Hansika Motwani
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి హన్సిక (ఫొటోలు)
-
హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక.. ఎందుకంటే?
హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె సోదరుడి భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24న హన్సిక పిటిషన్ వేయగా.. ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కాగా.. గతంలో హన్సికతో పాటు ఆమె తల్లిపై సోదరుడి భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ గృహ హింస కేసు పెట్టారు. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్ను ఆశ్రయించింది. -
పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక
ఉత్తరాది భామ హన్సిక(Hansika Motwani) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2003లో తన నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ ఉత్తరాది బ్యూటీ 2007లో దేశముదురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. తెల్లగా, బొద్దుగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ భామ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిలోనూ పడింది. ఆ తర్వాత 2011లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా తలుపుతట్టాయి. అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది. కాగా పలు భాషల్లో కథానాయకిగా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక ఆ మధ్య పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు. వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇంతకుముందు బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది. తాను అలా తయారు కావడానికి ఉపయోగించిన టిప్స్ను కూడా చెప్పుకొచ్చింది. అందులో మంచినీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యకారణం అని పేర్కొంది. అదేవిధంగా యోగా, ధ్యానం, వంటి శారీరక కసరత్తులు చేస్తానని కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వనని ఈ టిప్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈ బొద్దుగుమ్మ చిక్కినా సక్కగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత -
వెన్నెలనీ దోచినదీ నీవేనా.. నవయవ్వనంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరు? (ఫోటోలు)
-
మాల్దీవులు బీచ్లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
వెడ్డింగ్ డే మూడ్: మాల్దీవుల్లో హన్సిక మోత్వానీ జిల్జిల్ జిగా (ఫోటోలు)
-
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
Hansika Motwani యాపిల్ బ్యూటీలా ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)
-
జిగేల్మనే అందాలతో ట్రెండింగ్లో హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
పెళ్లికూతురిలా మెరిసిపోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు
-
దీపావళి పటాకా మాదిరి గ్లామర్తో పేల్చేసిన హన్సిక (ఫోటోలు)
-
సరికొత్త ప్రయాణం : నటి హన్సిక గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
గుడిలో టాప్ హీరోయిన్ .. ఫిదా అవుతున్న తమిళ అభిమానులు
తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన ముంబాయి బ్యూటీ హన్సిక. 2001లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రం ద్వారా కోలీవుడ్కు కథానాయకిగా పరిచయమైన ఈమె తొలి చిత్రంతోనే ఇక్కడ సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంగేయుమ్ కాదల్, ఒరు కల్ ఒరు కన్నాడీ, బిర్యాని, సింగం 2 వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి కోలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ దేశముదురు చిత్రంతో రంగ ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోలతో నటించి టాప్ కథానాయకిగా రాణించారు. అలా 50 చిత్రాలకు పైగా నటించిన హన్సిక 2022లో వివాహం చేసుకున్నారు. అయితే నటనకు మాత్రం దూరం కాలేదు. వివాహానంతరం అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. దీంతో మళ్లీ మంచి అవకాశాలు దక్కించుకోవడానికి హన్సిక తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామాక్షి అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఒకటి తమిళ వారిని మెప్పిస్తుంది. తాను ముంబైలో పుట్టినా మానసికంగా మాత్రం తాను తమిళ అమ్మాయినే అంటూ హన్సిక ఇచ్చిన స్టేట్మెంట్ వారిని మెప్పిస్తుంది. అంతేకాకుండా (నమ్మ ఊరు సాప్పాటు) మన ఊరు భోజనం సూపర్ అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో తమిళ నెటిజన్లు హన్సికను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. తమిళ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
మల్లెపూలతో మనోహరంగా హీరోయిన్ హన్సిక (ఫొటోలు)
-
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్లో 108రోజుల వర్కౌట్తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Hansika Motwani: పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికా మోత్వాని రేర్ ఫోటోలు
-
అచ్చమైన పెయింటింగ్లా అందమైన భామ (ఫోటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్లో హన్సిక
-
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న హన్సిక (ఫోటోలు)
-
బ్లాక్ డ్రెస్లో హన్సిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
సూసేకి.. అగ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్ అదిరిపోయింది!
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో, అందులోని పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. సమంత నటించిన ఊ అంటావా మామా అనే ఐటమ్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయి సినిమాకే ఎంతో హైప్ తెచ్చి పెట్టింది. పలువురు సినీస్టార్స్తో పాటు, ఇతరులు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను వైరల్ చేశారు. అదేవిధంగా రష్మిక మందన్నా నటించిన రా రా సామి అనే పాట కూడా బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం పుష్ప–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట సినిమా హైప్ను పెంచేస్తోంది.ఈ పాటకు హన్సిక లంగా ఓణి ధరించి నలుగురు కుర్రాళ్లతో కలిసి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి చిత్ర యూనిట్ ఇంకా పబ్లిసిటీని ప్రారంభించలేదు. అయితే హన్సిక వంటి సెలబ్రిటీలు అందులోని పాటకు డాన్స్ చేయడంతో ఇప్పటి నుంచే ఫ్రీ పబ్లిసిటీ మొదలైందన్నమాట. మరోవైపు సూసేకి సాంగ్.. తెలుగు, హిందీ వర్షన్స్ కలుపుకుని యూట్యూబ్లో 100 మిలియన్ (పది కోట్ల) వ్యూస్ రాబట్టడం విశేషం. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) People just cannot stop vibing to #TheCoupleSong ❤️🔥#Pushpa2SecondSingle TRENDING #1 on YouTube for music with 100 MILLION+ VIEWS & 1.67 MILLION+ LIKES 💥💥▶️ https://t.co/Tgu57adbiT#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024. pic.twitter.com/FSw6yePP7j— Pushpa (@PushpaMovie) June 14, 2024చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్ -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
స్మశానంలో షూటింగ్.. హన్సిక హారర్ మూవీ రిలీజ్
వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ లెన్స్ పెట్టినట్లు వెల్లడించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది. -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
క్షమాపణలు చెప్పిన హన్సిక
-
'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్ స్టార్కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. Celebrating 17 MASSive years of Icon Star @alluarjun's #Desamuduru 🤙🏻 Every dialogue and song from this film continues to send electrifying chills down our spine!#PuriJagannadh @ihansika #Chakri#17YearsForDesamuduru pic.twitter.com/AxxFJpo4Kd — DVV Entertainment (@DVVMovies) January 12, 2024 17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽 — Allu Arjun (@alluarjun) January 12, 2024 -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నెల రోజులకే ఓటీటీ రానున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్!
గతేడాది ప్రియుడిని పెళ్లాడిన దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ ఇటీవలే మొదటి వివాహా వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త సోహెల్ కతూరియాతో కలిసి కేక్ కట్ చేసింది. అయితే పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని హన్సిక.. ఇటీవలే మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్లో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతస్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈనెల 17 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజే స్ట్రీమింగ్కు వస్తే రిలీజైన నెల రోజులకే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్) -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ
టైటిల్: మై నేమ్ ఈజ్ శృతి నటీనటులు:హన్సిక, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు నిర్మాత:బురుగు రమ్య ప్రభాకర్ దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్ సంగీతం: మార్క్ కె రాబిన్ ఎడిటర్ : చోటా కే ప్రసాద్ విడుదల తేది: నవంబర్ 17, 2023 కథేంటంటే.. శృతి(హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది. సోషల్ మీడియా ద్వారా చరణ్(సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అతన్ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన శృతి..అనుకోకుండా స్కిన్ మాఫీయా ముఠా వలలో చిక్కుకుంటుంది. ఆ ముఠా లీడర్, ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్) చేసే అరచకాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? శృతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసు అధికారి రంజిత్(మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? స్కిన్ మాఫీయా వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యే గురుమూర్తికి, స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి(ప్రేమ)కు ఉన్న సంబంధం ఏంటి? స్కిన్ మాఫియా ముఠాను అరికట్టేందుకు శృతి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది డబ్బు కోసం గుండె, కిడ్నీ లాంటి అవయవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తారో చాలా సినిమాల్లో చూశాం. అందం కోసం పిండాలను అమ్మేసే మాఫియా ఉందని ‘యశోద’ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. కానీ స్కిన్ డ్రాప్టింగ్ మాఫియా నేపథ్యంలో మాత్రం ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఆ సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే `మై నేమ్ ఈజ్ శృతి`. చర్మంతో కూడా వ్యాపారం చేస్తున్నారనే కొత్త అంశాన్ని ప్రేక్షకులను తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికే.. తెరపై అంతే కొత్తగా చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్కిన్ డ్రాప్టింగ్ అంశంతోనే కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. మర్డర్ని రివీల్ చేసి చేసి.. అందులోని ట్విస్ట్ను సస్పెన్స్లో పెట్టాడు. ముందు, వెనుక అంటూ ఫస్టాఫ్ అంతా సస్పెన్స్గానే సాగుతుంది. అయితే ప్రతిసారి కథ ముందుకు, వెనక్కు వెళ్లడంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనం కాలేడు. కానీ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని మాత్రం కొనసాగిస్తూ సెకండాఫ్పై ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్టాఫ్లోని పలు ప్రశ్నలకు సెకండాఫ్లో సమాధానం దొరుకుతుంది. స్కిన్ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధం, స్కామ్ని బయట పెట్టేందుకు శృతి వేసే ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు థ్రిలింగ్గా ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా.. సినిమాటిక్గా అనిపిస్తాయి. స్కిన్ మాఫియా గురించి మరింత లోతుగా చర్చించి, స్క్రీన్ప్లే మరింత గ్రిప్పింగ్గా తీసుకెళ్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. శృతి పాత్రకి హన్సిక న్యాయం చేసింది. అమాయకంగా కనిపిస్తూనే..ముఖంతోనే అనేక భావోద్వేగాలను పలికించి ఆకట్టుకుంది. ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకుంది. విలన్గా పూజా రామచంద్రన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. డబ్బుకోసం ఎంతకైనా తెగించే యువతి పాత్ర తనది. ఇక అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి పాత్రలో నటించి, మెప్పించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నరేన్, మురళీ శర్మ, ప్రవీణ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)
-
'పెళ్లి తర్వాత అదొక్కటే మారింది'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్!
దేశముదురు భామ, హీరోయిన్ హన్సిక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ. ఇటీవలే మై 3 అనే వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న గార్డియన్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన ప్రియుడితో పెళ్లి తర్వాత హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా మై నేమ్ ఈజ్ శృతీ ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదని చెప్పుకొచ్చింది. హన్సిక మాట్లాడుతూ.. ' సోహైల్తో పెళ్లయ్యాకం నా లైఫ్ పెద్దగా ఏం మారలేదు. సినిమా షూటింగ్ సమయంలో క్యారెక్టర్లో ఉంటాను. ఇంటికెళ్లాక నా భర్తతో ఎక్కువ టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా అడ్రస్ మాత్రమే మారింది. అంతే తప్ప నా ఇంటి పేరులో ఎలాంటి మార్పులేదు. హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డా. అందుకే ఇంటి పేరును అలాగే ఉంచా.' అంటూ వివరించింది. 'మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. -
ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ హన్సికకు అందం అలంకారం అయితే చిరునవ్వు అదనపు ఆకర్షణ. ఈమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కు పైగా చిత్రాల్లో నటించి తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుందీ బ్యూటీ. వివాహానంతరం కూడా చెక్కు చెదరని అందాలతో తగ్గని ఆదరణతో, పెరుగుతున్న అవకాశాలతో పుల్ జోష్లో ఉందీ అమ్మడు. తాజాగా తమిళంలో నటిస్తున్న గార్డియన్ చిత్రం టీజర్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రం టీజర్ ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విభిన్న కథలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమె బహుభాషా నటిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళం, తెలుగు భాషల్లో బిజీగా చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక హిందీలో మై 3 అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గార్డియన్, మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైనవి అన్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో 105 నిమిడంగళ్, తమిళంలో మ్యాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా 2024 తనకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ పేర్కొంది. చదవండి: అమర్ దీప్కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ.. -
భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్ బ్యూటీ
ఇప్పటివరకు హీరోలకే పెళ్లి, వయసుతో పనిలేదు అనుకొనే వాళ్లం. ఇప్పుడు హీరోయిన్లూ ఆ కోవలోకి చేరిపోతున్నారు. పెళ్లయితే గ్లామర్ పోతుంది, హీరోయిన్ అవకాశాలు రావు అనే కాలం పోయింది. పిల్లలకు తల్లిలు అయిన తర్వాత కూడా ఈ కాలం నటీమణులు హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. నటి కాజల్ అగర్వాల్, నయనతార వంటి వాళ్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇక మరో అందాల తార హన్సిక గురించి చెప్పాలంటే ఇటీవలే పెళ్లి చేసుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. 2003లో దేశముదురు అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తూ నేటికీ బిజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవలే నటిగా అర్ధ సెంచరీ కొట్టిన హన్సిక హీరోయిన్గా ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో నాలుగు ఐదు చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో గార్డియన్ అనే హారర్ర్ చిత్రంలో దెయ్యంగా భయపెట్టోందుకు సిద్ధమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. దర్శకుడు విజయ్ చందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇప్పటివరకు హన్సికలోని గ్లామర్ను చూసిన ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ గార్డియన్ రాబోతుంది. నటుడు సురేష్ మీనన్, శ్రీమాన్, మొట్టై రాజేంద్రన్, ప్రదీప్ రాయన్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శబరి, గురుశరవణన్ ద్వయం దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి స్పందన వస్తోంది. నవంబర్ 30న తమళ్,తెలుగు భాషలలో గార్డియన్ చిత్రం విడుదల కానుంది. -
పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లేదంటున్న క్రేజీ బ్యూటీ
పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా అతి కొద్దిమంది హీరోయిన్లలలో హన్సికా మోత్వాని ఒకరు. ఈ ముంబై బ్యూటీ కథానాయకిగా ఎక్కువ పేరు, డబ్బు గడిచింది మాత్రం తెలుగు, తమిళం భాషా చిత్రాలతోనే. టాలీవుడ్లో దేశముదురు చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టింది. మాప్పిళై చిత్రంతో తమిళంలోనూ కథానాయకిగా రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా హిట్ కొట్టింది హన్సిక. సౌత్లో ఈ రెండు భాషల్లోనూ గట్టి పునాదినే వేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శింబు స్టార్ హీరోల సరసన గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ కలిపి 50 చిత్రాల మైలురాయిని అధిగమించిన హన్సిక గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అందాలను మెరుగు పరచుకోవడంపై ఏమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. మొదట్లో కొంచెం బొద్దుగా ఉండి జూనియర్ కుష్బూగా ముద్ర వేసుకున్న హన్సిక ఆ తర్వాత చాలా స్లిమ్గా తయారైంది. ఇప్పటికీ ఈ అమ్మడు జిమ్లోనే ఎక్కువ సమయం గడుపుతుందట. అందాన్ని కాపాడుకోవడానికి తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా హన్సిక చేతిలో ఇప్పటికీ తెలుగులో 4, తమిళంలో 4 చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉండే విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని అలరిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
జిమ్లో అన్వేషి.. వర్షంలో కృతి శెట్టి ఫోజులు
► నీతోనే డ్యాన్స్ అంటూ పొట్టి గౌన్లో రచ్చ చేస్తున్న శ్రీముఖి ► డిస్నీ ల్యాండ్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ ► ఫుల్ వర్షంలో సూపర్బ్ ఫోటోలను షేర్ చేసిన కృతి శెట్టి ► జిమ్లో వర్కౌట్స్ సెల్ఫీలతో అన్వేషి జైన్ ► కలర్ఫుల్ డ్రెస్ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ► అదిరిపోయే ఫోజులతో అందరి మనసుదోచే ఫోటోలు షేర్ చేసిన సోనాలి బింద్రే View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న హన్సిక (ఫోటోలు)
-
టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!
ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) అయితే ఈవెంట్లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్పై ఈవెంట్కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్! ) -
ఇండస్ట్రీలో అదంతా గ్యాంబ్లింగ్, నేనేమీ పట్టించుకోను: హన్సిక
పైళ్లె ఏడు నెలలే అయ్యింది. ఒక పక్క వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క హీరోయిన్గా బిజీగా ఉంది హన్సిక. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయికగా అర్ధ సెంచరీ దాటేసింది. కాగా హన్సిక హీరో ఆదిపినిశెట్టితో కలిసి నటించిన పార్ట్నర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చైన్నెకి వచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ వివాహ జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని, నట జీవితానికి తన భర్త ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. తన తల్లి అంతకుమించి అండగా ఉంటున్నారని పేర్కొంది. తనకు నటించడం చాలా ఇష్టమని చెప్పిన ఆమె నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయంది. అయితే లక్ష్యం అంటూ ఏమీలేదని మంచి నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చింది. పలు భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆ అనుభవం చాలా నేర్పిందని పేర్కొంది. 50వ చిత్రం మహాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడంతో ఆ తరహా పాత్రలోనే నటించాలని కోరుకోవడం లేదని, పాత్ర నచ్చితే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి రెడీ అంది. ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్ అని.. సీనియర్ దర్శకులైనా, వర్ధమాన దర్శకులైనా కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. పార్ట్నర్ చిత్రంలో పురుషుడిగా మారే పాత్రను పోషించానని, ఇది పూర్తిగా విలువైన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. తాను ఎప్పుడు చాలా జాలీగా ఉంటానని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మీరు నిజజీవితంలో ఎవరుగా మారాలనుకుంటున్నారన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్గా మారాలని కోరుకుంటానంది. భవిష్యత్తులో చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అందుకు అవకాశమే లేదని, అదేవిధంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. నటిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు హన్సిక పేర్కొంది. చదవండి: రూ.20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్ -
బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడెలా అయిందో చూడండి (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత బాగా సన్నబడిన హన్సిక.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్
తమిళసినిమా: అందమైన నటీమణులకు బరువు అనేది పెద్ద భారం అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. నటి అనుష్క వంటి వారికి ఇది కష్ట సాధ్యంగానే మారిందని చెప్పక తప్పదు. అయితే మరో బ్యూటీ హన్సిక మాత్రం బరువు తగ్గడం అనేదాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్గా మారింది. ముంబయి భామ హన్సిక బాల నటిగా హిందీలో కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇక కోలీవుడ్లో ధనుష్ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. విజయ్కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాగా స్లిమ్గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: యాసలందు అన్ని యాసలూ లెస్స) -
సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక
బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన హన్సిక మొత్వానీ దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. అమాయకపు చూపులతో సన్యాసిగా నటించిన హన్సిక నటనకు, అందానికి ప్రేక్షకులు దాసోహమయ్యారు. మా కళ్లతో చూడు మామా అంటూ తెలుగబ్బాయిలు ఆమె ఫ్యాన్స్ లిస్టులో చేరిపోయారు. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హన్సిక ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఆమె గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకప్పుడు ఎలా ఉండేదంటే డిజైనర్లు మాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్లే కాదు. ఓహ్, మీరు దక్షిణాది హీరోయినా? మీకు మేము దుస్తులివ్వం అని ముఖం మీదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వారంతట వారే స్వయంగా వచ్చి మరీ మీకు ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది.. ట్రైలర్ లాంచ్ లాంటివి.. మరి అలాంటప్పుడు మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా? అని బతిమాలుతున్నారు. అప్పటి మాటలకు, ఇప్పటి మాటలకు చాలా తేడా ఉంది కదా! గతంలో వాళ్లు అలా చులకనగా మాట్లాడినప్పుడు నేనేమీ వాళ్లపై పగ పెంచుకోలేదు. దానికి బదులుగా నేనింకా కష్టపడాలి. వాళ్లను నా పనితో తిరిగి రప్పించేలా చేయాలని కసిగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఛీ కొట్టినవాళ్లే తిరిగి వచ్చారో అప్పుడు నాకే ఆశ్చర్యం వేసేది. ఏంటి? మీరిప్పుడు నన్ను రెడీ చేయాలనుకుంటున్నారా? అది కూడా మీ కాస్ట్యూమ్తో అని ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా హన్సిక ప్రస్తుతం మ్యాన్ అనే సినిమా చేస్తోంది. చదవండి: 20 ఏళ్లుగా బుల్లితెరకు దూరం.. అదే నేను చేసిన తప్పు: నటుడు -
హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ యూత్లోనూ మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే రీసెంట్గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ సత్తా చాటుతున్న హన్సిక తాజాగా ఓ ఇంటరవ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది.అయితే ఆ హీరోకు తగిని విధంగా బుద్ది చెప్పానంటూ పేర్కొన్న హన్సిక ఆ టాలీవుడ్ హీరో ఎవరన్నది మాత్రం బయటకు రివీల్ చేయలేదు. దీంతో అతను ఎవరై ఉంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
హన్సిక మోత్వానీ స్టన్నింగ్ లుక్స్ ఫోటో గ్యాలరీ
హన్సిక మోత్వానీ స్టన్నింగ్ లుక్స్ ఫోటో గ్యాలరీ -
నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వాలి: హన్సిక తల్లి డిమాండ్
తమిళ సినిమా: బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి హన్సిక. ఆ తర్వాత తమిళంలో ధనుష్కు జంటగా, కథానాయకిగా మాప్పిల్లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగులో అల్లు అర్జున్కు జంటగా దేశముదురు చిత్రంతో పరిచయమయ్యారు. అలా ఈ రెండు భాషల్లోనూ నటిస్తూ అగ్రకథానాయకి స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ప్రేమ వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు బాగానే వినిపించింది. నటుడు శింబుతో ప్రేమ పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక నటిగా 50 చిత్రాల మైలు రాయిని అధిగమించిన హన్సిక ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా గత 2022 డిసెంబర్ 4వ తేదీన ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతురియను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ లోని 450 ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన ప్యాలెస్లో వీరి వివాహ తంతు వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకను కూడా హన్సిక కుటుంబం వ్యాపారంగా మార్చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థకు ఆ వేడుక ప్రసార హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. దీంతో ఆ సంస్థ హన్సిక వివాహ వేడుకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, వరుడు సోహైల్తో వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు. దాన్ని ఇప్పుడు లవ్ షాది డ్రామా పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులో నటి హన్సిక, ఆమె తల్లి మోనా మోత్వానీ గతంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి, వాటి పరిష్కారం కోసం వారు తీసుకున్న నిర్ణయాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. స్ట్రీమింగ్ అయిన లవ్ షాది డ్రామా ఎపిసోడ్ లో హన్సిక తల్లి మోనా చెప్పిన ఒక విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే వివాహ వేడుకకు సోహైల్ కుటుంబ సభ్యులు సరైన సమయానికి చేరుకోకపోవడంతో టెన్షన్ అయిన మోనా మోత్వానీ, సోహైల్ తల్లికి ఫోన్ చేసి ఇంకా మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కోరారట. ఈ విషయాన్ని ఆమె ఆ ఎపిసోడ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
పెళ్లికి ముందు భర్త చేసిన పనికి షాక్ అయిన హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే సోహల్ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. టాటూ వేసే సమయంలో ఆయన హన్సికకు వీడియో కాల్ చేయగా సోహెల్ చేసిన పనికి హన్సిక షాక్ అయ్యింది. ఓ ఇంజెక్షన్ తీసుకోవడానికే చాలా బాధపడతాను. అలాంటిది సోహెల్ నా పేరుమీద టాటూ వేయించుకున్నాడు అని చెబుతూ హన్సిక ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
పెళ్లిలో కన్యాదానం చేయనన్న తల్లి, ఏడ్చేసిన హన్సిక
హన్సిక పెళ్లి సందడి 'లవ్ షాదీ డ్రామా' పేరుతో హాట్స్టార్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజవగా అందులో హల్దీ, మెహందీ ప్లానింగ్ను చూపించారు. తాజాగా రిలీజైన మూడో ఎపిసోడ్లో హన్సిక, సోహైల్ డ్రెస్సింగ్ సెలక్షన్ను, మంగళసూత్రం ఎంపికను చూపించారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెళ్లి వేడుకలను షురూ చేశారు. పూజ అనంతరం హన్సిక జంట డ్యాన్సులతో హడావుడి చేసింది. మరోవైపు కన్యాదాయం చేయనని తల్లి చెప్పడంతో భావోద్వేగానికి లోనైంది హీరోయిన్. ఒకరికి దానమివ్వడానికి నువ్వేం ఒక వస్తువు కాదని, కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తానంది. 30 సంవత్సరాలు గుండెలకు హత్తుకుని పెంచుకున్న కూతురిని ఎవరికైనా దానమిచ్చేయాలంటే ఎలా మనసొప్పుతుంది, నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు అంటూ ఎమోషనలైంది ఆమె తల్లి. ఆ మాటలు విని హన్సిక కన్నీటిపర్యంతమైంది. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు గర్వంగా ఉంది. నువ్వు కన్యాదానం చేసినా చేయకపోయినా ఈ కన్య నీతోనే ఉంటుంది అంటూ ఏడ్చేసింది హీరోయిన్. -
హీరోతో లవ్ బ్రేకప్.. పెదవి విప్పిన హన్సిక!
హీరోయిన్ హన్సిక మొత్వానీ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ను పెళ్లాడింది. డిసెంబర్ 4న గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందడి హాట్స్టార్లో లవ్ షాదీ డ్రామా పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. సోహైల్కు ఇది రెండో వివాహం కాగా హన్సికకు ఇది రెండో లవ్.. అర్థం కాలేదా? గతంలో ఈ బ్యూటీ శింబుతో డేటింగ్ చేసింది. కొంతకాలం బాగానే ఉన్న ఈ లవ్ బర్డ్స్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ విషయాలను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వేరేవారికి ఎస్ చెప్పడానికి నాకు ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమను నమ్ముతాను, కానీ రొమాంటిక్ పర్సన్ అయితే కాదు. అంత ఈజీగా అన్ని ఎమోషన్స్ను వ్యక్తపరచలేను. నాతో కలకాలం ఉండాలనుకుంటున్న వ్యక్తికి ఓకే చెప్పడానికి నేను చాలా సమయమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్షిప్ విచిత్రంగా సాగింది. అయినా ఇప్పుడది ముగిసిన కథ' అని చెప్పుకొచ్చింది. కాగా సోహైల్ మొదటి పెళ్లి పెటాకులవడానికి కూడా హన్సికే కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పేరెంట్స్కు చెన్నైలో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ధనుష్ -
త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక?
హీరోయిన్స్ అందాన్ని పొగిడేవారితో పాటు ఆ అందానికి ఏదో ఇంజక్షన్సో లేదా సర్జరీనో కారణమై ఉంటుందని విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. హన్సిక కూడా ఇలాంటి ఇంజక్షన్స్ ఏదో తీసుకునే ఉంటుందని ఆమధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. హాట్స్టార్లో ప్రసారమవుతున్న లవ్ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్లో ఆ రూమర్లను కొట్టిపారేసింది. 'సెలబ్రిటీగా ఉండటం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చాలామంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. చాలామంది నేను త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్నానని రాశారు. 8 ఏళ్లకే నేను నటినయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి నన్ను త్వరగా పెద్దది చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు?' అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. హన్సిక తల్లి మధ్యలో అందుకుంటూ.. 'అదే కనక నిజమయ్యుంటే నేను టాటా, బిర్లాల కంటే ధనవంతురాలినయ్యేదాన్ని. మీరు కూడా అలా త్వరగా ఎదిగే చిట్కా చెప్పమని నా దగ్గర క్యూ కట్టేవారు. అయినా అలా రాయడానికి కాస్తైనా కామన్సెన్స్ వాడరా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు మృతి -
నా భర్త విడాకులకు కారణం నేను కాదు: హన్సిక ఎమోషనల్
డిసెంబర్ 4, 2022న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే తాజాగా వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హన్సిక తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీత్ చేసింది. అయితే హన్సిక పెళ్లికి ముందు జరిగిన అనుభవాలను లవ్ షాదీ డ్రామాలో వెల్లడించింది. సోహైల్ను పెళ్లి చేసుకునే వరకు అత్యంత సీక్రెట్గా ఉండేందకు ప్రయత్నించినట్లు తెలిపింది హన్సిక. కానీ మీడియాకు ఎలా లీకవుతున్నాయో అని తీవ్ర అసహనానికి గురైంది. ఇంకా తన జీవితంలో హన్సిక తల్లి ఆమెకు అన్ని విధాలా వెన్నెముకలా నిలిచిందని చెప్పుకొచ్చింది బ్యూటీ. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే సోహైల్కు గతంలోనే వివాహమైందని, అతడు తన భార్య నుంచి విడిపోవడానికి తానే కారణమని ఎన్నో వార్తలు బయటకు వచ్చిన విషయాన్ని హన్సిక ఈ వీడియోలో ప్రస్తావించింది. తన పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. హన్సిక మాట్లాడుతూ.. 'నా పెళ్లి అయ్యే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చాయి. అది నాకు నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్ గురించి రాసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా. అలాంటి టైంలో అమ్మ, నా సోదరుడి సలహాతో ఫస్ట్ టైం మా ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశా. సోహైల్ పారిస్లో ప్రపోజ్ చేసిన ఫొటోలు చూసి అందరూ కంగ్రాట్స్ అన్నారు. అప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. అన్ని ఓకే అనుకున్నాక తిరిగి షూటింగ్స్ కోసం చెన్నై వెళ్లా. అప్పుడే సోహైల్కు గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలొచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్ చేస్తూ.. సోహైల్ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణమని రాశారు. నిజంగా ఆతని గతం నాకు తెలుసు. కానీ.. విడాకులతో నాకు సంబంధం లేదు' అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లవ్ షాదీ డ్రామాలో హన్సిక పెళ్లికి ముందు సంఘటనలను చూపించారు. -
ఇతనా నా లైఫ్ పార్ట్నర్.. హన్సిక ఎమోషనల్
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలే వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే హన్సిక ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది ఈ జంట. హన్సికన తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ చేయనుంది. ట్రైలర్ చూస్తే కతురియాతో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ఇన్ని రోజులు తన చుట్టే తిరిగిన ఇతనేనా లైఫ్ పార్టనర్ అని అనిపించిందని హన్సిక అన్నారు. తాను చాలా ఎమోషనల్ పర్సన్ అంటూ ట్రైలర్లో చెప్పుకొచ్చారు. అలాగే సోహెల్ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక చేసిన పోరాటం ఏంటో ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. హన్సిక జీవితంలో ఈ ఎమోషనల్ జర్నీని లవ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక
తమిళ సినిమా: సినిమా కెరీర్ను చక్కగా ప్లాన్ చేసుకున్న నటీమణుల్లో హన్సిక ఒకరని చెప్పవచ్చు. ఈ ముంబాయి భామ దక్షిణాదినే ఎక్కువగా చిత్రాలు చేసి పేరు తెచ్చుకుంది. గ్లామర్నే నమ్ముకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికీ 50 చిత్రాలకుపైగా నటించింది. కెరీర్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుంది. సోహైల్ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పెళ్లి జరిగింది. ఒకపక్క వివాహ జీవితాన్ని అనుభవిస్తూనే నటనకు సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ఈ అమ్మడు చెన్నైకి చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. మీడియా హన్సికను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చెన్నైలో అడుగుపెట్టగానే పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని పేర్కొంది. 2022 సంవత్సరం తనకు చాలా లక్కీ అని.. ప్రస్తుతం తాను అంగీకరించిన 7 చిత్రాలు చేతిలో ఉన్నాయని చెప్పింది. పూర్తి చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొంది. తన వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. నెల రోజులపాటు చెన్నైలోనే ఉండి చిత్రాలను పూర్తి చేస్తానని వెల్లడించింది. -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
పెళ్లైనా తగ్గేదేలే.. హన్సిక అందాల ఆరబోత మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
ఆ విషయంలో నయనతార కంటే స్పీడుగా ఉన్న హన్సిక
స్టార్ హీరోయిన్ నయనతార కంటే హన్సిక ముందంజలో ఉంది. హన్సికతో లేడీ సూపర్స్టార్ నయనతారతో పోలికేంటి? అసలీ కహానీ ఏంటనుకుంటున్నారా? ఈ ముద్దుగుమ్మలిద్దరూ క్రేజీ హీరోయిన్లే. ఇద్దరూ బహుభాషా నటీమణులే. ఇద్దరూ ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను చవిచూసినవాళ్లే. ఇంకా చెప్పాలంటే నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార స్టార్ ఇమేజ్ కాస్త ఎక్కువంతే. చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.ఇద్దరి పెళ్లిళ్లు ధూమ్ధామ్గా జరిగాయి. ఆ పెళ్లిళ్లతో ఇద్దరూ సొమ్ము చేసుకున్నారు. నయనతార విఘ్నేశ్తో పెళ్లి తతంగం అంతా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగింది. అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్ను ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగింది. వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటి నయనతార పెళ్లి జరిగి ఏడు నెలలు పైగా అవుతోంది. ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది. అలా ఈ భామ నయనతార కంటే ముందంజలో ఉందన్నమాట! View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పెళ్లి తర్వాత హన్సిక తొలి పండుగ.. ఎలా సెలబ్రెట్ చేసుకుందంటే!
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతామని చెప్పారు. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... ‘సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది’ అని చెప్పుకొచ్చింది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ ‘పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపింది. -
బాప్ రే.. హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా?
‘దేశముదురు’ ఫేం హన్సిక మోత్వాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో డిసెంబర్ 4న హన్సిక పెళ్లి ఘనంగా జరిగింది.జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. బ్యాచిలర్ పార్టీ, మెహందీ, హల్డీ, ప్రీవెడ్డింగ్, పెళ్లి.. ఇలా ఏ విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా హన్సిక ఖర్చి చేసిందట. ఇప్పుడు హన్సిక పెళ్లి ఖర్చు నెట్టింట వైరల్ అవుతోంది. బ్యాచిలర్ పార్టీ మొదలు పెళ్లి వరకు దాదాపు రూ.20 కోట్ల వరకు హన్సిక ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో పెళ్లి దుస్తులకు కూడా ఎక్కువే ఖర్చు చేశారట. సూఫీ రాత్రి కోసం హన్సిక ధరించిన గోల్డెన్ లెహంగా ఒక్కటే దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. హాన్సికా పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది అనేది వాస్తవం. -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్లైట్లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్లైట్లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
అది మరిచిపోలేని క్షణం.. హన్సిక తల్లి ఎమోషనల్
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా కూతురి వివాహంపై హన్సిక తల్లి ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!) హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. 'నేను అదృష్టవంతురాలిని. హన్సికను చూసి సంతోషంతో పొంగిపోయా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ సంతోషంగా వివాహం చేసుకోవడమే మరిచిపోలేని క్షణం. సరైన సమయంలో మంచి వరుడు దొరికాడు. నేను చెప్పాల్సింది ఒక్కటే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. హన్సిక తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించాం. ఇంత మంచి కుటుంబం దొరకడం కూడా మన అదృష్టం. మంచి మనిషిగా ఉండటం చాలా ముఖ్యం.' అంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తర్వాత హన్సిక ప్లాన్పై ఆమె మాట్లాడారు. హన్సిక హాట్స్టార్ కోసం ఏడు సినిమాలు, రెండు వెబ్ షోలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె మునుపటిలానే బిజీగా ఉండబోతోందని మోనా వివరించింది. -
ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు వేశారు. జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు.. ఎన్జీఓలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథ పిల్లలను కూడా పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు హన్సిక. అలాగే వివాహం జరుగుతున్న ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు ఆదివారం ఆమె విందు ఏర్పాటు చేయించారు. దీనిపై అటు ఫ్యాన్స్, నెటిజన్లు హన్సికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) -
కాబోయే భర్తతో హన్సిక డ్యాన్స్, వీడియో వైరల్
దేశముదురు హీరోయిన్ హన్సిక మొత్వానీ మరికొద్ది గంటల్లో శ్రీమతి హన్సికగా మానుంది. ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ ముగియగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబైన హన్సిక తనకు కాబోయే భర్త, వ్యాపారవేత్త సోహైల్తో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సోహైల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. కాగా హన్సిక, సోహైల్ వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్లోని జైపూర్ ముండోటా ప్యాలెస్లో జరగనుంది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya) View this post on Instagram A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya) చదవండి: ఆర్ఆర్ఆర్ షూటింగ్లో అనారోగ్యంతో ఇబ్బందిపడ్డ రాజమౌళి బిగ్బాస్: టికెట్ టు ఫినాలే గెలిస్తే ట్రోఫీ గెలవలేరా? -
గ్రాండ్గా హన్సిక బ్యాచ్లర్ పార్టీ.. గ్రీస్ వీధుల్లో హల్ చల్
నటి హన్సిక మోత్వాని వచ్చేనెలలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమె వ్యాపారవేత్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే అతనికి పెళ్లై విడాకులు తీసుకున్నారు. జైపూర్లోని ఓ పురాతన కోట వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. అంతేకాక హన్సిక పెళ్లి వేడుకను ఓటీటీలోనూ ప్రసారం చేయనున్నారు. (చదవండి: హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!) తాజాగా పెళ్లికి ముందు జరుపుకునే బ్యాచ్లర్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది భామ. తన స్నేహితులతో కలిసి వీధుల్లో తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్రీస్లో పార్టీ చేసుకున్న వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేస్తూ..'బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్' అంటూ పేర్కొంది. హన్సికతో పాటు నటి శ్రీయా రెడ్డి, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ వెనుక భాగంలో 'పెళ్లికూతురు' అని రాసి ఉంది. హన్సిక వివిధ రకాల దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చింది. రెస్టారెంట్లో కుర్చీలపై నిలబడి డ్యాన్స్ కూడా చేశారు ముద్దుగుమ్మ. ఇప్పటికే హన్సిక తన వివాహ వేడుకల్లో భాగంగా 'మాతా కి చౌకీ' కార్యక్రమంలో కాబోయే భర్తతో పూజలో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆమె సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. ఇప్పటికే హన్సిక పెళ్లిసందడి మొదలైంది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' ముంబైలో నటి నివాసంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. (చదవండి: హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!) హన్సిక, సోహైల్ కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ జంట వ్యాపారంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న జంట పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. మరోవైపు సోహైల్కు గతంలోనే హన్సిక స్నేహితురాలు రింకీని వివాహం చేసుకోగా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Bollywoodflash (@bollywoodflash01) -
హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. (చదవండి: హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!) తాజాగా హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హన్సిక మోత్వానీ సోహెల్ ఖతురియాతో పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు హన్సిక ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తండగా కెమెరాకు చిక్కింది. ముంబైలో జరుగుతున్న ఈ వేడుకలో హన్సిక మోత్వాని ఎరుపు రంగు చీరలో అచ్చం వధువులా తయారైంది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరుగునున్నాయి. వీటితో పాటు, పోలో మ్యాచ్, క్యాసినోతో కూడిన పార్టీ కూడా జరగనుంది. -
త్వరలో పెళ్లి! మూవీ యూనిట్తో కలిసి అమ్మవారి దర్శనం
నటి హన్సిక పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఈమె పెళ్లికి సిద్ధమవడమే. డిసెంబర్ 4వ తేదీన హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఆదివారం చెన్నైలోని కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం యూనిట్ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. తాజాగా హన్సిక్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో మెట్రో సిరీష్ , మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ప్రజిత, పవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న 10వ చిత్రం ఇది. ఈమె చిత్ర షూటింగ్ను ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ముందుగా హన్సికతో పాటు చిత్ర యూనిట్ కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎమోషనల్తో కూడిన హార్రర్, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ను నిర్విరామంగా ఈ నెలపాటు నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. #Hansika did Dharshan at the famous #KaligaambaalTemple in Chennai today before shooting for @Dir_kannanR ‘s emotional horror thriller. For the very first time, #Hansika does dual role in this film produced by @MasalaPix @johnsoncinepro pic.twitter.com/tlgEoBIEzp — Ramesh Bala (@rameshlaus) November 13, 2022 -
హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హన్సిక పెళ్లిపై ఓ వార్త వైరలవుతోంది. హన్సిక వివాహా వేడుకను ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. (చదవండి: కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్) అయితే యాపిల్ బ్యూటీ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది సన్నిహితులు, వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిసెంబర్ 2వ తేదీన సూఫీ, 3వ తేదీన మెహందీ, సంగీత వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 4వ తేదీ పెళ్లి వేడుక సందర్భంగా క్యాసినో నేపథ్యంతో కూడిన పార్టీని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. -
కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహెల్ ఖతూరియాతో డిసెంబర్లో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల హన్సిక కాబోయే భర్తను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హన్సిక, ఆమె కాబోయే భర్త గురించిన పలు ఆసక్తిక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హన్సిక ఆమె ప్రియుడు వార్తల్లోకెక్కారు. వీరిద్దరి పర్సనల్ ఫొటో ఒకటి తాజాగా లీకైంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. దీంతో ఈ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ బోట్లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటో తను షేర్ చేసింది కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు హన్సిక, సోహెల్ పిక్పై క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్తో స్పందిస్తున్నారు. కాగా రాజస్థాన్ జైపూర్లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. చదవండి: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే View this post on Instagram A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal) -
హన్సిక మోత్వాని.. అతనితో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. పారిస్లోని ఈఫిల్ టవర్లో వద్ద దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి, ఖుష్బు సుందర్తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ఆర్టిస్టులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ నటీనటులు ఏదో ఒక రూమర్లు రావడం సహజం. గతంలో హన్సిక మోత్వాని కోలీవుడ్ హీరో శింబుతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హన్సిక మోత్వాని తన రిలేషన్షిప్ గురించి ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆమె తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'నా వ్యక్తిగత జీవితం గురించి చాలా పుకార్లు వింటున్నా. కానీ నాకు స్పష్టత ఉంది. అందుకే నేను వాటి మాట్లాడటానికి ఇష్టపడను.' అంటూ పోస్ట్ చేశారు. (చదవండి:హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?) గతంలో శింబు ఇలా వ్రాశాడు. 'అవును. నేను హన్సికతో డేటింగ్లో ఉన్నాను. త్వరలోనే మా పెళ్లిని మా కుటుంబం నిర్ణయిస్తుంది. మీరు మా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నా. హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని ఉండాలనుకుంటున్నా. నా తల్లిదండ్రుల అనుమతితో, నేను హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుంటా. అజిత్, షాలిని లాగా మేమిద్దరం సంతోషంగా జీవితాన్ని గడుపుతాము.' అని ఓ ఇంటర్వ్యూలో శింబు తెలిపారు. (చదవండి: రిషబ్ శెట్టిని కలిసిన లెజెండ్ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్) హన్సిక, శింబు తమ రిలేషన్ గురించి 2013లో అధికారికంగా ప్రకటించి అభిమానులను షాక్కు గురిచేశారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చినా ఆ తర్వాత ఈ జంట విడిపోయినట్లు ప్రకటించారు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు. హన్సిక తన కెరీర్లో ఓ వివాదాన్ని ఎదుర్కొన్నారు. 2019లో ఆన్లైన్ హ్యాకింగ్కు గురయ్యారు. హన్సిక మోత్వాని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కానీ ఆ చిత్రాలు వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించారు. -
హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్లోఊ ఇద్దరూ పార్ట్నర్స్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్ఫ్రెండ్ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్లోని ఓ ప్రముఖ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆ హీరోయిన్ తో లవ్ నిజమేనా?
-
తెగ ఫీలవుతున్న హన్సిక ఫ్యాన్స్
-
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పనున్న హన్సిక?
'దేశ ముదురు' సినిమాతో టాలీవుడ్కు పరిచయమై ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హన్సిక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రియుడు సోహెల్ ఖతురియాతో వచ్చే నెలలోనే ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన హన్సిక కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత హన్సిక నటనకు గుడ్బై చెప్పనుందా లేదా కంటిన్యూ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన హన్సిక పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేసింది. పని చాలా విలువైనదని, వివాహం తర్వాత కూడా హీరోయిన్గా కొనసాగుతానని పేర్కొంది. హన్సిక చివరగా ‘మహా’అనే చిత్రంలో నటించింది. -
హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వరుడు ఎవరన్నది క్లారిటీ లేదు. సినీ ఇండస్ట్రీకి చెందినవాడా? కాదా? ఇంకేవరంటూ అందరిలో సందేహం నెలకొంది. ఈ క్రమంలో తన కాబోయే భర్తను పరిచయం చేసి అందరి సందేహాలు తీర్చింది ఈ భామ. వరుడి పేరు సోహెల్ ఖత్తూరియా అని కూడా వెల్లడించింది. ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్గా త్రోబ్యాక్ వీడియో ‘ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా.. నౌ ఫరెవర్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో హన్సిక్ పెళ్లి ఎవరిని చేసుకొనున్నది అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోహైల్ ఏం చేస్తుంటాడనేది ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు అతను ఎవరు, ఎక్కడి వాడు అంటూ హన్సిక్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సోహెల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. సోహెల్, హన్సిక మంచి స్నేహితులు. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి అదే స్నేహంతో సోహెల్, హన్సికను తన బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేశారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం పెరిగిందని, అదే ప్రేమగా మారిందని తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నౌ అండ్ ఫరెవర్.. ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా
నటి హన్సిక మరోసారి వార్తల్లో కెక్కింది. ఇంతకుముందు సినిమాకు సంబంధించిన వార్తలతోనూ, వదంతులతోనూ వార్తల్లో నానిన ఈ ముంబయి బ్యూటీ ఇప్పుడు వ్యక్తిగత విషయంతో తనే స్వయంగా వార్తల్లోకి వచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ కథానాయికగా రాణిస్తున్న హన్సిక మత్వాని ఈ రెండు భాషల్లోనూ ప్రముఖ నటులతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో బొద్దుగా..ముద్దుగా కనిపించిన హన్సిక ఆ తరువాత వర్కౌట్ చేసి స్లిమ్గా తయారైంది. ఈ చిన్నది చిక్కినా చక్కగానే ఉందంటూ దర్శక, నిర్మాతలు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తూ్తనే ఉన్నారు. అలా 50 చిత్రాలను అవలీలగా పూర్తి చేసిన ఈ అమ్మడికి ఇప్పట్లో చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపిన హన్సిక ఆయనతో పెళ్లిపీటల వరకు వెళ్లాలని భావించింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు కారణంగా బ్రేకప్ అయ్యింది. అయిననూ పక్కా ప్రొఫషనలిస్ట్ అయిన హన్సిక తన 50వ మహా చిత్రంలో మాజీ ప్రియుడు శింబుతో రొమాన్స్ చేసింది. ఆ తరువాత పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నేను సంతోషంగానే ఉన్నాగా ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అలాంటిది అనూహ్యంగా ఇటీవల నటి హన్సిక ప్రేమ, పెళ్లి గురించి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అది చాలా స్పెషల్గా, రొమాంటిక్గా ఈ అమ్మడు వ్యాపారవేత్త సోహైల్ ఖత్తూరియా అనే వ్యక్తితో చాలాకాలంగా లవ్లో ఉన్నట్లు సమాచారం. వీటిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయని హన్సిక బుధవారం తన ప్రియుడు గురించి ఒక్కసారిగా బ్లో అప్ అయ్యింది. ఈ క్రమంలోనే బుధవారం ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ వద్ద మతాబుల వెలుగుల మధ్య అందమైన పువ్వులతో ముస్తాబు చేసిన లవ్ సింబల్ మధ్య తన కాబోయే జీవిత భాగస్వామితో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ప్రియుడు మోకాలుపై నిలబడి హన్సిక చేతిని పట్టుకోగా ఆమె ప్రేమైక వదనంతో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాన్ని పొందుపరిచారు. అందులో ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా, నౌ ఫరెవర్ అని పేర్కొంది. అలా తన ప్రియుడిని పరిచయం చేసి వదంతులకు పుల్స్టాప్ పెట్టింది. కాగా వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇద్దరి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక.. ఫోటోలు వైరల్
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక చెప్పింది. దీంతో హన్సికకు కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్కి పరిచయం చేసింది హన్సిక. ఈఫిల్ టవర్(పారిస్)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో అతను హన్సికకు ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం తెలుపుతూ హగ్ చేసుకుంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హన్సిక పెళ్లి రాజస్తాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్లో డిసెంబర్ 4న జరగనుంది. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పెళ్లి పీటలు ఎక్కనున్న హన్సిక.. వరుడు ఎవరో తెలిసిపోయింది
హీరోయిన్ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు తెలుస్తోంది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్4న వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైనట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. రాజస్థాన్ జైపూర్లోని ముండోటా ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందట. ఇక హన్సిక ప్రియుడు సోహాల్ కతూరియా విషయానికి వస్తే.. ముంబైలోని బడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. చాలాకాలం నుంచి హన్సికకు అతనితో మంచి అనుబంధం ఉందట. అంతేకాకుండా అతని కంపెనీలోనూ హన్సిక షేర్స్ ఉన్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతకాలంగా డేటింగ్లో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్యాలెస్లో జరగనున్న పెళ్లి వేడుక కోసం ఇప్పటికే గదులు కూడా బుక్ చేసినట్లు సమాచారం. -
ప్రముఖ వ్యాపారవేత్తతో హీరోయిన్ హన్సిక వివాహం?
నటి హన్సిక పెళ్లికి సిద్ధమైనట్లు, డిసెంబర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్తరాది బ్యూటీ ధనుష్ జంటగా వప్పిళ్లై త్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయ్, ఆర్య, శింబు వంటి స్టార్ హీరోలతో జత కట్టి ప్రముఖ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అలాగే తెలుగులోనూ ప్రముఖ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్న హన్సిక నటిగా అర్ధ శతకం దాటేసింది. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపి, పెళ్లికి కూడా సిద్ధమైపోయింది. అయితే భేదాభిప్రాయాల కారణంగా శింబుతో పెళ్లి పీటలు దాకా వెళ్లలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దరంగా ఉంటూ నటనపై దృష్టి సారించింది. ఇటీవల పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఇప్పుడు పెళ్లికి తొందర ఏముంది? నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని బదులిచ్చిన హన్సిక సడన్గా పెళ్లికి రెడీ అవుతుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు, డిసెంబర్లో వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. హన్సిక పెళ్లి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్లో జరగనుందని, దీంతో ఆ ప్యాలెస్ను అలంకరించే పనిలో హన్సిక కుటుంబం ఉందని, ఎక్కువ సమయం లేకపోవడంతో పెళ్లి కార్యక్రమాలు హడావుడిగా నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే హన్సిక పెళ్లి గురించి ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎ లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
హన్సిక రాయల్ వెడ్డింగ్, పెళ్లి జరిగేది ఎక్కడంటే?
ఇండస్ట్రీలో అర్ధసెంచరీ కొట్టేసింది హన్సిక. ఇప్పటివరకు ఆమె 50 సినిమాల్లో నటించింది. అంతేనా? వర్క్ చేస్తున్న కొద్దీ తనకు ఊపొస్తుందంటూ వరుస పెట్టి చిత్రాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో దాదాపు పది సినిమాలు హ్యాండిల్ చేస్తూ యమ జోరు మీదుంది. వర్క్ విషయంలో సంతృప్తిగా ఉన్న హన్సిక ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేసిందట. మొన్నటివరకు ఇప్పుడప్పుడే పెళ్లెందుకు? అని మాట దాటేసిన ఈ హీరోయిన్ డిసెంబర్లో ఆ తతంగాన్ని జరిపించేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జైపూర్లో 450 ఏళ్ల చరిత్ర ఉన్న ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ను అడ్వాన్స్గా బుక్ చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏమేం చేయాలో ఇప్పటినుంచే ప్లాన్లు వేసుకుంటున్నారట. అంటే తన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు హన్సిక ఇప్పటినుంచే రెడీ అవుతోందన్నమాట! పెళ్లి తేదీ, వరుడి వివరాలు తెలియాలంటే మాత్రం హన్సిక స్వయంగా నోరు విప్పేవరకు ఆగాల్సిందే! View this post on Instagram A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace) View this post on Instagram A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace) View this post on Instagram A post shared by Mundota Fort & Palace, Jaipur (@mundotapalace) చదవండి: ప్రభుత్వానికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన నయన్- విఘ్నేశ్ ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి, వీడియో చూశారా? -
ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సంవత్సరం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో హన్సిక ఒకరు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మిగతా సినిమాలను ఓ పట్టు పట్టనుంది. ఇదిలా ఉంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మహ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 10 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. శ్రీకాంత్, శింబు ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. మరి ఓటీటీలో ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి! Missing!! Maha's daughter is missing!! Find out #MahaOnAHA Premieres September 10.@SilambarasanTR_ @ihansika @MathiyalaganV9 pic.twitter.com/ouDeKqDHtr — ahavideoin (@ahavideoIN) September 7, 2022 చదవండి: రణ్బీర్ - ఆలియాకు చేదు అనుభవం బిగ్బాస్కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డుకున్నారు -
మెరుపు తీగలా తయారైన హన్సిక!
సినిమా రంగం గ్లామర్ ప్రపంచం. స్టార్ హీరోయిన్ల నుంచి వర్ధమాన హీరోయిన్ల వరకూ స్కిన్ షో ప్రదర్శిస్తుంటారు. హీరోయిన్ హన్సిక కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ముంబై బ్యూటీ ఆది నుంచి దక్షిణాదినే నమ్ముకుంది. కోలీవుడ్లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రంతో పరిచయం అయ్యింది. బొద్దుగా, ముద్దుగా ఉంటే ఈ అమ్మడిని చిన్న కుష్బూ అని పిలిచేవారు. అలాంటి ఇమేజ్తో పలు చిత్రాలు చేసిన హన్సికకు ఒక దశలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందంపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు వర్కౌట్స్ చేసి బాగా చిక్కింది. దీంతో మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. అయితే సక్సెస్ మాత్రం దరి చేరడం లేదు. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకుని శింబుతో కలిసి హీరోయిన్ సెంట్రిక్ కథాచిత్రంలో నటించిన మహా చిత్రం నిరాశ పరచింది. ఇది హన్సిక అర్ధ సెంచరీ చిత్రం కూడా. తాజాగా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇటీవలే పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న హన్సిక, పొట్టి దుస్తులు ధరించి నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సముద్ర తీర ప్రాంతంలో అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. కావలసినంత తీరిక దొరకడంతో ఇలా అందం చూడవయా ఆనందించడయా అంటూ ఎంజాయ్ చేస్తూ అవకాశాల వేట మొదలెట్టిందంటూ నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. -
పెళ్లిపై హీరోయిన్ హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు
పెళ్లెందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది హన్సిక. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. హన్సిక నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం మహా. అంతే కాకుండా ఈమె నటించిన 50వ చిత్రం ఇది కావడం విశేషం. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.మదియళగన్ నిర్మించిన ఈ చిత్రానికి యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. నటుడు శింబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం అతి త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి హన్సిక సోమవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. మహా చిత్రాన్ని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ? చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది కథ. రెండోది నేను నటిస్తున్న తొలి లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. మూడోది నా 50 వ చిత్రం. ఇందులో ఒక బిడ్డకు తల్లిగా నటించాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర. నేను ఇంత వరకు చేయనటువంటి పాత్ర. నటనకు అవకాశంతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన పాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మహాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పాత్రను చేయడం చాలా ఛాలెంజ్ అనిపించింది. చిత్రం చాలా బాగా వచ్చింది. నా సినీ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోతుంది. చిత్రం విడుదలలో జాప్యానికి కారణం? నేను మాత్రం కాదు. చాలా కారణాలున్నాయి. అందులో కోవిడ్ కూడా ఒక కారణం. కరోనా కారణంగా ప్రపంచానికే పెద్ద గ్యాప్ వచ్చింది. కరోనా కాలంలో మీరు బోర్గా ఫీల్ అయ్యారా? లేదు. నేను ఎప్పుడు ఖాళీగా ఉండను. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను. అదే నాకు ఎనర్జీ ఫైర్ ఇస్తుంది. మధ్యలో ఒక వెబ్సిరీస్ను చేశాను. అందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇది రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? మహా నా 50వ చిత్రం. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో 10 చిత్రాలు చేస్తున్నాను. ఈ ఏడాది వరుసగా చిత్రాలు చేస్తున్నాను. ఏ తరహా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు? ఏ నటి అయినా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలని చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాకు అలాంటి అవకాశాలే వస్తున్నాయి. అయితే కథలను బట్టే నా ఎంపిక ఉంటుంది. అర్ధసెంచరీ సినిమాలు దాటేశారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు? పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికీ వర్క్తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. -
సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్తో హన్సిక '105 మినిట్స్'..
Hansika Motwani 105 Minutes Is Single Shot Film: క్యూట్ అండ్ బొద్దుగుమ్మ హన్సిక వరుస సినిమాలతో మళ్లీ బిజీ కానుంది. దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్క్ బ్యూటీ సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మళ్లీ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో తన చిత్రాలతో అలరించనుంది. హన్సిక ప్రస్తుతం ఏకంగా 9 సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ‘పార్ట్నర్’, ‘రౌడీ బేబీ’, 'మై నేమ్ ఈజ్ శ్రుతి', ‘105 మినిట్స్’, ‘మహా’, ఒక ఓటీటీ ప్రాజెక్ట్, ఇంకా పేరు ఖరారు కాని మూడు చిత్రాలు.. ఇవీ హన్సిక చేతిలో ఉన్నవి. ఈ చిత్రాల్లోని '105 మినిట్స్' సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. టైటిల్ తగినట్లుగానే 105 నిమిషాలు ఉన్న రన్టైమ్ ఉన్న ఈ మూవీ మొత్తాన్ని సింగిల్ షాట్లోనే చిత్రీకరించారట. అంతేకాకుండా ఈ సినిమాలో ఒకే ఒక్క (సింగిల్) పాత్ర మాత్రమే ఉందని సమాచారం. భారతదేశంలోనే తొలిసారిగా ఈ సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్తో ప్రయోగాత్మకంగా తెరకెక్కింది ‘105 మినిట్స్’. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో థ్రిల్లర్గా ఈ మూవీని డైరెక్ట్ చేశారు రాజు దుస్సా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, గ్లింప్స్కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ ఈ మూవీని నిర్మించారు. -
మారిందేమో నా రాత!
హీరోయిన్ హన్సిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట..’ అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. మార్క్ రాబిన్ సంగీతం అందించారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మై నేమ్ ఈజ్ శృతి’ లాంటి ఇంటెన్స్ స్టోరీని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలోని ట్విస్ట్లు ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రమ్యా ప్రభాకర్. ‘మనిషి చర్మం వొలిచి వ్యాపారం చేసే గ్యాంగ్తో ఓ యువతి చేసే పోరాటమే మా చిత్రం’’ అని శ్రీనివాస్ ఓంకార్ అన్నారు. -
హన్సిక ప్రధాన పాత్రలో సైన్స్ ఫిక్షన్ చిత్రం
సాక్షి, చెన్నై: చిన్న గ్యాప్ తరువాత నటి హన్సిక మళ్లీ కోలీవుడ్లో బిజీ అవుతున్నారు. తాజాగా సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్ మహీంద్ర నిహార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇందులో నటి హన్సిక, నేత్ర అనే యువ సైంటిస్ట్గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ తెలిపారు. చిత్రం కోసం స్థానిక ఈసీఆర్ రోడ్లో భారీ ఖర్చుతో సైన్స్ ల్యాబ్ సెట్ వేసినట్లు చెప్పారు. చిత్రంలోని గ్రాఫి క్స్ సన్నివేశాలు కోసం ప్రముఖ యానిమేషన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఛాయాగ్రహణం, సిద్ధార్థ్ సుభావెంకట్ డైలాగ్స్ రాస్తున్నట్లు వెల్లడించారు. -
సినిమా ప్రతి ఒక్కరికీ అవసరం: మంత్రి తలసాని
‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హన్సిక లీడ్ రోల్లో డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ‘ది హిడెన్ ట్రూత్’ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ‘అఖండ, పుష్ప’ సినిమాల రాకతో ఇండస్ట్రీ కొంత పుంజుకుంది. చిత్ర పరిశ్రమ ఇంకా పుంజుకోవాలని తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంతో పాటు 5వ ఆటకు అనుమతి ఇచ్చాం. షూటింగ్ల పర్మిషన్ కోసం సింగిల్ విండో విధానాన్ని ఓకే చేశాం. తెలంగాణలో ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పరిస్థితులు ఉధృతంగా ఉంటే ఆంక్షలు విధిస్తాం. త్వరలోనే ఆన్లైన్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను. ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ– ‘‘ శరీర అవయవాల మాఫియా నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్తో తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి సినిమా తీసే చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మా చిత్రం చాలా బాగుంటుంది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు హన్సిక. ‘‘ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొంది? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు ప్రభాకర్ గౌడ్. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పవన్కుమార్ బండి, ఏజీ ఎలియస్, నాగేందర్ రాజు, లైన్ ప్రొడ్యూసర్: కె. విజయ్కుమార్. -
ఒకటీ, రెండు కాదు హన్సిక చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలు!
ఒకటి కాదు.. రెండు కాదు... ప్లాన్ చేసిన ప్రకారం జరిగితే హన్సిక ఈ ఏడాది నైన్ ప్రాజెక్ట్స్లో కనిపిస్తారు. ఇది ఆమె అభిమానులు ఆనందపడే న్యూస్. ‘పార్ట్నర్’, ‘రౌడీ బేబీ’, 'మై నేమ్ ఈజ్ శ్రుతి', ‘105 మినిట్స్’, ‘మహా’, ఒక ఓటీటీ ప్రాజెక్ట్, ఇంకా పేరు ఖరారు కాని మూడు చిత్రాలు.. ఇవీ హన్సిక చేతిలో ఉన్నవి. ఇన్ని సినిమాల్లో కనిపించనున్నారు కాబట్టే 2022 తనకు చాలా ప్రత్యేకం అంటున్నారామె. ఇంకా హన్సిక మాట్లాడుతూ – ‘‘గడిచిన రెండేళ్లు అందరికీ ఓ పెద్ద సవాల్. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చాలా క్లిష్టమైన పరిస్థితి. 2022లో పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకంతో ఉన్నాం. నా వరకూ వస్తే చేతిలో తొమ్మిది సినిమాలు ఉండటం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ఈ సినిమాల్లో కొన్ని షూటింగ్ దశలో, విడుదలకు సిద్ధమయ్యే దశలో ఉన్నాయి. ఎంతో పాజిటివ్గా ఉంది. ఆ మాటకొస్తే.. ఇప్పుడు (కరోనా పరిస్థితుల్లో) అందరం పాజిటివ్గా ముందుకు సాగడం అవసరం. ఆ పాజిటివిటీయే మనల్ని నడిపిస్తుంది’’ అన్నారు. -
హీరోయిన్ లేటెస్ట్ పిక్, వావ్ అంటున్న ఫ్యాన్స్
సాక్షి, ముంబై: బొద్దుగుమ్మలుగా అలరించిన స్టార్ హీరోయిన్లు ఇపుడు సన్నజాజి తీగల్లా మరింత మెరిసి పోతున్నారు. భారీ కసరత్తు, యోగాసనానలతో నాజూగ్గా, సెక్సీగా తయారవుతున్నారు. తాజాగా టాప్ హీరోయిన్ హన్సిక ఇన్స్టా పోస్ట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే హన్సిక ప్రతిరోజూ ఫోటోలు వీడియోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. సముద్ర తీరాన బాడీ మొత్తాన్ని అలవోకగా అలా వంచేస్తూ చేసిన యోగాసనం ఫోటోను హన్సిక్ షేర్ చేసింది. దీంతోఫ్యాన్స్ వావ్ అంటున్నారు. తెలుగులో బొద్దుగుమ్మగా పాపులర్ అయిన హన్సిక పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ టాప్హీరోయిన్ సమంత, మహానటిలో బొద్దుగా మారిన కీర్తి సురేష్, క్రేజీ హీరోయిన్స్, పూజా హెగ్దే తదితర హీరోయిన్లు జిమ్లు, యోగా అంటూ బాడీ ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
రీల్ లైఫ్లో, రియల్ లైఫ్లో హన్సిక సింగిల్!
Hansika In 105 Minutes: అవును.. హన్సిక సింగిల్గా ఉన్నారు. రియల్ లైఫ్లో ఆమె సింగిల్. ‘105 మినిట్స్’ సినిమాలోనూ సింగిల్గానే కనిపించనున్నారు. ఒకే ఒక పాత్రతో ఈ సినిమా సాగుతుంది. ఈ షూటింగ్లో జాయిన్ అయిన హన్సిక ‘‘కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నాను. ఎగ్జయిటింగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.. రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఒకే ఒక్క క్యారెక్టర్ చుట్టూ ఉత్కంఠగా సాగే కథా కథనాలతో ఈ సినిమా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎడిటింగ్ చేయించకుండా, షూటింగ్ స్పాట్లోనే ఎడిటర్ శ్యామ్ పర్యవేక్షిస్తున్నారు. ‘ఒక షాట్, ఒక పాత్ర, రీల్ టైమ్–రియల్ టైమ్’ హైలైట్స్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బొయిదాపు, సంగీతం: సామ్ సి. యస్. Started a new project yesterday . #105 #oneshotmovie , really excited for this one . Wishing the team all the very best . #105minutes #hansika53rd pic.twitter.com/Wei2Ovrjuz — Hansika (@ihansika) July 20, 2021 -
గ్లామర్ సీక్రెట్ చెప్పిన హన్సిక
బాల తారగా సినిమాల్లోకి వచ్చి కథానాయికగా స్థిరపడ్డ కొద్ది మంది నటీమణుల్లో హన్సిక ఒకరు. అనతికాలంలోనే అభిమానుల ఆరాధ్య దేవతగా మారింది. ఆ ఆరాధన కోసం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవీ... పిచిక డ్రెస్... ప్రముఖ డిజైనర్ ఊర్వశి సేథి స్థాపించిన సంస్థ ‘పిచిక’. చాలా తేలికగా.. సౌకర్యంగా ఉంటుంది వీరి ఫ్యాబ్రిక్. అదే దీని బ్రాండ్ వాల్యూ. ఈ దుస్తులు ఎక్కువగా లేత రంగుల్లో లభిస్తాయి. అంతేకాదు జైపూర్ హస్తకళాకారులతో వాటిపై పెయింటింగ్ వేయిస్తారు. ఈ యూనిక్నెస్ కోసమే ఆ బ్రాండ్ అంటే ఆసక్తి చూపిస్తుంటారు సెలబ్రిటీలు. ఇతర డిజైనర్ దుస్తులతో పోలిస్తే వీటి ధర కాస్త తక్కువే. పేరొందిన అన్ని ఆన్లైన్ స్టోర్స్లో పిచిక డిజైన్స్ లభిస్తాయి. సిల్వర్ క్రేవింగ్స్... వెండి ఆభరణాలకు పేరుపొందిన సంస్థ ఈ ‘సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ’. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో ప్రారంభమైందీ వెండి, బంగారు ఆభరణాల దుకాణం. సంప్రదాయ డిజైన్స్ దీని ప్రత్యేకత. ఈ ఆభరణాలకు మంచి గుర్తింపు రావడంతో గత ఏడాది ఇతర రాష్ట్రాల ప్రజల కోసమూ దీని అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించారు. ఇందులో ముక్కు పుడక నుంచి పెద్ద పెద్ద హారాల దాకా అన్ని రకాల జ్యూయెలరీ దొరుకుతుంది. వెండి, బంగారు నాణ్యతతోపాటు నగల డిజైన్స్ను బట్టి ధర ఉంటుంది. సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ కేవలం దానికి సంబంధించిన దుకాణం, వెబ్సైట్లలో మాత్రమే లభిస్తుంది. జ్యూయెలరీ.. బ్రాండ్: సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ (Silver Cravings jewellery) కమ్మల ధర: రూ. 7,850 డ్రెస్ బ్రాండ్ : పిచిక (Picchika) ధర: రూ. 35,000 గాజుల ధర: రూ. 11,000 హారం ధర: రూ. 25,000 ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అదే నా బ్రాండ్ టిఫిన్. నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వేరే టిఫిన్ చేస్తే తినేదాన్ని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా ‘ఇడ్లీ బుగ్గల పిల్లా’ అంటూ టీజ్ చేసేవారు. బహుశా నా గ్లామర్ సీక్రేట్ అదేనేమో. కానీ ఇప్పుడు అన్నిరకాల టిఫిన్లూ తింటున్నా!. – హన్సిక మోత్వానీ - దీపిక కొండి చదవండి: మహా సముద్రం మూవీకి పారితోషికం తగ్గించిన శర్వానంద్! -
పాత చీరలో నివేదా, బర్త్డే పార్టీలో హన్సిక రచ్చ రంబోలా!
► నిండు సూరీడులా తాను కూడా ప్రకాశిస్తానంటోన్న సాక్షి అగర్వాల్ ► తల్లి బర్త్డే దగ్గరుండి కేక్ కట్ చేయించిన అల్లు అర్జున్ ► జిమ్లో అల్లు శిరీష్ కసరత్తులు ► సోదరి బర్త్డే పార్టీలో హన్సిక రచ్చ ► పాత చీర కట్టానంటోన్న నివేదా థామస్ ► పైకి నవ్వుతున్నామంటే అంతా కరెక్ట్గా ఉన్నట్లు కాదంటోంది చైత్రా రెడ్డి ► గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అంటోన్న జాన్వీ కపూర్ ► కరోనాకు ముందు, తర్వాత అంటూ ఫన్నీ వీడియోను షేర్ చేసిన సుమ కనకాల ► దళపతి పాటకు వీర లెవల్లో స్టెప్పులేసిన కీర్తి సురేశ్ ► వ్యాక్సిన్ వేయించుకున్న శృతీ హాసన్ ► గోవాను మిస్ అవుతున్న అమీషా పటేల్ View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
హన్సిక సినిమా విడుదలపై నిషేధం విధించలేం
నటి హన్సిక నటించిన 'మహా' చిత్రానికి చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాలు.. హన్సిక, శింబు నటించిన తాజా చిత్రం 'మహా'. జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మిస్తున్నారు. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో చిత్రం విడుదలపై నిషేధం విధించాలని ఆ చిత్ర దర్శకుడు జమీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాత ఇంకా రూ.10 లక్షలు పారితోషికం బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నిర్మాత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 'మహా' చిత్రానికి చిత్రంపై పూర్తి హక్కులు నిర్మాతకే చెందుతాయన్నారు. దర్శకుడి పారితోషికం గురించి సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని న్యాయమూర్తి జయచంద్రన్కు వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ చిత్రం విడుదలపై నిషేధం విధించలేమని, దర్శకుడికి చెల్లించాల్సిన పారితోషికం వ్యవహారంపై చిత్ర నిర్మాత రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. చదవండి: ఓటీటీలో దీన్ని ఆపేయాలి: దర్శకుడి డిమాండ్ వ్యాపారవేత్తతో స్టార్ హీరోయిన్ సహజీవనం! -
ఈ టైంలో లవ్ అంటోన్న నటి, నెక్స్ట్ ఏంటన్న బ్రహ్మాజీ
► క్యూట్ ఫొటో షేర్ చేసిన చార్మీ కౌర్ ► రిజెక్ట్ చేసేముందు ఆలోచించుకోండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను షేర్ చేసిన నటి సిమ్రత్ కౌర్ ► సండేను సూపర్గా ఎంజాయ్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ► కరోనా టైంలో లవ్ అంటోన్న శిల్పా శెట్టి ► ఊయలూగుతున్న నందినీ రాయ్ ► ఆహార పొట్లాలు పంచుతోన్న మంచు లక్ష్మీ టీమ్ ► తన కన్నా తన పిల్లి క్లారా బాగా రీల్స చేస్తుందంటోన్న శృతీ హాసన్ ► నెక్స్ట్ ఏంటి అని అడుగుతోన్న బ్రహ్మాజీ ► త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
వివాదంలో హన్సిక మూవీ: కోర్టుకెక్కిన డైరెక్టర్
హీరోయిన్ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మహా’ పై వివాదం నెలకొంది. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించారు. కాగా ‘‘నేను దర్శకత్వం వహించిన ‘మహా’ని నాకు చెప్పుకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.. దీనిపై నిషేధం విధించాలి’’ అని జమీల్ డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. హన్సిక టైటిల్ రోల్ చేసిన ‘మహా’ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ‘‘ఈ చిత్రం పెండింగ్ పనులు నాకు తెలియకుండానే పూర్తి చేశారు.. నిర్మాత (మదియళగన్) నాకు 24 లక్షలు పారితోషికం చెల్లించాల్సి ఉండగా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారు. నాకు తెలియకుండానే పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసినందున, నా కథ మార్చినందున రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయి చెల్లించాలి’’ అని కేసు పెట్టారు జమీల్. అంతేకాదు.. సినిమా రిలీజ్ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని విధించాలని కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ‘జమీల్ పిటిషన్పై మే 19లోగా స్పందించాలి’ అంటూ సదరు కోర్డు నిర్మాతను ఆదేశించింది. కాగా ఒక పైలెట్తో ప్రేమలో పడే పైలెట్ అటెండెంట్ (హన్సిక) కథ ఇది. ఈ జంటకు పుట్టిన కుమార్తె మరణం వెనక దుర్మార్గుల్ని హీరో ఎలా పట్టుకుని అంతం చేశాడు? అనేది ‘మహా’ చిత్రకథ. ఇందులో శింబు అతిథి పాత్రలో కనిపిస్తారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
సోషల్ హల్చల్: పాట పాడిన శృతి, దెబ్బలు తిన్న హన్సిక
♦ ఇది ఏ ప్రదేశమో గుర్తుపట్టారా? అంటున్న అనుపమ పరమేశ్వరన్ ♦ తల్లి చేతిలో దెబ్బలు తిన్న హన్సిక ♦ వర్షం పడుతున్నప్పుడు కాఫీ తాగితే ఉంటది అసలైన మజా అంటున్న నభా నటేశ్ ♦ అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నానంటోన్న అమీషా పటేల్ ♦ పాట పాడిన శృతీ హాసన్ ♦ పాజిటివ్గా ఆలోచిస్తే అంతా సంతోషం, బలం అన్నీ వస్తాయంటున్న మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
హన్సిక ఇంట్లో పెళ్లి సందడి ఫోటోలు
-
హీరోయిన్ హన్సిక ఇంట పెళ్లి సందడి!
‘దేశముదురు’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన హన్సిక తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులతో నటించి, తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్లోనే ఈ ముద్దు గుమ్మకు ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ఈ మధ్య తెలుగు తెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా వుంటే తన అన్నయ్య ప్రశాంత్ మోత్వానీకి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న జైపూర్లో వివాహం జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కేవలం బంధువులను, సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ఆ వేడుకల్లో హన్సిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక పెళ్లిలో తమ సంప్రదాయ దుస్తులు, నగలను ధరించిన హన్సిక బుట్ట బొమ్మలా కనిపించింది. అతిథులతో ముచ్చట్లు పెడుతూ, తోబుట్టువులను ఆటపట్టిస్తూ, డాన్స్ చేస్తూ.. ధూమ్ధామ్గా సందడి చేసింది. అప్పుడే తన వదిన నాన్సీతో బలమైన బంధం ఏర్పడిందని, ఈ వివాహం తర్వాత మేము సోదరీమణులం అయ్యామని పేర్కొంది. పెళ్లి వేడుకల్లో తీసుకున్న కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. మార్చి 21న ఎంగేజ్మెంట్తో మొదలైన ఈ సంబరాలు పెళ్లితో ముగిసాయి. ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియంటడ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'మహా'లో నటిస్తోంది. కోలీవుడ్ నటుడు శ్రీకాంత్ విలన్గా చేస్తున్నాడు. శింబు ఓ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఆమె సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్.జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. కోవిడ్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ( చదవండి : మాజీ ప్రియురాలితో.. ) హన్సిక ఇంట్లో పెళ్లి సందడి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాశ్మీరి అందాలను ఎంజాయ్ చేస్తోన్న హన్సిక
-
హన్సిక వెబ్ సిరీస్కు ‘నషా’ టైటిల్!
ఓటీటీ వేదికలు పాపులర్ కావడంతో స్టార్స్ అందరూ వెబ్ సిరీస్లు, షోల బాట పట్టిన సంగతి తెలిసిందే. హన్సిక కూడా ఓ వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుందని తెలిసింది. ‘పిల్ల జమీందార్, భాగమతి’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. హన్సిక లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్కు ‘నషా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ముంబై బ్యాక్డ్రాప్లో సాగే సిరీస్ ఇది. యూత్ఫుల్ కథతో పది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ని రూపొందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ షో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమ్ కానుంది. చదవండి: మహా పూర్తయింది -
నాకు పెళ్లా..వరుడు ఎవరు!
నటి హన్సిక పెళ్లంట! ఇదే ఇప్పుడు కోలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు ధనుష్కు జంటగా మాప్పిళ్లై చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత బుల్లి కుష్బూ గా ముద్ర వేసుకుని పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అదే విధంగా తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న హన్సిక ప్రస్తుతం కోలీవుడ్లో మహా, పార్ట్నర్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీకి సక్సెస్ లు దూరం అయ్యాయని చెప్పాలి. తన 50వ చిత్రం మహా నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోంది. అదేవిధంగా అవకాశాలు హన్సికకు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ముంబాయి భామ పెళ్లికి రెడీ అవుతున్నారని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పెళ్లాడబోతున్న టు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతే కాదు మరో రెండు రోజుల్లోనే పెళ్లి అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అభిమానులు కాస్తంత షాక్ కు గురవుతున్నారు అయితే ఈ ప్రచారంపై స్పందించిన నటి హన్సిక ఎవరబ్బా ఆ పారిశ్రామికవేత్త నాకే తెలియదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా తనకు పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. చదవండి: భయంతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు -
మాజీ ప్రియురాలితో..
సినిమా: సంచలన నటుడు శింబు, నటి హన్సికల మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. చాలా డీప్గా ప్రేమించుకున్న ఈ జంట ప్రేమాయణం పెళ్లి అంచుల వరకూ సాగి ఆగిపోయ్యింది. అలా మాజీ ప్రియురాలు అయిన హన్సిక 50వ చిత్రంలో అతిథిగా నటించడానికి ఎలాంటి అభ్యతరం చెప్పలేదు శింబు. అవును నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఆమె సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్సట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్.జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. ఆరంభ దశలో దమ్మర దమ్ అంటూ హన్సిక దమ్ముకొట్టే ఫొటోలతో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేసి హడావుడి చేశారు. ఆ తరువాత చల్లబడ్డారు. అసలు ఈ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి. కాగా తాజాగా ఒక ఫొటోను విడుదల చేశారు. అందులో నటి హన్సికపై శింబు పడుకుని కళ్లు మూసుకుని తన్మయత్నంలో ఉన్నట్లు దృశ్యం ఉంది. ఇంకే ముందు మరోసారి మహా చిత్ర ప్రచారం వేడెక్కిపోతోంది.ఈ ఫోటోను దర్శకుడు వెంకట్ప్రభు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అయితే మహా చిత్రానికి సంబంధించిన ఇతర ఏ వివరాలు లేకపోవడంతో ఇదంతా నిద్రాణ దశలో ఉన్న మహా చిత్రం గురించి మరోసారి హైప్ తీసుకురావడానికి చేసిన ట్రిక్ అని తెలుస్తోంది. ఏదేమైతేనేం మరోసారి మహా చిత్రం వార్తల్లోకి వచ్చింది. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి రానుందో తెలియదు గానీ, తాజాగా విడుదల చేసిన శింబు, హన్సికల ఫొటో మహా చిత్రంపై ఆసక్తిని మాత్రం రేకెత్రిస్తోంది. అదీ గాక నటుడు శింబు నటించిన చిత్రం విడుదలై కూడా చాలా కాలమైంది. వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం కొత్తగా నటిస్తున్న చిత్రం కూడా ఏదీ లేదు. త్వరలో వెంకట్ప్రభు దర్శకత్వంలో సురేశ్కామాక్షి నిర్మించనున్న మానాడు చిత్రంలో నటించడానికి శింబు రెడీ అవుతున్నారు. ఈలోగా శింబు తన మాజీ ప్రియురాలు హన్సికతో రొమాన్స్ చేసిన మహా చిత్రం విడుదలయితే బాగుంటుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. -
మరో థ్రిల్లర్కు హన్సిక రెడీ
అందాల భామ హన్సిక మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించనున్నారు. మహా చిత్రంతో అర్ధ సెంచరీ కొట్టేసిన ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం నటుడు అధర్వతో రొమాన్స్ చేసిన 100 చిత్రం 9వ తేదీన తెరపైకి రానుంది. కాగా మహా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. అంతే కాదు మహా చిత్రంలో హన్సిక పలు గెటప్లలో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కథ సొల్లపోరేర్, గులేభకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్ తాజాగా నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్పాట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్టైయిన్మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో తదుపరి చిత్రానికి కల్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఈ సారి కల్యాణ్ సూపర్ నేచులర్ థ్రిల్లర్ కథను తయారు చేసుకున్నారు. ఇందులో నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నారు. కల్యాణ్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన గులేభకావళి చిత్రలోనూ హన్సిక లీడ్ రోల్లో నటించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో హన్సిక మరోసారి కల్యాణ్ దర్శకత్వంలో నటించడానికి ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
మే 7న ‘తెనాలి రామకృష్ణ’ ఫస్ట్లుక్
చాలా కాలం నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తరువాత ఈ హీరో కెరీర్లో మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడక చాలా ఏళ్లైంది. అయినా వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రాలను చేస్తున్నాడు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి మే 7న ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఆదికి ‘పార్ట్నర్’గా హన్సిక
వైవిధ్య కథా చిత్రాలను ఎంచుకుని నటిస్తున్న నటుడు ఆది. కోలీవుడ్లో ఈరమ్, అరవాన్, యూటర్న్ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆది తాజాగా నటిస్తున్న చిత్రం పార్టనర్. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ‘మహా’ చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రా ల నాయకి స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ ఇప్పుడు తొలిసారిగా ఆదితో కలిసి నటిస్తోంది. అయితే ఇందులో వీరిద్దరూ జంటగా నటించడం లేదట. పార్టనర్ చిత్రంలో ఆదికి జంటగా పాలక్ లల్వాణి అనే నటి నటించనుంది. ఈ అమ్మడు కుప్పత్తురాజా చిత్రంలో జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా నటించింది. ఆర్ఎఫ్సీ క్రియేషన్స్ పతాకంపై ఎస్పీ.కాళీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మనోజ్ దామోదరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్టనర్ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథా చిత్రం. అదే సమయంలో సైన్స్ ఫిక్షన్తో కూడిన ఫాంటసీ పార్టు కూడా చిత్రంలో ఉంటుంది. ఇక హన్సిక పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక నటుడు ఆది సినీ కెరీర్లోనే ముఖ్యమైన చిత్రంగా పార్టనర్ నిలుస్తుంద’ని తెలిపారు. -
నటి ఫోన్ హ్యాక్.. ప్రైవేట్ ఫోటోలు లీక్
మొన్న అక్షరా హాసన్.. నిన్న అమీ జాక్సన్.. నేడు హన్సిక మోత్వాని.. ఏంటనుకుంటున్నారా హ్యాకింగ్ బాధితులు. అవును నటి హన్సిక ఫోన్ హ్యాక్ అయ్యింది. దాంతో ఆమె ప్రైవేట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హన్సిక ఫోన్ని హ్యాక్ చేసిన వ్యక్తులు ఆమె టూ పీస్ బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు హన్సిక. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘నా ఫోన్, ట్విటర్ అకౌంట్ రెండు హ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్ ఎండ్ టీమ్ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్ ఖాతాలో వచ్చే మెసేజ్లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తున్నారు. ఇది హన్సిక నటిస్తున్న 50వ చిత్రం. Phone n Twitter hacked please don’t respond to any random messages . My back end team is working on getting things in control. — Hansika (@ihansika) January 23, 2019 -
షూటింగ్లో గాయపడ్డ హన్సిక
ఇటీవల కోలీవుడ్ లో తరుచూ వార్తల్లో కనిపిస్తున్న హీరోయిన్ హన్సిక. ప్రస్తుతం మహా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న హన్సికకు గాయమైనట్టుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జారిపడిన హన్సిక చేతికి గాయమైంది. అయితే ఆ గాయం తీవ్రమైనది కాకపోవటంతో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు. తన 50వ చిత్రంగా తెరకెక్కుతున్న మహా సినిమా పనుల్లో బిజీగా ఉన్న హన్సికను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ హన్సికను కష్టాల్లో పడేశాయి. హన్సిక మాత్రం అవేవి పట్టించుకోకుండా షూటింగ్ పనులు కానిచ్చేస్తుంది. -
నా పిల్లల్లో ఒకరు టెన్త్ చదువుతున్నారు..
సినిమా: నటి హన్సిక నూతన సంవత్సరంలో ఒక శపథం చేసింది. ఈమెలో అందమే కాదు దాని వెనుక అంతకన్నా అందమైన మనసూ, మంచి ఆశయమూ ఉంది. నటిగా పుష్కరాన్ని టచ్ చేసినా క్రేజీ కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న నటి హన్సిక. ఈ ముద్దుగుమ్మ సిగ్ధమనోహరం యువత గుండెల్లో తీయని గునపాలను గుచ్చుతుంది. ఇప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల్లో అందాలను ఆరబోయడానికే ఎక్కువగా ప్రయత్నించిన ఈ బ్యూటీ తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. అలాంటి చిత్రమే ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న మహా. ఇది హన్సికకు అర్ధ సెంచరీ చిత్రం కావడం విశేషం. అయితే ఈ చిత్రంతో మొదటి నుంచే హన్సిక వివాదాలకు కారణంగా మారుతోంది. మహా చిత్ర తొలి రెండు ఫస్ట్లుక్ పోస్టర్ల విడుదల సమయంలోనూ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరో పోస్టర్ను విడుదల చేశారు. అదీ చర్చనీయాంశంగా మారింది. అందరూ టబ్లో నీళ్లతో స్నానం చేస్తారు. మహా చిత్రంలో నటి హన్సిక మాత్రం రక్తంతో స్నానం చేసింది. అవును చేతిలో గన్ పట్టుకుని రక్తం నిండిన టబ్లో స్నానం చేస్తున్నట్లున్న హన్సిక ఫొటోతో కూడిన మహా చిత్ర మూడో పోస్టర్ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నూతన సంవత్సరంలో నటి హన్సిక చేసిన శపథం విషయానికి వస్తే ఈ బ్యూటీ ఇంత చిన్న వయసులోనే 34 మందికి తల్లి అయ్యింది. అవును 34 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. వారిని హన్సిక తన పిల్లలనే చెబుతుంది. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కట్టించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా హన్సిక తన ట్విట్టర్లో పేర్కొంటూ నా పిల్లల్లో ఒకరు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను రాయనున్నారని చెప్పింది. అతన్ని మంచి మార్కులు సాధించేలా చేసి రాష్ట్రంలోనే ప్రథమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని నూతన సంవత్సరంలో శపథం చేశానని తెలిపింది. ఇకపోతే తాను ప్రస్తుతం నటిస్తున్న మహా చిత్రం విభిన్నమైన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్రం గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంది. ఇప్పుడు మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించానని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని హన్సిక పేర్కొంది. అదేవిధంగా ఇకపై తాను నటించే చిత్రాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. -
ఈ సారి ముస్లిం గెటప్లో..
సినిమా: నటి హన్సిక వివాదాస్పద గెటప్ల్లో ఉచిత ప్రచారాన్ని తెగ పొందేస్తోంది. ఇందులో ఆమె ప్రమేయం లేకపోయినా ప్రైమ్ టైమ్ వార్తల్లోకెక్కేస్తోంది. ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది హన్సికకు 50వ చిత్రం. అంతే కాదు ఈ బ్యూటీ నటిస్తున్న తొలి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం. ఇందులో అమ్మడు రకరకాల గెటప్లు ధరించి పిచ్చపిచ్చగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతకంటే ఎక్కువ వివాదాల్లో నానుతూ ఉచిత ప్రచారాన్ని పొందేస్తోంది. నవ దర్శకుడు జలీల్ను పరిచయం చేస్తూ ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మాత మదియళగన్ నిర్మిస్తున్న చిత్రం మహా. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇటీవల నటి హన్సిక కాషాయ దుస్తులు ధరించి నోటి నిండా సిగరెట్ పీల్సిన పొగతో కాశీ నగర బ్యాక్డ్రాప్లో సింహాసనంలో కూర్చున్న దృశ్యంతో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనిపై మత సంఘాలు, రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ క్రిస్మస్ పండగ సందర్భంగా మహా చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ను విడుదల చేశారు. ఈ సారి హన్సికను ముస్లిం అమ్మాయి గెటప్లో చూపించి, మసీదు ముందు భాగంలో కూర్చుని నమాజ్ చేసుకుంటున్నట్లు దృశ్యాన్ని ఆ పోస్టర్లో పొందుపరిచారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, అదే పోస్టర్లో వెనుక భాగంలో హన్సిక తుపాకీ పట్టుకుని కాల్చుతున్నట్లు స్టిల్ను చేర్చారు. ఇది కూడా వివాదాంశంగా మారింది. మొన్న హిందువు అమ్మయిగా, ఇప్పుడు ముస్లిం యువతిగా చూపించిన మహా చిత్ర వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మహా చిత్రానికి మతాలను అంట గట్టరాదని, ఇలాంటి సన్నివేశాలతో మహా చిత్రం ఎలా ఉంటుందన్నది చూడాలని చిత్ర నిర్మాత అంటున్నారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వివాదాస్పద చిత్రం
విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది. ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు. మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. -
ఫస్ట్ లుక్ వివాదం.. కష్టాల్లో హీరోయిన్
హీరోయిన్ కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేయటమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాదించిన సౌత్ బ్యూటీ హన్సిక. అయితే త్వరలో తన 50వ సినిమా ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న హన్సికకు ఆ సినిమా కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. మహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక, సింహాసనం లాంటి కుర్చిలో కూర్చొని హుక్కా తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్ను ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 50వ సినిమా కావటంతో హన్సిక కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ వివాదం కారణంగా హన్సికకు మరింత ప్రచారం లభిస్తుందో లేక సినిమానే ఇబ్బందుల్లో పడుతుందో చూడాలి. -
అభిమానాన్ని కొత్తగా ఎక్స్ప్రెస్ చేశాడు..
సినిమా: హన్సిక నా జీవితం అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది ఒక వీరాభిమాని నటి హన్సికపై కురిపించిన ప్రేమ. ఇప్పుడు పెద్దగా ఫేమ్లో లేకపోయినా ఒకప్పుడు యమ క్రేజీ హీరోయిన్ హన్సిక. అలాగని ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు లేవనికాదు. తమిళంలో మూడు, తెలుగులో బిజీగానే ఉంది. మరి అలాంటి బ్యూటీకి అభిమానుల సంఖ్య తక్కువేమీ ఉండదుగా. వారిలో వీరాభిమానులు ఉంటారు. అదుగో అలాంటి ఒక అభిమానినే ఇటీవల హన్సికపై తన అభిమానాన్ని కొత్తగా ఎక్స్ప్రెస్ చేశాడు. అదెలాగంటే హన్సిక నా జీవితం అంటూ ఏకంగా 28 భాషల్లో రాసి అదే పేరుతో ఫేస్బుక్ను ఓపెన్ చేసి తన వీరాభిమానం హన్సికకు తెలిసేలా పోస్ట్ చేశాడు. అందులో హన్సిక నా జీవితం అంటూ తెలుగులో, హన్సిక మై లైఫ్ అని ఆంగ్లంలో, హన్సిక ఎన్ వాళ్క్కై అని తమిళంలో ఇలా ఇదే అర్థం వచ్చే విధంగా 28 భాషల్లో రాశాడు. దీంతో యమ ఖుషీ అయిపోయిన నటి హన్సిక వావ్ ఇది విభిన్నంగా బాగుంది. చాలా ధన్యవాదాలు అని ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది. హన్సిక స్పందనతో తెగ ఆనందపడిపోయిన ఆ అభిమాని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అంతే కాదు తన కోరికను వెలిబుచ్చాడు. హన్సిక ఇటీవల బాగా కసరత్తులు చేసి స్లిమ్గా తయారైంది కానీ ఇంతకుముందు బొద్దుగా ముద్దుగా ఉండేది. అందుకే చిన్న కుష్బూ అని కూడా పిలిచేవారు. ఇప్పుడీ అభిమానికి హన్సిక సన్నగా బక్క చిక్కిపోవడం నచ్చలేదట. మునుపటిలానే ఉండాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరి తనపై అభిమానాన్ని 28 భాషల్లో రాసి మరీ వ్యక్తం చేసిన అభిమాని కోరికపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్రమ్ప్రభుతో జత కట్టిన తుపాకీ మునై చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది. అదే విధంగా 50వ చిత్రం మహా చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. -
ఆ విషయం ముందే తెలుసు!
అగ్ర కథానాయకిగా రాణిస్తానని తనకు ముందే తెలుసు అని చెప్పింది నటి హన్సిక. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా సెటిల్ అయిన నటి హన్సిక. ముఖ్యంగా కోలీవుడ్లో మాప్పిళ్లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆపై వరుసగా అవకాశాలను అందుకుని, దర్శకుల హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో విజయాల శాతమే అధికం అని చెప్పవచ్చు. మొత్తం మీద అర్ధశతకానికి రీచ్ అయిన ఈ అమ్మడి ఖాతాలో మహా అనే చిత్రం అర్ధశతకంగా నమోదు అవుతోంది. త్వరలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆనందంలో తుల్లిపోతున్న హన్సిక మాట్లాడుతూ 50వ చిత్రంలో నటించబోతుండడం చాలా సంతోషంగా ఉందంది. మహా చిత్ర కథ హీరోయిన్ సెంట్రిక్తో కూడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి కథా చిత్రంలో నటించడం ఇదే ప్రప్రథమం అని తెలిపింది. అందుకే ఇందులో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది. ఈ చిత్రం బాగా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పింది. మహా చిత్ర దర్శకుడు జమీల్ తనకు ముందే తెలుసని, బోగం చిత్రాలకు తామిద్దరం కలిసి పని చేశామని చెప్పింది. ఈ చిత్ర స్క్రిప్ట్ను చెప్పడానికి ఆరు నెలలు ఎదురు చూశారని, తాను బిజీగా ఉండడంతో ఆయన్ని కలిసి కథ వినడం కుదరలేదని తెలిపింది. ఎట్టకేలకు ఒక సమయంలో దర్శకుడు తనను కలిసి కథ వినిపించారని, అయితే అప్పుడు అందులో నటించడానికి అంగీకరించలేదని అంది. రెండవసారి మరోసారి కథ చెప్పినప్పుడు ఓకే చెప్పానంది. అయితే ముందు కథ విన్నప్పుడే మహా చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి సక్సెస్ఫుల్ హీరోయిన్ని అవుతానని తనకు ముందే తెలుసని చెప్పింది. ఎందుకంటే తాను కఠినంగా శ్రమిస్తానని అంది. అందుకే తనను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటిస్తానని, అగ్ర కథానాయకినవుతానని తెలుసంది. ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. పలువురు లెజెండ్స్ను కలిసి మాట్లాడుతున్నానని, తప్పులు చేయడం సహజం అని, అయితే తప్పు చేశానే అని దాన్నే తలుచుకుని బాధ పడుతూ కూర్చునే మనస్తత్వం తనది కాదని చెప్పింది. తాను గత ఏడాది మాత్రమే 19 చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇంతకుముందు ఏడాదికి 8 చిత్రాల వరకూ చేసేదాన్నని, ఇప్పుడు ఏడాదికి 4 చిత్రాలే చేస్తున్నానని తెలిపింది. అలాగని పనిలేకుండా ఖాళీగా ఉంటున్నట్లు భావించరాదని అంది. ప్రస్తుతం రెండు చిత్రాలను పూర్తి చేసి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది. -
హన్సిక @ 100
తమిళసినిమా: హన్సిక @100 అనగానే మీరు ఆశ్చర్య పడతారని తెలుసు. తను 100 చిత్రంలో నటిస్తోందా? ఆమె నటించిన చిత్రం నూరు రోజులు ఆడిందా? లాంటి పలు సందేహాలు రావచ్చు. అయితే అవేవి నిజం కాదు. హన్సిక క్రేజీ కథానాయికే. విజయ్, సూర్య, ధనుష్,శింబు వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్లు అందుకుంది. అలాంటి నటి ఆ మధ్య శివకార్తికేయన్తో నటించడానికి ఓకే చెప్పగానే ఆ హీరో అదృష్టం అనే ప్రచారం జరిగింది. ఆయన సరసన నటించిన తొలి క్రేజీ హీరోయిన్ హన్సికనే. అంత స్టార్ ఇమేజ్ను హన్సిక సంపాదించుకున్నారు.ఆ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి మార్కెట్ను అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ ఖాతాలో విజయాల సంఖ్యే ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పక తప్పదు. కారణాలేమైనా అవకాశాలు పలచబడ్డాయి. చాలా గ్యాప్ తరువాత అధర్వకు జంటగా ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. దీనికి శ్యామ్ అంటాన్ దర్శకుడు. ఈయన ఇంతకు ముందు జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా డార్లింగ్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఇటీవలే షూటింగ్ను ప్రారంభించుకున్న ఈ చిత్రంలో అధర్వ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. దీనికి 100 అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో అధర్వ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో పోలీస్స్టేషన్ ఫోన్ నంబర్ 100 కావడంతో అదే పేరును చిత్రానికి నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ 100 చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ చిత్రంతో కోలీవుడ్లో మరో రౌండ్ కొట్టడం ఖాయం అనే నమ్మకాన్ని నటి హన్సిక వ్యక్తం చేస్తోంది. -
వారెవ్వా హన్సిక!
తమిళసినిమా: ఆలోచనలకు సాన పడితే అద్భుతాలు సాక్షాత్కరిస్తాయి. నటి హన్సిక కూడా అదే చేశారు. ఈమె తన చక్కని నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్న హన్సికకు ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువే. తన ఈ మధ్య ప్రభుదేవాతో కలిసి నటించిన గులేబాకావళి చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను పొందింది. అయితే ప్రస్తుతం హన్సికకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నది నిజం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మలో మరో టాలెంట్ కూడా మెండుగా ఉంది. అవును మంచి నటే కాదు మంచి చిత్రకారిణి కూడా. చిత్రలేఖనాలంటే ఎంతో మక్కువ. షూటింగ్ లేని సమయాల్లో కుంచె చేతబట్టి క్యాన్వాస్పై తన మనసులోని భావాలకు అబ్బురపరిచే రూపాలను ఇస్తుంటారు. అవి మోసిన చిత్ర కళాకారుడి కళారూపాలకు దీటుగా ఉంటాయి. అలా తన మనసులోని ఆలోచనలకు రూపం ఇచ్చిన ఒక చిత్రలేఖనాన్ని హన్సిక సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.ఆ చిత్ర లేఖనం పలువురి ప్రశంసలను అందుకుంటోంది. ఈమె తాను రూపొందించిన కళాకృతుల గురించి పలు మార్లు చెప్పారు కానీ, వాటిని ఏనాడు ప్రదర్శించలేదు. ప్రదర్శనలకు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం చెప్పారు. దీంతో ఆమెలోని చిత్రకారిణి గురించి ఎవరూ పెద్దగా ఊహించలేదు. అలాంటిది హన్సిక కుంచెతో రంగులద్దిన బుద్ధుడి చిత్రలేఖనం కళాహృదయులను రంజింపజేస్తోంది. ఆహా హన్సికలో ఇంత గొప్ప ఆర్ట్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రముఖ హాస్య నటుడు వివేక్ లాంటి వారు తను కళా రూపకాలకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచనలిస్తున్నారు. అలా వచ్చిన నిధిని సమాజసేవకు ఉపయోగించవచ్చునని ట్విట్టర్లో సలహా ఇస్తున్నారు. అందుకు బదులిస్తూ వారికి థ్యాంక్స్ చెబుతూ తనకు అలాంటి ఆలోచన ఉందని హన్సిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ అందాల భామ సామాజిక సేవలోనూ ముందే ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 23 ఏళ్ల అమ్మాయి 30 మంది పిల్లలకు అమ్మ అయ్యారు. అవును హన్సిక 30 మంది అనాథ పిల్లలను చేర దీసి వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లతోనే గడుపుతానంటున్న హన్సిక 30 మంది పిల్లలు తనను అమ్మ అనే పిలుస్తారని, అంత మందికి అమ్మ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వారందరికీ ఒక ఆశ్రమాన్ని కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హన్సిక తెలిపారు. వారెవ్వా హన్సికా! -
ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి
‘‘ఇదే నాన్న చెప్పిన విగ్రహం. దీనికి ఫారిన్లో సూపర్ డిమాండ్ ఉంది... నేను తెస్తాను నా శిల్పాన్ని’..., ‘వద్దురా.. ఆ ఊరే పెద్ద రిస్కు’..., ‘మీరు ముగ్గురూ కలిసి ఆ పెట్టెను కొట్టేయాలి’..., ‘ఏం.. మమ్మల్ని చూస్తే హీరోల్లా అనిపించట్లేదా?’..., ‘మా అన్నకు షుగర్ అని తెలీదా.. ఎందుకురా లాలీపాప్ పెట్టారు’..., ‘మీరూ మీ పొట్టలు.. మీ బండ నడుములు.., ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి’..., ‘చనిపోయిన మా అబ్బాయి శ్రీనివాస్ నీలాగే ఉండేవాడు’..., ‘అప్పుడు ఆ నిధి ఏమైనట్టు’... వంటి డైలాగులు ‘గులేబకావళి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతున్నాయి. ప్రభుదేవా, హన్సిక జంటగా నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తమిళంలోలా తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్కుమార్. -
కాట్టేరికి టాటానా?
తమిళసినిమా: కాట్టేరి చిత్రానికి నటి హన్సిక టాటా చెప్పిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ ముంబై బ్యూటీ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ కోలీవుడ్లో బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్న గులేభాకావళి చిత్రం ఒకటి. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తోంది. శాన్ ఆంథోని దర్శకుడు. కాగా వైభవ్ కథానాయకుడిగా డీకే. దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్న కాట్టేరి చిత్రంలో నటించడానికి హన్సిక అంగీకరించింది. ఇది హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం. కథ కూడా విని నటించడానికి ఓకే చెప్పిన ఈ భామ తాజాగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. హన్సిక కొత్త సంవత్సరంలో మరో భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతుండడంతో కాట్టేరి చిత్రానికి టాటా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ముందుగా నటి ఓవియ న టించనుందనే ప్రచారం జరిగింది. ఈ తరువాత ఆమె అవకాశాన్ని హన్సిక కొట్టేసిందన్నారు. తాజాగా ఈ బ్యూటీ కూడా వైదొలిగిందనే ప్రచారం హోరెత్తుతోంది. కాల్షీట్స్ సమస్య కారణంగానే కాట్టేరికి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. హన్సిక ఐదేళ్లుగా న్యూఇయర్ను తన స్నేహితులతో కలిసి న్యూ యార్క్లో ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఈ సారి ఆ టూర్ను కూడా రద్దు చేసుకుందట. చేతి నిండా చిత్రాలుండడంతో హన్సిక ఈ ఏడాది హ్యేపీ న్యూ ఇయర్ను ముంబైలోనే తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనుందట. -
అవకాశాల కోసం తప్పలేదు..!
తమిళ సినిమా: సినీ రంగంలో క్రేజ్ ఉన్నంత వరకే అవకాశాలైనా, డిమాండ్ అయినా.. క్రేజ్ తగ్గకూడదంటే సక్సెస్ చాలా అవసరం. సక్సెస్ లేకుంటే దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. నటి హన్సిక విషయానికే వస్తే ఆదిలో విజయాలు దరి చేరకపోయినా, ఆ తరువాత సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకుంది. విజయ్, విశాల్, జయంరవి లాంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు దర్శకుల నటిగా పేరు తెచుకుంది. ఆ తరువాత నటించిన చిత్రాలు హిట్ అయినా ఎందుకో గానీ అవకాశాలే పలచబడ్డాయి. ప్రభుదేవాతో నటిస్తున్న గులేబకావిళి చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి తరుణంలో అధర్వతో నటించే అవకాశం తలుపు తట్టింది. అజిత్ హీరోగా చిత్రం చేయాలన్న నిర్ణయంతో చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆరా సంస్థ ఆయన కాల్షీట్స్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలెట్టారు. ఈ సంస్థ తాజాగా జై, అంజలి, జననీఅయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన బెలూన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు అధర్వ హీరోగా చిత్ర నిర్మాణం తలపెట్టారు. డార్లింగ్, ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు చిత్రాల ఫేమ్ శ్యామ్ అంటని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సికను నాయకిగా ఎంపిక చేశారు. అధర్వ, హన్సిక జంట కడుతున్న తొలి చిత్రం ఇదే. ఇంతకు ముందు రూ.కోటి వరకూ పుచ్చుకున్న ఈ అమ్మడు పారితోషికం తగ్గించుకోవడం వల్లనే ఈ అవకాశాన్ని పొందించనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై హన్సిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. -
ఉప్పొంగిన అభిమానం
తమిళసినిమా: వెలకట్టలేని వాటిలో అభిమానం ఒకటి. ఇక తారలకు మూలధనమే అదే. వాళ్ల ప్రేమాభిమానాలు కనుక లభిస్తే ఆ తారలకు తిరుగుండదు. నటి హన్సిక మంగళవారం అలాంటి అభిమానంతోనే తడిచి ముద్దయింది. హన్సిక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పక తప్పదు. ఆమె చేతిలో ప్రభుదేవాకు జంటగా నటిస్తున్న గులేబాకావళి చిత్రం ఒక్కటే ఉంది. అయినా అభిమానుల్లో ఈ బ్యూటీపై అభిమానం ఏమాత్రం కొరవలేదనడానికి మంగళవారం జరిగిన సంఘటనే చిన్న ఉదాహరణ. ఈ అమ్మడు మంగళవారం ఈరోడ్డులో సందడి చేసింది. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన హన్సికను చూడడానికి ఆ చుట్టు ప్రక్కల జనం భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఆమె కోసం సుమారు రెండు గంటలకు పైగా వేచి ఉన్నారు. హన్సిక వేదికపైకి రాగానే అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగింది. హేయ్ హన్సిక అంటూ కేకలు, ఈలలు, చప్పట్లతో అంటూ ఆ ప్రాంతం మారుమోగింది. అప్పటికీ ముందుగానే భద్రతా సిబ్బందిని నిర్వాహకులు ఏర్పాటు చేసినా, వారికి అభిమానాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. అభిమానులను ఉద్దేశించి హన్సిక మాట్లాడుతూ ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరంటే చాలా ఇష్టమంటూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోయారు. హన్సికను చూసిన ఆనందంతో గాలిలో తేలినట్లుందే అంటూ పాడుకుంటూ ఇంటి దారి పట్టారు.అయితే హన్సిక రావడం, అభిమానులు చుట్టడం వంటి సంఘటనలతో ఆ ప్రాంత వాహనచోదకులకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని చక్కబరచారనుకోండి. అలా నటి హన్సిక అభిమానంతో తడిచి ముద్దయిందన్నమాట. -
అప్పుడు దర్శకత్వంలో ఇప్పుడు జంటగా..
ఎంతటి వారికైనా గ్యాప్ రావడం అన్నది సహజం. ప్రతిభ ఉన్నవారికి ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగదు. అందులోనూ అందం కూడా మెండుగా ఉన్న నటి హన్సిక లాంటి వారికి చిన్నగ్యాప్ పెద్ద సమస్య కానేకాదు. ఈ మధ్యనే రోమియో జూలియట్, భోగన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన హన్సిక ఆ తరువాత కోలీవుడ్లో నూతన అవకాశాలు రావడానికి కాస్త సమయం పట్టింది. దీంతో హన్సిక పనైపోయింది. మూటాముల్ల సర్దుకుంది అనే టాక్ వేగంగా ప్రచారమైంది. అలాగే ఒక మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అలాగని ఈ బ్యూటీ కాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. టాలీవుడ్లో ఒక చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజా సమాచారం ఏమిటంటే కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ హన్సిక తలుపు తట్టింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్నారు. చాలా కాలం క్రితం దక్షిణాది వదిలి ఉత్తరాది సినిమాలో జెండా పాతి అక్కడ తనదైన ముద్ర వేసుకున్న ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. భోగన్ చిత్రంతో నిర్మాతగా కూడా అవతారమెత్తిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు హీరోగా, డైరెక్టర్గా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే నవ దర్శకుడు అర్జునకు అవకాశం ఇచ్చి యగ్ మంగ్ జంగ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.ఇందులో ఆయనతో నటి లక్ష్మీమీనన్ రొమాన్స్ చేస్తోంది. మరో పక్క ఆయన మాజీ ప్రియురాలు నయనతార ప్ర«ధాన పాత్రను పోషిస్తున్న కోలైయుదీర్ కాలం చిత్ర హిందీ రీమేక్లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక నటుడు విశాల్, కార్తీ హీరోలుగా కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రానికి మెగాఫోన్ పట్టారు.ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయేషా నాయకి. కాగా కథానాయకుడిగా మరో చిత్రానికి కూడా ప్రభుదేవా పచ్చజెండా ఊపారని, ఇందులో నటి హన్సిక నాయకిగా నటిస్తున్నారన్న సమాచారం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉందని, దీనికి గులేభాహావళి అనే టైటిల్ను కూడా నిర్ణయించారని తెలిసింది. దీనిని నవదర్శకుడు కర్ణన్ తెరకెక్కిస్తున్నారు.అమ్మడు హన్సిక ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారన్నమాట. -
కథే హీరో అంటున్న హన్సిక
నటి హన్సికకు బాణి మార్చుకోక తప్పని పరిస్థితి అట. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సక్సెస్ఫుల్ నటిగానే ముద్రవేయించుకుంది. ఈ మధ్య నటించిన మనిదన్, బోగన్ వంటి చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. పైగా దర్శకుల నటిగానూ పేరు తెచ్చుకుంది. అయినా బోగన్ చిత్రం తరువాత నూతన చిత్రమేదీ చేతిలో లేదు. దీంతో కొత్త ప్రయత్నంగా మాలీవుడ్లో ట్రై చేసింది. అక్కడ మోహన్లాల్కు జంటగా విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా కోలీవుడ్లో శశికుమార్కు జంటగా కొడివీరన్ చిత్రంతో పాటు యువ నటుడు విష్ణువిశాల్తో ఒక చిత్రంలో రొమాన్స్ చేయడానికి అంగీకరించింది. దీంతో మరిన్ని సెకెండ్ గ్రేడ్ కథానాయకులతో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయట. విజయ్, విశాల్, జయంరవి వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు చిన్న హీరోలతో నటించమని అడగడంతో కాస్త షాక్కు గురైందట. అయితే ఆ అవకాశాలను కూడా జారవిడుచుకుంటే మార్కెట్ మరీ డౌన్ అయిపోతుందని, ఆ తరువాత అలాంటి అవకాశాలు కూడా రావని ఆలోచనలో పడ్డ హన్సిక పెద్ద హీరోనా, చిన్న హీరోనా అన్నది సమస్య కాదని, తనకు కథే హీరో అన్న నిర్ణయానికి వచ్చి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి రెడీ అంటోందట. ఇటీవల నయనతార కూడా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేలా చూసుకుంటూ వర్తమాన హీరోలతో కూడా నటించేస్తోంది. తాజాగా నటి హన్సిక కూడా అదే బాణీలో పయనించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కోలీవుడ్లో మళ్లీ ఒక రౌండ్ కొట్టాలని ఆశిస్తోందట. మరి ఈ బ్యూటీ నూతన పంథా ఎలాంటి ఫలితాన్ని స్తుందో చూద్దాం. మోహన్లాల్కు జంటగా నటిస్తున్న విలన్ చిత్రం పైనా హన్సిక చాలా నమ్మకాన్ని పెట్టుకుందట. ఆ చిత్రం విజయం సాధిస్తే అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో ఉందట. -
మా అమ్మయి చాలా యంగ్
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటను యువత ఇప్పటికీ మరిచిపోదు. పోకిరి చిత్రంలో ముమైత్ఖాన్ నర్తించిన ఆ పాట యూత్కి ఎప్పటికీ కిక్కే. ఆ విషయం మాకు తెలుసు.. ఇంతకీ మీరు చెప్పొచ్చేదేమిటంటారా? నటి హన్సిక అమ్మ మాటలు చూస్తే ముమైత్ఖాన్ పాట గుర్తుకొచ్చిందిలెండి. చాలా మంది హీరోయిన్ల తల్లుల మాదిరిగానే హన్సిక తల్లి మోనా మోత్వాని తన కూతురి వయసు గురించి మాట్లాడారు. మా అమ్మాయి చాలా యంగ్. ఈ మధ్యే 24 ఏళ్లు పూర్తి అయ్యాయి. అసత్య ప్రచారాలు చేయకండి అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. హన్సిక తల్లికి అంత కోపం ఎందుకొచ్చిందో ఈ పాటికే అర్థమై ఉంటుంది. విషయం ఏమిటంటే అందాల భామ హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనని, మోనా మోత్వాని ఆమెకు వరుడిని వెతికే పనిలో ముమ్మరంగా ఉన్నారనే ప్రచారం సోషల్మీడియా హోరెత్తిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. హన్సికకు కోలీవుడ్లో ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. జయంరవితో నటించిన ఒక చిత్రం భోగన్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కొత్తగా అవకాశాలు లేవు. ఇక చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్లో లక్కున్నోడు అనే ఒక్క చిత్రంలో నటిస్తున్నారు. అయితే హన్సిక కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హన్సిక నటించిన చివరి చిత్రం మనిధన్. ఆ తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. భోగన్ తరువాత ఇంకో చిత్రం లేదు. ఇలాంటి కూడికలు తీసివేతలు లెక్క కట్టే.. హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక పోతే మా అమ్మాయి చాలా యంగ్ అని హన్సిక తల్లి మోనా అనడంలోనూ తప్పులేదు. ఎందుకంటే మూడున్నర పదులు దాటిన నాయికలు ఇంకా పెళ్లికి తొందరేముంది అంటుంటే 24 ఏళ్ల హన్సికకు అప్పుడే పెళ్లి ఆలోచనేమిటన్నది ఆమె తల్లి భావనై ఉండవచ్చు. -
నాకింకా పెళ్లీడు రాలేదు
నా జీవితంలో ప్రేమ వచ్చి పోయిందని నటి హన్సిక నిర్లిప్తను వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో దర్శకుల నటిగా పేరు తెచ్చుకున్న ఈ బబ్లిగర్ల్ కెరీర్ మంచి హైప్లో ఉన్న సమయంలో కొన్ని తప్పటడుగులు వేశానని చెప్పవచ్చు. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ వ్యవహారం పెద్ద సంచలనానికే దారి తీసింది. ప్రస్తుతం కోలీవుడ్లో జయంరవికి జంటగా నటిస్తున్న బోగన్ చిత్రం మినహా మరో అవకాశం రాలేదు. బోగన్ చిత్రం కూడా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సో మరో అవకాశం వచ్చే వరకూ హన్సిక పేరు కోలీవుడ్లో వినిపించకపోవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన దత్త పిల్లలతో దీపావళిని జరుపుకోవడానికి ప్లాన్ చేసే పనిలో ఉన్నారట. దీని గురించి తను ఒక భేటీలో చెబుతూ తానీసారి దీపావళి పండగను తన 31 మంది దత్త పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకోసం ముంబైలో ఒక మండపాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి, చుట్టు పక్కల షాపింగ్ వీధుల్లో తిరిగి వారితో కలిసి భోజనం చేసి ఆ రోజంతా పిల్లలతోనే గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. పిల్లల సంతోషాన్ని దగ్గరగా చూడాలనే ఈ ఏర్పాటు అని వివరించారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు హన్సిక ఇచ్చిన బదులేమిటో చూద్దాం. ప్ర: మీ సహ నటీమణుల్లో కొందరు వివాహం చేసుకున్నారు. మరి కొందరు అందుకు సిద్ధం అవుతున్నారు. మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? జ : నేనింకా చాలా చిన్న పిల్లనండీ. నాకింకా పెళ్లీడు రాలేదు. అందుకే అలాంటి ఆలోచన లేదు. మరో ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటాను. ప్ర: మీది ప్రేమ వివాహం అవుతుందా? పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారా? జ : ప్రేమ అన్నది ఒక అందమైన అనుభవం. అంది అందరికీ కావాలి. అయితే అలాంటి ప్రేమ నా జీవితంలోకి వచ్చి వెళ్లిపోయింది. మా అమ్మ చూసి నిశ్చియించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ప్ర: హీరోలెవరైనా మిమ్మల్ని సహోదరి అని పిలిచారా? జ: లేదు.అలా నన్నెవరూ పిలవలేదు. ఇంకా చెప్పాలంటే హీరోహీరోయిన్లు అన్నా చెల్లెలుగా మసలు కుంటే నటించే ప్రేమ సన్నివేశాలు పండవు. ప్ర: సరే ఏ హీరో భార్యతోనైనా మీకు స్నేహం ఉందా? జ: నటుడు జయంరవి భార్య ఆర్తీ నాకు మంచి నెచ్చెలి. తను అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య మంచి స్నేహం ఉంది. ప్ర: తమిళంలో చాలా చిత్రాలు చేశారు. అయినా తమిళ భాషను మట్లాడలేకపోతున్నారే? జ : నిజానికి నాకు తమిళ భాష కొంచెం తెలుసు. అయితే మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే అర్థాలు మారిపోతాయనే భయంతో మాట్లాడడం లేదు. -
గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు
రాంచరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమాకు తమిళంలో ఒరిజినల్ వెర్షన్ చేసిన జయం రవి.. తన కొత్త సినిమా బోగన్ షూటింగులో గాయపడ్డాడు. మళ్లీ త్వరలోనే పని మొదలుపెడతానని అతడు చెప్పాడు. బోగన్ సినిమాలో ఒక కీలక సన్నివేశం షూటింగ్ సందర్భంగా గాయపడినప్పుడు జయం రవి భుజానికి తీవ్రగాయమైంది. ఆ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. ''మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. షూటింగ్ సందర్భంగా చిన్న గాయమైంది. మరికొద్ది రోజుల్లో మళ్లీ పని మొదలుపెడతా. అభిమానులే నా బలం'' అని రవి ట్వీట్ చేశాడు. ఇంతకుముందు జయం రవి నటించిన జాంబీ సినిమా మిరుదన్, అంతకుముందు 2015లో చేసిన తని ఒరువన్ రెండూ బ్రహ్మాండమైన హిట్ అయ్యాయి. బోగన్ సినిమాలో జయం రవి సరసన హన్సిక నటిస్తుండగా, వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రోమియో జూలియట్ దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. Thank u for ur love and prayers. I'm doing well. A minor injury at shoot. Will resume work in a few days. U guys r my strength — Jayam Ravi (@actor_jayamravi) 22 October 2016 -
సూర్యతో మరో చాన్స్?
సూర్యతో హిట్ పెయిర్ లిస్ట్లో అందాల భామ హన్సిక కూడా ఉన్నారు. మాస్ ఎంటర్టెయినర్ సింగం-2లో అనుష్కతో పాటు హన్సిక కూడా నాయకిగా నటించిన విషయం తెలిసిందే. హన్సికకు సక్సెస్ఫుల్ నాయకి అనే పేరే ఉంది. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జయంరవితో నటిస్తున్న బోగన్ చిత్రం ఒకటే ఈ అమ్మడి చేతిలో ఉంది. తాజాగా సూర్యతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు సమాచారం. సూర్య ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. నటి నయనతార లవర్గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి తానా సేర్న్ద కూటం అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నటి నయనతార నాయకిగా నటించే అవకాశాలు ఉన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ దర్శకుడు విఘ్నేశ్శివతో కలిపి బోలెడు గ్యాసిప్స్ హల్చల్ చేస్తుండడంతో సూర్యతో నటించడానికి సుముఖత వ్యక్తం చేయనట్లు కోలీవుడ్లో జరుగుతున్న ప్రచారం. ఈ చిత్రంలో సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని కీర్తీసురేశ్ కొట్టేశారు. ఇందులో మరో నాయకి ఉన్నారట. ఆ అవకాశం నటి హన్సికను వరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ బ్యూటీ ఇంతకు ముందు సింగం-2లో నటి అనుష్కతో కలిసి సూర్యతో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ తానా సేర్న్ద కూటం చిత్రంతో మరోసారి ఆయనతో జత కట్టనున్నారన్న మాట. అయితే ఈ విషయాన్ని హన్సిక వర్గం ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్, సతీష్, శరణ్య పొన్వన్నన్, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
ఈసారి పెద్దవాళ్ల కోసం!
అందమైన రూపం మాత్రమే కాదు... అంతకు మించి అందమైన మనసు హన్సిక సొంతం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు అనాథ బాలలను దత్తత తీసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటి వరకూ ఆమె 31 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. తానే తల్లీ తండ్రీ అయ్యి ఆ బాలల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఈ నెల 9న హన్సిక పుట్టినరోజు. అయితే ఈసారి ఎవ్వరినీ దత్తత తీసుకోలేదు. ఎందుకంటే... వృద్ధాశ్రమం కట్టాలనుకుంటున్నారు. పిల్లల ఆదరణ కోల్పోయిన వృద్ధులకు అండగా, ఆసరాగా నిలవాలని హన్సిక నిర్ణయించుకున్నారు. ‘‘ఈసారి హన్సిక పిల్లలను దత్తత తీసుకోలేదు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటోంది. 31 మంది చిన్నారుల బాధ్యతలను చూసుకోవడంతో పాటు ఆశ్రమంపై దృష్టి పెడుతున్నాం’’ అని హన్సిక తల్లి మోనా తెలిపారు. పండగలు, పుట్టినరోజు వంటి ముఖ్యమైన సందర్భాలను చిన్నారులతో జరుపుకుంటారు హన్సిక. 25వ పుట్టినరోజును కూడా వారితోనే జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారితో గడిపిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. -
మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది
మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని అంటున్నారు అందాల భామ హన్సిక. తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత అంటున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల ఉదయనిధి స్టాలిన్కు జంటగా నటించిన మనిదన్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో ఆ సంతోషాన్ని అనుభవిస్తూ తాజాగా భోగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు. ఇది ఆమె జయంరవితో నటిస్తున్న మూడో చిత్రం అన్నది గమనార్హం. ముందుగా ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తరువాత రోమియో జూలియట్ చిత్రంలో జత చేరారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా భోగన్ చిత్రంలో మరో సారి కలిసి నటిస్తున్నారు. విశేషం జయంరవితో నటించిన తొలి చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. ఈ భోగన్ చిత్రానికి ఆయన నిర్మాత. రోమియో జూలియెట్ చిత్రం దర్శకుడు లక్ష్మణ్నే భోగన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని వివరాల గురించి హన్సికతో చిన్న భేటీ.. ప్ర: మనిదన్ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తునట్లున్నారు? జ: మనిదన్ నాకు చాలా నచ్చిన చిత్రం. అందులో గ్రామీణ యువతిగా నటించాను. ఇంతకు ముందు అరణ్మణై చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించినా, మనిదన్ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా అమరింది. నా గత చిత్రాల పాత్రలకు మనిదన్ చిత్రంలోని పాత్ర పూర్తిగా భిన్నం. అందుకే చాలా ఆస్వాదిస్తూ నటించాను. అందుకు మంచి పేరు వచ్చింది. ప్ర: ఉదయనిధి స్టాలిన్తో రెండో సారి నటించడం గురించి? జ: అవును.అయన తొలి చిత్రం ఒరు కల్లు ఒరు కన్నాడి చిత్ర నాయకిని నేనే. ఇంకో విషయం ఏమిటంటే మేమిద్దరం కలిసి మరో చిత్రంలో నటించాల్సింది. అది పూర్తిగా అమెరికాలో జరిగే కథ. దానికి అహ్మద్నే దర్శకత్వం వహించాల్సి ఉంది.అందులో నాది చాలా గ్లామరస్ పాత్ర. అయితే ఆ చిత్రం ప్రారంభం కాలేదు. అందుకే మనిదన్ చిత్రంలో నటించమని అడిగారు. తొలి చిత్రంలో నటించినప్పుడు ఉదయనిధి కొత్తనిపించారు. ఇప్పుడు నటనలో ఆరితేరారు. మంచి స్నేహితుడు. ప్ర: సరే తాజా చిత్రం బోగన్ గురించి? జ: నేను ఇంతకు ముందు జయంరవితో కలిసి నటించిన రోమియో జూలియెట్ చిత్రం మంచి హిట్. మా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని దర్శకుడు లక్ష్మణ్ అన్నారు. అందుకే మళ్లీ బోగన్ చిత్రంలో కలిసి నటిస్తున్నాం. ప్ర: బోగన్ చిత్రం కథేంటి? జ: కథ గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్ర: హిందీ చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: నాకు తమిళ చిత్రాలలో నటించడానికే సమయం సరిపోతోంది. అందుకే తమిళ చిత్రాలకే ప్రాముఖ్యత నిస్తున్నాను. ప్ర: ఇన్ని చిత్రాల్లో నటించినా ఇంకా తమిళ భాష నేర్చుకోలేక పోయారుగా? జ: ఎవరు చెప్పారు? తమిళంలో ఏమి మా ట్లాడినా నాకు అర్థం అవుతుంది. కొంత వర కూ మాట్లాడగలను. త్వరలోనే తమిళ భాష ను పూర్తిగా మాట్లాడగలను. అందుకే తమిళ చిత్రాల్లోనే నటించాలని ఆశపడుతున్నాను. -
సెట్లో... టైమ్ బాంబ్
‘దేశముదురు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడ బాగానే సినిమాలు చేశారు హన్సిక. అయితే. తెలుగులోకన్నా ఇప్పుడు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ హన్సిక కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా ఉంది. చిన్న ఖుష్బూ అని తమిళ పరిశ్రమ, ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుస్తుంటారు. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది. ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ - ‘‘నేను షూటింగ్కి కరెక్ట్ టైమ్కి వెళిపోతాను. ఏడు గంటలంటే ఓ పది నిమిషాలు ముందే లొకేషన్లో ఉంటాను. అందుకే అందరూ నన్ను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారు’’ అని చెప్పారు. పంక్చువాల్టీని ఇష్టపడే హన్సిక ఇప్పుడా విషయంలో కొంచెం మారాలనుకుంటున్నారు. ‘‘నేను ముందు లొకేషన్కి వెళిపోతాను. కానీ, ఆలస్యంగా వచ్చేవాళ్ల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు. దాంతో నేను ముందు వెళ్లినా ప్రయోజనం ఉండదు. అందుకే, కొంచెం మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ, నావల్ల కావడం లేదు’’ అని హన్సిక పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తాను చేస్తున్న చిత్రాల వివరాలు తెలియజేస్తుంటారు. అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. హన్సిక ట్విట్టర్ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇటీవలే 20 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఈ బ్యూటీ ధన్యవాదాలు తెలిపారు. -
ప్రశాంతంగా గడపాలి
టీనగర్: ప్రశాంతంగా జీవితం గడపాలనేదే తన ఆశని నటి హన్సిక తెలిపారు. త్రిష, నయనతారకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడడంతో హన్సిక, కాజల్ అగర్వాల్ వంటి తారలకు చిత్ర అవకాశాలు తక్కువయ్యాయి. హన్సిక తమిళంలో నటించిన ‘ఉయిరే ఉయిరే’ చిత్రం ఇటీవల విడుదలయింది. ఆ తర్వాత మణిదన్, భోగన్ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కూడా చిత్రాల్లేవు. కొత్త చిత్రాలను అంగీకరించేందుకు స్క్రిప్ట్లు వింటున్నారు. తాను నటిని కాకుంటే డాక్టర్ అయి ఉండేదాన్నని ఆమె తరచూ అంటుండేవారు. ఆమె తల్లి కూడా డాక్టర్ అనేది గమనార్హం. హన్సికకు తరచుగా న్యూయార్క్కు టూర్ వెళ్లడం, అక్కడే నెల రోజులు వరకు గడపడం ఇష్టం. న్యూయార్క్పై ఆమెకున్న ప్రేమే ఈ పయనానికి కారణమట. ఇటీవల తన ఇష్టాయిష్టాల గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక ఒక ప్రశ్నకు బదులిస్తూ వందేళ్ల వరకు బతుకుతాననే నమ్మకం ఉందని, నిద్రించే సమయంలో నెమ్మదిగా నిద్రించాలని, ప్రశాంతంగా జీవితం గడపాలనేదే తన ఆశని పేర్కొన్నారు. -
చిన్నప్పుడే ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు!
ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడని నటి హన్సిక అంది. ఈ ఉత్తరాది భామ ఇటీవల చాలా కసరత్తు చేసి తన అందాలను మరింత మెరుగు పరచుకుంది. చిత్రాల ఎంపికలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ సెలెక్టెడ్ చిత్రాలనే చే సుకుంటూ పోతున్నారు. హన్సిక నటించిన పోకిరిరాజా చిత్రం ఇటీవలే విడుదలైంది.ప్రస్తుతం ఉయిరే ఉయిరే, మనిదన్ చిత్రాల్లోనటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న భేటీ... పోకిరిరాజా చిత్రంలో సన్నగా మరింత అందంగా కనిపించారు. శారీరక సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారే? థ్యాంక్స్. శారీరక అందంపైనే కాదు, చిత్రాల ఎంపికపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. జీవాకు జంటగా నటించిన పోకిరిరాజా చిత్రంలో స్వచ్ఛ భారత్ పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా మంచి కథా పాత్రలో నటించాను. ఇది తన నిజజీవితానికి దగ్గరగా ఉండడంతో పత్యేక దృష్టి పెట్టి నటించాను. ఈ మధ్య మీ మార్కెట్ తగ్గిందనే ప్రచారం గురించి? నేను నటించిన చిత్రాలన్నీ విడుదలయ్యాయి. ప్రస్తుతం సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నాను. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విక్రమ్ వంటి ప్రముఖ నటుల సరసన నటించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. నటుడు శింబుతో నటించడానికి నిరాకరించారట? ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇదునమ్మఆళు చిత్రంలో నటించనున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ చిత్రంలో నటించమని నన్ను ఎవరూ అడగలేదు. సినిమాను తప్ప నేనెవరినీ ప్రేమించలేదు. నాకు మగ స్నేహితులు అధికంగా లేరు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక కుర్రాడు ప్రేమిస్తున్నానని చెప్పాడు.ఆ తరువాత ఎవరూ ప్రేమిస్తున్నానని నాతో చెప్పలేదు. నా ప్రశ్నకు మీరేదేదో చెబుతున్నారే? మీరడిగిన ప్రశ్నలో దాగి ఉన్న నిగూడార్థాన్ని నేను తెలుచుకోగలను. నేనేమీ చిన్న పిల్లనా? అర్థంకాక పోవడానికి. మీరు నంబర్ ఒన్ నటి పోటీలో ఉన్నారనుకోవచ్చా? నానుంచి మీరేమి ఆశిస్తున్నారో అర్థమైంది.ఆ తరువాత మీకు నయనతార పోటీయా? అని అడుగుతారు. నా జవాబుతో సంచలనం కలిగించి ఏ వివాదానికో దారి తీసేలా ప్రయత్నం చేస్తారు. నిజానికి మీరో, నేనో అంటే నంబర్ ఒన్ నటి అయిపోరు. దాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు.నా వరకూ నేను మంచి కథా పాత్రలు ఎంపిక చేసుకుని శక్తి వంచన లేకుండా నా పని నేను చేసుకుపోతాను. ఈ నా నిర్ణయం నన్ను ఏ స్థాయిలో కూర్చోపెడుతుందో అదే జరుగుతుంది. ఈ మధ్య హారర్ చిత్రాల్లో నటించారు. దెయ్యాలంటే భయపడతారా? భయమా? గియమా? నిజానికి అసలు దెయ్యాలుంటేగా. వాటికి భయపడడానికీ. ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతాను. అదే మన జీవితాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఇక దెయ్యాలు, భూతాలు అనేవి సినిమాలకే పరిమితం. అరణ్మణై సిరీస్ చిత్రాల్లో అలాంటి పాత్రలు పోషించాను. అదో మంచి అనుభవం. మీ చిత్ర లేఖనాలను వేలం వేస్తానన్నారు? నేను వేసిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వేలం చేసి నేను దత్తత తీసుకున్న 31 మంది పిల్లల సంరక్షణ కోసం నిధిని చేకూర్చాలనుకుంటున్నాను. ఇప్పటికే ఒక సారి ముంబైలో నా పెయింటింగ్లను వేలం వేశాను. త్వరలోనే చెన్నైలోనూ పెయింటింగ్స్ను వేలం వేయాలనుకుంటున్నాను. -
మంచి నటి అన్న పేరు చాలు!
మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్ను ఈ ఏడాది కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది. తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్గా నంబర్ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్ఒన్ స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం. -
కలల హీరో కోసం ఎదురు చూస్తున్నా
చెన్నై : నా కలల హీరో కోసం ఎదురుచూస్తున్నా అంటున్నారు మిల్కీ బ్యూటీ హన్సిక. అందమైన అమ్మాయిలందరిలోనూ మంచి మనసు ఉంటుందని చెప్పలేం. ఈ రెండు కలసిన పాలరాతి బొమ్మ హన్సిక. నటిగా ఎంత ప్రతిభావంతురాలో వ్యక్తిగానూ అంత మానవత్వం కలిగిన హన్సిక తన ప్రతి పుట్టిన రోజుకూ ఒక అనాథ పిల్లను లేదా పిల్లాడిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని మోస్తున్న అరుదైన నటి హన్సిక. అలా ఇప్పటికి 23మంది పిల్లలను పెంచి పోషిస్తున్న ఈ ముంబాయి భామ దీపావళి పండగను వారి సమక్షంలో జరుపుకుని ఎనలేని ఆనందాన్ని అందించారట. ఒక పక్క నటిగా తన స్థాయిని పెంచుకుంటూ మరో పక్క సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా పేరు తెచ్చుకుంటున్న హన్సికతో చిన్న భేటీ... ప్ర : నటిగా మీ బలం, బలహీనతలు? జ: నటి కావడమే నా బలం. ఇక బలహీనతకు తావే లేదు. ప్ర : మీ మనసుకు నచ్చిన కథానాయకుడెవరు? జ: నాతో జత కట్టిన కథా నాయకులందరూ నాకు నచ్చినవారే. వారిలో ఒకరి పేరు చెప్పి మరొకరి కోపానికి గురికావడం నాకు ఇష్టం లేదు. ప్ర : మీ అమ్మ డాక్టరు. మీరు నటనను వృత్తిగా ఎంచుకున్నారు. అప్పుడు మీ అమ్మ రియాక్షన్ ఏమిటి? జ: ఆ విషయం గురించి సరిగా జ్ఞాపకం లేదు కానీ మా అమ్మ రియాక్షన్ను అర్థం చేసుకునేలోగానే నేను నటనా రంగంలోకి ప్రవేశం చేసేశాను. అమ్మ స్కిన్ డాక్టరు. పలువురు బాటీవుడ్ నటీనటులు అమ్మ వద్దకు సలహాలు, సూచనల కోసం వస్తుండేవారు. అలా వాళ్లను చూస్తూ ఎదిగిన దాన్ని నేను. అలానే సినిమా అవకాశం రావడంతో బాలతారగానే ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్లలో తెలిసిన నటినైపోయాను. మొదట్లో నా కూతురు తనలా డాక్టరు కాలేకపోయిందనే చిన్న బాధ ఉన్నా ఆ తర్వాత అది పోయింది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. ప్ర : మీ ప్రతి పుట్టిన రోజున అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం అనే సేవా దాతృత్వ కార్యక్రమం కొనసాగుతుందా? జ: తప్పకుండా కొనసాగుతుంది. ఈ ఆలోచన నాకు చిన్నతనం నుంచే ఉండేది. భవిష్యత్లో కూడా నా శక్తి కొలదీ దత్తత స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. ప్ర : ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? జ: స్క్వాష్ క్రీడ ఆడతాను. పెయింటింగ్ చేస్తాను. పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాను. ప్ర : మీ కలల హీరో ఎవరు? జ: కలల హీరోను ఇకపైనే అన్వేషించాలి. ఆ ఎవరనే వాడి కోసమే నేనూ ఎదురు చూస్తున్నాను. ప్ర : సరే మీ డ్రీమ్ పాత్ర అంటూ ఏమైనా ఉందా? జ: నా డ్రీమ్ పాత్ర ఏమిటన్నది నా అభిమానులే చెప్పాలి. ఇప్పటి వరకూ నాకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాను. అంతే కానీ నాకంటూ డ్రీమ్ పాత్ర అంటూ ఏదీలేదు. ఎప్పటికీ అభిమానుల తీర్పే నాకు ముఖ్యం. ప్ర : స్నేహం ద్రోహంగా మారితే దాన్ని ఎలా ఎదుర్కొంటారు? జ: నేను అవన్నీ దాటే వచ్చాను. కాబట్టి ఆ విషయం గురించి పెద్దగా పటించుకోను. మనసు బాధిస్తుంది. అయినా చిరు నవ్వుతోనే దాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తాను. -
హన్సిక.. ఉదయనిధి.. ఓ సెల్ఫీ!
బబ్లీ బ్యూటీ హన్సిక.. సెల్ఫీలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఒకపక్క షూటింగులో పాల్గొంటూనే కాస్త విరామం దొరికినప్పుడల్లా ఓ సెల్ఫీ తీసేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఒకవైపు ట్విట్టర్, మరోవైపు ఇన్స్టాగ్రామ్ రెండింటిలోనూ హన్సిక తన సెల్ఫీలు పోస్ట్ చేస్తోంది. నేరుగా సెట్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నానంటూ హీరో ఉదయనిధి స్టాలిన్తో కలిసి తాను దిగిన ఫొటోలను ట్వీట్ చేసింది. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ తమ తమ ఫోన్లతో ఫొటోలు తీసుకుంటుండగా.. అవతలి నుంచి మూడో వ్యక్తి కూడా ఒకరు వీళ్లిద్దరినీ ఫొటో తీశారు. ఇప్పుడా సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోనే హన్సిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Reporting live from sets !!! Behind the scenes #candid @Udhaystalin -
హన్సిఖామణి
హన్సిక మంచి నటే కాదు... మంచి మనసున్న వ్యక్తి కూడా. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తుంది. ఎందరో అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. వారికో మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆరాట పడుతోంది. ఒక వృద్ధాశ్రమం కట్టి నీడ లేని వృద్ధులకు ఆశ్రయం కూడా ఇవ్వాలనుకుంటోంది. ఇన్ని మంచి గుణాలున్న హన్సిక ఓ విలువైన మణి. అందుకే ఆమె... హన్సిఖామణి! ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అసలు మీకెప్పుడైనా కోపమొస్తుందా? చాలా తక్కువ. ఎప్పుడైనా వచ్చినా వెంటనే కంట్రోల్ చేసుకుని కూల్ అయిపోతాను. కోపం చాలా చెడ్డది. అందుకే దాన్ని దగ్గరకు రానివ్వను. మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి? నాకు గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ఐ ప్యాడ్, ఐ ఫోన్, ఐ టచ్... అవి లేకపోతే బతకలేను. ఎప్పుడూ కొత్తవి కొంటూనే ఉంటాను. పాతవి నా అసిస్టెంట్లకి ఇచ్చేస్తాను. అలాగే డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ముంబైలో ఉన్నప్పుడు నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటాను. ఫ్రీ టైమ్ దొరికితే..? స్క్వాష్ ఆడతాను. స్విమ్మింగ్ చేస్తాను. ప్రతి సినిమానీ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. వంట కూడా చేస్తుంటాను. వెజ్, నాన్వెజ్... ఏదైనా అదరగొట్టేస్తా. మీకు డిసిప్లిన్ ఎక్కువట..? అవును. ఉదయం లేవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ అన్నీ టైమ్ ప్రకారం చేస్తాను. షూటింగ్కి ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లను. ఏ పనినీ వాయిదా వేయను. అన్నీ పద్ధతి ప్రకారం జరిగి పోవాలి. నాకే కాదు, ప్రతి మనిషికీ డిసిప్లిన్ అవసరమంటాను నేను. దేవుణ్ని నమ్ముతారా? ఎంత నమ్మాలో అంతే నమ్ముతాను తప్ప మూఢభక్తి లేదు. నిజానికి నాకు బౌద్ధమతమంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది మతానికి ఏమీ చేయమనదు. నీ కోసం, నువ్వు మంచిగా బతకడం కోసం, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం కోసం ఏమైనా చేయమంటుంది. హోమాలు, పూజలు చేసే బదులు సాటి మనిషికి సాయం చేయమంటుంది. మీరు ఎలాగూ చేస్తారుగా? ఏదో నాకు చేతనైనంత. మా అమ్మమ్మ సమాజ సేవ చాలా చేసేది. అమ్మ కూడా అంతే. చిన్నప్పుడు పండు గలొస్తే సినిమాలకీ షికార్లకీ కాకుండా... ఓల్డేజ్ హోమ్స్కీ, అనాథాశ్రమాలకీ తీసుకెళ్లేవారు. అక్కడివాళ్లకు అన్నీ పంచిపెట్టి సెలెబ్రేట్ చేసేవాళ్లు. అవన్నీ చూశాక ఎదుటివారికి ఇవ్వడంలోనే ఆనందం ఉందని తెలుసుకున్నాను. డబ్బుకి విలువిస్తారా? లేదు. నా రెమ్యునరేషన్ గురించి కూడా నేను మాట్లాడను. అన్నీ అమ్మే చూసుకుంటుంది. అందరు పిల్లల్లాగే నేను కూడా అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసు కుంటాను. అంతకుమించి ఎంత వస్తోంది, ఎంత ఖర్చవుతోంది అని లెక్కలేసే అలవాటు నాకు లేదు. కాంప్లిమెంట్స్ కోరుకుంటారా? కోరుకుంటే వచ్చేవి కాదు కాంప్లిమెంట్స్. మనం చేసే పనిని బట్టి అవి లభిస్తాయి. అసలు ఎవరో పొగడాలని ఏ పనీ చేయకూడదు. ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే పనికి సార్థకత లభిస్తుంది. గాసిప్స్కి మీ రియాక్షన్? రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందనుకోను. రకరకాల మనుషులు ఉంటారు. వారికి తోచినట్టు ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనల్ని మనం నియంత్రించలేం. అయినా నిజం మనకు తెలిసినప్పుడు ఎవరో ఊహించి మాట్లాడే మాటలను పట్టించుకోవడం అవసరమా! పెళ్లి ఎప్పుడు? పుట్టుక, మరణం మన చేతిలో లేనట్టే పెళ్లి కూడా ఉండదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మీ డ్రీమ్ లవర్ ఎలా ఉండాలి? ఎవరు, ఎప్పుడు మన జీవితంలోకి వస్తారో మనకు తెలియదు కదా! అప్పటి పరిస్థితులను బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడటం, పడకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అతను ఇలా ఉండాలి అని ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను. మీ లైఫ్ యాంబిషన్? చాలామంది పేద పిల్లల్ని దత్తత తీసుకుని, వారి అవసరాలన్నీ తీరుస్తున్నాను. అలాగే ఓల్డేజ్ హోమ్ కట్టి, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు ఆశ్రయం ఇవ్వాలని ఉంది. ప్రాణమున్నంత వరకూ ఎదుటివాళ్లకు సాయపడటమే నా లక్ష్యం! -
నేను సైతం స్వచ్ఛభారత్లో
స్వచ్ఛభారత్కు నేను సైతం అంటూ సిద్ధం అవుతున్నారు నటి హన్సిక. ప్రధాని ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ పథకం చాలా మట్టుకు ప్రచారానికే పరిమితం అయ్యిందనే ఆరోపణలు ఎదురవ్వుతున్న నేపథ్యంలో నటి హన్సిక గొడవేంటంటారా? అయితే ఆమె స్వచ్ఛభారత్కు నేను సైతం అంటోంది రియల్ లైఫ్లో కాదు లెండి. రీల్లైఫ్లోనే. విషయం ఏమిటంటే ఈ క్రేజీ బ్యూటీ తాజాగా నటుడు జీవాతో రొమాన్స్కు సిద్ధం అవుతున్నారు. ఇటీవల విజయాల్లో వెనుకబడ్డ జీవా ఇప్పుడు చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నయనతారతో తిరనాళ్ చిత్రంతో పాటు కవలైవేండామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేష్ ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఇప్పుడు జీవా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. దర్శకుడు రామ్ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో హన్సిక నాయికగా ఎంపికైంది. దీని గురించి ఆమె తెలుపుతూ దర్శకుడు చెప్పిన కథ వైవిధ్యంగా ఉందని తెలిపారు. ఇందులో తన పాత్ర చాలా హ్యుమరస్గా ఉండడంతో అంగీకరించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ వలెంట్రీ యువతిగా నటించనున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం అరణ్మణై-2లో నటిస్తున్నారు.తదుపరి నటించే చిత్రం జీవాతోనేనని తెలిపారు. -
హాయ్ జూలియట్
నటి హన్సిక మంచి జోష్ మీద ఉన్నారు. కారణమేమిటంటారా? ఈ అమ్మడు నటించిన రోమియో జూలియట్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటారీ హన్సిక. అరణ్మైణ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, ఆ తరువాత దెయ్యంగా రెండు డైమన్షన్ గల పాత్రలో నటించి మెప్పించిన ఈ ఉత్తరాది బ్యూటీ తాజాగా రోమియో జూలియట్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జయంరవి హీరోగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర గురించి హన్సిక తెలుపుతూ ఈ చిత్రంలో తాను ఎయిర్హోస్టెస్గా నటించానని తెలిపారు. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో కూడిన ఈ చిత్రం తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని అలా ఎంచుకున్న చిత్రాల్లో రోమియో జూలియట్ ఒకటని అన్నారు. అప్పుడే ప్రేక్షకులు ఎక్కడ కనిపించినా హాయ్ జూలియట్ అని పిలుస్తున్నారని అలా చిత్రంలోని పేరుతో పిలించేంతగా గుర్తింపు రావ డం ఏ నటికైనా ఆనందంగా ఉంటుం దని హన్సిక అన్నారు. ఈ ఏడాది రెండవ భాగంలో రోమియో జూలియట్తో పాటు విజయ్తో నటిస్తున్న పులి చిత్రం కూడా విడుదల కానుండడం సంతోషకరమైన విషయమన్నారు. -
మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా
టీనగర్: నటి హన్సిక మరో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. హన్సిక మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న వాలు త్వరలో విడుదల కానుందన్నారు. జయం రవితో నటించిన రోమియో జూలియట్, విజయ్తో నటించిన పులి విడుదల కానున్నాయన్నారు. తనను వెదుక్కుంటూ ఏడు కథలు వచ్చాయని, వీటిలో రెండింటిని సెలక్ట్ చేశానన్నారు. పెద్ద హీరో, పేరున్న దర్శకుని చిత్రాలని, ఆయా సంస్థలు వీటి గురించి ప్రకటన విడుదల చేస్తాయన్నారు. ఈ క్రమంలో హిందీ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నందున ప్రస్తుతం నిరాకరించినట్లు తెలిపారు. చక్కని కథాంశంలో పెద్ద చిత్రాలు కుదిరితే నటిస్తానన్నారు. నిరాదరణకు గురైన చిన్నారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని, ఇంతవరకు 25 మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు పిల్లలను ఆగస్టులో దత్తత తీసుకోనున్నానని, వీరి కోసం ముంబై శివారు ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశానన్నారు. అందులో వారికి అనాథశ్రమం నిర్మిస్తానని తెలిపారు. -
భూకంప బాధితులకు హన్సిక చేయూత
చెన్నై : నేపాల్లో భూకంపం విళయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిదివేల మంది పైగా మృత్యువాత పడ్డారు. ఎందరో క్షతగాత్రులయ్యారు. మంగళవారం కూడా అక్కడ భూకంపం వచ్చి మరికొందరి ప్రాణాలను బలిగొంది. అలాగే నేపాల్ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి నేపాల్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. చాలామంది వ్యక్తిగతంగాను ఆపన్న హస్తం అందిస్తున్నారు. అదే విధంగా నటి హన్సిక నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆరు లక్షలు అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తన సేవా నిరతిని నిరూపించుకున్నారు. ఆమె ఇప్పటికే తన పుట్టినరోజు కొక్కరి చొప్పున అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. త్వరలో ముంబైలో వారికి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న హన్సిక సేవానిరతికి జోహార్లు. -
అభిమానుల సంతోషాన్నే కోరుకుంటా
అందం చూడవయా ఆనందించవయా అన్నారో కవి. అందానికి అంత ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పాలంటే స్త్రీలకు అందం ఒక ఆయుధం అనవచ్చు. సినీ రంగంలో అలాంటి అందాలతో చాలామంది నెగ్గుకొస్తున్నారు. అలాంటి వారిలో నటి హన్సిక ఒకరు. అయితే ఆమెలో అందం, అభినయం పోటీపడతాయిలెండి. అయినా హన్సిక అందానికి ప్రాముఖ్యతనిస్తానంటున్నారు. ఆమె నుంచి అభిమానులు ఎక్కువ కోరుకునేది అదేనట. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ తెలుపుతూ అందానికి మెరుగు పరచుకోవడం ఒక కళ అన్నారు. అలాంటి కళ తనలో ఉండడం గర్వంగా భావిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే తన ఏడుపు నటన తన అభిమానులకు నచ్చదన్నారు. తన అందమైన జాలీ నటననే వారు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే తన అందాన్ని మెరుగుపరచుకుంటున్నానని చెప్పారు. తన అందాన్ని అభిమానులు పొగుడుతుంటే మనసు సంతోషంతో పరవశం చెందుతుందన్నారు. తాను తన అభిమానులు సంతోషాన్నే కోరుకుంటానని చెప్పారు. చిన్నతనం నుంచే కుటుంబ సభ్యులు తనను మహారాణిగా చూసుకున్నారని షూటింగ్లకు వెళ్లినా అలాంటి గౌరవమే లభించడం తన అదృష్టం అన్నారు. హన్సిక ప్రస్తుతం పులి చిత్రంలో యువరాణిగా నటిస్తున్నారన్నది గమనార్హం. -
నష్టపరిహారం కోటి చెల్లించండి
నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని నటుడు, దర్శకుడు టి.రాజేందర్ రోమియో జూలియట్ చిత్ర నిర్మాతకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. వివరాల్లో కెళితే..డండన్నక పాట వ్యవహారం ముదురుతోంది. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం యువగీత రచయిత లోకేష్ డండన్నక అనే పాటను రాశారు. మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. ఈ పాటలోని పదాలు దర్శక నటుడు టి.రాజేందర్కు సంబంధించి ఉండటంతో ఆయన తన అనుమతి లేకుండా తనకు సంబంధించి పాట రాయడం ఏమిటంటూ చిత్ర నిర్మాత, దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకులకు నోటీసులు పంపారు. అందులో టి ఆర్న్యాయవాది పేర్కొంటూ డండన్నక పాటలో తన క్లయింట్ టి.రాజేందర్ మాట్లాడే భాషను అనుకరిస్తూ ఆయన పేరును వాడుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు టి.రాజేందర్కు దుష్ర్పచారాన్ని ఆపాదించడమే అవుతుందన్నారు. అదే విధంగా ఆయన ఇమేజ్కు భంగం వాటిల్లుతోందన్నారు. అందువలన నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోమియో జూలియట్ చిత్ర నిర్మాత నందగోపాల్కు, దర్శకుడు లక్ష్మణన్, సంగీత దర్శకుడు డి.ఇమాన్, గీత రచయిత లోకేష్ పాడిన అనిరుధ్లకు నోటీసులు పంపారు. -
నేను అలాంటి అమ్మాయిని కాను
సంతోషం సగం బలం అంటారు. మనిషి ఏమి చేసినా ఆనందమైన జీవితం కోసమే. అలాంటిది కొందరు ఎంత కూడబెట్టినా ఇంకా డబ్బు డబ్బు అంటూ పరుగులు పెడుతుంటారు. తనలా డబ్బు కోసం వెంపర్లాడే అమ్మాయిని కాదంటున్నారు నటి హన్సిక. కోలీవుడ్లో అత్యధిక అవకాశాలు చేతిలో ఉన్న నటీమణుల్లో నయనతార తరువాత హన్సికనేనని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అరణ్మణై, ఆంబళ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మాజీ ప్రియుడు శింబుతో నటించిన వాలు చిత్రం మేలో తెరపైకి రానుంది. శింబుతో జత కట్టిన వేట్టైమన్నన్తో పాటు జయంరవితో నటిస్తున్న రోమియో జూలియట్, ఇళయదళపతి విజయ్కి జంటగా నటిస్తున్న పులి, నటి జయప్రద కొడుకు సిద్ధార్థ్ సరసన నటిస్తున్న ఉయిరే ఉయిరే, ఉదయనిధి స్టాలిన్తో కలసి నటిస్తున్న ఇదయం మురళి అంటూ అరడజను చిత్రాలకుపైగా నటిస్తున్న హన్సిక డైరీ ఈ ఏడాది అంతా ఫుల్ అయిపోయింది. చక్కని అభినయంతోపాటు అందాలు ఆరబోయడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో హన్సికకు అవకాశాలు వద్దన్నా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ డబ్బు సంపాదన గురించి కూడా పెద్దగా పట్టించుకోదట. ఒక ఇంటర్వ్యూలో హన్సిక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అందరూ డబ్బు సంపాదన కోసమే కఠినంగా శ్రమిస్తున్నారన్నారు. అయితే తాను మట్టుకు సంపాదనే ధ్యేయంగా భావించడం లేదన్నారు. తనకు అవసరం అయిన విషయాలను అమ్మ గమనించుకుంటుందని అందుకే పరిధులు దాటి తానామెను ఏమి అడగనని అన్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ పెట్టుకోలేదు. అందుకే సంతోషంగా ఉన్నాను అని హన్సిక అన్నారు. -
ఒక్కొక్కరితో ఒక్కో ప్రత్యేక అనుభవం
ఇళయదళపతి విజయ్ డాన్స్లో ఇరగదీస్తారు. ఇక సూర్యతో నటనలో పోటీ పడటానికి చాలా కష్టపడాల్సిందే నంటోంది నటి హన్సిక. కోలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న బ్యూటీ హన్సిక. అలాగే ప్రముఖ యువ కథా నాయకులందరితోనూ నటించేస్తూ మంచి రైజింగ్లో ఉన్న ఈ ఉత్తరాది భామ ఒక్క ఖర్చు విషయంలో మినహా దర్శక నిర్మాతలకు తెగ నచ్చేస్తోంది. కారణం ఏంటంటే, చెప్పిన సమయానికి షూటింగ్కు రావడం, కాల్షీట్స్ సమస్యలు లాంటివి తెచ్చిపెట్టకపోవడం లాంటి కూడా క్వాలిఫికేషన్స్ హన్సికకు అవకాశాలు దగ్గర చేస్తున్నాయి. వరుస విజయాలు కూడా ఈ అమ్మడిని లక్కీస్టార్ను చేశాయి. అరణ్మణై, పూజై లాంటి తాజా విజయాలను తన ఖాతాలో వేసుకున్న హన్సిక ప్రస్తుతం వాలు, వేట్టైమన్నన్, ఉయిరే ఉయిరే చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తోంది. అదే విధంగా జయం రవితో నటిస్తున్న రొమాంటిక్ లవ్స్టోరీ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక ఇళయదళపతి విజయ్తో పులి చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్, సూర్య, ఆర్య, ధనుష్, శింబు వంటి స్టార్ హీరోలతో నటించిన అనుభవంతో హన్సిక వారేమిటో చెప్పనా అంటోంది. నటుడు విజయ్ డాన్స్లో దుమ్మురేపుతారు. రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తారు. సూర్య గురించి చెప్పాలంటే కఠిన శ్రమ జీవి. ఆయనతో సమంగా నటించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నటుడు ధనుష్ చాలా ప్రతిభావంతుడు. జయం రవి మంచి స్నేహశీలి. ఆర్య విషయానికొస్తే ఒట్టి అల్లరోడు. శివకార్తికేయన్ చాలా జాలీ టైప్. ఇలా ఒక్కో నటుడితో ఒక్కో ప్రత్యేక అనుభవం ఉందంటున్న హన్సిక తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ఆ కళ మగాళ్లకే అధికం
ప్రేమించడం అనేది ఒక గొప్పకళ అని అంటున్నారు హన్సిక. ఈ బ్యూటీ స్వీయ అనుభవంతో చెబుతున్నారా? ఇంతకీ ఈమె ఏమి చెప్పదలచుకున్నారు. అదేంటో చూద్దాం హిట్ చిత్రాల కథానాయికి హన్సిక. ఆ మధ్య అరణ్మణై చిత్ర హిట్తో తెగ సంతోష పడిపోయిన ఈ అమ్మడు తాజాగా ఆంబళ విజయంతో ఫుల్జోష్లో ఉన్నారు. అదే విధంగా జయంరవి సరసన నటించిన రోమియో జూలియట్ నటి జయప్రద వారసుడు సిద్ధుతో జత కట్టిన ఉయిరే ఉయిరే చిత్రాల విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం విజయ్తో పులి చిత్రంలో నటిస్తున్నారు. వ్యక్తిగతంగా చూస్తే ఆ మధ్య శింబుతో ప్రేమాయణం సాగించి ఆ తరువాత దానికి గుడ్బై చెప్పిన హన్సిక అనూహ్యంగా ప్రేమ గురించి కాచి వడపోసినట్లు ప్రేమించడం సాధారణ విషయం కాదు. అదో గొప్ప కళ అని పేర్కొన్నారు. ఇంకా వివరంగా చెబుతూ ఆడవారి కంటే మగవారికి ఈ కళ ఎక్కువగా అబ్బుతుందన్నారు. పురుషులు ప్రేమిస్తున్నారా? లేదా? అన్నది వారి కళ్లు చూస్తేనే తెలిసిపోతుందన్నారు. కొందరు కళ్లతోనే ప్రేమను వ్యక్తం చేస్తారన్నారు. చూపులతోనే అమ్మాయిలను ప్రేమలో పడేలా చేసుకోగలరని చెప్పారు. అయితే ఆడవారు అలా కాదని వారు ప్రేమించినా ఆ విషయాన్ని త్వరగా బయటపెట్టలేరని పేర్కొన్నారు. వీరి మనసులో ఏముందో చెప్పడం కూడా కష్టమన్నారు. ఇది సొంత అనుభవంతో చెబుతున్న మాటలని అనుకోవద్దని ప్రేమించిన స్నేహితురాళ్లను చూసిన అనుభవంతో చెబుతున్న మాటలివని హన్సిక అన్నారు. -
తమిళ పులిలో 'శ్రీదేవి'
ముంబై : పులి సినిమా షూటింగ్ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రూ.2 కోట్లు కావాలట
సాధారణంగా హీరోయిన్ల కాల్ షీట్స్ , పారితోషికం వ్యవహారాలు వారి తల్లులే చూసుకుంటుంటారు. అలాంటి అవకాశం లేని వారు మేనేజర్లను నియమించుకుంటారు. నటి హన్సిక విషయానికి వస్తే ఆమె తల్లి నిర్మాతల్ని అమ్మో అని భయపెడుతున్నారట. ఆమె విధించే షరతులకు, పెంచుతున్న పారితోషికానికి నిర్మాతలే బెంబేలెత్తి పోతున్నారట. అంతగా, హన్సిక పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ మధ్య విడుదలైన అరణ్మణై చిత్రం తర్వాత హన్సిక పారితోషికాన్ని కోటిన్నరకు పెంచేశారటా. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న గరుడ చిత్రానికి హన్సిక కోటిన్నర తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, తదుపరి ఆర్యతో నటిస్తున్న మిగామాన్ ఈనెల 25న, విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల విజయాలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న హన్సిక తల్లి ఆ చిత్రాల విడుదలకు ముందే, పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారట. దీంతో కొత్తగా వస్తున్న నిర్మాతలందరినీ రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి రూ.50 లక్షలు తీసుకున్నారట. తాజాగా నటిస్తున్న చిత్రంలో ఒక కంపెనీ వాణిజ్య ప్రకటనలో నటించే విధంగా సన్నివేశం చోటు చేసుకుందట. ఇందుకు ఆ చిత్ర నిర్మాత సదరు కంపెనీ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట.ఈ విషయం హన్సిక అమ్మ చెవిన పడడంతో అందులో సగం ఇస్తేగానీ, తన కూతురు ఆ వాణిజ్య ప్రకటన సన్నివేశంలో నటించదని కరాఖండీగా చెప్పేసిందట. దీంతో వేరే దారి లేక ఆ నిర్మాత ఆమె డిమాండ్కు తల వంచక తప్పలేదు. ఈ విధంగా నటి హన్సిక తల్లి నిర్మాతలను అమ్మో అనిపిస్తున్నట్టు కోలీవుడ్లో చర్చ సాగుతున్నది. -
అదంతా అసత్య ప్రచారం
నటి హన్సిక నటించిన తాజా చిత్రం మెగామాన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి మగిళ్ తిరువేణి దర్శకుడు. ఈ చిత్రంలో హన్సిక పోషిం చిన పాత్రపై పలు రకాల ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. హన్సిక హీరోయిన్గా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన అరణ్మణై చిత్రంతో సహా వరుస విజయాలను అందుకుంటున్న నటి హన్సిక. అదే విధంగా విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. వ్యక్తిగతంగా కూడా పలువురు పిల్లలను దత్తత తీసుకోవడం వంటి పలు సేవా కార్యక్రమాలతో మంచి ఉదార స్వభావం గల నటిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటి మెగామాన్ చిత్రంలో పోషించిన పాత్ర చిన్న పిల్లలు మెచ్చేదిగా ఉండకపోవడమే కాకుండా వారిని భయపెట్టేదిగాను, ఆమె వ్యక్తిగతానికి పూర్తి విరుద్దమైనది గాను ఉంటుందనే ప్రచారం సోషల్నెట్ వర్క్స్లో జోరందుకుంది. దీనికి స్పందించిన హన్సిక అదంతా అసత్య ప్రచారం అని కొట్టి పారేశారు. తాను మెగామాన్ చిత్రంలో హీరోయిన్గా నటించానని తెలిపారు. దీన్ని ఎవరో కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగామాన్ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన చిత్రం అని అలాంటి చిత్రంలో పిల్లలను భయపెట్టే పాత్రగా తనకెందుకుంటుందని హన్సిక ప్రశ్నిస్తున్నారు.