extra marital affair
-
కానిస్టేబుల్తో ఎస్ఐ వివాహేతర సంబంధం.. భార్య ఫిర్యాదు
సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
గజపతినగరం : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పింది. ఇందులో ప్రియుడు ప్రాణం కొల్పోగా... ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శీర పైడిరాజు(31)కు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహిత సబుకు రామలక్ష్మితో పైడిరాజుకు ఎనిమిది నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పురిటిపెంట రైల్వే గేటు వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగాని ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పైడిరాజు శనివారం మృతి చెందినట్టు తెలిపారు. రామలక్ష్మి వైద్య సేవలు పొందుతున్నట్టు చెప్పారు. మృతుడి తండ్రి శీర అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
60 ఏళ్ల వృద్ధుడితో యువతి వివాహేతర సంబంధం..చివరికి..!
అన్నానగర్: వేలచ్చేరిలోని ఓ హాస్టల్లో వృద్ధుడితో కలిసి ఉన్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు.. చెన్నైలోని వేలాచ్చేరి తరమణి 100 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో 60 ఏళ్ల వృద్ధుడితో కలిసి ఉంటున్న 27 ఏళ్ల యువతి ఛాతీ నొప్పితో మృతి చెందినట్లు వేలచ్చేరి పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయ పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో వృద్ధుడు చిందాద్రిపేటకు చెందిన జ్యోతి (60) అని తేలింది. ఇతడికి విల్లివాకానికి చెందిన శశికళ(50)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోయింది. శశికళ రెండో కూతురు రమ్య(27). భర్త నుంచి విడిపోయి తల్లి ఇంట్లో ఉంటోంది. ఈమెకు జ్యోతితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఇద్దరూ హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నారు. రమ్యకు మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది. హోటల్ కు చేరుకోగానే 6 సీసాల బీరు కొన్నారు. రమ్య రాత్రి 4 బీర్లు తాగింది. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు.సోమవారం ఉదయం మళ్లీ రమ్య 2 సీసాల బీరు తాగిన తర్వాత ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రమ్య మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వేలాచ్చేరి పోలీసులు రమ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య చేశారా? లేక అధిక మోతాదులో మద్యం తాగడం వల్ల చనిపోయిందా? మరేదైనా కారణమా? అనేది తేలుతుందని పోలీసులు తెలిపారు. -
మేనకోడలితో సంబంధం.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమైందని
యూపీలో ఘోరం వెలుగుచూసింది. మేనకోడలుతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.ఈ ఘటన హర్దోయ్ జిల్లాలోచోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మాన్సీపాండే అనే 22 ఏళ్ల యువతి వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి మణికాంత్ ద్వివేదితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కానీ యువతికి మరో వ్యక్తితో కుటుంబ సభ్యులు నవంబర్ 27న పెళ్లి కుదిర్చారు. ఈ క్రమంలో సోమవారం రక్షాబంధర్ సందర్భంగా ఆమె మణికాంత్ ఇంటికి వెళ్లింది. తనకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరిందనే విషయాన్ని అతడికి. అయితే అందుకు అతడు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, చేసుకోవద్దని యువతిని బలవంతం చేశాడు.ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మణికాంత్ మాన్సీని గొంతు నులిమి చంపేసి నిర్మాణంలో ఉన్న భవనంలో పడేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె మొబైల్ను బస్సులో విసిరేశాడు. అయితే కూతురు ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి రాంసాగర్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణికాంతే తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి వద్ద మాన్సీని దింపినట్లు తెలిపారు. ‘మేము స్వగ్రామానికి వెళ్ళాము, తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం మణికాంత్ నాకు ఫోన్ చేసి, మాన్సీ కనిపించడంలేదని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు. కానీ నాకు అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు -
వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..
హోసూరు: మహిళ ఇంట్లో ప్రియుడు హత్యకు గురైన సంఘటన బేరికె పోలీస్స్టేన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. బేరికె సమీపంలోని కొళదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి (39), ఈమె భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చింది. బేరికె సమీపంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (40)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. వెంకటేష్ తరచూ జ్యోతి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇది తెలిసి జ్యోతి సోదరి కొడుకు హరీష్ (23) మీ వల్ల పరువు పోతోందని వారిద్దరినీ మందలించాడు. దీంతో ఆమె ప్రియున్ని ఇంటికి రావద్దని చెప్పింది. అయినప్పటికీ మంగళవారం వెంకటేష్ జ్యోతి ఇంటికి రాగా తలుపు వేసి జ్యోతి, హరీష్ కలిసి కట్టెలతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్ను అరెస్ట్ చేశారు. చదవండి: 15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు -
15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు
మండ్య(బెంగళూరు): అనుమానంతో భార్యను కడతేర్చిన ఉదంతం మండ్య జిల్లా నాగమంగల పట్టణంలో జరిగింది. ఇక్కడి టీబీ లేఔట్లోని ముళకట్టె రోడ్డులో నివాసం ఉంటున్న పుట్ట స్వామి, గిరిజ దంపతుల కుమార్తె మధుశ్రీ(25)కి నాగమంగళ తాలూకా కరడహళ్లికి చెందిన గంగాధర్ కుమారుడు మంజునాథ్తో వివాహమైంది. వీరికి నాలుగు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ బెంగళూరులో ఉంటూ 15 రోజులకు ఒక పర్యాయం వచ్చి వెళ్తుండేవాడు. అయితే మధుశ్రీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. మంగళవారం కూడా దంపతులు గొడవ పడ్డారు. ఓ దశలో భార్య కడుపులో కత్తితో దాడి చేసి కుమారుడితో కలిసి ఉడాయించాడు. బుధవారం ఉదయం ఎంతసేపైనా మధుశ్రీ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. నాగమంగల పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రాణం తీసిన రీల్స్ వ్యసనం.. చంపి నదిలో పడేశాడు
బెంగళూరు: నిత్యం మొబైల్లో మునిగిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వెరసి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి శవాన్ని నదిలో పడేసిన ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకా మండ్యకొప్పళు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ, శ్రీనాథ్ భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, పూజా గంటల తరబడి మొబైల్ వాడేది. టిక్టాక్ చేసే పూజా అది లేకపోవడంతో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆమె ఇతరులతో చాటింగ్ చేయడాన్ని భర్త గుర్తించాడు. సహించలేక మరో వ్యక్తితో కలిసి చంపేసి శవాన్ని నదిలో పడేశాడు. ఈ విషయం మూడు రోజుల తరువాత బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టాల్లో ఏముందంటే..? -
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్స్టేషన్లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): వన్టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడితో కలిసి భార్యే అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్ (35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ను పరిశీలించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య బుధవారం పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతని అన్నయ్య బర్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ దిశగా ప్రారంభమైన పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని.. భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న రామారావు అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రమేష్ను అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రమేష్ మద్యం తాగి పడుకున్న సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రియుడితో కలిసి తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. భర్త బెడ్పై గిలగిల కొట్టుకుంటుప్పుడు భార్య శివాని సెల్ఫోన్లో తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే ఆ వీడియో ఎందుకు తీసింది? హత్యకు దారి తీసిన పరిణామాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వద్ద లభించిన వీడియోలో దృశ్యాలు నేపథ్యంలో అతనిని తలగడతో నొక్కి చంపి ఉంటారా? లేదా విష ప్రయోగం చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఆమె ప్రియుడు రామారావును, గురువారం ఆమెను ఎంవీపీ పోలీసులు పూర్తిస్థాయిలో విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. దర్యాప్తు పట్ల పూర్తి గోప్యత పాటిస్తున్నారు. వీరు వెల్లడించిన వివరాలతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి.. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
వివాహితతో పరిచయం.. భర్త ఉండగానే ప్రియుడిని ఇంటికి పిలిచి
క్రిష్ణగిరి(బెంగళూరు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన కేసులో నిందితులను సింగారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... సింగారపేట సమీపంలోని కోనార్కొటాయ్ గ్రామానికి చెందిన కార్మికుడు ఇళంసూర్యన్ (47), ఇతడి భార్య పరిమళ (43). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ (42)తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకొన్న భర్త ఇళంసూర్యన్ భార్యను మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి గురైన పరిమళ ప్రియుడు లక్ష్మీకాంత్ను ఇంటికి రప్పించుకొని ఇళంసూర్యన్పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య పరిమళ, లక్ష్మీకాంతంలను అరెస్ట్ చేశారు. చదవండి ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
అప్పు చేసి నా భార్యను చదివించా.. జాబ్లో చేరగానే అసలు కథ మొదలు
లక్నో: ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కొందరు కలల కంటారు. ఈ జాబితాలో ఆడపిల్లలు ఉండగా.. వాళ్లకు పెళ్లి కాగానే వారి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. భర్తలు భార్యలను అర్థం చేసుకుంటూ వాళ్ల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తున్నారు. అయితే... కొందరు దీన్ని పూర్తిగా మిస్ యూస్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే.. తమ కలల కోసం కష్టపడిన భర్తలకు షాక్కిస్తూ ఇతరులతో వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీలోని ఉన్నావ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎస్డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా. సరిగ్గా అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో ఒకటి వెలుగు చూసింది. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్, బెల్సి గ్రామానికి చెందిన ఛాయా సింగ్ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే ఛాయా సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భర్త విజయపాల్ సింగ్ ముందుకు వచ్చాడు. తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను తన భార్య కలను తనదిగా భావించాడు. ఉన్నావ్ నగరంలో మంచి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి ఆమెను చదివించాడు. చివరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరుకగా.. ఆమె 2016లో మహిళా కానిస్టేబుల్గా నియమితులైంది. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భర్త రూ.50 వేలు అప్పు తీసుకుని భార్యకు ఇచ్చాడు. చివరికి బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్గా విధుల్లో కూడా చేరింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జాబ్లో చేరగానే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ప్రియుడితో పెళ్లి సిద్ధమైంది. ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16న ప్రియుడితో తన భార్య నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని..తన భార్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయ్పాల్ ఎస్పీ ఉన్నావ్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. చదవండి ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి
చెన్నై: వివాహేతర సంబంధం విషయంలో మహిళకు నిప్పు అంటించి హత్య చేయడానికి ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టులో సంచలనం కలిగింది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా పాలరు భగత్ సింగ్ నగర్కు చెందిన ప్రతాప్ అనే కుళ్లన్ (33) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. అయితే పిల్లలు లేరు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రకాష్ భార్య ప్రియ (27)తో పరిచయం ఏర్పడి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర వ్యవహారం ప్రతాప్ భార్యకు తెలిసింది. దీంతో ప్రతాప్ను వారించింది. కానీ ఈ మాటలు పట్టించు కోకుకుండా ప్రియురాలతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రతాప్ బావ అతని పై దాడి చేశాడు. దీంతో ప్రతాప్ ప్రియతో మాట్లాడడం ఆపేశాడు. అయితే తనతో సంబంధం కొనసాగించాలని ప్రియ ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో గురువారం పాలరు రోడ్డులో ప్రతాప్, ప్రియ గొడవ పడ్డారు. అనంతరం శనివారం ఉదయం ప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వెళ్లిన ప్రతాప్.. ఆమె పై కిరోసిన్, పెయింట్ కొట్టడానికి ఉపయోగించు టర్బెంట్ ఆయిల్ను రెండు కలిపి పోసి నిప్పంటించాడు. పాలరు సహాయ ఇన్స్పెక్టర్ కోదండన్ ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రియను చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చదవండి భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది! -
భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్!
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి తినిపించింది. వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు) రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్, మరో మహిళతో ఫోన్ చేయించి
సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది. ఈనెల 19న ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... -
ప్రియుడి సహకారంతో భర్త హత్య.. బైక్ రిపేరీ అని పిలిపించి..
సాక్షి, కృష్ణరాజపురం, కర్ణాటక: ప్రియుడి సహకారంతో భర్తను హత్య చేసిన ఘటన నగరంలోని మహాదేవపుర కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... ఉదయ్ కుమార్ (40), ప్రియా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే వీరు ఉంటున్న ఇంటి పక్కనే అన్వర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉదయ్ నిత్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు. తన బాధలు అన్ని ప్రియా అన్వర్కు చెప్పుకునేది. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అన్వర్ ఆమైపె ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె ససేమిరా అనేది. బైక్ రిపేరీ అని పిలిపించి హత్య బైక్ మెకానిక్ అయిన ఉదయ్ కుమార్ గురువారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య, పక్కింటి అన్వర్కు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని అడ్డు తొల గించుకోవడానికి అన్వర్ పథకం వేశాడు. బెక్ రిపేరీ ఉందని ఉదయ్కు అన్వర్ ఫోన్ చేశాడు. కాడుగోడి శివాలయం వద్ద ఉన్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో ఉదయ్ రాత్రి సమయమైన అక్కడికి చేరుకున్నాడు. ఉదయ్ అక్కడికి రాగానే అన్వర్.. భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీశాడు. సంబంధం లేని విషయంలో నీ జోక్యం ఎందుకు అంటూ ఉదయ్ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అన్వర్ తన వద్ద ఉన్న కత్తితో ఉదయ్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి అన్వర్ను అరెస్ట్ చేసి ఉదయ్కుమార్ భార్యను కూడా విచారణ చేస్తున్నారు. -
3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో..
అన్నానగర్ (తమిళనాడు): కళ్లకురిచ్చి సమీపంలోని మొవన్నంజూర్ గ్రామానికి చెందిన విజయా (20)కి పల్లక్కచేరి గ్రామానికి చెందిన మురుగన్ (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. తర్వాత కేవలం 3 నెలలు మాత్రమే వీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విజయా తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. అయితే మురుగన్ తన ఇంటికి రావాలంటూ విజయాను చాలాసార్లు పిలిచాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఇదే సమయంలో కడలూరు జిల్లా సిరుపాక్కం గ్రామానికి చెందిన మురుగన్ బంధువు మాయవన్తో విజయాకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నిత్యం కలుస్తుండడంతో కోపొద్రిక్తుడైన మురుగన్ బుధవారం సాయంత్రం విజయ కల్లకురిచ్చి బస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ మినీ బస్సులో ప్రయాణిస్తున్న భార్య విజయాను వెంబడించాడు. బస్సు దిగి విజయ వెళ్తుండగా జోరు వానలో ఒక్కసారిగా ఆమైపె కత్తితో దాడి చేశాడు. రక్తపుమడుగులో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు మురుగన్పై దాడి చేయడంతో కళ్లకురిచ్చి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
బీమా డబ్బులు కోసం ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్త ఇంట్లోకి రాగానే
రాంచీ: పెళ్లి మండపంలో వధూవరులు జీవితాంతం ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే కొంత కాలం ప్రయాణం తర్వాత కొన్ని జంటల మధ్య ఏం జరుగుతుందో ఏమో గానీ ఈ ప్రమాణాలను గాలికి వదిలేసి వారి దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు మందుకేసి తమ భాగస్వాములను హతమారుస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు. తండ్రి మరణం, తల్లికి జైలు శిక్ష.. ఇప్పుడికి ఆ పిల్లలు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మరియం సురిన్ అనే మహిళ ఇటీవల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన భర్త నుంచి విడిపోయి తన ప్రియడితో కలిసి జీవించాలని అనుకుంది. అయితే వారిద్దరికీ బతకడానికి డబ్బుకు లోటు ఉండకూడదని భావించింది. ఈ క్రమంలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి దారుణమైన కుట్ర పన్నింది. భర్త వాసిల్ సూరిన్ మరణిస్తే అతని పేరు మీద బీమా సొమ్ము రూ.20 లక్షలు తనకే దక్కుతుందని భావించింది. ప్లాన్ ప్రకారం తన భార్త ఇంట్లోకి రాగానే తలుపులు అన్నీ మూసేసింది. తనకీ ఏమాత్రం అనుమానం రాకుండా వినయం నటిస్తూ అతన్ని మాటల్లోకి దింపింది. ఈ క్రమంలో రాడ్తో భర్తని కొట్టి చంపింది. ఈ హత్యను ప్రమాదవశాత్తు జరిగిందని ఆ మహిళ నమ్మించాలని ప్రయత్నించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు నుంచి మరియం సురిన్ చెప్పే మాటలపై అనుమానం వచ్చింది. చివరికి ఈ ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’
ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్ఘర్ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్ (4)ను కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్ వ్యాపారి ఫోన్ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్ పోలీసులకు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. -
3 రోజులు అక్కడ.. 3 రోజులు ఇక్కడ.. ఒక భర్త, ఇద్దరు భార్యల మధ్య ఒప్పందం!
ఒక్కోసారి కోర్టులో తీరని సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే తీరుతాయంటారు. అదే చేశారు ఓ భర్త ఇద్దరు భార్యలు. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి తన ఇద్దరి భార్యలతో సమస్య రాగా కోర్టుకు వెళ్లారు. చివరికి కూర్చుని మాట్లాడుకుని ఓ ఒప్పందం చేసుకుని సమస్యను పరిష్కరించుకున్నారు. భర్తకు దూరంగా.. అసలు విషయం తెలిసి షాక్ హర్యానాలోని గురుగ్రామ్లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ 2018లో 28 ఏళ్ల సీమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి సంసారం కరోనా రాకతో చెక్ పడింది. లాక్డౌన్ కారణంగా సీమ భర్త కుటుంబానికి దూరంగా తాను పని చేస్తున్న చోటు ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన సహోద్యోగులలో ఒకరితో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇదిలా ఉండగా తన భర్తలో మార్పు రావడం, తనకి దూరంగా ఉండడాన్ని గమనించిన సీమకు భర్తపై అనుమానం వచ్చింది. అసలువిషయం తెలుసుకునేందకు సీమ గురుగ్రామ్కు పయనం కాగా అక్కడ తన భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసి ఆగ్రహానికి గురైంది. వారాన్ని ఇలా పంచుకున్నారు సీమ తన భర్త పెళ్లి చేసుకున్న యువతితో గొడవపడింది. ఫలితం లేకపోయే సరికి తన కుమారుడి పోషణకు తగిన భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. అనంతరం కోర్టు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించింది. చివరికి వారి ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరి ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం.. ఆ వ్యక్తి ఒక వారాన్ని ఇద్దరు భార్యలతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారంలో ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మరో మూడు రోజలు గడపాల్సి ఉంటుంది. మిగిలిన ఒక్క రోజు తనకు నచ్చిన చోటు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్లో ఆ ఇద్దరి మహిళలకు రెండు వేర్వేరు అపార్ట్మెంట్లు ఉంచి సంసారం సాగిస్తున్నాడు. చదవండి: లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎక్కిన విద్యార్థి.. ట్విస్ట్ ఏంటంటే! -
వివాహేతర సంబంధం : ప్రియుడిని దారుణంగా హత్య చేసి..
హాలియా : త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే నగేష్ దారుణ హత్యకు గురయ్యాడని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన దంపతులను అరెస్టు చేశారు. హాలియా పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి మిర్యాలగూడ డీఎస్పీ పనకంటి వెంకటగిరి కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామానికి చెందిన నగేష్(27) గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాత్రి సతీష్ అతని తమ్ముడు ఎర్రగొర్ల నగేష్ ఇద్దరూ భోజనం చేసిన తరువాత ఒకే చోట పడుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 11 సమయంలో ఎర్రగొర్ల నగేష్ సెల్ఫోన్కి కాల్ వచ్చింది. ఆ తరువాత ఉదయం ఎర్రగొర్ల సతీష్ చూడగా నగేష్ కనిపించలేదు. ఈనెల 6వ తేదీ నుంచి నగేష్ కనబడలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నగేష్ సోదరుడు ఎర్రగొర్ల సతీష్ త్రిపురారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. నగేష్, కంచుగంట్ల శ్రీనివాస్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చిపోతుండేవారు. శ్రీనివాస్ లేని సమయంలో కూడా నగేష్ ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నగేష్ తన భార్యతో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు నగేష్ని హెచ్చరించినా తీరు మార్చు కోలేదు. నగేష్తో స్నేహంగా ఉంటూనే అతనిపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో ఫోన్ చేయించి.. పథకం ప్రకారం ఈనెల 5వ తేదీ రాత్రి శ్రీనివాస్ తన భార్య మీనాక్షితో నగేష్కి ఫోన్ చేయించి తన ఇంటికి వచ్చేవిధంగా పథకం పన్నాడు. అదే రోజు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన నగేష్ను శ్రీనివాస్ కత్తితో మెడపై నరికాడు. నగేష్కి బలమైన గాయాలు అయి మంచంపై పడిపోగా శ్రీనివాస్ భార్య మీనాక్షి ఇంట్లో ఉన్న కర్రతో నగేష్ తనపై బలంగా మోదింది. దీంతో మరో మారు కత్తితో శ్రీనివాస్ నగేష్ని పొడిచాడు. అతని ప్రాణం ఇంకా పోలేదని భావించిన శ్రీనివాస్, అతని భార్య మీనాక్షి ఇద్దరూ కలిసి నైలానుతాడుతో నరేష్ మెడకు రెండు సార్లు చుట్టి హత్య చేశారు. అనంతరం పశువుల కొట్టం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ మూత పగలగొట్టి నగేష్ మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడవేశారు. దీంతో పాటు నగేష్ చెప్పులు, సెల్ఫోన్తో పాటు రక్త మరకలు అంటిన తమ దుస్తులను సెఫ్టిక్ ట్యాంకులో వేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని తన ఇంట్లోని వడ్ల బస్తాల వెనుక దాచిపెట్టినట్లు పోలీసులు సమక్షంలో కంచుగంట్ల శ్రీనివాస్, భార్య మీనాక్షి ఒప్పుకున్నారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని.. ఇటీవల నగేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు త్రిపురారం పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా కంచిగట్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో కలిసి నగేష్ను హత్య చేసి తన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని పడవేసినట్లు నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని కేసులో నిందితులైన శ్రీనివాస్తో పాటు అతని భార్య కంచిగట్ల మీనాక్షిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి వివరించారు. కేసును ఛేదించిన హాలియా సీఐ గాంధీనాయక్, త్రిపురారం ఎస్ఐ శోభన్బాబు, సిబ్బంది రవి, శ్రావన్కుమార్, శ్రీని వాస్, రాము, శ్రీనును అభినందించినట్లు డీఎప్పీ తెలిపారు. కార్యక్రమంలో హాలియా ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది
సాక్షి, చెన్నై: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ అల్లినా మామ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా ఆర్కే పేట మండలం చంద్రవిలాసపురం సమీపంలోని సుందర్రాజుపురానికి చెందిన ఆరుముగం కుమారుడు యువరాజ్ (29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గాయత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే మృతిపై అనుమానంతో యువరా జ్ తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. సీఐ అన్నాదురై విచారణ చేపట్టారు. గాయత్రి పొంతనలేని సమాధానం చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. అడ్డు తొలగించుకునేందుకే.. గాయత్రి చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో డిప్లమా నర్సింగ్ చదువుతుండగా అదే కళాశాలలో పనిచేస్తున్న తిరుత్తణి ఆగూరుకు చెందిన శ్రీనివాసన్ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కళాశాల చదువు పూర్తికావడంతో గాయత్రికి యువరాజ్తో వివాహం చేశారు. అయితే ఏడాది కిందట తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరిన గాయత్రికి అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఉద్యోగానికి సైతం నిలిపివేశారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువరాజ్ను గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాసన్, అతని స్నేహితులు మణిగండన్(26), హేమంత్ అలియాస్ జిల్లు(23) గొంతు నులుమి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను డీఎస్పీ విఘ్నేష్ ఆధ్వర్యంలో బృందం అదుపులోకి తీసుకుంది. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా
తిరుత్తణి(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆర్కేపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చంద్రవిలాసపురం పంచాయతీలోని సుందర్రాజుపురానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతనికి అదే గ్రామానికి చెందిన మేనమామ కుతూరు గాయత్రి (22)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో గాయతి తిరుత్తణిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో తిరుత్తణికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. భర్త అనుమానంతో పనులకు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో రెండు గదుల్లో వేర్వేరుగా భార్యభర్త నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి గదిలో మరో యువకుడి ఉండడాన్ని గుర్తించిన యువరాజ్ వారిని నిలదీశాడు. ఈ క్రమంలో గాయత్రి ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసి అక్కడు నుంచి పరారైనట్లు తెలుస్తోంది. యువరాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆర్కేపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పరారైన ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. -
పిన్ని కుమారుడితో సంబంధం.. భర్త హత్యకు రూ. 5 లక్షల సుపారీ!
బెంగళూరు: జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య దారి తప్పి కట్టుకున్నోడిని కడతేర్చింది. పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయడానికి రౌడషీటర్లకు భార్య రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి పరలోకానికి పంపించిన వైనమిది. కర్ణాటక రాష్ట్రం తుమకురు జిల్లాలోణి కుణిగల్ తాలూకాలోని సీనప్పనహళ్ళి గ్రామానికి చెందిన మంజునాథ్ హత్యకు అతని భార్య హర్షిత (20) కిరాయి ఇచ్చింది. ఈ కేసులో ఆమెను, ఆమె పిన్ని కుమారుడు రఘు, ఇతని మిత్రుడు రవికిరణ్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం మంజునాథ్ ఫిబ్రవరి 3వ తేదీన కుణిగల్ పట్టణంలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మళ్లీ సీనప్పనహళ్ళి గ్రామంలోని సొంత ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి బయటకు పిలిచి హత్య.. అతనికి అర్ధరాత్రి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లిపోయాడు. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్న మంగళ చెరువులో మంజునాథ్ శవమై తేలాడు. దీంతో మంజునాథ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి భార్య హర్షితను అరెస్టు చేశారు. ఆమె చెప్పిన వివరాలతో మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. భార్యే ఈ హత్య చేయించిందని గ్రామస్తులు కూడా ఆరోపించారు. రఘు, రవికిరణ్లు మంజునాథ్కు ఫోన్ చేయించి చెరువు వద్దకు పిలిపించారు. అక్కడ అతన్ని హత్య చేసి చెరువులో పడేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. కేసు విచారణలో ఉంది. -
కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన వివాహితకు, కోల వెంకటరమణమూర్తి (47) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ కుటుంబ సభ్యులను వదిలి నగరాని వచ్చింది. పీర్జాదిగూడ బీబీసాహెబ్ మక్తా అమృత కాలనీలోని వృద్ధాశ్రమంలో వెంకటరమణమూర్తి కేర్ టేకర్గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా తన తల్లి చిరునామా తెలుసుకున్న ఆమె కుమారుడు నగరానికి వచ్చాడు. వెంకటరమణమూర్తికి నచ్చజెప్పి ఆమెను ఊరికి తీసుకువెళ్లాడు. వెంకటరమణమూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ నగరానికి రావాలంటూ పట్టుబడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ దూరమవుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది. దీంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంకటరమణమూర్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణమూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్ సిలిండర్తో వెంకటరమణమూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అదే సమయంలో సిలిండర్ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యను టార్గెట్ చేసి..
కాజులూరు, తూర్పు గోదావరి: తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్షి్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియోపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
వివాహేతర సంబంధం.. మా ఇంటికి ఎందుకొచ్చావ్.. ఇంతలోనే షాకింగ్ ఘటన..
తొండూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని ఊడవగండ్ల గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డి(66)ని మచ్చుకొడవలితో అతి కిరాతకంగా నరికారు. రూరల్ సీఐ బాలమద్దిలేటి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డికి అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గంగిరెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం కలగడంతో.. మా ఇంటి వద్దకు ఎందుకు వచ్చావని గంగిరెడ్డి మందలించారు. దీంతో సహదేవరెడ్డికి, గంగిరెడ్డికి మాటకుమాట పెరిగి వాగ్వాదం జరుగుతుండగా.. గంగిరెడ్డి అన్న కుమారుడు ప్రహ్లాదారెడ్డి మచ్చుకొడవలితో సహదేవరెడ్డిపై దాడి చేశారు. గతంలో సహదేవరెడ్డి, గంగిరెడ్డి మధ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సహదేవరెడ్డి తీరు మారకపోవడంతో గంగిరెడ్డి ఇంటి సమీపంలో అరుగు మీద కూర్చొన్న సహదేవరెడ్డిని చూసి కోపోద్రిక్తులై సంఘటన జరిగినట్లు తెలిపారు. సహదేవరెడ్డి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ హనుమంతు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం? -
భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..
అన్నానగర్(తమిళనాడు): ఊటీ బొటానికల్ గార్డెన్లో ఆత్మహత్యకు యత్నించిన వివాహేతర జంట చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. నీలగిరి జిల్లా ఓల్డ్ ఊటీకి చెందిన జైశంకర్ (36) పెయింటర్. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా తరచూ బయటి ఊరుకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారు. పెయింటర్ పనులకు వెళ్లే క్రమంలో జైశంకర్కు మేట్టుపాళయానికి చెందిన వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాధను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మేట్టుపాళయం నుంచి రాధను ఊటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో జైశంకర్ కుమారులు తండ్రితో మాట్లాడలేదు. దీంతో జైశంకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత వారం రాధతో కలిసి ఊటీ బొటానికల్ గార్డెన్ను చూడటానికి వెళ్లాడు. జైశంకర్, రాధ అక్కడే విషం తాగి స్ఫృహ తప్పి పడిపోయారు. దీంతో పర్యాటకులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఇద్దరూ మృతి చెందారు. ఊటీ సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని.. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి
గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఇద్దరిని బలిగొన్న.. వివాహేతర సంబంధం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): వివాహేతర సంబంధాన్ని వదులుకోలేక ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో చోటుచేసుకుంది. తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు పదేళ్ల క్రితం మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన లావణ్య(28)తో పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, లావణ్యకు అదే గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్తో మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి.. వారు మందలించడంతో మహేశ్, లావణ్య ఆదివారం తమ ఇళ్లను విడిచి వెళ్లపోయారు. లావణ్య భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ లోకేషన్ ద్వారా గ్రామంలో కౌలు రైతు సోమిరెడ్డి మాధవరెడ్డి వ్యవ సాయ భూమి వద్ద మహేశ్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకోగా అప్పటికే ఇరువురూ మృతిచెంది ఉన్నారు. పక్కన పురుగుల మందు డబ్బాలు ఉండటంతో ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!
సాక్షి, మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రాంలాల్ వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు(39) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్, భార్య సుజాత వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్రెడ్డితో నాలుగేళ్ల క్రితం సుజాతతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు భార్యను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. అయినా గుట్టు చప్పుడుగా వీరు తమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో, పద్ధతి మార్చుకోవాలని భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త గొడవ పడుతున్న విషయాన్ని సుజాత ప్రియుడికి తెలిపింది. ఇరువురు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం వేశారు. ఈ నెల 6న గ్రామంలో జాతర ఉందని ఇంటిని శుద్ధి చేసి భర్తను నమ్మించి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మద్యం సేవించారు. శ్రీనివాసులు మద్యం మత్తులోకి జారుకోగా, రాత్రి 12 గంటల సమయంలో భార్య తన భర్త ముఖంపై ఊపిరి ఆడకుండా గట్టిగా దిండు పెట్టగా, ప్రియుడు కరుణాకర్రెడ్డి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. భార్యపై అనుమానంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిజాలు తేలాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరిని గ్రామంలోనే అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. చదవండి: ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి.. మియాపూర్లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఓ మహిళకు ఒకతనితో వివాహేతర సంబంధం ఉంది. అతను ఆమె కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయంపై మహిళ అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో భరించలేకపోయిన తల్లి కర్ర, రాళ్లతో అతడిపై దాడి చేయగా తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు ఈ ఏడాది జూన్ 8వ తేదీన హత్య కేసును నమోదు చేశారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. వెంకటాచలం పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కసుమూరు కొండపై నివాసం ఉంటున్న కూరపాటి వెంకయ్య (74)కు, అక్కడే నివాసముంటున్న మోతే నారాయణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే నారాయణమ్మ కుమార్తెను కూడా వెంకయ్య లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ పలు సందర్భాల్లో వెంకయ్యను మందలించింది. జూన్ 8న తెల్లవారుజామున నారాయణమ్మ కుమార్తె బహిర్భూమికి వెళ్లగా, వెంకయ్య వెంబడించి పట్టుకోవడంతో పెద్దగా కేకలు వేసింది. నారాయణమ్మ అక్కడికి చేరుకుని కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని వెళ్లిపోతుండగా, వెంకయ్య మళ్లీ వెంబడించడంతో అక్కడే ఉన్న రాళ్లతో కొట్టి వెళ్లిపోయింది. అయితే వెంకయ్య మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. నారాయణమ్మను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ గంగాధర్రావు, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
పనిమనిషితో వివాహేతర సంబంధం.. బెడ్పై గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో కొద్ది రోజుల క్రితం ప్లాస్టిక్ బ్యాగ్లో ఓ శవం లభించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. నవంబర్ 16న ఆమె ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. తన యజమానితో వివాహేతర సంబంధం ఉందని అందరికీ తెలిస్తే పరువు పోతుందని మహిళ భావించింది. దీంతో అతడు చనిపోయిన విషయాన్ని భర్తతో పాటు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత వాళ్లు వచ్చాక ముగ్గురు కలిసి శవాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. అని పోలీసులు వివరించారు. చనిపోయిన వ్యక్తి పేరు బాల సుబ్రహ్మణ్యం. జేపీ నగర్లో నివసించేవాడు. నవంబర్ 16 సాయంత్ర 4:55 గంటలకు తన మనవడ్ని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత పని ఉందని, ఆలస్యంగా వస్తానని కోడలుకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజే పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ మరునాడే పోలీసులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో బెడ్ షీట్లు చుట్టి ఉన్న ఓ శవం కన్పించింది. అతడ్ని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పనిమనిషి అసలు విషయం చెప్పింది. ఆయనతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అతను శృంగారం చేస్తూ బెడ్పైనే చనిపోయాడని చెప్పింది. తామే శవాన్ని బ్యాగులో చుట్టి రోడ్డు పక్కన పడేశామని అంగీకరించింది. చదవండి: యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో.. -
పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్ ఎఫైర్.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..
ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు. నవంబర్ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్ లేఖ కూడా రాశాడు. అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ వెల్లడించారు. చదవండి: కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు -
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత
లక్నో: నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు తాజాగా చేధించారు. ఈ కేసులో మృతుడి భార్య, పొరుగింటిలో నివాసముండే అరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తన ప్రియుడు అరుణ్తో కలిసి భర్తను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం ప్రియుడు ఇంట్లోనే ఆరు అడుగుల గోతి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు తేలింది. గొయ్యిపై నుంచి సిమెంట్ ఫ్లోరింగ్ చేసిన తరువాత అరుణ్ అదే ఇంట్లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడి ఇంట్లో నుంచి కుళ్లిపోయిన మృతదేహాన్ని, అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య చేసేందుకు ఉపయోగించిన పిస్టల్, గొడ్డలిని కనుగొన్నారు. భర్తను చంపకముందే గొయ్యి తీసి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా లోతుగా తవ్వినట్లు తెలిపారు. చదవండి: Girlfriend Murder In Delhi: యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. అసలేం జరిగిందంటే తన భర్త చంద్రవీర్ సింగ్ కనిపించకుండాపోయాడని సవిత అనే మహిళ 2018లో ఘజియాబాద్లోని సిహానీ గేట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. భర్త అదృశ్యం వెనక అతని తమ్ముడి హస్తం ఉన్నట్లు భార్య తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో సరైన సాక్క్క్ష్యాధారాలు లేకపోవడంతో మూసివేశారు. నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ఈ కేసులోఘజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ దిక్ష శర్మ తెలిపారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య సవిత, ప్రియుడు అరుణ్ అలియాస్ అనిల్ కుమార్ కలిసి చంద్రవీర్ను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. 2017 నుంచి తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ గొడవలు జరిగేవని భార్య సవిత తెలిపింది. మరోసారి ఇలా జరగవద్దని పలుమార్లు హెచ్చరించాడని పేర్కొంది. #SSP_GZB @IPSMUNIRAJ के निर्देशन में क्राइम ब्रांच व थाना नन्दग्राम द्वारा 04 वर्षाें से लापता चल रहे चंद्रवीर उर्फ पप्पू नामक व्यक्ति की हत्या का खुलासा, पत्नी सहित प्रेमी गिरफ्तार, अभियुक्तगण ने हत्या कर शव को घर में दफना दिया था। मृतक का शव व घटना में प्रयुक्त आलाकत्ल बरामद। pic.twitter.com/NrGvHBEs1Y — GHAZIABAD POLICE (@ghaziabadpolice) November 14, 2022 దీంతో చంద్రవీర్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేసేందుకు సవిత, అరుణ్ పథకం వేశారు. సెప్టెంబర్ 28, 2018న చంద్రవీర్ అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. వెంటనే సవిత అరుణ్ను ఇంట్లోకి పిలిపించడంతో.. చంద్రవీర్ గదిలోకి వెళ్లి అతని తలపై కాల్చి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఎత్తుకుని అతని ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ్ ఇంటి వద్ద సవిత సాయంతో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులో చంద్రవీర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్ను కోర్టులో హజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్ను పెళ్లాడటంతో ఈ జంట హాట్టాపిక్గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేసిన తల్లి
సాక్షి, మహబూబ్నగర్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఓ తల్లి కన్న కొడుకును హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో జరిగింది. హన్వాడ ఎస్ఐ రవి కథనం ప్రకారం.. టంకర గ్రామానికి చెందిన వెంకటే‹Ù(26) బుడగ జంగం వృత్తి చేస్తూ ఉండేవాడు. అతని తండ్రి పాపయ్య ఆరేళ్ల కిందట మృతి చెందాడు. వెంకటేష్ తల్లి దాయమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో శ్రీను పలుమార్లు ఇంటికి వచ్చేవాడు. ‘మా ఇంటికి ఎందుకు వస్తున్నావ’ని శ్రీనుతో వెంకటేష్ గొడవపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున శ్రీను, అతని అన్న అల్లుడు నర్సింహతో కలిసి దాయమ్మ కోసం వాళ్ల ఇంటికి వచ్చారు. మరోసారి వెంకటేష్ వారితో గొడవపడ్డాడు. దీంతో శ్రీను, నర్సింహ, దాయమ్మలు కలిసి వెంకటేష్ను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పడేశారు. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ -
నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడంతో..
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై కేసు నమోదైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న తన భార్యను కారుతో తొక్కించాడనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగావెలుగులోకి వచ్చింది. భర్త తనని చంపాలని చూశాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: Samantha Shocking Look: సామ్ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి! వివరాలు.. బాలీవుడ్ నిర్మాత అయిన కిశోర్ మిశ్రా మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అంధేరిలోని ఓ ఇంటి పార్కింగ్ స్థలంలో సదరు మహిళతో సన్నిహితంగా ఉండటం ఆయన భార్య కంటపడింది. ఇక ఈ విషయమై ఆయనను నిలదీసేందుకు ఆమె కారు దగ్గరికి వెళ్లింది. కారు దిగమని చెబుతున్న ఆయన డోరు తీయకపోవడంతో ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో కంగారు పడ్డ కిశోర్ మిశ్రా వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో కారు ఆమెను ఢీకోట్టడంతో ఆమె కిందపడిపోయింది. చదవండి: పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చిన బంగారం ఎంతో తెలుసా? అయినా కిశోర్ మిశ్రా కారు ఆపకుండ భార్య కాళ్లపై నుంచి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆమె అరవడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి ఆమె కాపాడాడు. అయితే ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భర్త తనను చంపాలని ప్రయత్నించాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కిశోర్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. Mumbai: FIR registered against filmmaker Kamal Kishor Mishra for allegedly ramming his car into his wife after she spotted him with another woman in the vehicle, say police pic.twitter.com/DeUa1YP1Xu — AH Siddiqui (@anwar0262) October 26, 2022 -
భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో
సాక్షి, బెంగళూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ యువతి తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన బెంగళూరు యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి యలహంకలోని కొండప్ప లేఔట్లో ఓ మేడపై చంద్రశేఖర్ (35) అనే నేత కార్మికుడు తల, మర్మావయవాలపై తీవ్ర గాయాలతో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్య ప్రమేయముందని వెల్లడైంది. దీంతో భార్య శ్వేత (19), ఆమె ప్రియుడు సురేశ్ (22)ని బుధవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల కిందట అక్క కూతురితో పెళ్లి వివరాలు.. శ్వేత, చంద్రశేఖర్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరిది పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్వస్థలం కాగా, అక్కడే నేత పని చేసేవారు. చంద్రశేఖర్ కంటే శ్వేత 16 ఏళ్ల చిన్నది. కానీ అక్క కుమార్తె అనే కారణంతో కుటుంబసభ్యులు ఇద్దరికీ బలవంతంగా వివాహం చేశారు. పెళ్లయిన తరువాత శ్వేత చదువుకోవడానికి హిందూపురంలో కాలేజీకి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని భర్త తరచూ గొడవపడేవాడు. హిందూపురం నుంచి యలహంకకు దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యలహంక కొండప్పలేఔట్ లో ఉండాలని ఇక్కడకు పంపించారు. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం సాగుతోంది. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు. హత్యకు కుట్ర శ్వేత, సురేశ్ కలిసి తమకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్ను తొలగించుకోవాలనుకున్నారు. సురేశ్ 22వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్ చేసింది. సురేశ్ వచ్చి చంద్రశేఖర్ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. సురేశ్ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్ తలపై దాడిచేశాడు. చంద్రశేఖర్ రక్తస్రావంతో కిందపడిపోయాడు. ఇదే సమయంలో మర్మావయవాలపై పొడిచి చంపి అక్కడి నుంచి ఉడాయించాడు. విచారణలో అసలు నిజం సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా చెప్పింది. ఆమెపై అనుమానంతో పోలీస్స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్తో కలిసి హత్య చేసినట్లు నోరువిప్పింది. పోలీసులు ముమ్మర గాలింపు జరిపి పరారీలో ఉన్న సురేశ్ను కూడా అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు. -
అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండుసార్లు పారిపోయి..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధంలో ప్రియుడు తన తండ్రితో కలసి ప్రియురాలిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడితోతోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. అరియలూరు జిల్లా తాపలూ ర్కు చెందిన శక్తివేల్ కూలి పనిచేసి, జీవిస్తున్నా డు. ఇతనికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మేల్కుడికాడు గ్రామానికి చెందిన అమృతరాజ్ (24)తో సత్య కు వివాహేత సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి వెల్లకోయిల్కు వెళ్లింది. అయితే శక్తివేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సత్యను గుర్తించి, ఆమెను మందలించి భర్తతో కలిసి జీవించమని పంపించారు. అయితే ఆ తర్వాత సత్యకు అమృతరాజ్ తమ్ముడు దేవాతో వివాహేతర సంబంధం ఏర్పడి, అతనితో సత్య పారిపోయింది. దీంతో విసిగిపోయిన శక్తివేల్ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదలిపెట్టి పని కోసం మలేషియా వెళ్లాడు. ఈ క్రమంలో మామ ఇంట్లో ఉన్న సత్యకు అమృతరాజ్కు మధ్య డబ్బు వ్యవహారంలో గొడవ ఏర్పడింది. దీంతో అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ కలసి సత్యపై కత్తితో దాడి చేసి, హతమార్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ (57)ను అరెస్టు చేసి, విచారణ జరపుతున్నారు. చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..! -
నిత్యం తాగొచ్చి వేధింపులు.. అత్తకు వివాహేతర సంబంధంపై రచ్చ.. పక్కా ప్లాన్తో!
ఖమ్మంఅర్బన్: మద్యం సేవించి నిత్యం వేధిస్తున్నాడని భావించి.. తన భర్త కాళ్లు, చేతులను కట్టి సాగర్ కాల్వలో పడేసిన భార్య ఉదంతమిది. శనివారం భార్య ఖమ్మంఅర్బన్ పోలీసుల వద్ద లొంగిపోగా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం నగరం యూపీహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ (33) కొంతకాలంగా కనిపించడం లేదని అతడి తల్లి ఎస్కే రహమత్ ఈ ఏడాది జూలైలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో అన్వర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీపై నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నారు. భార్య సల్మా సొంతగ్రామమైన మహబూబాబాద్లో ఉంటోందని తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లభించలేదు. తర్వాత ఐడీ పార్టీ పోలీసుల ద్వారా నిఘా పెంచారు. ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడి, తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్ స్టేషన్కు వచ్చిన నిందితులు అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్, బాలాజీ, వెంకన్న లొంగిపోయారు. వారిని విచారించగా అన్వర్ను తామే హత్య చేశామని అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. ఇదీ హత్యోదంతం.. అన్వర్ వివాహం అయిన నాటి నుంచి చికెన్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో పాటు గంజాయికి అలవాటు పడి భార్యను అనుమానిస్తున్నాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లి రెండు, మూడు నెలల తర్వాత తనంతట తానుగా ఇంటికి వచ్చేవాడు. భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడు. ఇదిలా ఉండగా అన్వర్ అత్త సాదుఖాన్ కూడా వీరి వద్దనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఆమెకు కొంతకాలంగా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది నచ్చని అన్వర్ గతేడాది యూపీహెచ్కాలనీలో బాలాజీ బైక్ను తగలబెట్టడంతోపాటు బాలాజీని కత్తితో బెదిరించాడు. దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో అన్వర్ను చంపాలని భార్య సల్మా, అత్త కలిసి నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి అన్వర్ చేతులు, కాళ్లు కట్టి అన్వర్ బావమరిది యాకూబ్ ఆటోలో బాలాజీ, చిర్రా వెంకన్న కలిసి తీసుకెళ్లి గోపాలపురం సమీపంలోని సాగర్ కాల్వలో పడేశారు. అప్పటి నుంచి వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారంతా భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నను రిమాండ్కు తరలించామని ఏసీపీ వివరించారు. అన్వర్ మృతదేహం ఆచూకీ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్లీజ్.. ఆలోచించండి ఓ అమ్మానాన్న!
కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. జిల్లాలోనూ ఈ పెడధోరణి పెచ్చుమీరుతోంది. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట ఈ విషపు గుళికలా ఇలాంటి అక్రమ సంబంధాలూ తారస పడుతున్నాయి. ఒక్కసారి కట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. టెక్కలి: హిరమండలానికి చెందిన ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీస్తే గానీ వివాహిత మోసం బయటపడలేదు. రణస్థలం మండలం దన్నానపేట గ్రామంలో వివాహేతర సంబంధంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా మరో వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. మహిళ భర్త గతంలో చనిపోగా కూరగాయలు అమ్ముకుంటూ ఒకే ఒక్క కుమారుడిని పోషిస్తోంది. మృతి చెందిన మరో వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధంతో ఒకే సారి ఇరువురూ మృతి చెందడంతో, మహిళకు చెందిన కుమారుడు అనాథగా మారగా, మరో వ్యక్తి కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు గ్రామీణ నేపథ్యం గల మన జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యకరమే. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండి సాఫీగా సాగాల్సిన సంసారాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని అభం శుభం తెలియని పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాలతో పాటు ప్రేమ వివాహాల్లో కూడా వివాహేతర సంబంధాలు కనిపిస్తున్నాయి. పాపం పసివారు.. అక్రమ సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడడం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలు పాలవడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కొన్ని కారణాలు.. ►సంపాదనే ధ్యేయంగా సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం. ►దంపతుల మధ్య చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం. ►భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం. ►మితిమీరిన ఆన్లైన్ స్నేహాలు. ►చెడు వ్యసనాలకు బానిస కావడం. ►బలహీన మనస్తత్వాలు ఇవి తప్పనిసరిగా పాటించాలి ►దాంపత్యంలోని మాధుర్యాన్ని గ్రహించాలి. ►ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి ►అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ► ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని తెలుసుకోవాలి. ►నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి. ►దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. నేరాలకు పాల్పడకూడదు దంపతుల మధ్య సమస్య ఉంటే చట్టాన్ని ఆశ్రయించి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలా జంటలు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉన్నాయి. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – బెండి గౌరీపతి, సీనియర్ న్యాయవాది, టెక్కలి. పిల్లలపై తీవ్ర ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల పిల్లలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్లో ఎన్నో ఇబ్బందులు పడతారు. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆసుపత్రి, టెక్కలి. జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఈ వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. వ్యామోహం, సరదాతో ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతాయి. మా దగ్గరకు వచ్చే భార్య భర్తల తగాదాల్లో అత్యధిక శాతం ఇలాంటి కేసులే వస్తుంటాయి. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసి వారి జీవితాలను నిలబెట్టాం. – ఎస్.వాసుదేవ్, డీఎస్పీ, దిశ పోలీస్స్టేషన్ -
డీజే ప్రవీణ్తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య
నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్పూర్ గ్రామానికి చెందిన లకావత్ కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి జీహెచ్ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలో పరిచయమై.. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్ ప్రవీణ్తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి చేరుకుని దారుణం చూసి.. అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్పై వేసుకుని వరంగల్ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్గౌడ్లు పాల్గొన్నారు. -
మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది
సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే -
బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని..
సాక్షి, సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు. వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14 ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. చదవండి: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి ఇంట్లో..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకుడిని హత్య చేసిన వివాహిత, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం శారదాంబాల్ వీధికి చెందిన సౌందర్య కోడంబాక్కం మండలం 132 వార్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులతో నివాసముంటోంది. వీరితో ఆమె అక్క కుమారుడు కూడా ఉంటున్నాడు. ఇటీవల సౌందర్యకు ఆమె మాజీ భర్త స్నేహితుడు విజయ్ (27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సౌందర్య ఇంట్లో విజయ్ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అందులో.. సౌందర్యకు అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌందర్య తన ప్రియుడు ప్రభుతో కలిసి ఇంట్లో ఉన్న విజయ్ అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
తప్పటడుగు వేస్తున్న బంధం.. ప్రాణం తీసేందుకు వెనుకాడని వ్యామోహం
సాక్షి, ఖమ్మం: కష్టసుఖాల్లో కడదాకా కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం బీటలు వారుతోంది. జీవితకాలం ఒకరికి ఒకరు తోడు ఉంటామని మొదలుపెట్టే ప్రయాణం మధ్యలో నే ఆగిపోతోంది. వేదమంత్రాలు, బంధుమిత్రుల నడుమ ఒక్కటవుతున్న కొందరు తప్పటడుగులు వేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఎంతో పవిత్రమైనదిగా భావించే వివాహబంధం.. తాత్కాలిక సుఖాల కోసం పక్కదారి పడుతోంది. అక్రమ సంబంధాల పేరిట అప్పటివరకు కష్ట్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్న కొందరు మహిళలే హత్యకు వెనుకాడకపోవడం గమనార్హం. అయితే, ఇటీవల కాలంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉసురు తీస్తున్న వివాహేతర సంబంధాలు కలిసిమెలిసి పిల్లాపాపలతో సంతోషంగా జీవించే భార్యాభర్తల నడుమ అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పచ్చగా సాగుతున్న కాపురాల్లోకి ప్రవేశిస్తున్న కొందరు మాయమాటలు చెప్పో.. తాత్కాలిక వ్యామోహం ఎర చూపో లోబర్చుకుంటున్నారు. నిజం ఎన్నాళ్లో దాగదన్నట్లుగా భార్య వ్యవహారం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి హత్యకు సిద్ధమవుతున్నారు. లేనిపోని ఆకర్షణలకు లోనై, అర్థం లేని కోరికలు, ఆడంబరాలకు పోయి కొత్త పరిచయాలకు ఆకర్షితులవుతుండగా, చివరకు హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఫలితంగా అటు కుటుంబీకులకు దూరమై ఇటు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. బతికి ఉన్నంత కాలం మచ్చే అక్రమ సంబంధాల కారణంగా హత్యలు చేయించేవారు, చేసే వారు తాము ఏదో ఘనకా ర్యానికి పాల్పడినట్లు భావిస్తుంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఒకసారి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని హత్య చేయించగలిగితే ఆతర్వాత తమ వ్యవహారానికి అడ్డెవరూ ఉండరని నమ్ముతారని పేర్కొంటున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో ఏదో ఓ రోజు విషయం బయటపడుతుందని, తాము కటకటాల పాలు కాక తప్పదని హత్యకు పాల్ప డే వారు మొదట గుర్తించడం లేదు. భర్తను భార్య హత్య చేయించినా, భార్యను భర్త హత్య చేసినా, చేయించినా శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి కేసులు బయటపడి, కేసుల పాలైతే శిక్ష అనుభవించి బయటకు వచ్చినా సమాజంలో తలెత్తుకుని జీవించే పరిస్థితి ఉండదు. సమాజంతో మాకేం పని అనుకున్నా కుటుంబం అక్కున చేర్చుకునే అవకాశం ఉండదు. ఇక దంపతులకు పిల్లలు ఉంటే ఒకరు చనిపోయి, ఒకరు జైలుకు వెళ్తే ఆ పిల్లలను ఎవరు పోషించాలి, సమాజం నుంచి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఓసారి ఆలోచించగలిగితే... అనైతిక బంధాలూ ఉండవు.. ఆపై హత్యలకు తావుండదు. ►గత నెలలో జిల్లాలోని ఆరెంపులకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివా హం చేసుకున్నాడు. చికెన్ వ్యర్థాలు తరలించే వాహనం డ్రైవర్గా పనిచేస్తుండగా ఆయన భార్యకు మరో డ్రైవర్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విష యం యువకుడికి తెలియడంతో భార్యను మందలించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి కృష్ణా జిల్లాలో మృతదేహాన్ని వేయించింది. ఇప్పటికీ సదరు యువకుడి మృతదేహం లభించలేదు. ►ఈనెల మొదట్లో ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఆయన భార్య హత్య చేయించింది. సాగర్ కాల్వలో నెట్టి వేసి హత్యకు పాల్పడగా ఈయన మృతదేహమూ లభించలేదు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. ►ఇప్పుడు చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ షేక్ జమాల్ సాహెబ్(48)ను ఆయన భార్య తాను సంబంధం సాగిస్తున్న ఆటోడ్రైవర్తో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేయించింది. -
ఈశ్వరమ్మతో ‘నాకు వివాహేతర బంధం’ ఉంది.. గట్టిగా కేకలు వేయడంతో
సాక్షి, విశాఖపట్నం: జింక్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ సిద్ధార్థ శంకర్ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో కుమారుడిని జువైనల్ హోమ్కు తరలించారు. ఇందుకు సంబంధించి క్రైం డీసీపీ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం... టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్ పట్నాయక్ మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ దగ్గర శంకర్ రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. మొత్తంగా చీటీలకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపి రూ.7లక్షల వరకు బాకీ పడ్డాడు. అయితే ఈశ్వరమ్మతో వివాహేతర సంబంధం కారణంగా బాకీ తీర్చకుండా జాప్యం చేశాడు. విషయం తెలుసుకున్న ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడు (బాలుడు) డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో... ఇవ్వను అని శంకర్ చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా ఈశ్వరమ్మతో తనకు వివాహేతర బంధం ఉందని కించపరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టడంతో ఆమె కుమారులు తట్టుకోలేకపోయారు. శంకర్ను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడాలని జూలై 25న తమ ఇంటికి పిలిచారు. తాగిన మైకంలో ఉన్న శంకర్ గొంతు, చేతి మణికట్టుపై కోసి ఈశ్వరమ్మ, గౌరీ శంకర్, అతని తమ్ముడు కడతేర్చారు. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్ మీద తీసుకెళ్లి జింక్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. అర్ధరాత్రి ఇల్లు కడగడంతో దొరికేశారు... జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో శంకర్ మృతదేహం జూలై 26న కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు అతని సహచర ఉద్యోగి, మల్కాపురం గాంధీజీ వీధికి చెందిన పాండా జితేంద్ర మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సిద్ధార్థ శంకర్ పట్నాయక్ జూలై 25న విధులకు హాజరుకాలేదని, మరుసటి రోజు జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో చనిపోయి కనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రైం ఏడీసీపీ డి.గంగాధరం పర్యవేక్షణలో గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్ఐ కె.సతీష్ బృందం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మింది గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులను విచారించగా... యడ్ల ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో శంకర్ గొడవపడ్డాడని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల వారితో మాట్లాడగా జూలై 25న అర్ధరాత్రి ఈశ్వరమ్మ ఇల్లు కడిగిందని స్థానికులు చెప్పారు. ఆ విషయం ఆధారంగా విచారించగా తామే శంకర్ను హతమార్చామని, రక్తపు మరకలను కడిగేశామని నిందితులు అంగీకరించారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ గంగాధరం, శ్రావణ్కుమార్, సీఐ ఎల్.భాస్కర్రావు, ఎస్ఐ కె.సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివాహేతర బంధంతో హత్యాయత్నం తన భార్యతో వివాహేతర బంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హతమార్చాలని దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంట్యాడ సమీప యారాడ గ్రామానికి చెందిన మొల్లి శ్రీను కూలి పనులు చేసుకుంటూ నివసించేవాడు. 2007లో మేనమామ కూతురుతో వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్యకు, ఎస్బీసీ డాలి్ఫన్ హిల్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొల్లి తాతారావుకు వివాహేతర బంధం ఏర్పడడాన్ని జీరి్ణంచుకోలేకపోయాడు. తాతారావును హతమార్చాలని శ్రీను నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి బీ షిప్ట్ ముగించుకుని తన సూపర్వైజర్ ఎస్.ప్రవీణ్తో కలిసి తాతారావు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 8.40 గంటలకు వారు డాలి్ఫన్ హిల్స్ గేటు ఎదురుగా రాగానే మొల్లి తాతారావుపై శ్రీను కారం చల్లి, ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన తాతారావు ఈ నెల 18న మల్కాపురం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సీఐ లూథర్బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో శ్రీను దాడి చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చాకు, ఇనుపరాడ్డు స్వా«దీనం చేసుకున్నారు. -
ఫేస్బుక్లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే
తిరువొత్తియూరు(చెన్నై): ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో తన తల్లి పరారైనట్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని కవరపట్టు గ్రామానికి చెందిన అయ్యప్పన్, లలిత (41) దంపతులకు 21, 19 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యప్పన్ సింగపూర్లో పని చేస్తున్నాడు. దీంతో కుమారులతో లలిత ఒరత్తనాడులో అద్దె ఇంట్లో ఉంటోంది. గురువారం రాత్రి పిల్లలు నిద్రిస్తుండగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని లలిత హఠాత్తుగా అదృశ్యమైంది. పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. తన తల్లికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్ల క్రితం ఓ యువకుడి (22)తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు. నగలు, నగదుతో ఆ యువకుడితో పరారైనట్లు తెలిపాడు. ఒరత్తనాడు పోలీసులు కేసు నమోదు చేసి లలిత, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా.. -
ప్రేమ పెళ్లి, ఆరునెలలకే మరొకరితో..
తిరువొత్తియూరు: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య మరొకరితో పారిపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నామక్కల్ జిల్లా ఎరుమపట్టి, బోడినాయకన్పట్టి తూర్పు వీధికి చెందిన షణ్ముగం కుమారుడు విమల్కుమార్ (20) నామక్కల్ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ధర్మపురికి చెందిన విద్యార్థినిని ప్రేమించి ఆరునెలల క్రితం ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. నామక్కల్లోని అతని తాత ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య అతనితో కలిసి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన విమల్కుమార్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్ని గట్టిగా కరిచి పరార్.. -
ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..
సాక్షి, చెన్నై: చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్ పోలీసు క్వార్టర్స్లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై సబ్ ఇన్స్పెక్టర్ కన్నుపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలి ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. సుమారు ఏడేళ్లుగా బాలికకు ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు అయింది. ఆమెకు మరొకరితో వివాహమైంది. కానీ తన తల్లి ఇంటికి వస్తున్న సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. అతని వేధింపులను సహించలేక ప్రియురాలు, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికను 13 ఏళ్ల నుంచి బెదిరింపులు లైంగికంగా వేధించినట్లు, ప్రస్తుతం వేరొకరితో వివాహం అయినప్పటికీ లైంగిక వేధింపులకు పాల్పతుండడంతో సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్లోడ్ చేస్తూ.. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి (40)కి ధర్మాబాద్ బాలాపూర్కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాటు మానుకోవాలని హితవు చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లికూతుళ్లు శ్రీనివాస్ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్పై తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు. అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్దారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాట వేసింది. చివరకు సోమవారం పోలీస్స్టేష్న్లో తనభర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్తో సావిత్రికి ఉన్న సంబంధం బయటపడింది. శ్రీనివాస్ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలికి మంగళవారం రుద్రూర్ సీఐ జాన్రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం: ఆఫీస్లో పరిచయం.. భార్యకి తరచూ ఫోన్ చేస్తున్నాడని..
తిరువొత్తియూరు: కోవైలోని ఓ వివాహితతో సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఓ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ను ఆమె భర్త, అతడి స్నేహితులు కిడ్నాప్ చేసి దాడి చేశారు. కత్తితో పొడిచిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై అలంగానల్లూర్కు చెందిన సోన ముత్తు (37). ఇతనికి వివాహమై భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. సోనముత్తు కోవై అవినాశి రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే బ్యాంకులో సేల్స్ విభాగంలో పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత సోనముత్తు రామనాథపురం నంజుండాపురం శ్రీపతినగర్లో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆ యువతికి వివాహమైంది. అయినప్పటికీ సోనముత్తు ఆ యువతికి తరచూ ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోనముత్తును కారులో కిడ్నాప్ చేసిన ఆ యువతి భర్త సాల్మన్ పారిస్ (23), అతని మిత్రులు అక్బర్ సాధిక్ (24), ముహ్మద్ అన్సర్ (24) తర్వాత కత్తితో పొడిచారు. దీంతో సోనముత్తును స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి రేస్కోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి సాల్మన్ పారిస్, అక్బర్ సాధిక్, మహమ్మద్ అన్సర్ను అరెస్టు చేశారు. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. -
ప్రేమించి పెళ్లి.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని
సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్న ఒక భర్త పాలిట భార్యే మృత్యుపాశంగా మారింది. ప్రియుడు, అతని సన్నిహితులతో కలిసి కిరాతకంగా భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, నగరి మునిసిపాలిటీ రామాపురం వద్ద వెలుగుచూసింది. రామాపురం వద్ద ఉన్న స్టోన్క్రషర్ కొలనులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్కుమార్ (32) మృతికి గల కారణాలను పోలీసులు అత్యంత వేగంగా కనుగొన్నారు. తీగలాగితే డొంక బయటపడినట్టు, మృతికి గల కారణాలు వెలుగు చూశాయి. నిందితులను అరెస్ట్ చూపుతున్న సీఐ శ్రీనివాసంతి సీఐ శ్రీనివాసంతి తెలిపిన వివరాలు.. నగరిలో సెల్ ఫోన్ షాపు నడుపుకునే విజయకుమార్కు 14 ఏళ్లక్రితం వనిత (30)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయకుమార్కు వ్యాపారరీత్యా టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు (21)తో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళరసు విజయకుమార్ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో తమిళరసుకు వనితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కుమార్తెతో అతి చనువుగా తమిళరసు మాట్లాడుతుండడంతో విజయకుమార్ తమిళరసును తన ఇంటికి రావద్దని ఆపేశాడు. 15 రోజుల పాటు తమిళరసు, వనిత కలుసుకోవడానికి విజయకుమార్ అడ్డుపడుతూ రావడంతో అతన్ని చంపడానికి వీరు మాస్టర్ ప్లాన్ వేశారు. తమిళరసు ఈ ప్లాన్లో తనకు మద్యం మిత్రులైన టీఆర్ కండ్రిగకు చెందిన తమిళరసు, కాకవేడు దళితవాడకు చెందిన నాగరాజు కొల్లాపురి (20), సంతోష్కుమార్ (15) కలిశారు. పక్కాగా పథక రచన చేశారు. గత ఆదివారం రాత్రి క్వారీ వద్దకు తమిళరసు, కొల్లాపురి, సంతోష్కుమార్ ముందుగా చేరుకున్నారు. ఫుల్గా మద్యం తాగి, విజయకుమార్కు ఫోన్చేసి బైక్లో పెట్రోల్ అయిపోయిందని.. తాము క్వారీ వద్ద ఉన్నామని పెట్రోల్ తీసుకురావాలని కోరాడు. మిత్రుని కోసం పెట్రోల్ తీసుకువెళ్లాలని బయలుదేరిన విజయకుమార్ వెంట తానూ వస్తానని వనిత బయలు దేరింది. ఇద్దరూ పెట్రోల్ తీసుకొని క్వారీ వద్దకు వెళ్లారు. పెట్రోల్ను బండిలో పోసే సమయంలో ఈతరాని విజయకుమార్ను వెనకనుంచి తమిళరసు తోసివేయగా కొల్లాపురి అతనిపై దూకి నీళ్లలో ముంచే ప్రయత్నం చేశాడు. క్వారీ పై నుంచి వనిత, సంతోష్ అతని తలపై రాళ్లువేయడంతో తీవ్రగాయాలపాలైన విజయకుమార్ నీటమునిగి మృతిచెందాడు. చదవండి: అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ ఒకసారి బెడిసికొట్టిన ప్లాన్ గత ఆదివారానికి ముందు చంపడానికి వీరు ప్లాన్ వేసి కత్తిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదేవిధంగా విజయకుమార్కు ఫోన్ చేసి పెట్రోల్ అయిపోయిందని చెప్పడంతో అతను వెళ్లాడు. అయితే ఆ సమయానికి అక్కడ జన సంచారం ఉండడంతో ప్లాన్ మిస్సయింది. అత్యంత వేగంగా విచారణ విజయకుమార్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగంగా జరిగింది. విచారణలో తాను దొరుకుతానని తెలుసుకున్న వనిత ముందస్తుగా వీఆర్వో వద్ద సరెండర్ కావడంతో, మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మైనర్ను జువైనల్ హోంకు పంపగా మిగిలిన వారిని రిమాండ్కు తరలించారు. -
అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సమీప బంధువు ఘాతుకానికి తెగబడ్డాడు. వరుసకు తమ్ముడైన వ్యక్తిని సుపారీ కిల్లర్స్తో హత్య చేయించి నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నేరేడుగొమ్ము మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, రాగ్య హైదరాబాద్లోని మణికొండలో కారు డ్రైవర్గా పని చేస్తూ అక్కడే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజాకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. హత్యకు రూ.20లక్షల సుపారీ తమ సఖ్యతకు రాగ్య అడ్డుగా ఉన్నాడని లక్పతి, రోజా భావించారు. దీంతో అతడి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్పతి నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్సింగ్, బాలోజీతో సుపారీ కుదుర్చుకున్నాడు. రాగ్యను హత్య చేస్తే రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. పరిచయం పెంచుకుని.. సుపారీ కుదుర్చుకున్న మాన్సింగ్, బాలోజి వైజాక్ కాలనీలో చేపల బేరం చేస్తారు. వీరు బేరం నిమిత్తం తరచూ హైదరాబాద్కు వెళ్లే వారు. ఈ క్రమంలో లక్పతి వద్ద రాగ్య ఫోన్ నంబర్ తీసుకుని అతడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రథకం ప్రకారం ఆగస్టు 19న రాగ్యను హత్య చేసి మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో పడవేశారు. చదవండి: బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది విషాదంలో రాగ్య తల్లిదండ్రులు, పక్కన రాగ్య (ఫైల్) హైదరాబాద్లో కేసు నమోదు.. సెల్ఫోన్ ఆధారంగా.. రాగ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21న హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్య తరచూ ఫోన్లో మాన్సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోందంత వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మాన్సింగ్, బాలోజీలను తీసుకుని కాచరాజుపల్లికి తీసుకువచ్చారు. కృష్ణా వెనుక జలాల్లో మృతదేహం కోసం గాలించగా సాయంత్రం వరకు లభ్యం కాలేదు. ఈ క్రమంలో నిందితులను తమకు అప్పగించాలని అక్కడికి చేరుకున్న రాగ్య కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాళ్లు రువ్వడంతో రాగ్య బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సోమవారం రాగ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపడతామని అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, రాగ్యను ఎక్కడ ఎలా హత్య చేశారు. హత్యోదంతంలో ఎంత మంది పాత్రధారులు? ఇందులో రాగ్య భార్య రోజా పాత్ర ఏ మేరకు ఉంది.? తదితర విషయాలు దర్యాప్తులో తేలుతాయని నేరేడుగొమ్ము పోలీసులు పేర్కొంటున్నారు. -
ప్రియుడి స్నేహితుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడితో పరారైన మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కీలక మలుపు తిరిగింది. ప్రియుడి స్నేహితుడు లైంగిక వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఈ నెల 29వ తేదీ తిరువళ్లూరు జిల్లా పెద్దకుప్పం కంబర్ వీధిలోని ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. మృతిపై తిరువళ్లూరు టౌన్ ఇన్స్పెక్టర్ పద్మశ్రీ బబ్బి విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతి చెందిన మహిళ చోళవరం సమీపంలోని ఎరుమై వెట్టిపాళయం గ్రామానికి చెందిన బాబు భార్య అముదగా గుర్తించారు. బాబు పాఠశాల వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్నారు. వీరికి జయశ్రీ, కిషోర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియుడితో పరార్ కొంత కాలం పాటు సజావుగా సాగిన బాబు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అముద అదే ప్రాంతానికి చెందిన జ్యోతీశ్వరన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం భర్త పిల్లలను వదిలి అతనితో పరారైంది. రెండేళ్లు ప్రియుడితో సహజీవనం చేసిన తరువాత పెద్దలు పంచాయతీ చేసి అముదను భర్త చెంతకు చేర్చారు. కొంత కాలం భర్తతోనే ఉన్న అముద మళ్లీ ప్రియుడితో పరారై అనుమానస్పద రీతిలో మృతి చెందింది. చదవండి: బైక్పై డ్రాప్ చేస్తామని తీసుకెళ్లి.. యువతిపై లైంగిక దాడి ప్రియుడి స్నేహితుడు వేధింపులు భరించలేక అముదతో సహజీవనం చేస్తున్న జ్యోతీశ్వరన్కు అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం మనస్సు మార్చుకుని భార్య పిల్లల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై అముద జ్యోతిశ్వరన్తో వాగ్వాదానికి దిగింది. నిన్ను నమ్మి భర్త పిల్లలను వదిలి వచ్చానని, ఇప్పుడు తనను నడిరోడ్డుపై వదిలేస్తే ఎక్కడికి వెళ్లాలని నిలదీసింది. జ్యోతీశ్వరన్ అముదను తిరువళ్లూరులోని ఇంట్లో వదిలిపెట్టి భార్య పిల్లల వద్దకు వెళ్లిపోయాడు. వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్న అముదను జ్యోతీశ్వరన్ స్నేహితుడు శివప్రకాష్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు గుర్తించారు. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి పెంచడంతోనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణమైన జ్యోతీశ్వరన్, శివప్రకాష్లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
ప్రియుడితో కలిసి.. కన్న కూతురిని కడతేర్చిన తల్లి
సాక్షి, నిజామాబాద్: అభంశుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్యచేసిందో తల్లి.. వివరాల్లోకి వెళ్తే.. మక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. నార్త్ రూరల్ సీఐ నరహరి కథనం మేరకు విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవాని, గురునాథం భార్య భర్తలు గతంలో రెండేళ్లపాటు నిర్మల్లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు. వీరికి నాగలక్ష్మి (6), గీతమాధవి (14 మాసాలు) అనే ఇద్దరు కూతుర్లున్నారు. అయితే నిర్మల్ నుంచి ఐదేళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గతనెల 14న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్ కేసు నమో దు చేశారు. నిజామాబాద్లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వేస్టేషన్లో ఆమె ప్రియుడైన బాన్సువాడ కొల్లూరుకు చెందిన దుండగుల శ్రీనుతో ఉండగా గుర్తించాడు. చిన్నకూతురు గీతమాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతును లిమి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆ శ్రయించగా భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్ రైల్వే కమాన్ వద్ద హత్య చేసి మాక్లూర్ చిన్నాపూర్ గండిలో పడవేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మానవత్వం నానాటికీ కానరాకుండా పోతుంది. మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా ఓమహిళ తొమ్మిది నెలల పేగు బంధాన్ని తెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడు సంవత్సరాల కొడుకొని తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన ముషీరాబాద్లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలని పార్మిగుట్టలో నివసాముంటున్న ఓ మహిళ.. నెల రోజుల క్రితం కుర్చీమీద నుంచి కిందపడి తన కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులుకేసు నమోదు చేశారు. అయితే తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేయించినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. -
ఒకరేమో ఏడు ముక్కలు చేయిస్తే.. మరొకరు ప్రియుడి చేతికి తుపాకీ అందించి..
2021 నవంబర్.. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్తను ఏడు ముక్కలు చేయించింది జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన హేమలత. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అతిగా మద్యం తాగించి ఆపరేషన్ చేసే సీజర్తో ప్రియుడితో ఏడు ముక్కలు చేయించి పలు ప్రాంతాల్లో పడేయించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇష్టపడి సొంత మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్. ఇద్దరు పిల్లలు సంతానం. అయినా ప్రేమికుడి మోజులో పడిన ఆయన భార్య రవళి.. తాళికట్టిన రాజేందర్ను ఈనెల 20న పిస్తోల్తో కాల్పులు జరిపించి చంపించింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని(పెద్దపల్లి): అర్థేచ.. కార్యేచ.. నాతి చరామి అంటూ చేతిలోచేయి వేసి జీవితాంతం తోడుంటామని బాస చేసిన కొందరు కట్టుకున్న భర్తను మట్టుబెట్టుతున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి తాళి కట్టిన వారిని కడతేర్చుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటనల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల ముందు తాళికట్టిన బంధాలు పలుచనైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచమంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తుంటే ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతివైపు పయనం పెరిగి పోతోంది. సింగరేణి కార్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. శనివారం హత్యకు గురైన కోరకొప్పుల రాజేందర్ను పెళ్లిచేసుకున్న రవళి ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాపురం చేయాల్సిన సమయంలో పెళ్లికి ముందునుంచే ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకుని తిరిగి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపించేందుకు సహకరించిందని అంటున్నారు. తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచిన భార్య ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు చంపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీపీసీ టీటీఎస్లో అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుముక్కలు చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను చంపించిన భార్య.. అతడి శరీరభాగాలను ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది. ఇలాంటి ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలను బలోపేతం చేసేలా స మాజం నడుం బిగించాలంటున్నారు. పోలీసుశాఖ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్పై వెంట తెచ్చుకున్న పిస్తోల్తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్వెపన్తో కాల్చారు.. షార్ట్వెపన్తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..
రాయచూరు(బెంగళూరు): వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి కడతేర్చిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన లింగసూగురు తాలాకా గుడదనాళలో బుధవారం జరిగింది. డీఎస్పీ వెంకటప్పనాయక్ కథనం మేరకు... గ్రామానికి చెందిన బెట్టప్పకు ఏడేళ్ల క్రితం కలబుర్గి జిల్లా యడ్రామికి చెందిన రేణుక(28)తో వివాహమైంది. వీరికి విరాట్, రాహుల్ అనే కుమారులున్నారు. అయితే రేణుకకు మల్లప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బెట్టప్ప అనుమానించేవాడు. మంగళవారం సాయంత్రం మల్లప్పతో భార్య ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. బుధవారం పుట్టింటికి వెళ్లి వస్తానని భార్య అడగడంతో మల్లప్ప కోసమే వెళ్తున్నావంటూ గొడవపడి గొడ్డలతో నరికి చంపి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి రేణుక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: సివిల్స్ కోచింగ్కు వెళ్లి.. యువకునితో వివాహేతర సంబంధం.. అందుకే.. -
ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమీషన్ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. భార్య వివాహేతర బంధంతో కుమిలిపోయి... చందక రాంబాబు అలియాస్ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్లోని భరత్నగర్లో నివసించేవారు. 2015లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు. ఒంటరితనం... స్త్రీలపై పగతో... భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. 2021 అక్టోబర్లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్ హాల్స్, దేవాలయాల వద్ద భోజనం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తన కారణంగా రాంబాబు స్త్రీలపై పగ, ద్వేషం పెంచుకున్నాడు. మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్ గార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్షి్మపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్లో అపార్టుమెంట్ వాచ్మెన్గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే... రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసినప్పుడు కమీషన్ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు. దీంతో వరుస హత్యలపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు కోసం పలు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అనంతరం రిమాండ్కు తరలించారు. సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: మహిళ సోదరుడికి తెలియడంతో..
రాయచూరు రూరల్(బెంగళూరు): జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కకొట్నేకల్లో శుక్రవారం సాయంత్రం వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణపై ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. మాన్వి పోలీసుల వివరాలు.. వీరేష్(25) అనే యువకుడిని హనుమేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. హనుమేష్ సోదరితో వీరేష్ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఇది గమనించిని హనుమేష్ అతని తీరు మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. అయితే ఆ మాటలను వీరేష్ పట్టించుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆ యువకుడిని హత్య చేశాడు హనుమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటప్ప నాయక్ తెలిపారు. చదవండి: 19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి -
వివాహేతర సంబంధానికి కూతురు అడ్డొస్తుందని.. సొంత అన్నతో కలిసి
సాక్షి, వరంగల్: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్ 100కు సమాచారం అందించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఒకేసారి ఇద్దరితో వివాహిత వివాహేతర సంబంధం.. ఐటీ ఉద్యోగి దారుణహత్య
తోట్లవల్లూరు (కృష్ణా జిల్లా) : వివాహేతర సంబంధం కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో జరిగింది. చిమ్మచీకట్లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘాతుకంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యాకమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల శ్రీకాంత్రెడ్డి స్నేహితులు. ఇరువురూ బాగా చనువుగా ఉండటంతో పాటు ఒకరింటికి ఒకరు పరస్పరం వచ్చి వెళుతుంటారు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా శ్రీనివాసరెడ్డి యాకమూరులోని ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్రెడ్డి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటాడు. చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంకు చెందిన ఆళ్ల మిధున అలియాస్ జ్యోతితో గత కొన్నేళ్లుగా శ్రీకాంత్రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జ్యోతి భర్త అమాయకంగా ఉంటాడు. దానిని ఆసరాగా తీసుకుని ఆమె శ్రీకాంత్రెడ్డితోనే కాకుండా కొంతకాలంగా శ్రీనివాసరెడ్డితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాకమూరులోని ఇంటి నుంచి ల్యాప్టాప్ తీసుకుని పునాదిపాడు స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆళ్లవారిపాలెంలోని మిధున ఇంటి వరండాలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి, కత్తి లభ్యమయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు కారకులుగా భావిస్తున్న ఆళ్ల శ్రీకాంతరెడ్డి, ఆళ్ల మిధున, ఆమె పదినెలల పాపతో కలిసి పరారయ్యారు. డాగ్స్కా్వడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. -
ఏందీ రచ్చ! ఆమెతో ఎఫైర్.. ఎలాన్ మస్క్ స్పందన ఇదే!
ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్ ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది ఈ పేరు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్నీ విషయాల్లోనూ తళుక్కున మెరుస్తున్నాడు ఈ టెస్లా అధినేత. మొన్న జానీ డెప్ వ్యవహారంలో, నిన్న ట్విటర్, ప్రస్తుతం ప్రాణ స్నేహితుడి భార్యతో ఎఫైర్ ఇలా విషయాలు వేరైనా కామన్గా వినిపించే పేరు మాత్రం ఎలాన్ మస్క్. అసలు కథేంటి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్కు ఎఫైర్ ఉందని సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని ఖండించారు. ఈ విషయంపై ట్వీట్ కూడా చేశారు. అందులో.. " ఇది పూర్తిగా అబద్దం. సెర్జీ, నేను స్నేహితులం. గత రాత్రే మేమిద్దరం పార్టీలో కలిశాం. నేను అతని భార్య నికోల్ను మూడు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా గుంపుగా ఉన్నప్పుడు. ఈ వ్యవహారంలో మరో రకంగా అనుకోవడానికి ఏమి లేద’’ని ట్వీట్ చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు . ఎలాన్ మస్క్ , సెర్జీ బ్రిన్ గతంలో మంచి స్నేహితులు. ఎంతలా అంటే ఎలాన్ మస్క్ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసేంత సాన్నిహిత్యం ఉంది. అలాంటిది సర్జీ, మస్క్కు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడని, వీటితో పాటు తన సలహాదారులకు కూడా మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడని తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా.. సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్హన్తో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం. -
వివాహేతర సంబంధం గుట్టురట్టు.. లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితతో అక్రమ సంబంధం గుట్టురట్టు కావడం, ఆమె భర్త బెదిరించడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరు కురుబరహళ్లి నివాసి అరుణ్ (33) నెలమంగల పట్టణంలోని ఒక లాడ్జిలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న అరుణ్ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో బెదిరించాడు. అంతేకాకుండా భార్యతో ఫోన్ చేయించి మన ఇద్దరి పేర్లు రాసి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పించాడు. దీంతో భయపడిపోయిన అరుణ్ నెలమంగలకు వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అరుణ్ ఒక్కడే జీవనాధారం కావడంతో కుటంబ సభ్యులు కన్నరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి..
భువనేశ్వర్: భార్య తలను నరికి చేతిలో పట్టుకొని 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఒక పైశాచిక భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరపూర్ గ్రామానికి చెందిన నక్కొఫొడి మాఝి అక్రమ సంబంధం అనుమానంతో తన భార్య సుచల మాఝిని పైశాచికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకొని పోలీసులకు లొంగిపోవడానికి కాలి నడకన బయల్దేరాడు. జొంఖిరా గ్రామం ప్రధాన రహదారిపై నిందితుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన భార్యకు అక్రమ సంబంధం ఉండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలియజేశాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కత్తితో పీకకోసి చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి -
ప్రియుడితో గొడవ.. మందు తాగించి, చీరతో గొంతు బిగించి..
సాక్షి, చెన్నై: నామక్కల్ జిల్లాలో వివాహేతర ప్రియుడిని చీరతో గొంతు బిగించి హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో తిడుమల్ ఆవారాంగాడు ప్రాంతానికి చెందిన సెల్వరాజు (50), అతని భార్య కళామణి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సెల్వరాజ్ తన రెండు కార్లను అద్దెకు నడుపుతుండేవాడు. ఈ క్రమంలో సెల్వరాజు పరమత వేలూరు సమీపంలోని పాలక్కరై ప్రాంతంలో ఉన్న సుధ (45) ఇంటిలో మృతి చెందినట్లు కళామణికి సమాచారం అందింది. బంధువులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి చూడగా సెల్వరాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. దీనిపై కలామణి నల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సెల్వరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్వరాజ్, సుధ మద్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల సుధకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలయడంతో సెల్వరాజ్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెల్వరాజును హత్య చేయడానికి సుధ నిర్ణయించుకుంది. గురువారం రాత్రి తన ఇంటికి వచ్చిన సెల్వరాజుకు ఎక్కువగా మద్యం తాగించి, చీరతో గొంతు బిగించి హత్య చేసింది. పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి పరమట్టి కోర్టులో హాజరుపరచి సేలం మహిళా జైలుకు తరలించారు. -
రెండున్నరేళ్ల నుంచి వివాహేతర బంధం.. రాత్రి నిద్రపోతుంటే..
సాక్షి,కేసముద్రం(మహబూబాబాద్): వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామశివారు చెరువు కొమ్ముతండాలో ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తను చంపిదో మహిళ. ఈమేరకు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముతండాకు చెందిన బానోత్ వీరన్న 15 ఏళ్ల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి శివారు జగ్గుతండాకు చెందిన వినోదను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తండాకు చెందిన అజ్మీర నరేశ్తో వినోద వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలో తండా పెద్ద మనుషుల మధ్య వీరన్న పంచాయితీ కూడా పెట్టాడు. అనంతరం వీరన్న, వినోద, నరేశ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వినోద పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి రావాలని వీరన్న పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయినా వినోద రాకుండా.. ఆళ్లపల్లి పోలీస్స్టేషన్లో భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ భర్తతో ఉండలేనని, అతడిని ఎలాగైనా చంపాలని వినోద తన ప్రియుడు నరేశ్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో వీరన్నను చంపేందుకు తన స్నేహితులైన కురవి మండలం కంచర్లడూడెం తండాకు చెందిన బానోత్ సుమన్, నారాయణపురం శివారు చెరువుకొమ్ముతండాకు చెందిన దారావత్ రాంబాబు, దేవాతో నరేశ్ చేయి కలిపాడు. వీరంతా కలిసి ఈనెల 21న అర్ధరాత్రి నిద్రిస్తున్న వీరన్న మెడ చుట్టూ తాడు బిగించి చంపేశారు. పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వీరన్నను నరేశ్, అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి వినోద హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దీంతో సోమవారం హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య వినోద పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు రమేశ్బాబు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పిల్లలు పుట్టడానికి మందు తెచ్చానంటూ భర్తకు పురుగుల మందు తాగించి హతమార్చిందో భార్య. ఇష్టంలేని పెళ్లి చేశారని, ప్రియుడిపై మోజుతో ఈ ఘాతుకానికి పాల్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలను కాళేశ్వరం పోలీస్స్టేషన్లో సీఐ కిరణ్కుమార్ ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జానెంపల్లికి చెందిన మౌనికకు.. కన్నెపల్లికి చెందిన పిట్టల సమ్మయ్య(28)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మౌనికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. సమ్మయ్య ఆమెను శారీరకంగా మానసికంగా హింసించేవాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. 10 రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇష్టం లేకపోయినా కాపురానికి వెళ్లింది. అయితే, పుట్టింట్లో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన పిట్టల రాజుతో మౌనికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను ఎలాగైనా హతమార్చాలని రాజుతో కలిసి పథకం వేసింది. అతడు కూడా ఒప్పుకోవడంతో ఈనె 22న రాజుకు ఫోన్ చేసి పురుగుల మందు తీసుకురావాలని చెప్పింది. అదే రోజు సాయంత్రం అతడు బస్సులో వచ్చి పురుగుల మందు డబ్బా ఇచ్చి వెళ్లాడు. అదే రోజు రాత్రి డాబాపై నిద్రిస్తున్న సమ్మయ్యకు పిల్లలు పుట్టడానికి మందు తెచ్చానంటూ నమ్మించి తాగించింది. ఆ తర్వాత కొంచెం మందును చెవిలో పోసింది. రాత్రి 11 గంటలకు రాజు సైతం గ్రామానికి చేరుకున్నాడు. మౌనిక, రాజు డాబాపైకి చేరుకున్నారు. సమ్మయ్య చనిపోకపోవడంతో చేతులను చున్నీ, టవల్తో మౌనిక మంచం కోళ్లకు కట్టేసింది. రాజు.. సమ్మయ్య కాళ్లను గట్టిగా పట్టుకోగా మౌనిక దిండుతో ఊపిరాడకుండా చేసింది. కొన ఊపిరి ఉండడంతో గొంతును నలిమి చంపింది. ఆ వెంటనే ఘటనా స్థలం నుంచి రాజు పారిపోయాడు. తెల్లవారుజామున 2గంటలకు అత్తమామల వద్దకు వెళ్లిన మౌనిక మీ కొడుకు ఎంత లేపినా లేవడంలేదంటూ చెప్పింది. సమ్మయ్య తండ్రి కొండయ్య డాబాపైకి వచ్చి చూడగా మృతి చెంది కనిపించాడు. దీంతో కాళేశ్వరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక, ఆమె ప్రియుడు రాజు హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు. కేసును చేదించిన ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్, ఏఎస్సై మల్లేశ్వర్, సిబ్బందని సీఐ అభినందించారు. -
వివాహిత మహిళను లోబరుచుకుని.. అడవిలోకి తీసుకువెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళను ఆమె కంటే చిన్నవాడైన అర్చకుడు మభ్యపెట్టి తీసుకెళ్లాడు, చివరకు ఆమె అడవిలో ఒంటరిగా ఉండడం చూసి జనం పోలీసులకు సమాచారమిచ్చారు. వివరాలు.. నంజనగూడు తాలూకాలోని కోల్లుపుర గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ (35) సమస్యలు తొలగిపోవాలని ఆలయానికి వెళ్లేది. అక్కడి పూజారి సంతోష్ (28) ఆమెను ప్రేమపేరుతో లోబరుచుకున్నాడు. ఇద్దరూ షికార్లకు వెళ్లేవారు. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పి సంతోష్ ఆ మహిళను తీసుకెళ్లి అడవిలో వదిలేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను చూసి హుల్లహళ్ళి పోలీసులకు చెప్పగా, వారు ఆమెను రక్షించారు. కేసు నమోదు చేశారు. చదవండి: తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి -
యువకుడితో సహజీవనం.. పెళ్లికి నో చెప్పిందని వివాహిత కుమారుడిని
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్(24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజర్గా రహ్మత్నగర్లో పని చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డట్లు శంకర్పై అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్నగర్లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్లో ఉన్నట్లుగా ఫోన్ కాల్డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి -
భార్య వివాహేతర సంబంధం.. కువైట్ నుంచి వచ్చిన భర్తకు తెలియడంతో
సాక్షి, నిజామాబాద్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపి, తర్వాత ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారమ్ సదానంద్కు కవితతో 2007లో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సదానంద్ బతుకు దెరువుకు కోసం కువైట్కు వెళ్లేవారన్నారు. 2008లో కవితకు అదే గ్రామానికి చెందిన మైలారం శేఖర్తో పరిచయమై తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. మే 5న కువైట్ నుంచి వచ్చిన సదానంద్కు భార్య మధ్య డబ్బుల విషయంలో తగాదా రావడంతో పాటు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. సదానంద్కు నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామానికి చెందిన తోకల విజయతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సదానంద్ను చంపేందుకు విజయతో కలిసి కవిత పథకం రచించింది. పథకం ప్రకారం సదానందంను విజయ నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులోకి వెళ్లేవరకు మద్యం తాగించింది. అనంతరం కవితకు ఫోన్ చేసింది. కవితతో పాటు శేఖర్, మరో వ్యక్తి రాజశేఖర్ వచ్చారు. తర్వాత అందరూ కలిసి సందానందం గొంతుకు స్కార్ఫ్ బిగించి చంపివేశారని సీపీ వివ రించారు. హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించి కవిత, వి జయ, శేఖర్, రాజశేఖర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు సెల్ఫోన్లు, బంగారు చైన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో అదనపు డీసీపీ నరేందర్, సీఐ జగడం నరేష్, ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం, ఆహారంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం జిల్లా కొళత్తూరు సమీపంలోని కారైకాడు వీరభద్ర న్ కొట్టాయంకి చెందిన శక్తివేల్ (37) కార్మికుడు. ఇతను మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని తమ్ముడు ముత్తుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శక్తివేలు భార్య పుగలరసి (37)కు అదే ప్రాంతానికి చెందిన ముత్తుకుమార్తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ సంగతి తెలుసుకున్న శక్తివేల్ భార్యను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి సోమవారం రాత్రి ఆహారంలో విషం కలిపి ఇచ్చి భర్తను పుగలరసి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పుగలరసి, ముత్తుకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
ప్రేయసితో ఏకాంతంలో దొరికాడు.. అలా నగ్నంగానే ఊరేగించిన భార్య
అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తి.. ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడుపుతున్న టైంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ వివాహేతర సంబంధాన్ని రచ్చకీడ్చే ఉద్దేశంతో.. వాళ్లిద్దరినీ అలా నగ్నంగానే బయటకు ఇడ్చుకొచ్చింది అతని భార్య. ఆపై ఊరంతా తిప్పి.. వాళ్లను ఘోరంగా అవమానించింది. ఛత్తీస్గఢ్ కొండాగావ్కు చెందిన ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్ తింది. అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. జూన్ 11వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ల ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..
బనశంకరి(బెంగళూరు): సుంకదకట్టెలో యువతిపై యాసిడ్ దాడి ఘటన కళ్లముందు మెదులుతుండగానే అలాంటి ఘోరం నగరంలో పునరావృతమైంది. పెళ్లికి నిరాకరించిందని ఓ వివాహితపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం కుమారస్వామి లేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. డీసీపీ హరీశ్పాండే కథనం మేరకు... యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లేఔట్ పరిధిలోని కర్ణాటక అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది. ఇదే పరిశ్రమలో పనిచేస్తూ భార్యకు దూరంగా ఉన్న అహ్మద్కు, ఆమెకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుందామని అహ్మద్ కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆ మహిళ అంగీకరించలేదు. ఇదేవిషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లేఔట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చదవండి: పబ్ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి.. -
మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..
సాక్షి,బీబీపేట(కామారెడ్డి): మహిళను లోబర్చుకున్నాడని ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో హత్య చేశారు. బీబీపేటలో శనివారం అర్ధరాత్రి జరి గిన ఈరోల్ల మల్లయ్య(62) హత్య కేసును పోలీసులు ఒక రోజు లోనే ఛేదించి నిందితులను రిమాండ్కు తరలించారు. మల్ల య్య హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఉంచగా బీబీపేట బస్టాండ్ వద్ద దొరికారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సోమవారం భిక్కనూర్ సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ బంధువులు కొంగరి పోచయ్య, రాజ్కుమార్ నిందితుడిపై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు మల్లయ్య ను హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మల్లయ్య, మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకున్నాడు. దీంతో కొంగరి పోచయ్య, రాజ్ కుమార్లు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బ యటకు లాక్కొచ్చారు. మల్లయ్య తలపై బండరాయితో మోది, ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని, దీంతో మ హిళను లోబర్చుకున్నట్లు నిందితులు పోలీసులతో పేర్కొన్నా రు. పోలీసులు, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చ గా నిజామాబాద్ జైలుకు తరలించారు. చదవండి: Extra Marital Affair: వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. -
వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. షాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్కు రమ్మనాడు. షాబాద్లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు. చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి..
మైసూరు(బెంగళూరు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బంధువును భర్త హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నంజనగూడు తాలూకా మాడ్రళ్లిలో శివణ్ణ (59) భార్యతో సిద్ధశెట్టి (47)కి వివాహేతరంసంబంధం ఏర్పడింది. దీనిపై ఇద్దరి భార్యాభర్తలకి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ఎన్ని సార్లు చెప్పినా శివణ్ణ భార్య సిద్ధశెట్టి తన సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త మాట పట్టించుకోలేదు. ఆదివారం కూడా దీని గురించి మాట్లాడేందుకు వెళ్లి వారి గొడవ జరగ్గా శివణ్ణ కత్తితో సిద్ధశెట్టిని పొడిచాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. శివణ్ణ పరారు అయ్యాడు. మరో ఘటనలో.. క్యాంటర్, బైక్ ఢీ.. ఒకరు మృతి దొడ్డబళ్లాపురం: క్యాంటర్– బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మరళేనహళ్లి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప (48) మృతి చెందాడు. సోమవారం ఉదయం హనుమంతరాయప్ప మరళేనహళ్లి నుండి దొడ్డబెళవంగల వైపు బైక్పై వెళ్తుండగా క్యాంటర్ను ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మూడు నెలల క్రితం భర్త మృతి.. మరో వ్యక్తితో సంబంధం, విషయం తెలియడంతో..
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్ జిల్లా తారాపురం ప్రాంతంలో బుధవారం రాత్రి వివాహేతర ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తారాపురంలోని పూవాడిపాలెంకు చెందిన కార్మికుడు మణికంఠన్కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ భార్య మారి యమ్మాల్ (40) దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. గత మూడు నెలల క్రితం నటరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో మారి యమ్మాల్కు మణికంఠన్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న బంధువులు వారిని మందలించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన వారిద్దరు అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో బొమ్మనాయకన్ పట్టి, పవన విద్యుత్ కేంద్రం ప్రాంతంలో ఒక జంట మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించగా చనిపోయిన వారు మారియమ్మాల్, మణికంఠన్గా గుర్తించారు. వీరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి