున్నారు. గుదిబండగా నిర్వహణ .. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రైవేటు యాజమాన్యాలే కీలకం. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే ఫీజులతోనే ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తున్నాం. కానీ మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ గుదిబండగా మారుతోంది. అటు విద్యార్థులను కోర్సు మధ్యలో పంపించలేక.. అప్పులు చేసి నిర్వహించలేక సతమతమవుతున్నాం. అరకొర ఫీజులిస్తూ నాణ్యత, ప్రమాణాలంటూ ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదు. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయలేని పరిస్థితితో ఆందోళన చెందుతున్నాం. – సతీశ్, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం గౌరవాధ్యక్షుడు -
ఇందూరుకు ఐటీ హంగులు
నగరంలో ఐటీహబ్ ఏర్పాటుకు నిధులు ♦ తొలివిడతలో రూ. 25 కోట్లు కేటాయింపు ♦ పెట్టుబడులకు 60 కంపెనీల ఆసక్తి ♦ స్థానికంగా మెరుగుపడనున్న ఉద్యోగాలు ♦ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అవకాశాలు ♦ రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం ♦ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం ♦ ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ కవిత వ్యవసాయ ఆధారిత నిజామాబాద్ జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థాపన దిశగా తొలి అడుగు పడింది. కేవలం హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నిజామాబాద్లో కూడా ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న సర్కారు.. తాజాగా ఈ జాబితాలో నిజామాబాద్ను కూడా చేర్చింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దీంతో రానున్న రోజుల్లో నిజామాబాద్ నగరంలో కూడా ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినప్పటికీ దశాబ్దం క్రితమే జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పడ్డాయి. దీనికితోడు నిజామాబాద్ హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలుండటంతో ఇక్కడ ఈ ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి మహా నగరాలతో పాటు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఐటీ కంపెనీల స్థాపన జరిగితే రానున్న రోజుల్లో స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా ఐటీ అనుబంధ వ్యాపారాలు పెరిగి నగరాభివృద్ధికి బాటలు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీపంలో ట్రిపుల్ ఐటీ.. బాసర ట్రిపుల్ ఐటీ నిజామాబాద్కు సమీపంలో ఉండటం ఒక అడ్వాంటేజ్. నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఉన్నత విద్యా సంస్థలో వేలాది మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడి నుంచి వందలాది మంది ఐటీ కోర్సులు చేసిన అభ్యర్థులు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళుతుంటారు. నిజామాబాద్లో ఐటీ పరిశ్రమల స్థాపన జరిగితే ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. తొలి విడతలో రూ.25 కోట్లు నిజామాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటుకు తొలివిడతలో రూ.25 కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి విడతలో మంజూరయ్యే ఈ నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ దిశగా పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఫలించిన కవిత చొరువ నిజామాబాద్కు ఐటీ హబ్ మంజూరు కావడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరువ చూపారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో చర్చించి మొదటి విడతలో రూ.25 కోట్లు మంజూరు చేయించారు. నిజామాబాద్ ఐటీ హబ్లో పెట్టుబడులు పెట్టేందుకు 60 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్త సోదరుడు మహేష్గుప్త వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో చర్చించారు. ఇక్కడ కంపెనీల స్థాపనకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐల జాబితాను ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్త, మహేష్గుప్తలు మంత్రి కేటీఆర్కు అందజేశారు. -
నేడు పీజీఈసెట్ తొలి జాబితా విడుదల
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను బుధవారం(16న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్– 2017 కోకన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్బాబు మంగళవారం తెలిపారు. పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు తమ పేర్లను http:// www. osmania. ac. in/ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
24 నుంచి ఇంజనీరింగ్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనెల 24వ తేదీనుంచి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈనెల 20 నుంచే తరగతులు ప్రారంభించాలని ముందుగా అనుకున్నప్పటికీ చివరి దశ ప్రవేశాలు కౌన్సెలింగ్ ఈనెల 22 వరకు ఉండటంతో 24 నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు జేఎన్టీయూ తమ అనుబంధ కాలేజీలకు ఈ మేరకు సమాచారం అందించింది. తరగతుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
2019లో నెట్ నిర్వహిస్తాం: ఏఐసీటీఈ
కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్)ను 2019–20లో నిర్వహిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షకు కొన్ని రాష్ట్రాలు అంగీకరించనందున వచ్చే ఏడాది నెట్ ఉండకపోవచ్చని ఏఐసీటీఈ చైర్మన్ అనీల్.డి.సహస్రబుద్ధే వెల్లడించారు. నెట్ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలకు.. ఈ పరీక్ష వల్ల స్థానిక విద్యార్థులకు కలిగే లాభాల్ని వివరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, మాతృ భాషలో విద్య అభ్యసించిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్(ఎస్ఐపీ)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్డ్లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు. -
ఇంజనీరింగ్ సీట్లు 90,011
♦ 36 వేల సీట్లకు కోత ♦ టాప్ కాలేజీల్లో సీట్లు యథాతథం ♦ ఓ మోస్తరు కాలేజీలకు భారీగా దెబ్బ ♦ కన్వీనర్ కోటాలో 61,441 సీట్లు... నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ♦ మిగతావి యాజమాన్య కోటాలో భర్తీ ♦ ప్రభుత్వం సరేనంటే కొత్త కోర్సుల్లో మరో 500 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు యూనివర్సిటీలు ఎట్టకేలకు అనుబంధ గుర్తింపును ఖరారు చేశాయి. మొత్తంగా 90,011 సీట్లకు గుర్తింపు జారీ చేశాయి. 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈనెల 16వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 250 కాలేజీల్లో 1,26,315 సీట్లకు గుర్తింపు ఇవ్వగా, వర్సిటీలు 201 కాలేజీల్లోని 90,011 సీట్లకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చాయి. వీటిలో 187 ప్రైవేటు కాలేజీల్లో 86,951 సీట్లు, 14 ప్రభుత్వ కాలేజీల్లో 3,060 సీట్లున్నాయి. ఈసారి ప్రవేశాలు వీటిలోనే జరుగనున్నాయి. ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చిన సీట్లలో సదుపాయాలు, అధ్యాపకుల కొరత తదితర లోపాలతో 36 వేలకు వర్సిటీలు కోత పెట్టాయి. గతేడాది ఏఐసీటీఈ 1.39 లక్షల సీట్లకు గుర్తింపునివ్వగా, వాటిలో 1.04 లక్షల సీట్లకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. గతేడాదితో పోలిస్తే వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలో 14 వేలకు కోత పడింది. ఈసారి కొన్ని కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే మరో 500 దాకా సీట్లు అందుబాటులోకి వస్తాయి. అనుబంధ గుర్తింపులో ఈసారి మధ్య తరహా కాలేజీలకు దెబ్బ పడింది. కొన్నింటికి గుర్తింపే లభించలేదు. ఏఐసీటీఈ 250 కాలేజీలకు గుర్తింపు ఇస్తే లోపాల కారణంగా 49 కాలేజీల్లో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. వీటిలో 11 కాలేజీలు ప్రవేశాలొద్దని వేడుకున్నాయి. టాప్ కాలేజీల్లో సీట్లకు యథాతథంగా ఆమోదం తెలిపారని, డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లనే తగ్గించారని సమాచారం. వెబ్ ఆప్షన్లు నేటి నుంచి వర్సిటీలు ఆమోదం తెలిపిన కాలేజీల్లో 9 ముస్లిం మైనారిటీ, అదర్ మైనారిటీ కాలేజీలు తమ పరిధిలోని దాదాపు 8 వేల సీట్లకు సొంత ప్రవేశ పరీక్ష ద్వారా సింగిల్ విండో (ఎస్డబ్ల్యూ)–1, 2 విధానంలో ప్రవేశాలు చేసుకోనున్నాయి. ఇవి పోను 83,432 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటాలో 58,381 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,060 సీట్లు కలిపి మొత్తం 61,441 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. 15 శాతం ఓపెన్ మెరిట్ ఉంటుంది. ఇందులో ఏపీ విద్యార్థులకు, నాన్ లోకల్స్కు (గతంలో తెలంగాణలో 10 ఏళ్లు నివాసమున్న కుటుంబాల పిల్లలకు) కూడా అవకాశమిస్తారు. శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఇప్పటికే లాగిన్ ఐడీలను ప్రవేశాల క్యాంపు కార్యాలయం పంపింది. మిగతా 28,570 సీట్లలో యాజమాన్యాలు 15 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో, మరో 15 శాతాన్ని ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో భర్తీ చేసుకుంటాయి. రెండు రోజుల్లో 36,000 ర్యాంకు దాకా ఆప్షన్లు ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తొలి రెండు రోజుల్లో 1–36 వేల దాకా ర్యాంకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 11 నుంచి 18న ఉదయం 11 గంటల ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీ nలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాలేజీలు, బ్రాంచీలవా రీగా సీట్ల వివరాలను సైట్లో పొందవ చ్చు. ఆ తర్వాత ఆప్షన్లు ఇచ్చుకునే వారికి తేదీలవారీ షెడ్యూలును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఖరారు చేసింది. గురువారం దాకా 36 వేల ర్యాంకు లోపు 24,259 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. శుక్రవారం 36,001 నుంచి 46 వేల ర్యాంకు దాకా విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ర్యాంకులవారీగా వెబ్ ఆప్షన్ల తేదీలు తేదీలు ర్యాంకు 16–6–2017, 17–6–2017 1 నుంచి 36 వేలు 18–6–2017, 19–6–2017 36001 నుంచి 56 వేలు 20–6–2017, 21–6–2017 56001 నుంచి 80 వేలు 21–6–2017, 22–6–2017 80001 నుంచి చివరి ర్యాంకు దాకా 22–6–2017, 23–6–2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017 సీట్లు కేటాయింపు, వెబ్సైట్లో వివరాలు 3–7–2017లోగా: కాలేజీల్లో చేరడం ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు తేదీలు ర్యాంకు 16–6–2017 36,001 నుంచి 46,000 17–6–2017 46,001 నుంచి 56,000 18–6–2017 56,001 నుంచి 68,000 19–6–2017 68,001 నుంచి 80,000 20–6–2017 80,001 నుంచి 92,000 21–6–2017 92,001 నుంచి చివరి ర్యాంకు దాకా -
తాకట్టులో విద్యార్హత!
♦ ఫీజులు చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే.. ♦ మూడేళ్లు దాటినా బకాయిల ఊసెత్తని సర్కారు ♦ ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటున్న కాలేజీలు ♦ చెల్లించలేక కాలేజీల్లోనే వదిలేసిన విద్యార్థులు ఉప్పల్కు చెందిన వెంకట్రెడ్డి.. ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 2013–14లో ఎంటెక్ పూర్తి చేశాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు బకాయిలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కాలేజీ యాజమాన్యానికి అతని ఫీజు అందలేదు. దీంతో టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లను ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం తమ వద్దే ఉంచుకుంది. సర్టిఫికెట్లు అవసరమైతే బకాయిలకు సంబంధించి మొత్తాన్ని డీడీS రూపంలో ఇచ్చి తీసుకెళ్లవచ్చని, సర్టిఫికెట్లు వెనక్కు ఇస్తే డీడీ ఇస్తామని వెసులుబాటు కల్పించింది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వూ్యలు తదితర సందర్భాల్లో వెంకట్రెడ్డి అప్పు చేసి కాలేజీలో డీడీలు సమర్పించి సర్టిఫికెట్లు పొందడం.. తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తెచ్చుకోవడం చేస్తున్నాడు. రాష్ట్ర విభజన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన పథకాలపై నెలకొన్న అయోమయం ఇప్పటికీ తీరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిధుల కేటాయింపులు, విడుదల సక్రమంగా ఉన్నప్పటికీ.. విభజన సమయం లో నెలకొన్న బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడం లేదు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నా రు. 2013–14 విద్యా సంవత్సరంలో దాదాపు 1.18 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.248.05 కోట్ల మేర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపులను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతి ఏడాదిలో విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఆ ప్రకారం 2013–14కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఉపకార వేతనాలు 2014–15లో ఇవ్వాలి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు విభాగాల విభజన ఆలస్యం కావడంతో ఆ ఏడాది నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలో వార్షిక సంవత్సరం చివర్లో బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికీ పూర్తిస్థాయి నిధులు విడుదల కాలేదు. ఖజానా విభాగం వద్దే పలు బిల్లులు 2013–14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తెలంగాణ జిల్లాల నుంచి 14.31 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతను నిర్ధారించిన అధికారులు రూ. 2,296.20 కోట్లు అవసరమని లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో 2014–15 వార్షిక సంవత్సరం చివర్లో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతన బిల్లులను సంక్షేమ అధికారులు పాస్ చేశారు. ఆయితే వీటిలో పలు బిల్లులు ఖజానా విభాగంలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు నిధులు విడుదల కాకుండా బ్రేక్ పడింది. ఇలా మొత్తంగా రూ. 248.05 కోట్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినప్పటికీ స్పందన మాత్రం శూన్యం. దీంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధ్రువపత్రాలన్నీ కాలేజీల్లోనే.. రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక సంబంధిత విద్యార్థుల ధ్రువపత్రాలు కాలేజీల్లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు తక్కువ మొత్తంలో ఫీజులుండటంతో చెల్లింపులు జరిపి సర్టిఫికెట్లు తీసుకోగలిగారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు మాత్రం పెద్ద మొత్తంలో ఫీజులు బకాయి పడటంతో చాలామంది తమ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాల వద్దే వదిలేశారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తు సమయంలో కాలేజీల్లో బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని డీడీ రూపంలో సమర్పించి వాటిని తాత్కాలిక పద్ధతిలో తెచ్చుకోవడం, తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు డీడీ చార్జీల భారం మించిపోతోంది. ఇందులోనూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి ఫీజులను నిర్ధారించాయి. రెండుసార్లు డీడీలు ఇచ్చా.. ‘పీహెచ్డీ కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో రెండుసార్లు ఎంటెక్ సర్టిఫికెట్లు అవసరమైతే రూ.20 వేల మేరకు డీడీలు తీసి కాలేజీలో సమర్పించా. ప్రక్రియ ముగిశాక తిరిగి డీడీలను తీసుకున్నా’ అని ఓయూలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని సుష్మ ‘సాక్షి’తో అన్నారు. -
’కాలేజీ యాజమాన్యమే నా బిడ్డను హత్య చేసింది’
-
ఇంజనీరింగ్లో 14 వేల సీట్ల కోత!
- 2017–18లో 242 కాలేజీల్లోని 1.24 లక్షల సీట్లకే అనుమతి - వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి 14 వేల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 33 కాలేజీలకు అనుమతులు తగ్గగా, వాటిల్లోని 14 వేల సీట్లకు కోత ఏఐసీటీఈ పెట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్య కాలేజీలకు ఏఐసీటీఈ తాజాగా అనుమతులు జారీ చేసింది. గతేడాదితో పోల్చితే బీ ఫార్మసీలో 2 వేలు, ఎంబీఏలో 5 వేలు, ఎంసీఏలో 1,500కు పైగా సీట్లకు కోత పడింది. ఎంటెక్లోనూ 7 వేల సీట్లకు అనుమతులి లభించలేదు. ఎంఫార్మసీలో వేయి, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 వేల సీట్లకు కోత పడింది. అయితే త్వరలో మరిన్ని కాలేజీలు, సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాగా, ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్లలో సీట్ల సంఖ్య పెరిగింది. హుస్నాబాద్ కొత్త పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి లభించింది. గతేడాది రాష్ట్రంలో 56 ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 11,980 సీట్లు ఉండగా, ఈసారి 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 12,100 సీట్లకు అనుమతి వచ్చింది. ఇంజనీరింగ్లో 242 కాలేజీల్లోని 4,613 బ్రాంచీలకు అనుమతి లభించింది. మరింతగా తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు.. రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలోని 275 కాలేజీల్లో 1,38,168 సీట్లకు అనుమతినిచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 242 కాలేజీల్లోని 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. మరోవైపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం తనిఖీ నివేదికల పరిశీలన జరుపుతోంది. వాటిలో లోపాలున్న కాలేజీలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. దీనికితోడు సీట్లు, బ్రాంచీల తగ్గింపునకు 81 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 11 కాలేజీలు పలు కోర్సులు, ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపేసేందకు (క్లోజర్) దరఖాస్తు చేసుకున్నాయి. ఆ ప్రకారం మరో 20 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎంటెక్లోనూ భారీ కోత.. ఎంటెక్లో అనుమతులు పొందిన కాలేజీల సంఖ్య తగ్గడంతో ఈసారి 7 వేల వరకు సీట్లకు కోత పడింది. గతేడాది 264 ఇంజనీరింగ్ కాలేజీల్లో 32,086 ఎంటెక్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతివ్వగా ఈసారి 203 ఇంజనీరింగ్ కాలేజీలకు, వాటిల్లో 25,140 సీట్లకే అనుమతులు మంజూరు చేసింది. కాగా, కాలేజీల్లో లోపాల కారణంగా జేఎన్టీయూహెచ్ మరిన్ని సీట్లకు కోత పెట్టే అవకాశముంది. -
తట్టుకోలేం.. తప్పుకుందాం!
- జేఎన్టీయూహెచ్ నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్న కాలేజీలు - సమీప వర్సిటీల నుంచి అఫిలియేషన్ తీసుకునేందుకు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల యత్నం - జేఎన్టీయూ నిబంధనలు, తనిఖీల నుంచి తప్పించుకునే ఎత్తుగడ - ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న 19 కాలేజీలు కాలేజీ వ్యవహారాల కోసం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు పలు దఫాలుగా రావడం అసౌకర్యంగా ఉంది. ఇందుకు సమయం వృథా కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాలేజీకి దగ్గరలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని భావిస్తున్నాం. అందుకు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం)తో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.ఇటీవల జేఎన్టీయూహెచ్కు కరీంనగర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్న దరఖాస్తు సారాంశమిది. సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నుంచి కొన్ని ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిష్క్రమించాలని యోచిస్తున్నాయి. దూరాభారం, సమయ పాలనలో సమస్యల్ని సాకుగా చూపుతూ సమీపంలో ఉన్న వర్సిటీల నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ వర్సిటీకి వినతులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. వర్సిటీ మార్పు కోసం పెద్ద సంఖ్యలో కాలేజీలు దరఖాస్తు చేసుకోవడంపై జేఎన్టీయూహెచ్ యంత్రాంగం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రఖ్యాత వర్సిటీ గుర్తింపు కాకుండా చిన్నపాటి వర్సిటీల వైపు కాలేజీల చూపేంటని సందిగ్ధంలో పడింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 315 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ (ఎంబీఏ, ఎంసీఏ) కాలేజీలు ఉండగా, ఇందులో 147 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తప్పించుకునేందుకేనా? రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో సగానికిపైగా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కాలేజీల అఫిలియేషన్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూ తనిఖీలు కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో వసతులు సరిగ్గా లేని కాలేజీలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాజమాన్యాలు జేఎన్టీయూ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వర్సిటీ మార్పు తెర మీదకు తీసుకొచ్చాయి. జేఎన్టీయూ నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, కాలేజీకి సమీపంలో ఉన్న వర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని ఎత్తుడగ వేశాయి. ఈ క్రమంలో వర్సిటీ మార్పు కోసం జేఎన్టీయూకు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు 19 కాలేజీలు వర్సిటీ మార్పును కోరుతూ వినతులిచ్చాయి. ఆచితూచి అడుగులు యూనివర్సిటీ మార్పు అంశం చిన్నదే అయినా జేఎన్టీయూ మాత్రం నిశితంగా పరిశీలిస్తోంది. దరఖాస్తు చేసుకున్న కాలేజీల పరిస్థితి, మౌళిక వసతులు తదితర అంశాలను లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకో నుంది. ఈ మార్పులతో కాలేజీల సంఖ్య తగ్గితే వర్సిటీ పరపతిని ప్రభావితం చేస్తుం ది. అధిక సంఖ్యలో కాలేజీలు, పెద్ద ఎత్తున పరిశోధనలతో ఉన్న జేఎన్టీయూ నుంచి కాలేజీలు నిష్క్రమిస్తే పరిధి చిన్నది కావడంతోపాటు కార్యక్రమాలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో వర్సిటీల మార్పు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జేఎన్టీయూ ఆచితూచి వ్యవహరిస్తోంది. కాలేజీల సంఖ్య తగ్గడంతో న్యాక్(నేషనల్ అసిస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఇచ్చిన ‘ఏ’ గ్రేడ్కూ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాలేజీల్లో ప్రమాణాలు సైతం తగ్గుతాయని ఆందోళన చెందుతోంది. దీంతో తమ పరిధిలోని కాలేజీలను ఇతర వర్సిటీల పరిధికి వెళ్లనివ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీల నుంచి వచ్చిన అర్జీలను ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి నివేదించాలని నిర్ణయించింది. మార్పు ప్రక్రియను ఆమోదిస్తే మరిన్ని కాలేజీలకు అవకాశం కల్పించినట్లవుతుందని భావిస్తున్న జేఎన్టీయూహెచ్ ఆ మేరకు ప్రభుత్వానికి సూచన చేసేందుకు సిద్ధమవుతోంది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘డమ్మీ లెక్చరర్లు’..!
బోధన సిబ్బంది భర్తీలో కాలేజీల ఎత్తుగడ ⇒ సిబ్బందిని నియమించకుండా సర్టిఫికెట్లతో మేనేజ్ చేస్తున్న వైనం ⇒ డమ్మీ లెక్చరర్లు తనిఖీలున్న రోజే కాలేజీల్లో కనిపిస్తారు.. ⇒ ఆ రోజుకు వారికి రూ.2 వేల నుంచి 5 వేలు చేతిలో పెడతారు.. ⇒ నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: బోధన సిబ్బంది నియామకాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేనప్పటికీ రికార్డుల్లో మాత్రం ఉన్నట్లు సృష్టించేందుకు నానాతంటాలు పడుతున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన సిబ్బంది, ఇతర సదుపాయాలున్నాయా లేదా అన్నదానిపై నిజనిర్ధారణ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏప్రిల్ 15నాటికి తనిఖీల ప్రక్రియ పూర్తి కానుండగా, ఇప్పటివరకు 40 శాతం కాలేజీల్లో పరిశీలన ముగిసినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో కమిటీ సభ్యులు పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను యూనివర్సిటీకి నివేదించాలి. ఈ క్రమంలో కమిటీని సైతం బురిడీ కొట్టించేలా యాజమాన్యాలు డమ్మీ లెక్చరర్లను సీనియర్ ఫ్యాకల్టీలుగా చూపిస్తున్నారు. అఫిలియేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 310 కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 214 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, మిగతావి ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు. సగానికి పైగా డమ్మీలే...! ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు నిర్వహిస్తుండడంతో కాలేజీలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న సిబ్బందిని ప్రత్యక్షంగా చూపేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బుధవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కాలేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో లెక్చరర్లు, వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఇంతలో తనిఖీ బృందంలోని సభ్యుడు సమీపంలోని ఓ విద్యార్థితో ముచ్చటిస్తూ ఫలానా లెక్చరర్ తెలుసా అని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పాఠ్యాంశ బోధన తెలియని డమ్మీ అధ్యాపకులు చాలామంది ఉన్నట్లు గుర్తించారు. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. తనిఖీల రోజే భత్యం... ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో డమ్మీ లెక్చరర్లే ఎక్కువ. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొందరు పూర్వ విద్యార్థులు లేదా నచ్చిన వ్యక్తుల్ని లెక్చరర్లుగా ఎంపిక చేసి, వారి నుంచి సర్టిఫికెట్లు తీసుకుని కాలేజీల్లో భద్రపరుస్తారు. తనిఖీల సమయంలో వాటిని అధికారులకు చూపడంతో పాటు ఆయా అభ్యర్థులను పిలిపించి లెక్కలు సర్దుబాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలేజీకి హాజరైన డమ్మీ లెక్చరర్లకు రూ. రెండు వేలు నుంచి రూ. ఐదు వేల వరకు ముట్టజెపుతున్నారు. సాధారణంగా తనిఖీ బృందాలు కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేయాలి. కానీ యాజమాన్యాలకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమై ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అవకతవకలను కప్పిపుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. నిబంధనల మేరకు అంకెలు సరిపోవడంతో అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. మహ్మద్ పాషా ఎంటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సంప్రదిస్తే.. లెక్చరర్ ఉద్యోగం ఇస్తామని అందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో వారి సూచన మేరకు సర్టిఫికెట్లు ఇచ్చాడు. లెక్చరర్ ఉద్యోగం ఇస్తున్నట్లు లెటర్ ఇచ్చారు కానీ నెలవారీ వేతనం మాత్రం ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే.. సమాచారం ఇచ్చినప్పుడు వస్తే చాలని సూచించడంతో పాషా ఖంగుతిన్నాడు. యాజమాన్యం అడపాదడపా సమాచారమిస్తున్నప్పుడు హాజరవడంతో రూ. రెండు వేలు నుంచి రూ. ఐదు వేలు చెల్లిస్తుండటంతో సరేలే అని సర్దుకుని తనపని తాను చేసుకుంటున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఆ కాలేజీలో సిబ్బంది ఉండరు. మౌలికవసతులు ఉండవు. కానీ అన్నీ ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అడుతున్నాయి. – గత అసెంబ్లీ భేటీలో రీయింబర్స్మెంట్పై చర్చలో సీఎం కేసీఆర్ అన్న మాటలివి.. ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ అధికారుల తనిఖీల్లో పలు కాలేజీల్లో ఇలాంటి సంఘటనలే బయటపడుతున్నాయి. -
838 కాలేజీల్లో ప్రవేశాలు సున్నా..!
ఫలితంగా గుర్తింపును రెన్యువల్ చేసుకోని కాలేజీలు ⇒ ఉపకార వేతనాలకు ఈ–పాస్ సైట్లోనూ రిజిస్ట్రేషన్ చేయించని వైనం ⇒ పలు కోర్సుల రద్దు కోసం ఇంజనీరింగ్ కాలేజీల దరఖాస్తులు ⇒ ప్రవేశాలపై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ జాప్యమే కారణం ⇒ కౌన్సెలింగ్ల నిర్వహణలో అలసత్వంతోనూ ఈ పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యా కళాశాలలు విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. ప్రవేశాల సంఖ్య తగ్గిపోవడంతో మూతపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 838 కాలేజీల్లో విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందలేదు. కొన్నింటిలో అరకొరగా ప్రవేశాలు జరిగినా.. సదరు యాజమాన్యాలే ఆ విద్యార్థులను సమీప కాలేజీల్లో చేర్పించేశాయి. 2016–17 విద్యా సంవత్సరానికిగాను ఆయా బోర్డుల నుంచి గుర్తింపు రెన్యువల్ను కూడా వాయిదా వేసుకున్నాయి. అటు సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించే ఈ–పాస్ వెబ్సైట్లోనూ అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం గమనార్హం. పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం, కౌన్సెలింగ్ నిర్వహణలో అలసత్వం కారణంగా కాలేజీల్లో అడ్మిషన్ల పరిస్థితి గాడి తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 20 శాతం కాలేజీలు బంద్! రాష్ట్రంలో మొత్తంగా 7,005 కాలేజీలు ఉన్నాయి. అందులో 2,750 కాలేజీలు ఇంటర్మీడియెట్, ఒకేషనల్ కాలేజీలు కాగా.. మిగతా 4,245 కాలేజీలు డిగ్రీ, వృత్తివిద్యకు సంబంధించినవి. 2016–17లో జూనియర్ కాలేజీలన్నింటిలోనూ ప్రవేశాలు సంతృప్తికరంగా జరిగాయి. కానీ డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డీఈడీ కోర్సు ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 111 డీఈడీ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు లేరు. అదేవిధంగా బీఈడీ కోర్సుకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత ఉన్నా కాలేజీల్లో చేరలేని పరిస్థితి. ఫలితంగా 83 కాలేజీల్లో విద్యార్థులు చేరలేదు. అదే విధంగా ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ విద్యార్థుల చేరిక భారీగా తగ్గింది. దాదాపు 80 కాలేజీలు పలు కోర్సులకు సంబంధించి అనుమతులు రద్దు చేయాలని జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనూ.. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించడం, దానికి తోడు గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడంతో చాలా మంది ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడంపై దృష్టిపెట్టారు. శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లలో చేరారు. ఈ క్రమంలో ఇతర కోర్సుల వైపు దృష్టి సారించలేదు. అలాగే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు సైతం చేపట్టడంతో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చాలా కాలేజీల్లో తగ్గిన ప్రవేశాలు ► ఉపాధి మరియు శిక్షణ సంచాలక శాఖ పరిధిలోని 274 కాలేజీల్లో 63 కాలేజీల్లో ప్రవేశాలు నమోదు కాలేదు. ► జేఎన్టీయూ పరిధిలోని 518 ఇంజనీరింగ్, పీజీ కాలేజీలకుగాను 110 కాలేజీల్లో అడ్మిషన్లు జరగలేదు. దాంతో ఆయా కాలేజీలు గుర్తింపును రెన్యువల్ చేసుకోలేదు. ► సాంకేతిక విద్యా, శిక్షణ బోర్డు పరిధిలో ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర కాలేజీలు 282 ఉండగా.. వీటిలో 43 కాలేజీల్లో విద్యార్థుల చేరిక చాలా తక్కువగా నమోదైంది. ► తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 104 కాలేజీలుండగా.. 7 కాలేజీల్లో అడ్మిషన్లు జరగలేదు. ► మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 29 డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రవేశాలు కాలేదు. ► కాకతీయ వర్సిటీ పరిధిలో 509 డిగ్రీ, పీజీ కాలేజీలకుగాను 62 కాలేజీలు గుర్తింపును రెన్యువల్ చేసుకోలేదు. ► ఉస్మానియా వర్సిటీ పరిధిలోని 913 కాలేజీల్లో 183 కాలేజీలు ఈ–పాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. -
27 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు!
⇒ కసరత్తు చేస్తున్న జేఎన్టీయూ ⇒ రానున్న ఏప్రిల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ! సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో తగిన స్థాయిలో ఫ్యాకల్టీ, సదుపాయాలను పరిశీలించేందుకు ఈనెల 27వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన కసరత్తు ప్రారంభించింది. అనుబంధ గుర్తింపు కోసం జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు కాలేజీల దరఖాస్తులను స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. ఈనెల 2 నుంచి ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. 2వ తేదీ నుంచి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఈ నెల 27 నుంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేసి, ఆ నెలాఖరు నుంచే 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు జారీని ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు (రికగ్నైజేషన్) ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈనెల 9 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై చేపట్టిన తనిఖీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. భారీగా తగ్గనున్న సీట్లు! వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే 11 కాలేజీలు మొత్తంగా ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు పలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇక వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జేఎన్టీయూకు విజ్ఞప్తులు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో మొత్తంగా 20 వేల వరకు సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. 2016–17లో రాష్ట్రంలోని 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల సంఖ్య లక్ష లోపే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈసారి ఫ్యాకల్టీ విషయంలో కాలేజీలకు ఊరటనిచ్చేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. కాలేజీలకు గుర్తింపు లభించిన సీట్ల ప్రకారం కాకుండా, కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా, లేదా? అన్నది పరిశీలిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. దీంతో అవసరం లేకపోయినా ఫ్యాకల్టీ నియమించాల్సిన పరిస్థితి తప్పింది. -
గుర్తింపు నిబంధనలపై గుబులు
♦ ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు నిబంధనల్లో ఏఐసీటీఈ మంజూరైన సంఖ్య మేరకు ఉండాల్సిందే ♦ ఫ్యాకల్టీ తక్కువుంటే సీట్లు తగ్గించుకోవాల్సిందే ♦ కొన్ని నిబంధనలకు మాత్రం సడలింపులు ♦ 10 ల్యాబ్లు అక్కర్లేదు.. 8 ఉన్నా చాలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్యతో సంబంధం లేకుండా కాలేజీకి మంజూరైన సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమించుకోవాల్సిందేనని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా అధ్యాపకులను నియమించుకుంటామన్న కాలేజీల యాజమాన్యాల అభ్యర్థనను తిరస్కరించింది. అనుబంధ గుర్తిం పుక్రమంలో తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ మౌఖికం గా పేర్కొందని యాజమాన్యాలు అంటు న్నా, అధికారికంగా నిబంధనల్లో పొందుపరచకపోవడంతో వాటికి గుబులు తప్పడం లేదు. ఒకట్రెండు రోజుల్లో రానున్న అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్లో ఎలాంటి నిబంధనలుంటాయోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. 2017– 18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సాంకేతిక విద్యా సంస్థలు (పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు జారీ చేసిన కొన్ని నిబంధనల్లో ఏఐసీటీఈ కఠినంగానే వ్యవహరించిందని యాజమాన్యాలంటున్నాయి. కాకపోతే పలు నిబంధనలను సులభతరం చేసిందని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్ పేర్కొన్నారు. సీట్ల తగ్గింపూ సులభమే వర్సిటీ ఎన్వోసీ లేకపోయినా సీట్లు తగ్గించుకునేలా ఏఐసీటీఈ వెసులుబాటు ఇచ్చింది. ఒక సెక్షన్లో 120 సీట్లుంటే వాటిలో 30 సీట్లను తగ్గించుకోవచ్చు. తర్వాతి ఏడాది కావాలంటే 120కి పెంచుకోవచ్చు. 60కి తగ్గించుకునేందుకూ ఎన్వోసీ అక్కర్లేదు. కాకపోతే 60కి తగ్గించుకున్నాక మళ్లీ 120 సీట్లు కావాలనుకు న్నా, ఇన్టేక్ను పెంచుకోవాలన్నా అక్రెడిటేషన్ తప్పనిసరి. ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సుల్లోనే రెగ్యులర్, ఫస్ట్ షిఫ్ట్లో ఇన్టేక్ను పెంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్, డ్యుయల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలంటే అక్రెడిటేషన్ తప్పనిసరి. ఆ కోర్సులో ప్రవేశాలే వద్దనుకుంటే వర్సి టీ నుంచి ఎన్వోసీ కావాలి. సెకండ్ షిఫ్ట్ రద్దుకు, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రద్దుకు అక్కర్లేదు. పీహెచ్డీ ఫ్యాకల్టీ తప్పనిసరి యూజీ, పీజీ కోర్సులకు పీహెచ్డీ అర్హత కలిగిన ప్రొఫెసర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పీజీకి ఒక ప్రొఫెసర్ తప్పనిసరి. 1:2:6 నిష్పత్తిలో అధ్యాపకులుండాలి. బీటెక్ ఇంజనీరింగ్కు 1:15, ఎంటెక్లో 1:12 నిష్పత్తిలో ఉండాలి. అనుమతించిన ఇన్టేక్ ప్రకారం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. 80 శాతం మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. వర్సిటీ మాత్రం 60 నుంచి 120 మంది విద్యార్థులకు ఒక యూజీ, పీజీ, పీహెచ్డీ తప్పనిసరని, తర్వాత ప్రతి 60 మం దికి ఒక పీహెచ్డీ ఫ్యాకల్టీ ఉండాలని పేర్కొం ది. అనుబంధ అధ్యాపకులు ఇప్పటిదాకా తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఎన్వోసీ తెస్తే నే మరోచోట పనిచేసే వీలుండేది. ఇక ఇప్పుడు రెండు, మూడుచోట్ల పనిచేయవచ్చు. బీటెక్ ఉండి, అనుభవముంటే చాలు. 10 ల్యాబ్ల నిబంధనను 8కి పరిమితం చేశారు. బీటెక్కు బోధిస్తున్న సిబ్బందిలో 50 శాతం మందిని పాలిటెక్నిక్ బోధనకూ వినియోగించుకోవచ్చు. ఒక్క దరఖాస్తుతో అన్ని అనుమతులూ యాజమాన్యాలు ఒక్క దరఖాస్తుతో అన్ని అనుమతులూ పొందేందుకు ఏఐసీటీఈ వీలు కల్పించింది. డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్రారంభానికి; కాలేజీని మరో ప్రాంతానికి మార్చుకునేందుకు; మూసివేసేందుకు; మహిళా కాలే జీ నుంచి కో ఎడ్గా, కో ఎడ్ నుంచి మహిళా కాలేజీగా మార్చుకునేందుకు; ఇంజనీరింగ్ను మూసేసి పాలిటెక్నిక్ కాలేజీగా, పాలిటెక్నిక్ను మూసేసి ఇంజనీరింగ్ కాలేజీగా మార్చుకునేందుకు; సొసైటీ పేరు, సభ్యుల మార్పు, విద్యా సంస్థ పేరు మార్పు, అనుబంధ గుర్తింపు విషయంలో మరో వర్సిటీ పరిధిలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిం చింది. వీటకి వర్సిటీ ఎన్వోసీ ఉంటే చాలు. -
మరింత తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు!
♦ బ్రాంచీల రద్దుకు 80కి పైగా కాలేజీల దరఖాస్తు ♦ ప్రవేశాల రద్దుకు దరఖాస్తు చేసిన మరో 11 కాలేజీలు ♦ దరఖాస్తులను పరిశీలిస్తున్న జేఎన్టీయూహెచ్ ♦ నెలాఖరులో ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు షురూ! ♦ కాలేజీల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసిన ఏఐసీటీఈ ♦ ఈనెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. 11 కాలేజీల వరకు ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జవహర్లాల్ నెహ్రూ సాంకే తిక విశ్వ విద్యాలయం–హైదరాబాద్ (జేఎన్టీ యూహెచ్)కు దరఖాస్తులు వచ్చాయి. కాలేజీల్లో కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ గడువు డిసెంబరు 27వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జేఎన్టీయూహెచ్ ఇచ్చే ఎన్వోసీతో కాలేజీ యాజమాన్యాలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోనున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 219 కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి మరింతగా సీట్లు తగ్గిపోనున్నాయి. గుర్తింపునకు ఏఐసీటీఈ నోటిఫికేషన్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి సాంకేతిక విద్యా కాలేజీ యాజమాన్యాలు గుర్తింపు, కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు, కాలేజీల షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుముతో (పాత కాలేజీలు) వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. కాలేజీల అనుమతుల ప్రక్రియను పిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారం భిస్తామని, ఏప్రిల్ 10 లోగా పూర్తి చేస్తామని ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ అలోక్ ప్రకాశ్ మిట్టల్ ఆ నోటిఫికేషన్లో వివరించారు. కసరత్తు వేగవంతం చేసిన జేఎన్టీయూహెచ్ ఏఐసీటీఈ నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో యూనివర్సిటీ నుంచి కాలేజీలు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్) పొందే ప్రక్రియపైనా జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల నిర్ణ యించింది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించి.. మరోవైపు తనిఖీలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 25 నుంచి కాలేజీల్లో తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉంది. వీలైతే కలసి.. లేదంటే సమాంతరంగా తనిఖీలు ఏఐసీటీఈ బృందాలు కాలేజీల్లో సదుపాయాలపై తనిఖీ చేయనున్నాయి. వీలైతే ఏఐసీటీఈ బృందాలతో జేఎన్టీయూహెచ్ ఎఫ్ఎఫ్సీ బృందాలు కలసి తనిఖీలు చేసే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అనుమతుల ప్రక్రియ, కాలేజీల తనిఖీలను ఏఐసీటీఈ ప్రారంభించనుంది. దీంతో కలసి తనిఖీలు చేపట్టే అంశంపై ఏఐసీటీఈతో మాట్లాడేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమవుతోంది. తద్వారా కాలేజీల్లో సదుపాయాలు, లోపాలు, సమస్యలపై తనిఖీలను మరింత పక్కాగా, పారదర్శకంగా చేపట్టవచ్చని భావిస్తోంది. అలా వీలుకాకపోతే సొంతంగా తనిఖీలు జరపనుంది. మే నెలలో యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయనుంది. జూన్ 1వ తేదీకల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. -
‘జి.పుల్లారెడ్డి’కి అరుదైన అవకాశం
– డీఎస్టీ ఫిస్టు–2016 నిధులు మంజూరు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కళాశాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ఫండ్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–2016లో భాగంగా 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ బీ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ. 30 లక్షలు, రెండో విడతలో మరో 30 లక్షల రూపాయలు రానున్నట్లు వివరించారు. ఈ నిధులను సైన్స్ పరికరాల కొనుగోలు కోసం వినియోగించేందుకు వీలుందన్నారు. దేశంలోని అతికొద్ది కళాశాలలకు మాత్రమే ఫీస్టు నిధులు మంజూరవుతాయని, అందులో తమ కళాశాలకు స్థానం లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సంవత్సరమే కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని అర్అండ్డీ విభాగం సీపీఈ(కాలేజ్ విత్ పొటెన్సియల్ ఎక్సాలెన్స్) స్థాయిని ఇచ్చిందని. ఏపీఎస్ఎస్డీసీ, పీఎంకేవీవై కింద మూడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మంజరైన విషయం విదితమేనని ఆయన వివరించారు. -
పెడదోవ పట్టే మార్గాలను ప్రోత్సహించం: సీఎం
సాక్షి, విశాఖపట్నం: ‘‘కొందరు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రపంచం లోనే పెద్ద ఎత్తున బికినీలతో లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటికి విశాఖపట్నంలో ఆస్కారం ఇచ్చే సమస్యే లేదు. మన కల్చర్కు వ్యతిరేకంగా, మన సంప్రదాయాలకు విరుద్ధంగా, యువత పెడదోవ పట్టే మార్గాలను ప్రోత్సహించం. అదే సమయంలో మనకుండే వనరులను సమర్థంగా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరినీ గౌరవిస్తాం తప్ప ఎవరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురాదు’’ అని బాబు అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. -
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
-
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
• తలలు పట్టుకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు • ఇప్పటిదాకా అడ్డగోలు డొనేషన్లు • ఎలాంటి రశీదులు లేకుండానే కోట్లలో వసూళ్లు • ఇప్పుడు ఆ డబ్బును ఎలా బయటకు తేవాలో అర్థంకాని స్థితి • లాసెట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో డొనేషన్ల వసూలు కష్టమే సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ఎలాంటి రశీదులు లేకుండా డొనేషన్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇప్పుడెలా చెలామణిలోకి తేవాలో అర్థం కాక యాజమన్యాలు తలపట్టుకున్నారుు. ఇటీవల చేపట్టిన మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల సందర్భంగా వసూలు చేసిన డొనేషన్ల డబ్బులో కొంత మొత్తాన్ని కొన్ని యాజమాన్యాలు మాత్రమే బ్యాంకుల్లో వేసుకున్నారుు. కానీ అనేక యాజమాన్యాల వద్ద ఆ సొమ్ము బ్లాక్ మనీగానే ఉండిపోరుుంది. ఇప్పుడు వాటిని ఎలా చెలామణిలోకి తేవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారుు. బ్యాంకుల్లో వేయని సొమ్ము మాత్రమే కాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు లెక్కలు అడిగే అవకాశం ఉండటంతో యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలో భారీగా.. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీటు ఫీజు ఐదేళ్లకు రూ.55 లక్షలు. కానీ వసూలు చేసింది మాత్రం గరిష్టంగా కోటి రూపాయలు! అంటే ఒక్కో సీటుపై రూ.45 లక్షలు అదనం. మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఒక్కో సీటుకు కనీసంగా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు యాజమాన్యాలు డొనేషన్ల రూపంలో వసూళ్లు చేశారుు.. ఇక టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డొనేషన్ల రూపంలో రూ.5 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఆ డబ్బుకు రశీదుల్లేవ్.. లెక్కలు లేవు. అనేక యాజమాన్యాలు ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని మాత్రమే ఇప్పటివరకు బ్యాంకులకు చేర్చగా.. అనేక యాజమాన్యాల వద్ద అనధికారిక సొమ్ము అలాగే ఉండిపోరుుంది. ఒక్క తెలంగాణలోనే మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్లో 1,200 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై యావరేజ్గా రూ.40 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు అంచనా. అంటే లెక్కల్లోకి రాని దాదాపు రూ.480 కోట్ల డబ్బు యాజమాన్యాల వద్ద ఉండి పోరుుంది. ఏపీలోనూ బీపీ.. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ 2,300 మెడికల్ సీట్లలో 1,150 సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేశారు. ఒక్కో సీటుపై అదనంగా రూ.40 లక్షల దాకా వసూళ్లు చేశారు. ఈ లెక్కన అక్కడ రూ.450 కోట్లు లెక్కల్లోకి రాకుండా యాజమాన్యాల వద్ద ఉండిపోరుుంది. ఇవే కాదు తెలంగాణ, ఏపీలోని డెంటల్ కాలేజీల్లోనూ 1,300 వరకు సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై సగటున రూ.15 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఇలా బీడీఎస్లో అదనంగా వసూలు చేసిన దాదాపు రూ.200 కోట్లు లెక్కల్లోకి రానిదేనని అంచనా. ఇప్పుడు ఆ సొమ్మును ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది. అరుుతే ఒకట్రెండు కాలేజీలు కాలేజీ డెవలప్మెంట్ ఫండ్ కింద రశీదు ఇచ్చి వసూలు చేసిన మొత్తానికి మాత్రం ఇబ్బంది ఉండదని యాజమాన్య వర్గాలు పేర్కొన్నారుు. ఇంజనీరింగ్లోనూ అదే పరిస్థితి.. తెలంగాణలోని 20కి పైగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల రూపంలో ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల వరకు అదనంగా వసూలు చేశారుు. ఒక్కో కాలేజీలో సగటున 250 సీట్ల చొప్పున మేనేజ్మెంట్ కోటాలో 5 వేల వరకు భర్తీ చేశారుు. ఒక్కో సీటుపై అదనంగా రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ.250 కోట్లు లెక్కల్లేని డబ్బును వసూలు చేసినట్లు అంచనా. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళనలో టాప్ కాలేజీలు పడ్డారుు. డొనేషన్లు తగ్గుతాయా? ప్రస్తుతం లాసెట్ ప్రవేశాలు జరుగుతున్నందున.. మేనేజ్మెంట్ కోటా ప్రైవేటు కాలేజీలు పెద్దగా డొనేషన్లను వసూలు చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద నగదు రూపంలో పెద్దగా డబ్బు అందుబాటులో లేనందువల్ల భారీ మొత్తంలో డొనేషన్లు చెల్లించి కాలేజీల్లో చేరే పరిస్థితి ఉండదు. దీంతో యాజమాన్యాలు డొనేషన్లు పెద్దగా తీసుకునే అవకాశం ఉండదన్న భావన నెలకొంది. -
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
= మృతులు చీరాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు = ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే చీరాల : దీపావళి తర్వాత వెలుగులు నిండాల్సిన ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు విద్యార్థులను లారీ రూపంలో మృతువు కబళించింది. మరో గంటలో ఇంటికి చేరాల్సిన విద్యార్థులు విగతజీవులయ్యారు. వివరాలు.. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న గుంటూరు జిల్లా కర్లపాలే చెందిన వై.రాజేష్( 21), పొన్నూరుకు చెందిన షేక్ నితిన్ షరీఫ్ (21)లు సోమవారం కళాశాల వదిలిన తర్వాత బైకుపై స్వగ్రామాలకు బయల్దేరారు. కొత్తపేట బజాజ్ షోరూమ్ సమీపంలో బైపాస్లో లారీని ఢీకొట్టి ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాజేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా నితిన్ షరీఫ్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తపేట నుంచి వడ్డే సంఘం వైపునకు ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. బైపాస్పై వాహనాలు వస్తుండటంతో అమె ఆగింది. ద్విచక్ర వాహనం ఆపే క్రమంలో అదుపుతప్పి ఆమె వాహనం కిందపడిపోరుుంది. ఆమె ముందు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి చూస్తూ బైకు నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కిందపడి దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు అప్పటి వరకూ తమతోనే ఉన్న మిత్రులు కొద్దిసేపటికే విగజీవులవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహలను పొస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడి హత్య
చిలకలూరిపేట రూరల్: మండలంలోని బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య రామచంద్రాపురం శివారులో ఇంజినీరింగ్ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య వ్యక్తి హత్య జరిగిందని ఆదివారం పోలీసులకు సమాచారం అందడంతో çఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో బీరుబాటిల్, సెల్ఫోన్ సిమ్కార్డు లభించింది. సిమ్ ఆధారంగా మృతిచెందింది చిలకలూరిపేట పట్టణానికి చెందిన నెల్లి రమణ (34)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రమణ నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఇంటికి రాలేదు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ యు.శోభన్బాబు తెలిపారు. కాగా, మృతిచెందిన రమణ చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం చిట్టీ డబ్బుల కోసం బొప్పూడి వెళుతున్నట్లు సోదరునికి తెలిపి, ఇద్దరు వ్యక్తులతో ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు తెలుస్తోంది. -
19 నుంచి ఎన్బీఏ బృందం పర్యటన
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని విభాగాల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) బృందం పర్యటించనుంది. ఈనెల 19, 20, 21 తేదీల్లో విభాగాల వారీగా పరిశీలించనుంది. ప్రతి విభాగానికీ ఇద్దరు నిపుణలు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సాంకేతికను అందిపుచ్చుకోవాలి
రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సిద్దిపేట రూరల్:మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్నాల శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్, డిప్లామా మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గ్రూపులపై దిశానిర్ధేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేంద్రనాథ్ మాట్లాడుతూ రోజురోజుకు సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు . విద్యార్థి దశ నుంచే కంప్యూటర్, ల్యాబ్ తదితర అంశాలపై నైపుణ్యత సాధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి ప్రణాళికబద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభూజీ బెన్కాఫ్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ల్యాబ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నదన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రవీందర్రావు, భూపతిరావు, హెచ్ఓడీలు ఆశ్వనికుమార్ మిశ్రా, ఉదయ్కుమార్, కుమార్స్వామి, అశోక్కుమార్, సరస్వతి, పీఆర్వో బి. రఘు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కొటేషన్ లేకుండా కొట్టేస్తున్నారు!
నిబంధనలకు విరుద్ధంగా పనుల అప్పగింత టెండర్లు లేకుండా ఇష్టారాజ్యంగా పరికరాల కొనుగోలు జేఎన్టీయూ : జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అభివృద్ధి పనుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోగా.. ఇద్దరు ఉద్యోగులకు ఏకంగా నిబంధనలు పక్కన బెట్టి రెండింతలు పదోన్నతి కట్టబెట్టారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో రూ.50 వేలకు పైబడి పనులకు టెండర్ల ద్వారా చేపట్టాలని, అదీ వర్సిటీ అజమాయిషీలో నిర్వహించుకోవాలన్న నిబంధనలున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెరైక్టర్ పర్యవేక్షణలోనే అభివృద్ధి పనులు జరగాలి. కానీ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అవేమీ పట్టనట్లు అన్ని తతంగాలు నడిపేశారన్న విమర్శలున్నాయి. ఆరు నెలల్లో అరకోటి ఖర్చు గత ఆరు నెలల కాలంలో రూ. 54,31,000 నిధులు ఖర్చుపెట్టేశారు. పరికరాల కొనుగోలులో కనీసం కొటేషన్లు లేకుండా కొట్టేశారు. మార్కెట్లో దొరికే ధర కంటే రెండింతలు ఎక్కువ ధర చూపించి, వస్తువులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జేఎన్టీయూ కళాశాలలో పని చేసే ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లకు డీఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులు డిప్యుటేన్పై కట్టబెట్టారు. అయితే వీరు వర్సిటీ డెరైక్టర్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్) ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలి. కానీ వీరిద్దరూ లక్షలాది రూపాయల పనులు మంజూరు చేస్తూ, బిల్లులు చేస్తున్నారు. తమ ఛాంబర్కు రూ.5 లక్షలు ఖర్చుపెట్టి ఏసీలు, కంప్యూటర్లు కొనుగోలు చేసేశారు. వాటిని కూడా జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ ఆమోదిస్తున్నారు. సివిల్ పనుల ప్రక్రియ, వస్తువులు కొనుగోలు అంశాలపై వర్సిటీ నియంత్రణ లేక ఇష్టారాజ్యంగా కళాశాల అధికారులు వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి పనినీ విభజించి.. కట్టబెట్టారు ఏదైనా నిర్మాణాన్ని అత్యవసరం అయితే తప్ప విభజించి నామినేషన్ పద్ధతిపై అప్పగించరాదు. కానీ ఇప్పటి దాకా చేసిన ప్రతి పనినీ విభజించి అస్మదీయులకు కట్టబెట్టారు. రూ.2లక్షల పనులను నలుగురు, ఐదుగురికి కేటాయించారు. ఇది కూడా ఉద్యోగులే బినామీలను పెట్టి కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఒకే రోజు రూ. 3 లక్షలు ఖర్చుపెట్టి ఖరీదైన ఏసీలు కొనుగోలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్యూటీ ఇంజనీరును డిప్యూటేషన్పై ని యమించారు. నామినేషన్ పద్ధతిపై ఎలాంటిపనులూ కట్టబెట్టే అధికారం డీఈకి లేదని నిబంధనలున్నా ఆ యన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లక్షలాది రూపాయల పనులు చేయించారు. వీటిని నియంత్రించాల్సిన ప్రిన్సిపల్ మౌనంగా ఉంటున్నారు. -
కన్వీనర్ కోటాలో 65,379 సీట్లు
ఇంజనీరింగ్, ఫార్మసీల్లో ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు - ప్రభుత్వ కాలేజీల్లో 3,040, ప్రైవేటు కాలేజీల్లో 62,339 సీట్లు - బీఫార్మసీలో కన్వీనర్ కోటాలో 2,888 సీట్లు - భారీగా తగ్గిన ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు - 282 ప్రైవేటు కాలేజీల్లో 178 కాలేజీలకే అనుబంధ గుర్తింపు - 26,716 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 65,379 సీట్ల భర్తీకి ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. మంగళవారం (ఈనెల 5) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 178 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 89,055 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. ఇందులో 62,339 సీట్లు (70 శాతం), 17 ప్రభుత్వ కాలేజీల్లోని 3,040 సీట్లు కలిపి మొత్తంగా 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ప్రైవేటు కాలేజీల్లోని మిగతా 26,716 (30 శాతం) సీట్లను యాజమాన్యాలే మేనేజ్మెంట్ కోటా (ఇందులో 15 శాతం ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా)లో భర్తీ చేసుకోనున్నాయి. టాప్ కాలేజీల్లో గతేడాది ఉన్న సీట్లు కొనసాగింపు ఈసారి టాప్ కాలేజీల్లో సీట్లకు, బ్రాంచీలకు పెద్దగా కోత పడలేదు. దాదాపుగా గతేడాది ఉన్నట్లుగానే ఈసారీ అనుబంధ గుర్తింపు లభించింది. సాధారణ కాలేజీల్లోనే ఎక్కువగా బ్రాంచీలు, సీట్లకు కోత పడింది. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేని కాలేజీల్లో భారీగా బ్రాంచీలు, సీట్లు తగ్గిపోయాయి. కాలేజీల సంఖ్య కూడా తగ్గింది. వాస్తవానికి రాష్ట్రంలోని 282 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. అందులో 40 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరో 47 కాలేజీల్లో లోపాలున్నట్లు యూనివర్సిటీలు, విజిలెన్స్ నివేదికల్లో తేలడంతో వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. మిగతా 178 ప్రైవేటు కాలేజీలు, 17 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఫార్మసీ కాలేజీల్లోని బీఫార్మసీ సీట్ల భర్తీకి, వెబ్ ఆప్షన్లకు చర్యలు చేపట్టింది. 52 వేల సీట్లు కోత ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన లెక్కన కాలేజీల్లో మొత్తంగా 1.42 లక్షల సీట్లు ఉండగా... యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చింది 178 కాలే జీల్లోని 89,055 సీట్లకే. అంటే 52,945 సీట్లకు కోత పడింది. మొత్తంగా ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలుపుకొని 92,095 సీట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇందులో 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించిన ప్రకారం దాని పరిధిలోని కాలేజీల్లో 79,705 సీట్లకు అనుమతి ఇచ్చారు. సోమవారం నాటికి సీట్ల సంఖ్య 81,424కు చేరుకుంది. అంటే 1,719 సీట్లు పెరిగాయి. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వండి ఇంజనీరింగ్ ఎంసెట్లో 1,04,500 మంది అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇందులో 63,777 మంది మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారంతా ఈనెల 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి, క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాగిన్ ఐడీని సోమవారమే వారి మొబైల్ ఫోన్లకు పంపించినట్లు చెప్పారు. జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలని వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వారికి 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీగా కోత
79,705 సీట్లకే గుర్తింపు.. 46 వేల సీట్లకు కోత - కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా వెలువరించిన జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి భారీగా కోత పడింది. సీట్లే కాదు కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది మొత్తంగా 1.16 లక్షల సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా ఈసారి 79,705 సీట్లకే గుర్తింపు ఇచ్చింది. గతేడాది 220 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా.. ఈసారి 158 కాలేజీలకే గుర్తింపు ఇస్తున్నట్టు ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న మేరకే కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకట్రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. 40 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసమే దరఖాస్తు చేసుకోకపోగా, మరో 43 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. వాటిలో 36 వేలకు పైగా సీట్లకు కోత పెట్టింది. ఇక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో 1.24 లక్షల సీట్లకు అనుమతి ఇవ్వగా జేఎన్టీయూహెచ్ 158 కాలేజీల్లోని 671 కోర్సుల్లో 79,705 సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చింది. అంటే దాదాపు 46 వేల సీట్లకు కోత పడింది. ఇక ఎంసెట్లో 1.04 లక్షల మంది అర్హత సాధించి ర్యాంకులు పొందగా.. 63,777 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం వారంతా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రకటన సోమవారం రానుంది. వాటిల్లో 14 వేల వరకు సీట్లు ఉండగా.. 10 వేల సీట్ల వరకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. దీంతో ఈసారి మొత్తంగా 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు 158 కాలేజీలకే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 241 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో జేఎన్టీయూహెచ్ తనిఖీలను నిర్వహించింది. అలాగే మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. రెండు విభాగాల తనిఖీ నివేదికలను పోల్చి చూసి 158 కాలేజీల్లో 79,705 సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. సగం ఫార్మసీ కాలేజీలకు నో జేఎన్టీయూహెచ్ పరిధిలో 89 ఫార్మసీ, 30 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. ఈసారి 46 ఫార్మసీ కాలేజీల్లోని 4 వేల సీట్లలో ప్రవేశాలకే అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లో కోర్సులు, సీట్ల వివరాలను ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్కు పంపించింది. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
కాకినాడ: ఇంజినీరింగ్ కళాశాలలో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ అప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,79,465 మంది హాజరు కాగా, వీరిలో లక్షా 31 వేల 580 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా అభ్యర్థులు హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలనతోపాటు వెబ్ అప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్లు మార్పు, చేర్పులు ఈ నెల 19,20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న చేస్తారన్నారు. పాస్వర్డ్ను గోప్యంగా ఉంచాలి... ప్రభుత్వ హెల్ప్లైన్ సెంటర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్కేఫ్లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్టైం పాస్వర్డ్ ఎవ్వరికీ తెలియకూడదని, ఈ పాస్వర్డ్ చాలా కీలకమని చెప్పారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరుకాలేకపోయినా తరువాత రోజు హాజరుకావచ్చన్నారు. ఎన్ని అప్షన్లు ఎక్కువగా ఇస్తే అంత మంచిదని, ఆసక్తిలేని కళాశాల పేర్లను అప్షన్లుగా ఇవ్వకూడదన్నారు. -
కన్నీళ్లగా మిగిలిన కలలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రెండేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరువలె మిగిలిపోయింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి నాణ్యమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు సంపాదించి తద్వారా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని భావించిన ఆ విద్యార్థుల కలలు కన్నీళ్లుగానే మిగిలిపోయాయి. ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా హాజరైన బాధిత విద్యార్థులు మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిందే. జిల్లాలో శుక్రవారం ఎంసెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి మెడిసిన్ పరీక్ష మూడేసి గంటల చొప్పున జరిగాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. శ్రీకాకుళం జిల్లా మందస ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చేసిన 14 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్ష రాసేందుకు నిర్ణీత సమయానికి చేరుకోలేక పరీక్ష కేంద్రాల నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఎందుకు ఆలస్యమైంది? అసలేం జరిగింది? వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ మాయ విశాఖపట్నంలో మధురవాడకు సమీపంలో బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ఉంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థుల అడ్మిషన్లను పెంచుకునే దిశగా ఎంసెట్ ఉచిత శిక్షణ పేరిట ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తై విద్యార్థులను వివిధ మార్గాల్లో ఎరవేసింది. పొరుగు జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులను సేకరించారు. వీరికి గత కొద్ది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం నాటి ఎంసెట్ పరీక్షకు నిర్ణీత సమయానికి కేంద్రాల వద్దకు చేర్చుతామంటూ(విద్యార్థుల వద్ద మెప్పు పొంది అడ్మిషన్లగా మరల్చకునే ప్రయత్నంలో) ప్రగల్బాలు పలికారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే మార్గంలో దారిపొడవునా ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులను దింపుకుంటూ వచ్చారు. సమయం దగ్గర పడుతుండడంతో శ్రీకాకుళం కేంద్రంగా పరీక్ష రాసే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పరీక్షకు సమయం మించిపోతుందని తొందరగా వెళ్లమని ఎంతమొత్తుకున్నా వీరి గాధ వినలేదు. మేమున్నామంటూ.. మాయ మాటలతో పొరుగు జిల్లా విద్యార్థులను సైతం ప్రధాన రహదారికి సమీపంలోని కేంద్రాల్లో దింపుకుంటూ శ్రీకాకుళం వచ్చేసరికి 10.20 నిమిషాలు అయింది. నిర్ణీత పరీక్ష సమయం(ఉదయం 10గంటలు) దాటిపోవడంతో ఈ విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించేలేదు. ఆరు కేంద్రాల్లో రాయాల్సి ఉంది జిల్లాలోని శ్రీకాకుళం పురుషులు, శ్రీకాకుళం మహిళలు, శ్రీకాకుళం రూరల్ పరిధిలోని గాయిత్రి, వైష్ణవి, శారద, వెంకటేశ్వర కళాశాలల ఆరు కేంద్రాల్లో ఇద్దరేసి చొప్పున(మహిళా కళాశాలలో నలుగురు) మొత్తం 14 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. ఆలస్యంగా కేంద్రాలకు హాజరుకావడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. బాబా ఇనిస్టిట్యూట్ని నమ్మి నిలువునా మోసపోయామని, కనీసం పరీక్ష రాసేందుకు కూడా మాకు అవకాశం లేకుండా చేశారని శ్రీకాకుళం పురుషుల కళాశాల కేంద్రంలో పరీక్ష రాయకుండా వెనుదిరిగిన రోహిణి, యోగిత ధీనంగా చెప్పారు. రోహిణిది పర్లాకిమిడి వద్ద పుడిగాం గ్రామం కాగా, యోగితది మందస మండలం ఆర్కె పురం గ్రామం. ఎంసెట్ పరీక్ష కోసం గత రెండేళ్లగా ఎదురుచూశామని, మాతోపాటు మరో 12 మంది కూడా పరీక్ష రాయలేకపోయారని వాపోయారు. ఏది ఏమైనా విద్యార్థిలోకానికి ఇదొక చెంప పెట్టు వంటిది. జీవితమనే పరీక్షల్లో ఒకరిపై ఆధారపడితే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నీతి వాఖ్యంగా భావించాలి. -
టార్క్.. యువతరం బైక్!
చూడగానే కుర్రకారుకు హుషారు తెప్పించే ఈ బైక్ పేరు టార్క్6 ఎక్స్. ఇది యువత కలలకు ప్రతిరూపమనే చెప్పుకోవచ్చు! దీని ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. అంటే కరెంట్తో పనిచేస్తుందన్న మాట. కేవలం గంటసేపు చార్జింగ్ పెడితే చాలు.. వంద కిలోమీటర్ల దూరం హాయిగా ప్రయాణించవచ్చు. పెట్రోల్తో నడిచే బైక్లతో ఏ విషయంలోనూ ఇది తీసిపోదు. స్టైల్కు స్టైలు.. మైలేజికి మైలేజీ అన్నమాట. పుణేలోని డీవై పాటిల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన 30 ఏళ్ల కపిల్ షెల్కే దీన్ని రూపొందించాడు. కాలేజీ రోజుల్లోనే ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు. 2009లో ఐల్ ఆఫ్ మాన్లో జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల రేసింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ టార్క్ 01 అనే బైక్ గంటకు 156 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి మూడో స్థానంలో నిలిచింది. అలాగే 2010లో జరిగిన పోటీల్లో పాల్గొని రికార్డు స్థాయిలో 214 కిలోమీటర్ల వేగం అందుకుంది. కొన్నేళ్ల పాటు చైనాలో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ల కంపెనీ తరఫున రేసుల్లో షెల్కే పాల్గొని ఈ టార్క్ను మరింతగా అభివృద్ధి చేశాడు. సాధారణ పెట్రోల్ బైక్ను మార్చి ఎలక్ట్రిక్ బైక్గా తయారు చేశాడు. 2014లో గుజరాత్లో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శితమైన టీఎక్స్-05కు మంచి ఆదరణ లభించడంతో దానికి మరిన్ని మెరుగులు దిద్ది టీ06 ఎక్స్ను రూపొందించాడు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాదిలోగా ఈ బైక్లు రోడ్లపై దూసుకెళ్తాయి. -
ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన
పటాన్చెరు: మెదక్ జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకున్నా అడ్మిషన్లు చేసుకుని, తీరా సెమిస్టర్ పరీక్షా సమయానికి అనుమతి లేదంటూ చేతులెత్తేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పటాన్చెరులోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాల అనుమతి లేకున్నా విద్యార్థుల నుంచి ఎంబీఏ అడ్మిషన్లు తీసుకుంది. చివరకు పరీక్షల సమయానికి ఆ కళాశాలకు అనుమతి లేదని తెలిసింది. దీంతో అడ్మిషన్ తీసుకున్న మొత్తం 99 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. -
బస్సు ప్రమాదంలో 10 మందికి గాయాలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం హయత్నగర్ లక్ష్మీరెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎలాంటి సూచన ఇవ్వకుండా ఇసుక లారీ మలుపు తిరుగుతుండగా.. అటు నుంచి వస్తున్న స్వాతి ఇంజనీరింగ్ కళాశాల బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు 10 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
విద్యకు కులం లేదు
యువతదంతా ప్రేమకులం ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ గుంటూరు రూరల్ : విద్యకు కులంలేదు, రక్తానికి కులం లేదు, మరి మనుషులకెందుకు ఈ వర్గ విభేదాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన 31వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రతి పని చేసేవారికి ఆ వర్గం చేసే పనిని తెలిపేందుకు కులాలను ఏర్పాటు చేశారని, కానీ నేడు అలాంటివి లేవని, అంతా ఒకటేనన్నారు. మనమంతా ప్రేమకులానికి చెందిన వారమని తెలిపారు. కష్టపడకుండా ఏదీ సాధ్యంకాదని ప్రతి విద్యార్థి తమ లక్ష్య సాధనకోసం రోజూ ఒక గంట కష్టపడితే తప్పని సరిగా లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. యువత నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్నారు. లక్ష్యసాధనకు పట్టుదల అవసరం ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడాలని, లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషిచేయాలని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. యువత తమలో ఉన్న శక్తిని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. తెలివితేటలు, నైపుణ్యాలను పంచుకుంటూ, పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి నిజాయితీ, ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన, సమాజంపై అవగాహన అనే లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఒక మేధావిగా తయారవ్వాలన్నారు. మంచు మనోజ్, ఉదయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కె.బసవపున్నయ్య, కార్యదర్శి ఆర్.గోపాలకృష్ణ, కోశాదికారి ఎం.గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ సుధాకర్, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
స్లాబ్ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
హసన్పర్తి : వరంగల్ నగర శివారులోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భవనం బుధవారం రాత్రి కూలింది. అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అదే ఆవరణలో మరో భవన నిర్మాణ పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. నిర్మాణంలో నెల్లూరు, వరంగల్ జిల్లాలకు చెందిన కూలీలు పని చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మొత్తం 18 మంది కూలీలు అక్కడ ఉన్నారు. 12 మంది పైన పని చేస్తుండగా.. ఆరుగురు కింద ఉన్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు భవనం రెండో అంతస్తు స్లాబ్ పూర్తయ్యే క్రమంలో ప్రమాదవశాత్తు స్లాబ్ కుప్పకూలింది. వెడ్ మిక్సింగ్ మిషిన్ పైప్ వైబ్రేషన్కు పైఅంతస్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ప్రసాద్(35), హసన్పర్తి మండలంలోని అన్నాసాగర్కు చెందిన లక్కి రాజేష్(35)కు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజేష్ మృతి చెందాడు. ప్రసాద్ వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్లాబ్ కుప్పకూలుతోందని గ్రహించిన ప్రసాద్, రాజేష్లు పైనుంచి కిందికి దూకారు. అయితే వారు దూకుతున్న క్రమంలో వారిపై నిర్మాణానికి వినియోగించిన సామగ్రి పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మిగతా పదిమంది సామగ్రి మధ్యలో పడటంతో గాయాలయ్యాయి. కింద పనిచేస్తున్న కూలీలు.. స్లాబ్ కూలు తుండడం గమనించి పరుగులు తీశారు. సమాచారం తెలిసిన వెంటనే వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
మా ఉసురు తగులుతుంది
బాధిత ఉద్యోగుల శాపనార్థాలు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన కళాశాల వద్ద ధర్నా, ప్రిన్సిపాల్ చాంబర్లో బైఠాయింపు శ్రీకాళహస్తి: ‘పదేళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నాం. రూ. 2వేల జీతం నుంచి 6 వేల జీతానికి మాత్రమే చేరుకున్నాం. మా 49 మంది జీతాలు కలిపితే ఒక్క అధ్యాపకుడి జీతంతో సమానం. అదికూడా లేకుండా చేసి మా కడుపు కొట్టడం భావ్యం కాదు. ఉన్న ఫలంగా తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి. మీలాగే మాకూ కుటుంబాలు, భార్య, బిడ్డలున్నారు.. వారిని పోషించలేక చంపుకోమంటారా? లేక మేమే ఆత్మహత్య చేసుకోవాలంటారా?’ చెప్పండి అంటూ బాధిత ఉద్యోగులు ప్రిన్సిపల్ జయుచంద్రయ్యను నిలదీశారు. మంగళవారం ఓ పత్రికలో స్కిట్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను టెండర్ ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించనున్నట్లు ఓ ప్రకటన ప్రచురించారు. దాంతో స్కిట్ కాంట్రాక్ట్ ఉద్యోగు లు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇందుకు స్పందించిన ప్రిన్సిపాల్ జయచంద్రయ్య.. కళాశాల కరెస్పాండెంట్, ఆలయ ఈఓ సూచనల మేరకే పత్రికలో ప్రకటన వెలువడిందన్నారు. ఎవరినీ తొలగించడం లేదని, ఓ ఏజెన్సీ ద్వారా తీసుకుంటారని వివరించారు. కరెస్పాండెంట్, ఈవో భ్రమరాంబతో మళ్లీ చర్చించి న్యాయుం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఆయన సూచన మేరకు ఆలయ చైర్మన్ గురవయ్యనాయుుడు, ఈవోను కలిసి బాధిత ఉద్యోగులు ఆవేదనను తెలియజేశారు. -
<b>ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు ఖాళీ</b>
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీ అవుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఈ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలకు ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, బయో మెడిసిన్ విభాగాలలో సుమారు 42 సీట్లు ఖాళీ అయ్యాయి. ఐఐటీ, ఇతర కేంద్రస్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించడంతో విద్యార్థులు వలస వెళ్తున్నారని ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రొ.రామచంద్రం తెలి పారు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఖాళీ అవుతున్న సీట్లను వృథాగా వదిలేయోద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వివిధ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం
సంబేపల్లె: ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పటి నుంచి వారు ప్రాణ స్నేహితులుగా మెలిగారు.. మూడేళ్లుగా ఎక్కిడికైనా ఇద్దరూ కలిసే వెళ్తుండే వారు.. చివరకు మరణంలోనూ వారు స్నేహాన్ని వీడలేదు.. ఈ హృదయ విదారక సంఘటన సంబేపల్లె మండలంలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు జాతీయ రహదారిలో తెల్లవారుజామున వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వారు మృతి చెందారు. వారు ఇద్దరూ తిరుపతిలోని సిద్దార్థ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) మూడవ సంవత్సరం చదువుతుండే వారు. సంబేపల్లి మండలంలోని దుద్యాల గ్రామం పొట్టిరెడ్డిగారిపల్లెకు చెందిన నాగిరెడ్డి కుమారుడు పవన్కుమార్రెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనెపల్లెకు చెందిన పద్మభూషణ్రెడ్డి కుమారుడు శివకుమార్రెడ్డి ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి కడపకు ఓ పనిపై వచ్చారు. వారు తిరిగి తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో శివకుమార్రెడ్డి(24) అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్కుమార్రెడ్డి(24)ని తిరుపతికి ఆసుపత్రికి 108లో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. శివకుమార్ అన్న గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవన్కుమార్రెడ్డికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆయన తల్లి కువైట్లో ఉంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సిద్దార్థ కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. యాజమాన్యంతోపాటు రాయలసీమ విద్యా సంస్థల డెరైక్టర్ ఆనందరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల బస్సుల్లో మృతుల ఊర్లకు వెళ్లి సంతాపం ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంజినీరింగ్ కాలేజి సమీపంలో మృతదేహం
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం శివారులోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహన్ని మంగళవారం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కుప్పం మండలం ఎర్రమానిగుంత గ్రామానికి చెందిన చిన్న కన్ను (50) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వ్యక్తిగత కక్షలు ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్!
-
బయటపడిన ఇంజనీరంగు
బ్రాంచికి ముగ్గురు నుంచి నలుగురే వర్సిటీ అన్ని వసతులు ఉన్నాయన్న కళాశాలల్లోనూ పూర్తిస్థాయిలో చేరని విద్యార్థులు కోదాడటౌన్ : జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా నాణ్యత నేతిబీరలో నెయ్యిచందంగా ఉందనే విషయం వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టే తేలిపోయింది. జేఎన్టీయూ అధికారులు తనిఖీలమీద తనిఖీలు చేసి అన్ని వసతులు ఉన్నాయని వేల సీట్లకు అనుమతులు ఇచ్చిన కళాశాలల్లో 10నుంచి 20 మంది విద్యార్థులు చేరగా సరైన వసతులు లేవని అనుమతులు నిరాకరించిన కళాశాలల్లో మాత్రం వందల సంఖ్యలో విద్యార్థులు చేరడం అధికారుల తనిఖీలలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కొన్ని కళాశాలల్లో సున్నా అడ్మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలుపరిస్థితి ఏమిటంటే... జిల్లాల్లో 41 ఇంజనీరింగ్ కళాశాలలుండగా వాటిలో 7 కళాశాలలు కౌన్సెలింగ్కు ముందే తాము కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మిగిలిన 34 కళాశాలల్లో 21 కళాశాలలకు మాత్రమే జెఎన్టీయూ అనుమతులు ఇవ్వగా 13 కళాశాలలు కోర్టు తీర్పుద్వారా షరతులతో కూడిన అనుమతులు పొందాయి. వీటిలో మొత్తం 10,500 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 1,850 సీట్లు మాత్రమే నిండాయి. 20 సీట్లకు లోపు నిండిన కళాశాలలు 13 ఉండగా 50 సీట్లకు పైగా నిండిన కళాశాలలు మరో 15 ఉన్నాయి. 100లోపు సీట్లు నిండిన కళాశాలలు రెండు ఉండగా, 200 సీట్లకు పైగా నిండిన కళాశాలలు రెండు మాత్రమే ఉన్నాయి. విజ్ఞాన్లో అత్యధికం... జిల్లాలో ఉన్న ఇంజనీరిగ్ కళాశాలల్లో అత్యధికంగా దేశ్ముఖిలో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్లో అత్యధికంగా విద్యార్ధులు చేరారు. ఇక్కడ అత్యధికంగా718 మంది విద్యార్థులు చేరారు. ఇక ఆ తరువాత కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో 268 మంది, నల్లగొండలో రామానంద తీర్థ కళాశాలలో 193 మంది భువనగిరి అరోర కళాశాలలో 189 మంది విద్యార్థు చేరారు. నల్లగొండలోని ఎంజీయూ కళాశాలలో 180 సీట్లకు గాను 180 సీట్లు నిండాయి. ఇక కోదాడలో ఉన్న కిట్స్ మహిళా కళాశాలలో మాత్రం 90 మంది విద్యార్ధులు చేరారు. దీని భావమేమిటో అధికారులే చెప్పాలి.... సౌకర్యాలు సక్రమంగా లేవని,అధ్యాపకులు లేరని వర్సిటీ అధికారులు తేల్చి అనుమతులు ఇవ్వని కళాశాలల్లోనే విద్యార్థులు అత్యధికంగా చేరడం గమనించదగ్గ విషయం. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని కౌన్సెలింగ్లో పాల్గొన్న ఈ కళాశాల వైపే విద్యార్థులు నమ్మకం ఉంచారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నడుస్తున్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు అధికారులు కేవలం 60 సీట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కానీ ఇక్కడ 110 మంది విద్యార్థులు చేరారు. ఇక కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు కేవలం 240 సీట్లకు మాత్రమే అనుమతులు ఇవ్వగా అక్కడ 269 మంది విద్యార్థులు చేరారు. జిల్లాలో అత్యధిక విద్యార్థులు చేరిన రెండో కళాశాల ఇదే కావడం గమనించదగ్గ విషయం. -
అఫిలియేషన్పై నేడు హైకోర్టు తీర్పు
ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీ నివేదికలు సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ వ్యవహారంలో మంగళవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో కూడిన బృందాలు తనిఖీలు పూర్తి చేసిన నేపథ్యంలో, అఫిలియేషన్పై నిర్ణయం ఎవరు తీసుకోవాలన్న దానిపై తాము స్పష్టతనిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఎ.అభిషేక్రెడ్డిలు ఈ కేసు గురించి ప్రస్తావించారు. తనిఖీ బృందాలు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి, వాటిలో సౌకర్యాలపై నివేదికలు తయారు చేశాయని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన 122 కాలేజీల్లో 23 కాలేజీలు తనిఖీలకు ముందే తమకు అసలు అఫిలియేషన్ అవసరం లేదని చెప్పాయని, మిగిలిన 99 కాలేజీల్లో అత్యధిక శాతం కాలేజీలు ఒకటి, రెండు కోర్సులకే అఫిలియేషన్ చాలని చెప్పాయని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల నివేదికలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అఫిలియేషన్ ఇచ్చే విషయంలో అటు ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోవాలా..? లేక జేఎన్టీయూ నిర్ణయం తీసుకోవాలా..? అన్న సందిగ్థత ఉందని, అందువల్ల ఈ విషయంలో స్పష్టతనివ్వాలని వారు కోర్టును కోరారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తనిఖీ బృందాల నివేదికలను సీల్డ్ కవర్లలో ఉంచి హైకోర్టు రిజిష్టర్ ముందుంచామని తెలిపారు. -
‘ఎంసెట్’లో మిగులు మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2015లో 2000 లోపు ర్యాంకు సాధించిన ఒక విద్యార్థికి మొదటి విడత కౌన్సెలింగ్లో రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అలాట్ అయ్యింది. అయితే అతనికి ఎన్ఐటీలో కూడా సీటు రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు... కానీ ఎంసెట్లో అతనికి కేటాయించిన సీటు ఇప్పటికీ అతని పేరుపైనే ఉండిపోయింది. ఇలాంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. క్యాంపస్ పరిధిలో ఉన్న కళాశాలల్లో ఇలాంటి సీట్లు ఎన్నో ఉన్నాయి. ఈ సీట్లను మలివిడత కౌన్సెలింగ్లోకి చేర్చకపోవడంతో మెరిట్లో తదుపరి ఉన్న వారికి అవి దక్కడంలేదు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యి మూడో విడత కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించినా మిగులు సీట్లపై ఉన్నత విద్యామండలికి, అడ్మిషన్ల కమిటీకి ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం విశేషం. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల కన్వీనర్ కోటాలోని 1,12,525 సీట్లలో మొదటి విడత కౌన్సెలింగ్లో 73,817 మందికి సీట్లు అలాట్ కాగా 64,417 మంది రిపోర్టు చేశారు. రెండో విడతతో అలాట్మెంటు సీట్ల సంఖ్య 76,928కి పెరిగింది. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకా మొత్తం కన్వీనర్ కోటాలోని సీట్లలో 38,708 మిగల గా రెండో విడత కౌన్సెలింగ్కు 38,870 సీట్లు చేరాయి. అంటే 162 సీట్లే పెరిగాయి. ఈ సీట్లు కూడా కొత్తగా కొన్ని కాలేజీలకు అదనంగా కేటాయించినవి. అంటే ఐఐటీ వంటివాటిల్లో చేరిన విద్యార్థులు ఖాళీ చేసిన సీట్లు చేరలేదు. వెబ్జాయినింగ్ రిపోర్టుతోనే సమస్య... గతం మాదిరిగా కాకుండా ఈమారు కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు వెబ్సైట్లోనే తమ లాగిన్ ద్వారా ‘వెబ్ జాయినింగ్ రిపోర్టు’ను సమర్పించాలని, అది తెలీని వారు హెల్ప్లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని నిబంధన పెట్టారు. తరువాత ట్యూషన్ ఫీజులు, ఒరిజినల్ ధ్రువపత్రాలను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు. మలి విడత కౌన్సెలింగ్లో పాల్గొనదలిచే వారు అది పూర్తయ్యాకనే కాలేజీల్లో చేరవచ్చని సడలింపునిచ్చారు. ఇదే ప్రస్తుత సమస్యకు మూలంగా మారింది. ఇలా వారెవ్వరూ కాలేజీల కు వెళ్లి జాయినింగ్ రిపోర్టు ఇవ్వలేదు. మొత్తంగా కన్వీనర్ కోటాలో మెరిట్ విద్యార్థులు ఖాళీ చేస్తున్న వందలాది సీట్లను రెండో విడత కౌన్సెలింగ్లో చేర్చకపోవడంతో తదుపరి స్థానాల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అవి దక్కకుండా పోయాయి. తాజాగా అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆయా కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాలని చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ తెలిపారు. ఆ వివరాలను ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో యాజమాన్యాలు ఎంసెట్ అధికారిక వెబ్సైట్కు అప్లోడ్ చేయాలి. దాన్ని అనుసరించి మూడో విడత కౌన్సెలింగ్కు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు
తవుకు ఏ కోర్సులు అక్కర్లేదని లేఖలు ఇచ్చిన 16 కాలేజీలు 60 కాలేజీల్లో రెండు, వుూడు బ్రాంచీలకు తనిఖీలు వద్దని లేఖలు హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు వెబ్ కౌన్సెలింగ్లో చేర్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో బుధవారం(22వ తేదీ) నుంచి తనిఖీలు చేపట్టాలని జేఎన్టీయుూహెచ్ నిర్ణరుుంచింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నారుు. ప్రతి కళాశాలను ముగ్గురు సభ్యుల బృందం తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఏఐసీటీఈకి చెందిన ఇద్దరు ప్రతినిధులు, జేఎన్టీయూహెచ్కు చెందిన ఒక ప్రతినిధి ఉంటారు. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో ఈ తనిఖీలు చేయనున్నారు. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందుగానే తెలియజేసిమరీ ఈ బృందాలు తనిఖీలకు వెళ్లనున్నారుు. బుధవారం తనిఖీలు చేసే కాలేజీలకు ఇప్పటికే విషయాన్ని తెలియజేశాయి. కోర్టును ఆశ్రరుుంచిన 121 కాలేజీల్లో 60 కాలేజీలు రెండు, వుూడు కోర్సులకు తనిఖీలు వద్దని, ఒకటీ రెండు బ్రాంచీలకే తనిఖీలు చేయూలని కోరుతూ లేఖలను జేఎన్టీయుూహెచ్కు అందజేశారుు. అదనపు బ్రాంచీలు, అదనపు సీట్ల కోసం చూసుకొనిసంయుక్త తనిఖీలకు ఒప్పుకుంటే.. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన బ్రాంచీలు, సీట్లు కూడా లేకుండాపోయే ప్రవూదం ఉందన్న ఆందోళనతో కాలేజీలు ఈ నిర్ణయూనికి వచ్చారుు. వురో 16 కాలేజీలు తవుకు ఏ కోర్సులు వద్దని, తవు కాలేజీల్లో తనిఖీలు చేయూల్సిన అవసరం లేదని పేర్కొంటూ లేఖలను అందజేశారుు. దీంతో కొన్ని కోర్సులకే తనిఖీలు కావాలన్న కాలేజీలతోపాటు అసలు లేఖలే ఇవ్వని వురో 46 కాలేజీల్లో సంయుుక్త బృందాలు తనిఖీలు చేపట్టనున్నారుు. 28వ తేది నాటికి తనిఖీలను పూర్తి చేసి తనిఖీ నివేదికలను హైకోర్టుకు అందజేయునున్నారుు.. -
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
-
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
నేటి సాయంత్రం 5 నుంచి ప్రక్రియ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ‘అఫిలియేషన్ల’ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం బుధవారమే తీర్పు ఇచ్చినా.. దాని కాపీ ప్రభుత్వానికి గురువారం అందింది.దానికి అనుగుణంగా ప్రవేశాల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ముందే జేఎన్టీయూహెచ్ అనుమతి పొంది ఎలాంటి వివాదం లేని కాలేజీలతో పాటు కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కాలేజీలు, స్వచ్ఛందంగా తనిఖీలకు ముందుకు వచ్చే కాలేజీలను వెబ్కౌన్సెలింగ్లో చేర్చనున్నారు. తనిఖీల్లో లోపాలున్నట్లు గుర్తిస్తే ఈ కాలేజీల్లో ప్రవేశాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు ముందు జాగ్రత్తగా ఈ మూడు రకాల కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలను మూడు రంగుల్లో వేర్వేరుగా సూచిస్తారు. విద్యార్థులు tseamcet.nic.in వెబ్సైట్లో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యా కమిషనర్ వాణిప్రసాద్, జేఎన్టీయూహెచ్ తాత్కాలిక వీసీ శైలజా రామయ్యార్ తదితరులు సమావేశమై కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేశారు. అనంతరం కడియం శ్రీహరి ఈ షెడ్యూల్ను ప్రకటించారు. కోర్టుకు వెళ్లని కాలేజీల యాజమాన్యాలు కూడా తాజా తనిఖీలకు ఒప్పుకుంటే వాటిని వెబ్ కౌన్సెలింగ్లో చేర్చుతామని.. ఇందుకోసం గురువారం రాత్రి వరకు జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. కోర్టుకు వెళ్లిన వారికి వర్తించే నిబంధనలే వీటికి వర్తిస్తాయన్నారు. ఇక కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 73 కాలేజీలు తమకు అదనపు సీట్లు అవసరం లేదంటూ జేఎన్టీయూకు లేఖలను అందజేశాయన్నారు. మరికొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలు వద్దని, మరికొన్ని బ్రాంచీలకు తనిఖీలు చేయాలని కోరాయన్నారు. 3 రంగుల్లో.. 3 కేటగిరీలుగా.. 1. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, బ్రాంచీలు, సీట్లు.. 82,759 ఉన్నాయి. వీటితోపాటు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు కలుపుకొని 257 కాలేజీల్లోని 95,629 సీట్లు వెబ్ కౌన్సెలింగ్లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఏ వివాదం లేనివి. వీటిని సాధారణంగా ఉంచడం లేదా ఆకుపచ్చ రంగులో చూపించే అవకాశం ఉంది. 2. హైకోర్టు ఆదేశాల మేరకు పలు కాలేజీలు, బ్రాంచీలు, సీట్ల వివరాలను వెబ్ కౌన్సెలింగ్లో అందుబాటులో పెడతారు. ఈ కాలేజీలకు, బ్రాంచీలకు మరొక రంగు (ఎరుపు లేదా పసుపు) ఇస్తారు. వీటిలో ప్రవేశాలు ఈనెల 20 నుంచి చేపట్టే ఏఐసీటీఈ, జేఎన్టీయూ సంయుక్తంగా తనిఖీ నివేదికలపై ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ఏవైనా కాలేజీలు, బ్రాంచీలకు అనుమతి రాకపోతే... వాటిలో చేరే విద్యార్థుల ఫీజులను వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తారు. మరో కాలేజీలోకి మార్చుతారు. 3. కోర్టుకు వెళ్లని వారి కాలేజీలు, బ్రాంచీలను యాజమాన్యాలు కోరుకుంటే కౌన్సెలింగ్లో చేర్చుతారు. వాటిల్లోనూ తనిఖీలు చేసి.. లోపాలున్నట్లు తేలితే అనుమతివ్వరు. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు సంబంధించి వర్తింపజేసే నిబంధనలు వీటికి కూడా వర్తిస్తాయి. ఈ కేటగిరీకి మరో రంగును కేటాయిస్తారు. జాగ్రత్తగా ఆప్షను ఇవ్వాలి ‘‘కాలేజీలను, బ్రాంచీలను ఎంచుకునే సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వెబ్సైట్లో పేర్కొన్న రంగులను చూసి, నిబంధనలు చదువుకొని కాలేజీలను ఎంచుకోవాలి. కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకుంటే అవి కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలేజీలలోని కోర్సుల వివరాలను జేఎన్టీయూహెచ్, కౌన్సెలింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు.’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదీ షెడ్యూల్ మొదటి దశ ప్రవేశాలు ⇒ ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ⇒ 22న ఆప్షన్లను మార్చుకునే అవకాశం ⇒ 24న సీట్ల కేటాయింపు ⇒ 25వ తేదీ నుంచి 27 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు రెండోదశ ప్రవేశాలు ⇒ 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (మొదటి దశలో పాల్గొనని వారికి) ⇒ 29 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులకు అవకాశం ⇒ 31న సీట్ల కేటాయింపు ⇒ ఆగస్టు 1వ తేదీన కాలేజీల్లో చేరేందుకు అవ కాశం, ఇదే రోజునుంచి తరగతులు ప్రారంభం -
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పై ఎల్లుండికి స్పష్టత!
హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్పై జేఎన్టీయూహెచ్ అప్పీల్పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 25 కాలేజీలకు అనుమతి నిరాకరణపై అడ్వకేట్ జనరల్ ఈ సందర్బంగా కోర్టుకు వివరించారు. రికార్డులు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఈ నెల 8 నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సీట్లు కోత పడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్లో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిని అమలు చేయకుండా జేఎన్టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్లింది. కాగా జేఎన్టీయూహెచ్, యాజమాన్యాల మధ్య ఏర్పడిన వివాదానికి రెండు మూడు రోజుల్లో ఏదైనా పరిష్కారం లభించకపోతే ఈ నెలాఖరుకల్లా ప్రవేశాలు పూర్తి చేయడం అసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ, వివాదం పరిష్కారం కాని పక్షంలో తరగతులు ప్రారంభించడం సాధ్యం కాదు. -
కౌన్సెలింగ్పై స్పష్టత వచ్చేనా..?
జేఎన్టీయూహెచ్ అప్పీల్పై నేడు హైకోర్టు బెంచ్ విచారణ! హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్పై స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఇందుకోసం వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్లో ఎడతెగని జాప్యంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టగా, మరి కొంతమంది అందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల కౌన్సెలింగ్ త్వరగా ప్రారంభం కావాలని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ నెల 8 నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సీట్లు కోత పడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్లో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిని అమలు చేయకుండా జేఎన్టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్లింది. దీనిపై సోమవారం ఉదయం విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా కేసును ఎక్కువ కాలం కొనసాగించకుండా, త్వరగా తేల్చేందుకు ఇటు జేఎన్టీయూహెచ్, అటు యాజమాన్యాలు సహకరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులు కోరుతున్నారు. రెండు మూడు రోజుల్లో తేలకపోతే కష్టమే జేఎన్టీయూహెచ్, యాజమాన్యాల మధ్య ఏర్పడిన వివాదానికి రెండు మూడు రోజుల్లో ఏదైనా పరిష్కారం లభించకపోతే ఈ నెలాఖరుకల్లా ప్రవేశాలు పూర్తి చేయడం అసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ, వివాదం పరిష్కారం కాని పక్షంలో తరగతులు ప్రారంభించడం సాధ్యం కాదు. అపుడు జేఎన్టీయూహెచ్ లేదా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అఫిలియేషన్ల వివాదం ఉన్నందున ప్రవేశాల్లో అలస్యం అవుతుందని, తరగతుల ప్రారంభానికి మినహాయింపు ఇవ్వాలని కోరాల్సి వస్తుంది. కాలేజీల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అభినందనీయమేనని, అయితే పూర్తి ప్రవేశాల చివరి గడువు సమీపించిన సమయంలో గందరగోళ పరిస్థితులకు తెరతీయడం సరైంది కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఒకసారి కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వమే అప్పీల్ వెళ్లడం వల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతాయని, విద్యార్థులు నష్టపోతారని తెలిసీ ఈ చర్యలకు దిగడం ఏంటని పేర్కొంటున్నారు. -
ఇంజనీరింగ్లో భారీగా సీట్ల కోత
87 వేల సీట్లకు గుర్తింపు నిరాకరించిన జేఎన్టీయూహెచ్ ♦ ఇందులో 40 వేల సీట్లను స్వచ్ఛందంగా వదులుకున్న యాజమాన్యాలు ♦ ఈ ఏడాది సీట్లు 76,635కే పరిమితం.. కాలేజీల సంఖ్య మాత్రం 220 ♦ పేరున్న కాలేజీల్లోనూ భారీగా కోత.. నకిలీ ఫ్యాకల్టీపైనా దృష్టి ♦ అత్యధిక కాలేజీల్లో ఒకటీ రెండు కోర్సులకే అనుబంధ గుర్తింపు ♦ ప్రమాణాల మేరకే కాలేజీల్లో సీట్లు: శైలజా రామయ్యర్ ♦ జూలై 6 నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి భారీ సంఖ్యలో సీట్లకు కోత పడింది. గత ఏడాది 1.63 లక్షల సీట్లకు గుర్తింపురాగా.. ఈసారి కేవలం 76,635 సీట్లకే అనుబంధ గుర్తింపు లభించింది. తగ్గిపోయిన సీట్లలో 40 వేల సీట్లను కాలేజీల యాజమాన్యాలే స్వచ్ఛందంగా వదులుకోగా.. దాదాపు మరో 47 వేల సీట్లకు జేఎన్టీయూహెచ్ అనుమతి నిరాకరించింది. మొత్తంగా గత ఏడాది కంటే ఈసారి ఏకంగా 87 వేల సీట్లు తగ్గిపోయాయి. నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు మాత్రమే అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకటీ రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. అయితే సీట్లలో భారీగా కోతపెట్టినా... గతేడాది (125 కాలేజీలు) కంటే ఎక్కువగా ఈసారి 220 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుమతి ఇవ్వడం గమనార్హం. కాగా వచ్చే నెల 6న ఈ సీట్లకు వెబ్ ఆప్షన్లను చేపట్టనున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై విద్యా మండలి ప్రకటన చేసే అవకాశముంది. నాణ్యతకు ప్రాధాన్యం.. జేఎన్టీయూహెచ్ పరిధిలో 2015-16 విద్యా సంవత్సరానికి గుర్తింపు కోసం 245 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి దరఖాస్తులురాగా 220 కాలేజీలకు గుర్తింపు ఇచ్చినట్లు ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం జేఎన్టీయూహెచ్లో రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు, అకడమిక్ ఆడిట్సెల్ డెరైక్టర్ విజయకుమారితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మొత్తం 290 ఇంజనీరింగ్ కాలేజీల్లో 245 దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఆ దరఖాస్తులను పరిశీలించి, తనిఖీలను నిర్వహించి 220 కళాశాలల్లోని 76,635 సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. నిబంధనల ప్రకారం లేని 25 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్లో విద్యార్థులు కళాశాలల వారీగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న పూర్తిస్థాయి సమాచారాన్ని పరిశీలించిన మీదట కోర్సులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపడుతున్నామని.. ఇందుకోసం జేఎన్టీయూహెచ్ సంస్కరణలకు నాంది పలికిందని పేర్కొన్నారు. కాలేజీల్లో పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, ల్యాబ్లు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చామని, నిపుణులైన ప్రొఫెసర్లు కాలేజీలను తనిఖీ చేశారని శైలజా రామయ్యర్ వెల్లడించారు. అలాగే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు క్వాలిటీ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల వారీగా కోర్సులు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదట బోగస్ ఫ్యాకల్టీని తాము గుర్తించామని రిజిస్ట్రార్ రమణారావు తెలిపారు. ఆ తరువాత కేంద్రం దృష్టి పెట్టిందని, దాంతో దేశవ్యాప్తంగా 60 వేల బోగస్ ఫ్యాకల్టీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాలేజీలు బోగస్ ఫ్యాకల్టీని చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమోదం పొందిన బ్రాంచ్లు, సీట్లు సివిల్ ఇంజనీరింగ్ 9,825 సీఎస్ఈ 22,440 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2,160 ఈసీఈ 20,070 ఈఈఈ 9,945 మెకానికల్ ఇంజనీరింగ్ 9,285 ఇతర బ్రాంచీలు 2,910 మొత్తం సీట్లు 76,635 -
ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట
* అనుబంధ గుర్తింపు వ్యవహారంలో వెసులుబాటు * అప్పీళ్లకు 20వ తేదీ వరకు అవకాశం * జూలై 6 నుంచి కౌన్సెలింగ్..జూలై 31 కల్లా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కావాలి * ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి..ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అనుబంధ గుర్తింపు ప్రక్రియ విషయంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), హైదరాబాద్ జారీ చేసిన ప్రొసీడింగ్స్కు సంబంధించి రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. 2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపిన జేఎన్టీయూ, వాటిని సవరించుకునేందుకు రెండు రోజుల గడువునిస్తూ ఈ నెల 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్పై అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేసుకునే వెలుసుబాటును హైకోర్టు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీకల్లా అప్పీళ్లు దాఖలు చేసుకోవాలని ఇంజనీరింగ్ కాలేజీలను ఆదేశించిన హైకోర్టు, ఆ అప్పీళ్లను ఈ నెల 28కల్లా పరిష్కరించాలని జేఎన్టీయూహెచ్ అప్పీలేట్ అథారిటీకి స్పష్టం చేసింది. అప్పీళ్లను విచారించే సమయంలో 9వ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్లో లేవనెత్తిన లోపాల వరకే పరిమితం కావాలని అప్పీలేట్ అథారిటీకి తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు సవరించింది. మొదటి కౌన్సెలింగ్ను జూలై 6న, రెండో కౌన్సెలింగ్ 13న, మూడో కౌన్సెలింగ్ను జూలై 20న నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై 31 కల్లా పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే కాలేజీల తనిఖీలు ఆపి, ఇప్పటి వరకు జరిపిన తనిఖీల ఆధారంగా తయారు చేసిన నివేదికలను, నిజనిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదికలను వెబ్సైట్లో ఉంచాలని జేఎన్టీయూని ఆదేశించింది. ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను జేఎన్టీయూహెచ్ ఎత్తిచూపింది. ఈ లోపాలను వెంటనే సవరించుకోవాలని, సవరించుకున్న విషయాన్ని తమకు తెలియచేస్తే మరోసారి తనిఖీలు నిర్వహిస్తామంటూ ఈ నెల 9న జేఎన్టీయూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. లోపాల సవరణకు రెండు రోజుల గడువునిచ్చింది. ఈ ప్రొసీడింగ్స్ను రద్దు చేయడంతో పాటు, తమ కాలేజీలను ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మరికొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
నిట్.. గూడెంలో సెట్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాత్కాలిక తరగతులు నిర్వహించేది ఏలూరులోనా.. తాడేపల్లిగూడెంలోనా అనే మీమాం సకు తెరపడింది. తాడేపల్లిగూడెంలోనే ఈ విద్యా సంవత్సరం నుంచే నిట్ తరగతులు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక బృందం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాల భవనాలను పరి శీలించింది. శాశ్వత భవనాలు నిర్మిం చేంత వరకూ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహించవచ్చని స్పష్టం చేయడంతో.. ఇక్కడే తరగతులు నిర్వహిం చేందుకు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అడ్మిషన్లు ఇలా.. జేఈఈ ఫలితాల ఆధారంగా నిట్లో సీట్లు ఇస్తారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఫలితాలలో విద్యార్థులు సాధించిన మార్కుల అధారంగా నిట్లో సీట్లు కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో కటాఫ్ మార్కుకు పైన ఉన్న విద్యార్థులు ఐఐటీలకు వెళతారు. మెయిన్ ఫలితాలలో ర్యాంకులు సాధిం చిన విద్యార్థులకు కటాఫ్ మార్కుల ఆధారంగా నిట్లో సీటు దొరుకుతుంది. గతంలో ఐఐటీకి వేరుగా, నిట్కు వేరుగా కౌన్సెలింగ్ జరగ్గా, ప్రస్తుతం రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని చెబుతున్నారు. నిట్లో ప్రవేశానికి ఈ నెల 18 తర్వాత నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక అడ్మిషన్లు ఇస్తారు. అనంతరం తరగతులు మొదలవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం జూలైలో పూర్తవుతుం దని, అదే నెల చివరి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే నిట్లో ఈ విద్యా సంవత్సరంలోనే 540 మంది విద్యార్థులు చేరతారు. రెండో ఏడాది మరో 540 మంది చేరతారు. వీరి కోసం వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. నిట్కు శాశ్వత భవనాలు నిర్మించడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్ప టివరకు వాసవిలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. -
ఫీజుల పథకానికి మార్గదర్శకాలు రెడీ!
డిప్యూటీ సీఎం కడియం నేతృత్వంలో సిద్ధమైన గైడ్లైన్స్ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కొత్త మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి. ఈ విద్యాసంవత్సరం (2015-16)లో నూతన గైడ్లైన్స్తో ఫీజుల పథకాన్ని అమలుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉన్నందున ఆ లోగానే వీటిని విడుదల చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ కసరత్తును పూర్తిచేసి ఆయా నిబంధనలను రూపొందించింది. ఐదువేల ర్యాంకులపైన పర్సంటేజ్ ఐదు వేల కంటే అధిక ర్యాంకు వచ్చేవారికి ఫీజు చెల్లించే విషయంలో కోర్సుల వారీగా నిర్ణీత కనీస మొత్తాన్ని (మినిమమ్ ఫీజు) చెల్లించడమా? ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సంటేజీ ఫీజును చెల్లించడమా? అన్న కోణంలో ఈ కమిటీ కసరత్తు చేసింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్థారించిన ప్రకారం ఒక కాలేజీలో రూ. లక్ష ఉంటే.. మరో కాలేజీలో రూ. 25 వేలే ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస కోర్సులో కనీస ఫీజు (మినిమమ్) చెల్లించడం కంటే ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సెంటేజీ ఫీజునే ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యార్థుల స్థానికత నిర్థారణకు మాత్రం రాజ్యాంగంలోని 371-డీ ప్రకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా విద్యార్థుల అటెండెన్స్ పరిశీలన ప్రతినెలా తప్పనిసరిగా విద్యార్థుల అటెండెన్స్ను పంపితేనే స్కాలర్షిప్లు చెల్లించాలని భావిస్తోంది. వీరి అటెండెన్స్ 75 శాతానికి తగ్గకుండా ఉంటే... ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలోనే నేరుగా ఆ డబ్బును జమచేయాలని, ఇతర విద్యార్థులకు ఆయా కాలేజీల అకౌంట్లకు డబ్బు పంపించాలనే ఆలోచనతో ఉంది. ఎంసెట్లో 5వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది(ఉమ్మడి రాష్ట్రంలో పదివేల ర్యాంకు వరకు ఉండేది). కోర్సుల వారీగా ప్రభుత్వం రీయింబర్స్మెంట్గా చెల్లించే ఫీజులపై సీలింగ్ విధించాలని భావిస్తోంది. -
జీతాలివ్వండి మహాప్రభో..!
వేతనాల్లేక అల్లాడుతున్న లక్ష మంది ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బంది ఆరేడు నెలలుగా జీతాలివ్వని వందకుపైగా కాలేజీలు రీయింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపుతున్న యాజమాన్యాలు ఈ ఏడాది ఇప్పటికీ పైసా ఫీజు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధిక శాతం మంది సకాలంలో జీతాలు అందక అల్లాడుతున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఉన్న 354 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు లక్షన్నర మందిలో సుమారు లక్ష మంది సిబ్బంది యాజమాన్యాల అనుచిత వైఖరితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపుతూ దాదాపు వంద కాలేజీల యాజమాన్యాలు విడతలవారీగా జీతాల బకాయిలు చెల్లిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే కనీస వేతనాలు కూడా అమలు చేయని ఈ కాలేజీలు బకాయిలను బూచీగా చూపడం పచ్చి మోసమని, అది కారణం కానే కాదని సిబ్బంది సంఘాలు ఆరోపిస్తున్నాయి. సకాలంలో జీతాలిస్తున్నవి 113 కాలేజీలే... రాష్ట్రంలో ప్రస్తుతం 113 కాలేజీలు మాత్రమే నెలా నెలా సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నాయి. వీటిలో (విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం) యూజీసీ స్కేళ్లు అమలు చేస్తున్న కాలేజీలు 25 మాత్రమే ఉండగా మిగిలిన 88 కాలేజీలు నెలానెలా వేతనాలు చెల్లిస్తున్నా మామూలుగా ఇచ్చే దానిలో (నిబంధనల ప్రకారం) సగం కూడా ఇవ్వట్లేదు. ఇక మిగిలిన 241 కాలేజీల్లో 140 కాలేజీలు ప్రతి 45 రోజులు లేదా రెండు నెలలకు ఒకసారి వేతనాలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 101 కాలేజీలు మాత్రం ఆరేడు నెలలు గడిచినా జీతాలు చెల్లించట్లేదు. కోచింగ్ సెంటర్లే దిక్కు... యాజమాన్యాలు నెలలు గడిచినా జీతభత్యాలు ఇవ్వకపోవడంతో బోధనా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. హైదరాబాద్లో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపుతున్నాయి. దాదాపు వందకుపైగా ఉన్న కోచింగ్ కేంద్రాల్లో దాదాపు లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యుడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వడంలో వారంతా తలమునకలవుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ...తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు పగలంతా కాలేజీలకు వెళ్లి పాఠాలు బోధిస్తూ మరోవైపు కోచింగ్ సెంటర్లకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన 90% మంది పేదలేనట... ప్రస్తుత విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారిలో 90 శాతం మంది పేదలేనట! ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 68 వేలకుపైగా సీట్లు భర్తీ అవగా అందులో 60 వేల మంది ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులని ప్రభుత్వమే తేల్చింది. ఇందులో తమ తప్పు ఎక్కడుందని ఇంజనీరింగ్ కాలేజీలు అంటున్నాయి. ‘మా కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు కార్లలో వస్తారు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకని అడిగితే ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలన్నది వారి సమాధానం. తహసీల్దార్లు ఇష్టానుసారం సర్టిఫికెట్లు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది’ అని ప్రముఖ కాలేజీలోని ఓ సీనియర్ ఫ్యాకల్టీ వాపోయారు. టాప్ కాలేజీలకూ తప్పని కష్టాలు రాష్ట్రంలో టాప్ 25 స్థానాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులో ఇప్పటిదాకా పైసా రాలేదు. ఒక్కో కాలేజీకి గరిష్టంగా రూ. 23 కోట్లు, కనిష్టంగా రూ. 16 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం ఎదురుచూడకుండా టాప్ కాలేజీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమో లేదా కార్పస్ ఫండ్ వాడుకోవడమో చేస్తున్నాయి. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో చెల్లించింది. ఈ ఏడాది (2014-15)కి సంబంధించి మాత్రం పైసా విడుదల కాలేదు. మరో రెండు మాసాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నా సర్కారు ఇంకా బకాయిలు చెల్లించలేదు. అప్పు తెచ్చి జీతాలిస్తున్నాం ఈ ఏడాది ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. అయినా జీతాలు ఇవ్వక తప్పదు కాబట్టి బ్యాంకు నుంచి రూ. 17 కోట్లు అప్పుగా తీసుకున్నాం. దానికి ఇప్పటివరకూ రూ. 2.5 కోట్లు వడ్డీ చెల్లించాం. - వి.మాలకొండారెడ్డి, సీబీఐటీ చైర్మన్ 3 నెలలకోసారి బకాయిలివ్వాలి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఇస్తే బాగుంటుంది. అప్పుడు ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉండవు. సిబ్బందికి కూడా నెలానెలా వేతనాలు ఇవ్వగలుగుతాం. - గౌతంరావు, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల సంఘం చైర్మన్ తంటాలు తప్పట్లేదు పగలంతా కాలేజీలో పాఠాలు చెప్పి రాత్రి 10 గంటల దాకా, మళ్లీ పొద్దున్నే 4 గంటల నుంచి కోచింగ్కు వెళ్లాల్సి వస్తోంది. సర్వీసుకు బ్రేక్ పడుతుందేమోనని నెలల తరబడి జీతాలు ఇవ్వకున్నా పని చేస్తున్నాం. - డాక్టర్ మురళీధర్రావు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ బోధన అంతంత మాత్రమే జీతాలు ఇవ్వని కాలేజీల్లో బోధన అంతంత మాత్రంగా ఉంటోంది. సిబ్బంది బోధనపై తగిన శ్రద్ధ చూపట్లేదు. ఫలితంగా ఆయా కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కనిష్టంగా ఏడు, గరిష్టంగా 19 శాతంగా ఉంది. - సీనియర్ అధికారి, జేఎన్టీయూహెచ్ -
మేలుకొలుపు
రొటీన్ కథలకు భిన్నంగా సామాజిక అంశాలనే చిత్రాలుగా మలిచాడు ఎ.బద్రి. తీసింది షార్ట్ ఫిల్ములే అయినా... చెప్పదలుచుకుంది సూటిగా, సుత్తి లేకుండా చెప్పి ఆలోచింపజేశాడు. ఆ చిత్రాలను మనమూ ‘షార్ట్’గా చూసేద్దాం రండి... ముందడుగు వేసి చూద్దాం ఓటు వేయరు గానీ... ప్రభుత్వ బాధ్యత గురించి గంటలు గంటలు చెప్పేస్తుంటారు చాలామంది. తమ కనీస బాధ్యతను విస్మరించి... పక్కవాడికి దాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. అలాంటిదే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా. ఓటు వేయడం దండగంటూ రూమ్ మేట్కు నూరిపోస్తుంటాడు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి. ప్రధాన బాధ్యతైన ఓటు వేయకుండా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటాడు. ఇది సరైన పద్ధతి కాదనే విషయం చివరకు ఇద్దరు చిన్న పిల్లల సంభాషణల ద్వారా అతనికి అర్థమవుతుంది. ఆలోచనా ధోరణి మారుతుంది. ఈ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. అనుకున్న మెసేజ్ను జనాల్లోకి పాస్ చేయడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. సిగ్గు లేదా..! గతుకుల రోడ్లు... కాయకష్టం చేస్తున్న బడి వయసు చిన్నారులు... ఫుట్పాత్పై దీనమైన బతుకులు... ఇంటి నుంచి కాలు పెడితే చాలు నిత్యం కనిపించే దృశ్యాలే ఇవి. సామాన్యుడిని అన్నీ కలచివేసేవే. ఇలా చూసి బాధపడితే ప్రయోజనం ఏముంటుంది! మనవల్ల కాదనుకుని వదిలేస్తే ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది! ఈ ప్రశ్నలన్నింటికీ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భద్రి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా... షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న తన అభిరుచి కొనసాగిస్తున్నాడు. మూస కథలు, చిత్రాలకు భిన్నంగా సమాజానికి అంతో ఇంతో సందేశాన్నిస్తున్నాడు. - ఓ మధు ది లేట్ కమర్స్ పంక్చ్యువాలిటీ పాటించడాన్ని గిల్టీగా ఫీల్ అవుతారు నేటి స్టూడెంట్స్. పైగా కాలేజీకి లేట్గా వెళ్లడమంటే అదో పెద్ద క్రెడిట్ వాళ్లకి. చేతిలో బుక్స్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ, లేట్గా వచ్చి క్లాస్లోకి పర్మిషన్ అడిగి, లెక్చరర్ని ఏదో ఒకటి అనడం బాగా అలవాటయిపోయిన విద్యార్థులపై సెటైరికల్గా ఈ లఘుచిత్రాన్ని రూపొందించాడు శ్రవణ్ కొత్త. ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అడుగు పెట్టిన లెక్చరర్కి ఎదురైన చేదు అనుభవాన్ని కథగా మలుచుకుని తీశాడు ఈ షార్ట్ ఫిల్మ్. ఆలస్యంగా వచ్చిన ప్రతి విద్యార్థీ ఏదో ఒక సాకు చెప్పి లోపలకు వచ్చి కూర్చుంటాడు. చివరికి అందరూ క్లాస్కి వచ్చేసరికి పీరియడ్ అయిపోతుంది. కథనం... డైలాగ్స్ బాగున్నాయి. ‘బీయింగ్ లేట్ టు క్లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ నాలెడ్జ్’ అనే మెసేజ్తో చిత్రం ముగుస్తుంది. బిగ్స్క్రీన్పై మక్కువ ఉన్నా అవకాశాలు దొరక్క పోవడంతో తనలోని క్రియేటర్ను ఇలా షార్ట్ ఫిల్మ్స్తో సంతృప్తి పరుస్తున్నాడు శ్రవణ్. ప్రస్తుతం నగరంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. - డా. వైజయంతి ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యూత్లో యమ క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com -
అలరించిన మిమిక్రీ
కర్నూలులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి శివారెడ్డి చేసిన మిమిక్రీ నవ్వులు పూయించింది. కర్నూలు(జిల్లా పరిషత్): జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వార్షికోత్సవంలో శివారెడ్డి మిమిక్రీ అలరించింది. శనివారం రాత్రి ఆ కళాశాల ఆవరణలో కల్చరల్, స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మాట్లాడుతూ.. తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నానన్నారు. రకరకాల ఉద్యోగాలు, పలు రకాల వ్యక్తులతో మెలగాల్సి రావడం ప్రస్తుత వృత్తికి దోహదపడిందన్నారు. నలుగురినీ నాలుగు కాలాల పాటు నవ్వించే ఆరోగ్యాన్ని భగవంతున్ని కోరుకుంటున్నాన్నారు. కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పరిపూర్ణత సాధించాలంటే మానసిక,శారీరక వికాసాలు పెరగాలన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాల కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా తమ కళాశాల ప్రోత్సహిస్తోందన్నారు. జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తమకు, తమ పిల్లలకు, పరిసరాల్లోని వారికి జి. పుల్లారెడ్డి నైతిక విలువలు పాటించేలా కథలు ఎలా చెప్పేవారో తెలిపారు. అధ్యాపకుల సూచనలు తనకు ఏవిధంగా ఉపయోగపడ్డాయో 1984-88 పూర్వ విద్యార్థి, ఈఆర్ఎస్ మెటల్స్ ప్రైవేటు లిమిటెడ్, చెన్నై డెరైక్టర్ పివిఎస్ మూర్తి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కింకర్తవ్యం..?
నల్లగొండ అర్బన్ : ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది. 2014-15 విద్యాసంవత్సరానికి నిబంధనలు పాటించలేదనే కారణంతో తెలంగాణ రాష్ట్రంలో 174 కాలేజీలకు జేఎన్టీయూ అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత హైకోర్టు ఆ వాదనను సమర్థించడంతో సుప్రీంకోర్టు దాకా వెళ్లి షరతులతో కూడిన అడ్మిషన్ల అవకాశం తెచ్చుకున్నా ఆశలపై చివరకు నిపుణుల కమిటీ నీళ్లు చల్లింది. వివరాల్లోకి వెళితే.. పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ల్యాబ్లు, గ్రౌండ్, ఫ్యాకల్టీ తదితర లోపాలతో పాటు ప్రమాణాలు పాటించడం లేదని జేఎన్టీయూ 2014 ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు తెలంగాణలోని 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు అడ్డు చెప్పింది. జిల్లాలో ఆ విధంగా 34 కాలేజీలకు అడ్మిషన్లు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లి షరతులతో అడ్మిషన్లను పొందేందుకు అవకాశాన్ని తెచ్చుకున్నారు. 174 కాలేజీలకు గాను 163 కాలేజీల వారే అడ్మిషన్లు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అంగీకరించారు. దాదాపు 60 వేల సీట్లు ఉండగా కేవలం 3 వేల మంది విద్యార్థులు మాత్రమే చేరారు. 7 కాలేజీల్లో 839 మంది విద్యార్థుల ప్రవే శం జిల్లాలో 34 కాలేజీల్లో దాదాపు 10 వేల సీట్లున్నా 27 కాలేజీల్లో ఎవరూ చేరలేదు. 7 కాలేజీల్లో 839 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కోదాడలోని రెండు కాలేజీల్లో 454 మంది, దేవరకొండలోని ఓ కాలేజీలో 150 మంది, మిర్యాలగూడలో 50 మంది, నల్లగొండలో సాగర్ రోడ్డులోని ఓ కాలేజీలో 22 మంది, హైదరాబాద్ రోడ్డులోని ఓ కాలేజీలో 13 మంది, చౌటుప్పల్, రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని ఓ కాలేజీలో 150 మంది ప్రవేశాలు పొందారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం ఆయా కాలేజీల్లో వసతులు లేకపోవడాన్ని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. తాజాగా అన్ని కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయించడం వల్ల ఇంతకాలం ప్రదర్శించింది మేకపోతు గాంభీర్యమని తేలిపోయింది. పలు కాలేజీల్లో ల్యాబ్లు, క్రీడా మైదానాలు లేకపోవడం, కొన్ని కాలేజీల్లో అవి ఉన్నా ముఖ్యంగా పీహెచ్డీ కలిగిన బోధకులు లేకపోవడం, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో చివరి అవకాశం కూడా చేజారింది. 7 కాలేజీలకు గాను కేవలం ఒకటి లేదా రెండు కాలేజీలు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారిని, మేనేజ్మెంట్ ద్వారా అడ్మిషన్లు తీసుకున్న వారిని సమీపంలోని కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే జేఎన్టీయూ తీసుకునే నిర్ణయం, ఇవ్వనున్న మార్గదర్శకాల ప్రకారం ఏ ఏ కాలేజీల్లో సర్దుబాటు చేస్తారనే విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అనుమతికి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిందే.. జిల్లాలో 41 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్కు అనుమతించిన ఆరు కాలేజీలు, ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఒక కాలేజీ మాత్రమే భవిష్యత్తులో కొనసాగే అవకాశాలున్నాయి. 34 కాలేజీలకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఇవ్వగా వాటిల్లో 7 కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు చేరడం తెలిసిందే. అయినప్పటికీ వాటిల్లో కూడా ఒకటి, రెండు కాలేజీలు మాత్రమే కొనసాగే అవకాశాలుండడంతో మిగతా కాలేజీలు రద్దుబాట పట్టక తప్పని పరిస్థితి. పలు కాలేజీల్లో అడ్మిష న్లను రద్దు చేయడంతో వాటి మనుగడ ముగిసినట్లేనని భావిస్తున్నారు. వాళ్లు మళ్లీ కొత్తగా అడ్మిషన్లు తీసుకోవాలంటే ఏఐసీటీఈ నార్మ్స్ ప్రకారం కొత్త కాలేజీ ప్రారంభంలో తీసుకోవాల్సిన నిబంధనలే పాటించాల్సి ఉంటుందని తెలిసింది. ల్యాబ్, గ్రౌండ్, ఫ్యాకల్టీ తదితర అన్ని వసతులను చూపి ప్రెష్గా దరఖాస్తు చేసుకోవాలని సమాచారం. -
అంతా డొల్లే!
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని లోపాలే ఫ్యాకల్టీ లేకుండానే కళాశాలల నిర్వహణ కంప్యూటర్లు, లైబ్రరీలు లేవు.. కనీస మౌలిక సదుపాయాలకూ దిక్కులేదు జేఎన్టీయూహెచ్ తాజా తనిఖీల్లో వెల్లడి గతంలో కోర్టు ఆదేశాల మేరకు 163 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి అందులోని 143 కాలేజీల్లో తొలి ఏడాది కోర్సుల గుర్తింపు రద్దు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల రంగు మరోసారి బయటపడింది. అన్ని సదుపాయాలూ ఉన్నాయని చెప్పుకొచ్చిన కళాశాలల్లో డొల్లతనం.. ఇటీవల జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లూ లేవు.. చదువుకునేందుకు లైబ్రరీల్లేవు, ఉన్నా వాటిల్లో పుస్తకాలు లేవు.. కనీస మౌలిక సదుపాయాలు లేవు.. చివరికి అధ్యాపకులు లేరు. అసలు అధ్యాపకులు లేకుండా చదువెలా చెబుతున్నారని తనిఖీ బృందాలు ప్రశ్నిస్తే యాజమాన్యాల నుంచి సమాధానం కరువైంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల్లో ఇలా అనేక లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్కు చెందిన 839 కోర్సుల్లో 807 కోర్సుల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్)ను జేఎన్టీయూహెచ్ రద్దు చేసింది. గతంలో సుప్రీంకోర్టు అనుమతితో ప్రవేశాలు చేపట్టిన 163 కాలేజీల్లో ప్రధానంగా ఫ్యాకల్టీ కొరత ఎక్కువగా ఉన్న 143 కాలేజీల్లో కోర్సుల గుర్తింపును రద్దు చేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు చెప్పారు. మిగతా మూడేళ్లకు సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఉన్నందున.. 45 రోజుల్లో ఫ్యాకల్టీ లోపాలను సవరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాలేజీలు లోపాలను దిద్దుకోకపోతే వాటి గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశముంది. ఇతర కాలేజీల్లోకి మార్పు! ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల కోసం అధ్యాపకులను ఆయా కాలేజీలు 45 రోజుల్లోగా నియమించుకోకపోతే.. వాటి గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 25 శాతం వరకు ఫ్యాకల్టీ కొరతను మినహాయించినా... అంతకుమించి కొరత ఉన్న 90 కాలేజీల్లో 43,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. 30 శాతం వరకు మినహాయింపు ఇస్తే.. 39,674 మంది (83 కాలేజీలు) విద్యార్థులు, 40 శాతం వరకు ఇస్తే 33,938 మంది విద్యార్థులు (83 కాలేజీలు), 50 శాతంలోపు ఫ్యాకల్టీ కొరతను మినహాయించినా 31,070 మంది విద్యార్థులు చదువుతున్న 65 కాలేజీలు అనర్హత పరిధిలో ఉంటాయి. అయితే ఏరకంగా చూసినా 25 శాతానికి మించి ఫ్యాకల్టీ కొరతకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేవు. దీంతో ఆయా కాలేజీల్లోని బీటెక్ ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం కోర్సుల గుర్తింపు రద్దు తప్పదు. అదే జరిగితే 43,020 మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘ప్రథమ’ విద్యార్థుల పరిస్థితేమిటి? ప్రథమ సంవత్సర అఫిలియేషన్ కోల్పోయిన 143 కాలేజీల్లో చేరిన మూడు వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు కానున్నాయి. లోపాలు ఉన్నట్లు తేలితే ఆ ప్రవేశాలు రద్దవుతాయని, విద్యార్థుల ఫీజును వెనక్కి ఇచ్చేస్తారని సుప్రీం కోర్టు ఆ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతిచ్చిన సమయంలోనే స్పష్టం చేసింది. అయితే ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఏదైనా కళాశాలను మూసివేసినా, గుర్తింపును రద్దుచేసినా అందులోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్చాల్సిన బాధ్యత కాంపిటెంట్ అథారిటీదే. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వమే ఇతర కాలేజీలకు పంపించే అవకాశం ఉంది. -
విద్యా సేవా?.. వ్యాపారమా?
* ఇంజనీరింగ్ కళాశాలల తీరుపై గవర్నర్ అసంతృప్తి * కోర్సులు పూర్తి చేసినా.. విద్యార్థుల్లో నైపుణ్యం శూన్యం * ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య వ్యాపారంగా మారిపోయిందని, ఈ పరిస్థితిని వెంటనే నిర్మూలించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరముందని సూచించారు. భారత ఇంజనీర్ల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘29వ ఇంజనీరింగ్ కాంగ్రెస్’ సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్... తన ప్రసంగంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇంజనీరింగ్ కళాశాలలు విద్యా సేవ చేస్తున్నా యా? వ్యాపారం చేస్తున్నాయా? ఫీజు రీయిం బర్స్మెంట్ కోసమే కళాశాలలు తెరిచారా? ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన వారికి స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాల అభివృద్ధి) అంటున్నారు. మరి నాలుగేళ్ల ఇంజనీరింగ్లో విద్యార్థులకు మీ రేం నేర్పిస్తున్నారు?’’ అని నరసింహన్ ప్రశ్నిం చారు. జాతీయ ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ఎక్కువయ్యాయని, ఇంజనీరింగ్ విద్యలో మార్పులకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య వ్యాపారీకరణను తుద ముట్టించాలని వ్యాఖ్యానించారు. ఎంత మంది ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారనేదాని కంటే ఎంత నైపుణ్యం సాధిస్తున్నారనేదే ముఖ్యమని గవర్నర్ పేర్కొన్నారు. దేశంలో మేధస్సుకు కొరత లేదని, దానిని వినియోగించుకోలేక పోతుండడమే ప్రధాన సమస్య అని చెప్పారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో నిస్సారంగా ఉండక, దేశ ఆర్థికోన్నతికి ఇంజనీర్లు దోహదపడాలని సూచించారు. నాణ్యమైన రహదారులు, సులువైన అనుసంధానం రూపాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిం చాలని, విద్యుచ్ఛక్తి భద్రత కల్పనకు ఇంజనీరింగ్ సంస్థలన్నీ కలిసి కృషి చేయాలని పేర్కొన్నారు. జల, థర్మల్ విద్యుత్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. భారీ వ్యయంతో సోలార్ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉండబోదన్నారు. అదే సమయంలో గృహావసరాలకు సోలార్ విద్యుత్ వినియోగాన్ని నొక్కిచెప్పాలని సూచించారు. రాజ్భవన్లో 85% విద్యుత్ అవసరాలను సౌర విద్యుత్ ద్వారానే తీర్చుకుంటున్నామని, త్వరలోనే దీన్ని వంద శాతానికి తీసుకెళతామని గవర్నర్ తెలిపారు. సదస్సులో ఇంజనీర్ల అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ జి. సుధాకర్, కార్యదర్శి బి. బ్రహ్మారెడ్డితోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లు హాజరయ్యారు. -
అంధుల కోసం ‘ఈ స్టిక్’
హైదరాబాద్: విద్యార్థులు తయారు చేసిన ఈ స్టిక్ అంధులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని బీవీఆర్ఐటీ మహిళ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ విష్ణు రాజు అన్నారు. నర్సాపూర్, భీమవరం, హైదరాబాద్ బీవీఆర్ఐటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఫ్యాకల్టీ సహకారంతో తయారు చేసిన వికలాంగుల పరికరాలను, అవి పని చేసే విధానాన్ని ఆయన వివరించా రు. ప్రపంచ వికలాంగుల దినోత్స వం సందర్భంగా బాచుపల్లిలోని కాలేజీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టిక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు రాజు మాట్లాడుతూ ప్రొ.అలెన్క్స్ ్రఈ అస్సెటీవ్ టెక్నాలజీ ల్యాబ్కు సంధాన కర్తగా వ్యవహరిస్తూ అనేక పరికరాలను తయారు చేయడానికి స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తమ విద్యార్థులు రూపొందించిన ఈ స్టిక్ అంధులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ స్టిక్ను పట్టుకున్న వారి ముందు రెండు మీటర్ల దూరంలో ఎలాంటి వస్తువులు, వక్తులు, పరికరాలు ఉన్నా వెంటనే సౌండ్తో అలర్డ్ చేస్తుందని ప్రయోగాత్మకంగా చూపించారు. స్టిక్ చేసిన శబ్దంతో అప్రమత్తం కాకుండా దగ్గరకు అలాగే వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. -
ఇద్దరు యువకుల జల సమాధి
చందర్లపాడు : ఇంటికి కూత వేటుదూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులతో కలసి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకుల ప్రాణాలను మృత్యువు కబళించింది. దీంతో ఇద్దరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కాసరబాదలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. గ్రామానికి చెందిన వాసిరెడ్డి వెంకట కమల ప్రవీణ్(18), అరవపల్లి ఫణిశేఖర్(32) ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో నివశిస్తుంటారు. ప్రవీణ్ గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫణిశేఖర్ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండుగను చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులైన గోకర ్లయోగానందం, ఉదయ్తో కలసి స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ప్రవీణ్ తమ్ముడు కార్తీక్ ఉన్నాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవీణ్ లోతుగా ఉండే ప్రదేశంలోకి వెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న అతడిని కాపాడేందుకు ఫణిశేఖర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మరణంచాడు. దీనిని గమనించిన కార్తీక్ ఒడ్డుకు వచ్చి తండ్రి చంద్రశేఖర్కు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి హుటాహుటిన వచ్చారు. జాలర్ల సాయంతో గాలించి, ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శర్మ, ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ తరలించారు. కాయకష్టంతో పిల్లలను చదివించారు.. చంద్రశేఖర్, సుభద్ర దంపతులకు ప్రవీణ్, కార్తీక్ సంతానం. చంద్రశేఖర్ తనకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ, ప్రైవేటు పాల డెయిరీకి ఏజెంట్గా పనిచేస్తున్నారు. సుభద్ర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సీతారామయ్య, శ్రీలక్ష్మి దంపతులకు ఫణీంద్ర, సంకీర్తన సంతానం. సీతారామయ్యకు 1.50 సెంట్ల భూమి ఉంది. తమ పొలాన్ని సాగుచేసుకుంటూనే సీతారామయ్య దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించారు. ఫణిశేఖర్ను ఎంసీఏ వరకు చదివించారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫణిశేఖర్కు ఇన్కంటాక్స్ డిపార్టుమెంటులో టాక్స్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలు కూడా రాశాడు. ఇద్దరి మరణంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
చదువులకు ఆటంకం కలిగించొద్దు: ఆర్.కృష్ణయ్య
విజయనగర్కాలనీ: బీసీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవకుండా అడ్డంకులు సృష్టించడం తగదని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పూర్తి ఫీజులతో రీయింబర్స్మెంట్ పథకం కొనసాగించకుంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని బీసీ సంక్షేమ భవన్ను ముట్టడించారు. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా చదువులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం 170 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి బీసీ యువకుల చదువుకు ఆటంకాలు కల్పించిందన్నారు. ఈ విషయంపై బీసీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తడం లేదని ఆయన అన్నారు. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాలేజి విద్యార్థుల స్కాలర్షిప్లకు, ఫీజుల రీయంబర్స్మెంట్ విధించిన గరిష్ట ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అలోక్ కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు విక్రమ్గౌడ్, ఎన్.వెంకటేష్, వంశీ, శివాజీ, గొరిగె మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చదువు సమాజానికి ఉపయోగపడాలి
బొల్లికుంట(సంగెం) : విద్యార్ధుల చదువు సామాజానికి ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ సామాజిక, జానపద ఉద్యమగాయకుడు గోరెటి వెంకన్న కోరారు. మండలంలోని బొల్లికుంటలోగల వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ జాతీయస్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ వాగ్ తరంగ్ 2కే-14 ముగింపు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రపంచదేశాలన్నింటికీ మన భారతదేశం, తెలంగా ణ మేధోసంపత్తిని అందిస్తున్నదన్నా రు. అనంతరం ఆయన తన పాటలు, నృత్యా ల ద్వారా ఆకట్టుకున్నారు. కాగా, వర్ధమాన సినీగాయకులు రెని నారెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించిన గీతాలు ఉర్రూతలూగించాయి. కళాశాల కార్యద ర్శి దేవేందర్రెడ్డి, ఏఓ సత్యపాల్రెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్తయ్య, ప్రకాశ్, డెరైక్టర్ భా స్కర్రావుతో పాటు రాజారావు, నాగరా జు, శ్రావణ్రెడ్డి, సురేష్ పాల్గొన్నారు. -
అనుమతి లేకున్నా స్పాట్ అడ్మిషన్లు!
కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలోని ఖాళీల భర్తీ ప్రకటనలు ఇచ్చి మరీ సీట్లు నింపుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలు హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. స్పాట్ అడ్మిషన్ల పేరుతో సీట్లను భర్తీ చేస్తున్నాయి. నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇచ్చి మరీ ఈ సీట్లను భర్తీ చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా స్పాట్ అడ్మిషన్ల పేరుతో మిగులు సీట్ల భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగలకపోయినా, మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను చాలా వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మధ్యతరహా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యా మండలి ఆమోదం లేకపోయినా ప్రకటనలు జారీచేసి మరీ సీట్లను భర్తీ చేస్తుండడంతో భవిష్యత్తులో వాటికి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 31తోనే ఆఖరు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31తోనే ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయింది. అప్పటివరకు కన్వీనర్ కోటాలోనే ఆంధ్రప్రదేశ్లో 57వేల సీట్లు, తెలంగాణలో 15వేల సీట్లు మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో మేనే జ్మెంట్ కోటాలో మరో 80 సీట్లు ఉండిపోయాయి. అయితే ఆగస్టు 31 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. కౌన్సిల్ ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా మేనే జ్మెంట్ కోటా సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 వేల మందికి యాజమాన్యాలు సీట్లను కేటాయించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిన్నకుండిపోయింది. అయితే యాజమాన్యాలు మాత్రం ప్రకటనలు జారీచేసి మరీ ఆ సీట్ల భర్తీకి గతంలోనే చర్యలు చేపట్టాయి. తాజాగా మేనేజ్మెంట్ కోట్లా, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో ప్రకటనలు జారీ చేసి భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఆగస్టు 31 తర్వాత చేపట్టిన, చేపడుతున్న ఈ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తుందన్నదీ ప్రశ్నార్థంగా మారింది. -
బీసీ విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పిస్తాం
పెద్దాపురం :రాష్ట్రంలో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న బలహీన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన గురువారం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ కళాశాలలు, వసతి గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. తమకు హాస్టర్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మంత్రికి తెలిపారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో మాట్లాడి దివిలి కేంద్రంగా కళాశాల హాస్టల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. తొలుత కళాశాల చైర్మన్ బేతినేడి శ్రీనివాసరావు మంత్రి రాజప్పకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి కళాశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. అనంతరం మంత్రి రాజప్పను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించింది. ఏఓ సందీప్, ఈఓ జెన్నిబాబు, దయాకర్, విశ్వేశ్వరరావు, పాల్కుమార్, వీరేంద్ర, పెదకాపు, అప్పారావు, సర్పంచ్లు కొత్తెం కోటి, మెయిళ్ళ కృష్ణమూర్తి, లక్కరాజు మున్నేశ్వరరావు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైస్ బకెట్
విద్యార్థులు సామాజిక చైతన్యంతో ముందుకు కదిలారు. బస్తీల్లోని నిరుపేదలకు బియ్యం పంచి తోచిన సాయమందించారు. రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సన్రైజ్లు కంటోన్మెంట్ మడ్పోర్డ్లోని ఉత్తరయ్య హట్స్లో బుధవారం ‘రైస్ బకెట్ చాలెంజ్’ నిర్వహించాయి. గుడిసెల్లో ఉండే పేదలకు ఐదు వందల కిలోల బియ్యాన్ని ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కాశ్మీర్ వరద బాధితులకు కూడా ఐదు వందల కిలోల బియ్యం పంపినట్టు కార్యక్రమ నిర్వాహకురాలు పూర్ణిమారెడ్డి తెలిపారు. - రసూల్పురా -
రేణిగుంటలో బాంబు కలకలం
రేణిగుంట: ఓ కళాశాలలో బాంబు ఉందని ఓ అంగతకుడు చేసిన ఫోన్ కాల్ స్థానికంగా కలకలం రేపింది. రేణిగుంటకు సమీపంలోని కరకబాడీ లోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో బాంబు ఉన్నట్టు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించారు. దాంతో రేణిగుంట పోలీసులు ఘటనస్థలానికి పరుగులు పెట్టారు. కళాశాలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరికి బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ఱారణ చేసుకున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పీజీ కౌన్సెలింగ్పై రీయింబర్స్మెంట్ ఎఫెక్ట్!
- ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఇవ్వని ప్రభుత్వాలు - సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా - అభ్యర్థులు విలవిల.. కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెల సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత చదువులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో ఫీజులు కళాశాలల ఖాతాలకు నేటికీ చేరలేదు. దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేశాయి. దీని ప్రభావం శనివారం ప్రారంభమైన పీజీఈసెట్ కౌన్సెలింగ్పై పడింది. ఖాళీగా కౌన్సెలింగ్ కేంద్రాలు గేట్, పీజీఈసెట్లో ర్యాంకులు సాధించినా కాలే జీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావడంలేదు. తాము బీటెక్ పాసైనట్లుగా వెబ్సైట్ మార్కుల జాబితాలు చూపినా అధికారులు అంగీకరించడంలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా కౌన్సెలింగ్కు అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నారు. అయితే.. అభ్యర్థులు పెద్దగా రాకపోవడంతో తొలిరోజు కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. పీజీ కోర్సుల్లో చేరాల్సిన గేట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరి శీలనకు గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం సుమారు 30వేల మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్జేయూకేటీలోనూ ఇదే దుస్థితి.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరిస్థితి అలాఉంటే.. ప్రభుత్వ విద్యాసంస్థలు తామేమీ తీసిపోమంటున్నాయి. రాజీవ్గాంధీ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిధిలోని 4 ఐఐఐటీల్లోనూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అంటుండడం విచారకరం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం ఆర్జేయూకేటీ ఆధ్వర్యంలో ఆరేళ్ల కిందట 4 ఐఐఐటీలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా టెన్త్ మెరిట్ ప్రకారం ఇంటర్, డిగ్రీల్లో ప్రవేశం కల్పించారు. ఐదేళ్లపాటు ఫీజులు చెల్లించిన ప్రభుత్వం చివరి సంవత్సరంలో చెల్లించకపోవడంతో అక్కడి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇడుపులపాయ, నూజి వీడు, బాసర, హైదరాబాద్ ఐఐఐటీల్లో డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులకు ఫీజులు రాలేదని అధికారులు ఫలితాలను సైతం నిలిపివేశారు. ఐఐఐటీల్లో బీటెక్ పూర్తిచేసిన పలువురు విద్యార్థులు గేట్, పీజీఈసెట్లలో మంచి ర్యాంకులు సాధించినా.. కౌన్సెలింగ్కు హాజరుకాక ఉన్నత చదువులపై ఆశలు వదులుకుంటున్నారు. ఆశలు వదులుకున్నా.. మాది మహబూబ్నగర్ జిల్లా వనపర్తి. టెన్త్లో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ఐఐఐటీలో సీటు వచ్చింది. బాగా చదివి బీటెక్లోనూ 77శాతం మార్కు లు సాధించా. గేట్-2014లోనూ ర్యాంకు వచ్చింది. చివరి ఏడాది ఫీజు బకాయి ఉంద ని అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. -శ్రీలత, గేట్ ర్యాంకర్, మహ బూబ్నగర్ సర్టిఫికెట్లు ఉంటేనే అనుమతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు బకాయిలుండటంతో సర్టిఫికెట్లు ఇవ్వ లేదని కొంతమంది చెబుతున్నారు. దాంతో మాకు సంబంధం లేదు. గేట్, పీజీఈసెట్లలో ర్యాంకులు వచ్చినవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తేనే ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తాం. -సీతారామరాజు, జేఎన్టీయూహెచ్ అడ్మిషన్స్ డెరైక్టర్ ఫీజులు చెల్లించాల్సిందే.. బీటెక్ పూర్తయిన విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు పూర్తిగా చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే మా తప్పు కాదుకదా. ఫీజు బకాయిలు ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆర్జేయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లిన అభ్యర్థులకు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫీజులు వస్తే విద్యార్థులకు రీయింబర్స్మెంట్ చేస్తాం. - వేణుగోపాల్, ఐఐఐటీ డెరైక్టర్, ఇడుపులపాయ -
సమష్టిగా జిల్లా అభివృద్ధి
వరంగల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూపాలపల్లిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రణాళిక సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో అభివృద్ధి పరంగా జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వరంగల్ లోక్సభ సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావులతో కలిసి శ్రీహరి ఆదివారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని పార్టీల నేతలను కలుపుని కృషి చేస్తామన్నారు. ఇందుకోసం సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేసిన జేఏసీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని, అభివృద్ధి, సంక్షేమం ముసుగులో జిల్లాను దోపిడీ చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్కు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలి పారు. గతంలో రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవంతో వరంగల్ లోక్సభ సభ్యుడిగా తాను జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల తర్వాత లోక్సభ సభ్యుడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. బిల్ట్ను కాపాడుతాం : ఎంపీ సీతారాంనాయక్ జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ బల్లాపూర్ ఇండస్ట్రియల్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమను మూతపడకుండా చర్యలు తీసుకుం టామని మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ చెప్పారు. 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ ఉత్పత్తి చేసే కాగితపు గుజ్జు(పల్ప్) విక్రయాలకు ఇబ్బందు లు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా బిల్ట్ నుంచి కాగితపు గుజ్జును ఈ రంగంలోని సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. గుండాల-ఇల్లెందు రహదారి మంజూరుకు అడ్డంకిగా ఉన్న 14 ఎకరాల అటవీ భూముల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు రూ.ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఏడు ఎకరాలకు సైతం నీళ్లివ్వలేదు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన కంతనపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టులనే కాకుండా చెరువుల అభివృద్ధికి, వాగులపై చెక్డ్యాంల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరాము. 40 ఎకరాల భూములు అవసరమని అడిగారు. భూములను గుర్తించే ప్రక్రియ మొదలుకానుంది. ఉన్నత ప్రమాణాలు ఉండే ఈ స్కూల్తో జిల్లాలోని ఉద్యోగులు, ఇతరుల పిల్లలకు మెరుగైన విద్య అందనుంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాన్ని పారి శ్రామిక కారిడార్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బొగ్గ గనులు ఉండి పరిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భూపాలపల్లిలో అనుబం ధ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(జేఎన్టీయూ -హైదరాబాద్) కోరాము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణ లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థను వరంగల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యారంగానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం సంస్థ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. ఆజంజాహి మిల్లు మూతపడిన తర్వాత జిల్లాలో పరిశ్రమ లు ఏర్పాటు కాలేదు. నిరుద్యోగ యువత ఉపాధి లేక అవస్థలు పడుతోంది. జిల్లాలో కొత్తగా కాంపోజిట్ టెక్స్టైల్ మిల్లు ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రిని కోరాము. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాశారు. ఈ మిల్లు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్, తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అంశాలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, అలాగే కాజీపేటను రైల్వే డివిజన్గా చేయాలని రైల్వే మంత్రిని కోరాము. రైల్వే వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటుకు సాంకేతిక అంశాలే అడ్డంకిగా ఉన్నాయి. వర్క్షాప్ ప్రదిపాదిత భూములకు పాతచట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ప్రక్రియ పూర్తి చేస్తే ఈ అంశం ముగిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న 100 స్మార్ట్ సిటీల్లో వరంగల్ నగరం ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. విస్తరిస్తున్న వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రిని కోరాం. ఇది ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉంది. కరెంటు అవసరాలను తీర్చేందుకు భూపాలపల్లిలో త్వర లోనే 660 మెగావాట్ల సామర్థ్యంతో రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభించనున్నాం. -
ఏం‘టెక్’ కాలేజీలో..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్కు బోధించాలంటే పీహెచ్డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎంటెక్లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి. -
ఈ కాలేజీల పరిస్థితేంటి ?
-
శ్రుతిమించిన ఈవ్టీజింగ్
- ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం బిట్రగుంట : ఈవ్ టీజింగ్ వ్యవహారం శ్రుతిమించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బోగోలులో సోమవారం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలుకు చెందిన ఓ విద్యార్థిని కావలి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తుండగా, బోగోలుకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు పరిచయం పెంచుకున్నాడు. అక్కా అంటూ సరదాగా మాట్లాడుతూ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. చివరకు ఈవ్టీజింగ్కు పాల్పడుతూ వేధిస్తుండటంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. కుటుంబ సభ్యులు ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వివాదం పెద్దది కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే కావలిలోని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా నొప్పుల నివారణకు వాడే మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కావలిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
రెండంటే..రెండే
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు నేపథ్యంలో జిల్లాలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే కౌన్సెలింగ్ కు అర్హత దక్కింది. ప్రయోగశాలలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, మౌలిక సౌకర్యాల కొరత నేపథ్యంలో యూనివర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. గతంలో జిల్లాలో తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీల్లో సుమారు మూడువేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా కాలేజీల్లో విద్యాప్రమాణాలు లేవనే కారణంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కొన్ని కాలేజీల గుర్తింపును రద్దుచేశాయి. రాష్ట్రంలో 315 ఇంజినీరింగ్ కాలేజీలకు కేవలం 141కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జిల్లాలో తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా యూనివర్సిటీల నిర్ణయంతో ప్రస్తుతం రెండు కాలేజీలు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హత సాధించాయి. జేపీఎన్ఎసీ(ధర్మాపూర్)తో పాటు స్విట్స్(దేవరకద్ర) కాలేజీలకు మాత్రమే కౌన్సెలింగ్లో పాల్గొనే అర్హత దక్కింది. ప్రస్తుతం ఒక్కో కాలేజీలో 420 సీట్ల చొప్పున 840 సీట్లలో మాత్రమే విద్యార్థులను భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే మూడు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డాయి. అలాగే ఫార్మసీ, బయోటెక్నాలజీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్యకు భారీగా కోత పడింది. జిల్లాలో కేవలం మూడు ఫార్మసీ కాలేజీలకు మాత్రమే గుర్తింపు లభించినట్లు సమాచారం. రెండో విడతలో అవకాశం? ఎంసెట్లో అర్హత పొందిన విద్యార్థులకు ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. దీంతో మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన వెబ్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఇప్పటివరకు 1837 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. గుర్తింపు రద్దు నేపథ్యంలో కౌన్సెలింగ్లో అవకా శం దక్కని కాలేజీల యాజమాన్యాలు అర్హత సాధించేందు కు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే నాటికి గుర్తింపు పునరుద్ధరిస్తారనే ఆశలో యాజమాన్యాలు ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర కాలేజీల్లో చేరి తే ఆ తర్వాత అనుమతి లభించినా ఫలితాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కాలేజీ యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఫీజు రీయంబర్స్మెంట్ భారాన్ని త గ్గించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వి ద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాంకేతిక విద్యను అందుకోవాలనే ఆశతో ఉన్న పేద విద్యార్థులు సీట్ల సంఖ్య లో కోత విధించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీలకు మళ్లీ చుక్కెదురు!
-
అధికార పార్టీకి ‘అఫిలియేషన్’ షాక్!
* గుర్తింపు రాని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీఆర్ఎస్ నేతలవే అధికం * టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కాలేజీలన్నింటికీ అఫిలియేషన్లు * కాంగ్రెస్, బీజేపీ నేతల కళాశాలలకూ గుర్తింపు * ఎక్కువ లోపాలతోపాటు చిన్న లోపాలున్న వాటికీ నిరాకరణ * లోపాలు సరిదిద్దుకుంటామన్న 34 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే చాన్స్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో ఈసారి రాజకీయ పార్టీల నేతలకు పెద్దగానే షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కాలేజీలకే అఫిలియేషన్లు లభించకపోగా, ఇతర పార్టీలకు చెందిన నేతల కాలేజీలు దాదాపు అన్నింటికీ అఫిలియేషన్లు రావడంపై అధికార, విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు అన్ని కాలేజీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకుల కళాశాలలకు అఫిలియేషన్లు లభించాయి. అయితే, టీఆర్ఎస్కి చెందిన నేతల కాలేజీలకు మాత్రం కత్తెర పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయా కళాశాలల యాజమాన్యాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కౌన్సెలింగ్ ముగిసేలోపే ఇవ్వండి... లోపాలను తెలియజేయకుండా, సరిదిద్దుకునే అవకా శం ఇవ్వకుండా, నోటీసులైనా జారీచేయకుండా అఫిలి యేషన్లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పరిస్థితుల్లో జేఎన్టీయూహెచ్ సదరు కాలేజీలకు లోపాలపై తాజాగా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్న మరో 34 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 25న మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తికానుందని,దానికి ముందే అఫిలియేషన్లు ఇవ్వాలని చిన్నచిన్న లోపాలున్న యాజమాన్యాలు కోరుతున్నాయి. అఫిలియేషన్ల వ్యవహారంలో ప్రధాన అంశాలు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్రెడ్డికి చెందిన మూడు కాలేజీలకు అఫిలియేషన్లు రాలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి చెందిన రెండు కళాశాలలకు గుర్తింపు నిరాకరించారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ నాగేశ్వర్కు చె ందిన రెండు కాలే జీలకు అఫిలియేషన్లు ఇవ్వలేదు. టీఆర్ఎస్ నేత మహబూబ్ అలీఖాన్కు చెందిన మూడు కాలేజీలకు కూడా గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు 15 కాలేజీలకు అఫిలియేషన్లు లభించగా.. తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కళాశాలలకు గుర్తింపు వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల కాలేజీలకూ అఫిలియేషన్లు లభించాయి. -
2020 నాటికి 40 లక్షల ఐటీ ఉద్యోగాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, 2020 నాటికి ఈ సంఖ్య రెండింతలు కానుందని ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్ వెల్లడించారు. ఐటీ, బీటీ రంగంలో కొత్త పరిణామాల గురించి తెలియజేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఐటీ ఎగుమతుల్లో మూడో వంతు కర్ణాటక నుంచే సాగుతోందని తెలిపారు. గత ఏడాది రూ.1.65 లక్షల ఐటీ ఎగుమతులు జరిగాయని చెబుతూ, 16 నుంచి 17 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేస్తూ, కెంగేరి, శివాజీ నగర, జయ నగర, బనశంకరి, విజయనగర బస్సు స్టేషన్లకు కూడా ఇటీవల ఈ సదుపాయాన్ని విస్తరించామని చెప్పారు. ఏడాదిలోగా మొత్తం బెంగళూరుతో పాటు జిల్లా కేంద్రాలకు ఈ సదుపాయాన్ని విస్తరించదలిచామని వెల్లడించారు. దీనిపై ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించగా, ఆరు సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ఇతర ప్రక్రియలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా పారిశ్రామికాసక్తి, నవ కల్పనలను ప్రోత్సహించడానికి మైసూరు, తుమకూరు, గుల్బర్గ, ధార్వాడ, బిజాపుర, బాగలకోటె, ఉడిపి, బెల్గాం, శివమొగ్గల్లోని తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలకు కొత్త తరం ఇన్క్యుబేషన్ సెంటర్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు మూడేళ్ల పాటు రూ.40 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని వెల్లడించారు. తమ అనుభవాలను, బోధనలను పంచుకోవడానికి ఈ కేంద్రాలన్నిటినీ అనుసంధానం చేస్తామని కూడా చెప్పారు. యువతకు ప్రయోజనం కలిగే విధంగా నైపుణృ్య అభివద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టే దిశగా సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. నగరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. ఇందులో కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తుందన్నారు. మైసూరులో కూడా రూ.30 కోట్ల వ్యయంతో ఇలాంటి క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తప్పు చేయకపోతే భయమెందుకు? విపక్ష బీజేపీ నేత జగదీష్ శెట్టర్ సవాల్ విసిరారు. బళ్లారి శివారులోని సంగనకల్లులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 542 ఎకరాలకు సంబంధించిన అర్కావతి లే ఔట్లో ఎకరం రూ. 15 కోట్లకు పైబడి ధర పలుకుతోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 14 నెలలకు సంబంధించి బళ్లారి జిల్లా, రాష్ట్రంలో చేపట్టిన అభిృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బళ్లారికి సోనియా గాంధీ ప్రకటించిన రూ.33వేల కోట్ల ప్యాకేజీపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కార్పొరేషన్లకు ప్రతి ఏటా రూ. వంద కోట్లను కేటాయించిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. కేపీఎస్సీ-11 నియామకాలు రద్దు చేయడం సబబు కాదని అన్నారు. కష్టపడి చదువుకుని ర్యాంకులు తెచ్చుకున్నవారి జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేపీఎస్సీ నియామకాల రద్దు వివాదాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీఎం అశోక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విరుపాక్షిగౌడ, జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు సుధీర్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురారీగౌడ పాల్గొన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ కౌన్సెలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు హెల్ప్లైన్ కేంద్రాల్లో గురువారం ప్రారంభమైంది. కౌన్సెలింగ్లో భాగంగా తొలిరోజు 1 నుంచి 5000 ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా జిల్లాలోని నాలుగు కేంద్రాలకు 127 మంది విద్యార్థులు హాజరయ్యూరు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని కేంద్రానికి 10 మంది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 29 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 38 మంది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని కేంద్రానికి 50 మంది హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం దాదాపు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం రోజున మాత్రం హెల్ప్లైన్ కేంద్రాలకు ఒక్కొక్కరుగా తరలివచ్చారు. గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ముందుగానే తెలిసినప్పటికీ ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కడ హాజరు కావాలనే విషయమై బుధవారం రాత్రి వరకూ స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ర్యాంకులవారీగా హాజరు కావాల్సిన హెల్ప్లైన్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం రాత్రి ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు షెడ్యూల్ను తెలుసుకోలేకపోయారు. గురువారం ఉదయం దినపత్రికల్లో చూశాక ఆయా హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా మూరుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు 10.30 తర్వాతే హాజరవగలిగారు. తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనను నిర్ణీత సమయానికి పూర్తి చేసుకుని వెళ్లారు. నేటి షెడ్యూల్ శుక్రవారం 5001 నుంచి 10వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. గుజ్జనగుండ్లలోని కళాశాలలో 5,001 నుంచి 6,250 ర్యాంకు వరకు, నల్లపాడులోని కళాశాలలో 6,251 నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని మహిళా కళాశాలలో 7,501 నుంచి 8,750 ర్యాంకు వరకు, ఏఎన్యూలో 8,751 నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులు హాజరుకావాలి. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
జిల్లాలో మూడు హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాట్లు పూర్తి యూనివర్సిటీ క్యాంపస్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశ ఫలి స్తోంది. పలు అడ్డంకుల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు హెల్ప్లైన్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. తొలిరోజైన గురువారం 1 నుంచి ఐదువేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల పత్రాలను పరిశీలించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలుగా స్క్రాచ్ కార్డులు ఇస్తారు. ఈనెల 23 వరకు పత్రాల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లలో విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తారు. జిల్లాలో 35 కళాశాలలు జిల్లాలో 35 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతిలో 20 కళాశాలలుండగా మిగిలిన ప్రాంతాల్లో 15 ఉన్నాయి. ఇవన్నీ జేఎన్టీయూ అనంతపురంకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అదనంగా ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీకి వస్తే కెమికల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్లో 40 సీట్లు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక్కో బ్రాంచ్లో సీట్లను 60కి పెంచారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 120 సీట్లు, ఈసీఈలో 120 సీట్లు, ఈఈఈలో 60, మెకానికల్లో 60 సీట్లు ఉన్నాయి. మిగిలిన 35 కళాశాలల్లో ఈసీఈ, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్లో 600 సీట్లు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 25 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంసెట్లో అర్హత సాధించిన వారు 18 వేల వరకు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది ఇప్పటికే తమిళనాడు, క ర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. దీని వల్ల ఈ యేడాది కూడా సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి ఎంసెట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంది. అలానే ఎంసెట్ హాల్టికెట్, ర్యాంక్ కార్డు, తప్పనిసరిగా కౌన్సెలింగ్కు తెచ్చుకోవాలి. ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఏర్పాట్లు పూర్తి ఎంసెట్ కౌన్సెలింగ్లో భాగంగా గురువారం నిర్వహించే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం 1 నుంచి 5 వేల ర్యాంకుల మధ్య ఉన్నవారి పత్రాలను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు జరుగుతుంది. విద్యార్థులు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కైనా హాజరు కావచ్చు. -ఎల్ఆర్.మోహన్కుమార్రెడ్డి, కో-ఆర్డినేటర్