Hansika Motwani
-
సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక
ఉత్తరాది భామ హన్సిక(Hansika Motwani) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2003లో తన నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ ఉత్తరాది బ్యూటీ 2007లో దేశముదురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. తెల్లగా, బొద్దుగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ భామ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిలోనూ పడింది. ఆ తర్వాత 2011లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా తలుపుతట్టాయి. అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది. కాగా పలు భాషల్లో కథానాయకిగా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక ఆ మధ్య పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు. వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇంతకుముందు బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది. తాను అలా తయారు కావడానికి ఉపయోగించిన టిప్స్ను కూడా చెప్పుకొచ్చింది. అందులో మంచినీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యకారణం అని పేర్కొంది. అదేవిధంగా యోగా, ధ్యానం, వంటి శారీరక కసరత్తులు చేస్తానని కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వనని ఈ టిప్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈ బొద్దుగుమ్మ చిక్కినా సక్కగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత -
వెన్నెలనీ దోచినదీ నీవేనా.. నవయవ్వనంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరు? (ఫోటోలు)
-
మాల్దీవులు బీచ్లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
వెడ్డింగ్ డే మూడ్: మాల్దీవుల్లో హన్సిక మోత్వానీ జిల్జిల్ జిగా (ఫోటోలు)
-
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
Hansika Motwani యాపిల్ బ్యూటీలా ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)
-
జిగేల్మనే అందాలతో ట్రెండింగ్లో హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
పెళ్లికూతురిలా మెరిసిపోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు
-
దీపావళి పటాకా మాదిరి గ్లామర్తో పేల్చేసిన హన్సిక (ఫోటోలు)
-
సరికొత్త ప్రయాణం : నటి హన్సిక గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
గుడిలో టాప్ హీరోయిన్ .. ఫిదా అవుతున్న తమిళ అభిమానులు
తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన ముంబాయి బ్యూటీ హన్సిక. 2001లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రం ద్వారా కోలీవుడ్కు కథానాయకిగా పరిచయమైన ఈమె తొలి చిత్రంతోనే ఇక్కడ సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంగేయుమ్ కాదల్, ఒరు కల్ ఒరు కన్నాడీ, బిర్యాని, సింగం 2 వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి కోలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ దేశముదురు చిత్రంతో రంగ ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోలతో నటించి టాప్ కథానాయకిగా రాణించారు. అలా 50 చిత్రాలకు పైగా నటించిన హన్సిక 2022లో వివాహం చేసుకున్నారు. అయితే నటనకు మాత్రం దూరం కాలేదు. వివాహానంతరం అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. దీంతో మళ్లీ మంచి అవకాశాలు దక్కించుకోవడానికి హన్సిక తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామాక్షి అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఒకటి తమిళ వారిని మెప్పిస్తుంది. తాను ముంబైలో పుట్టినా మానసికంగా మాత్రం తాను తమిళ అమ్మాయినే అంటూ హన్సిక ఇచ్చిన స్టేట్మెంట్ వారిని మెప్పిస్తుంది. అంతేకాకుండా (నమ్మ ఊరు సాప్పాటు) మన ఊరు భోజనం సూపర్ అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో తమిళ నెటిజన్లు హన్సికను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. తమిళ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
మల్లెపూలతో మనోహరంగా హీరోయిన్ హన్సిక (ఫొటోలు)
-
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్లో 108రోజుల వర్కౌట్తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Hansika Motwani: పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికా మోత్వాని రేర్ ఫోటోలు
-
అచ్చమైన పెయింటింగ్లా అందమైన భామ (ఫోటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్లో హన్సిక
-
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న హన్సిక (ఫోటోలు)
-
బ్లాక్ డ్రెస్లో హన్సిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
సూసేకి.. అగ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్ అదిరిపోయింది!
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో, అందులోని పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. సమంత నటించిన ఊ అంటావా మామా అనే ఐటమ్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయి సినిమాకే ఎంతో హైప్ తెచ్చి పెట్టింది. పలువురు సినీస్టార్స్తో పాటు, ఇతరులు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను వైరల్ చేశారు. అదేవిధంగా రష్మిక మందన్నా నటించిన రా రా సామి అనే పాట కూడా బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం పుష్ప–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట సినిమా హైప్ను పెంచేస్తోంది.ఈ పాటకు హన్సిక లంగా ఓణి ధరించి నలుగురు కుర్రాళ్లతో కలిసి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి చిత్ర యూనిట్ ఇంకా పబ్లిసిటీని ప్రారంభించలేదు. అయితే హన్సిక వంటి సెలబ్రిటీలు అందులోని పాటకు డాన్స్ చేయడంతో ఇప్పటి నుంచే ఫ్రీ పబ్లిసిటీ మొదలైందన్నమాట. మరోవైపు సూసేకి సాంగ్.. తెలుగు, హిందీ వర్షన్స్ కలుపుకుని యూట్యూబ్లో 100 మిలియన్ (పది కోట్ల) వ్యూస్ రాబట్టడం విశేషం. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) People just cannot stop vibing to #TheCoupleSong ❤️🔥#Pushpa2SecondSingle TRENDING #1 on YouTube for music with 100 MILLION+ VIEWS & 1.67 MILLION+ LIKES 💥💥▶️ https://t.co/Tgu57adbiT#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024. pic.twitter.com/FSw6yePP7j— Pushpa (@PushpaMovie) June 14, 2024చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్ -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
స్మశానంలో షూటింగ్.. హన్సిక హారర్ మూవీ రిలీజ్
వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ లెన్స్ పెట్టినట్లు వెల్లడించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది. -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
క్షమాపణలు చెప్పిన హన్సిక
-
'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్ స్టార్కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. Celebrating 17 MASSive years of Icon Star @alluarjun's #Desamuduru 🤙🏻 Every dialogue and song from this film continues to send electrifying chills down our spine!#PuriJagannadh @ihansika #Chakri#17YearsForDesamuduru pic.twitter.com/AxxFJpo4Kd — DVV Entertainment (@DVVMovies) January 12, 2024 17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽 — Allu Arjun (@alluarjun) January 12, 2024 -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నెల రోజులకే ఓటీటీ రానున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్!
గతేడాది ప్రియుడిని పెళ్లాడిన దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ ఇటీవలే మొదటి వివాహా వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త సోహెల్ కతూరియాతో కలిసి కేక్ కట్ చేసింది. అయితే పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని హన్సిక.. ఇటీవలే మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్లో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతస్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈనెల 17 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజే స్ట్రీమింగ్కు వస్తే రిలీజైన నెల రోజులకే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్) -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ
టైటిల్: మై నేమ్ ఈజ్ శృతి నటీనటులు:హన్సిక, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు నిర్మాత:బురుగు రమ్య ప్రభాకర్ దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్ సంగీతం: మార్క్ కె రాబిన్ ఎడిటర్ : చోటా కే ప్రసాద్ విడుదల తేది: నవంబర్ 17, 2023 కథేంటంటే.. శృతి(హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది. సోషల్ మీడియా ద్వారా చరణ్(సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అతన్ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన శృతి..అనుకోకుండా స్కిన్ మాఫీయా ముఠా వలలో చిక్కుకుంటుంది. ఆ ముఠా లీడర్, ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్) చేసే అరచకాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? శృతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసు అధికారి రంజిత్(మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? స్కిన్ మాఫీయా వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యే గురుమూర్తికి, స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి(ప్రేమ)కు ఉన్న సంబంధం ఏంటి? స్కిన్ మాఫియా ముఠాను అరికట్టేందుకు శృతి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది డబ్బు కోసం గుండె, కిడ్నీ లాంటి అవయవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తారో చాలా సినిమాల్లో చూశాం. అందం కోసం పిండాలను అమ్మేసే మాఫియా ఉందని ‘యశోద’ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. కానీ స్కిన్ డ్రాప్టింగ్ మాఫియా నేపథ్యంలో మాత్రం ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఆ సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే `మై నేమ్ ఈజ్ శృతి`. చర్మంతో కూడా వ్యాపారం చేస్తున్నారనే కొత్త అంశాన్ని ప్రేక్షకులను తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికే.. తెరపై అంతే కొత్తగా చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్కిన్ డ్రాప్టింగ్ అంశంతోనే కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. మర్డర్ని రివీల్ చేసి చేసి.. అందులోని ట్విస్ట్ను సస్పెన్స్లో పెట్టాడు. ముందు, వెనుక అంటూ ఫస్టాఫ్ అంతా సస్పెన్స్గానే సాగుతుంది. అయితే ప్రతిసారి కథ ముందుకు, వెనక్కు వెళ్లడంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనం కాలేడు. కానీ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని మాత్రం కొనసాగిస్తూ సెకండాఫ్పై ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్టాఫ్లోని పలు ప్రశ్నలకు సెకండాఫ్లో సమాధానం దొరుకుతుంది. స్కిన్ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధం, స్కామ్ని బయట పెట్టేందుకు శృతి వేసే ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు థ్రిలింగ్గా ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా.. సినిమాటిక్గా అనిపిస్తాయి. స్కిన్ మాఫియా గురించి మరింత లోతుగా చర్చించి, స్క్రీన్ప్లే మరింత గ్రిప్పింగ్గా తీసుకెళ్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. శృతి పాత్రకి హన్సిక న్యాయం చేసింది. అమాయకంగా కనిపిస్తూనే..ముఖంతోనే అనేక భావోద్వేగాలను పలికించి ఆకట్టుకుంది. ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకుంది. విలన్గా పూజా రామచంద్రన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. డబ్బుకోసం ఎంతకైనా తెగించే యువతి పాత్ర తనది. ఇక అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి పాత్రలో నటించి, మెప్పించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నరేన్, మురళీ శర్మ, ప్రవీణ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)
-
'పెళ్లి తర్వాత అదొక్కటే మారింది'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్!
దేశముదురు భామ, హీరోయిన్ హన్సిక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ. ఇటీవలే మై 3 అనే వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న గార్డియన్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన ప్రియుడితో పెళ్లి తర్వాత హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా మై నేమ్ ఈజ్ శృతీ ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదని చెప్పుకొచ్చింది. హన్సిక మాట్లాడుతూ.. ' సోహైల్తో పెళ్లయ్యాకం నా లైఫ్ పెద్దగా ఏం మారలేదు. సినిమా షూటింగ్ సమయంలో క్యారెక్టర్లో ఉంటాను. ఇంటికెళ్లాక నా భర్తతో ఎక్కువ టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా అడ్రస్ మాత్రమే మారింది. అంతే తప్ప నా ఇంటి పేరులో ఎలాంటి మార్పులేదు. హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డా. అందుకే ఇంటి పేరును అలాగే ఉంచా.' అంటూ వివరించింది. 'మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. -
ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ హన్సికకు అందం అలంకారం అయితే చిరునవ్వు అదనపు ఆకర్షణ. ఈమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కు పైగా చిత్రాల్లో నటించి తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుందీ బ్యూటీ. వివాహానంతరం కూడా చెక్కు చెదరని అందాలతో తగ్గని ఆదరణతో, పెరుగుతున్న అవకాశాలతో పుల్ జోష్లో ఉందీ అమ్మడు. తాజాగా తమిళంలో నటిస్తున్న గార్డియన్ చిత్రం టీజర్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రం టీజర్ ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విభిన్న కథలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమె బహుభాషా నటిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళం, తెలుగు భాషల్లో బిజీగా చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక హిందీలో మై 3 అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గార్డియన్, మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైనవి అన్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో 105 నిమిడంగళ్, తమిళంలో మ్యాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా 2024 తనకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ పేర్కొంది. చదవండి: అమర్ దీప్కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ.. -
భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్ బ్యూటీ
ఇప్పటివరకు హీరోలకే పెళ్లి, వయసుతో పనిలేదు అనుకొనే వాళ్లం. ఇప్పుడు హీరోయిన్లూ ఆ కోవలోకి చేరిపోతున్నారు. పెళ్లయితే గ్లామర్ పోతుంది, హీరోయిన్ అవకాశాలు రావు అనే కాలం పోయింది. పిల్లలకు తల్లిలు అయిన తర్వాత కూడా ఈ కాలం నటీమణులు హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. నటి కాజల్ అగర్వాల్, నయనతార వంటి వాళ్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇక మరో అందాల తార హన్సిక గురించి చెప్పాలంటే ఇటీవలే పెళ్లి చేసుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. 2003లో దేశముదురు అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తూ నేటికీ బిజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవలే నటిగా అర్ధ సెంచరీ కొట్టిన హన్సిక హీరోయిన్గా ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో నాలుగు ఐదు చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో గార్డియన్ అనే హారర్ర్ చిత్రంలో దెయ్యంగా భయపెట్టోందుకు సిద్ధమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. దర్శకుడు విజయ్ చందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇప్పటివరకు హన్సికలోని గ్లామర్ను చూసిన ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ గార్డియన్ రాబోతుంది. నటుడు సురేష్ మీనన్, శ్రీమాన్, మొట్టై రాజేంద్రన్, ప్రదీప్ రాయన్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శబరి, గురుశరవణన్ ద్వయం దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి స్పందన వస్తోంది. నవంబర్ 30న తమళ్,తెలుగు భాషలలో గార్డియన్ చిత్రం విడుదల కానుంది. -
పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లేదంటున్న క్రేజీ బ్యూటీ
పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా అతి కొద్దిమంది హీరోయిన్లలలో హన్సికా మోత్వాని ఒకరు. ఈ ముంబై బ్యూటీ కథానాయకిగా ఎక్కువ పేరు, డబ్బు గడిచింది మాత్రం తెలుగు, తమిళం భాషా చిత్రాలతోనే. టాలీవుడ్లో దేశముదురు చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టింది. మాప్పిళై చిత్రంతో తమిళంలోనూ కథానాయకిగా రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా హిట్ కొట్టింది హన్సిక. సౌత్లో ఈ రెండు భాషల్లోనూ గట్టి పునాదినే వేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శింబు స్టార్ హీరోల సరసన గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ కలిపి 50 చిత్రాల మైలురాయిని అధిగమించిన హన్సిక గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అందాలను మెరుగు పరచుకోవడంపై ఏమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. మొదట్లో కొంచెం బొద్దుగా ఉండి జూనియర్ కుష్బూగా ముద్ర వేసుకున్న హన్సిక ఆ తర్వాత చాలా స్లిమ్గా తయారైంది. ఇప్పటికీ ఈ అమ్మడు జిమ్లోనే ఎక్కువ సమయం గడుపుతుందట. అందాన్ని కాపాడుకోవడానికి తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా హన్సిక చేతిలో ఇప్పటికీ తెలుగులో 4, తమిళంలో 4 చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉండే విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని అలరిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
జిమ్లో అన్వేషి.. వర్షంలో కృతి శెట్టి ఫోజులు
► నీతోనే డ్యాన్స్ అంటూ పొట్టి గౌన్లో రచ్చ చేస్తున్న శ్రీముఖి ► డిస్నీ ల్యాండ్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ ► ఫుల్ వర్షంలో సూపర్బ్ ఫోటోలను షేర్ చేసిన కృతి శెట్టి ► జిమ్లో వర్కౌట్స్ సెల్ఫీలతో అన్వేషి జైన్ ► కలర్ఫుల్ డ్రెస్ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ► అదిరిపోయే ఫోజులతో అందరి మనసుదోచే ఫోటోలు షేర్ చేసిన సోనాలి బింద్రే View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న హన్సిక (ఫోటోలు)
-
టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!
ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) అయితే ఈవెంట్లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్పై ఈవెంట్కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్! ) -
ఇండస్ట్రీలో అదంతా గ్యాంబ్లింగ్, నేనేమీ పట్టించుకోను: హన్సిక
పైళ్లె ఏడు నెలలే అయ్యింది. ఒక పక్క వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క హీరోయిన్గా బిజీగా ఉంది హన్సిక. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయికగా అర్ధ సెంచరీ దాటేసింది. కాగా హన్సిక హీరో ఆదిపినిశెట్టితో కలిసి నటించిన పార్ట్నర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చైన్నెకి వచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ వివాహ జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని, నట జీవితానికి తన భర్త ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. తన తల్లి అంతకుమించి అండగా ఉంటున్నారని పేర్కొంది. తనకు నటించడం చాలా ఇష్టమని చెప్పిన ఆమె నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయంది. అయితే లక్ష్యం అంటూ ఏమీలేదని మంచి నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చింది. పలు భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆ అనుభవం చాలా నేర్పిందని పేర్కొంది. 50వ చిత్రం మహాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడంతో ఆ తరహా పాత్రలోనే నటించాలని కోరుకోవడం లేదని, పాత్ర నచ్చితే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి రెడీ అంది. ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్ అని.. సీనియర్ దర్శకులైనా, వర్ధమాన దర్శకులైనా కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. పార్ట్నర్ చిత్రంలో పురుషుడిగా మారే పాత్రను పోషించానని, ఇది పూర్తిగా విలువైన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. తాను ఎప్పుడు చాలా జాలీగా ఉంటానని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మీరు నిజజీవితంలో ఎవరుగా మారాలనుకుంటున్నారన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్గా మారాలని కోరుకుంటానంది. భవిష్యత్తులో చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అందుకు అవకాశమే లేదని, అదేవిధంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. నటిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు హన్సిక పేర్కొంది. చదవండి: రూ.20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్ -
బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడెలా అయిందో చూడండి (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత బాగా సన్నబడిన హన్సిక.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్
తమిళసినిమా: అందమైన నటీమణులకు బరువు అనేది పెద్ద భారం అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. నటి అనుష్క వంటి వారికి ఇది కష్ట సాధ్యంగానే మారిందని చెప్పక తప్పదు. అయితే మరో బ్యూటీ హన్సిక మాత్రం బరువు తగ్గడం అనేదాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్గా మారింది. ముంబయి భామ హన్సిక బాల నటిగా హిందీలో కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇక కోలీవుడ్లో ధనుష్ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. విజయ్కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాగా స్లిమ్గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: యాసలందు అన్ని యాసలూ లెస్స) -
సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక
బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన హన్సిక మొత్వానీ దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. అమాయకపు చూపులతో సన్యాసిగా నటించిన హన్సిక నటనకు, అందానికి ప్రేక్షకులు దాసోహమయ్యారు. మా కళ్లతో చూడు మామా అంటూ తెలుగబ్బాయిలు ఆమె ఫ్యాన్స్ లిస్టులో చేరిపోయారు. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హన్సిక ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఆమె గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకప్పుడు ఎలా ఉండేదంటే డిజైనర్లు మాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్లే కాదు. ఓహ్, మీరు దక్షిణాది హీరోయినా? మీకు మేము దుస్తులివ్వం అని ముఖం మీదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వారంతట వారే స్వయంగా వచ్చి మరీ మీకు ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది.. ట్రైలర్ లాంచ్ లాంటివి.. మరి అలాంటప్పుడు మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా? అని బతిమాలుతున్నారు. అప్పటి మాటలకు, ఇప్పటి మాటలకు చాలా తేడా ఉంది కదా! గతంలో వాళ్లు అలా చులకనగా మాట్లాడినప్పుడు నేనేమీ వాళ్లపై పగ పెంచుకోలేదు. దానికి బదులుగా నేనింకా కష్టపడాలి. వాళ్లను నా పనితో తిరిగి రప్పించేలా చేయాలని కసిగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఛీ కొట్టినవాళ్లే తిరిగి వచ్చారో అప్పుడు నాకే ఆశ్చర్యం వేసేది. ఏంటి? మీరిప్పుడు నన్ను రెడీ చేయాలనుకుంటున్నారా? అది కూడా మీ కాస్ట్యూమ్తో అని ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా హన్సిక ప్రస్తుతం మ్యాన్ అనే సినిమా చేస్తోంది. చదవండి: 20 ఏళ్లుగా బుల్లితెరకు దూరం.. అదే నేను చేసిన తప్పు: నటుడు -
హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ యూత్లోనూ మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే రీసెంట్గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ సత్తా చాటుతున్న హన్సిక తాజాగా ఓ ఇంటరవ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది.అయితే ఆ హీరోకు తగిని విధంగా బుద్ది చెప్పానంటూ పేర్కొన్న హన్సిక ఆ టాలీవుడ్ హీరో ఎవరన్నది మాత్రం బయటకు రివీల్ చేయలేదు. దీంతో అతను ఎవరై ఉంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
హన్సిక మోత్వానీ స్టన్నింగ్ లుక్స్ ఫోటో గ్యాలరీ
హన్సిక మోత్వానీ స్టన్నింగ్ లుక్స్ ఫోటో గ్యాలరీ -
నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వాలి: హన్సిక తల్లి డిమాండ్
తమిళ సినిమా: బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి హన్సిక. ఆ తర్వాత తమిళంలో ధనుష్కు జంటగా, కథానాయకిగా మాప్పిల్లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగులో అల్లు అర్జున్కు జంటగా దేశముదురు చిత్రంతో పరిచయమయ్యారు. అలా ఈ రెండు భాషల్లోనూ నటిస్తూ అగ్రకథానాయకి స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ప్రేమ వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు బాగానే వినిపించింది. నటుడు శింబుతో ప్రేమ పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక నటిగా 50 చిత్రాల మైలు రాయిని అధిగమించిన హన్సిక ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా గత 2022 డిసెంబర్ 4వ తేదీన ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతురియను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ లోని 450 ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన ప్యాలెస్లో వీరి వివాహ తంతు వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకను కూడా హన్సిక కుటుంబం వ్యాపారంగా మార్చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థకు ఆ వేడుక ప్రసార హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. దీంతో ఆ సంస్థ హన్సిక వివాహ వేడుకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, వరుడు సోహైల్తో వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు. దాన్ని ఇప్పుడు లవ్ షాది డ్రామా పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులో నటి హన్సిక, ఆమె తల్లి మోనా మోత్వానీ గతంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి, వాటి పరిష్కారం కోసం వారు తీసుకున్న నిర్ణయాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. స్ట్రీమింగ్ అయిన లవ్ షాది డ్రామా ఎపిసోడ్ లో హన్సిక తల్లి మోనా చెప్పిన ఒక విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే వివాహ వేడుకకు సోహైల్ కుటుంబ సభ్యులు సరైన సమయానికి చేరుకోకపోవడంతో టెన్షన్ అయిన మోనా మోత్వానీ, సోహైల్ తల్లికి ఫోన్ చేసి ఇంకా మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కోరారట. ఈ విషయాన్ని ఆమె ఆ ఎపిసోడ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
పెళ్లికి ముందు భర్త చేసిన పనికి షాక్ అయిన హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ ఇలా పలు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే సోహల్ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. టాటూ వేసే సమయంలో ఆయన హన్సికకు వీడియో కాల్ చేయగా సోహెల్ చేసిన పనికి హన్సిక షాక్ అయ్యింది. ఓ ఇంజెక్షన్ తీసుకోవడానికే చాలా బాధపడతాను. అలాంటిది సోహెల్ నా పేరుమీద టాటూ వేయించుకున్నాడు అని చెబుతూ హన్సిక ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
పెళ్లిలో కన్యాదానం చేయనన్న తల్లి, ఏడ్చేసిన హన్సిక
హన్సిక పెళ్లి సందడి 'లవ్ షాదీ డ్రామా' పేరుతో హాట్స్టార్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజవగా అందులో హల్దీ, మెహందీ ప్లానింగ్ను చూపించారు. తాజాగా రిలీజైన మూడో ఎపిసోడ్లో హన్సిక, సోహైల్ డ్రెస్సింగ్ సెలక్షన్ను, మంగళసూత్రం ఎంపికను చూపించారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెళ్లి వేడుకలను షురూ చేశారు. పూజ అనంతరం హన్సిక జంట డ్యాన్సులతో హడావుడి చేసింది. మరోవైపు కన్యాదాయం చేయనని తల్లి చెప్పడంతో భావోద్వేగానికి లోనైంది హీరోయిన్. ఒకరికి దానమివ్వడానికి నువ్వేం ఒక వస్తువు కాదని, కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తానంది. 30 సంవత్సరాలు గుండెలకు హత్తుకుని పెంచుకున్న కూతురిని ఎవరికైనా దానమిచ్చేయాలంటే ఎలా మనసొప్పుతుంది, నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు అంటూ ఎమోషనలైంది ఆమె తల్లి. ఆ మాటలు విని హన్సిక కన్నీటిపర్యంతమైంది. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు గర్వంగా ఉంది. నువ్వు కన్యాదానం చేసినా చేయకపోయినా ఈ కన్య నీతోనే ఉంటుంది అంటూ ఏడ్చేసింది హీరోయిన్. -
హీరోతో లవ్ బ్రేకప్.. పెదవి విప్పిన హన్సిక!
హీరోయిన్ హన్సిక మొత్వానీ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ను పెళ్లాడింది. డిసెంబర్ 4న గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందడి హాట్స్టార్లో లవ్ షాదీ డ్రామా పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. సోహైల్కు ఇది రెండో వివాహం కాగా హన్సికకు ఇది రెండో లవ్.. అర్థం కాలేదా? గతంలో ఈ బ్యూటీ శింబుతో డేటింగ్ చేసింది. కొంతకాలం బాగానే ఉన్న ఈ లవ్ బర్డ్స్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ విషయాలను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వేరేవారికి ఎస్ చెప్పడానికి నాకు ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమను నమ్ముతాను, కానీ రొమాంటిక్ పర్సన్ అయితే కాదు. అంత ఈజీగా అన్ని ఎమోషన్స్ను వ్యక్తపరచలేను. నాతో కలకాలం ఉండాలనుకుంటున్న వ్యక్తికి ఓకే చెప్పడానికి నేను చాలా సమయమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్షిప్ విచిత్రంగా సాగింది. అయినా ఇప్పుడది ముగిసిన కథ' అని చెప్పుకొచ్చింది. కాగా సోహైల్ మొదటి పెళ్లి పెటాకులవడానికి కూడా హన్సికే కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పేరెంట్స్కు చెన్నైలో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ధనుష్ -
త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక?
హీరోయిన్స్ అందాన్ని పొగిడేవారితో పాటు ఆ అందానికి ఏదో ఇంజక్షన్సో లేదా సర్జరీనో కారణమై ఉంటుందని విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. హన్సిక కూడా ఇలాంటి ఇంజక్షన్స్ ఏదో తీసుకునే ఉంటుందని ఆమధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. హాట్స్టార్లో ప్రసారమవుతున్న లవ్ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్లో ఆ రూమర్లను కొట్టిపారేసింది. 'సెలబ్రిటీగా ఉండటం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చాలామంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. చాలామంది నేను త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్నానని రాశారు. 8 ఏళ్లకే నేను నటినయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి నన్ను త్వరగా పెద్దది చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు?' అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. హన్సిక తల్లి మధ్యలో అందుకుంటూ.. 'అదే కనక నిజమయ్యుంటే నేను టాటా, బిర్లాల కంటే ధనవంతురాలినయ్యేదాన్ని. మీరు కూడా అలా త్వరగా ఎదిగే చిట్కా చెప్పమని నా దగ్గర క్యూ కట్టేవారు. అయినా అలా రాయడానికి కాస్తైనా కామన్సెన్స్ వాడరా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు మృతి -
నా భర్త విడాకులకు కారణం నేను కాదు: హన్సిక ఎమోషనల్
డిసెంబర్ 4, 2022న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే తాజాగా వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హన్సిక తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీత్ చేసింది. అయితే హన్సిక పెళ్లికి ముందు జరిగిన అనుభవాలను లవ్ షాదీ డ్రామాలో వెల్లడించింది. సోహైల్ను పెళ్లి చేసుకునే వరకు అత్యంత సీక్రెట్గా ఉండేందకు ప్రయత్నించినట్లు తెలిపింది హన్సిక. కానీ మీడియాకు ఎలా లీకవుతున్నాయో అని తీవ్ర అసహనానికి గురైంది. ఇంకా తన జీవితంలో హన్సిక తల్లి ఆమెకు అన్ని విధాలా వెన్నెముకలా నిలిచిందని చెప్పుకొచ్చింది బ్యూటీ. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే సోహైల్కు గతంలోనే వివాహమైందని, అతడు తన భార్య నుంచి విడిపోవడానికి తానే కారణమని ఎన్నో వార్తలు బయటకు వచ్చిన విషయాన్ని హన్సిక ఈ వీడియోలో ప్రస్తావించింది. తన పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. హన్సిక మాట్లాడుతూ.. 'నా పెళ్లి అయ్యే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చాయి. అది నాకు నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్ గురించి రాసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా. అలాంటి టైంలో అమ్మ, నా సోదరుడి సలహాతో ఫస్ట్ టైం మా ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశా. సోహైల్ పారిస్లో ప్రపోజ్ చేసిన ఫొటోలు చూసి అందరూ కంగ్రాట్స్ అన్నారు. అప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. అన్ని ఓకే అనుకున్నాక తిరిగి షూటింగ్స్ కోసం చెన్నై వెళ్లా. అప్పుడే సోహైల్కు గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలొచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్ చేస్తూ.. సోహైల్ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణమని రాశారు. నిజంగా ఆతని గతం నాకు తెలుసు. కానీ.. విడాకులతో నాకు సంబంధం లేదు' అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లవ్ షాదీ డ్రామాలో హన్సిక పెళ్లికి ముందు సంఘటనలను చూపించారు. -
ఇతనా నా లైఫ్ పార్ట్నర్.. హన్సిక ఎమోషనల్
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలే వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే హన్సిక ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది ఈ జంట. హన్సికన తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ చేయనుంది. ట్రైలర్ చూస్తే కతురియాతో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ఇన్ని రోజులు తన చుట్టే తిరిగిన ఇతనేనా లైఫ్ పార్టనర్ అని అనిపించిందని హన్సిక అన్నారు. తాను చాలా ఎమోషనల్ పర్సన్ అంటూ ట్రైలర్లో చెప్పుకొచ్చారు. అలాగే సోహెల్ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక చేసిన పోరాటం ఏంటో ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. హన్సిక జీవితంలో ఈ ఎమోషనల్ జర్నీని లవ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక
తమిళ సినిమా: సినిమా కెరీర్ను చక్కగా ప్లాన్ చేసుకున్న నటీమణుల్లో హన్సిక ఒకరని చెప్పవచ్చు. ఈ ముంబాయి భామ దక్షిణాదినే ఎక్కువగా చిత్రాలు చేసి పేరు తెచ్చుకుంది. గ్లామర్నే నమ్ముకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికీ 50 చిత్రాలకుపైగా నటించింది. కెరీర్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుంది. సోహైల్ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పెళ్లి జరిగింది. ఒకపక్క వివాహ జీవితాన్ని అనుభవిస్తూనే నటనకు సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ఈ అమ్మడు చెన్నైకి చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. మీడియా హన్సికను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చెన్నైలో అడుగుపెట్టగానే పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని పేర్కొంది. 2022 సంవత్సరం తనకు చాలా లక్కీ అని.. ప్రస్తుతం తాను అంగీకరించిన 7 చిత్రాలు చేతిలో ఉన్నాయని చెప్పింది. పూర్తి చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొంది. తన వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. నెల రోజులపాటు చెన్నైలోనే ఉండి చిత్రాలను పూర్తి చేస్తానని వెల్లడించింది. -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
పెళ్లైనా తగ్గేదేలే.. హన్సిక అందాల ఆరబోత మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
ఆ విషయంలో నయనతార కంటే స్పీడుగా ఉన్న హన్సిక
స్టార్ హీరోయిన్ నయనతార కంటే హన్సిక ముందంజలో ఉంది. హన్సికతో లేడీ సూపర్స్టార్ నయనతారతో పోలికేంటి? అసలీ కహానీ ఏంటనుకుంటున్నారా? ఈ ముద్దుగుమ్మలిద్దరూ క్రేజీ హీరోయిన్లే. ఇద్దరూ బహుభాషా నటీమణులే. ఇద్దరూ ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను చవిచూసినవాళ్లే. ఇంకా చెప్పాలంటే నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార స్టార్ ఇమేజ్ కాస్త ఎక్కువంతే. చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.ఇద్దరి పెళ్లిళ్లు ధూమ్ధామ్గా జరిగాయి. ఆ పెళ్లిళ్లతో ఇద్దరూ సొమ్ము చేసుకున్నారు. నయనతార విఘ్నేశ్తో పెళ్లి తతంగం అంతా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగింది. అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్ను ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగింది. వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటి నయనతార పెళ్లి జరిగి ఏడు నెలలు పైగా అవుతోంది. ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది. అలా ఈ భామ నయనతార కంటే ముందంజలో ఉందన్నమాట! View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పెళ్లి తర్వాత హన్సిక తొలి పండుగ.. ఎలా సెలబ్రెట్ చేసుకుందంటే!
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతామని చెప్పారు. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... ‘సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది’ అని చెప్పుకొచ్చింది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ ‘పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపింది. -
బాప్ రే.. హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా?
‘దేశముదురు’ ఫేం హన్సిక మోత్వాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో డిసెంబర్ 4న హన్సిక పెళ్లి ఘనంగా జరిగింది.జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. బ్యాచిలర్ పార్టీ, మెహందీ, హల్డీ, ప్రీవెడ్డింగ్, పెళ్లి.. ఇలా ఏ విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా హన్సిక ఖర్చి చేసిందట. ఇప్పుడు హన్సిక పెళ్లి ఖర్చు నెట్టింట వైరల్ అవుతోంది. బ్యాచిలర్ పార్టీ మొదలు పెళ్లి వరకు దాదాపు రూ.20 కోట్ల వరకు హన్సిక ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో పెళ్లి దుస్తులకు కూడా ఎక్కువే ఖర్చు చేశారట. సూఫీ రాత్రి కోసం హన్సిక ధరించిన గోల్డెన్ లెహంగా ఒక్కటే దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. హాన్సికా పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది అనేది వాస్తవం. -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్లైట్లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్లైట్లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
అది మరిచిపోలేని క్షణం.. హన్సిక తల్లి ఎమోషనల్
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా కూతురి వివాహంపై హన్సిక తల్లి ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!) హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. 'నేను అదృష్టవంతురాలిని. హన్సికను చూసి సంతోషంతో పొంగిపోయా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ సంతోషంగా వివాహం చేసుకోవడమే మరిచిపోలేని క్షణం. సరైన సమయంలో మంచి వరుడు దొరికాడు. నేను చెప్పాల్సింది ఒక్కటే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. హన్సిక తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించాం. ఇంత మంచి కుటుంబం దొరకడం కూడా మన అదృష్టం. మంచి మనిషిగా ఉండటం చాలా ముఖ్యం.' అంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తర్వాత హన్సిక ప్లాన్పై ఆమె మాట్లాడారు. హన్సిక హాట్స్టార్ కోసం ఏడు సినిమాలు, రెండు వెబ్ షోలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె మునుపటిలానే బిజీగా ఉండబోతోందని మోనా వివరించింది. -
ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు వేశారు. జైపూర్లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు.. ఎన్జీఓలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథ పిల్లలను కూడా పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు హన్సిక. అలాగే వివాహం జరుగుతున్న ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు ఆదివారం ఆమె విందు ఏర్పాటు చేయించారు. దీనిపై అటు ఫ్యాన్స్, నెటిజన్లు హన్సికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) -
కాబోయే భర్తతో హన్సిక డ్యాన్స్, వీడియో వైరల్
దేశముదురు హీరోయిన్ హన్సిక మొత్వానీ మరికొద్ది గంటల్లో శ్రీమతి హన్సికగా మానుంది. ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ ముగియగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబైన హన్సిక తనకు కాబోయే భర్త, వ్యాపారవేత్త సోహైల్తో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సోహైల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. కాగా హన్సిక, సోహైల్ వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్లోని జైపూర్ ముండోటా ప్యాలెస్లో జరగనుంది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya) View this post on Instagram A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya) చదవండి: ఆర్ఆర్ఆర్ షూటింగ్లో అనారోగ్యంతో ఇబ్బందిపడ్డ రాజమౌళి బిగ్బాస్: టికెట్ టు ఫినాలే గెలిస్తే ట్రోఫీ గెలవలేరా? -
గ్రాండ్గా హన్సిక బ్యాచ్లర్ పార్టీ.. గ్రీస్ వీధుల్లో హల్ చల్
నటి హన్సిక మోత్వాని వచ్చేనెలలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమె వ్యాపారవేత్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే అతనికి పెళ్లై విడాకులు తీసుకున్నారు. జైపూర్లోని ఓ పురాతన కోట వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. అంతేకాక హన్సిక పెళ్లి వేడుకను ఓటీటీలోనూ ప్రసారం చేయనున్నారు. (చదవండి: హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!) తాజాగా పెళ్లికి ముందు జరుపుకునే బ్యాచ్లర్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది భామ. తన స్నేహితులతో కలిసి వీధుల్లో తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్రీస్లో పార్టీ చేసుకున్న వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేస్తూ..'బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్' అంటూ పేర్కొంది. హన్సికతో పాటు నటి శ్రీయా రెడ్డి, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ వెనుక భాగంలో 'పెళ్లికూతురు' అని రాసి ఉంది. హన్సిక వివిధ రకాల దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చింది. రెస్టారెంట్లో కుర్చీలపై నిలబడి డ్యాన్స్ కూడా చేశారు ముద్దుగుమ్మ. ఇప్పటికే హన్సిక తన వివాహ వేడుకల్లో భాగంగా 'మాతా కి చౌకీ' కార్యక్రమంలో కాబోయే భర్తతో పూజలో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆమె సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. ఇప్పటికే హన్సిక పెళ్లిసందడి మొదలైంది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' ముంబైలో నటి నివాసంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. (చదవండి: హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!) హన్సిక, సోహైల్ కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ జంట వ్యాపారంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న జంట పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. మరోవైపు సోహైల్కు గతంలోనే హన్సిక స్నేహితురాలు రింకీని వివాహం చేసుకోగా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Bollywoodflash (@bollywoodflash01) -
హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. (చదవండి: హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!) తాజాగా హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. హన్సిక మోత్వానీ సోహెల్ ఖతురియాతో పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు హన్సిక ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తండగా కెమెరాకు చిక్కింది. ముంబైలో జరుగుతున్న ఈ వేడుకలో హన్సిక మోత్వాని ఎరుపు రంగు చీరలో అచ్చం వధువులా తయారైంది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరుగునున్నాయి. వీటితో పాటు, పోలో మ్యాచ్, క్యాసినోతో కూడిన పార్టీ కూడా జరగనుంది. -
త్వరలో పెళ్లి! మూవీ యూనిట్తో కలిసి అమ్మవారి దర్శనం
నటి హన్సిక పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఈమె పెళ్లికి సిద్ధమవడమే. డిసెంబర్ 4వ తేదీన హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఆదివారం చెన్నైలోని కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం యూనిట్ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. తాజాగా హన్సిక్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో మెట్రో సిరీష్ , మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ప్రజిత, పవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న 10వ చిత్రం ఇది. ఈమె చిత్ర షూటింగ్ను ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ముందుగా హన్సికతో పాటు చిత్ర యూనిట్ కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎమోషనల్తో కూడిన హార్రర్, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ను నిర్విరామంగా ఈ నెలపాటు నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. #Hansika did Dharshan at the famous #KaligaambaalTemple in Chennai today before shooting for @Dir_kannanR ‘s emotional horror thriller. For the very first time, #Hansika does dual role in this film produced by @MasalaPix @johnsoncinepro pic.twitter.com/tlgEoBIEzp — Ramesh Bala (@rameshlaus) November 13, 2022 -
హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హన్సిక పెళ్లిపై ఓ వార్త వైరలవుతోంది. హన్సిక వివాహా వేడుకను ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. (చదవండి: కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్) అయితే యాపిల్ బ్యూటీ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది సన్నిహితులు, వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిసెంబర్ 2వ తేదీన సూఫీ, 3వ తేదీన మెహందీ, సంగీత వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 4వ తేదీ పెళ్లి వేడుక సందర్భంగా క్యాసినో నేపథ్యంతో కూడిన పార్టీని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. -
కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహెల్ ఖతూరియాతో డిసెంబర్లో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల హన్సిక కాబోయే భర్తను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హన్సిక, ఆమె కాబోయే భర్త గురించిన పలు ఆసక్తిక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హన్సిక ఆమె ప్రియుడు వార్తల్లోకెక్కారు. వీరిద్దరి పర్సనల్ ఫొటో ఒకటి తాజాగా లీకైంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. దీంతో ఈ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ బోట్లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటో తను షేర్ చేసింది కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు హన్సిక, సోహెల్ పిక్పై క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్తో స్పందిస్తున్నారు. కాగా రాజస్థాన్ జైపూర్లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. చదవండి: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే View this post on Instagram A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal) -
హన్సిక మోత్వాని.. అతనితో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. పారిస్లోని ఈఫిల్ టవర్లో వద్ద దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి, ఖుష్బు సుందర్తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ఆర్టిస్టులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ నటీనటులు ఏదో ఒక రూమర్లు రావడం సహజం. గతంలో హన్సిక మోత్వాని కోలీవుడ్ హీరో శింబుతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హన్సిక మోత్వాని తన రిలేషన్షిప్ గురించి ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆమె తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'నా వ్యక్తిగత జీవితం గురించి చాలా పుకార్లు వింటున్నా. కానీ నాకు స్పష్టత ఉంది. అందుకే నేను వాటి మాట్లాడటానికి ఇష్టపడను.' అంటూ పోస్ట్ చేశారు. (చదవండి:హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?) గతంలో శింబు ఇలా వ్రాశాడు. 'అవును. నేను హన్సికతో డేటింగ్లో ఉన్నాను. త్వరలోనే మా పెళ్లిని మా కుటుంబం నిర్ణయిస్తుంది. మీరు మా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నా. హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని ఉండాలనుకుంటున్నా. నా తల్లిదండ్రుల అనుమతితో, నేను హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుంటా. అజిత్, షాలిని లాగా మేమిద్దరం సంతోషంగా జీవితాన్ని గడుపుతాము.' అని ఓ ఇంటర్వ్యూలో శింబు తెలిపారు. (చదవండి: రిషబ్ శెట్టిని కలిసిన లెజెండ్ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్) హన్సిక, శింబు తమ రిలేషన్ గురించి 2013లో అధికారికంగా ప్రకటించి అభిమానులను షాక్కు గురిచేశారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చినా ఆ తర్వాత ఈ జంట విడిపోయినట్లు ప్రకటించారు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు. హన్సిక తన కెరీర్లో ఓ వివాదాన్ని ఎదుర్కొన్నారు. 2019లో ఆన్లైన్ హ్యాకింగ్కు గురయ్యారు. హన్సిక మోత్వాని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కానీ ఆ చిత్రాలు వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించారు. -
హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్లోఊ ఇద్దరూ పార్ట్నర్స్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్ఫ్రెండ్ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్లోని ఓ ప్రముఖ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆ హీరోయిన్ తో లవ్ నిజమేనా?
-
తెగ ఫీలవుతున్న హన్సిక ఫ్యాన్స్
-
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పనున్న హన్సిక?
'దేశ ముదురు' సినిమాతో టాలీవుడ్కు పరిచయమై ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హన్సిక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రియుడు సోహెల్ ఖతురియాతో వచ్చే నెలలోనే ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన హన్సిక కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత హన్సిక నటనకు గుడ్బై చెప్పనుందా లేదా కంటిన్యూ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన హన్సిక పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేసింది. పని చాలా విలువైనదని, వివాహం తర్వాత కూడా హీరోయిన్గా కొనసాగుతానని పేర్కొంది. హన్సిక చివరగా ‘మహా’అనే చిత్రంలో నటించింది. -
హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వరుడు ఎవరన్నది క్లారిటీ లేదు. సినీ ఇండస్ట్రీకి చెందినవాడా? కాదా? ఇంకేవరంటూ అందరిలో సందేహం నెలకొంది. ఈ క్రమంలో తన కాబోయే భర్తను పరిచయం చేసి అందరి సందేహాలు తీర్చింది ఈ భామ. వరుడి పేరు సోహెల్ ఖత్తూరియా అని కూడా వెల్లడించింది. ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్గా త్రోబ్యాక్ వీడియో ‘ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా.. నౌ ఫరెవర్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో హన్సిక్ పెళ్లి ఎవరిని చేసుకొనున్నది అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోహైల్ ఏం చేస్తుంటాడనేది ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు అతను ఎవరు, ఎక్కడి వాడు అంటూ హన్సిక్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సోహెల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. సోహెల్, హన్సిక మంచి స్నేహితులు. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి అదే స్నేహంతో సోహెల్, హన్సికను తన బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేశారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం పెరిగిందని, అదే ప్రేమగా మారిందని తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నౌ అండ్ ఫరెవర్.. ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా
నటి హన్సిక మరోసారి వార్తల్లో కెక్కింది. ఇంతకుముందు సినిమాకు సంబంధించిన వార్తలతోనూ, వదంతులతోనూ వార్తల్లో నానిన ఈ ముంబయి బ్యూటీ ఇప్పుడు వ్యక్తిగత విషయంతో తనే స్వయంగా వార్తల్లోకి వచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ కథానాయికగా రాణిస్తున్న హన్సిక మత్వాని ఈ రెండు భాషల్లోనూ ప్రముఖ నటులతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో బొద్దుగా..ముద్దుగా కనిపించిన హన్సిక ఆ తరువాత వర్కౌట్ చేసి స్లిమ్గా తయారైంది. ఈ చిన్నది చిక్కినా చక్కగానే ఉందంటూ దర్శక, నిర్మాతలు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తూ్తనే ఉన్నారు. అలా 50 చిత్రాలను అవలీలగా పూర్తి చేసిన ఈ అమ్మడికి ఇప్పట్లో చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపిన హన్సిక ఆయనతో పెళ్లిపీటల వరకు వెళ్లాలని భావించింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు కారణంగా బ్రేకప్ అయ్యింది. అయిననూ పక్కా ప్రొఫషనలిస్ట్ అయిన హన్సిక తన 50వ మహా చిత్రంలో మాజీ ప్రియుడు శింబుతో రొమాన్స్ చేసింది. ఆ తరువాత పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నేను సంతోషంగానే ఉన్నాగా ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అలాంటిది అనూహ్యంగా ఇటీవల నటి హన్సిక ప్రేమ, పెళ్లి గురించి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అది చాలా స్పెషల్గా, రొమాంటిక్గా ఈ అమ్మడు వ్యాపారవేత్త సోహైల్ ఖత్తూరియా అనే వ్యక్తితో చాలాకాలంగా లవ్లో ఉన్నట్లు సమాచారం. వీటిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయని హన్సిక బుధవారం తన ప్రియుడు గురించి ఒక్కసారిగా బ్లో అప్ అయ్యింది. ఈ క్రమంలోనే బుధవారం ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ వద్ద మతాబుల వెలుగుల మధ్య అందమైన పువ్వులతో ముస్తాబు చేసిన లవ్ సింబల్ మధ్య తన కాబోయే జీవిత భాగస్వామితో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ప్రియుడు మోకాలుపై నిలబడి హన్సిక చేతిని పట్టుకోగా ఆమె ప్రేమైక వదనంతో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాన్ని పొందుపరిచారు. అందులో ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా, నౌ ఫరెవర్ అని పేర్కొంది. అలా తన ప్రియుడిని పరిచయం చేసి వదంతులకు పుల్స్టాప్ పెట్టింది. కాగా వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇద్దరి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక.. ఫోటోలు వైరల్
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక చెప్పింది. దీంతో హన్సికకు కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్కి పరిచయం చేసింది హన్సిక. ఈఫిల్ టవర్(పారిస్)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో అతను హన్సికకు ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం తెలుపుతూ హగ్ చేసుకుంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హన్సిక పెళ్లి రాజస్తాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్లో డిసెంబర్ 4న జరగనుంది. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పెళ్లి పీటలు ఎక్కనున్న హన్సిక.. వరుడు ఎవరో తెలిసిపోయింది
హీరోయిన్ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు తెలుస్తోంది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్4న వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైనట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. రాజస్థాన్ జైపూర్లోని ముండోటా ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందట. ఇక హన్సిక ప్రియుడు సోహాల్ కతూరియా విషయానికి వస్తే.. ముంబైలోని బడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. చాలాకాలం నుంచి హన్సికకు అతనితో మంచి అనుబంధం ఉందట. అంతేకాకుండా అతని కంపెనీలోనూ హన్సిక షేర్స్ ఉన్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతకాలంగా డేటింగ్లో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్యాలెస్లో జరగనున్న పెళ్లి వేడుక కోసం ఇప్పటికే గదులు కూడా బుక్ చేసినట్లు సమాచారం. -
ప్రముఖ వ్యాపారవేత్తతో హీరోయిన్ హన్సిక వివాహం?
నటి హన్సిక పెళ్లికి సిద్ధమైనట్లు, డిసెంబర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్తరాది బ్యూటీ ధనుష్ జంటగా వప్పిళ్లై త్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయ్, ఆర్య, శింబు వంటి స్టార్ హీరోలతో జత కట్టి ప్రముఖ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అలాగే తెలుగులోనూ ప్రముఖ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్న హన్సిక నటిగా అర్ధ శతకం దాటేసింది. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపి, పెళ్లికి కూడా సిద్ధమైపోయింది. అయితే భేదాభిప్రాయాల కారణంగా శింబుతో పెళ్లి పీటలు దాకా వెళ్లలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దరంగా ఉంటూ నటనపై దృష్టి సారించింది. ఇటీవల పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఇప్పుడు పెళ్లికి తొందర ఏముంది? నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని బదులిచ్చిన హన్సిక సడన్గా పెళ్లికి రెడీ అవుతుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు, డిసెంబర్లో వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. హన్సిక పెళ్లి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్లో జరగనుందని, దీంతో ఆ ప్యాలెస్ను అలంకరించే పనిలో హన్సిక కుటుంబం ఉందని, ఎక్కువ సమయం లేకపోవడంతో పెళ్లి కార్యక్రమాలు హడావుడిగా నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే హన్సిక పెళ్లి గురించి ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎ లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.