heart stroke
-
స్టార్ క్రికెటర్కు గుండెపోటు.. పరిస్థితి విషమం
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్కు (36) ఇవాళ (మార్చి 23) ఉదయం గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతుండగా తమీమ్ తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే రెండు సార్లు ఛాతీ నొప్పికి గురైనట్లు సమాచారం. తమీమ్ పరిస్థితి తెలిసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసుకుంది. బోర్డు డైరెక్టర్లు తమీమ్ను చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్లో అత్యంత సఫలమైన ఆటగాడు. తమీమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను లోకల్ క్రికెట్ ఆడుతూ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. తమీమ్ పేరిట బంగ్లాదేశ్ క్రికెట్కు సంబంధించి ఎన్నో రికార్డులు ఉన్నాయి. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లలో) 15000 పైచిలుకు పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 వరకు బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆఫీసర్. గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కిందటి ఏడాది మహేందర్రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్ బాస్ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. .. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలె సీఎం రేవంత్రెడ్డి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రాజీవే సారధ్యం వహించారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలందించారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. రాజీవ్ రతన్ మృతి పట్ల నా సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం రేవంత్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సీనియర్ #IPS అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి @revanth_anumula దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను… — Telangana CMO (@TelanganaCMO) April 9, 2024 -
సీపీఎం తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది. వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్క్షన్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది. -
ఎలాగ్జింతో గుండె ధైర్యం
పీలేరు: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ వయస్సు వారికై నా గుండెపోటు (హార్ట్ స్ట్రోక్)రావడం సర్వసాధారణంగా మారింది. సమయానికి వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గుండెపోటు వచ్చిన వారికి తక్షణ ఉపశమనం కల్పించి పెద్ద ఆస్పత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం ఎలాగ్జిం ఇంజెక్షన్ను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో తెచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ ప్రాజెక్టు కింద కొన్ని కొన్ని ఆస్పత్రులకు మాత్రమే ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గుండెపోటుతో ఎవరూ మరణించరాదని, పేదలను సైతం ఆదుకోవాలని భావించి అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లోపైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేశారు. అనంతరం గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో అమలు చేశారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. ఒక్క పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏడాది కాలంలో తొమ్మిది మందికి ఎలాగ్జిం ఇంజెక్షన్తో ప్రాణాలు కాపాడారు. విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు గుండెపోటెకు గురైన నన్ను స్నేహితులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణ ఉపశమనం కోసం రూ. 51,669 విలువైన ఇంజెక్షన్ ఉచితంగా అందించారు. నా ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. – సురేంద్ర, పీలేరు ఎలాగ్జింతో గంటసేపు ప్రాణాలు కాపాడవచ్చు గుండెపోటు గురైన వారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేరాలి. ప్రభుత్వాస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇవ్వ డం ద్వారా తక్షణం ప్రాణాలు కాపాడటంతోపాటు గంట సమయంలో ఉన్నతాసుపత్రికి వెళ్లడానికి రక్షణగా పని చేస్తుంది. రెండో సారి గుండెపోటు రాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ డేవిడ్ సుకుమార్, డీసీహెచ్ఎస్, రాయచోటి జగనన్నకు రుణపడి ఉంటాం నాకు గుండెపోటు రావడంతో తక్షణం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇచ్చారు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే వరకు నా ప్రాణాలు కాపాడింది. ఆస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్ అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. – మమత, పీలేరు అవసరమనిపిస్తేనే ఇంజెక్షన్ వాడతాం గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన అనంతరం వారి కండీషన్ను బట్టి ఎలాగ్జిం ఇంజెక్షన్ ఇస్తాం. విలువైన ఇంజెక్షన్ కావడంతో వృథా చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎలాగ్జిం వాడడం జరుగుతుంది. – డాక్టర్ చంద్రశేఖర్, పీలేరు ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ -
భారత సంతతి వ్యక్తికి ఆరుసార్లు ఆగిన గుండె.. ఆ తర్వాత ఏమైందంటే?
లండన్: బ్రిటన్లో లండన్ నగరంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి భారతీయ-అమెరికన్ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. ఏకంగా ఆరుస్లార్లు ఆగిపోయిన గుండెకు ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన బ్రిటన్ సహా భారత్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని సీటెల్కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్లో హామర్స్మిత్ హాస్పిటల్కు తరలించారు.కాగా, అతుల్ రావ్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. #IndianAmerican student chooses career in medicine after #UK #NHS medics save his life after his heart stopped 6 times due to blood clots.#CardiacArrest #PulmonaryEmbolism #hearthealth https://t.co/R3NJZipmuQ — National Herald (@NH_India) October 5, 2023 ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. మరోవైపు, భారతీయ-అమెరికన్ విద్యార్థి అతుల్ రావ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. -
సంగారెడ్డి: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, సంగారెడ్డి: చిన్నవయసులోనే గుండెపోటుతో కన్నుమూస్తున్న వరుస ఘటనలు చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డిలోనూ అలాంటి విషాద ఘటనే నెలకొంది. 12 ఏళ్ల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసిన ఘటన స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. కంగ్టి మండలం తడ్కల్కు చెందిన ఖలీల్(12) ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. గతరాత్రి నిద్రలో అపస్మారక స్థితికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను కన్నుమూశాడు. ఖలీల్ను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతోనే కన్నుమూసినట్లు ధృవీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిన్నటిదాకా తమ కళ్ల ముందు ఆడిపాడిన చిన్నారి లేడనే విషయాన్ని వాడ ప్రజలు తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు. -
వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..
ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్లో వర్కవుట్ చేస్తూ సడెన్గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. గజియాబాద్కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్లోని ట్రెడ్మిల్పై నడుస్తుండగా.. సడెన్గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3 — Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023 ఇక, జిమ్లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్లో టీచర్గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా సూపర్ క్రేజ్ -
కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్ చేసుకున్నారా?
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు? రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ... ►ఛాతీలో నొప్పి పెట్టడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం ► మూత్రంలో రక్తం కనిపించడం ►ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం ► తలనొప్పి తీవ్రంగా రావడం ► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. -
ఖమ్మం: గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి
క్రైమ్, ఖమ్మం: హఠాన్మరణాలు.. అందులో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ మరణాలపై వైద్య నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరణించిన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలూ ఉంటున్నాయని, వాటిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాజాగా.. ఖమ్మంలో తొమ్మిదో క్లాస్ చదివే విద్యార్థి మరణం.. స్థానికంగా విషాదం నింపింది. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు మాదాసి రాజేష్. బుధవారం స్కూల్కు వెళ్లిన రాజేష్ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి టీచర్లకు చెప్పడంతో.. వాళ్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మరణించాడని, రాజేష్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజేష్కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పైగా గత కొద్దిరోజులుగా నీరసంగా కూడా ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి సరిగ్గా బడికి వెళ్లలేదు. అయితే.. బుధవారం స్కూల్లో విద్యార్థులకు అవగాహనా సినిమా ప్రదర్శించాడు. అందుకోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. బడికి వెళ్లిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదీ చదవండి: తమ్ముడి పెద్దకర్మ ఆ అన్నకి ఆఖరిరోజు! -
కారు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసిన సీఐ.. కానీ..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుల కారణంగా ఎంతో మంది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. పెద్ద అంబర్పేట వద్ద ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో, బాధితుడు స్పృహాలోకి వచ్చాడు. అనంతరం, బాధితుడిని స్థానిక వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి చేరుకునేలోపే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
Heart Attack: టీచర్ గుండె ఆగింది
చీరాల: రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థుల కేకలు వినబడ్డాయి. సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు అచేతనంగా ఒరిగిపోయి ఉన్నాడు. ఆందోళనతో.. 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు. అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. శనివారం యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
Healthy Heart: మీ గుండె ఆగిపోకూడదనుకుంటే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం. అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. ► కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ► అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. ► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. ► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ► మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ► అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు. ► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్ కూడా అస్సలు మంచిది కాదు. ► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. ► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. ► స్మోకింగ్ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్కు దూరంగా ఉండటం మంచిది. ► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. ► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్ చెకప్ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్ అరెస్ట్ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!. Sitting in some position Chewing ginger garlic dhaniya Mirch Coughing sneezing laughing None of these will help in heart attack Reach a hospital with Cardiac facilities as soon as possible to get appropriate treatment in #Heartattack to save life https://t.co/3Aa6cT0cCS pic.twitter.com/ELjEyAW6ne — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 24, 2023 -
తారకరత్నకు మెలెనా? ఈ వ్యాధి గురించి తెలుసా..
సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కారణాలు.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. మెలెనా లక్షణాలు.. మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
యువతకు గుండె పోటు.. అనర్థాలు ఇవే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత గుండె లయతప్పుతోంది. మూడు పదుల వయస్సులోనే గుండెపోటుకు గురవుతోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వారంలో ఇద్దరు ముగ్గురు యుతీయువకులు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు సైతం పలువురు వెళ్తున్నారు. కోవిడ్ తర్వాత యువతలో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి. వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారు. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం విపరీతమైన ఒత్తిడి (స్ట్రెస్), ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలు. కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. యువతలో గుండెపోటును నివారించాలంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం విజయవాడ లబ్బీపేటకు చెందిన 25 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ విధుల్లోనే ఉంటాడు. ఇటీవల ఛాతీ నొప్పికి గురవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ యువకుడిని పరీక్షించి గుండెపోటుగు గురయ్యాడని నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరే కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో కొందరు ఆస్పత్రికి చేరటప్పటికే మృత్యువాడ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కారణాలివే.. - చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవడానికి వైద్యులు అనేక కారణాలు చెబుతున్నారు. - చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం. - స్మోకింగ్, ఆల్కహాల్ సేవనం ప్రధాన కారణం. - ఫాస్ట్ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కూడా కారణమే. - రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం. - తల్లిదండ్రులు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే, వారి పిల్లలు చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. - వాతావరణ కాలుష్యం కూడా గుండెజబ్బులకు దారితీస్తోంది. - కోవిడ్ బారిన పడిన వారి సన్నని రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి ఇరవై ఏళ్ల వారికి కూడా గుండెపోటు వస్తోంది. ఆరోగ్య రక్షణకు ఏంచేయాలంటే.. - గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. - పనిలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి సారించాలి. - శారీరక శ్రమ కలిగేలా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. - తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉన్న వారు వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత హార్ట్ చెకప్ తరచూ చేయించుకోవాలి. - ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్, నూనె ఎక్కువగా వినియోగించిన ఆహారం తీసుకోరాదు. అప్రమత్తంగా ఉండాలి గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల తరచుగా చూస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి సైతం అలాంటి వారు వారంలో ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. గుండెపోటుకు గురవుతున్న యువతలో 80 శాతం మందికి స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ కారణాలుగా ఉంటున్నాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. రక్తనాళాల్లో పూడికలకు స్టెంట్స్ వేయాలా లేక బైపాస్ సర్జరీ అవసరం అవుతుందా, మందులు సరిపోతాయా అనేది నిర్ణయించేందుకు ఎఫ్ఎఫ్ఆర్ పరీక్ష చేస్తాం. ఇటీవల యువతకు ఎక్కువగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి.విజయచైతన్య. -
Health: బ్లాక్ సాల్ట్ను నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకుంటే..
Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►డయాబెటిస్ను నియంత్రించవచ్చు. ►కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ►ఎముకలు దృఢంగా మారుతాయి. ►నిద్ర చక్కగా పడుతుంది. ►మానసిక ప్రశాంతత లభిస్తుంది. ►అధిక బరువు తగ్గుతారు. ►కొవ్వు కరిగి పోతుంది. ►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ►చర్మం కాంతివంతంగా మారుతుంది. ►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
యువత ‘హృదయ’ వేదన
నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన 20 ఏళ్ల ఏసురత్నం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తీవ్రమైన ఛాతినొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఈసీజీ, 2డీఎకో పరీక్షల అనంతరం అతనికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు. అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో బ్లాక్లు ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి అతని ప్రాణాలను వైద్యులు కాపాడారు. లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ సతీష్(45) గత నెలలో గుండెపోటుకు గురై మరణించారు. కోడుమూరులో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగం చేసి కూర్చుని అలాగే గుండెపోటుకు గురికావడంతో సహ ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. .. వీరిద్దరే కాదు ఇటీవల కాలంలో మధ్యవయస్సు వారు గుండెపోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే దురలవాట్లకు లోనుకావడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మితం లేని ఆహారం వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే గుండెజబ్బులు నేడు 20 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి గుండెచేతబట్టుకుని వస్తున్న వారిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారే అధికంగా ఉంటున్నారు. అంతేగాకుండా వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి వారానికి రెండు రోజుల ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటోంది. నెలలో 400 మంది వార్డులో చేరి చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. ఏటా ఐదువేల మందికి గుండె సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. లక్షణాలు ఇవీ.. కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతిలో పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటే గుండెజబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. గుండెపోటు వచి్చన మొదటి కొద్దినిమిషాలు కీలకమైనవి. గుండెపోటు రావడానికి కారణాలివీ.. ధూమపానం, నెయ్యి వాడకం, పరగడుపున రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, అధిక కొల్రస్టాల్, రక్తపోటు, శారీరక వ్యాయామం బాగా తగ్గడం, తల్లిదండ్రుల్లో గానీ, తోబుట్టువలలో గానీ ఎవ్వరికైనా గుండెపోటు వచి్చనా కానీ ముందుగానే ఈ సమస్య ఉండటం, లిపోప్రోటీన్–ఎ, హైపర్ హోమోసిస్టెమియా, హైపర్ కాగ్యులబుల్ పరిస్థితి, కొకైన్ వాడకం లాంటివి ఉంటే ఈ సమస్యలు వస్తాయి. ధూమపానం ఉంటే 72శాతం, అధిక కొలె్రస్టాల్ ఉంటే 52శాతం, కుటుంబంలో ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ చరిత్ర ఉంటే 35శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడమే కారణం రక్తంలో హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడం వల్లే ఇటీవల కాలంలో యుక్త వయస్సులోనూ గుండెపోట్లు కేసులు పెరుగుతున్నాయి. పాశ్చాత్యులు కూరగాయలను పచి్చగానే తింటారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువగా ఉడికించడమో, ఫ్రై చే యడమో చేసి తింటారు. దీనివల్లే హైపర్ హోమోసిస్టీనిమియా లెవెల్స్ పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు కేసుల్లో 5శాతంలోపు మాత్రమే యువకులు ఉండేవారు. ఇప్పుడది 14 నుంచి 15శాతానికి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం. గుండెజబ్బులపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. –డాక్టర్ పి.చంద్రశేఖర్, కార్డియాలజి హెచ్వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీవనశైలిలో మార్పుల వల్లే... శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలె్రస్టాల్ శాతం పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండెజబ్బులు రావచ్చు. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం ఈ కేసులు మరింత పెరిగాయి. కోవిడ్ సమయంలో చాలా మంది రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడ్డాయి. గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే... - మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వాకింగ్, యోగా, ధ్యానం చేయాలి. - శాస్త్రీయ సంగీతం వినాలి. పాత పాటల్లోని సాహిత్యం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. - లిఫ్ట్లో వెళ్లడం కంటే మెట్లు ఎక్కడమే మేలు. సమతుల ఆహారం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. - నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించుకోవాలి. బయట లభించే ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఫుడ్స్కు, దిగుమతి చేసుకున్న చికెన్ లెగ్స్కు దూరంగా ఉండాలి. - బజ్జీలు తినాల్సి వస్తే ఇంట్లోనే చేసుకోవాలి. - బీపీ, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి. స్థూలకాయం తగ్గించుకోవాలి. - వయస్సుకు తగినట్లు నిద్రపోవాలి. నిద్రతగ్గితే శరీరం రోగాలను ఆహా్వనిస్తుంది. -
సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం
ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. దీనికి తోడు అధిక కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం వల్ల ఆరోగ్యం ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం పెరిగింది. నగరంలోని ప్రముఖ గుండె వైద్య ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడే దీనికి నిదర్శనమంటున్నారు. బనశంకరి: ఐటీ బీటీ సిటీలో ఉద్యోగాలంటేనే ఉరుకులు, పరుగులు లాంటి యాంత్రిక జీవనానికి సరి సమానం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో రాజధాని నగర ప్రజలను తీవ్రమైన గుండె సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హృద్రోగ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా గణనీయ ప్రమాణంలో పెరగడం దీనికి నిదర్శనంగా భావించాలి. అందులోనూ యువత, మధ్య వయసువారే ఎక్కువగా గుండె పోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణుల కంటే 30 శాతం అధికం బెంగళూరు మహానగర వాసులు గ్రామీణ ప్రాంతాలవారి కంటే 30 శాతానికి పైగా గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగళూరు నగరంలో హెచ్చుమీరిన వాయు కాలుష్యం, ట్రాఫిక్, ఒత్తిడితో కూడుకున్న జీవితంతో చిన్ని గుండె త్వరగా అలసిపోతోంది. దీంతో పాటు వందలో 50 శాతం మంది శారీరక కదలికలు లేని ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనానికి లోనవుతోందని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా తరువాత మరింత ఎక్కువ నగరంలోని ప్రముఖ హృద్రోగ ఆసుపత్రి నారాయణమల్టీ స్పెషాలిటిలో కరోనా అనంతరం 55 ఏళ్లు వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు గుండె సమస్యలతో రావడం 30 శాతం పెరిగింది. గత ఒక ఏడాదిలో నమోదైన మొత్తం రోగుల్లో 70 శాతం మంది 25–55 వయసు మధ్యవారేనని తెలిపారు. జయదేవ హృద్రోగ ఆసుపత్రిలో ఏడాదికి సరాసరి 6 లక్షల మందికి పైగా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టితో పాటు 40 వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది 40 ఏళ్లు లోపు వయసు వారు సగం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటితే స్కాన్ చేయించాలి గుండెపోటు ఒకేసారి రాదు కనీసం 10 ఏళ్లకు ముందుగానే గుండెరక్తనాళాల్లో రక్తప్రసరణ తలెత్తుతుంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒకసారి గుండె కు సీటీ స్కాన్ తీయించుకోవాలి. ఈ పరీక్షతో 5 శాతం రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటే తెలుస్తుంది. దీంతో ప్రారంభ సమయంలోనే చికిత్స తీసుకుంటే గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చునని ప్రముఖ గుండెవైద్య నిపుణుడు డాక్టర్ దేవీ శెట్టి సలహా ఇచ్చారు. ఒత్తిడి జీవన విధానమే కారణం ప్రస్తుతం ప్రజలు అత్యంత ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో జీవనం గడుపుతున్నారు. ఒక ఏడాది పని ఒక నెలలో పూర్తిచేయాలనే మానసిక స్థితిని కలిగి ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఒకేసారి రెండు మూడు కోర్సులు ప్రారంభించి, మంచి ఉద్యోగం, మరింత డబ్బు సంపాదించాలనే ఆరాటానికి గురవుతున్నారని జయదేవ హృద్రోగ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ తెలిపారు. ఓ సర్వేలో చేదు నిజాలు సమగ్ర ఆరోగ్య కేంద్ర సంస్థ ప్రాక్టో దేశంలోని ప్రముఖ మహానగరాల్లో జరిపిన పరిశోధనల్లో మూడునెలల్లో బెంగళూరులో గుండెపోటుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు 200 శాతం పెరిగినట్లు తెలిపింది. గత రెండేళ్లలో గుండె జబ్బులతో అనేక మంది ప్రముఖులు మృత్యవాత పడ్డారు. దీంతో ప్రజల్లో జాగ్రత్త పెరిగి గత మూడునెలల్లో గుండె పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఇందులో 56 శాతం మంది 30–39 ఏళ్లులోపు వారు ఉన్నారు. -
విధి ఆడిన వింత నాటకం.. అప్పటి వరకు ఎంజాయ్ చేసి ఒక్కసారిగా..
మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఇప్పటికే ఎన్నో ఘటనల్లో చూసే ఉంటాము. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి క్షణకాలంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటనలు షాక్కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్లు చేస్తూ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా, వేడుకల్లో గుజరాత్కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఆనంద్ జిల్లాలోని తారాపూర్లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో.. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్పుత్(21) అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ ముందుకు వచ్చి కింద కుప్పుకూలిపోయాడు. దీంతో, అక్కడున్న వారంతా సడెన్గా ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు అతడిని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, పండుగ పూట వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. Anand : गरबा खेलते खेलते एक शख्स की मौत। तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था। युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी। वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA — Janak Dave (@dave_janak) October 2, 2022 -
పెరిగిన గుండెపోటు కేసులు.. నాలుగేళ్లలో అక్కడ 80 వేలకుపైగా మృతి
సాక్షి, ముంబై: కోవిడ్–19 మహమ్మారి తర్వాత ముంబైకర్లలో గుండెపోటు కేసులు, గుండెపోటుతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో బీఎంసీ, ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ఆందోళనలో పడిపోయాయి. ప్రస్తుతం కరోనా వైరస్ దాదాపు నియంత్రణలోకి రావడంతో పరిస్ధితులు యథాతధంగా మారాయి. కానీ గడచిన నాలుగేళ్లలో ముంబైలో 80 వేలకుపైగా గుండెపోటుతో మృతి చెందినట్లు నమోదైన కేసులను బట్టి తెలిసింది. అందులో కోవిడ్ కాలం అంటే ఒక్క 2020లోనే 25,378 మంది మృతి చెందారు. ఈ సంఖ్యను బట్టి ముంబైలో ప్రతీరోజు సగటున 70 మంది గుండెపోటుతో మృతి చెందినట్లు స్పష్టమైతోంది. దీంతో సెప్టెంబర్ 29న ‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా ముంబైకర్లు తమ గుండెను భద్రంగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కారణంగా నరాలలో రక్తం గడ్డ కట్టడం, గుండె మండటం, వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు పెరిగాయి. అందుకు కారణం వ్యసనాలు, తరుచూ అనారోగ్యానికి గురికావడం, అనోబాలిక్ స్టెరాయిడ్ లాంటి పదార్ధాలను విచ్చలవిడిగా వినియోగం పెరిగిపోవడంవల్ల గుండెపోటు, మరణాలు పెరిగిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కోవిడ్ సోకి, వ్యాధి నయం అయిన వ్యక్తుల్లో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు 21 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తికి గుండెపోటు రావడం వెనక గుండె దిశగా వెళ్లే నరాల్లో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణం కావచ్చని ఫోర్టీస్ ఆస్పత్రికి చెందిన డా.మనీష్ హిందుజా పేర్కొన్నారు. గుండెపోటు నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ప్రతీరోజు తినే ఆహరాన్ని నియంత్రణలో ఉంచాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు నడవాలి. తమ శరీర తత్వాన్ని, తట్టుకునే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంతే సమయం వ్యాయామం చేయాలని కేం ఆస్పత్రిలోని డి.ఎం.కార్డియాలాజీ విభాగం యూనిట్ చీఫ్, ప్రొఫెసర్ డా.చరణ్ లాంజేవార్ పేర్కొన్నారు. ఇందులో ఏదో ఒక దాంట్లో నియంత్రణ కోల్పోయినా లేదా పాటించకపోయినా గుండెపోటు రావడం, ఆ తర్వాత సకాలంలో చికిత్స అందకపోవడంతో మరణించడం లాంటివి చోటుచేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 10 నుంచి 20 శాతం గుండె వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందు, సిగరెట్లు, కల్తీ ఆహారం, అధిక నూనెలతో కూడిన ఆహారం గుండెకు ప్రమాదకరం. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో 45 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్లకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ 29న వర్డల్ హార్ట్డే నిర్వహిస్తూ గుండెను ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పీఆర్కే వర్మ గుండెను ఎలా కాపాడుకోవాలో వివరించారు. గోల్డెన్ అవర్లో చికిత్స ముఖ్యం గుండెపోటు వచ్చిన వక్తికి అత్యవసరంగా వాడే రెండు రకాల మాత్రాలున్నాయి. అవి ASPIRIN 325 mg, Sorbitrate 5 mg.. గోల్డెన్ అవర్(మొదటి ఆరు గంటలు)లో ఆస్పత్రిలో చేరితో గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత పేషేంట్ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన వైద్యం అందించవచ్చు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కోవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత ఐదేళ్లుగా గుండె వ్యాధుల కేసులు ఏటా 10 నుంచి 20 శాతం పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది జిల్లాలో 10 వేల నుంచి 20 వేల కేసులు ఉంటున్నాయి. ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ గుండె వైద్యం అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ పుణ్యమా అని ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీలో గుండెకు ఉచిత వైద్యం అందుతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీను అద్భుతంగా అమలు చేయడంతో గుండెకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిల్లో గుండెకు సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. భీమవరం వర్మ ఆస్పత్రి, తణుకు యాపిల్ ఆస్పత్రి, ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి, ఏలూరు విజయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో గుండె వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. జన్యుపరంగానూ గుండెపోటు గుండె పోటు ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోనూ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. ఇక ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, బీపీ, సుగర్, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. అధిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. ఆందోళన వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. గుండెపోటు ఎలా గుర్తించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులు ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. చాలా మంది గుండెపోటును గ్యాస్ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే క్లినిక్ల్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. మద్యపానం, ధుమపానం మానాలి. ప్రతి రోజూ వ్యాయమం చేయాలి. పాస్ట్ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరాదు. కనీసం 45 నిమిషాలు నడవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలి. -
50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్లో చేరేలోపే గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కాగా, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ ఆయిల్ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు) -
'భీమిలి కబడ్డీ జట్టు'ను గుర్తుచేస్తూ మృత్యు ఒడిలోకి.. వీడియో వైరల్
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదం నింపాయి. పోటీల్లో పాల్గొన్న విమల్రాజ్ అనే యువకుడు లైవ్ మ్యాచ్లోనే ప్రాణాలు వదిలాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో విమల్రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చిన విమల్రాజ్ను ప్రత్యర్థి ప్లేయర్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ ప్లేయర్ మోకాలు, విమల్రాజ్ ఛాతిపై బలంగా తగిలింది. విమల్రాజ్ గీత దాటడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో సదరు ప్లేయర్ కూడా లైన్ బయట చేతులు పెట్టడంతో విమల్రాజ్కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ విసిరాయి. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన తోటి ప్లేయర్లు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే విమల్రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమిక అంచనాకి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా తరహాలోనే ఇక్కడ విమల్రాజ్ ప్రాణాలు వదలడం అందరిని కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: భారత్కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్! -
విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత
పుణేలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు గ్రౌండ్లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా మృతి చెందిన యువకుడి పేరు శ్రీతేజ్ సచిన్ గులే అని తెలిసింది. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడడానికి వచ్చాడు. మ్యాచ్ మధ్యలో శ్రీతేజ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భయపడిన అతని స్పేహితులు పరిగెత్తుకొచ్చినప్పటికి అప్పటికి శ్రీతేజ్ సృహలో లేడు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీంతో షాక్ తిన్న అతని స్నేహితులు శ్రీతేజ్ సచిన్ మరణవార్తను అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా శ్రీతేజ్ పుణేలోని హదప్సార్ ఏరియాలో నివసిస్తున్నారు. చదవండి: మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. -
చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?
►సంజామల మండలం ముచ్చలపురి గ్రామానికి చెందిన కాశీంబీ(55) గత నెల 24వ తేదీన పూడికతీత పనులు చేస్తూ గుండెపోటుకు గురై మరణించింది. ►ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్(46) గుండెపోటుకు గురై గత నెల 21వ తేదీన ప్రాణాలొదిలాడు. ►పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన అబ్దుల్ అనీఫ్(23) అనే యువకుడు గత నెల 22న హార్ట్స్ట్రోక్తో మృతి చెందాడు. ►ఇటీవలే కర్నూలు కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఎరువుల వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురై హఠాన్మరణం పొందారు. వీరే కాదు ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట పట్టుమని 50 ఏళ్లు కూడా నిండని వారు అధికంగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఒకప్పుడు హృద్రోగ సమస్యలు 70 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ఇప్పుడు పాతికేళ్ల యువకులను సైతం ఈ సమస్య వేధిస్తోంది. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, బేకరీల్లో లభించే తినుబండారాలు, వారంలో నాలుగైదుసార్లు చికెన్, మటన్ లాగించేయడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేని జీవితాన్ని గడపడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో నేటి యువతరం గుండె బలహీనమైపోతోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరు మాత్రమే కార్డియాలజిస్టు ఉండేవారు. అప్పట్లో గుండె సమస్యలకు సైతం జనరల్ ఫిజీషియన్లు చికిత్స చేసేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పాతికేళ్ల క్రితం జనరల్ ఫిజీషియన్లే గుండె జబ్బుల విభాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కార్డియాలజిస్టు రావడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన ఒక్కరే విభాగాన్ని పర్యవేక్షించారు. మధ్యలో ఒకరిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్ రెసిడెంట్లు వచ్చినా కొన్నాళ్లకే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కార్డియాలజిస్టులు ఈ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఓపీకి 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుండగా, ఇన్ పేషంట్లుగా నెలకు 350 నుంచి 400 మంది వరకు చేరి చికిత్స పొందుతున్నారు. రోజూ 400కి పైగా ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11వేల దాకా యాంజియోగ్రామ్లు, 2వేలకు పైగా స్టెంట్స్, 60 పేస్మేకర్లు వేశారు. దీంతో పాటు కార్డియోథొరాసిక్ విభాగంలో సైతం గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకు 480కి పైగా ఆపరేషన్లు నిర్వహించారు. గుండె పోటు వచ్చిన వారికి సత్వర వైద్యం అందించేందుకు కర్నూలు పెద్దాసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. గుండెపోటుకు కారణాలు ►మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు ►చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు బీపీ, షుగర్లు రావడం ►ఈ జబ్బులు వచ్చినా వాటిని నియంత్రణలో ఉంచుకోకపోవడం ►ఒకేచోట గంటలకొద్దీ సమయం కూర్చుని పనిచేయడం ►ధూమ, మద్యపానాలతో మరింత చేటు ►విపరీతంగా ఫాస్ట్ఫుడ్, మాంసాహారం తినడం ►రాత్రివేళల్లో తగినంత నిద్రలేకపోవడం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ►బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. ►రోజూ తగినంత వ్యాయామం చేయాలి. ►ధూమ, మద్యపానాలు మానేయాలి. ►ఒత్తిడి లేని జీవితం కోసం ప్రణాళికతో రోజును ప్రారంభించాలి. ►స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. ►అధిక కొవ్వు, నూనెలు, ఉప్పు, చక్కెరలకు దూరంగా ఉండాలి. ►రాత్రి త్వరగా నిద్రపోవాలి. తగినంత నిద్రతో గుండెకు అదనపు శక్తి. యువతలో హృద్రోగ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు సైతం గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పలు రకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో పాటు దురలవాట్లు, నియంత్రణలేని ఆహారం, కుటుంబ సమస్యలు, వాతావరణ కాలుష్యం కారణాలుగా భావిస్తున్నాము. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుని రోజూ తగినంత వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మేలు. బీపీ, షుగర్లు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. –డాక్టర్ చైతన్యకుమార్, కార్డియాలజిస్టు, కర్నూలు ఉద్గీత ధ్యాన యోగ ఉపకరిస్తుంది గుండెపోటు ప్రధానంగా మానసిక ఒత్తిడి అధికం కావడం, నిద్రలేకపోవడంతో వస్తోంది. దీనికితోడు శరీరం సైతం అంతరశుద్ధి లేకపోవడం వల్ల లోపల వాయువులు ఏర్పడి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు గాను ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే లీటర్ నీటిని తాగి శరీరాన్ని అంతరశుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్గీత ధ్యానయోగ(గట్టిగా ఓంకారం పలకడం)ను 20 సార్లు చేయాలి. –జి. మురళీకృష్ణ, యోగామాస్టర్, కర్నూలు -
Health Tips: గుండె ఆరోగ్యం.. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే..
Best Diet For Heart Health And Weight Loss: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్నిరకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో, దానిని ఎందుకు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ ఎక్కువగా ఉండాలి.. ►నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ►ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ►ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ►దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ►చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వెజిటేరియన్లు ఎలా? ►ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ►బాదంపప్పు, వాల్నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ►వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►నట్స్ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గించుకుంటేనే.. ►అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ►ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ►చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ►అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గించుకునేందుకు.. ►సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. ►వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ►జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్లా పనిచేసి, కొలెస్ట్రాల్ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్లు కూడా.. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. ►అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే.. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ►సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. ►అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో.. ►బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. ►పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ►టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. ►దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. చదవండి👉🏾Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్లాండ్ వెకేషన్కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్తో పాటు టవల్స్పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్లాండ్కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన
‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...’’ అన్నాడో కవి. సంతోషం సగం బలమే కాదు.. పూర్తి మనోబలం అంటున్నారు శాస్త్రవేత్తలు. పొద్దునలేస్తే వాట్సాప్లో ‘పాజిటివ్ థింకింగ్’కోట్స్... యూట్యూబ్, షేర్చాట్ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ‘బీ పాజిటివ్’అంటూ వీడియోస్. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ పాజిటివ్ గోలేంట్రా!? అని అనుకోని వారుండరు. ‘ఎవరెన్నైనా అనుకోనివ్వండి ఆలోచన అనేది మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన బాగుంటే చాలు... అంతా బాగుంటుంద’న్నది శాస్త్రవేత్తల మాట. అందులో నిజానిజాలేంటో నేడు ‘వరల్డ్ థింకింగ్ డే’ సందర్భంగా తెలుసుకుందాం. ‘ఆశ... క్యాన్సర్ ఉన్నవాడినైనా బతికిస్తుంది. భయం.. అల్సర్ ఉన్నవాడినైనా చంపేస్తుంది’అని ఓ సినిమాలో డైలాగ్. అది నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పెట్టుకునే ఆశ అయినా... పెంచుకునే భయం అయినా... ప్రభావితం చేసేది బ్రెయిన్. మనం ఏది చెప్తే అదే స్వీకరించే బ్రెయిన్.. శరీర భాగాలు అలాగే స్పందించేలా చేస్తుంది. ఏదైనా జబ్బుతో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు, ట్రీట్ చేసిన విధానం నచ్చకపోతే ఫలితం ఒకలా ఉంటుంది. చికిత్స ఇద్దరిదీ ఒకటే అయినా... డాక్టర్ రిసీవ్ చేసుకున్న విధానం, మీతో మాట్లాడిన తీరు, మీకిచ్చిన భరోసా బాగుంటే... అదే సగం జబ్బును తగ్గిస్తుంది. డాక్టర్ నుంచి వచ్చిన స్పందన, దాంతో వచ్చిన సంతృప్తి తాలూకు ఫలితం అది. ఇదే చాలా విషయాలకూ వర్తిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. మరణం ముప్పు తగ్గుతుంది... సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉంటే.. క్యాన్సర్ ముప్పును 16 శాతం తగ్గించుకోవచ్చు. హృద్రోగాలతో మరణించే రిస్క్ను 38 శాతం తగ్గించొచ్చు. శ్వాస సంబంధిత జబ్బుల మర ణాలనుంచీ 38% బయటపడొచ్చు. గుండెపోటుతో మరణించే రిస్క్ను 38% తగ్గించొచ్చు. ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి 52 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. సానుకూల ఆలోచనకు సంతోషానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని హార్వర్డ్ బృందం తెలిపింది. ఈ సానుకూల ధోరణి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కలిపి.. వివిధ జబ్బుల రిస్క్ నుంచి కాపాడతాయి. అవుట్కమ్ మీద ఆలోచనల ప్రభావం... కీడెంచి మేలెంచాలని సామెత. ఎప్పుడూ మేలే ఎంచాలనేది పాజిటివ్ థింకింగ్ థియరీ. ‘ఏదైనా చేయగలననుకుంటే.. మెదడు అటువైపు నడిపిస్తుంది. చేయలేననుకుంటే.. నీరుగారుస్తుంది’ అని న్యూజిలాండ్ విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదేమీ మ్యాజిక్కాదు... ఆలోచనలే ఆచరణమీద ప్రభా వం చూపి అవుట్కమ్ను ప్రభావితం చేస్తాయట. యవ్వనం, ఫిట్నెస్కూడా మైండ్ గేమే అంటున్నారు. అయితే ప్రతీదానికి పాజిటివ్ ఉండమంటూ... మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తున్నారనే మరో వాదనా ఉంది. ఎనిమిదేళ్ల ఆయుష్షు... ఆలోచనలు సానుకూల దృక్పథంతో ఉంటే... అంత ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్య య నం తేల్చి చెప్పింది. ఆలోచనా విధానం బాగుంటే చావును ఎనిమిదేళ్లు వాయిదా వేయొచ్చట. ఆలోచనా దృక్పథం ఆయుష్షును ఎనిమిదేళ్లు పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అం దులోనూ మహిళల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేల్చి చెప్పింది. అందుకే... రోగులకు మంచి ఆహారం తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పడమే కాదు.. వారిని సానుకూల ఆలోచనలను వైపు నడిపించా లని పరిశోధక బృందానికి నాయ కత్వం వహించిన డాక్టర్ ఎరిక్కిమ్ వైద్యులకు సూచిస్తున్నారు. వాటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. హార్వర్డ్ ఈ పరిశోధనను 70వేల మంది మహిళల మీదే జరిపినా... పురుషులకూ ఇదే వర్తిస్తుందని అంటున్నారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న మహిళలను కొన్నేళ్లపాటు పరీక్షించగా.. సానుకూల దృక్పథంతో ఉన్నవారిలో మరణం ముప్పు 30% తగ్గిందట. -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్) -
టీ, కాఫీతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చిలా..! పక్షవాతం, స్ట్రోక్ కూడా..
Are You Drinking More Coffee And Tea A Day Must Know These Shocking Health Benefits: ప్రతి రోజూ రెండు కప్పుల టీ, అలాగే రెండు కప్పుల కాఫీ తాగేవారికి మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరుపు రావడం అన్నది... అలా తాగని వారితో పోల్చినప్పుడు దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు డాక్టర్ యువాన్ ఝాంగ్, అతని బృందం. ఒక్కరూ ఇద్దరూ కాదు... దాదాపు అయిదు లక్షల మందిపై పదేళ్ల పాటు బ్రిటన్లో సుదీర్ఘ పరిశోధన చేశారు. చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ, టీ తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) మాత్రమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ జర్నల్ ‘ప్లాస్ మెడిసిన్’ (PLoS Medicine)లో ప్రచురితమయ్యాయి. అయితే ఇలా కాఫీ, టీల మీద పరిశోధనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివే చాలా సాగాయి. దాంతో ఈ ఫలితాల మీద కొంత ఎదురుదాడి కూడా జరుగుతోంది. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ఇలాంటి పరిశోధనలు గతంలోనూ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే దోహద పడి ఉండకపోవచ్చనీ, ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సైతం ఈ పరిశోధన ఫలితాల వెల్లడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుండే మాట వాస్తవమే. అయినప్పటికీ వాటిని పరిమితికి మించి తీసుకుంటూ ఉంటే కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53%మందికి డిమెన్షియా వస్తుందని తేలిన ఫలితాలను వారు ఉటంకిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘రెండంటే రెండే’’ అన్న పరిమితికి కట్టుబడాలంటూ గట్టిగా చెబుతున్నారు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం
సెలవు రోజు సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం విషాదంలో మునిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. ఆయన మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. చిన్నారులిద్దరూ ప్రాణాలతో బయటపడిన సంఘటన వరదయ్యపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. తాగిన మైకంలో నడి రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తండ్రి పక్కకు లాగుతుండగా కారు ఢీ కొనడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శ్రీరంగరాజపురం మండలంలో జరిగింది. సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు): సరదా కోసం ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వరదయ్యపాళెం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవేడు మండలం చిగురుపాళెం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు తన స్వగ్రామమైన చిగురుపాళెంకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద సరదాగా గడిపారు. మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనే కారు నడుపుతూ తిరుగు పయనమయ్యారు. దరఖాస్తు గ్రామం వద్ద ప్రభాకర్ రెడ్డి గుండపోటుకు గురవడంతో, కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య రజితకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో బాధితులను సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రభాకర్ రెడ్డి మార్గమధ్యంలోనే మృతి చెందారు. భార్య రజిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు పిల్లలు బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. ఎస్ఐ పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్కు తరలించినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ► ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021 -
ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పాత బజార్కు చెందిన ఇరవై ఆరేళ్ల రాజు ప్రైవేట్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) -
పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం.. యువ వైద్యుడి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడి నిశ్చితార్థానికి అతని సొంతూరుకు వెళ్దామని ఆనందంతో ఉన్న మిత్రులు.. ఆ స్నేహితుడి మృతదేహాన్నే తీసుకువెళ్లాల్సి రావడం కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయని భోరున విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో యువ వైద్యుడు పూర్ణచంద్ర బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ► ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్ చదువుకున్నారు. ► గాంధీలోనే సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్)గా విధులు నిర్వర్తించి ఈ ఏడాది జూలైలో పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్నేహితులతో కలిసి పద్మారావునగర్లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి రావడంతో గాంధీలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలన్నీ నార్మల్గానే వచ్చాయి. ► బుధవారం ఉదయం 5 గంటలకు మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ తీసుకున్నారు. పద్మారావునగర్లోని గదికి వెళ్లవద్దని, అత్యవసర విభాగ భవనం పైనున్న పీజీ హాస్టల్లో ఉండాలని సహచర వైద్యుల సూచన మేరకు మెట్ల మార్గంలో వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి తీ వ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పది రోజుల్లో నిశ్చితార్థం.. పూర్ణచంద్ర గుప్తాకు మరో పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. గతంలోనే ఆయన తల్లి చనిపోయింది. వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్కే పరిమితమైన తండ్రి బాగోగుల్ని సోదరుడు చూస్తున్నాడు. పూర్ణచంద్ర కోరిక మేరకు నిశ్చితార్థానికి వైద్య మిత్రులంతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృత్యువు కబళించడంతో అంత్యక్రియలకు స్నేహితుని మృతదేహాన్ని తీసుకుని ఆయన సొంతూరుకు వెళ్తున్నామని భోరుమన్నారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు నివాళులర్పించారు. -
గుండెపోటుతో మాజీ ఉపాధ్యక్షుడి మృతి
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రాయచూరు నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత దొడ్డమల్లేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్లే సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రెండుసార్లు నగరసభ సభ్యుడిగా, బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల నగరసభ అధ్యక్షుడు వినయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన సాయి సుశాంత్(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీలో స్టాఫ్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుశాంత్ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్నాయక్ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. -
భార్య కళ్లముందే గుండెపోటుతో భర్త మృతి
కొత్తవలస: ఆయన రైల్వే విశ్రాంత ఉద్యోగి. ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో భార్యతో కలిసి బయలుదేరారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా.. కష్టసుఖాలు చెప్పుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు మెట్లు ఎక్కనేలేదు. అక్కడ ఉన్న ఏటీఎం వద్ద ఒక్కసారిగా వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో వృద్ధురాలైన భార్య తెలుసుకునేలోపే ప్రాణం విడిచిన హృదయవిదారక ఘటన కొత్తవలస స్టేట్బ్యాంకు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన బోదం తాతాలు(75) రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈయన ఇద్దరు పిల్లలకు వివాహాలు కావడంతో హైదరాబాద్లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ మల్లివీడులో ఉంటున్నారు. పెన్షన్ డబ్బుల డ్రా చేసేందుకు భార్య రాములమ్మతో కలిసి బ్యాంకుకు బయలుదేరారు. బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
గుండెపోటు వస్తే.. ఇలా ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసాఫీసర్.. డ్యూటీలో ఉంటాడు.. తనపై ఏదో విష ప్రయోగం జరుగుతుంది.. ఛాతీలో నొప్పి మొదలై గుండెపోటు వస్తుంది. అది గుర్తించిన ఆయన మెల్లగా కారు దగ్గరికి వెళ్తాడు.. అందులో ఉన్న ఓ పరికరంతో ఛాతీపై షాక్ ఇచ్చుకుంటాడు. గుండెపోటు నుంచి బయటపడతాడు.. ఇదంతా ‘కాసినో రాయల్’జేమ్స్బాండ్ సినిమాలో ఓ సీన్. అందులో షాక్ ఇచ్చుకున్న పరికరం ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’. ఇదేదో సినిమా అని కాదు. నిజంగా పనిచేసే పరికరం. గుండెపోటు వచ్చినవారి ప్రాణాలను కాపాడే పరికరం. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. పెద్ద బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిద్ధంగా ఉంచుతారు. కానీ మన దగ్గర మాత్రం ముఖ్యమంత్రుల కాన్వాయ్లో కూడా ఈ పరికరాలు లేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ ప్రభావంతో గుండె సమస్యలు పెరిగి.. కరోనా మొదలైనప్పటి నుంచీ.. వైరస్ ప్రభావంతోపాటు పలు ఇతర కారణాలతో గుండె సమస్యలు పెరిగాయి. 25 ఏళ్లవారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారినపడుతున్నారు. ఆకస్మికంగా వచ్చే ఈ సమస్యకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించకుంటే పరిస్థితి చేయిదాటుతుంది. ఎవరైనా గుండెపోటుకు గురైతే ఐదారు నిమిషాల్లోగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేస్తూ, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ (ఏఈడీ) పరికరంతో షాక్ ఇస్తే.. ప్రాణాపాయం నుంచి 70–80 శాతం వరకు కాపాడొచ్చు. కానీ మన దేశంలో ఇటువంటి వాటిపై తగిన అవగాహన లేదు. పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు సీపీఆర్పై శిక్షణ ఇస్తారు. అమెరికా, పలు యూరప్ దేశాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏఈడీలు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందుతుంది. ఈ పరికరం ధర లక్ష రూపాయలలోపే ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పరికరాన్ని మన దగ్గర సీఎం కాన్వాయ్లలోనూ పెట్టడం లేదని.. అంటే ఈ విషయంగా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో కేవలం 2 శాతం మందికే సీపీఆర్ తదితర అంశాలపై అవగాహన, చైతన్యం ఉందని చెప్తున్నారు. ప్రాణాలు కాపాడొచ్చు.. గుండెపోటుకు గురైనవారికి ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్స అందించే ప్రక్రియను ‘బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)’అంటారు. ఛాతీపై తగిన విధంగా అదుముతూ ఉండటం, నోటిద్వారా ఊపిరి అందించడం వంటి పలు ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి. డాక్టర్లు, నర్సులు వంటి వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తే.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చు. గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతీ నిమిషం ఆలస్యానికి ఏడెనిమిది శాతం ప్రాణాపాయం పెరుగుతుంది. ఎంత త్వరగా సీపీఆర్ చేస్తే.. అంతగా కాపాడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మన దేశంలోనూ గుండె జబ్బులతో చనిపోయేవారిలో 60 శాతం మంది సడన్ కార్డియాక్ షాక్ ద్వారానే మరణిస్తున్నారు. ఇందులో చాలా వరకు ఇళ్లలో, బయట ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నవేనని.. సీపీఆర్ శిక్షణ, ఏఈడీ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలా మందిని రక్షించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా స్పందించి సీపీఆర్, ఏఈడీలతో ప్రాథమిక చికిత్స చేస్తే అంత బాగా ఫలితం ఉంటుంది. కోవిడ్తో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోట్లు పెరుగుతున్నాయి. అందువల్ల సీపీఆర్, ఏఈడీ తదితర అంశాల్లో ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాలి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఏఈడీ అందుబాటులో ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో మాల్స్, మల్టీప్లెక్సులు, ఎయిర్పోర్టుల్లో అందుబాటులో ఉంటాయి. – డాక్టర్ విజయ్రావు, ఎండీ (యూఎస్), రిససియేషన్ మెడిసిన్, హైదరాబాద్ -
ఘంటసాల కుమారుడు కన్నుమూత
చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్పై ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన నేడు మరణించారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు డబ్బింగ్ చెప్పి రత్నకుమార్ రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళ, మలయాళ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. చదవండి : ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు! 'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు' -
మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారం.. షాక్కు గురై గుండెపోటు
మరిపెడ రూరల్: ఓ యువకుడు మాయమాటలతో మభ్యపెట్టి గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. అయితే.. ఊహించని షాక్కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మోడు లక్పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లక్పతికి మహబూబాబాద్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేశ్ దుకాణం వద్దకు వచ్చాడు. ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను పురుషోత్తమాయగూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. అతను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఈలోపు విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వెంటనే మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా.. ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఉష మృతదేహాన్ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం తొర్రూరు డీఎస్పీ వెంకటరమణతో కలసి ఘటనా స్థలం వద్ద విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజేశ్, ఉష ఇద్దరూ గుట్టల వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కలెక్టర్ గౌతం కూడామృతురాలి బంధువులను ఓదార్చారు. అయితే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, పోలీసులు నచ్చచెప్పి పంపించారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ జరపండి.. ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం సీతారాం తండాకు చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. -
గుండెపోటుతో క్రికెట్ కోచ్ కన్నుమూత.. విషాదంలో కోహ్లి
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా శనివారం గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేశ్ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. కోహ్లి టీనేజ్ వయసులో ఉన్నప్పుడు సురేశ్ బాత్రా అతనికి బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించారు. కోహ్లి బ్యాటింగ్ స్టైల్లో మార్పు రావడంలో సురేశ్ కీలకపాత్ర పోషించారు. కాగా ఢిల్లీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్గా ఉన్న రాజ్కుమార్ శర్మ ట్విటర్లో స్పందించారు. ' నేను ఈరోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్ కోహ్లికి కూడా కోచ్గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు అంటూ ట్వీట్ చేశారు. కాగా కోహ్లి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు టీమిండియాతో కలిసి జూన్ 2న ఇంగ్లండ్ బయల్దేరనున్నాడు. కివీస్తో టెస్టు చాంపియన్షిప్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: 'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా' Suresh Batra (striped t-shirt), who coached @imVkohli when he was a teenager, passed away on Thursday. He had finished his daily morning puja and collapsed. He was 53. "I lost my younger brother. Knew him since 1985," said Rajkumar Sharma. May his soul Rest in Peace.... pic.twitter.com/pW3avt6NpP — Vijay Lokapally (@vijaylokapally) May 21, 2021 -
గుండె స్పందనల వేగం పెరిగిందా?
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. ఇలా గుండె వేగం పెరిగిన కండిషన్ను సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు కార్డియాలజిస్ట్ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షలల్లాంటివి చేయించాలి. ఓ వ్యక్తి అలా స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. -
నిలకడగా ‘దాదా’ ఆరోగ్యం
కోల్కతా: భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వల్ప స్థాయి గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నగరంలోని వుడ్ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం యాంజియోప్లాస్టీ చేశారు. ఇందులో మూడు పూడికల్ని (బ్లాకులు) గుర్తించారు. ప్రస్తుతం గంగూలీని ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచిన నిపుణులైన వైద్యబృందం ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. టీమిండియా విజయవంతమైన మాజీ కెప్టెన్ గంగూలీ అనారోగ్యం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. గంగూలీ భార్య డోనా, కూతురు సనా విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్, రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ బెనర్జీ, బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడు అవిశేక్ దాల్మియా ఆసుపత్రికి వెళ్లి గంగూలీని పరామర్శించి అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 48 ఏళ్ల గంగూలీ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 113 టెస్టుల్లో, 311 వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడి 21 విజయాలు సాధించింది. 13 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. వన్డేల్లో గంగూలీ నాయకత్వంలో టీమిండియా 146 మ్యాచ్లు ఆడింది. 76 మ్యాచ్ల్లో గెలిచి, 65 మ్యాచ్ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరించిన గంగూలీ 2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ ట్రెడ్మిల్పై నడుస్తుండగా... నిజానికి శుక్రవారం రాత్రే గంగూలీకి ఛాతీలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. అయినాసరే ఉదయం తన రోజువారీ దైనందిన పనులకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే సాధారణ వర్కౌట్లు చేశాడు. ట్రెడ్మిల్పై నడుస్తుండగా అతనికి ఛాతీనొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆలస్యం చేయకుండా స్థానిక వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. ముందుగా హృదయ సంబంధిత పరీక్షలన్నీ చేసిన వైద్య బృందం ఈసీజీ, ఎకో టెస్టుల తేడాల్ని పరీశిలించింది. డాక్టర్ సరోజ్ మండల్ నేతృత్వంలోని వైద్యబృందం గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించింది. అలాగే అతని కుటుంబీకుల్లో హృద్రోగుల చరిత్ర ఉండటంతో వెంటనే కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించింది. ‘దాదాకు స్వల్ప గుండెపోటు వచ్చింది. పరీక్షల్లో గుండె మూడు రక్తనాళాలు బ్లాక్ అయినట్లు గుర్తించాం. దీంతో యాంజియోప్లాస్టీ చేసి అత్యవసరమైన చోట ఒక స్టంట్ వేశాం. ఇప్పుడైతే అతను స్పృహలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే మూణ్నాలుగు రోజుల పాటు అత్యవసర విభాగంలోని వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే ఉంచుతాం. ఆరోగ్యస్థితిని అంచనా వేస్తాం. ఇంకా స్టంట్ల అవసరం ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఇది మినహా అతని బీపీ, షుగర్ ఇతరత్రా అన్ని పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి’ అని డాక్టర్ సరోజ్ మండల్ వివరించారు. త్వరగా కోలుకోవాలని... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ క్రికెటర్లు, అతని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు. ‘సౌరవ్ గుండెపోటుకు గురవడం విచారకరం. త్వరితగతిన కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలి. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి’ అని బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. ►గెట్ వెల్ సూన్ గంగూలీ. త్వరగా కోలుకోవాలని నా ప్రార్థన. –భారత కెప్టెన్ కోహ్లి ►‘దాదా’ వేగంగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలి. అదే నేను కోరేది... ప్రార్థించేది. –బీసీసీఐ కార్యదర్శి జై షా ►‘దాదా’... మీరు త్వరలోనే కోలుకుంటారు. మీకు పూర్తి స్వస్థత చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. – వీరేంద్ర సెహ్వాగ్ ►సౌరవ్ నీ అనారోగ్యం గురించి తెలిసింది. ఇకపై గడిచే ప్రతి రోజు నిన్ను పూర్తి ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలని కోరుకుంటున్నా. – సచిన్ టెండూల్కర్ ►భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గుండెపోటుకు గురయ్యాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. మేమంతా అతను సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. –ఐసీసీ -
విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం
సాక్షి, చెన్నై: వ్యవసాయ మంత్రి దురైకన్ను(72) ఆరోగ్యం క్షీణించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు తీవ్రచికిత్స అందిస్తున్నారు. సీఎం పళనిస్వామి, మంత్రులు సోమవారం పరామర్శించారు. దురైకన్ను ఈ నెల 13న కారులో సేలంకు వెళుతుండగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు. క్రమంగా పల్స్ తగ్గడంతో హుటాహుటిన చెన్నైకు తరలించారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) ప్రైవేటు ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. సీఎం పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం వేర్వేరుగా ఆస్పత్రికి వెళ్లి దురైకన్నును పరామర్శించారు. వైద్య బృందాలతో సీఎం పళనిస్వామి మాట్లాడారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఎక్మో చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
కరోనాతో కొత్తముప్పు !
సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్ఫెక్షన్స్కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్లకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు... కరోనాతో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా సివియర్ కండీషన్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ రోగుల్లో గుండె సమస్యలను గుర్తించడంతో ఇటీవల కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో గుండె వైద్య విభాగాన్ని సైతం ఆఘమేఘాలపై ప్రారంభించారు. ఆ విభాగంలో ప్రతి రోగికి ఈసీజీ, ఎకో కార్డియాలజీ పరీక్ష చేస్తున్నారు. అవసరమైతే యాంజియోగ్రామ్ నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండె వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు. (ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!) వెలుగు చూస్తున్న సమస్యలివే... కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు కొందరు పల్మనరీ ఎంబోలిజయ్(ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం)కు ఎక్కువుగా గురవుతున్నారు. కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో ఇదే కారణంగా చెపుతున్నారు. కొందరిలో గుండె రక్తనాళాల్లో, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, పూడికలు రావడం, కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 నుంచి 3 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మరణాలు సంభవిస్తుండగా, డిశ్చార్జి అయిన వారిలో 7 నుంచి 8 శాతం మందిలో గుండె, మెదడు సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలి. అలా వాడిన వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవు. ►ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు స్టెరాయిడ్స్ వాడిన వారు, ఆ తర్వాత ఫాలోఅప్ మందులు కూడా వాడాలి. ►యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ►పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ►తరచూ రక్తంలో ఆక్సిజన్శాతాన్ని పరీక్షించుకోవాలి. ఏ మా త్రం తగ్గినట్లు గుర్తించినా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి కోవిడ్ సివియర్ స్టేజ్కు వెళ్లిన కొందరిలో యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తంలో విపరీతమైన గడ్డలు ఏర్పడటం గుర్తిస్తున్నాం. గుండె రక్తనాళాలతో పాటు, మెదడు, కాళ్ల రక్తనాళాల్లో కూడా గడ్డలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి పదిరోజుల పాటు మంచంపైనే పడుకుంటే సాధారణంగా పల్మనరీ ఎంబోలిజమ్కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఐసీయూలో కదలకుండా రోజుల తరబడి ఉంటున్న వారికి పల్మనరీ ఎంబోలియజ్, కరోనాతో ఏర్పడే గడ్డలతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి వారికి యాంటి కో ఆగ్యులేషన్ థెరపీ అందిస్తారు. కరోనా చికిత్స పొందిన వారిలో పదిహేను ఇరవై రోజుల్లో కొందరిలో, నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మరికొందరిలో గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్కు గురవుతున్న వారిని గుర్తిస్తున్నాం. విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో ఈసమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ -
గుండెపోటు మరణాలే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్ ఆంక్షల వల్ల వైద్య సేవలు అందక బ్రిటన్లో 65 ఏళ్ల లోపు వృద్ధుల్లో ఎక్కువ మంది గుండెపోటుతో మరణించారు. కరోనాతోపాటు అత్యవసర ఆపరేషన్లను మినహా మిగతా వైద్య సేవలను నిలిపి వేయడం వల్ల ఇళ్లకే పరిమితమైన వీరు గుండెపోటుకు గురయ్యారు. గత మార్చి, ఏప్రిల్ రెండు నెలల కాలంలోనే బ్రిటన్లో 2,800 మంది 65 ఏళ్ల లోపు వృద్ధులు గుండెపోటుతో మరణించారు. సాధారణ సమయాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్యకన్నా ఇది 420 ఎక్కువ. జూలై నెల వరకు 800 మంది వృద్ధులు ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. అంటే కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల కారణంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య దాదాపు 13 శాతం పెరిగిందని ‘బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్’ వెల్లడించింది. లాక్డౌన్ సందర్భంగా పింఛనుదారుల మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఫౌండేషన్ అంచనా వేసింది. సాధారణ పరిస్థితుల్లోకన్నా ఆంక్షల సమయంలో 976 మంది పింఛనుదారులు మరణించారని, సాధారణ సమయాల్లోకన్నా ఈ మరణాలు ఆరు శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా మినహా వైద్య సేవలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించినట్లయితే భవిష్యత్లో గుండెపోటు మరణాలు, పింఛనుదారుల అకాల మృతి పెరగుతుందని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ సోన్యా బాబు–నారాయణ్ హెచ్చరించారు. గత మార్చి నెల నుంచి జూన్ వరకు నాలుగు నెలల కాలంలో ఆస్పత్రుల్లో సాధారణ అడ్మిషన్లు 1,73,000 తగ్గగా, లక్షా పదివేల మంది అనారోగ్యం వల్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్నున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. -
కూతురి మరణ వార్తతో తండ్రికి గుండెపోటు
వైఎస్ఆర్ జిల్లా,గాలివీడు: కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే గుండె పోటుతో తండ్రి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని గొట్టివీడు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో సుభహాన్వలి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమార్తె మొదీనా (27)ను రాయచోటి సమీపంలోని మాసాపేటకు ఇచ్చి వివాహం చేశాడు. ఆదివారం ఉదయాన్నే మొదీనా గుండె పోటుతో మృతిచెందిందని అల్లుడి కుటుంబీకులు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. కూతురి మరణ వార్త చెవిన పడగానే సుబహాన్వలి కుప్పకూలి పడిపోయి వెంటనే ప్రాణం వదిలాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మృతుడి కుటుంబీకులను ఫోన్లో పలుకరించి ధైర్యం చెప్పారు. -
అస్తమించిన భాస్కరుడు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానును అధిరోహించే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు(68) హుకుంపేటలో ఉన్న స్వగృహంలో శుక్రవారం కన్ను మూశారు. గురువారం రాత్రి గుండె నొప్పితో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఉమామహేశ్వరి, కుమారుడు ధనుంజయ్, కుమార్తెలు అరుణ, వాసవి ఉన్నారు. ఈయన 2009 నుంచి 2016 వరకు సిరిమానును అధిరోహించారు. అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించేవారు. భాస్కరరావు మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలిపారు. ఈయన మృతిపై కస్పా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి వేలమూరి నాగేశ్వరరావు, గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాడిశెట్టి శాంతారావు, పైడితల్లి అమ్మవారి ఆలయ అభవృద్ధి కమిటీ ప్రతినిధి ఎంబీ సత్యనారాయణ, పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకుడు, గురుస్వాములు ఆర్ఎస్ పాత్రో, ఎస్.అచ్చిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
కొడుకు మృతి.. ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్ తండ్రి సుదర్శన్ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు. టెక్స్టైల్ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. చలించిపోయిన పోలీసులు అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్ సిబ్బంది అమిత్ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్ రూ.10 వేలు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. -
మూగబోయిన ప్రభోదాశ్రమం
అనంతపురం, తాడిపత్రి రూరల్: ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంతకర్త, బహుగ్రంథకర్త ప్రభోదానంద స్వామి ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని గురువారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణ మందిరం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఈ నెల 7న ఆస్పత్రికి తరలిస్తుండగా.. గతంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ప్రభోదానంద స్వామి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నెల 7న తిరిగి ఆయన గుండెలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు కుమారుడు గుత్తా యోగానంద చౌదరి తెలిపారు. 1950లో జన్మించిన ప్రభోదానంద పూర్తి పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం పెద్దపప్పూరు మండలం అమ్మళ్ళదిన్నె కొత్తపల్లి గ్రామం. భారత సైన్యంలో వైర్లెస్ ఆపరేటర్గా పనిచేశారు. ఆ సమయంలోనే దైవజ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని వదిలి, తాడిపత్రి ప్రాంతానికి వచ్చారు. కొంత కాలం ఆర్ఎంపీగా పలువురికి వైద్య సేవలు అందించారు. ఆధ్యాత్మిక జీవితంతో పేరు మార్పు కులాంతర వివాహం చేసుకున్న పెద్దన్న చౌదరి.. కాలక్రమంలో ఆయుర్వేద వైద్యంపై కొన్ని పుస్తకాలు వెలువరించారు. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆయన దృష్టి మళ్లింది. ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధనాత్మక రచనలు కొనసాగించారు. దైవజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనతో ‘ఇందూ జ్ఞానవేదిక’ను స్థాపించి దేవుడు ఒక్కడేనని చాటిచెబుతూ వచ్చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఉన్న దైవజ్ఞానం అందరికీ ఒక్కటేటని బోధిస్తూ త్రైత సిద్దాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అనేక గ్రంథాలను రచించి 1980న ప్రభోదానందస్వామిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంబించారు. వివాదాలకూ కేంద్రబిందువు త్రైత సిద్ధాంత బోధనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన ప్రభోదానంద స్వామి.. ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 1990లో ఓ సారి ఆశ్రమంపై దాడులు జరిగాయి. అలాగే 2018 సెప్టెంబర్ 16న ప్రభోధానంద ఆశ్రమంపై జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచనలమయ్యాయి. ముస్లింల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఆయన రాసిన ఓ పుస్తకంపై 2017లో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతర పరిణామాలు, రాజకీయ కక్షలు కారణంగా ఆయన భక్తులకు ఆశ్రమంలో అందుబాటులో లేకుండా పోయారు. అయినా సామాజిక మాధ్యమాల ద్వారా తన బోధనలను భక్తులకు వినిపిస్తూ వచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రభోదానంద స్వామి కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన భక్తులు గురువారం ఉదయం నుంచి చిన్నపొడమల గ్రామంలోని ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. భక్తుల రాకను గమనించిన పోలీసులు అప్రమత్తమై కోవిడ్–19 నేపథ్యంలో వారికి అనుమతులు నిరాకరిస్తూ ఎక్కడికక్డ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో నుంచే భక్తులను వెనక్కు పంపిస్తూ వచ్చారు. ఆశ్రమంలోని భక్తులకు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి రూరల్, పట్టణ సీఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రభోదానంద పార్థివ దేహం సందర్శనకు బీజేపీ నాయకులు అంకాల్రెడ్డి, ప్రతాపరెడ్డి ఆశ్రమానికి వచ్చారు. వారికి ఆయన కుమారుడు గుత్తా యోగానంద చౌదరి వివరాలు తెలిపారు. తహసీల్దార్ నయాజ్ అహమ్మద్, ఎంపీడీఓ రంగారావు అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం రాత్రి ప్రభోదానంద అంత్యక్రియలను ఆశ్రమంలోనే నిర్వహించారు. -
పెళ్లింట చావు మేళం!
కర్నూలు, డోన్ టౌన్: పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. రోజు గడిస్తే వివాహ వేడుక మొదలుకావాల్సి ఉండగా.. పెళ్లికుమార్తె తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. డోన్ పట్టణంలోని పాతపేట రాముల దేవాలయం ఎదుట నివాసం ఉండే రాజా కుళ్లాయప్ప(49) గత 15 ఏళ్లుగా ఎల్ఐసీ, అగ్రిగోల్డ్ ఏజెంటుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఈయన కుమార్తెకు మండలంలోని సీతంగుంతలకుచెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. వాస్తవానికి ఏప్రిల్ 9,10 తేదీల్లో పెళ్లి జరగాల్సి ఉండేది. లాక్డౌన్ వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 11,12 తేదీల్లో ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి పత్రికలు సైతం పెంచిపెట్టారు. కాగా.. బుధవారం తెల్లవారుజామున రాజా కుళ్లాయప్పకు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కాలనీవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లికి హాజరు కావాల్సిన తాము చావుకు రావాల్సి వస్తుందని కలలోనూ ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం!
కోవెలకుంట్ల: ముక్కుపచ్చలారని చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. వందేళ్లపాటు జీవించాల్సిన చిన్నారి ఐదేళ్ల వయసులోనే గుండెకు రంధ్రం పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. రెండు నెలల్లో ఆపరేషన్ చేయకుంటే ప్రాణాపాయం కలుగుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించాలంటూ వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల పట్టణంలోని సీతారాం నగర్లో నివాసం ఉంటున్న రామాంజనేయులు, గురుదేవి దంపతులకు రాంచరణ్, అఖిల్ సంతానం. రామాంజనేయులు గౌండా పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమారుడు రాంచరణకు ఐదేళ్ల వయసు రావడంతో పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడీ కేంద్రంలో చేర్చించారు. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. చిన్నారి గుండెకు రంధ్రం:అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్లు రాంచరణ్ అనారోగ్య పరిస్థితిని గుర్తించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పది రోజుల క్రితం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి గుండెకు రంధ్రం పడినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు చిన్నారిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా అదే సమస్య చెప్పి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్కు దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆపరేషన్ చేయకుంటే ప్రాణాపాయం : రెండు నెలల్లో చిన్నారి గుండెకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితులు తప్పవని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను బతికించుకోవడానికి గత వారం రోజుల నుంచి ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆపన్న హస్తం అందించి తమ కొడుకుని బతికించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయాల్సిన చిరునామా: గురుదేవి: ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ 080510100186893 ఐఎఫ్సీ కోడ్: ANDB0000805 కోవెలకుంట్ల ఫోన్: 9550066686, 9391026170 -
నాన్నా.. అమ్మ ఏది?
చంపాపేట: తల్లి ఈ లోకాన్ని విడిచిపోయిందని తెలియని ఆ చిన్నారి.. తన తండ్రి దగ్గరకు వెళ్లి.. నాన్నా.. అమ్మ మాట్లాడట్లేదు.. నాన్నా.. అమ్మను లేపు నాన్నా.. అమ్మ కావాలి.. నాన్నా.. అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంటే.. ఆ చిన్నారిని ఓదార్చలేక.. భార్య దహన సంస్కారాలు జరపలేక.. నిస్సాయ స్థితిలో ఉండిపోయి.. ఏం చేయాలో తెలియక బాధను దిగమింగుకుంటూ రోజంతా గడిపేశాడు.. నట్టింట్లో భార్య మృతదేహాన్ని చూస్తూ కనీసం సాయం కూడా అడగలేక పోయాడు. అతడి దుస్థితిని చూసి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక చేయూత అందించడంతో మృతదేహం ఇంటి నుంచి కదిలింది. వివరాల్లోకెళితే.. చంపాపేట డివిజన్ మారుతీనగర్ కాలనీకి చెందిన ఇషాంత్, రేఖ దంపతులు. వీరికి ఆరుషీ(5) కూతురు. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది) ఇషాంత్ చార్మినార్లోని ఓ మందుల షాప్లో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తూ చాలీచాలని జీతంతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇషాంత్ కుడి కాలు పూర్తిగా విరగటంతో మంచానికే పరిమితమయ్యాడు. భర్త చికిత్స ఖర్చుల కోసం రేఖ ఎక్కని గడప, మొక్కని దేవుడు లేడు. మూడునెలల పాటు అందిన కాడికి అప్పులు చేసి కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూనే తన భర్తకు చికిత్స అందించింది. ఇషాంత్ కొద్దిగా కోలుకుని ఒంటి కాలితో అయినా సరే విధులకు వెళ్దామనుకునే సమయంలో కరోనా.. లాక్డౌన్ వార్త పిడుగులా పడింది. ఇక చేసేది ఏమీలేక ఇషాంత్ మళ్లీ ఇంటికే పరిమితమయ్యాడు. తెల్ల రేషన్కార్డు లేదు.. దాతల వద్దకు వెళ్లి చేయిచాచేందుకు ఆత్మాభిమానం అడ్డుతో తన కుటుంబ సభ్యులతో అర్దాకలితోనే గడిపాడు. పెరిగిన అప్పులు.. పూట గడవని పరిస్థితి, భర్త అచేతన పరిస్థితిని తలుచుకుని రేఖ కొన్ని రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యింది. సోమవారం సాయంత్రం ఆమె గుండెపోటుతో మృతి చెందింది. నాన్నా.. అమ్మను లేపు అని కూతురు గుక్కపెట్టి ఏడవటంతో స్థానికులు కంచన్బాగ్ పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరి తన సొంత ఖర్చులతో రేఖ అంత్యక్రియలు చేయించాడు. స్థానికులు, దాతలు కొంత డబ్బును ఇషాంత్కు అందజేశారు. మూడు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులను అందచేసి చిన్నారి ఆరుషీ ఆలనా పాలన తన బాధ్యత అంటూ భరోసా ఇచ్చిన పోలీసు శ్రీనన్న ఔదార్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఇషాంత్ కుటుంబ సభ్యులను ఆదకోవాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నెం: 9390225976. -
హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): హోం క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి (48) శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, వైద్యాధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యక్తి ఉపాధి కో సం గతంలో గల్ఫ్కు వెళ్లాడు. మార్చి 23వ తేదీన స్వగ్రామమైన కంజర్కు తిరిగి వచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అతడు గ్రామానికి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్న వైద్యాధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రతి రోజు వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తనకు ఛాతిలో నొప్పి వస్తుందని ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందితో చెప్పగా, వారు మాత్రలను అందజేశారు. అదేరోజు అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. వాస్తవానికి ఆదివారంతో ఆయనకు విధించిన 14 రోజుల హోం క్వారంటైన్ గడువు ముగియనుంది. అయితే చివరి రోజు మరణించడంతో కరోనా సోకి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కరోనా సోకిన వారి మాదిరిగానే మృతదేహాన్ని కవర్లతో చుట్టేసి, రసాయనాలు చల్లి అంత్యక్రియలు నిర్వహించడం వారి అనుమానాలకు బలం చేకూర్చింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గుండెపోటుతోనే మృతి.. హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తి గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యాధికారి డాక్టర్ నవీన్ తెలిపారు. ప్రతిరోజు వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే వారని, ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించలేవని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం హోం క్వారంటైన్లో ఉండటం వల్ల కరోనా సోకిన వారికి ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే పూర్తి చేశామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. -
గుండెకు ప్లాస్టిక్ పట్టీ...
గుండెజబ్బు వచ్చిన తరువాత గుండెపై ఉండే కణజాలం కొంత దెబ్బతింటుందని... ఫలితంగా ఆ భాగం గుండె లబ్డబ్లలో భాగం కాదని తెలుసు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దాని ప్రభావం కాస్తా మన ఆరోగ్యంపైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్లోని డబ్లిన్కు చెందిన ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ ప్లాస్టిక్ పట్టీ అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఈ పట్టీని చెడిపోయిన గుండె కణజాలంపై అతికిస్తే చాలు.. పరిసరాల్లోని గుండె కణాల విద్యుత్ ప్రచోదనాలను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఈ పట్టీలో విద్యుత్ ప్రచోదనాలను ప్రసారం చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ గుండె కణజాల సంకోచ వ్యాకోచాలను ఈ పట్టీ ద్వారా అనుకరించవచ్చునన్నమాట. ప్రస్తుతానికి ఈ పట్టీని తాము పరిశోధన శాలలోని కణజాలంపై ఉపయోగించి చూశామని, త్వరలోనే జంతు ప్రయోగాలు చేపడతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైకేల్ మోనగన్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి పట్టీలు కొన్ని అభివృద్ధి చేసినా వాటిల్లో సజీవ గుండెకణజాల కణాలనే ఉపయోగించే వారు కాగా.. తాము తయారు చేసింది పూర్తిగా ప్రత్యేక పదార్థాంతోనని ఆయన వివరించారు. సజీవ కణాలను చేరిస్తే పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కేసీపీ గ్రూపు అధినేత వీఎల్ దత్ కన్నుమూత
కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వీఎల్ దత్ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, కుమార్తె కవితా దత్ ఉన్నారు. 1937 డిసెంబర్ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్ (వీఎల్దత్) లండన్లోని బిజినెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్, చక్కెర తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘డాక్టర్ వీఎల్ దత్ అకాల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. పరిశ్రమలకు, దేశానికి ఆయన అందించిన సేవలను ఫిక్కీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీఎల్ దత్ 1991–92 వరకు ఫిక్కీ ప్రెసిడెంట్గా పనిచేశారు. సీఎం జగన్ సంతాపం వీఎల్ దత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దత్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. -
మరణంలోనూ వీడని బంధం
ప్రకాశం, గిద్దలూరు: ముప్పై మూడేళ్ల వైవాహిక జీవితంలో ఆ ఆలూమగలు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. అకస్మాత్తుగా భర్త మరణించడంతో దాన్ని జీర్ణించుకోలేని భార్యా గుండెలవిసేలా రోదిస్తూ..చివరకు తుదిశ్వాస విడిచింది. గిద్దలూరు పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కొప్పువారి వీధిలో నివాసం ఉంటున్న మునగనూరి బాలసత్యనారాయణ (58) కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం వీరన్నబావి వద్ద షటిల్ కోర్టులో షటిల్ ఆడుతూ కుప్పకూలాడు. దీంతో సహచరులు స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11 గంటల సమయంలో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. భర్త మృతిని తట్టుకోలేని భార్య మహాలక్ష్మి (55) కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు. మెడికల్ షాపు నిర్వహిస్తున్న బాలసత్యనారాయణకు అతని భార్య మహాలక్ష్మి దుకాణంలోనూ సహాయంగా ఉండేది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహం చేయగా..కుమారుడు రవితేజకు ఇటీవల వివాహం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలా తల్లిదండ్రులు ఇద్దరూ ఒక రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. భార్యా, భర్తలబంధానికి అర్థం చెప్పిన బాలసత్యనారాయణ, మహాలక్ష్మిల జీవితాన్ని బంధువులు కొనియాడుతూ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు వారి మృతహాలను సందర్శించి, కు టుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మృతదేహంతో వస్తున్నభార్య కూడా మృతి హనుమంతునిపాడు: భర్త మృతదేహంతో వస్తూ వృద్ధురాలైన భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నందనవనంలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లింగయ్య (78) కుటుంబం కొన్నేళ్ల నుంచి విజయవాడలో ఉంటోంది. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలో లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. స్వగ్రామం నందనవనంలో అంత్యక్రియలు చేసేందుకు బయల్దేరారు. ఈ తరుణంలో మార్గంమధ్యలో మృతుడి భార్య లింగమ్మ ఉన్నట్టుండి çస్పృహ కోల్పోయింది. చిలకలూరిపేట వద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దంపతుల మృతదేహాలను స్వగ్రామం తీసుకొచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. జీవితాంతం కలిసి జీవించిన దంపతులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. -
విడ'తీయని'బంధం!
50 ఏళ్ల వైవాహిక జీవితంఒడిదొడుకుల ప్రయాణంచలించని మనోధైర్యంప్రేమానురాగాలు అనంతంఆగెను ఓ హృదయంవిలవిల్లాడెను మరో ప్రాణంఆ హృదయాన్నే అనుసరించిన వైనంఓడి గెలిచిన మూడుముళ్ల బంధం చెన్నై,టీ.నగర్: నిద్రలో భార్య ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురైన భర్త గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం విషాదాన్ని నింపింది. వివరాలు.. చెన్నై వాషర్మెన్పేట సంజీవిరాయన్కోవిల్ వీధికి చెందిన లోకనారాయణన్ (65) చెన్నై కార్పొరేషన్ రిప్పన్ బిల్డింగ్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇతని భార్య రాజేశ్వరి (60). వీరికి పెళ్లై దాదాపు 50 ఏళ్లు అవుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో విడిగా ఉంటోంది. గత 14వ తేదీన తీవ్రమైన గుండెనొప్పితో బాధపడిన రాజేశ్వరిని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్సలు ముగించుకుని ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం కాఫీ తయారుచేసేందుకు రాజేశ్వరిని లేపగా ఆమె నిద్రలోనే మృతిచెందినట్లు తెలిసింది. దిగ్భ్రాంతి చెందిన లోకనారాయణన్ స్ఫ్రహతప్పి పడిపోయాడు. కొంతసేపటికే భార్య మృతదేహం వద్దే కన్నుమూశాడు. ఆదివారం దంపతులు ఇంటి నుంచి వెలుపలికి రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇరువురూ మృతిచెంది ఉండడం చూసి నివ్వెరపోయారు. దీనిపై సమాచారం అందుకున్న వారి బంధువులు ఇంటికి చేరుకున్నారు. కుమారుడు జగదీశన్, కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తండయార్పేట పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. -
ప్రాణం మీదకు తెచ్చిన పాప్కార్న్..!
లండన్: బ్రిటన్కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ పంటిలో సెప్టెంబర్లో పాప్కార్న్ ఇరుక్కుంది. దీంతో దానిని బయటకి తీయడానికి పెన్, టూత్పిక్, వైరు ముక్క, నెయిల్ కట్టర్ ఇలా అనేక సామగ్రిని పాప్కార్న్పై ప్రయోగించాడు. దీంతో మార్టిన్ చిగుళ్లకి ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్ అనే గుండె వ్యాధికి దారి తీసింది. రాత్రిళ్లు నిద్రలో బాగా ఇబ్బందిగా ఉండటంతో వైద్యుడి వద్దకు వెళ్లగా గుండె దెబ్బతిందని చెప్పారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ను తొలగించారు. నరకానికి చాలా దగ్గరగా వెళ్లి అదృష్టం కొద్ది బయటపడ్డానని, ఇకపై పాప్కార్న్ జోలికి మాత్రం పోనని మార్టిన్ అంటున్నాడు -
హైటెక్ నగరి.. రోగాల దాడి!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ నగరం రోగాల మయంగా మారుతోంది. నగరంలో చక్కెర వ్యాధితో పాటు గుండె జబ్బులు, బీపీ సహా వివిధ రకాల కేన్సర్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నగరంలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలోఈ విషయం తెలిసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మూడోవంతు రోగులు హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం. పెరుగుతున్న భూ, జల, వాయు కాలుష్యం, మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల కేన్సర్లు ప్రబలుతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వైపు పాత నగరంలో టీబీ వ్యాధిగ్రస్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెలా ఆరు వందల నుంచి 700 వరకు టీబీ కేసులు నూతనంగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనంవెల్లడించింది. పాత నగరంలో జీవనశైలి జబ్బులు తో పాటు తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు 25 శాతంగా ఉన్నట్లు ఈ సంస్థ అధ్యయనం తెలిపింది. వీరిలో చాలామంది వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన జబ్బులు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నాయి. ఆయా వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చులు వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. కాగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్త కేన్సర్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లేమితో ముప్పు జీవనశైలి జబ్బులు, తీవ్రమైన రోగాలపై ప్రధానంగా నిరుపేదలు, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు అవగాహన లేకపోవడం, ఆయా వ్యాధులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులపై కనీసఅవగాహన లోపించడం శాపంగాపరిణమిస్తోంది. తరచూ వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు తీసుకునే విషయంలోనూ పలువురు వెనుకంజ వేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే ఉచిత వైద్య పరీక్షలునిర్వహించినప్పుడు ఆయా టెస్టులుచేసుకునేందుకు కొందరు ముందుకురావడం గుడ్డిలో మెల్ల. వయో గ్రూపులవారీగా రోగాల జాడ ఇలా.. ఈ అధ్యయనం ప్రకారం నగరంలో 30 ఏళ్లు ఆపై వయసున్న వారిలో 20 శాతం మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. 35 ఏళ్ల పైబడిన వారిలో 12 శాతం మందికి చక్కెర వ్యాధి ముప్పు పొంచి ఉంది. 25 నుంచి యాభయ్యేళ్ల లోపు వయసున్న వారిలో 11 శాతం మంది నోటి కేన్సర్తో బాధపడుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళల్లో 8 శాతం మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇక 40 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు, పురుషుల్లో ఐదు శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ల లోపు చిన్నారుల్లో ఐదు శాతం మందికి రక్త కేన్సర్ల ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన శైలి వ్యాధులు, తీవ్రమైన జబ్బులు రావడానికి గల కారణాలు, చికిత్స, నివారణ పద్ధతులపై ఇటు ప్రభుత్వం, అటు వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ అధ్యయనం స్పష్టం చేయడం విశేషం. -
గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి
అఫ్జల్గంజ్: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి చెందిన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్ డిపో1లో తాత్కాలిక డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్ఘాట్ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
శబ్ద కాలుష్యం వల్ల గుండెపోట్లు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : పచ్చని చెట్లుగల ప్రశాంత వాతావరణంలో జీవించే వారికన్నా ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రణగొణ ధ్వనుల మధ్య జీవించే వారికి రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువని బార్సిలోనాలోని ‘హాస్పిటల్ డెల్మార్ మెడికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన పరిశోధక బందం 2,761 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని దాదాపు 9 ఏళ్ల పాటు అధ్యయనం చేయడం ద్వారా తేల్చింది. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న వారికన్నా ఈ రణగొణ ధ్వనుల మధ్య జీవిస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని కనుగొన్నది. కేవలం శబ్ద కాలుష్యం వల్లనే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? సహజంగా పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి వాహనాల నుంచి వెలువడే కాలుష్య ప్రభావం తోడవడం వల్ల కూడా ప్రజలకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా ? అన్నది స్పష్టంగా ఈ అధ్యయనం తేల్చలేదు. పైగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వ్యాయామం అలవాటు కూడా తక్కువ, అందువల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. శబ్ద కాలుష్యం గురించి తప్పా మరో కాలుష్యం గురించి పేర్కొనక పోయినప్పటికీ ఈ అన్ని కాలుష్యాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్లో ఏడాదికి దాదాపు లక్ష మంది గుండెపోటులకు గురవుతున్నారని, వారిలో ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్లనే మరణిస్తున్నారని పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వచ్చి ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న వారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని, వారిలో కూడా ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్ల గుండెపోటుకు గురయిన వారేనని తెలిపారు. గుండెపోటులో రెండు రకాలు ఉంటాయని, గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డడం వల్ల 80 శాతం గుండెపోట్లు వస్తాయని, రక్త నాళాలు చిట్లడం ద్వారా కూడా గుండెపోట్లు వస్తాయని, అలాంటి గుండెపోట్లు మొత్తంలో 20 శాతం ఉంటాయని పరిశోధకులు తెలిపారు. -
మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్’లు తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర) -
కార్డియోమయోపతి అంటే ఏమిటి...?
నా వయసు 42 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మాకు తెలిసిన డాక్టర్కు చూపించుకుంటే ఆయన కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. నా కండిషన్ ‘కార్డియోమయోపతి’ కావచ్చని కార్డియాలజిస్ట్ అంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? దీనికి చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరించండి. – ఎమ్. శ్రీకాంత్రావు,కరీంనగర్ కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీరు వివరిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వైరస్లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే తొలి లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్మేకర్ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు.డాక్టర్ పంకజ్ జరీవాలా,సీనియర్ ఇంటర్వెన్షనల్కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడహైదరాబాద్ -
పాల ఉత్పత్తులతో సమస్య లేదు!
పాలు ఆరోగ్యానికి మంచిది కావని మీకు ఇటీవలి కాలంలో ఎవరైనా చెప్పారా? వాళ్ల మాటల్లో నిజం లేదని అంటున్నారు హార్వర్డ్, టఫ్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెజబ్బులతోపాటు, మధుమేహానికి, పాలకు సంబంధం లేదని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వీరు చెబుతున్నారు. ఆహారంలో పాల ఉత్పత్తులను భాగంగా చేసుకున్న దాదాపు మూడు వేల మందిపై తాము అధ్యయనం చేశామని.. వీరికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. అలాగే సుమారు రెండు లక్షల మందిని దశాబ్దాల పాటు పరిశీలించిన తరువాత తాము పాలతో గుండెజబ్బుల సమస్య ఎక్కువ కాదన్న అంచనాకు వచ్చామని వివరించారు. పాల ఉత్పత్తులతో అందే కొవ్వులకు బదులు మొక్కలతో లభించే కొవ్వులు, గింజలను వాడినప్పుడు గుండెజబ్బుల ప్రమాదం ఇంకో 24 శాతం తగ్గిందని వీరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాంస ఉత్పత్తులతో సమస్య ఆరు శాతం వరకూ ఎక్కువ కావడం. మొక్కల ద్వారా లభించే కొవ్వులు, పాలతో వచ్చే వెన్నలోని కొవ్వులను పోల్చి చూసినప్పుడు మొదటి రకం కొవ్వులు ఆరోగ్యకరంగా ఉంటే.. రెండో రకం కొవ్వులను మితంగా వాడితే పెద్ద ప్రమాదమేమీ లేదని ఇంకో అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తమ్మీద చూస్తే ఏ రకమైన కొవ్వులనైనా మితంగా వాడటం మేలని అర్థమవుతుంది. -
గుండెకు ఆపరేషన్..మెదడువాపుతో చనిపోయాడన్నారు
రాంగోపాల్పేట్: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పిస్తే శస్త్ర చికిత్స చేసి మెదడు వాపుతో చనిపోయాడని చెప్పారు. శస్త్ర చికిత్స బాగానే జరిగిందని చెప్పిన వైద్యులు తెల్ల వారే సరికి అతను మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టడమేగాక రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, జలాల్పూర్కు చెందిన అయ్యలమ్ కుమారుడు రవి (13) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో అతను అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ నెల 5న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టుర్లు బాలుడి గుండెలో రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అతడికి చికిత్స అందించేందుకుగాను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఈ నెల 10న బాలుడికి ఆపరేషన్ చేసిన వైద్యులు శస్త్ర చికిత్స విజయవంతం అయిందని తెలిపారు. 11న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి రవి మెదడు వాపు వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యసేవల్లో లోపం లేదు:ఎండీ భాస్కర్రావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవికి శస్త్ర చికిత్సకు ముందు, అనంతరం వైద్యులు పూర్తి స్థాయి వైద్యసేవలు అందించారు. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. శస్త్ర చికిత్స తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయగా మెదడు పనితీరు సక్రమంగా లేదని గుర్తించి, అదే రోజు కుటుంబ సభ్యులకు చెప్పాం. గుండె ఆగిపోవడంతో రోగి మృతి చెందాడు. -
గుండె మరమ్మతులకు కొత్త పద్ధతి...
గుండెపోటు కారణంగా నష్టపోయిన కండరాలకు చికిత్స కల్పించేందుకు మూలకణాల ద్వారా అభివృద్ధి చేసిన గుండె కండరకణాలు ఉపయోగపడతాయని గుర్తించారు అలబామా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెపోటు వల్ల కండరంలోని కొంతభాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. తగిన చికిత్స లేని పక్షంలో ఈ కండర భాగం కారణంగా గుండె మొత్తం ఉబ్బిపోయి సమస్య జటిలం కావచ్చు. ఈ నేపథ్యంలో అలబామా యూనివర్శిటీకి చెందిన బయో మెడికల్ ఇంజినీర్లు కొన్ని ప్రయోగాలు చేశారు. కార్డియో మయోసైట్స్ నుంచి సేకరించిన మూలకణాలను గుండె గాయం వద్ద ఇంజెక్ట్ చేసినప్పుడు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం కొంచెం పెరిగినట్లు తెలిసింది. అయితే కార్డియో మయోసైట్స్లో తాము అత్యంత చురుకైన, పూర్తి డీఎన్ఏ ఉన్న కణాలను సేకరించి వాటిద్వారా మూలకణాలను సిద్ధం చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రామస్వామి కన్నప్పన్ తెలిపారు. కణాలను వేగంగా పెంచే క్రమంలో డీఎన్ఏ దెబ్బతింటుందని, వీటిని గుండెపై వాడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని వివరించారు. ఇలాంటి కణాలను వదిలేసేందుకు తాము ఒక పద్ధతిని ఆవిష్కరించామని చెప్పారు. గుండెపోటుకు గురైన ఎలుకలకు సుమారు తొమ్మిది లక్షల మూలకణాలను అందించినప్పుడు నాలుగు వారాల తరువాత గుండె సామర్థ్యం పెరిగిందని తెలిపారు. -
గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!
అధిక రక్తపోటు గుండెజబ్బులకు దారితీస్తుందని మనం చాలాకాలంగా వింటూనే ఉన్నాం. రక్తపోటును కొలిచేందుకు ఉపయోగించే రెండు అంకెలు (డయాస్టోలిక్, సిస్టోలిక్ ) ద్వారా కూడా గుండెపోటు, జబ్బులను ముందుగానే గుర్తించవచ్చునని కైసర్ పర్మనెంటే అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. గుండె ఎంత శక్తితో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతుందో తెలిపేది సిస్టోలిక్ రీడింగ్ కాగా... లబ్ డబ్ల మధ్య గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు ధమనులపై ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్ రీడింగ్ సూచిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు వైద్యులు దశాబ్దాలుగా సిస్టోలిక్ అంకెపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని.. డయాస్టోలిక్ అంకెను పరిగణించాల్సిన అవసరం లేదని కూడా చెబుతారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ సి ఫ్లింట్ తెలిపారు. తాజా అధ్యయనం మాత్రం రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోందని చెప్పారు. తాము దాదాపు మూడు కోట్ల అరవై లక్షల మంది తాలూకూ రక్తపోటు వివరాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని.. 20007 –16 మధ్యకాలంలో ఈ వివరాలను తీసుకోగా డయాస్టోలిక్ అంకెకూ గుండెపోటు, జబ్బులను అంచనా వేయడంలో తగిన ప్రాధాన్యమున్నట్లు తెలిసిందని చెప్పారు. -
గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!
గుండెపోటు కారణంగా దెబ్బతిన్న గుండె కణజాలానికి వేగంగా స్వస్తత చేకూర్చేందుకు బెర్లిన్ హీల్స్ అనే జర్మనీ సంస్థ ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. శరీర గాయాలు తొందరగా మానేందుకు చిన్న స్థాయి విద్యుత్తు షాక్లు ఉపయోగపడతాయన్న అంశం ఆధారంగా తాము ఈ పరికరాన్ని అభివృద్ధి చేశామని వియన్నా మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు డయలేటివ్ కార్డియోమయపతి అనే ఆరోగ్య సమస్య కారణంగా గుండె కణజాలం క్రమేపీ బలహీనపడుతూంటుందని... చివరిదశలో సక్రమంగా సంకోచ వ్యాకోచాలూ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని డొమినిక్ వీడెమాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మందులు ఇవ్వడం లేదంటే పేస్మేకర్ వంటివి అమర్చడం మాత్రమే ప్రస్తుతం ఈ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలు. చాలా సందర్భాల్లో గుండెమార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డియాక్ మైక్రోకరెంట్ పేరుతో తాము ఉత్పత్తి చేసిన పరికరం ఎంతో ఉపయోగపడుతుందని డొమినిక్ వీడెమాన్ తెలిపారు. రెండు చిన్న గాట్లు పెట్టడం ద్వారా ఈ పరికరాన్ని గుండెపైన అమర్చవచ్చునని సూక్ష్మస్థాయి విద్యుత్తు షాక్లు ఇచ్చినప్పుడు కణజాలం చైతన్యవంతమై సమస్య రాకుండా ఉంటుందని వివరించారు. -
ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి..
చింతల్: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి గుండెపోటుతో మృతి చెందడంతో కుత్బుల్లాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ గుబురుగుట్టకు చెందిన మహ్మద్ జహంగీర్ కుమారుడు మహమ్మద్ అమీర్(27) నాలుగున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే పార్ట్టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు. దీంతో గుబురుగుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా అమీర్ తల్లి ఏడాది క్రితమే మరణించినా స్వదేశానికి తిరిగి రాలేదని ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్లు విజయ్శేఖర్గౌడ్, రావుల శేషగిరిలు ఆదివారం అమీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాయలు చేశామని, ఎంబసీ అధికారులతో కేటీఆర్ మాట్లాడినట్లు తెలిపారు. -
21 మంది విద్యార్థులను రక్షించి డ్రైవర్మృతి
అన్నానగర్: విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా గుండెపోటుకు గురై వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. ఆరుముగనేరిలో బుధవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా వ్యాన్ డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు ఏర్పడింది.అతడు వ్యాన్ వేగాన్ని తగ్గించడంతో అక్కడున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని వ్యాన్ ఆగింది. వ్యాన్లో ఉన్న 21 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. తూత్తుక్కుడి జిల్లా ఆత్తూర్–పున్నక్కాయల్ రోడ్డు ప్రాంతానికి చెందిన మోహన్రాజ్ (45). ఇతను ఆరుముగనేరిలో ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం పాఠశాల వ్యాన్లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతున్నాడు. వ్యాన్లో 21 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరుముగనేరి బజార్ దాటి రామరాజపురం ప్రాంతంలో వెళుతుండగా హఠాత్తుగా మోహన్రాజ్కి గుండెపోటు ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన మోహన్రాజ్ వ్యాన్ పేగాన్ని తగ్గించి, ఎడమ వైపుగా వ్యాన్ని తిప్పిన స్థితిలో స్టేరింగ్పై కుప్పకూలిపోయాడు. వ్యాన్ నేరుగా రోడ్డు పక్కనున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని ఆగింది. వ్యాన్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. స్పృహతప్పిన మోహన్రాజ్ను స్థానికులు తిరుచెందూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మోహన్రాజ్ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
కంటి దీపం ఆరిపోయింది..
దారి చూపిన దేవత వెళ్లిపోయింది.. కంటి వెలుగై ఇంటి దీపమై కాంతులీనిన సహచరి హఠాత్తుగా కనుమరుగైపోయింది. ఇక నా బతుకంతా కటిక చీకటేనంటూ హృదయవిదారకంగా సాగిన అతని రోదన చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది. ఓ అంధ ఉపాధ్యాయుడితో విధి ఆడిన విషాద నాటకమిది. అన్నీ తానై నిలిచి పెద్ద దిక్కుగా ఉన్న సతీమణి గుండెపోటుతో క్షణాల్లోనే కన్నుమూయడం ఆ అభాగ్యుడి గుండెల్లో గునపాలు దింపింది. శ్రీకాకుళం, ఆమదాలవలస: కనుచూపు దూరం చేసి భగవంతుడు ఓసారి అన్యాయం చేశాడు.. దీపంలాంటి భార్యనిచ్చి ఆ లోటును భర్తీ చేశాడు.. వారికి రత్నాల్లాంటి ఇద్దరు కుమార్తెలు.. సజావుగా సాగుతున్న వారి జీవితంలో ఎందుకో హఠాత్తుగా విషాదం నింపాడు. భర్తను బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకువెళుతుండగా.. హృద్రోగానికి గురై అంధ ఉపాధ్యాయుడి భార్య క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంకయ్యపేట గ్రామంలో విషాదం నింపింది. ఈ మండలంలోని చిన్న జొన్నవలస గ్రామంలోని ఎంపీఈపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బగాన వెంకటరమణమూర్తి.. పదో తరగతి చదువుతున్న సమయంలోనే చూపునుకోల్పోయారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ (హిస్టరీ) చదివి, అనంతరం మచిలీ పట్నంలోగల బీఈడీ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ ట్రైయినింగ్ తీసుకొని బీఈడీ పూర్తి చేశారు. డీఎస్సీలో ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పద్మావతి తనను ఆదర్శ వివాహం చేసుకోవడంతో ఆయన జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. ఉదయం లేచిన వెంటనే బ్రష్ అందించడం దగ్గర నుంచీ ద్విచక్ర వాహనంపై స్కూలుకు తీసుకువెళ్లి ఇంటికి తెచ్చే వరకు అన్నీ తానే అయి ఆమె కంటికి రెప్పలా చూసుకునేవారు. వీరికి డిల్లేశ్వరి, లావణ్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మృత్యువు కమ్ముకొచ్చిందిలా... రోజూలాగే పద్మావతి (40) బుధవారం ఉదయం భర్తను పాఠశాలకు విధులకు తీసుకు వెళ్లి అక్కడే ఉండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం నవనంబాబు, పొన్నాం గ్రామాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు గ్రామదేవత పండగకు పిలవడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై తన భర్తను తీసుకొని బయల్దేరారు. మార్గమధ్యంలో గేదెలవానిపేట కాలనీ వద్ద ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. తనకు బాగులేదని చెబుతూ ద్విచక్రవాహనం నడపలేక పక్కనే ఉన్న పొలాల్లో బండి ఆపారు. స్థానికులు గమనించి ఆమెను రోడ్డు పైకి తీసుకువచ్చి 108కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన 108 వాహనం సిబ్బంది అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. దీంతో ఆ అంధ ఉపాధ్యాయుడి రోదన అక్కడి వారిని కలచివేసింది. ఇక తనకు దిక్కెవరంటూ ఆయన గొంతులోంచి తన్నుకొస్తున్న విషాదం చూసి కంట తడి పెట్టని వారు లేరు. పద్మావతి భౌతిక కాయానికి వెంకయ్యపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో బావ మృతి.. ఆగిన మరదలు గుండె
బావ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ఓ మరదలు గుండె పగిలింది. గుండెపోటుకు గురైన బావ ఆస్పత్రి నుంచి విగత జీవిగా రావడం చూసి గుండెలవిసేలా ఏడ్చిన ఆమె అలాగే కుప్పకూలింది. అంతే! ఆమె గుండెచప్పుడూ ఆగిపోయింది. గంట వ్యవధిలో ఒకే ఇంట ఇద్దరి హఠాన్మరణాలు ఆ గ్రామాన్ని విషాదసంద్రంలో ముంచింది. చిత్తూరు, సత్యవేడు : మండలంలోని బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆశీర్వాదం(38), అతని తమ్ముడు కార్తీక్ వ్యవసాయ కూలీలు. ఆశీర్వాదానికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కార్తీక్కు భార్య రేఖ (24), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకే ఇంట ఉమ్మడి కుటుంబంగా ఉన్న వీరంతా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎవరి ఏ కష్టమొచ్చినా పంచుకునేవారు. ఏడాది క్రితం ఆస్తిపంపకాలతో కుటుంబాలు వేరయ్యాయి. ఒకే ఇంట మధ్యలో గోడ వెలిసింది. అయినా వారి అనుబంధాలు చెరగిపోలేదు. ఎప్పటిలాగే రెండు కుటుంబాలు కష్టసుఖాలు పంచుకునేవి. ఈ నేపథ్యంలో, గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆశీర్వాదం గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆటోలో తమ్ముడు కార్తీక్ తన వదిన, మరికొందరితో కలిసి సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని నిమిషాలకే ఆశీర్వదం మరణించారు. దీంతో అక్కడి నుంచే కార్తీక్ తన భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. బావ హఠాన్మరణం చెందడంతో రేఖ దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరై విలపించింది. ఇంతలో ఆశీర్వాదం మృతదేహం ఇంటికి చేరుకుంది. విగతజీవిగా ఉన్న బావను చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఉన్నపళాన అలాగే కుప్పకూలింది. సొమ్మసిల్లి పడిపోయిందేమోనని భావించిన కుటుంబ సభ్యులు నీటిని ఆమె ముఖంపై చిలకరించారు. నిమిషాలు గడుస్తున్నా ఆమె ఉలుకూ పలుకూ లేకుండా అచేతనంగా ఉండిపోయింది.కార్తీక్ ఆమెను తట్టి..తట్టి లేపేందుకు యత్నించాడు. శరీరం చల్లబడుతూ ఉండటం, ముక్కు వద్ద చేయి పెట్టినా శ్వాస తీసుకుంటున్న ఆనవాళ్లు లేకపోవడం అనుమానించాడు. తన భార్య కూడా హఠాన్మరణం చెందిందని గ్రహించేందుకు అట్టే సమయం పట్టలేదు. అటు సోదరుడు, ఇటు భార్య మృతదేహాల నడుమ అతని కళ్లు కట్టలు తెగిన చెరువే అయ్యింది. ఒకే ఇంట గంట వ్యవధిలో ఇద్దరి మృతి గ్రామాన్ని విషాదంలో ముంచింది. రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
జ్యోతి కుటుంబంలో మరో విషాదం
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తన కుమార్తెను దారుణంగా హత్యచేశారన్న బాధను జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన తండ్రి గోవిందయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఫిబ్రవరి 15 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బిడ్డ హత్యను తట్టుకోలేకే తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా హత్యకేసులో నిందితుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాడేపల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అంగడి జ్యోతి తండ్రి జ్యోతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గోవిందయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 15న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. (పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు) శ్రీను బంధువులపై దాడి బుధవారం సీతానగరంలోని జ్యోతి ఇంటి నుంచి గోవిందయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గోవిందయ్య, జ్యోతి మధ్య అనుబంధాన్ని బంధువులు చర్చించుకున్నారు. అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న చుంచు శ్రీను ఇంటిని చూసిన బంధువులు జ్యోతి, గోవిందయ్యల మృతికి కారణమైన వాడి ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపులు విరగ్గొట్టి దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న చుంచు శ్రీను బాబాయి లక్ష్మీనారాయణ, పిన్ని, నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని స్థానికులు చూసి 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జ్యోతి బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చుంచు శ్రీను బంధువులు సైతం పోలీసులకు 100 ద్వారా ఫిర్యాదు చేశారు కానీ, పోలీస్స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. (కేసు ముగించే కుట్ర ) -
‘పోటె’త్తిస్తున్న పని ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఆర్టీసీ డ్రైవర్లపై జీవన శైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర ఒత్తిళ్ల నడుమ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత, డబుల్ డ్యూటీలు, సకాలంలో సెలవులు లభించకపోవడం, నగరంలోని ట్రాఫిక్ రద్దీలో గంటల తరబడి బస్సులు నడపడం తదితర కారణాలతో డ్రైవర్లు చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. రాణిగంజ్ డిపోకు చెందిన మల్లారెడ్డి 42 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైన గుండెపోటు కారణంగా మంగళవారం చందానగర్లో మృతి చెందిన ఉదంతం ఆర్టీసీ కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. కేవలం పని ఒత్తిడి వల్లనే డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, అధిక రక్తపోటు, షుగర్, పైల్స్ వంటి జీవన శైలి వ్యాధులతో పాటు గుండె జబ్బులు కూడా కబలిస్తున్నాయని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒక చోట డ్రైవర్లు గుండెపోటుతో మృతి చెందుతున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు సకాలంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్సలను అందజేసే సదుపాయం ఆర్టీసీ ఆసుపత్రిలో లేకపోవడంతో పాటు డిపోల్లో సిబ్బంది కొరత, విధుల్లో ఉన్న వారే అదనపు పని గంటలు పని చేయాల్సి రావడం వంటి అంశాల కారణంగా చిన్నవయస్సులోనే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ‘గతంలో 50 ఏళ్లు దాటిన డ్రైవర్లు మాత్రమే గుం డెపోటు వంటి సమస్యలను ఎదుర్కొనేవారని, ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా 40 ఏళ్లకే వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఆరోగ్యం బారిన పడుతున్నారు’ అని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్య నిపుణులు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఏటా పెరుగుతున్న డ్రైవర్ల కొరత... గ్రేటర్లో మొత్తం 29 డిపోల నుంచి 3850 బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, శ్రామిక్లు, తదితర సిబ్బంది అంతా కలిసి సుమారు 18000 మందికి పైగా ఉన్నారు. వీరిలో 8000 మందికి పైగా డ్రైవర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఏటా వందలాది మంది పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకుండా డిపోల్లో ఉన్న డ్రైవర్లకే అదనపు విధులను అప్పగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం 1000 మంది డ్రైవర్లను భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా ఏడున్నర గంటలు పని చేసే కార్మికుడు డబుల్ డ్యూటీ పేరిట 15 గంటల నుంచి 16 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. సాయంత్రం విధుల్లో చేరిన వారు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.‘‘ సిటీలో ఏడున్నర గంటల డ్యూటీ మాత్రమే అంటారు. కానీ ఏ డ్రైవర్ కూడా ఏ ఒక్క రోజు ఏడున్నర గంటల్లో డ్యూటీ ముగించుకొని డిపోకు చేరుకోవడం సాధ్యం కాదు. డబుల్ డ్యూటీ చేసినప్పుడు కచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు, లేదా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బస్సు నడపాల్సిందే..’’ అని ఉప్పల్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. డబుల్ డ్యూటీకి అంగీకరించకపోయినా, సెలవులు తీసుకొన్నా అధికారులు చార్జీషీట్లతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అరకొర వైద్య సదుపాయాలు... ⇔ గుండెపోటు ముప్పును గుర్తించడంలో ట్రెడ్మిల్ టెస్ట్ (టీఎంటీ) ఎంతో ముఖ్యమైంది. అప్పటి వరకు ఉన్న బలహీనతను గుర్తించడంతో పాటు రాబోయే ముప్పును కూడా ఈ పరీక్ష ద్వారా వైద్యులు గుర్తిస్తారు. ⇔ 50 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయాలను అందజేసే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఈ సదుపాయం లేదు. ఇదొక్కటే కాదు. చాలా పరీక్షల కొరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ⇔ డ్రైవర్లకు ప్రతి మూడేళ్లకు ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 45 ఏళ్లు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కొంతకాలంగా పెరిగిన గుండె జబ్బుల ముప్పు ను పరిగణనలోకి తీసుకొని 40 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికీ ఏటా అన్ని రకాల వైద్య పరీక్షలు (టీఎంటీతో సహా) చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాది దాటినా ఇది అమలుకు నోచుకోలేదు. ⇔ టీఎంటీ సదుపాయం లేకపోవడంతో ప్రసు ్తతం ఈసీజీ వంటి సాధారణ పరీక్షలకే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాధుల ముప్పును సకాలంలో పసిగట్టలేకపోతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇔ తార్నాక ఆసుపత్రిలో 40 మంది పారామెడికల్ సిబ్బందికి గాను కేవలం 20 మందే ఉన్నారు. 45 మంది వార్డుబాయ్లు పనిచేయాల్సి ఉండగా 18 మంది మాత్రమే ఉన్నారు. 45 మంది వైద్య నిపుణులకు గాను ప్రస్తుతం 28 మంది మాత్రమే పని చేస్తున్నారు. ⇔ వైద్యులు, సిబ్బంది కొరత, సరైన లాబొరేటరీ సదుపాయాలు లేకపోవడం వేలాది మంది కార్మికుల పాలిట శాపంగా మారాయి. -
భర్తే లోకమని..
‘మూడుముళ్లు’ ఏకం చేశాయి..‘అగ్నిసాక్షి’గా ఏడడుగులు నడిచారు.. ఎన్నికష్టాలొచ్చినా ఒకరికొకరం తోడూనీడగా ఉందామనుకున్నారు. దర్జాగా బతకలేకున్నా ఉన్నంతలో ఆదర్శంగా బతుకుతున్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతి‘రూపాలు’ను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు.. ఆ దాంపత్యాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. అంతలోనే అనారోగ్యమనే మిత్తి.. గుండెను నులిమింది. భార్య నుంచి భర్తను వేరు చేసింది. భర్తలేని లోకం శూన్యమని ఆమె భావించింది.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషాద ఘటనతో అభంశుభం తెలియని చిన్నారులు దిక్కులేని వారయ్యారని అందరి కళ్లు చెమర్చగా.. గార్లదిన్నె శోకసంద్రమైంది. అనంతపురం , గార్లదిన్నె: జ్వరంతో బాధపడుతున్న భర్త గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. భర్త లేని జీవితం శూన్యమని భార్య ఆత్మహత్య చేసింది. వివరాల్లోకెళ్తే.. మండల కేంద్రం గార్లదిన్నెలో కిరాణా అంగడి నిర్వహిస్తున్న నాగరాజు (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉన్నపళంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే భర్త లేని ఈ లోకంలో తాను జీవించలేనని భార్య పద్మావతి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు 108లో ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికే ఆమె కూడా మృతి చెందింది. ఇదిలా ఉండగా నాగరాజు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. అయోమయంలో పిల్లలు.. నాగరాజు, పద్మావతి దంపతులకు ఆరో తరగతి చదువుతున్న గౌతమ్, తొమ్మిదో తరగతి చదువుతున్న చైతన్య కుమారులు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. -
మంటగలిసిన మానవత్వం
తమిళనాడు, వేలూరు: కాట్పాడి సమీపంలో బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుకు గురై వృద్ధురాలు మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని బస్స్టాప్లో వదిలివెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారుకు చెందిన భూషణం (60). ఈమె బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం రైలు ద్వారా కాట్పాడికి తిరిగి వచ్చారు. కాట్పాడి రైల్వేస్టేషన్లో దిగిన ఆమె వేలూరు కొత్త బస్టాండ్కు వెళ్లేందుకు బస్సులో ప్రయాణం చేశారు. కాట్పాడి చిత్తూరు బస్టాండ్ వద్ద వస్తున్న సమయంలో బస్సులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీన్ని గమనించిన బస్సు కండెక్టర్ వెంటనే ఆమెను కిందకు దింపారు. బస్సు నుంచి కింద దిగిన భూషణం కొద్ది క్షణాల్లోనే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బస్స్టాప్లోనే వదిలిపెట్టి బస్సు బయలుదేరి వెళ్లింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి బ్యాగులో తనిఖీ చేయగా ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ తెలుసుకొని వారికి సమాచారం అందించారు. అనంతరం కుటుంబసభ్యులు అక్కడికి రావడంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. గుండెపోటుకు గురైన వృద్ధురాలిని కిందకు దింపి వెళ్లిపోయిన బస్సు కండక్టర్, డ్రైవర్ ఎవరు, ఏ బస్సు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వృద్ధురాలికి గుండెపోటు వచ్చిన వెంటనే అంబులెన్స్ను రప్పించి ఆస్పత్రిలో చేర్పించాల్సిన బస్సు డ్రైవర్, కండెక్టర్లు బస్స్టాప్లో వదిలి పెట్టి వెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. -
అమ్మా...గుండెనొప్పి...!
మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫలితంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అప్రమత్తమయ్యేలోపే చాలా వరకు ప్రాణాలు పోతున్నాయి. విజయనగరం ఫోర్ట్: గతంలో 50, 60 ఏళ్లు దాటిని వారు గుండె నొప్పి బారిన పడేవారు. ఇప్పుడు 40 ఏళ్లు, 50 ఏళ్లులోపు వారు కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. గతంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు ఫాస్ట్ఫుడ్స్, జంక్ ఫుడ్స్కు అలవాటు పడ్డారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు బారిన పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 10 శాతం మంది వరకు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా చేసే లిపిడ్ ప్రోఫైల్ పరీక్షల్లో 35 శాతం మందికి ట్రైగిజరైడ్స్ ఎక్కువుగా ఉన్నాయని, ఇవి గుండెకు అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరే గాక వంశపారంపర్యం, జన్యు లోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండె జబ్బులతో జన్మించే పిల్లలు ఇటీవల ఎక్కువ అయ్యారు. గుండె చేతి పట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకి ఇటీవల కాలంలో 40 ఏళ్లు లోపు వారే అధికంగా వస్తున్నారు. జిల్లాలో నెలకు పది వేల మంది వరకు ఈసీజీలు, వెయ్యి మందికి పైగా 2డీ ఎకో పరీక్షలు, 100 మంది వరకు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. గుండె నొప్పి లక్షణాలు... గుండె పోటు లక్షణాలు వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి విపరీతంగా కలిగి మెలి పెట్టినట్టు ఉంటుంది. ఈ సమయంలో విపరీతమైన చెమట పడుతుంది. వాంతి వచ్చే భావన ఉంటుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లు, చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండె పోటు సూచనగా భావించాలి. చాతిలో నొప్పి వచ్చి అది ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా విపరీతంగా చెమటలు పడుతూ ఇబ్బంది పడుతున్నా గుండె పోటుగా అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా అనుమానంతో వైద్యులను సంప్రదించడం మంచిది. విపరీతంగా అలసిపోవడం ఒళ్లంతా నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు తరుచు కనిపిస్తున్నా వాటిని అశ్రద్ధ చేయకూడదు. గుండెను ఇలా కాపాడుకుందాం... పిల్లలకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్కు దూరంగా ఉంచాలి. పాఠశాలల్లో తప్పనిసరిగా యోగాను ప్రవేశ పెట్టి అమలు చేయాలి. ప్రతీ ఒక్కరికి వ్యాయామంపై అవగాహన పెంచాలి. చికెన్ లెగ్స్, అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. పాఠశాలలు, కళాశాలలు వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేయకూడదు. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలి. మనసు ప్రశాంతంగా ఉంచేందుకు ప్రకృతితో మమేకం కావాలి. తగినంత నిద్రపోవాలి. ఇది గుండెకు అదనపు శక్తినిస్తుంది. లిఫ్టులో వెళ్లే కంటే మెట్లు ఎక్కడం మంచిది. రక్తం చిక్కబడితే ప్రమాదం.. ఇటీవల కాలంలో గుండె పోటు కేసుల్లో ఎక్కువుగా 40 ఏళ్లు లోపు వారు 15 శాతం మంది వరకు ఉంటున్నారు. ధూమపానం, కోకైన్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం లేక పోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో యువకుల్లో గుండె పోటు వస్తుంది. రక్తం చిక్కగా ఉండడం వల్ల సడన్గా గుండె పోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ ప్రకాష్ చంద్ రాణా,కార్డియాలజిస్టు -
అందని పరిహారం..ఆగిన రైతు గుండె!
ప్రభుత్వం తీరుతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తిత్లీ తుపాను నష్టపరిహారం అందక రైతు గుండె బద్దలైంది. మందస మండలం అంబుగాం పంచాయతీ లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33) వివిధ పంటలను సాగు చేస్తుండేవాడు. తిత్లీ తుపానుతో పది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే రూపాయి కూడా పరిహారం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం గుండె పోటుతో చనిపోయాడు. కుమార్తె పుట్టిన రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మందస: తిత్లీ తుపాను సమయంలో అనర్హులకు లక్షలాది రూపాయలను చెల్లించిన ప్రభుత్వం నిజంగా నష్టపోయిన వారిని మాత్రం విస్మరించింది. దీంతో అలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. మందస మండలంలోని భేతాళపురంలో ఇప్పటికే ఒకరు చనిపోగా.. గురువారం ఓ రైతు గుండె ఆగిపోవడం చర్చనీయాంశవైంది. గత ఏడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో సంభవించిన తిత్లీ తుపానుతో లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33)కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల్లో కొబ్బరి, మరో మూడు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు, వరి పంట పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. సుమారు 10 ఎకరాల పంట నష్టం జరగడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 5 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం మంజూరైనట్టు ఆన్లైన్లో చూపెడుతోంది. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు మొత్తం రూ.3.87 లక్షలు మంజూరైనట్టు అధికారులు అతనికి తెలియజేశారు. అయితే ఆ డబ్బులు కూడా రైతు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. గ్రామానికి చెందిన చాలామందికి పరిహారం డబ్బులు వచ్చినప్పటికీ తమకు ఎందుకు రాలేదోనని భార్య గీతాంజలి వద్ద శ్రీనివాసరావు రోజూ బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు సీతయ్య, ఇళ్లమ్మలకు శ్రీనివాసరావు ఒక్కగానొక్క కుమారుడు కాగా, వారసత్వంగా వచ్చిన తోట ఫలసాయంతో కుటుంబాన్నిపోషిస్తున్నాడు. కొంతమంది వ్యాపారుల వద్ద కూడా శ్రీనివాసరావు కొంతమొత్తాన్ని అప్పుగా తెచ్చాడు. అయితే ఇటీవల వీరి నుంచి డబ్బులను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడం, తిత్లీ తుపాను పరిహారం రూపాయి కూడా రాకపోవడంతో మనోవేనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం గుండె ఆగి శ్రీనివాసరావు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమార్తె లాస్య (8), కుమారుడు లోహిత్ (6) ఉన్నారు. కుమార్తె పుట్టిన రోజునే తండ్రికన్నుమూత! కుమార్తె లాస్య 8వ పుట్టినరోజు గురువారమే. ఇదే రోజున తండ్రి మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. భార్య గీతాంజలిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సీదిరి పరామర్శ గుండెపోటుతో చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించి ఓదార్చారు. మృతదేహంపై పూలదండను ఉంచినివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, పార్టీ నాయకులు బదకల జానకిరావు, మద్దిల బాలకృష్ణలు కూడా ఉన్నారు. యాదవకుల సంక్షేమ సంఘం సంతాపం పంట నష్టపరిహారం అందక మరణించిన శ్రీనివాసరావు కుటుంబాన్ని యాదవ కుల సంక్షేమ సంఘం నాయకులు రాపాక చిన్నారావు, మామిడి మాధవరావులు పరామర్శించి తీవ్ర సంతాపం తెలియజేశారు. తిత్లీ తుపాను ప్రభావం ఉద్దానంపై ఎలా ఉంటుందో ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు వివరించామని, అయినా వారిలో స్పందనలేదన్నారు. బాధితులకు నష్టపరిహారం అందకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
విధి వింత క్రీడ
ఇచ్ఛాపురం రూరల్: మామయ్య మృతి చెందాడన్న వార్తను విన్న కోడలు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి శోకాన్ని మిగిల్చిన సంఘటన మండలంలో ధర్మపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గత 15 రోజులుగా చలిగాలు తీవ్రంగా వీస్తుండటంతో గ్రామంలోని పిట్ట ఆదయ్య(75) చలికి తట్టుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. విషయాన్ని పక్కవీధిలో ఉన్న చిన్న కుమారుడు పిట్ట వెంకటేష్కు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణ వార్తను విన్న వెంకటేష్ భార్య పిట్ట మహాలక్ష్మీ(44) అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హూటాహుటీన స్థానిక ఆర్ఎంపీ వైద్యునికి చూపించగా గుండెపోటుతో మరణించినట్టు ధృవీకరించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మామయ్య మృతిని తట్టుకోలేక మహాలక్ష్మి గుండెపోటుతో మరణించిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి పెద్ద కుమారుడుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
పెళ్లయిన మరునాడే మృత్యు ఒడిలోకి..!
చిత్తూరు ,మదనపల్లె సిటీ : పెళ్లి బాజాభజంత్రీల మోత ఆగిందో లేదో.. ఆ ఇంట చావుడప్పు ఆరంభమైంది. పెళ్లియిన మరునాడే గుండెపోటు రూపంలో మృత్యువు కొత్త పెళ్లికొడుకును తన ఒడిలోకి చేర్చుకుని పెళ్లివారింట విషాదం నింపింది. వివరాలిలా.. మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ వీధికి చెందిన మగ్బూల్ కుమారుడు మోహీన్బాషా (28) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి మదనపల్లెకే చెందిన ఓ యువతితో ఆదివారం రాత్రి వివాహం జరిగింది. రాత్రి 12 గంటల వరకు అందరూ బంధువులతో కలసి సంతోషంగా గడిపారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మోహీన్బాషాకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అతనిని మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మోహీన్బాషా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లికొడుకు మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, నవవధువును ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. -
కూతురు లేదని ఆగిన తండ్రి గుండె
చిన్నతనంలో కూతుర్ని గుండెలపై పెట్టుకుని మమకారంగా పెంచుకున్నాడు. కన్న బిడ్డ కేర్మని ఏడిస్తే తాను కన్నీళ్లు కార్చాడు. అల్లుడు కూడా తన ఊరే కావడంతో బిడ్డ కళ్లెదుటే ఉంటుందని మురిసిపోయాడు. తాను మెట్టినింటికి వెళ్లాక కూడా నాన్న కాస్త నలతగా ఉన్నాడని తెలిస్తే చాలు ఆ కూతురి కాలూచేయి ఆడేవి కాదు. ఆయన గొంతులో ప్రేమామృతం పోసే దాకా నిలిచేవి కాదు. ఇలా అల్లుకున్న తండ్రీకూతుళ్ల ప్రేమానురాగాలపై విధి విషం చిమ్మింది. రోడ్డు ప్రమాదం రూపంలో కూతుర్ని చిదిమేసింది. ‘నాన్నా’ అనే ఆ కూతురి పిలుపు ఇక వినబడదని ఆ తండ్రి గొంతు మూగబోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన ఆయన గుండె కూడా ఆగిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే తండ్రీకూతుళ్ల మృత్యువాత ఘటన చిలకలూరిపేటలో విషాద ఛాయలు నింపింది. గుంటూరు, చిలకలూరిపేటరూరల్: కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక కన్న తండ్రి గుండె ఆగింది. ఈ సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ఆదివారం చోటు చేసుకుంది.ఒకరి వెంట ఒకరు మరణం ఇలా ... పట్టణంలోని కొమరవల్లిపాడు (పాటి మీద) జెండా చెట్టు సమీపంలో చింతకాయల శివనాగేశ్వరరావు(64) నివసిస్తున్నారు. పసుమర్రు గ్రామ శివారులో డీఆర్ఎన్ఎస్సీవీఎస్ డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె మారుబోయిన అనంతలక్ష్మి(45)ని చిలకలూరిపేటలోనే ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె. శనివారం భర్తతో కలిసి గుంటూరు దంత వైద్యశాలకు వెళ్లి చిలకలూరిపేటకు తిరిగి వస్తుండగా కోండ్రుపాడు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పింది. అనంతలక్ష్మికి తీవ్ర గాయాలవడంతో కాటూరి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆదివారం కుమార్తె దహన సంస్కారం నిర్వహించిన అనంతరం తండ్రి చింతకాయల శివనాగేశ్వరరావు కుమార్తె మృతిని జీర్ణించుకోలేక గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించేలోగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. తండ్రీకుమార్తెల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
సీఎం మేనల్లుడి మృతి
చిత్తూరు, చంద్రగిరి : సీఎం చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్ కుమార్(43) శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన కందులవారిపల్లెకు తీసుకొచ్చారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి, నారా ఇందిర, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి శుక్రవారం సాయంత్రం కందులవారిపల్లెకు చేరుకున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆ గ్రామానికి చేరుకుని ఉదయ్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. శనివారం ఉదయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు సమాచారం. -
నీవెంటే.. నేనూ..
చిత్తూరు, కలకడ : గుండెపోటుతో భర్త మృతిచెందాడు. దీన్ని జీర్ణించుకోలేక భార్య ఆవేదన చెంది మృతి చెందింది. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ సంఘటన కలకడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని నవాబుపేట పంచాయతీ హరిజనవాడకు చెందిన మంద చలపతి(33) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. దీన్ని భార్య సంతోషి(30) జీర్ణించుకోలేకపోయింది. భర్త లేకపోవడంతో ఆవేదన చెందింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. బుధవారం ఉదయం ఆమె కూడా మృతిచెందింది. గంటల వ్యవధిలోనే దంపతులు మృతిచెందడం స్థానికులను కలచి వేసింది. తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు బాలాజీ(8) అనాథగా మిగిలాడు. సమాచారం అందుకున్న వెలుగు సిబ్బంది గ్రామానికి చేరుకుని విచారించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. మిగిలిన చంద్రన్న బీమా నగదును వారి కుమారుడు పేరు మీద బ్యాంకులో జమచేస్తామని చెప్పారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
గుండెపోటుతో ‘ఆశ’ వర్కర్ మృతి
తూర్పుగోదావరి, వేండ్ర (పెదపూడి): విధి నిర్వహణలో శిక్షణ పొందుతూ ఆశ వర్కర్గా పని చేస్తున్న పలివెల చిట్టెమ్మ(50) గుండెపోటుతో మృతి చెందిందని సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వేండ్ర గ్రామానికి చెందిన పలివెల చిట్టమ్మ ఈనెల 20 సామర్లకోటలోని టీటీడీసీ సెంటర్కు శిక్షణ నిమిత్తం వెళ్లిందని, గురువారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వెంటన్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందన్నారు. ఆశ వర్కర్ను ప్రభుత్వం ఆదుకోవాలి సామర్లకోట టీటీడీసీలో శిక్షణ పొందుతూ మృతి చెందిన ఆశ వర్కర్ పలివెల చిట్టెమ్మను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మండల సీఐటీయూ నాయకురాలు ఎం.రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో చిట్టెమ్మ భౌతికకాయాన్ని వారు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యురాలైన కోడలకు ఆశ వర్కర్ ఉద్యోగం ఇవ్వాలని, ఆశవర్కర్కు చంద్రన్న బీమా పథకం వర్తింపజేయాలన్నారు. అలాగే తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండల ఆశవర్కర్ల నాయకురాలు రెడ్డి వెంకటలక్ష్మి, సంపర పీహెచ్సీ నాయకురాలు సుందరపల్లి మణిరత్నం, డీ.రత్నం, కె.పద్మవతి, సీహెచ్ మంగయమ్మ, జి.ఈశ్వరి తదితరులు ఉన్నారు. -
బేబి గుండె ఆగింది
అయినవారెవరూ లేకపోయినా ఉన్నత చదువులు చదువుకుని ఆదర్శంగా నిలవాలనుకున్న విద్యార్థిని బేబి ఆశ నెరవేరలేదు. అకాల మృత్యువు గుండె జబ్బు రూపంలో ఆమెను పొట్టనబెట్టుకుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఆమె గుండె జబ్బుతో పోరాడి ఓడింది. వైద్యం కోసం ఆసరాగా నిలిచిన దాతలు, అండగా నిలబడిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను శోకసంద్రంలో ముంచేస్తూ తుదిశ్వాస విడిచింది. చిత్తూరు, చౌడేపల్లె: చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పో యి చౌడేపల్లె బాలికల వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని బేబి(15) గురువారం మృతి చెందింది. సదుం మండలం(ఎస్ఎం పల్లె) సిద్ధం దళితవాడకు చెందిన బేబి హాస్టల్లో ఉంటూ చౌడేపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. బేబికి నా అనేవారు ఎవరూ లేరు. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో అమ్మమ్మ తరఫు బంధువులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుండె జబ్బు ఉందని గుర్తించడంతో ఇరవై రోజుల క్రితం ఆమెను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్విమ్స్ కార్డియాలజీ ఐసీయూలో ఆమె చికిత్స పొందుతూ వచ్చింది. ఆస్పత్రి ఖర్చులకు కూడా లేని స్థితిలో చౌడేపల్లె ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్రెడ్డి, ఉపాధ్యాయిని జయ చొరవతో పత్రికల్లో బేబి దీనావస్థపై కథనాలు వచ్చాయి. దీంతో దాతలు ముందుకు వచ్చారు. బేబి వైద్యం కోసం కొంత మొత్తాన్ని ఉపాధ్యాయుల ద్వారా దాతలు అందజేశారు. బేబి కోలుకొని తిరిగి పాఠశాలకు వచ్చి తమతోపాటు చదువుకోవాలని సహ విద్యార్థులు కోరుకున్నారు. అయితే వారి ఆశలు నెరవేరకనే బేబిని అకాల మృత్యువు కబళించింది. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఖిన్నులయ్యారు. బేబి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చిన్నారి ప్రాణాలను రక్షించడానికి కృషి చేసిన పుంగవం ఫౌండేషన్, ఇతర దాతలు, విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆగిన క్యాథ్ లబ్ డబ్ !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో హృద్రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆపరేషన్ల కోసం ఆశగా ఎదురుచూసి నిరాశ చెందారు. సాధారణంగా గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురికావద్దంటూ వైద్యులు సూచిస్తుంటారు.. అయితే సాక్షాత్తు జీజీహెచ్ గుండె వైద్య విభాగంలో సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోవడం పేదల ఆరోగ్యంపై పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. వాస్తవానికి జీజీహెచ్లో నెలకు సుమారు 150 వరకు గుండె ఆపరేషన్లు జరుగుతుంటాయి.ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఐదు ఆపరేషన్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయం ఎక్కడ? క్యాథ్ల్యాబ్ను ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్నాయి. అయితే జీజీహెచ్ అధికారులుగానీ, ప్రైవేట్ సంస్థ ప్రతిని«ధులుగానీ గుండె వైద్య విభాగంలోని రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్మరించారు. దీంతో దుమ్ము, ధూళి రావడంతో గుండె వైద్య విభాగంలోని రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు సైతం సోమవారం జరగాల్సిన గుండె ఆపరేషన్లు నిలిపివేసి క్యాథ్ల్యాబ్ మిషన్లపై దుమ్ము పడకుండా బట్టలతో కప్పి ఉంచారు. కొత్త క్యాథ్ల్యాబ్ మిషన్ ఏర్పాటు చేసే వరకూ గుండె ఆపరేషన్లు నిలిచిపోతాయంటూ వైద్యులు అంటుంటే, చిన్న రిపేరు వల్ల సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయని, మంగళవారం నుంచి యథావిధిగా ఆపరేషన్లు జరుగుతయంటూ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. అధికారులు, వైద్యులు విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి ఎదురుచూపు.. గుంటూరు జీజీహెచ్లో ప్రస్తుతం ఉన్న క్యాథ్ల్యాబ్ మిషన్కు మరో రెండేళ్లు కాలపరిమితి ఉన్నప్పటికీ దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ జరుగుతుందనే కారణంతో రోగులు ఉదయం నుంచి ఏమీ తినకుండా వేచి చూస్తున్న తరుణంలో ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించడం వారిని విస్మయానికి గురిచేసింది. అయితే మంగళవారం అయినా ఆపరేషన్లు జరుగుతాయా? అనేదానిపై వైద్యుల నుంచి స్పష్టత కొరవడింది. ప్రైవేటు పరం చేయడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు వైద్యాన్ని ప్రొత్సహిస్తూ రోగులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సహృదయ, ఉన్నతి ఫౌండేషన్ వంటి సంస్థల మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేయాలనే తలంపుతో వస్తే మంచి జరుగే అవకాశం ఉన్నప్పటికీ అధిక శాతం మంది వ్యాపారం కోసం వస్తూ నిరుపేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా జీజీహెచ్లో ఎమ్మారై స్కాన్ ఏర్పాటుకు ప్రభుత్వం తొలుత నిధులు మంజూరు చేసినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు కమీషన్ల కోసం దాన్ని నిలిపివేయించి పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చేశారు. ప్రైవేటు ఏజెన్సీ కావడంతో మొదటల్లో ఓపీలో స్కానింగ్కు రూ. 2వేల వరకు వసూలు చేశారు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేని నిరుపేద రోగులకు సైతం ఓపీలో స్కానింగ్ సేవలు ఉచితంగా అందడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కార్డియాలజీ విభాగంలోని క్యాథ్ల్యాబ్ను సైతం ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ప్రస్తుతం జీజీహెచ్లో ఉన్న క్యాథ్ల్యాబ్ మిషన్ కాలపరిమితి 2020 వరకు ఉన్నప్పటికీ దాన్ని తొలగించి హడావుడిగా క్యాథ్ ల్యాబ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వానికే తెలియాలి. క్యాథ్ ల్యాబ్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై అటు వైద్యులు, ఇటు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి యథావిధిగాఆపరేషన్లు.. జీజీహెచ్ గుండె వైద్య విభాగంలో క్యాథ్ల్యాబ్ మిషన్ రిపేరు రావడంతో సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే ఇంజినీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తాం. ప్రైవేటు సంస్థ క్యాథ్ల్యాబ్మిషన్ ఏర్పాటు చేసే వరకు జీజీహెచ్ క్యాథ్ల్యాబ్మిషన్ ద్వారా రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఆపరేషన్లు చేస్తాం. –డాక్టర్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఛాతీనొప్పితో తీసుకొస్తే సూదేసి చంపేశారు
అనంతపురం, హిందూపురం అర్బన్: ‘ఛాతీలో నొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. డాక్టర్ లేడు. డ్యూటీలో ఉండే నర్సు ఇంజక్షన్ ఇచ్చింది. పది నిమిషాలకే ప్రాణం పోయింది’ అంటూ తండ్రిని పోగొట్టుకున్న ఆర్టీసీ కాలనీకి చెందిన అతీబ్, రహిమాన్ స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు... ఆర్టీసీ కాలనీలో నివాసముండే రిటైర్డు ఆర్టీసీ మెకానిక్ అబ్దుల్సలాం(65) బుధవారం రాత్రి నమాజ్ తర్వాత ఛాతీనొప్పిగా ఉందని చెప్పారు. కుమారులు అతీబ్, రహిమాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేరు. అబ్దుల్సలాం నొప్పితో బాధపడుతూ ఉండటంతో హెడ్నర్సు ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే ఆయనలో కదలిక లేకుండా పోయింది. అంతలో డాక్టర్ శివకుమార్ వచ్చి పరిశీలించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు, సíన్నిహితులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నొప్పి తగ్గిస్తారని తీసుకొస్తే చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డ్యూటీలో ఉండే డాక్టర్ ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని వారికి సర్ధి చెప్పడానికి చూశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు కూడా వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. కానీ బాధితులు వినలేదు. ఆసుపత్రిలో ఒకరోజు ఐదుగురు పిల్లలు చనిపోతేనే ఇంతవరకు ఏ చర్యలూ తీసుకోలేదే... ఇప్పుడేం చర్యలు తీసుకుంటారని అడిగారు. ఆసుపత్రిలో నర్సులు, సిబ్బంది రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన చెందారు. తర్వాత టౌటౌన్ సీఐ తమీంఅహ్మద్ వచ్చి తాము చర్యలు తీసుకుంటామని బాధితులకు సర్దిచెప్పారు. దీంతో వారు రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. -
బుల్లితెర నటుడు మృతి
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు విజయ్రాజ్(43) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పళని, ఇడుంబన్మలైకు చెందిన విజయ్రాజ్ కోలంగళ్, మెట్టిఒళి, నాదస్వ రం మెగా సీరియళ్లలో నటించారు. ఎండన్ మగన్ వంటి కొన్ని చిత్రాల్లోనూ నటిం చిన విజయ్రాజ్ మూడు రోజుల క్రి తం దీపావళి పండుగను కుటుం బ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లారు. అక్కడ శనివారం సాయంత్రం అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విజయ్రాజ్ను పరీక్షించిన వైద్యులు తను మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. విజయ్రాజ్కు భార్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు. -
పోలాకి తహసీల్దార్కు గుండెపోటు!
పోలాకి/శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుపాను ప్రభావిత మండలా ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు.. పనిఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న అధికారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా పోలాకి మండల తహసీల్దార్ జెన్ని రామారావు శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యా రు. దీంతో వెంటనే అతన్ని శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జేసీ–2 పి.రజనీ కాంతరావు, డీఆర్వో నరేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఏవో రమేష్బాబులు కిమ్స్కు చేరుకొని రామారావును పరామర్శించారు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విధాలా ప్రభుత్వం ద్వారా వైద్య సదుపాయాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రామారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కుటుంబసభ్యులు విశాఖపట్నానికి రామారావును తరలించారు. ఈయన తుపాను విధుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి పోలాకిలో మండల ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. సుమారు 28 రోజులుగా విధుల్లో ఉంటున్న ఆయన అలసటకు గురయ్యారు. విధుల్లో ఒత్తిడి పెరడంతోనే గుండెపోటుకు గురయ్యారని రెÐవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నలుగురు తహసీల్దార్లు అస్వస్థతకు గురికాగా టెక్కలి ఆర్డీవో దఫేదార్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారని అసోసియేష¯న్ జిల్లా అధ్యక్షుడు పి. వేణుగోపాలరావు అన్నారు. తుపాను విధుల్లో ఉన్న అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్నామ్యాయ చర్యలపై దృష్టి సారించాలని కోరారు. -
ప్రముఖ రచయిత్రి ప్రమీలాదేవి మృతి
గౌతంనగర్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి(75) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి సుమారు 40 పుస్తకాలు రచించారు. ‘పద సాహిత్య పరిషత్’ అనే సంస్థను స్థాపించి సాహిత్య సేవలందించారు. అన్నమాచార్య కీర్తనలపై పీహెచ్డీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులైలో మధ్యప్రదేశ్లో జరిగిన అఖిల భారతీయ రాష్ట్ర భాషా సమ్మేళనంలో సరస్వతీ సన్మాన్ అవార్డు అందుకున్నారు. సర్దార్పటేల్నగర్లోని శ్మశానవాటికలో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రముఖ కవయిత్రులు ముక్తావి భారతి, ఆకెళ్ల విజయలక్ష్మి, తమిరస జానకి, గోల్లమూరి పద్మావతి తదితరులు హాజరై నివాళులర్పించారు. -
ప్రతిభాభారతి ఆరోగ్యంపై ఆందోళన
ఆరిలోవ (విశాఖ తూర్పు): తండ్రి అనారోగ్యాన్ని తట్టుకోలేక మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి గుండెపోటుకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధాప్యంతో బాధ పడుతున్న ఆమె తండ్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.పున్నయ్యను వారి స్వగ్రామమైన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి నుంచి గురువారం అర్ధరాత్రి విశాఖ హెల్త్సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అంబులెన్స్ వెనుక కారులో వస్తున్న ప్రతిభా భారతికి రణస్థలం సమీపంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కూడా బంధువులు పినాకిల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇక్కడి వైద్యులు తెలిపారు. ప్రతిభా భారతి అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె కుమార్తె గ్రీష్మ ప్రసాద్ను కలసి పరామర్శించారు. మాజీ మంత్రి కోండ్రు మురళి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల అప్పలనాయుడు, రాష్ట్ర హెచ్.ఆర్.డి. సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకా సత్యకిరణ్, పలువురు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ప్రతిభా భారతికి తీవ్ర అనారోగ్యం
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పినాకిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92) ను చూసేందుకు ఆమె శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రతిభా భారతికి అత్యవసర చికిత్స అందిస్తున్నామనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. -
వైజాగ్కు ఇక సెలవు
తెలుగు కళారంగంలో మరో ధ్రువతార రాలిపోయింది. ప్రముఖ సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారన్న వార్తప్రసార మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో నగరమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఆ తర్వాత బుల్లితెరపై కూడా నటించి ఆయన ఎందరో మనసులు గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వైజాగ్ ప్రసాద్ ఇక లేరన్న వార్తను ఆయనఅభిమానులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటును తలచుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వస్థలం గోపాలపట్నం విషాదంతో మూగబోయింది. గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/విశాఖ కల్చరల్: వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద్. విశాఖ నగరం గోపాలపట్నం యల్లపువానిపాలెంలో ఆయన జన్మించారు. పాతగోపాలపట్నం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రామ్మూర్తి మాస్టారి అబ్బాయిగా సుపరిచితులు. ముగ్గురు అక్కలు తర్వాత సంతానం ప్రసాద్. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అన్నీ నాన్నే అయ్యారు. ప్రాథమిక చదువుల నుంచీ ఎస్ఎస్ఎల్సీ వరకూ ప్రసాద్ను తన మేనమామ వద్ద చదివించారు. తర్వాత విశాఖలో పీయూసీ చదివారు. తర్వాత బీఏ చదివారు. ఆరు దశాబ్దాలుగా ప్రసాద్ గోపాలపట్నం మెయిన్రోడ్డులో నివాసం ఉంటున్నారు. సినీ రంగనేప«థ్యంలో ప్రసాద్ భార్య విద్యావతితో హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ ఇద్దరూ ఇంజినీర్లుగా అమెరికా, లండన్లో స్థిరపడ్డారు. నాటకాల మోజులో డాక్టర్ సీటు వదిలేసి... ప్రసాద్కు నాటకాల పిచ్చి అంతా ఇంతా కాదు. చిన్నతనంలో మునిమాణిక్యం నరసింహారావు అనే రచయిత నాటకానికి ఇద్దరబ్బాయిలు కావాలని కోరితే నాలుగొతరగతి చదువుతున్న ప్రసాద్కు అవకాశం కల్పించారు. అప్పటి నుంచీ నాటకాల మోజు పెరిగింది. ప్రసాద్ ఎస్ఎస్ఎల్సీ తర్వాత వైజాగ్లో తండ్రి రామ్మూర్తి మాస్టారి వద్దకు వచ్చినా నాటకాల వ్యామోహం తీరలేదు. అప్పట్లో పీయూసీ తర్వాత ప్రీప్రొఫెషనల్ కోర్సు చేశాక ఎంబీబీఎస్ సీటు వచ్చినా అందులో చేరాల్సిన రోజు నాటకాల ప్రదర్శనలో పడి సీటు వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. తర్వాత డాక్టర్ అవ్వాలని ప్రయత్నించినా కాలేకపోయానని, తర్వాత బీఏ చదివానని అçప్పుడపుడు ఆయన సన్నిహితుల వద్ద అలనాటి నాటకాల మోజును గుర్తు చేసుకుంటుండేవారు. ఉద్యోగం చేస్తున్నా నాటకాలే... ప్రసాద్ బీహెచ్పీవీలో ఉండగా విద్యావతితో వివాహం జరిగింది. అనకాపల్లి పరిషత్ పోటీల్లో ప్రసాద్కు పావలా నాటికతో ఉత్తమ ప్రొడక్షన్ అవార్డు అందుకున్నారు. తర్వాత కాలంలో ఆయన షిప్యార్డుల్లో ఉద్యోగం చేశారు. అప్పట్లో అక్కడి సంçస్థలో ప్రముఖనటుడు వంకాయల సత్యనారాయణ తదితర కళాకారులతో ఆయన నాటకాలు వేస్తుండేవారు. వంకాయల సత్యనారాయణతో విజయభారతి సంస్థ నెలకొల్పి మొట్టమొదటిగా గరీభీహటావో నాటిక ప్రదర్శించారు. చిలకలూరిపేట, బాపట్ల, కోల్కతా, అలహాబాద్ తదితర ప్రాంతాల్లో ఈనాటకానికి జాతీయస్థాయిలో విశేష ఆదరణ లభించింది. హాస్యనటుడు, విలన్, ఇంకా అనేక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో గుర్తింపు పొందారు. నేనూ మనిషినే నాటికలో హీరోగా వేశారు. కాలధర్మం నాటికలో వృద్ధుడి పాత్ర...ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. సినిమాల్లోనూ అవకాశాలు పెరగడంతో 2002లో షిప్యార్డులో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 170కిపైగా సినిమాలు...మూడునందులు 1983లో ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన బాబాయ్ అబ్బాయ్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ప్రసాద్ నాటక ప్రదర్శనలే సినీ అవకాశాలిచ్చాయి. ఆయా నాటకాలు చూసి సినీ దర్శకులు జంధ్యాల, కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖుల ప్రోత్సాహించడంతో ప్రసాద్ వెండితెరపై మెరిశారు. ముద్దమందారం, మొగుడూపెళ్లాలు, ప్రతిఘటన, శృతిలయలు, ఊరికిమొనగాడు, ప్రేమపుస్తకం చిత్రాల్లో ప్రసాద్కు అవకాశాలు వచ్చాయి. దర్శకుడు తేజ పిలుపు మేరకు నువ్వు..నేను చిత్రంలో ప్రసాద్ క్యారెక్టర్కు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచీ ఒక్క వెండితెరపై నిలదొక్కుకున్నారు. ఇలా భద్ర, జైచిరంజీవ, గౌరి, జానికివెడ్స్ శ్రీరామ్ మంచి పాత్రల్లో నటించారు. సుమారు 170 సినిమాలకు పైగా నటించారు. ఇలా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు మార్లు ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను అందుకున్నారు. ఇంకా ఆయనకు నాటక, సినీరంగాల్లో ఉగాది పురస్కారాలు, సన్మానాలు, అభినందన పతకాలు, ప్రశంసాపత్రాలూ లెక్కలేదు. సేవల్లో ప్రత్యేక శైలి... వైజాగ్ ప్రసాద్ది విలక్షణ శైలి. ఒక చేత్తో చేసింది మరో చేతికి తెలియకుండా చేయాలన్న ఆకాంక్ష ఆయనది. గోపాలపట్నంలో షిర్డీ సాయినాథుని వెండి మకరతోరణం, వెంకటాపురం రామాలయానికి గంటస్తంభం ఏర్పాటుకు ఆయన సహకరించారు. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినపుడు ఆయన ఏదో సేవాసంస్థను సందర్శించి సంతోషం పొందుతుంటారు. పాపాహోమ్లో చిన్నారులకు దుస్తులు ఇవ్వడం, ఎయిడ్స్బారిన పడ్డ వారి పిల్లలకు దుస్తులు కుట్టించి ఇవ్వడం, ఆర్థ్ధిక సాయం చేయడం ద్వారా సంతృప్తి చెందుతుండేవారు. -
పుంగనూరు వైఎస్ఆర్సీపీలో విషాదం
ఆయన మాజీ సర్పంచ్. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కలిగే మేలును ప్రజలకు వివరించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. పుంగనూరు/మదనపల్లె : పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు శనివారం గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటతడి పెట్టారు. నాయకుల భౌతికకాయాల వద్ద మౌనంగా కూర్చుని ఉండిపోయారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పుంగనూరు మండలంలో పల్లెబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వారిలో చండ్రమాకులపల్లె మాజీ సర్పంచ్ వేణుగోపాల్రెడ్డి(45) కూడా ఉన్నారు. తన ఇంటిలో ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే బయలుదేరుతుండగా వేణుగోపాల్రెడ్డి గుండెపోటుకు గురయ్యా రు. వెంటనే నాయకులు ఆయనను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరిం చారు. శనివారం ఉదయం పుంగనూరు మున్సి పల్ చైర్పర్సన్ షమీమ్ మామ, మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం అధ్యక్షుడు ఫకృద్దీన్ షరీఫ్ తండ్రి మహమ్మద్ షరీఫ్ (65) గుండెపోటుతో మృతి చెందారు. అలాగే యాదవ సంఘం నాయకుడు ఆంజప్ప (60) కూడా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాటను రద్దు చేసుకుని మదనపల్లె ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వేణుగోపాల్రెడ్డి భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. బోరున విలపిస్తూ ఆస్పత్రిలోనే కూర్చుండిపోయారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి , తంబళ్లపల్లె వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ ద్వారకనాథరెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ద్వారకనాథరెడ్డి కూడా బోరున విలపించారు. మృతులకు నివాళి మృతులు ఆంజప్ప, వేణుగోపాల్రెడ్డి, మహమ్మద్షరీఫ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. భౌతికదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఓకే రోజు ముగ్గురు నాయకుల మృతితో వైఎస్ఆర్ సీపీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైస్ఎంపీపీ రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్కుమార్, పెద్దిరెడ్డి, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్రెడ్డి, యువజన సంఘ నాయకులు రాజేష్, ప్రతాప్, రెడ్డెప్ప, బాబ్జాన్, ఉదయ్కుమార్, కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి, బాలగంగాధర రెడ్డి, జయరామి రెడ్డి, కనకదుర్గ సత్య, దండాల రవిచంద్రా రెడ్డి, భువనేశ్వరి సత్య, గార్ల చంద్రమౌళి, హరి రాయల్, డీఎల్పీవో లక్ష్మి, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఏఈ పురుష్తోతం, జేఈ జగదీష్, ఈవోఆర్డి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. -
గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
డల్లాస్ : గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మ్రుదుల్ చెరుకుపల్లి ఆమెరికాలోని డల్లాస్లో గుండెపోటుతో మృతి చెందారు. మ్రుదల్కు ఆదివారం తెల్లువారుజామున గుండెపోటు రావడంతో హుటాహుటిన బెయిలర్ స్కాట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మ్రుదుల్ కన్నుమూశారు. డల్లాస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మ్రుదుల్కు భార్య, ఆరేళ్ల కూతురు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే మ్రుదల్ది కష్టపడే తత్వం అని ఆయన స్నేహితులు తెలిపారు. మ్రుదల్ అకాలమరణంతో ఆయన కుటుంబ సభ్యులను అదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ముందుకొచ్చింది. ఆర్థికపరమైన అవసరాలను తీర్చడానికి నాట్స్ హెల్ప్లైన్ టీమ్ వారి కుటుంబసభ్యులు, స్నేహితులను సంప్రదించి వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. ఇలాంటి కష్టసమయంలో మద్రుల్ కుటుంబానికి బాసటగా నిలవడానికి అందరూ ముందుకురావాలని నాట్స్ పిలుపునిచ్చింది. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నరసింహమూర్తి (51) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసుబృందం దాడులు నిర్వహించింది. పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు పరుగెత్తే సమయంలో నరసింహమూర్తి గుండెపోటుకు గురయ్యాడు. కళ్యాణదుర్గంలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు అక్కడ ఆయన ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ నరసింహమూర్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది దిగ్బ్రాంతికి లోనయ్యారు. -
మంటగలిసిన మానవత్వం
కాచిగూడ: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.నాగేశ్వరరావు (66) తిలక్నగర్ శివాలయం సమీపంలోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నాగేశ్వర్రావు మృతిపై ఇంటి యజమానులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని వారు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రినుంచే నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులను ఇంటి యజమానులు మల్లమ్మ, మంజులు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడమేగాక, ఇంటికి తాళంవేసి బయటకు గెంటేశారు. దీంతో మృతుడు నాగేశ్వర్రావు భార్య, కుమారుడు, కుమార్తె, వర్షంలో తడుస్తూ బయటే కూర్చోవాల్సి వచ్చింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి యజమానిని మందలించి వారిని ఇంట్లోకి పంపించారు. అయినా వారు ఇంట్లోకి నలుగురిని మాత్రమే అనుమతించి షరతులు విధించడం గమనార్హం. ఇంట్లో ఎలాంటి కర్మకాండలు చేయరాదని ముందే హెచ్చరికలు జారీ చేశారు. -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
వరదయ్యపాళెం: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిన్న పాండూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన హనుమంతు (35) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం వెదురుకర్రల లోడుతో గిద్దలూరు నుంచి తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న పాండూరు వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో టీ తాటేందుకు లారీని రోడ్డు పక్కన ఆపాడు. టీ దుకాణంలోకి వెళ్లిన హనుమంతు టీ తాగి తిరిగి లారీ వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని సమీపంలోని చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో క్లీనర్, వెదురుకర్రల యజమాని గిద్దలూరుకు తరలించారు. గిద్దలూరు టౌన్కు చెందిన హనుమంతుకు ఏడాది క్రితం పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతని తెలిసింది. వాహనం ఆగిన తర్వాత గుండెపోటు రావడం పెనుప్రమాదం తప్పిందంటూ స్థానికులు చర్చించుకున్నారు. -
భార్య శవం పక్కనే వారం రోజులు
దొడ్డబళ్లాపురం : గుండెపోటుతో మృతి చెందిన భార్య శవాన్ని కూడా ముట్టుకోలేని స్థితిలో అచేతనంగా ఉన్న భర్త శవం పక్కనే వారం రోజులు గడిపిన సంఘటన కారవారలోని కేహెచ్బీ కాలనీలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. ఇళ్ల పనులు చేసే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆదివారం కొందరు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. -
సినీ దర్శక నిర్మాత ఇకలేరు
పెరంబూరు: సీనియర్ దర్శక, నిర్మాత ఆర్.త్యాగరాజన్ ఆదివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 74. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో అనేక చిత్రాలను నిర్మించిన దివంగత ప్రఖ్యాత నిర్మాత చిన్నప్ప దేవర్కు త్యాగరాజన్ అల్లుడు అన్నది గమనార్హం. త్యాగరాజన్ ఎంజీఆర్ నటించిన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకుడిగా రజనీకాంత్తో తాయ్వీడు, అన్నై ఒర్ ఆలయం, తాయ్ మీదు సత్యం, అన్బుక్కు నాన్ అడిమై 8 చిత్రాలతో పాటు కమలహాసన్ హీరోగా రామ్లక్ష్మణన్, తాయ్ ఇల్లామల్ నాన్ ఇల్లై మూడు చిత్రాలు, విజయ్కాంత్తో నల్లనాళ్, అన్నైభూమి 3డీ, హిందీలో రజనీకాంత్, రాజేవ్ఖన్నాలతో రెండు చిత్రాలు అంటూ మొత్తం 35 చిత్రాలను తెరకెక్కించారు. శివకుమార్, శ్రీప్రియ జంటగా ఆట్టుక్కార అలమేలు, వెళ్లిక్కిళమై వ్రదం చిత్రాలు ఈయన దర్శకత్వంలో రూపొందినవే. ఆట్టుక్కార అలమేలు చిత్రం తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో రీమేక్ అయ్యింది. స్థానిక పోరూర్, భారతీయార్ వీధి, కావేరి గార్డెన్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న త్యాగరాజన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈయనకు భార్య సుబ్బలక్ష్మి, కొడుకు వేల్మురుగన్, కూతురు షణ్ముగవడివు ఉన్నారు. త్యాగరాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయానికి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వలసరవాక్కంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
పెళ్లయిన 20 రోజులకే..
పాములపాడు: మండలంలోని చెలిమిల్లలో గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లింగస్వామి కుమారుడు రమే‹ష్(28)కు 20 రోజుల క్రితం మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన జాస్మితో వివాహమైంది. గురువారం ఉదయం ఇంటి వద్ద ఉండగా రమేష్ గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భర్త మృతదేహం వద్ద భార్య విలపించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇదిలా ఉండగా ఎంబీఏ చదివిన రమేష్ ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడిని గుండెనొప్పి రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
భార్యను టెట్ పరీక్ష హాల్లోకి పంపి..
చిత్తూరు, రేణిగుంట: ‘‘ భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష రాయించేందుకు, రేణిగుంట సమీపంలోని ఓ పరీక్ష కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. పరీక్ష బాగా రాయాలని ఆల్ ద బెస్ట్ చెప్పి.. భార్యను కేంద్రంలోని పంపిన గంట వ్యవధిలోనే ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. చుట్టుపక్కల వారు గుమిగూడేలోపే మృత్యు ఒడికి చేరాడు. కాగా భర్త మరణించిన విషయం తెలిస్తే తట్టుకోలేదన్న భావనతో నిర్వాహకులు పరీక్ష పూర్తయ్యే వరకు ఆమెకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. పరీక్ష రాసి మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వచ్చి విగతజీవిగా భర్త పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. గుండెలు బాదుకుంటూ మృతదేహంపై పడి భోరున విలపించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది.’’ రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొండేపల్లెకి చెందిన ప్రభాకర్(33), భార్య సరితకు మంగళవారం టెట్ ఆన్లైన్ అర్హత పరీక్ష ఉంది. దీంతో వారు మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి చిత్తూరుకు చేరుకున్నారు. అక్కడ బైక్ పార్క్ చేసి బస్సులో తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి పరీక్ష కేంద్రం ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చారు. టెట్ పేపర్–1 పరీక్ష రాసేందుకు ఉదయం 8.30 గంటలకు భార్య సరితను కేంద్రంలోకి పంపి ఆమె కోసం కళాశాల ప్రాంగణంలో ప్రభాకర్ కూర్చుని నిరీక్షించాడు. 10 గంటల సమయంలో అతనికి గుండెపోటుకు గురై కూర్చున్న చోటే కుప్పకూలాడు. పక్కనున్న వారంతా తేరుకుని దగ్గరికి చేరేలోపే తుదిశ్వాస విడిచాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన సరిత భర్త మృతి చెందడాన్ని చూసి తీవ్ర మనోవ్యధకు గురైంది. ‘ఏవండీ పరీక్ష బాగా రాశాను.. లేవండి.. ఇంటికెళదాం’ అంటూ రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు యశ్వంత్(9), హాసిని(7), గోపీకృష్ణ(5) ఉన్నారు. ప్రభాకర్ చిత్తూరులో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన మృతి చెందడంతోవారి కుటుంబం వీధిన పడిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని బంధువులు వేడుకుంటున్నారు. -
తోడబుట్టి.. తోడుగా గిట్టి!
వారిద్దరూ అన్నదమ్ములు..ఇద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కలిగినా కలిసిమెలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ అన్నదమ్ముల బంధానికి సరైన నిర్వచనంగా నిలిచారు. వీరిద్దరినీ ఎవరూ వేరు చేయలేరనేంతగా వారి బంధం కొనసాగింది. చివరకు మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. అన్న వెంటే తమ్ముడు కానరాని లోకాలకు తరలిపోయాడు. కౌతాళం/ కౌతాళం రూరల్: కామవరంలో ఒకే రోజు అన్నదమ్ములు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చిదానంద, నాగమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు నాగరాజు(48), మల్లయ్య(45) గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు. ఎనిమిది నెలల క్రితం నాగరాజుకు, నెల క్రితం మల్లయ్యకు గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో ఇంటి వద్ద ఇద్దరు విశ్రాంతి తీసుకునేవారు. మంగళవారం ఇద్దరికీ గుండెనొప్పి రావడంతో కర్నూలుకు తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక నాగరాజు గురువారం మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున మల్లయ్య కూడా కన్నుమూశాడు. ఒక రోజు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాగరాజుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
చెట్నేపల్లిలో విషాదం
విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకుడిని చేసిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. నాన్న లేని లోకం శూన్యం అనిపించింది. ఏడుస్తూ ఏడుస్తూ గుండె పోటుకు గురై తనూ ప్రాణం వదిలాడు. 24 గంటల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుత్తి : గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే.. చెట్నేపల్లికి చెందిన గద్దల ఓబులేసు(89)కు నాగభూషణం, సూర్య చంద్ర (49), మస్తానప్ప అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఓబులేసు రైల్వే ఉద్యోగిగా పని చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగ విరమణ తర్వాత నుంచి ఓబులేసు తన రెండవ కుమారుడైన విశాలాంధ్ర స్టాఫ్రిపోర్టర్ సూర్య చంద్రతోనే ఉండేవాడు. అనారోగ్యం కారణంగా సోమవారం సాయంత్రం ఓబులేసు కన్నమూశాడు. తండ్రి మరణాన్ని సూర్య చంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉండిపోయాడు.అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సూర్య చంద్రకు ఛాతీలో నొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యచంద్రకు భార్య సులోచన, కుమార్తెలు సుజన, రచన, కుమారులు రాహుల్, సిదార్థ ఉన్నారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకు మరణించడంతో చెట్నేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరూ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తండ్రీ కొడుకుల మృతదేహాలు పక్కపక్కనే ఉండటం చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. కుటుంబ సభ్యులకు పరామర్శ తండ్రీ కొడుకులు( ఓబులేసు, సూర్యచంద్ర) మరణిచారన్న వార్త తెలుసుకుని వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెరుమాళ్ల జీవానందరెడ్డి, సభ్యులు గాలి నరసింహారెడ్డి, హనుమంతురెడ్డి, రామకృష్ణ, నారప్ప, రవితో పాటు వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ హుసేన్పీరా చెట్నేపల్లికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
గాలిలో ప్రాణాలు
అరుణాచలం..వయసు 64ఏళ్లు..ఆర్టీసీ డ్రైవరు. ఆదివారం రాత్రి చెన్నై నుంచి 50మంది ప్రయాణికులున్న బస్సు నడుపుకుంటూ తిరుపతి వస్తున్నాడు. రెడ్ హిల్స్ వద్ద అనారోగ్యంగా అనిపించింది. బస్సుఆపి మాత్ర వేసుకున్నారు. పిచ్చాటూరు మండలం కీళపూడి వచ్చేసరికి గుండెలో నొప్పి తీవ్రమైంది. బస్టాండులో ఆపి మాత్ర వేసుకుని బస్సు నడిపేందుకు సన్నద్ధమవుతుండగా స్టీరింగ్పై కుప్పకూలిపోయాడు..ప్రాణాలు విడిచాడు. గడచిన ఆర్నెళ్ల కాలంలో జిల్లాలో ఆరుగురు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. 10 మంది అనారోగ్యంతో చనిపోయారు. తిరుపతి సిటీ: ఆర్టీసీలో డ్రైవర్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. విధినిర్వహణలో జరగరానిది జరిగితే ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పే. తరచూ జిల్లాలో ఎక్కడో చోట బస్సు నడుపుతూ అనా రోగ్యం పాలవుతున్న సంఘటనలు ఎక్కువవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 14 డిపోల్లో 3,600 మంది డ్రైవర్లు ఉన్నారు. అందులో తిరుమల–తిరుపతి 416 వన్మెన్ సర్వీసులతోపాటు మరో 200 వన్మెన్ సర్వీసులను బెంగళూరు, చెన్నై, శ్రీకాళహస్తి, పుత్తూరుకు నాన్ స్టాప్ పేరుతో నడుపుతున్నారు. ఎక్కువగా ఒత్తిళ్లకు లోనై మృత్యువాత పడుతున్నారు. అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడికి గురై..... డ్రైవర్లకు పనిభారమెక్కువవుతోంది. ‘కిలోమీటరు–ఇంధన వినియోగం’పై ఆంక్షలు పెడుతుండటంతో వీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్స్ప్రెస్లలో కండక్టరు ఉండరు. డ్రైవరే టిమ్ మిషన్లతో టికెట్ కొట్టి డబ్బులు తీసుకోవాలి. ‘చిల్లర’ సమస్యలతో ప్రశాంత చిత్తానికి దూరమవుతున్నారు. నాలుగేళ్ల కిందట స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు 300–400 కిలోమీటర్ల నడిపేవారు. ఇప్పుడు 500–700 కిలోమీటర్ల వరకు బస్సులను తప్పనిసరిగా నడపాల్సిన పరిస్థితి. 10 గంటలకు పైగా పనిచేయిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఎక్కువ ఆదాయం తీసుకు రావాలని బలవంతపెడుతున్నారని వాపోతున్నారు. లేనిపక్షంలో చార్జిషీట్ ఇప్పిస్తామని, సస్పెండ్ చేస్తామని భయపెడుతున్నారు. కలెక్షన్ తక్కువ తీసుకొస్తున్నారనే నెపంతో కండక్టర్లను, టిమ్ మిషన్ల డ్రైవర్లను టీఐ–3 స్థాయి అధికారులు మనోవేదనకు గురిచేస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఇవిగో ఉదాహరణలు.. ♦ ఆదివారం తిరుమల డిపోకు చెందిన అరుణాచలం బస్సు డ్రైవర్ గుండె పోటుకు గురై స్టీరింగ్ మీదనే ప్రాణా లొదిలాడు. ♦ పుత్తూరు డిపోకు చెందిన డీఎస్.రాజు, ఆయన కుమారుడు డి.ఉదయ్ భాస్కర్ గుండెపోటుకు గురై చనిపోయారు. ♦ సదుంకు చెందిన వైఆర్.బాబు సత్యవేడు డిపోలో డ్రైవర్గా పనిచేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ♦ నగరికి చెందిన కృష్ణ మంగళం డిపోలో విధి నిర్వహణలో ప్రాణాలొదిలాడు. ♦ ఇటీవల కాలంలో 10 మందికి పైగా ఆనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 7,200 మందికి ఇద్దరే వైద్యులు.. చిత్తూరు, తిరుపతి డివిజన్లలోని 7,200 మంది ఆర్టీసీ కార్మికులకు ఇద్దరే వైద్యులున్నారు. చిత్తూరులోని డిస్పెన్సరీలో ఒక రు, తిరుపతిలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా స్పెషలిస్టులు కారు. 45 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు 3 ఏళ్లకు ఒక్కసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. అనుభవం లేని వైద్యులతోనే కంటిచూపు పరీక్షలు చేయ డం, బరువు, ఎత్తు, పొడవు పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లేదంటే విజయవాడకు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆనారోగ్యం బారినపడిన కార్మికులకు ‘సిక్’ సర్టిఫికెట్లను మంజూరు చేయరాదని ముందస్తుగానే ఆర్ఎం, డిపో మేనేజర్లు వైద్యులకు హుకుం జారీ చేస్తున్నారు. సెలవులు లేకపోవడం, పలు రకాల జబ్బులతో నిత్యం సతమతమవుతున్నారు. కనీ సం చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు చెబుతున్నారు. 2013 నుంచి భర్తీకి నోచుకోని పోస్టులు.. ఆర్టీసీలో 2013 నుంచి ఇప్పటివరకు డ్రై వర్ల పోస్టులు భర్తీ చేయలేదు. 2011లో ఎస్సీ,ఎస్టీ డ్రైవర్ల పోస్టులు 81 ఖాళీలకు గాను ఇటీవల 36 మందిని భర్తీ చేశారు. తిరుపతి డివిజన్ పరిధిలోని 7 డిపోల్లో డ్రై వర్ల కొరత తీవ్రంగా ఉంది. చిత్తూరు డివిజన్ పరిధిలోని డ్రైవర్లు ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మందిని తిరుపతి, అలిపిరి, తిరుమల, మంగళం డిపోలకు బదిలీ చేస్తున్నారు. దీంతో వారు అక్కడ్నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసుకుని తిరిగి వారి సొంత ఊళ్లకు వెళ్లాల్సి ఉంది. కార్మికులకు పెరిగిన పనిభారం.. క్రమంగా కండక్టర్లను తొలగిస్తూ వస్తున్నారు. డ్రైవర్ల చేతి వారి విధులు చేయిస్తున్నారు. వన్మ్యాన్ సర్వీసుల పేరుతో లాంగ్ సర్వీసులను నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ డీలక్స్ బస్సులకు 55 సంవత్సరాల్లో ఉన్నవారిని డ్రైవర్లుగా పంపిస్తున్నారు. డిమాండ్ పేరుతో కొన్నిసార్లు డ్రైవర్ చేతనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి గంటలు కూడా పది దాటిపోతున్నాయి. చార్టు ప్రకారమే డ్యూటీలు సీనియర్ డ్రై వర్లకు కోరుకున్న విధంగా ఛార్టు ప్రకారం డ్యూటీలు వేస్తున్నాం. చెన్నయ్కు వెళ్లే రహదారిలో పుత్తూరు నుండి ఊతుకోట వరకు రో డ్డు పూర్తిగా పాడైంది. ఆనార్యోగ సమస్యలు తలెత్తినప్పుడు సెలవులు మంజూరు చేస్తున్నాం.. 45 ఏళ్లు పైబడి వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.- ఎం.భాస్కర్రెడ్డి, ఇన్చార్జ్ డిప్యూటీ సీటీఎం, తిరుపతి. -
ఉపాధి కోసం వెళ్లి...
పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలకు ఆశాదీపాలుగా ఉన్న ఇద్దరు యువకుల ఆయువు అంతలోనే తీరిపోయింది. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని మృత్యువు కాటేసింది.దీంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉపాధి కోసం అబుదాబీకి వెళ్లిన మునగపాక మండలం మడకపాలెం యువకుడు అక్కడ గుండెపోటుతో మృతి చెందగా, మాడుగుల మండలం వీరనారాయణంకు చెందిన మరో యువకుడిని రైలు రూపంలో మృత్యువు కబళించింది. మునగపాక(యలమంచిలి): ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని భావించాడు. ఇక్కడే ఉంటే ఆ స్థాయిలో సంపాదించలేనని అనుకున్నాడు. సంసాదన కోసం దేశం కాని దేశం వెళ్లాడు. కష్టాలు తీరుతాయని ఆశిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై ఓ యువకుడు మృతి చెందడంతో కుటుంబం వీధినపడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మడకపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి నూకరాజు,నరసమ్మ దంపతులకు ఇద్దరు సంతానం, కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. పేదరికంలో ఉన్న కుటుంబానికి చేయూత ఇచ్చేందుకు కుమారుడు మహేష్(25) గాజువాక ఏజెంట్ ద్వారా ఐదేళ్ల క్రితం అబుదాబీ వెళ్లాడు. అక్కడ రెండేళ్లపాటు వెల్డర్గా పనిచేసి, ఇంటికి వచ్చేశాడు. ఏడాదిపాటు గ్రామంలో ఉంటూ తల్లిదండ్రులకు చేయూతగా ఉండేవాడు. 22 నెలల క్రితం మళ్లీ అబుదాబీ వెళ్లాడు. కుటుంబమంతా సంతోషంగా ఉన్న తరుణంలో వారికి పిడుగులాంటి వార్త అందింది. మహేష్ గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లి, నిద్రించే క్రమంలో 11 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్నేహితులు మహేష్ తల్లితండ్రులకు శుక్రవారం తెల్లవారు 2 గంటలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మహేష్ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కుటుంబానికి అండగా నిలిచిన మహేష్ మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రైలు ఢీకొని .. మాడుగులరూరల్: కుటుంబానికి అండగా ఉండేందుకు పనికోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన అయితంశెట్టి పరమేశ్(20) ఐటీఐ పూర్తిచేసి, ఉపాధి కోసం గత నెల 28న బెంగళూరు వెళ్లాడు. అక్కడ ప్రైవేటుగా రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నాడు. పరమేశ్తో పాటు మరో పది మంది యువకులు ఈ పని చేయడానికి వెళ్లారు. పరమేశ్ పనిచేసే స్థలానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకు గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. అకస్మాత్తుగా రైలు వచ్చి పరమేశ్ను ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ట్రాక్పైకి వెళ్లడంతో రైలు వచ్చిన శబ్దం వినిపించలేదు. తోటి యువకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరమేశ్ మృతదేహానికి బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి, అంబులెన్స్ లో శుక్రవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. వీరనారాయణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పరమేశ్ తండ్రి భీమునాయుడు గతంలో హత్యకు గురయ్యాడు. పరమేశ్ మృతి చెందడంతో తల్లీసోదరుడు భోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
యువతలో హార్ట్ సర్క్యుట్
ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులకు గురైన వారిని చూసేవాళ్లం. దశాబ్ద కాలంగా మధ్యవయస్సు వారు గుండెజబ్బులకు గురవుతున్నారు. తాజాగా యువతలో 20 ఏళ్లకే గుండె అరెస్ట్(షార్ట్సర్క్యుట్) వంటి కారణాలతో మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. దీనిపై కథనం... లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుమారుడు 21ఏళ్లకు కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందిన విషయం తెలిసిందే. అంత చిన్న వయస్సులో గుండెజబ్బుతో మృతి చెందడం కొంత ఆందోళన కలిస్తుంది. అంతేకాదు. ఇద్దరు ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ కార్డియాక్ అరెస్ట్తో తమ వద్దకు వచ్చినట్లు విజయవాడకు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి.రమేష్బాబు చెబుతున్నారు. గుండె జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో గుండెపోటుకు గురై సకాలంలో ఆస్పత్రికి రాక ముగ్గురు వైద్యులు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం యువతతోపాటు, 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో అధికంగా గుండె జబ్బులకు గురవుతున్నారు. ఒకప్పుడు స్త్రీలలో సైతం 70 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులు వచ్చేవని, ప్రస్తుతం 35 ఏళ్లకే వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా అన్ని వర్గాల్లో గుండె జబ్బులు నమోదవుతున్నాయి. కారణాలివే... చిన్న వయస్సులో గుండెజబ్బులకు రెండు రకాల కారణాలున్నాయి. వారి ఫ్యామిలీ హిస్టరీ, జన్యుపరమైన లోపాలు ఒక కారణం. గుండె కండరాలు దలసరిగా ఉండటం(సాధారణంగా 11 ఎంఎం ఉండాలి. కానీ 20 ఎంఎం ఆపైన ఉండటం), గుండెలోపల ఎలక్ట్రికల్ వైరింగ్, కరెంట్లో లోపాలతో షార్ట్సర్క్యుట్కు గురవడం, రక్తనాళాలు కుడి వైపున ఉండాల్సినవి ఎడమ వైపునకు తారుమారుగా పుట్టుకతోనే ఉన్నా గుర్తించకపోవడం వంటిగా పేర్కొంటున్నారు. ఇలాంటి వారు టెన్షన్స్, రెస్ట్ లేకుండా పనిచేయడం వంటి సందర్భాల్లో హార్ట్ షార్ట్ సర్క్యుట్కు గురై సడన్డెత్కు గురవుతారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడంతో 30, 40 శాతం పూడికలు ఉన్నా అవి చిట్లీ రక్తం గడ్డ కట్టి ప్రమాదకరంగా మారుతుంది. కొందరిలో 80 శాతం పూడికలు ఉన్నా ప్రమాదం కావని, కానీ కొందరిలో 30 శాతం ఉన్నా ప్రమాదకరంగా మారతాయంటున్నారు.–డాక్టర్ పోతినేని రమేష్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పుట్టిన వెంటనే గుండె పరీక్షలు చేయించడంతోపాటు, ఇరవై ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండెలోపాలు ఉన్నట్లు గుర్తించి మందులు వాడటంతోపాటు, సరైన ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం ఎంతో అవసరం. సరైన ఆహార అలవాట్లు కూడా ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. తమ కుటుంబంలో ఎవరికైన గుండెజబ్బులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అవగాహన ఎంతో ముఖ్యం నయం చేయగల గుండె జబ్బులతో బాధపడే వారు సరైన అవగాహన లేక మృత్యువాత పడడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం చిన్నవయస్సులో హార్ట్ షార్ట్ సర్క్యుట్కు ప్రధానంగా జన్యుపరమైన సమస్య కారణంగా చెప్పవచ్చు. వైద్యులకు సైతం గుండెపోటు, గుండెజబ్బులపై సరైన అవగాహన ఉండటం లేదు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఈసీజీ తీయడం ద్వారా గుండెపోటును నిర్ధారించవచ్చు. టెలీ, ఈసీజీ, టెలీమెడిసిన్ సెంటర్ల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చు. యువతలో గుండె షార్ట్సర్క్యుట్లకు సైతం తక్షణ వైద్యంతో నివారించవచ్చు. ప్రివెంటీవ్గా గుర్తిస్తే నయం చేయగల వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు. గుండె రక్తనాళాల్లోని కాల్ఫియం స్కోరు ఆధారంగా గుండెపోటు వచ్చే లక్షణాలను ముందుగా గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా నైస్ గైడ్లైన్స్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
గుండెపోటుతో నటి అనితా దాస్ మృతి
భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర నటి అనితా దాస్ (57) శుక్ర వారం మరణించారు. కొద్ది పాటి గుండెపోటుతో ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. 100కు పైబడి చిత్రాల్లో ఆమె నటించారు. తల్లి పాత్రకు ఆమె కొత్త ఒరవడి దిద్దిన నటిగా పేరొందారు. 1957వ సంవత్సరం నుంచి ఆమె చలనచిత్ర రంగంలో నటిగా వెలుగొందారు. 1975లో విడుదలైన జాజాబొరొ చిత్రం ఆమె నటనా జీవితంలో మైలు రాయిగా నిలిచింది. కృష్ణ సుధామా (1976), రామాయణ్ (1980), మా –ఓ–మమత (1980), స్వొప్నొ సాగొరొ (1983), పుఒ మోరొ కొలా ఠకురొ (1988), గొడి జణిలే ఘొరొ సుందొరొ (1994), బహుడిబే మో జొగొబొలియా (2003), సాథీరే (2004), ఓం శాంతి ఓం (2005), అమొ భిత్తొరే కిచ్ఛి ఒచ్ఛి (2010), శపథ్ (2012), అభయ్ (2017) ఆమె నటనా జీవితంలో పేరు తెచ్చిన చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యమంత్రి సంతాపం అనితా దాస్ మరణంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్ర వారం సంతాపం ప్రకటించారు. అకాల మరణంతో వెండి తెర, బుల్లి తెర వీక్షకులు అపురూపమైన నటిని కోల్పోయారని ఆయన సానుభూతి ప్రకటించారు. ఒడియా చలన చిత్ర, టెలివిజన్ నటనా రంగానికి ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అనితా దాస్ మరణం నటనా రంగానికి తీరని లోటు అంటూ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు చలన చిత్ర రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆమె మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు అంటూ కన్నీరు కార్చారు -
శోకసంద్రంలో పుట్రాయునిపేట
పులివెందుల : పులివెందుల పట్టణంలో మార్చి 4వ తేదీన ఘర్షణ కేసులో నిందితుడిగా ఉండి కడప సెంట్రల్ జైలులో గుండె పోటు రావడంతో రిమ్స్లో చికిత్స పొందుతూ వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం మృతి చెందాడు. బుధవారం శ్రీనివాసరెడ్డి మృతదేహానికి రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పుట్రాయునిపేటకు మృతదేహాన్ని తరలించారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో బుదవారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రిమ్స్కు చేరుకుని అధికారులు, డాక్టర్లతో మాట్లాడి పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా ముగించాలని కోరారు. స్వగ్రామానికి చేరుకున్న శ్రీనివాసరెడ్డి మృతదేహానికి కడసారిగా నివాళులర్పించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ శ్రీనివాసరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి మృతి చాలా బాధాకరమని.. ఆయన మరణం కుటుంబ సభ్యులకేకాక పార్టీకి కూడా తీరని లోటు అన్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన వెంటనే తాను వచ్చి కలుస్తానని వారికి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు హాజరైనవైఎస్ అవినాష్రెడ్డి శ్రీనివాసరెడ్డి మృతదేహానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డిలు హాజరై శ్రీనివాసరెడ్డి మృతదేహానికి పూలమాలలు, పార్టీ కండువాలు కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని తెలిపారు. శోకసంద్రంలో పుట్రాయునిపేట.. శ్రీనివాసరెడ్డి మృతితో పుట్రాయునిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరెడ్డి భార్య సరోజమ్మ, కుమారుడు గంగిరెడ్డి, కుమార్తె హేమలత తమను అనాథలను చేసి వెళ్లిపోయాడని బోరున విలపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, వేముల మండల పరిశీలకుడు రామలింగారెడ్డి, పులివెందుల కన్వీనర్ వరప్రసాద్, జిల్లా కార్యదర్శులు రసూల్, సురేష్రెడ్డి, సర్వోత్తమరెడ్డి, నాయకులు ఈశ్వరరెడ్డి, వెలుగోటి శేఖరరెడ్డి, బండి రామమునిరెడ్డి, భద్రంపల్లె రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
త్రీడీ సినిమా చూస్తుండగా గుండెపోటు
ప్రొద్దుటూరు క్రైం : త్రీడీ సినిమా చూస్తూ ఒక వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన ప్రొద్దుటూరులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు శ్రీనివాసనగర్కు చెందిన పెద్దపసుపల బాషా (43) బేల్దారి పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతను సోమవారం సాయంత్రం సినీహబ్ థియేటర్లో అవేంజర్ త్రీడీ సినిమాకు వెళ్లాడు. సినిమా వదిలాక అందరూ లేచి బయటికి వెళ్తున్న సమయంలో అతను లేవకుండా సీట్లోనే ఉండిపోయాడు. పక్కనున్న వారు ఎంత పిలిచినా లేవలేదు. వెంటనే థియేటర్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియడంతో భార్య ఖాదర్బీ, పిల్లలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్తకు నాలుగేళ్ల నుంచి గ్యాస్ట్రబుల్ మాత్రమే ఉందని, ఇతర సమస్యలు ఏవీ లేవని భార్య పోలీసులకు తెలిపింది. త్రీడీ సినిమాను అందరూ కళ్ల జోడు పెట్టుకొని చూస్తారు. అందులోని కొన్ని దృశ్యాలు మీదికి వచ్చి పడేలా ఉంటాయి. కొత్తగా త్రీడీ సినిమా చూసే వారికి కొన్ని దృశ్యాలు భయాన్ని కలిగిస్తాయి. ఈ దృశ్యాలు చూస్తూ అతను భయపడి గుండె పోటుతో చనిపోయాడా లేక సాధారణంగానే గుండె పోటు వచ్చి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు. -
గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం: గుండె పోటుతో సెంట్రల్ జైల్ జీవిత ఖైదీ మృతి చెందాడు. పోలీసులు, జైలు అధికారులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన తాతపూడి సత్యనారాయణ (49) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు లేచిన సత్యనారాయణ గుండెల్లో నొప్పిగా ఉందని అనడంతో జైలులో ఉన్న వైద్యులకు చూపించారు. వారి సూచనల మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జైలు గేటు వద్దకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మృతుడు 2017 మే నెలలో భార్య హత్య కేసులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదీ విధించడంతో శిక్ష నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యను హత్య చేయడంతో శిక్షపడి జైలుకు వచ్చినప్పటి నుంచి కుమారులు, కుటుంబ సభ్యులు, బంధువులు పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై అస్వస్థతతో ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. జైలు అధికారులు మృతుడి కుమారుడు తాతపూడి శ్రీను కు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగించారు. సబ్ కలెక్టర్ సమక్షంలో పంచనామా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ సమక్షంలో సెంట్రల్ జైల్ ఖైదీ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. సబ్ కలెక్టర్ మృతుడి కుమారుడు శ్రీను, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సెంట్రల్ జైల్లో మృతుడు ఉన్న బ్యారక్లో ఉన్న ఖైదీల నుంచి వివరాలు సేకరించారు. గుండు నొప్పి వచ్చినపుడు హాస్పిటల్కు తరలించినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వన్టౌన్ ఎస్సై జుబేర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకును కొడుతున్నారని ఆగిన తల్లిగుండె..
వేములవాడరూరల్: ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యా దు చేసుకున్నారు. ఈ విషయం ఓ యువకుడి తల్లికి తెలియడంతో తన కొడుకును కొడుతున్నారని ఆ తల్లి గుండె ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన చేపూరి తిరుపతి, వెంకటేష్, కరుణాకర్ ఇంకొంతమంది, నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క రాహుల్, వనపర్తి నగేష్తో పాటు మరికొంత మంది ఆదివారం ఓ పెళ్లి భరాత్లోఘర్షణ పడ్డారు. ఈ విషయంపై ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా రాత్రి ఇచ్చుకున్నారు. నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క వెంకవ్వ(35)కు ‘మీ కొడుకు చెక్క రాహుల్ను కొడుతున్నారంటూ’ కొందరు ఫోన్ చేశారు. తన కొడుకును కొడుతున్నారా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వేములవాడ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు బంధువు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. దుబాయిలో మృతిరాలి భర్త.. వెంకవ్వ భర్త సత్యనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటాడు. విషయం తెలుసుకుని స్వదేశానికి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకవ్వకు కూతురు, కొడుకు ఉన్నారు. -
గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి
ఆదిలాబాద్: గుడిహత్నూర్ పోలీసుస్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పాలకొండ శ్రీనివాస్ (49) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న హెడ్కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.20 వేలు ఎస్పీ అందించారు. ఎస్పీ వెంట పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు టెలీకాన్ఫరెన్స్ నిర్వహణ అధికారి సింగజ్వార్ సంజీవ్కుమార్ ఉన్నారు. -
పంటతోపాటు ప్రాణం పోయింది
రాయికల్(జగిత్యాల): ప్రకృతి కన్నెర్రజేసింది. చేతికందే సమయంలో తాను సాగుచేసిన ఆరు ఎకరాల వరిపంట దెబ్బతినడంతో ఆ పంటను చూసిన మహిళారైతు గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని లాల్నాయక్ తండాకు చెందిన మహిళా రైతు నునావత్ కైక (55) గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో వరిపంట సాగుచేసింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆ మహిళ రైతు గుండె తల్లడిల్లింది. ఏడుస్తూ ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయికల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలికి భర్త పర్శరాం, ఇద్దరు కూతుళ్లు, కొడుకులు ఉన్నారు. ఇటీవలే కొడుకు పెళ్లి కుదిరింది. వడగండ్ల వానతో పంటనష్టం రాయికల్ మండలం తాట్లవాయి ధర్మాజీపేట, కట్కాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో గ్రామంలోని వేలాది ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. వరి చేలు నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. తాట్లవాయి గ్రామంలో లావుడ్య కిషన్, భూక్యానాయక్, ధర్మాజీపేటలోని సురేశ్నాయక్ ఇళ్ల పైకప్పు లేచిపోవడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
గూడు చెదిరింది..గుండె ఆగింది
అల్గునూర్(మానకొండూర్): వారిది పేద కుటుంబం. ఇంటిపెద్ద గతంలోనే కాలం చేశాడు. తల్లి, ముగ్గురు పిల్లలు వారికున్న చిన్నపాటి ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. జాతీయరహదారికి పక్కన ఉండడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో గూడు కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో ఆ తల్లి కొద్దిరోజులుగా బెంగపెట్టుకుంది. పరిహారం వస్తుందో లేదోనని దిగాలుతో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. ఈసంఘటన తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో జరిగింది. ముగ్గురు పిల్లలను అనాథలయ్యారు.. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అల్గునూర్కు చెందిన అఫిదాబీ(43) భర్త గతంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మానసిక వికలాంగులరాలైన కూతురు ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరు కొడుకులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గతంలో కోర్టు కేసు కారణంగా అల్గునూర్లో ఆగిపోయిన రాజీవ్రహదారి విస్తరణ పనులు ఇటీవల మొదలయ్యాయి. అల్గునూర్ చౌరస్తాలో ఉన్న ఇళ్లకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం హైకోర్టులో డిపాజిట్ చేసింది. కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్లను యజమానులే కూల్చేసుకుంటున్నారు. సొంత డబ్బులతో ఇల్లు కూల్చివేత అఫిదాబీ కూడా సొంత డబ్బులతో ఇటీవలే ఇల్లు కూల్చివేసుకుంది. అయితే గ్రామానికి చెందిన శ్రీనివాస్చారి సర్వేనంబర్ 501, 511లోని భూములు తమవే అని, వాటికి సబంధించిన పరిహారం తమకే ఇప్పించాలని గతంలోనే కోర్టులో కేసు వేశాడు. దీంతో ఇదే సర్వేనంబర్లో ఉన్న పలు ఇళ్ల యజమానులకు పరిహారం చెల్లింపు నిలిచిపోయింది. అఫిదాబీకి రావాల్సిన రూ.5 లక్షలు అందలేదు. ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేని అఫిదాబీ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కొద్దిరోజులుగా దిగాలుతో.. కోర్టు కేసు ఎప్పుడు తేలుతుంది.. పరిహారం ఎప్పుడు అందుతుందోనని కొన్నిరోజులుగా దిగాలు చెందుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలింది. తహసీల్దార్ జగత్సింగ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ అయిందని, బాధితులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
హృదయ విదారకం
మల్లన్నా..ఓ రైతన్నా..ఆరుగాలమూ..ఎవుసమే అంటివి..స్వేదం చిందించి పైరును కాపాడితివి.ప్రకృతి పగబడితే పదిలం జేసుకుంటివి..భూ తల్లిని నమ్ముకునికుటుంబాన్ని సాకుతుంటివి..ధాన్యపు రాశుల పంట మురిపెం తీరకపాయే..కష్టార్జితం ఇంటికి చేరకపాయే..అలుపెరుగని కౌలు చాకిరీచి‘వరి’కి ఉసురు తీసుకునే..బతికున్నోళ్లకు ‘పుట్టెడు’ దుఃఖాన్ని మిగిల్చే. నేలకొండపల్లి:స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేలకొండపల్లికి చెందిన చెక్కల మల్లయ్య(55) అనే కౌలురైతు ధాన్యం ఆరబోస్తూ..గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందాడు. యాసంగి (రబీ) సీజన్కు సంబంధించి తాను సాగు చేసిన కౌలు భూమిలోని వరిపంటను యంత్రంతో కోయించగా..వడ్లు కాస్త తేమగా ఉన్నాయని ఆరబోస్తుండగా..ఎండ తీవ్రతకు నీరసించి..ఒక్కసారిగా గుండెపోటుతో ఆ వడ్ల రాశిపైనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తోటి రైతులు చూసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ రైతు..కొన్నేళ్లుగా భూములను కౌలుకు తీసుకుని..జీవనం సాగిస్తున్నాడు. కాయకష్టం చేసి..పంటలను కాపాడుకుని..ఇంటిని నెట్టుకొస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు శ్రీను హమాలీగా..రెండో కొడుకు నాగరాజు మెకానిక్గా పనిచేస్తున్నారు. కుమార్తె వెంకటలక్ష్మి భర్త చనిపోగా..ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రి వద్దనే ఉంటోంది. అందరికీ అభయంగా ఉంటూ..ఇటు వ్యవసాయం, అటు వంట మాష్టారుగా పనులు చేస్తూ..మంచి వ్యక్తిగా పేరొందిన చెక్కల మల్లయ్య ఇలా మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకురాలు బేబి స్వర్ణ కుమారి, సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు శీలం వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మైశా శంకర్, వార్డు సభ్యురాలు గడ్డం చంద్రకళ, దేవస్థానం చైర్మన్ బాజా నాగేశ్వరరావు, వంట మాష్టార్ల సంఘం నాయకులు చట్టు ధనమూర్తి, సాలయ్య, పెద్ధరాజు నర్సయ్య తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. -
పెళ్లింట విషాదం
ఇంట్లో పెళ్లి ఉందని బంధువులందరికీ చెప్పారు.. పెళ్లి పత్రికలు పంచారు.. బంధువులంతా పెళ్లి కొడుకు ఇంటికి చేరుకున్నారు.. మరీ కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అందరు బంధువులూ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే విధి కన్నెర్ర చేసింది. పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటివరకు సంబరంగా ఉన్న వారంతా దుఖంలో మునిగిపోయారు. కన్న కొడుకు పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కాటికిపయనమయ్యాడు. గుండెపోటుతో తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నిండింది. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు పెళ్లికొడుకు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది. సిరికొండ(బోథ్): సిరికొండ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సట్ల రాజన్న(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. రాజన్నకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. పెద్ద కొడుకు, కూతురు పెళ్లిళ్లు గతంలోనే కాగా చిన్న కొడుకు పోశెట్టి పెళ్లి ఉట్నూర్ మండలం టేకుగూడ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం 12 గంటలకు వధువు ఇంటి వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. మగపెళ్లివారు బయల్దేరడానికి సిద్ధమవుతుండగానే పెళ్లి కొడుకు తండ్రి రాజన్నకు గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు సంబరంగా ఉన్న ఆ ఇంట్లో రోదనలు ఆకాశాన్నంటాయి. ఇంటి పెద్ద మరణంతో పెళ్లిని వాయిదా వేశారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
సంగీత దర్శకుడికి గుండెపోటు
బెంగళూరు : ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖకు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఓ కన్నడ చానల్కు సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరణ చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హంసలేఖను సాగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లింట్లో విషాదం
ములుగురూరల్: పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంఘటన మండలంలోని పత్తిపల్లి పంచాయతీ పరిధి చింతలపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపెల్లి సాంబయ్య(55), రాజమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలకు గతంలో వివాహం జరిగింది. నాల్గో కుమార్తె జ్యోతికి శనివారం వివాహం జరిగింది. శుభాకార్యం ముగిసిన అనంతరం వధూవరులను అత్తారింటికి సాగనంపారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సాంబయ్యకు సుమారు 2 గంటల ప్రాంతంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన రోదనలు మిన్నంటాయి. ఆదివారం అబ్బాయి ఇంట్లో రిసెప్షన్కు ఏర్పాట్లు కావడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చింతలపల్లితో పాటు అబ్బాయి గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. -
అపోలో ప్రతాప్ రెడ్డికి గుండెపోటు
సాక్షి, చెన్నై: అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చింది. ఆయనకు చెన్నై థౌజండ్ లైట్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాం పేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో రాత్రంతా చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్ చికిత్స అనంతరం బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షిస్తున్నారు. -
ఒక్కసారి లేవండి...పిల్లల్ని చూడండి
కారంపూడి: ఆజీ.. ఏక్ బార్ దేఖో జీ... హుటో జీ.. బచ్చీ ఆయే...అంటూ గుండెపోటుతో విధి నిర్వహణలో బుధవారం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సయ్యద్ తాజ్బాబు భార్య కైరున్ శోకమిది. ఒక్కసారి లేవండి... ఒక్క సారి చూడండి.. పిల్లల్ని చూడండి అంటూ ఆమె రోదన హృదయాన్ని పిండేసింది. ఎలాంటి అలవాట్లు లేవయ్యా...నిన్న విజయవాడ వెళ్లినప్పుడు ఫోన్ చేశా...ట్రాఫిక్లో ఉన్నాను, మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు. తర్వాత చేశారు. రాత్రి ఇంటికి వచ్చి, మళ్లీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లాడు. ఇంతలోనే చావు కబురు వచ్చిందని విలపించింది. కుమార్తెలు షమీనా, షారీనా, అమీనాలు కూడా తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు కలచివేస్తోంది. డ్రైవింగ్ చేస్తుండగానే గుండెపోటు పిడుగురాళ్ల నుంచి కారంపూడి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సయ్యద్ తాజ్బాబుకు మార్గం మధ్యలో జూలకల్లు గ్రామం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే వాలిపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును చెట్టును ఢీకొంది. డ్రైవర్ తాజ్బాబు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల్లో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆర్డీవో పరామర్శ కారంపూడిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని గురజాల ఆర్డీవో మురళి పరామర్శించారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ హనుమంతరావు, ఎస్ఐ మురళీలు, ఆర్టీసీ అధికారులు, సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. తాజ్బాబు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గురజాల తరలించారు. నోటి భాగంలో తీవ్ర గాయం కావడంతో కారంపూడి తహసీల్దార్ గుంటూరు ఆసుపత్రిలో చేరారు. ఆర్టీసీ ఎస్టీవో నర్సరావుపేటలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్లే పెను ప్రమాదం తప్పింది గుండెపోటు వచ్చినప్పుడు బ్రేక్ వేద్దామన్నా సాధ్యం కాదని, డ్రైవర్ సమయస్ఫూర్తితో స్టీరింగ్ తిప్పబట్టి చెట్టుకు ఢీకొని బస్సు ఆగిందని డీఎస్పీ ప్రసాద్ అన్నారు. డ్రైవర్ తాను చనిపోతూ బస్సులో ఉన్న 22 మందికి ప్రాణాపాయం లేకుండా చేశారని, లేకపోతే ముందే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు. గాయపడిన వారి వివరాలు కారంపూడి తహసీల్దార్ సాయిప్రసాద్, ఆర్టీసీ బస్సు కండక్టర్ రాంబాబు, కారంపూడి ఏఎన్ఎం రమాదేవి, పిడుగురాళ్లకు చెందిన కార్మికులు వెంకటేశ్వర్లు, శ్రీను, యాకోబు, సునీల్, యర్రెయ్య, చిన్నమ్మ, సీతమ్మ మరో ఇద్దరు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
ఆశలతో కువైట్ వెళ్లి.. అశువులు బాసి జన్మభూమికి
పాలకోడేరు: ఎన్నెన్నో ఆశలతో సముద్రాలు దాటి వెళ్లిన అతను విగత జీవిగా మారి ఇంటికి చేరుకున్నాడు. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గొరగనమూడి గ్రామానికి చెందిన కొచ్చెర్ల గణేశ్వరరావు (48) పొట్టకూటి కోసం నాలుగు నెలల క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లాడు. అక్కడ కష్టపడి సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత ఇంటికి పంపిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో మృత్యువు అశనిపాతంలా తాకింది. ఈనెల 9వ తేది రాత్రి అతను గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం గొరగనమూడి చేరుకుంది. మృతదేహాన్ని చూసి మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతునికి భార్య నళిని, పాప ఉంది. సర్పంచ్చెల్లబోయిన పాపారావు, ఎంపీటీసీ సభ్యుడు పంపన దామోదరం తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
పదో తరగతి విద్యార్థికి గుండెపోటు
రాజాం/సంతకవిటి/శ్రీకాకుళం: కొద్దిసేపట్లో పదో తరగతి పరీక్షను రాయాల్సిన విద్యార్థి గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన సంతకవిటి మండలం మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతకవిటి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన అదే గ్రామానికి చెందిన కె.పవన్కు మందరాడ కేంద్రాన్ని కేటాయించారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అతను గుండెపోటుతో పడిపోయాడు. అప్రమతమైన పరీక్షల డీవో గోపాలరావు సంతకవిటి పీహెచ్సీ వైద్యాధికారి గట్టి భార్గవికి సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వచ్చి పవన్ను పరిశీలించారు. గుండే సంబంధిత వ్యాధి ఉండడంతో విద్యార్థి అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ వాహనం ద్వారా రాజాంలో ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా పరీక్ష కేంద్రం ఆవరణలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోగా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంపై విద్యాశాఖాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ పరీక్ష కేంద్రమైన మందరాడ జిల్లా పరిషత్ హైస్కూల్ చీఫ్ సూపరింటెండెంట్పై చర్యల కోసం ఆర్జేడీకి నివేదించిన డీఈఓ తన పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. శుక్రవారం ఎవరెవరిపై చర్యలు తీసుకున్నారో వెల్లడించే అవకాశం ఉంది. -
మరణంలోనూ వీడని బంధం
విజయనగరం, గరివిడి: మరణంలోనూ ఆ దంపతులు వీడిపోలేదు. దాంపత్య జీవనంలో కష్టసుఖాల్లో ఒక్కటిగా మెలిగి జీవించిన వారు మరణంలోనూ ఒక్కటై చనిపోయారు. ఈ ఘటన తోండ్రంగిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే...తోండ్రంగి గ్రామానికి చెందిన గొంటి గంగరాజు(62) బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి వద్దే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గొంటి దాలమ్మ అ మధ్యాహ్నం నుంచి భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరై తీవ్ర మనస్తాపానికి గురై అపస్మారక స్థితిలో వెళ్లింది. గ్రామస్తులు గంగరాజు మృతదేహానికి దహన సంస్కారావు పూర్తి చేసుకొని రాగా దాలమ్మ(53) అపస్మారక స్థితి నుంచి బయటకొచ్చి ఏడవడం మొదలు పెట్టింది. ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా ఏడుస్తూనే బుధవారం రాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచింది. దాలమ్మ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తోంది. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ముగ్గురికి వివాహమైంది. 12 గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది. -
ఇదేనా శవ మర్యాద?
అన్నవరం (ప్రత్తిపాడు): అనాథ శవానికైనా నలుగురు ఖర్చులు భరించి అంత్యక్రియలు చేసే సంస్కృతి మనది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సత్యదేవుని ఆలయానికి భక్తులను తీసుకువచ్చిన ఓ టూరిస్ట్ బస్ డ్రైవర్ గుండెనొప్పితో చనిపోతే ఆ శవాన్ని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రిలో ఆరుబయట ఎండలో పడేశారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆ మృతదేహం ఎండకు ఎండుతూ ఉంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఇదేమి అన్యాయం? అని ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఆ శవాన్ని నీడకు తరలించారు. కొంత సేపటికి, మృతిచెందిన డైవర్ తరఫువారు అంబులెన్స్లో ఆ డ్రైవర్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండకు తీసుకువెళ్లారు. దేవస్థానం శానిటరీ, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా నందవరం మండలం కనికివేడు పాడు, ఎమ్మిగనూర్ మండలానికి చెందిన 90 మంది భక్తులు రెండు టూరిస్ట్ బస్సులలో కాశీ తీర్థయాత్రకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. వీరందరూ రాత్రి బస్సులతో నిద్రించారు. అయితే ఏపీ02 టీబీ 9799 బస్ డ్రైవర్ జి.కృష్ణ (60) మాత్రం ఆరుబయట నిద్రించాడు. తెల్లవార జాము ఐదు గంటలకు అందరూ లేచి స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా డ్రైవర్ మాత్రం లేవలేదు. కొందరు అతడిని లేపడానికి ప్రయత్నించగా చలనం లేకపోవడం, నోటినుంచి, మెడ నుంచి రక్తం వస్తుండడం గమనించి మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేసి వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ, ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఒక వ్యాన్లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రి లోపలకు తీసుకురావద్దని, బయట ఉంచాలని ఆసుపత్రి నర్స్, అటెండర్ చెప్పడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీస్థలంలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే తమను అడగలేదని, వ్యాన్లో మొక్కలు తెచ్చారేమో అని అనుకుని దూరంగా దింపమని చెప్పానని నర్స్ సరోజినీ తెలిపారు. ఏమైందో తెలియదు కాని ఆ మృతదేహం మ«ధ్యాçహ్నం 12.30 గంటల వరకు అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీడలోకి ఆ శవాన్ని మార్చారు. కొంతసేపటికి మృతి చెందిన డ్రైవర్ తాలుకు వారు వచ్చి అంబులెన్స్లో ఆ శవాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లా : డాక్టర్ రామారావు ‘‘నేను ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటప్పటికే ఆ శవం అక్కడ ఉంది. అలా బయట ఉండకూడదని చెప్పి నేను, ఫార్మసీ సూపర్వైజర్ మా«ధవి కలసి దేవస్థానం అధికారులకు, ఈఓ పేషీకి ఫోన్ చేసి చెప్పాం. తరువాత ఈఓను కొండమీద కలిసి వివరించాం. ఈఓ కూడా వెంటనే ఆ డ్రైవర్ స్వగ్రామానికి దేవస్థానం ఖర్చుతో ఆ శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అదే విషయం శవాన్ని తీసుకువచ్చిన వారికి చెప్పగా పోలీస్ క్లియరెన్స్ వచ్చాక తీసుకుపోతామని చెప్పారు.’’ అని డాక్టర్ రామారావు ‘సాక్షి’కివివరించారు. -
ఒత్తిడితో విలవిల
సాక్షి, విశాఖపట్నం: విశ్రాంతి ఇవ్వకుండా మన చేత ఇలా డ్యూటీలు మీద డ్యూటీలు చేయిస్తున్నంత కాలం మనకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఒత్తిడి తట్టుకోలేక ఎవరో ఒకరూ ఇలాగే ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఇంకెప్పుడు మారుతుందో? ఆఫీసర్స్ అందరికి శతకోటి వందనాలు.. చావగొడుతున్నారు.. తిండి తిప్పల్లేవు.. కంటిమీద కునుకు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది తమ సహచర ఉద్యోగులకు పెడుతున్న మెసేజ్లు ఇవి. ఎంత ఒత్తిడితో పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారో ఈ మెసేజ్లు చూస్తే అర్థమవుతోంది. ఏపీఐఐసీ ప్రాంగణంలో జరుగుతున్న మూడ్రోజుల భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ అధికారులు.. సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సదస్సు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న చేపల రాజు (39) అనే హోంగార్డు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. లక్ష్మిటాకీస్ దరి చిలకపేటకు చెందిన ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఏఆర్ కానిస్టేబుల్ సన్యాసిరావు(పీసీ నెం.531) ఒత్తిడి తట్టుకోలేక ఫిట్స్ రావడంతో రక్తం కక్కుకుంటూ కూలబడిపోయాడు. అతడిని హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. అతను కూడా గుండెపోటుకు గురైనట్టుగానే చెబుతున్నారు. పరిస్థితి విçషమంగా ఉందని కేజీహెచ్ వైద్యులు వెల్ల డించారు. ఈయన హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరే కాదు.. రెవెన్యూ శాఖలో కూడా ఓ డెప్యుటీ తహసీల్దార్తో సహా ముగ్గురు సిబ్బంది హైబీపీతో ఆస్పత్రి పాలైనట్టుగా తెలియవచ్చింది. గతంలో కూడా ఇదే రీతిలో పార్లమెంటరీ స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో స్టీల్ ప్లాంట్ భూసేకరణ విభాగం స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ నోవొటల్ వద్ద వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్న సమయంలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఓవైపు భూకబ్జాలు.. రికార్డుల టాంపరింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సిట్ సిఫార్సులు, కేసులు నివేదికలతో రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరో వైపు వరుసగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలతో క్షణం తీరికలేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. భాగస్వామ్య సదస్సు ప్రాంగణం వద్దే హోంగార్డు గుండెపోటుతో మరణించడం.. మరో కానిస్టేబుల్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా.. సీఎంతో సహా కేబినెట్ మొత్తం ఇక్కడే ఉన్నా వారిలో చలనం లేకపోవడం దురదృష్టకరం. కనీసం చనిపోయిన కానిస్టేబుల్ ఇంటికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ పరామర్శించేందుకు వెళ్లిన పాపానపోలేదు. దీంతో ఇంకెంతకాలం ఒత్తిడిలో పనిచేయాలంటూ పోలీస్, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా రేయింబవళ్లు భార్య, బిడ్డలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనీస గుర్తింపు కూడా లేదని వాపోతున్నారు. సదస్సు ప్రాంగణంలోనే రక్తం కక్కుకుంటూ కుప్పకూలిన ఏఆర్ కానిస్టేబుల్ -
బిల్లు చూస్తే గుండె దడ
కర్నూలు నగరంలోనిఓ ఫంక్షన్ హాలుకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం గుండెనొప్పి రావడంతో నగరంలో కొత్తగా ఏర్పాటైన ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతన్ని 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుకుని రూ.33 లక్షల బిల్లు వేశారు. ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఆ బిల్లు కట్టి బతుకు జీవుడా అంటూ సదరు వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. కర్నూలు నగరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రాము బీపీ చెక్ చేయించుకోవడానికి తన సామాజిక వర్గానికే చెందిన వైద్యుడు నిర్మించిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి అక్కడ ఈసీజీ, 2డీ ఎకోతో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు. రూ.10వేలు బిల్లు వేశారు. అలాగే రెండు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఆపరేషన్ చేసి స్టెంట్లు వేయాలని చెప్పారు. దీంతో బెదిరిపోయిన అతను బెడ్పై నుంచే ఇంటికి ఫోన్ చేసి రూ.4లక్షలు తెప్పించుకుని స్టెంట్లు వేయించుకున్నాడు. కర్నూలు(హాస్పిటల్): ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఛాతి నొప్పి అంటూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి స్టెంట్ వేయాలని, రూ.2లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పగా, క్లెయిమ్ మొత్తంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే నాణ్యత లేని స్టెంట్ వేయాల్సి ఉంటుందని బెదిరించారు. ఎడతెరిపిలేని దగ్గు అయితే టీబీ కావచ్చనే తరహాలో ఛాతిలో నొప్పి ఉంటే అది గుండెనొప్పికి దారితీయొచ్చంటూ రోగులను కొందరు వైద్యులు బెంబేలెత్తిస్తున్నారు. అవసరం లేకపోయినా ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలూ చేస్తున్నారు. ఈ పరీక్షలపై అవగాహన లేని వారికి కాస్త తేడా కన్పిస్తోందని, స్టెంట్ వేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు కర్నూలు నగరంలో నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు లేవని బాధపడేవారు. ఇప్పుడు నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు వచ్చినా, లేనిపోనివి చెప్పి ఎక్కడ బిల్లుతో బాదుతారోనని జనం బెదిరిపోతున్నారు. అవసరం లేకపోయినా పలు పరీక్షలు చేయించి..బిల్లుల మోత మోగిస్తుండటంతో అప్పులు చేసి మరీ చెల్లించాల్సి వస్తోంది. గతంలో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రమే యాంజియోగ్రామ్లు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఐదారు ఆసుపత్రుల్లో కేథలాబ్లు ఏర్పాటు చేశారు. నాలుగు ఆసుపత్రుల్లో గుండె శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు. కర్నూలుతో పాటు వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, తెలంగాణలోని గద్వాల, అలంపూర్, మహబూబ్నగర్, బళ్లారి ప్రాంతాలకు చెందిన హృద్రోగులు చికిత్స కోసం కర్నూలు వస్తున్నారు. హైదరాబాద్తో పోలిస్తే గుండె చికిత్సలు ఇక్కడ కాస్త తక్కువైనా పోటీ ఎక్కువ కావడం, పెట్టుబడులు, నిర్వహణఖర్చులు పెరిగిపోవడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనైతిక వైద్యానికి తెరతీశాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల వైపు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. డామిట్ ‘స్టెంట్’ కథ అడ్డం తిరిగింది! స్టెంట్ల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను గణనీయంగా తగ్గించేసింది. ఒక్కో స్టెంట్ ధర రూ.30,180లుగా నిర్ణయించింది. కానీ తెలివిమీరిన కొందరు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు స్టెంట్ల ధరలు తగ్గించి, హ్యాండ్లింగ్ చార్జీలు(నిర్వహణ ఖర్చులు) మాత్రం పెంచేశారు. ఈ కారణంగా ఒక స్టెంట్ వేయించుకుంటే ఎప్పటిలాగే రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతోంది. ఫీజుల వివరాలు జాడలేదు ప్రతి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రజలందరికీ కనిపించేలా ఫీజుల వివరాలు ప్రదర్శించాలి. ఆసుపత్రిలోకి ప్రవేశించగానే రిసెప్షన్ కౌంటర్ వద్ద గానీ, అందరికీ కనిపించే విధంగా గానీ ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో ఏయే చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారు.. ల్యాబ్ పరీక్షా ఫీజుల వివరాలను సైతం ఇందులో ప్రదర్శించాలి. కర్నూలు నగరంలో కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. అధికశాతం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వివరాలు మచ్చుకైనా కనిపించవు. ఈ విషయమై ప్రశ్నించే అధికారం, దమ్ము జిల్లా అధికారులకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాడ్మింటన్ ఆడుతూ కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకు గురై యువకుడు మృతిచెందిన ఘటన ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ముదిన వెంకటాచారి (38) లింగపాలెం మండలం రంగాపురంలో విద్యుత్శాఖ ఆర్సీ (బిల్లు కలెక్టర్)గా పనిచేస్తున్నారు. షటిల్పై ఆసక్తితో స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి సత్తెన్నగూడెంలో జరుగుతున్న టోర్నమెంట్కు వెళ్లారు. అక్కడ షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై సేదతీరుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. సహచరులు హుటాహుటిన ద్వారకాతిరుమలలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులులు ఉన్నారు. చారీ గతంలో ప్రముఖ దినపత్రికలో కొంతకాలం విలేకరిగా పనిచేశారు. -
దొంగల్ని చూసి భర్త గుండె ఆగిందని..
చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లెలో శనివారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందా డు. డీఎస్పీ చిదానందరెడ్డి, టూటౌన్ సీఐ సురేష్కుమార్, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తం బళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయతీ తిమ్మయ్యగారిపల్లెకు చెందిన నరసింహులు, నరసమ్మ కుమారుడు రామ్నాథ్ (30) వికలాంగుడు. ఇతనికి రాజంపేట, గరుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెం దిన ఏఎన్ఎం లక్ష్మీతో వివాహమైంది. వీరు మదనపల్లె పట్టణం గొల్లపల్లెమిట్టలోని విజయనగర కాలనీలోని సొంత ఇంటిలో ఉంటున్నారు. రామ్నాథ్ మల్లికార్జున సర్కిల్లో ఉంటున్న ఓ ఇంజినీర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతను శనివారం వేకువజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి భార్యను విచారించారు. దొంగలను చూసి.. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన భర్త బాత్ రూమ్కు వెళ్లేందుకు తలుపు తీశారని, ఆ సమయంలో ఐదుగురు ముసుగు దొంగలు ఇంటిలోకి చొరబడ్డారని భార్య లక్ష్మి తెలిపింది. వారిని చూసి తన భర్త గుండె ఆగి చనిపోయాడని పేర్కొంది.తనను చంపుతామని బెదిరించడంతో మిన్నకుండిపోవాల్సి వచ్చిందని తెలిపింది. దొంగలు బీరువా తెరిచి రూ.5 వేల నగదు, భర్త మెడలోని బంగారు చైను, తన మెడలోని మరో బంగారు చైను అపహరించారని వివరించింది. అక్కడి పరిస్థితులను బట్టి ఇది పతకం ప్రకారం జరిగిన హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తెల్లవారే సమయంలో దొంగలు ఇంటిలోకి చొరబడే ప్రసక్తే ఉండదని, అందులోనూ పేదలు ఎక్కువగా ఉంటున్న ఏరియా కావడంతో దొంగలు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే మృతుడి గొంతుపై కమిలిన గాయాలు ఉన్నాయని పేర్కొ న్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లొ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత రామ్నాథ్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు(క్రైమ్): గుండెపోటుకు గురై జీజిహెచ్లో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. రాపూరు మండలం గండురుపల్లికి చెందిన ఎం. శ్రీహరి (40) గూడూరురూరల్, కలువాయి పోలీసుస్టేషన్ల పరిధిలో మోటార్ల దొంగతనాల కేసుల్లో నిందితుడు. ఈ కేసుల్లో గతేడాది నవంబర్ 7వ తేదీ నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో రిమాం డ్ అనుభవిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం శ్రీహరికి విపరీతమైన కడుపునొప్పి, గుండెనొప్పి వచ్చింది. దీంతో జైలు అధికారులు అతన్ని చికిత్స నిమి త్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జైలర్ ఎ.కాంతరాజు రిమాండ్ ఖైదీ మృతి ఘటనపై ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్సై సీహెచ్ కొండయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీజీహెచ్లో ఆదివారం మృతదేహానికి ఆర్డీఓ హరిత సమక్షంలో శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సీఎం పర్యటనలో టీవీ కెమెరామెన్కు గుండె పోటు
బొబ్బిలి: సీఎం పర్యటనలో భాగంగా పట్టణంలో హెలీపాడ్ నుంచి వస్తున్న విలేకర్ల బృందంలోని ఓ టీవీ కెమెరామెన్ సూర్యప్రకాష్కు శుక్రవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విలేకర్లు కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ను ఇవ్వమని కోరగా సీఎం కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ ఇవ్వకూడదని, బాడంగి లేదా బొబ్బిలి ఆసుపత్రులకు ఫోను చేస్తే అంబులెన్స్ వస్తుందని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉత్పన్నమయింది. అయితే అక్కడి నుంచి డీసీహెచ్ఎస్ ఉషశ్రీ చర్యలు తీసుకోవడంతో ప్రైవేటు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగలిగారు. బొబ్బిలి ఆసుపత్రిలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలి ఆసుపత్రిలో ఫిజిషియన్ లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేదు. దీంతో కెమెరామెన్ను కాపాడుకునేందుకు పలు అవస్థలు పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని సహచర మీడియా ప్రతినిధులు తెలిపారు. సీఎం కాన్వాయ్లో రెండు, సభ దగ్గర కొన్ని అంబులెన్స్లు ఉన్నా గుండెపోటు వచ్చిన వారికి మాత్రం అంబులెన్స్లు ఇవ్వని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
గుండెనొప్పొస్తే.. గుంటూరుకే!
నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగరంలో అతిపెద్ద ప్రభుత్వాస్పత్రి అది. రోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయినా ఏం లాభం? గుండెనొప్పి వస్తే గుంటూరు ఆస్పత్రికి వెళ్లమని ఇక్కడి డాక్టర్లు ఉచిత సలహా ఇస్తారు. కార్డియాలజీ విభా గంలో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 45ఏళ్ల మహిళకు గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారికి వైద్యం అందకపోగా, ఈసీజీలో తేడా ఉంది. గుంటూరు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్లో గుంటూరు తీసుకెళ్లారు. ఆటోనగర్లో ఉండగా లారీడ్రైవర్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అతనికి ఈసీజీ తీసి గుండెనొప్పి అని తేల్చారు. గుంటూరు తీసుకెళ్లాలని రిఫర్ చేయగా, చేసేది లేక నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. నవ్యాంధ్ర రాజధాని నగరంలో వెయ్యి పడకలకు పైగా ఉన్న పెద్దాస్పత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రి. జిల్లాలోని 45 లక్షల మంది జనాభాతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం నిత్యం ఇక్కడికి వస్తుంటారు. మెరుగైన వైద్యం అందుతుందని ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తే కనీస సౌకర్యాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో వచ్చిన వారిని గుంటూరు రిఫర్ చేస్తున్నారు. కార్డియాలజీ విభాగం ఉన్నా.. కనీస సౌకర్యాలు లేక పోవడంతో వైద్యులు ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితికి చేరారు. ఒక్కో సమయంలో కనీసం ఈసీజీ తీసేవారే ఉండటం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ప్రభుత్వాస్పత్రిలో మూడు దశాబ్దాలుగా కార్డియాలజీ విభాగం ఉంది. కానీ, కనీస సౌకర్యాలు మాత్రం లేవు. ఒక్క 2డీ ఎకో మిషన్ మినహా ఇతర పరికరాలేవీ అందుబాటులో లేవు. రెండు నెలల్లో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తామని వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య హామిఇచ్చి ఏడాదిన్నర గడిచింది. నేటికీ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఐదేళ్ల కిందట కొన్న ట్రెడ్మిల్ మూలనపడింది. దీంతో టీఎంటీ టెస్ట్చేసే అవకాశం లేకుండాపోయింది. కాగా, తొమ్మిది పడకలతో ఏర్పాటుచేసిన ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్లో, 17 పడకలతో ఏర్పాటుచేసిన కార్డియాలజీ వార్డులో సైతం సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. క్యాథ్ల్యాబ్ ఏర్పాటుచేయాలి గుండెజబ్బులకు గురైన వారికి చికిత్స చేసేందుకు క్యాథ్ల్యాబ్ పరికరం కీలకం. రక్తనాళాల్లో పూడికలను గుర్తించేందుకు, గుండె వాల్వుల పనితీరు తెలుసుకునేందుకు క్యాథ్ల్యాబ్లో యాంజియోగ్రామ్ నిర్వహిస్తుంటారు. అయితే, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో క్యాథ్ల్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. క్యాథ్ల్యాబ్ అందుబాటులోకి వస్తే యాంజియోగ్రామ్లు నిర్వహించడంతో పాటు స్టెంట్లు కూడా అమర్చే వీలుంటుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. డాక్టర్లు ఉన్నా లేనట్టే.. గుండెజబ్బులకు వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో కార్డియాలజిస్టులు ఎవరూ ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపట్లేదు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వచ్చిన యువ వైద్యులు సైతం సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. అత్యాధునిక పరికరాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తే వైద్యులు సైతం ఉత్సాహంగా పనిచేస్తారని, ఏమీ లేకుండా వైద్యులు ఉండీ ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు పలుమార్లు వినతిపత్రం సమర్పించారు. -
ఎస్ఐ శిక్షణ పొందుతున్న ఏఎస్ఐ మృతి..
కరీంనగర్: స్థానిక పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ)లో సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి కోసం శిక్షణ పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఏఎస్ఐ పి.వి.వి.ప్రసాద్(57) తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. అస్వస్థతకు గురైన ఆయనను అపోలో ఆసుపత్రికి తలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
పొలంలోనే ఆగిన రైతు గుండె
బుక్కపట్నం: పొలంలోకి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కొత్తచెరువు మండలం కేశాపురం రైతు సాంబశివ (63) కోపగానిపల్లి వద్ద గల పొలంలో పంట సాగు చేశాడు. శనివారం ఈ - క్రాప్ బుకింగ్ చేసుకునేందుకు పొలానికి వెళ్లి ఒక్కసారిగా గుండెపోటు రావటంతో కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వసంతకుమార్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం బుక్కపట్నంలో నివాసముంటున్నారు. -
విధి నిర్వహణలో డ్రైవర్కు గుండెపోటు
అనంతపురం న్యూసిటీ : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు నాగేంద్ర, ఖాన్ విజయవాడ డ్యూటీకి బుధవారం బయలుదేరారు. బస్సు బత్తలపల్లి సమీపానికి రాగానే టికెట్లు కొడుతున్న నాగేంద్రకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను తోటి డ్రైవర్ ఖాన్ హుటాహుటిన అనంతపురం బస్టాండ్కు తీసుకువచ్చారు. విషయాన్ని డ్యూటీలో ఉన్న రాయదుర్గం డిపో మేనేజర్ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన, అనంతపురం డీఎం బాలచంద్రప్ప కలసి వెంటనే నాగేంద్రను 108లో సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచాలంటూ సూచించారు. -
గుండెపోటు రైతు మృతి
పాణ్యం: వేలకువేలు పెట్టుబడి పెట్టి పండించిన మిరపకు ఆశించిన మేరకు ధర రాకపోవడంతో దిగాలుగా ఉన్న ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. మండల పరిధిలోని నెరవాడ గ్రామానికి చెందిన ఒడ్డు రామచంద్రారెడ్డి(58) నాలుగు ఎకరాల సొంత పొలంతోపాటు అదనంగా మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. ఎకరానికి 12-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతకు ముందు కిలో రూ. 80 వరకు ఉన్న ధర పది రోజుల క్రితం నాటికి రూ. 60కి పడిపోయింది. అరకొరగా వచ్చిన పంటను రెండు రోజుల క్రితం గంటూరు మార్కెట్కు తీసుకెళ్లగా ధర రాకపోవడంతో దిగుబడిని అక్కడే ఉంచి ఇంటికి వచ్చాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడుతున్న రైతు ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
గుండెపోటుతో రైతు మృతి
డోన్ టౌన్ : వైద్యంకోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ రైతు గుండెపోటు కారణంగా అక్కడే మరణించాడు. ఈ ఘటన డోన్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మండల పరి«ధిలోని గోసానిపల్లెకు చెందిన గొర్ల మద్దయ్య (48) సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యుని వద్దకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు వచ్చి పరీక్షించగా అప్పటికే ఆయన మరణించాడు. -
హైకోర్టులో తహశీల్దార్ మృతి
హైదరాబాద్సిటీ: అనంతపురం జిల్లా పెనుగొండ తహశీల్దార్ ఇంతియాజ్ మహ్మద్ హైకోర్టు ఆవరణలో కుప్పకూలి చనిపోయాడు. గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన ఇంతియాజ్ మంగళవారం గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హైకోర్టు సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు హైకోర్టు సిబ్బంది తెలిపారు. పోలీసులు ఇంతియాజ్ కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇంతియాజ్ మహ్మద్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో ట్రైనీ ఎస్సై మృతి
కరీంనగర్: పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏఆర్ ఎస్సై గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అంబర్పేట్ సీపీఎల్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న యాదగిరిరావు ప్రమోషన్ పొంది ఏఆర్ ఎస్సైగా కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం శిక్షణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సహచరులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో సాక్షి విలేకరి మృతి
నిర్మల్ : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుకు గురై సాక్షి దినపత్రిక విలేకరి మృతి చెందాడు. జిల్లాలోని కడెం విలేకరిగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందాడు. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
మంగళగిరి బస్టాండ్లో ఘటన మంగళగిరి: గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో గురువారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన భీమిరెడ్డి ప్రభాకర్రెడ్డి(54) మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చే బస్సులో విధులు నిర్వహిస్తూ మంగళగిరి డిపోకు బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నాడు. అనంతరం కౌంటర్లో నగదు చెల్లించేందుకు వెళ్తూ ఆకస్మాత్తుగా బస్టాండ్లో కింద పడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు ప్రభాకర్రెడ్డిని లేపేందుకు ప్రయత్నించి అంబులెన్స్కు ఫోన్ చేయగా అంబులెన్స్లో వచ్చిన సిబ్బంది చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభాకర్రెడ్డి మృతి పట్ల ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు సంతాపం తెలిపారు. -
ఆయుష్షు పోయింది
► గుండె జబ్బుతో మృతి చెందిన చిరుద్యోగి ► చికిత్సకెళ్లి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఘటన ► ప్రతి క్షణం మానసిక వేదన అనుభవించిన తీరు ► ఐదు నెలలుగా ‘ఆయుష్’లో జీతాల్లేని వైనం ► ఉద్యోగులను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు పెద్దపెద్ద సార్లు ఒక నెల జీతం ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. అలాంటిది ఐదు నెలలుగా వేతనాల్లేవు.. పైగా ఉద్యోగ భద్రత లేదు. దానికి అనారోగ్యమూ తోడైంది. నిత్యం ఆర్థిక ఇబ్బందులు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా ఉన్న ఆమె మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఇదే సమయంలో గుండెజబ్బు రావడంతో ఆపరేషన్ కోసం బంధువులు సాయం చేశారు. ఆ తర్వాత మందులు, ఇతరత్రా వాటికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎలాగోలా అప్పు చేసి చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లిన ఆమె.. స్వగ్రామానికి తిరిగొస్తుండగా మార్గంమధ్యలో మృత్యు ఒడికి చేరింది. ఆమె మరణం చెబుతున్న గుణ‘పాఠం’ ఒక్కటే. జీతంతో ముడిపడిన నిరుపేద జీవితాలకు నెలనెలా సక్రమంగా వేతనాలివ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవకుంటే ఉద్యోగుల ‘ఆయుష్షు’ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆత్మకూరు మండలం పి.యాలేరుకు చెందిన నిర్మలది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రజినమ్మ, తిప్పారెడ్డి దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె సంపాదనతోనే కుటుంబం గడపాల్సిన దుస్థితి. పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వృద్ధాప్యంలోని అమ్మానాన్నకు దిక్కెవరని భావించిన నిర్మల పెళ్లి కూడా చేసుకోలేదు. ఇల్లరికం కోసం అడిగితే వీరి పేదరికాన్ని చూసి ఎవరూ ముందుకు రాలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో ఏడేళ్ల క్రితం ఎస్ఎన్ఓ(స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ)గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం రావడంతో ఇక జీవితానికి ఢోకా ఉండదని భావించింది. కుందుర్పి ప్రభుత్వ హోమియో వైద్యశాలలో పని చేస్తుండేది. ఉద్యోగం వచ్చిన మాటే గానీ.. ఉద్యోగం వచ్చిందన్న మాటే గానీ సకాలంలో వేతనాలు అందక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఏటా ఉద్యోగానికి రెన్యూవల్ కష్టాలు వెంటాడేది. ఇదే సమయంలో తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేకపోయింది. అయినా కష్టాలను దిగమింగి ఉన్న కాడికి చూపించేది. ఈ క్రమంలో నిర్మల కూడా అనారోగ్యం పాలైంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడంతో గుండెజబ్బు వచ్చింది. దాతల ఔదార్యంతో... ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బంధువులు, తెలిసిన వాళ్లు సాయం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. రెండ్రోజుల కిందట ఆరోగ్యం బాగాలేక, బస్సులో వెళ్లే పరిస్థితి లేకపోయింది. బంధువులతో కలసి హైదరాబాద్కు ఓ ప్రైవేట్ వాహనంలో వెళ్లింది. ఈ సమయంలో అక్కడ వీరు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. వాహనం దెబ్బతింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో శుక్రవారం రాత్రి మరో వాహనంలో తిరుగుపయనమైంది. శనివారం తెల్లవారుజామున పంపనూరు వద్దకు రాగానే నీళ్లు కావాలని అడగ్గా, తోడుగా ఉన్న మేనత్త వాహనం ఆపి నీళ్లిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే నిర్మల కన్నుమూసింది. కొన్నాళ్లూగా మానసిక ఒత్తిడికి గురవడంతోనే జబ్బు చేసిందని, ఈ క్రమంలోనే ఇంతటి ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా కూడా సుమారు రూ.1.20 లక్షల వరకు అప్పు చేసిందని, దాన్ని ఎలా తీర్చాలి, తల్లిదండ్రులను ఎలా పోషించాలని తరచూ ఆలోచించేదని తెలిపారు. నిర్మల(41) మృతి విషయం తెలియగానే ‘ఆయుష్’ సబ్ కంట్రోలింగ్ ఆఫీసర్ పాటిల్ ప్రభాకర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు మహేశ్, జాయింట్ సెక్రటరీ సునీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రషీద్ తదితరులు పి.యాలేరుకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. భరోసా లేని జీవితాలు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరికైనా కొండంత ధైర్యం వస్తుంది. కానీ ‘ఆయుష్’ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇందుకు బిన్నం. కొన్నాళ్లుగా ‘ఆయుష్’లో జరుగుతున్న పరిణామాలతో ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో భవిష్యత్ను తలచుకుని కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో వారికి భరోసా ఇచ్చే వారే కరువయ్యారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) కింద 2008లో మొదటి విడత కింద 22 ఆయుష్ డిస్పెన్సరీలు, 2009లో రెండో విడత కింద 21 డిస్పెన్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలున్నాయి. ఇవన్నీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే నడుస్తున్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ పోస్టులు ఉంటాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద ఉన్న వైద్యశాలల్లో 125 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. గతంలో ఏడాదికి ఒకసారి రెన్యూవల్ జరిగేది. అయితే కొన్ని నెలలుగా మూడు నెలలకు ఒకసారి మాత్రమే రెన్యూవల్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి గడువు ముగిసినా రెన్యూవల్ కాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ వరకు రెన్యూవల్ చేశారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులు రెన్యూవల్కు నోచుకోలేదు. ఐదు నెలలుగా వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం, కనీసం జీతం కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలపై గత నెల 27న అనంతపురంలోని రెండో రోడ్డులో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రి వద్ద యూనియన్ నాయకులతో పాటు ఉద్యోగులు ధర్నా చేశారు. అయినా చలనం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
విధి నిర్వహణలో గుండెపోటు వచ్చి..
ఆర్మీ హవల్దార్ చిరంజీవి మృతి సైనిక లాంఛనాలతో ఖాజీపేటలో అంత్యక్రియలు తెనాలి టౌన్: రూరల్ మండలం ఖాజీపేటకు చెందిన ఆర్మీ హవల్దార్ పోలిశెట్టి చిరంజీవి(31) విధి నిర్వహణలో గుండెపోటుతో ఈ నెల 17న మృతి చెందారు. అగర్తల సమీపంలోని డిజాంగ్ బెటాలియన్లో చిరంజీవి హవల్దార్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైనా బోర్డర్లో పనిచేస్తుండగా ఈ నెల 17న గుండెపోటు రావడంతో తోటి సైనికులు వైద్యశాలకు తీసుకు వెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాంబశివరావు, వెంకటరమణ దంపతులకు చిరంజీవి రెండో కుమారుడు. 2002 ఏప్రిల్లో ఆర్మీలో చిరంజీవి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా తెలియజేశారని, అక్కడి నుంచి మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు శుక్రవారం రాత్రి 11గంటలకు తీసుకురాగా, అక్కడి నుంచి వాహనం ద్వారా ఇక్కడికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. హవల్దార్ చిరంజీవి మృతదేహాన్ని ట్రాక్టర్పై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అంత్యక్రియలను శనివారం ఉదయం సైనిక లాంఛనాలతో జరిపారు. చిరంజీవి మృతదేహం వద్ద భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు. -
గుండె పోటుతో రైతు మృతి
అనంతపురం రూరల్: చియ్యేడు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య(46) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు. తనకున్న 3 ఎకరాల పొలంలో రూ.5 లక్షల మేర అప్పులు చేసి 10కి పైగా బోర్లు తవ్వించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు రుణదాతల నుంచి వత్తిడి పెరగడంతో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ హోంగార్డు మృతి
విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు అనే హోంగార్డు పుష్కర విధుల నిమిత్తం ఈ నెల 7వ తేదీన విజయవాడకు వచ్చాడు. 11 వ తేదీ అర్థరాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి హోంగార్డులు ఆయన్ను సమీప ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అనంతరం వెంకటేశ్వరరావును విశాఖ కేజీహెచ్కు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. హోంగార్డు కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.25 వేలు సాయం అందించారు. దీనిపై కనీసం ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ స్పందించడంలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే వెంకటేశ్వరరావు బ్రతికుండేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. -
నటుడు శరత్కుమార్కు అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, అఖిల భారత సమత్తువ కచ్చి నేత శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు తీవ్రంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబు సభ్యులు ఆయన్ని థౌజండ్ లైట్స్ సమీపంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు. అనంతరం శరత్కుమార్ సాయంత్రమే ఇంటికి వెళ్లిపోయినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు. ఇటీవల శరత్ కుమార్ రాజకీయ పరంగానూ, వ్యక్తిగతంగానూ తీవ్ర అశాంతికి గురయ్యారని సమాచారం. ఆ మధ్య జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయన నటనకు దూరంగా ఉంటూ వచ్చారు.అదే విధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పాలైయ్యారు. ఇటీవల విహారయాత్రకు విదేశాలు వెళ్లిన శరత్కుమార్ గత వారం చెన్నై నగరానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ కన్నడ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు కూడా.