Indira Gandhi
-
అత్యవసరంగా నేర్చుకోవాల్సింది!
రాజకీయ నాయకుడి సత్తా ఏమిటో గుర్తించాలంటే వాళ్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. పార్టీ, కుటుంబం, లేదా వ్యక్తిగతమైన తప్పులను ఒప్పుకొంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇది మరీ ముఖ్యమవుతుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ... ఆ మాటకొస్తే ఆయన కుటుంబం, నాయనమ్మ కూడా బలహీనులనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికవేత్త కౌశిక్ బసు ఎమర్జెన్సీ గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేశారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ‘పొర బాటు’గా అభివర్ణించారనీ, ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ దేశంలోని వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదనీ’’ రాహుల్ వివరించారు. రెండు విషయాల్లోనూ రాహుల్ తప్పే చెప్పారు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సుమారు లక్ష మందిని అరెస్ట్ చేసింది. పత్రికలపై నిషేధాజ్ఞలు విధించారు. న్యాయ, అధికార వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చేశారు. అçప్పుడు ఆయనకు ఐదేళ్లు అయినప్పటికీ, రాహుల్ గాంధీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి!వ్యూహాత్మక సమర్థనలుఅత్యవసర పరిస్థితిని ‘పొరబాటు’ అని ఇందిరా గాంధీ అన్నారనడం కూడా అబద్ధమే. ఆమె స్వయంగా దానికి బాధ్యత వహించారు. అందులో సందేహం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్ని కల్లో ఘోరంగా ఓడిపోయారు. కానీ దాన్ని ‘పొరబాటు’ అన్నారనడం అవాస్తవం. ఎమర్జెన్సీ అకృత్యాలను సమర్థించుకునేందుకు ఇందిర రకరకాల ఎత్తులు పన్నారు. ఆమె మాటల్లో దానిపట్ల సమర్థింపే కనిపించేది. ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాల్లో ఒకటి, అవసరానికి మించి జరిగిన ఘటనను అంగీకరించడం. 1978 జూలైలో మేరీ కరాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పత్రికలను అణచివేయడం మరీ గట్టి చర్య’’ అని వ్యాఖ్యానించారు. ఇంకోలా చెప్పాలంటే, కట్టడి చేసేందుకు ఇంకొంచెం తేలికైన పద్ధతి ఉంటే బాగుండేదని అర్థం.అంతేతప్ప, పత్రికలను నియంత్రించడం పొరబాటైతే కాదు.ఇంకో వ్యూహం ఉంది. ఇతరులు తప్పులు చేశారు... నేను మాత్రం వాటికి బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడం. 1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక ఇందిరా గాంధీ యవ త్మాల్ (మహారాష్ట్ర)లో ఇచ్చిన ఒక ప్రసంగంపై కథనాన్ని ప్రచురించింది. ‘‘తప్పులు చేసిన ఇతరులు తమ అతిని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. నేను మాత్రం జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటున్నాను’ అని ఇందిరాగాంధీ చెప్పారు’’ అని ఉంది అందులో.ఇక మూడో వ్యూహం: ఏ రకమైన తప్పులు జరిగినా వాటిని చాలా చిన్నవిగా చూపించి ఒప్పుకోవడం. మేరీ కారస్ ఇంట ర్వ్యూలోనే ఇందిరా గాంధీ ‘‘రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడం మినహా అసాధార ణమైనవి ఏవీ లేవు’’ అని వ్యాఖ్యానించారు. తుర్క్మాన్ గేట్ (ఢిల్లీ) వద్ద కొంతమంది మరణించిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ‘‘హింస జరగలేదు... అవి ఒకట్రెండు విడి ఘటనలు’’ అని తేల్చే శారు. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కూడా పెద్దగా జరగలేదంటారు ఇందిర. ‘‘తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది. అలాగని మేమేమీ తప్పులు చేయలేదని అనడం లేదు. అయితే వాటిని కొండంత చేసి చూపించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ విషయంలోనూ ఇదే జరిగింది. విషయాలను వాళ్లు ఎట్లా ప్రచారం చేస్తారంటే... చెప్పాలంటే నా దృష్టిలో అవి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు. ప్రచారం మాత్రమే. వారు చెప్పేంత స్థాయిలో జరగలేదు. కొన్ని కేసులున్నాయి కానీ... చాలా కేసుల గురించి వాకబు చేసిన ప్పుడు తప్పని తేలింది’’ అని ఇందిర 1978 మార్చి 26న పాల్ ఆర్ బ్రాస్తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చెప్పుకొన్న ప్రతి అంశంలోనూ ఇందిరాగాంధీ కొన్ని నిర్దిష్ట అంశాల గురించి అంటే... నిషేధాజ్ఞలు, అరెస్టులు, తుర్క్మాన్ గేట్, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వాటి గురించి మాట్లాడారే కానీ... అత్యవసర పరిస్థితి గురించి నేరుగా మాట్లాడలేదు. అత్యవసర పరిస్థితిలోంచి ఈ తప్పులను వేరుగా చూపే ప్రయత్నం చేశారు. దీన్నిబట్టే అత్యవసర పరిస్థితి విధింపుపై ఇందిరా గాంధీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. క్షమాపణ చెప్పలేదు!1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనం ప్రకారం, అత్యవసర పరిస్థితి సమయంలో ఇతరులు చేసిన తప్పులు, అక్రమాలకు ఇందిరా గాంధీ బాధ్యత వహిస్తూనే, ‘‘ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలోని పరిస్థితి ఏమిటో ఆలోచించాలి’’ అని శ్రోతలను కోరారు. ‘‘అన్నివైపులా గందరగోళం నెలకొని ఉండింది. పరిస్థితి అలాగే కొనసాగి ఉంటే భారత్ పరిస్థితి బంగ్లా దేశ్లా అయ్యేదని వ్యాఖ్యానించారు.’’ ‘‘రోగానికి చికిత్స చేసేందుకు ఇచ్చిన ఔషధమే ఎమర్జెన్సీ’’ అని అన్నారు.ఎమర్జెన్సీకి సంబంధించి మీరేదైనా భిన్నంగా చేసేవారా? అని పాల్ బ్రాస్ అడిగినప్పుడు ఇందిర ఇచ్చిన సమాధానం ‘లేదు’ అని. సూటి ప్రశ్నకు వచ్చిన మొట్టమొదటి స్పందన అది. ఆ తరువాత... ఎమర్జెన్సీ కష్టాలను, బాధలను ‘వ్యక్తిగతంగా’ చూడలేకపోవడం తన తప్పు అని అన్నారు. ‘‘నా తప్పేమిటి అంటే... ఆ విషయాలను వ్యక్తిగతంగా చూడకపోవడం, చర్చించకపోవడం.’’ ఇవీ ఆమె మాటలు!కాబట్టి విషయమైతే స్పష్టం. ఎమర్జెన్సీ ఒక పొరబాటు అని ఇందిరా గాంధీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు క్షమాపణ కూడా చెప్పలేదనడం నిస్సందేహం. 1977 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను మాత్రం అంగీకరించారు. దానికి అతిపెద్ద కారణం ఎమర్జెన్సీ అన్నారే గానీ, అది తప్పు అని మాత్రం అనలేదు. నా పరిశోధనలో ఎంతో సాయం చేసిన, ఇందిరా గాంధీ ఆత్మకథ రాసిన సాగరికా ఘోష్ కూడా దీనితో ఏకీభవిస్తారు. ఎమర్జెన్సీ విధించడం తప్పు అని ఇందిరా గాంధీ అన్న దాఖలా నాకు ఎక్కడా కనిపించలేదు.మౌలికంగా భిన్నమా?ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థల్లో తనవాళ్లను ప్రవేశపెడుతోందని ఇప్పుడు ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం ‘మౌలికంగా భిన్నం’ అంటారు. ఇది కూడా తప్పే. అప్పట్లో ఓ జూనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేయడంతో హెచ్.ఆర్.ఖన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. హోంశాఖ కార్యదర్శి నిర్మల్ ముఖర్జీ వంటి నిబద్ధత కలిగిన అధికారులను పదవుల నుంచి తప్పించారు. రాహుల్ గాంధీ ఎక్కడ పప్పులో కాలేశారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితినీ, ఎమర్జెన్సీ పరిస్థితినీ వేరుగా చూపాలని ఆయన భావించారు. తద్వారా ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితి మెరుగు అన్న భావన కల్పించాలని అనుకున్నారు. అందుకే ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ వ్యవస్థలను వశపరచుకోవాలని అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో అంశం... ఎమర్జెన్సీని నానమ్మ ‘పొరబాటు’ అన్నారని చెప్పడం ద్వారా ఆ అంశంపై మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్తపడ్డారు. చర్చను ముగించేందుకుగానూ, కొంత నష్టపోవడం అన్నమాట. అయితే రాహుల్ మాటలు అప్పట్లోనే వివాదాన్ని సృష్టించాయి. ఆయన జ్ఞానం, తీర్పరితనం, నిజాయితీ, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం... అన్నింటిపై సందేహాలు వచ్చాయి. ఈ విషయాలన్నింటిలోనూ ఆయన చాలా తేలికగా ఓడి పోయారేమో అనిపిస్తుంది. ఇదో గూగ్లీ అనుకుంటే రాహుల్ బౌల్డ్ అయ్యారు. దీన్ని ఒక పరీక్షగా అనుకుంటే రాహుల్ దీంట్లో పాస్ కాలేదు. జనాలను ఆకట్టుకోవాలన్నది రాహుల్ ఉద్దేశమైతే అది కూడా జరగలేదు. రాహుల్ ఈ దేశ ప్రధాని అయితే... ఇబ్బంది కరమైన పరిస్థితులను, మరీ ముఖ్యంగా తన కుటుంబ గత చరిత్ర గురించి ఎదుర్కోవడం ఎలాగో ఏదో ఒక రోజు కచ్చితంగా నేర్చు కోవాల్సి ఉంటుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. -
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సావర్కర్ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్పై విమర్శలు రాహుల్కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
వయనాడ్లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణ వైపు దేశం చూపు..బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ది..బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్బైజాన్లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్హోమ్లో 1972 జూన్లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్హోమ్లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్లోని లాల్ చౌక్ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
ఆ రోజు ఏం జరిగిందంటే...
కొన్ని నిర్ణయాలు చరిత్ర గతినే మారుస్తాయి. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేర సైనిక చర్య జర పాలనే నిర్ణయం ఇందుకొక నిదర్శనం. 1984 జూన్లో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో మకాం చేసుకున్న సిక్కు తీవ్రవాదులను బయటికి రప్పించడానికి మరో మార్గం లేక ప్రధాని ఇందిరాగాంధీ (67) భారత సైన్యాన్ని పంపాల్సి వచ్చింది. దీనికి దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. ఊహించని ఆ చర్యతో సిక్కు తీవ్రవాదం ఓ విధంగా సద్దుమణిగింది. కానీ, ఆ తర్వాత ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాజీ, జవసత్వాలు ఉడిగిన అబలగా ప్రవర్తించారని అంటారు. ప్రభుత్వ కార్యభారాలు చాల వరకు తగ్గించుకుని ఆమె, ప్రధాని నివాసం... 1, సఫ్దర్ జంగ్ రోడ్డుకే పరి మితం అయ్యారు. రాత్రి పూట ఆమెకు ఏవో పీడ కలలు కూడా వచ్చేవట. తన కుటుంబ సభ్యులను ఏవో శక్తులు కిడ్నాప్ చేస్తాయని తెలీని ఆందోళన ఆమెలో ఆవహించ సాగింది. వీలు దొరికితే సామాన్య మహిళలా, రాత్రి కొడుకు, కోడలు, మనవడు (రాహుల్), మనవరాలు (ప్రియాంక)తో కలిసి డిన్నర్ చేయటానికి ఉవ్విళ్ళూరేవారట. 12 ఏళ్ల ప్రియాంకతో, పెద్దయాక, తను వాడే పట్టుచీరలు ధరించి రాయ బరేలి, ఆమేథి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లా లని, నవ్వుతూ అనేదట (వింత కోరికలు!).‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా సిక్కు సమాజం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా ప్రభుత్వానికి దూరమయింది. ఇందిరా భక్తుడు, ప్రముఖ పాత్రి కేయుడు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డును వాపస్ చేశారు. అప్పటి పరిస్థితుల దరిమిలా ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ప్రధానిని కొంతకాలం సిక్కు యువతకు దూరంగా ఉండాలని తేల్చాయి. సెక్యులర్ దేశానికి ప్రధానిగా ఉండి అలా చేయడం బావోదని, తన నివాసంలో ఉన్న ఇద్దరు సిక్కు సెక్యూ రిటీ యువకులను మార్చనీయలేదు ఇందిర. 22 ఏళ్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ సత్వంత్ సింగ్ను చూపిస్తూ ఒకసారి... ‘ఈ బహదూర్ నౌ జవాన్ పర్యవేక్షణలో నాకు ఏ ప్రాణహాని లేదని’ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆశ్చర్యం! వారంలోపే అదే యువకుని తుపాకి తూటాలకు ఆమె బలైపోయారు.1984 అక్టోబర్ 31 బుధ వారం ప్రొద్దుట రాహుల్, ప్రియాంకలను స్కూలుకెళ్ళే ముందు నానమ్మ ఇందిర, దగ్గరకి తీసుకుని గట్టిగా వాటేసుకుంది. ఏదో ఉద్వేగ పూరిత అనుభూతి ఆమెతో అలా చేయించింది. ఆ తర్వాత 9 గంటలకు, ముదురు ఆవరంగు కాటన్ శారీలో వడి వడిగా అడుగు లేస్తూ, ప్రక్కనే ఉన్న 1, అక్బరు రోడ్డులోని పార్టీ ఆఫీసు వైపు నడుస్తున్నా రామె. ఆమె వెంట పర్సనల్ స్టాఫ్ నారాయణ్ సింగ్ ఆమెకు ఎండ తగులకుండా గొడుగు పడుతూ పోతున్నాడు. అతని వెనకాలే ‘మేడం మేన్ ఫ్రైడే’గా పేరొందిన పీఏ... ఆర్కే థావన్ కూడా నడుస్తున్నాడు. బ్రిటన్ యాక్టర్ పీటర్ ఉస్తినోవ్, ఐరిష్ టీవీ యూనిట్తో ప్రధానిని ఇంటర్వ్యూ షూటింగ్ కోసం అక్కడ ఎదిరి చూస్తూ, రిస్ట్ వాచి చూసుకున్నాడు. సరిగ్గా 9.10 గంటలు. మేడం పది నిమిషాలు లేటు, ఎందుకో అని అనుకుంటుండగానే, అటు వైపు గన్ ఫైరింగ్ సౌండ్! ప్రధాని సెక్యూరిటీ స్టాఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బియాంత్ సింగ్... వెళ్తున్న ప్రధానికి ఎదురెళ్లి శాల్యూట్ చేస్తూనే, సర్వీస్ రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి జడుసుకుని నారాయణ్ సింగ్ గొడుగును గాలిలో వదలి ‘బచావ్’ అంటూ కేక లేశాడు. అంతలోనే, అటు సత్వంత్ సింగ్ స్టెర్లింగ్ సబ్ మెషిన్ గన్ నుండి 30 బుల్లెట్లు మేడం శరీరంలో కెళ్ళాయి. క్షణాల్లో రక్త ప్రవాహంతో నేల కొరిగింది ఇందిర. గత కొద్ది రోజులుగా పొంచి ఉన్న మృత్యువు హుటాహుటిన ఆమెను అలా తీసుకెళ్ళింది. రక్తం చుక్కల డైలాగ్...క్రితం రోజే (అక్టోబరు 30) సాయంత్రం, భువ నేశ్వర్ (ఒరిస్సా) అసెంబ్లీ ఆవ రణలో జరిగిన బహిరంగ సమా వేశంలో ఇందిరాజీ ప్రసంగిస్తూ, ‘... మై ఆజ్ యహన్ హూ. కల్ శాయద్ యహాన్ న రహూ. ముఝే చింతా నహి. జబ్ మై మరూంగీతో, మేరీ ఖూన్ కా ఏక్ ఏక్ బూంద్ భారత్ కో మజ్బూత్ కర్నేమే లగేగా’ (ఇవ్వాళ నేను ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు ఇక్కడ లేకపోవచ్చు. నాకు బెంగ లేదు. నేను ఒకవేళ చనిపోతే, నా ప్రతీ రక్తం చుక్క దేశ పటిష్ఠతకు తోడ్పడుతుంది) అని అన్నారు. ఆవేశపూరితమైన ఈ రక్తం చుక్కల డైలాగు, ఆమెతో మృత్యు దేవతే పలికించిందని అప్పటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోసాగారు. ఇందిర హత్యానంతరం రాజధాని డిల్లీలో చెలరేగిన మత ఘర్షణల్లో 3 వేల మంది సిక్కులు చనిపోయారని ఖుష్వంత్ సింగ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. జిల్లా గోవర్ధన్ (రషీద్ కిద్వాయి రాసిన ‘24, అక్బర్ రోడ్ ’ ఆధారం)వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (రేపు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు) -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్గా నిలిచింది. బ్యాక్రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్కు టాలిస్ మాన్గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?
బడ్జెట్ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పడింది.1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్లను సమర్పించారు.1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్ను సమర్పించారు. ఆమె బడ్జెట్లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను సమర్పించారు.ఇదీ చదవండి: 'ఇన్కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది. -
ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 1975 నాటి ఎమర్జెన్సీపైనే ప్రత్యేకంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చిదంబరం చెప్పుకొచ్చారు.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ చిదంబరం తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ గురించి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాదా?. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. అయినా, ఎమర్జెన్సీ విధించడం పొరపాటు అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు’ అని గుర్తు చేశారు.ఇదిలా ఉండగా.. కేంద్రం జూలై 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’కు పాల్పడుతోందన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీనియర్ నేత జైరాం రమేష్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదలైన రోజును(జూన్ 4)ను మోదీ ముక్తీ దివస్గా జరుపుకోవాలని సూచించారు. -
ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లోకి నెట్టారు.. కానీ: ఎమర్జెన్సీపై లాలూ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీపై శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేకమంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవరిని హింసించలేదని పేర్కొన్నారు.ఈ మేరకు లాలూ, జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టికల్ను ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు."అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను. నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర బీజేపీ మంత్రుల గురించి నాకు, నా సహచరులకు తెలియదు. వారి గురించి మేము అసలు వినలేదు.ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివారని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేదని విషయాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఖండించారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. -
నాటి ఎమర్జెన్సీని తలపించేలా ఏపీలో నియంత పాలన
-
ట్రెండింగ్లోకి ఎమర్జెన్సీ.. 50 ఏళ్లు పూర్తి (ఫొటోలు)
-
పదేళ్లపాటు మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి అమలుచేస్తే, గత పదేళ్లలో నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేశారని విమర్శించారు. మోదీ విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయినప్పటికీ మోదీలో అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీక్ కావడంతో యువత నష్టపోయారని, ప్రధాని మోదీ కనీసం సానుభూతి తెలపడం లేదని తప్పుపట్టారు. బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై మాట్లాడడం లేదని ఆక్షేపించారు. -
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
ఇందిరాగాంధీ.. భారతమాత: సురేశ్ గోపీ
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు. -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్క్లోజర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
మహామహులకూ తప్పని... ఓటమి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్బరేలీ లోక్సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్సభ ఎన్నికలకు వెళ్లి రాజ్నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.మినూ మసాని మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్సభ ఎన్నికల్లో రాజ్కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.అటల్ బిహారీ వాజ్పేయ్ రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్పేయి ఒకరు. గ్వాలియర్లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.సీకే జాఫర్ షరీఫ్ భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్పై విజయం సాధించారు.దేవెగౌడఅత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.బిజోయ్ కృష్ణ హండిక్ గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.సోమనాథ్ ఛటర్జీ సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్లోని బుర్ద్వాన్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్పూర్ లోక్సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్పూర్ లోక్సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అరుణ్ జైట్లీపారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు. పీవీ నరసింహారావుపాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. -
1984: రాజీవం
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్కు బాగా కలిసొచ్చింది. ఏకంగా 404 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలివి. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి. అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గుతూ పోగా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ రావడం విశేషం... అభివృద్ధికి ప్రజామోదం 1984 అక్టోబర్ 31న ఇందిర హత్య యావత్ ప్రపంచాన్నీ షాక్కు గురి చేసింది. అదే రోజు సాయంత్రం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఏడో లోక్సభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 1984 డిసెంబర్ 24, 27, 28 తేదీల్లో 514 లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అసోం, పంజాబ్ల్లోని మిగతా స్థానాల్లో 1985లో ఎన్నికలు జరిగాయి. సానుభూతికి తోడు ఇందిర దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్కు కలిసొచ్చాయి. హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది. రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు. ఇందిర హయాంలోని 1980–85 ఆరో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతమైనదిగా చెబుతారు. జీవన వ్యయం పెరిగినా ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి చేరింది. వీటన్నింటి ఫలస్వరూపంగా కాంగ్రెస్కు ఏకంగా 49.1 శాతం ఓట్లు, 404 సీట్లు దక్కాయి. నెహ్రూ, ఇందిర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు. యూపీలో కాంగ్రెస్ 85కు ఏకంగా 83 సీట్లను గెలుచుకుంది! బెంగాల్ మినహా పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ దుమ్ము రేపినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎనీ్టఆర్ స్థాపించిన తెలుగుదేశం ధాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది. టీడీపీ ఏకంగా 30 సీట్లు నెగ్గింది. బోఫోర్స్ మరక... రాజీవ్ హయాంలో పలు వివాదాలూ రేగాయి. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి మరక వాటిలో ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్ కంపెనీ రూ.820 కోట్ల ముడుపులు చెల్లించినట్టు 1987 మేలో స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన కథనం సంచలనం రేపింది. బోఫోర్స్ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒట్టావియో ఖత్రోచికి రాజీవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే జాతుల పోరుతో అట్టుడుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యంపైనా రాజీవ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది! ఈ పరిణామం అంతిమంగా రాజీవ్ హత్యకు దారితీసింది. నాడేం జరిగిందంటే..? ఇందిర హత్యకు గురైనప్పుడు రాజీవ్ పశి్చమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి తొలుత హత్య వార్త ఉదయం 9.30కు తెలిసింది. ఇందిరపై కాల్పులు జరిగాయని మాత్రం రాజీవ్కు చెప్పి విమానంలో ఢిల్లీ బయల్దేరదీశారు. కాక్పిట్లోకి వెళ్లిన రాజీవ్ కాసేపటికి బయటికొచ్చి ‘అమ్మ మరణించింది’ అని ప్రకటించారు. అందరూ మౌనం దాల్చారు. మరిన్ని విశేషాలు... ► బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ 7.74 శాతం ఓట్లు సాధించింది. ► బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ. అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. బీజేపీకి రెండో స్థానం గుజరాత్లోని మెహ్సానాలో దక్కింది. ► 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ తీసుకొచ్చారు. ► ఓటు హక్కు వయో పరిమితిని 1988లో 21 ఏళ్ల నుంచి 18కి తగ్గించారు. ► ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా 1988లో చట్ట సవరణ చేశారు. సెబీని ఏర్పాటు చేశారు. ► 1989లో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి తోడు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. ► విద్య ఆధునికీకరణకు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు. ► కంప్యూటర్లు, విమానయాన పరిశ్రమ, రక్షణ, రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ► వృద్ధి రేటు పెంపే లక్ష్యంగా కొర్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు అందించారు. ► దేశంలో టెలికం, ఐటీ రంగ అభివృద్ధికి రాజీవే ఆద్యుడని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ని చరణ్ సింగ్ (లోక్దళ్), బాబూ జగ్జీవన్రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్దళ్ అభ్యర్థి శరద్ యాదవ్పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్సభ కాలం సాక్షిగా నిలిచింది... సాక్షి, నేషనల్ డెస్క్: నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. విపక్షాలు గుంపుగా వచ్చిన... ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్ బచావో’ నినాదమూ సూపర్హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది. విశేషాలు... ► ఐదో లోక్సభ ఎన్నికల పోలింగ్ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. ► 1952 నుంచి లోక్సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. ► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. ► 1971లో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్ పీచమణిచాయి. పాక్ ► ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. ► డిసెంబర్ 16న బంగ్లాదేశ్ అవతరించింది. ► 1974 మే 18న రాజస్తాన్లోని పోఖ్రాన్లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్ అవతరించింది. చెరగని మరక... ఎమర్జెన్సీ 1975 జూన్ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ప్రకటించారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. -
1966 to 1977: ఇందిరమ్మ శకం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది. పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్సభ కాలం వేదికగా నిలిచింది. ఇందిరాగమనం... పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. 361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది. చైనా, పాక్తో యుద్ధాలు నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది. భారత్లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు. సిరా చుక్కకు నాంది ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది. మూడో లోక్సభ కాలంలో ముఖ్య పరిణామాలు ► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి ► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం ► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం ► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం ► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం మూడో లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 494) పార్టీ సీట్లు కాంగ్రెస్ 361 సీపీఐ 29 స్వతంత్ర పార్టీ 18 ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 భారతీయ జన సంఘ్ 14 ఇతరులు 40 స్వతంత్రులు 20 – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు పోటీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన హంతకుడి బంధువు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరిలో ఒకరైన బీయాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా.. పంజాబ్లోని ఫరీధ్కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. 45 ఏళ్ల ఈయన 12 తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. గతంలోనూ పలు ఎన్నికల బరిలో నిలిచిన సరబ్జిత్.. ప్రతిసారి ఓటమినే చవిచూశారు. 2014, 2009లో, సరబ్జిత్ సింగ్ ఖల్సా వరుసగా ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్డ్) మరియు భటిండా స్థానాల నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అలాగే 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఎన్నికల అఫిడవిట్లో సరబ్జిత్ సింగ్ తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలలో,బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. సరబ్జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ బఠిండా నుంచి విజయం సాధించారు. ఇక 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఫరీద్కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సాదిఖ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచిఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో నిలిచారు. . శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. చదవండి: పాకిస్తాన్కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్నాథ్ సింగ్ -
జూలో జిరాఫీల కనుమరుగు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో జిరాఫీలు కనుమరుగయ్యాయి. ఒక్కొక్కటిగా మృత్యువాత పడ్డాయి. దీంతో జూలో వాటిఎన్క్లోజరు బోసిపోయింది. జూ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏనుగులు, పులులు, కోతులు, వివిధ రకాల పక్షులు ఉండేవి. కానీ జిరాఫీ, జీబ్రాలు ఉండేవికాదు. దీంతో 2012లో ఉమ్మడి అంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరెక్టర్ మల్లికార్జున ప్రోత్సాహంతో అప్పటి జూ క్యూరేటర్ రామలింగం కృషితో మలేషియా దేశంలో నెగరా జూ నుంచి మూడు జిరాఫీలను తీసుకురావడానికి సీజెడ్ఏ నుంచి అనుమతులు లభించాయి. దీంతో 2013లో మలేషియా దేశం నుంచి మూడు జిరాఫీలను విశాఖ జూకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వాటిలో రెండు మగవి, ఒకటి ఆడది. సముద్ర మార్గం నుంచి ఓడలో తీసుకొస్తుండగా మార్గమద్యలోనే ఓ మగ జిరాఫీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో మిగిలిన జత జిరాఫీలను అధికారులు విశాఖ జూకి తీసుకొచ్చారు. జిరాఫీల పునరుత్పత్తిలో భాగంగా కొన్నాళ్లకు ఆ రెండింటికి మేటింగ్ నిర్వహించారు. దాని ఫలితంగా మే అనే ఆడ జిరాఫీ ఓ మగ పిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్ల జిరాఫీ రెండు వారాల్లో మృత్యవాతపడింది. మరో మూడేళ్ల అనంతరం ఆ ఆడ జిరాఫీ మళ్లీ గర్భందాల్చింది. ఈసారి దాని కడుపులో ఉండగానే పిల్ల మృతిచెందింది. పుట్టిన జిరాఫీ పిల్లలు నిలవలేదు సరకదా ఈసారి పెద్ద జిరాఫీలే కాలం చేశాయి. మే అనే ఆడ జిరాఫీ గత ఏడాది మే 17న అనారోగ్యంతో మృతి చెందింది. పోస్టుమార్టం రిపోర్టులో దీని పొట్టలో 16 కిలోల ఇసుక ఉన్నట్లు జూ వైద్యులు నిర్ధారించి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న బేకన్ అనే మగ జిరాఫీ ఆదివారం అర్ధరాత్రి కార్డియక్ పల్మనరీ ఫెయిల్యూర్ కావడంతో మృతి చెందింది. దీంతో ఈ జూ పార్కులో నాలుగు జిరాఫీలు మృత్యువాత పడినట్లయింది. దీంతో జంతు ప్రేముకులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వన్యప్రాణులను నాణ్యమైన వైద్యం అందుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా జూ నుంచి జత జిరాఫీలను తీసుకొస్తాం విశాఖ జూలో ఉన్న మగ జిరాఫీ ఆదివారం అ ర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. ప్ర స్తుతం జూలో జిరాఫీలు లేవు. కొద్ది నెలల క్రితం నుంచి కోల్కతాలో అలీపూర్ జూ పా ర్కు నుంచి జత జిరాఫీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కో సం సీజెడ్ఏ(సెంట్రల్ జూ అథారిటీ)కి ప్రతిపాదనలు పంపించాం. వాటిని తీసుకురావడానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
ప్రగతి మైదానం ఇకపై ‘భారత్ మండపం’
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. -
‘హస్తం’, ‘చర్ఖా’ లేకున్నా ఇందిర ప్రభంజనం!
స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది. 1971లో లోక్సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ. -
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024 Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu — Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024 -
ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు!
ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని చెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరా గాంధీకి బ్రేక్ఫాస్ట్గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ చెఫ్ గెలచాడా? లేదా? అసలేం జరిగిందంటే..అది 1983లో ఇందిరాగాంధీ చోగం (CHOGM) సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. చెఫ్ అరోరా ఆ పుస్తకంలో.. 1983 నవంబర్లో దివగంత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామెన్వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్లో ఆతిధ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. ఇందిరాగాంధీ బ్రేక్ఫాస్ట్గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బోపాయిలు ఎక్కడ అందుబాటులో లేవు. అదీగాక ఈ కామెన్వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తుతో హాడావిడిగా ఉంది. ఎక్కడిక్కడ మరమత్తులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్లి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్లి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో చెఫ్ల బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే ఐదేళ్లుగా సేవలందించిన చెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు. "వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరా గాందీ, ఆమె సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రానీ పండ్లను వారికి ఎలాఅందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకుని ఆమెకు బ్రేక్ఫాస్ట్గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్లన్నీ గాలించానని" తెలిపారు అరోరా. "చివరికి ఓ మార్కెట్లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ.. ఏదో సాధించిన వీరుడిలా ఆనందంగా వచ్చా". కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవాన్ని వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయోమో! అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్చేశారు. ఓ రెండు చెక్లు చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటికి రంధ్రాలు చేశారు సెక్యూరి సిబ్బంది. ఏదో రకంగా ప్రదాని ఇందిరా గాంధీకి బ్రేక్ఫాస్ట్గా బోప్పాయిల అందిచేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించని కొన్ని ఆసక్తకర విషయాలు వాళ్లు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ల నిర్ణయాలు, జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ!. (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
నానమ్మ ఇందిరపై వరుణ్ గాంధీ ప్రశంసలు.. కాంగ్రెస్లోకి బీజేపీ ఎంపీ?
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు గెలుపు వల్ల లభించిన పేరు ప్రతిష్టలను తన తన ఖాతాలోనే వేసుకోరని అన్నారు. ఈ మేరకు 1971 యుద్ధంలో భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరా రాసిన లేఖను వరుణ్ గాంధీ షేర్ చేశారు. ‘మొత్తం జట్టు కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం లభిస్తుందని నిజమైన నాయకుడికి తెలుసు. విజయంతో వచ్చిన కీర్తి ప్రతిష్టలను వారు ఒక్కరే స్వీకరించరు. ఎప్పుడూ ఎలా విశాల హృదయంతో ఉండాలో ఆ నేతకు తెలుసు’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసిన విజయం గురించి గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ ఇద్దర్ని జాతీయసంపదగా భావిస్తోందని, వారికి వందనం చేస్తుందని అన్నారు. కాగా ఉత్తర్ప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. ఈమధ్య పార్టీ విషయాల్లో అంటీముట్టనట్లు వ్యహరిస్తున్నారు. కీలక విషయాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా తన లోక్సభ నియోజకవర్గమైన పిలిభిత్లో క్రియాశీలంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. వీటిని బలపరిచేలా గత నెలలో ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ పుణ్యక్షేత్ర సందర్శనకు వేర్వేరుగా వెళ్లిన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ.. ఆలయం బయట కలుకొని అప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు నేతలు చెప్పుకొచ్చారు. తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ..
రెండు రోజుల్లో రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్ మ్యాచ్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్ శర్మ టీమ్ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్ మ్యాచ్ జరగడంతోనే టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. (చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్ షా ఫైర్) -
కాలశకలమై మిగిలిన జ్ఞాపకం
సీజర్ విషయంలో జరిగినట్లే ఇందిరా గాంధీకీ జరిగింది! ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తుపెట్టుకున్నది చెత్తను మాత్రమే! ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు ఈనాటికీ ఎంతో ఉత్తేజభరితమైనది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్కు లేఖ రాయడం అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం. అయినప్పటికీ నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యాయంగా తిరస్కరిస్తున్నాం. ఒకవేళ నేటికీ ఆమె సజీ వంగా ఉండి ఉంటే, తన 106 ఏళ్ల వయసులో ఉండేవారు (నవంబర్ 19న జయంతి). ఆమె హత్యకు గురయ్యారన్న నాలుగు దశాబ్దాల నాటి వాస్తవం నేడొక వెలిసిపోయిన జ్ఞాప కంగా మాత్రమే మిగిలినప్పుడు ఇందిరాగాంధీని నేనిలా గుర్తు చేసుకోవడం చిత్రమైన సంగతే. అయితే సఫ్దర్జంగ్ రోడ్డులోని ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శించే అసంఖ్యాక జనసమూహానికి అదొక పర్యాటక ఆకర్షణ. తక్కిన మనందరికీ గతించి పోయిన కాల శకలం. ఎమర్జెన్సీ (అత్యవసర పరి స్థితి) తప్ప, మరేదీ మన మదిలో లేనిది. తొలిసారి నేనామెను నిబిడాశ్చర్యంతో చూశాను. అది 1975. ఎమర్జెన్సీ పరిస్థితులు పరా కాష్ఠకు చేరుకుని ఉన్న సమయం. నిజానికి నేనొక పురుషాధిపత్య స్వభావం కలిగిన ఒక మహిళను చూడబోతున్నాననే అనుకున్నాను. కానీ ఆమె సొగసుగా, స్నిగ్ధంగా ఉన్నారు. ఆమెలో నాకు అత్యంత స్పష్టంగా గుర్తున్నవి ఆమె చేతులు. అవి సన్నగా, కోమలమైన ఆకృతిని కలిగి ఉన్నాయి. ఒక నియంతలో అవి నేను ఊహించనివి. అప్పటికి నాలుగేళ్ల క్రితం ‘ది ఎకనమిస్ట్’ ఆమెను భారత సామ్రాజ్ఞి అని అభివర్ణించింది. ఆమె మణికట్టుకు మగవారి చేతివాచీ ఉన్నప్పటికీ ఒక రాకుమారిలోని సౌకుమార్యం ఆమెలో ఉట్టిపడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె అతి సామాన్యంగా ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆదివారం నేను, మా అక్కచెల్లెళ్లు... గాంధీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ‘ద పింక్ పాంథర్’ను చూసేందుకు వెళ్లడానికి ముందు అంతా కూర్చొని అల్పాహారం తీసుకుంటూ, పూర్తిగా మాటల్లో మునిగిపోయాం. శ్రీమతి గాంధీ ఒక్క ఉదుటన ‘‘పదండి, పదండి...’’ అనేంత వరకు కూడా సమయం మించిపోతున్నట్లు మేము గమనించనే లేదు. ‘‘ఇప్పటికే మనం లేట్ అయ్యాం. ఎవరైనా ఒకటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిరండి’’ అని కూడా ఆమె అన్నారు. అప్పుడు మా ప్రమీలక్క, ‘‘ప్రచారంలో ఉండగా ఒకటికి వెళ్ల వలసి వచ్చినప్పుడు మీరేం చేశారు?’’ అని శ్రీమతి గాంధీని అడి గారు. మా మాటకు ఆమె... ‘‘రాత్రి పడుకునే ముందు చివరిగా నేను చేసే పని కడుపునిండా నీళ్లు తాగడం. దాంతో ఉదయానికంతా నా సిస్టమ్ ఖాళీ అయిపోతుంది. తర్వాత ఒకటికి వెళ్లే అవసరమే ఉండదు’’ అని చెబుతూ, ‘‘మగవాళ్లలా నేను చెట్టు వెనక్కు వెళ్లలేను కదా’’ అని నవ్వారు. ఏమైనా సీజర్ విషయంలో జరిగినట్లే, ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తు పెట్టుకున్నది చెత్తను మాత్రమే! నా జ్ఞాపకాలలో 1971 డిసెంబర్ 16 నాటి ఉత్తేజం నేటికింకా స్పష్టంగా ఉంది. ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు అది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్కు లేఖ రాసినప్పుడు అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం ఇచ్చారని నా పదహారేళ్ల వివే చనకు అనిపించింది. నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యా యంగా తిరస్కరిస్తున్నాం. విదేశాలలో ఇందిరా గాంధీ నెలకొల్పిన భారతదేశ ప్రతిష్ఠను చూసి గర్వించిన తరం నాది. 1960ల మధ్యలో లిండన్ జాన్సన్ పక్కన చక్కటి దుస్తులలో, తీరుగా కత్తిరించిన ఒత్తయిన జుత్తుతో ఇందిరా గాంధీ నిలబడి ఉండగా ఫొటో తియ్యడం ఆ ఫొటోగ్రాఫర్ జన్మకు ధన్యత అనే చెప్పాలి. శ్వేతసౌధం పచ్చిక బయళ్లలో తీసిన ఆ ఫొటోల కంటే మెరుగ్గా మళ్లీ ఎవరైనా తియ్యడం అసాధ్యం అను కున్నాను. అయితే అది 1982లో లండన్లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో నేను ఆమెను చూసేంత వరకే! ఆ కార్యక్రమంలో మార్గరెట్ థాచర్తో కలిసి నడుస్తున్నప్పుడు ఇందిరా గాంధీ ఆహా ర్యాన్ని చూసి ప్రేక్షకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. జామావర్ షాల్తో తయారైన అద్భుతమైన కోటును ధరించి ఉన్నారామె. ఆమెను అలా చూసి నా మనసు పాఠశాల రోజు లలో నేను చదువుకున్న ఎనోబార్బస్ వర్ణనను గుర్తు చేసింది. ‘‘వయసు ఆమెను వడలిపోనివ్వదు. సంప్రదాయం ఆమె అనంతమైన వైవిధ్యాన్ని నశించ నివ్వదు’’ అంటాడు ఎనోబార్బస్, క్లియో పాత్ర గురించి! 1977లో ఇందిరా గాంధీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి కారణం ఏమిటి? బహుశా అది ఆమె గురించి ఎప్పటికీ విడివడని ముడి కావచ్చు. ఆ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఏమీ లేకపోవచ్చు. కానీ వాటిని వాయిదా వేయగల సామర్థ్యం ఆమెకు లేకపోతే కదా! ఎన్నికలకు ఆమెను బలవంతం చేసే బయటి శక్తులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆమె తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్లారని అనుకోవాలా? లేక ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెలో పశ్చాత్తాపం కలిగిందా? లేదంటే, ఎమర్జెన్సీ చాలా కాలం సాగిందన్న విషయాన్ని ఆమె అంగీకరించి ఉంటారా? వేర్వేరు వ్యక్తులు ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటి కూడా సబబైన జవాబుగా అనిపించదు. నిజానికి ఇంకా లోతైన ప్రశ్న ఉంది. ఆ ఎన్నికలలో తను విజయం సాధించగలనని ఆమె భావించి ఉంటారా, లేదా తనొక ఘోర పరాజయం వైపు వెళుతున్నానన్న అవగాహనను ముందే కలిగే ఉన్నారా? జరగబోయేదేమిటో తెలిసి కూడా విధిని ఆమె స్వాగతించారా? అది తనకు తను విధించుకున్న శిక్షా? ఎమర్జెన్సీ అనే పాపానికి చేసుకున్న పరిహారమా? ఇందిరా గాంధీ తర్వాత కూడా మనకు బలమైన పాలకులు వచ్చారు. చక్కటి వస్త్రధారణతో మనల్ని ముగ్ధుల్ని చేసిన అనేకమంది ప్రధానులూ ఉన్నారు. అందరిలోకి ఇందిరా గాంధీ ఒక్కరే ప్రత్యేకమైన వారిగా ఎందుకు నిలిచారు? బహుశా అలా అనిపించడం యవ్వనంలోని జ్ఞాపకాలు జమ చేసుకుని ఉంచుకున్న అవ్యక్త గతానుభూతులు ప్రతిధ్వనించడం వల్లనా? మనోవైజ్ఞానిక నిపుణులు, తత్త్వవేత్తలు దీనికి మెరుగైన వివరణ ఇవ్వగలరనుకుంటాను. నేను చెప్పగలిగింది మాత్రం ఒక్కటే – అలాగని ఏదో చెప్పాలని చెప్పడం కాదు – నేను ఏమనుకుంటానంటే ఆమెలో ఏదో లేకుండానైతే లేదని! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను కూడా ఇరుదేశాలు జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. అయితే.. ఇంతటి చర్యలకు కారణం ఒక్క ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ హత్య కేసుపై ట్రూడో వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న ఖలిస్థానీ వివాదం, ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. హర్దిప్ సింగ్ హత్య కేసుతో చిలికి చిలికి గాలివానలా మారింది. అమృత్ పాల్సింగ్తో మొదలు.. పంజాబ్లో ఖలిస్థానీ ప్రబోధకుడు అమృత్ పాల్సింగ్పై మార్చిలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత దౌత్య కార్యాలయం ఎదుటు నిరసనకు దిగారు. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య అధికారుల భద్రత కెనడా ప్రభుత్వం చూసుకోవాలని కోరింది. ఈ చర్యల తర్వాత కెనడాలోని బ్రాంప్టన్లో ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇలాంటి చర్యలకు మద్దతు తెలపరాదని దుయ్యబట్టారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాలకు ఈ చర్యలు ఏమాత్రం మంచిది కాదని హితువు పలికారు. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. ఈ కేసుపై కెనడా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కౌన్సిల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలే కారణమని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు ఆరోపించారు. భారత దౌత్య అధికారులే నిజ్జర్ హత్యకు కారణమని టొరెంటోలో జులై 8న నిర్వహించిన ర్యాలీలోని పాంప్లెట్లలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ20 సమ్మిట్.. ఆ సారి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదం పెరుగుతుండటం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆవాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అసాంఘీక శక్తులను అణిచివేయడంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దీనికి స్పందించిన ట్రూడ్రో కెనడా భావవ్యక్తీకరణ స్వేచ్చను గౌరవిస్తుందని అన్నారు. శాంతికాముకమైన నిరసనలకు అనుమతి ఉంటుందని పేర్కొంటూ.. అల్లర్లను కూడా సహించబోమని స్పష్టం చేశారు. కొంతమంది చేసే చర్యలకు ఓ వర్గాన్ని మొత్తం ఆపాదించడం సరికాదని అన్నారు. ఇదీ కాకుండా విమానం సాంకేతిక కారణాల వల్ల జీ20 మీటింగ్ అనంతరం కెనడా ప్రధాని ట్రూడో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం విమానం ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన ఉపయోగించుకోలేదు. దాదాపు 36 గంటలు ఢిల్లీలోనే ఉండి, సాంకేతిక సమస్యలు ముగిశాక కెనడాకు బయలుదేరారు. ఈ పరిణామాల అనంతరం గత సోమవారం నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని వివాదాస్పదంగా మాట్లాడారు. తమ పౌరుల పట్ల విదేశీ జోక్యం సహించబోమని మండిపడ్డారు. ఇలా.. అమృత్ పాల్ సింగ్తో మొదలైన వివాదం.. జీ20 సమ్మిట్ అనంతరం బయటపడింది. ఇదీ చదవండి: Trudeau Avoids Media Questions: ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకో పవన్
కొమ్మాది (భీమిలి): ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకోవాలని ఇక్కడి జేవీ అగ్రహారం, నిడిగట్టు, కొత్తవలస రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సూచించారు. పర్యాటక ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నారంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం ఎర్రమట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 5 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా పంటలు పండకపోవడంతో ప్రభుత్వం ఈ భూములను అభివృద్ధి చేస్తామనడంతో లాండ్ పూలింగ్కు ఇచ్చామని, తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని చెప్పారు. బుధవారం పవన్ పర్యటించిన ప్రాంతం నుంచి కనుచూపు మేరలో కూడా ఎర్రమట్టి దిబ్బలు లేవన్నారు. అసలు ఎర్రమట్టి కనిపించే ప్రాంతమంతా ఎర్రమట్టి దిబ్బలు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మట్టి ఎర్రగా ఉంటుందని, అలా అని ఊరంతా ఎర్రమట్టి దిబ్బలంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ పర్యటించిన ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు డీఫారం భూములు కొన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు చవగ్గా లాగేసుకున్నా మాట్లాడని పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలే తప్ప ఇతర పార్టీల లబ్ధికోసం పేదల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, నల్లబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. -
అవిశ్వాస తీర్మానం.. నెహ్రూ నుంచి మోదీ వరకు.. నెగ్గింది, ఓడింది వీరే!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్నారు. మోదీ ఇంటి పేరు కేసులో శిక్ష కారణంగా నాలుగు నెలల తర్వాత పార్లమెంట్లోకి అడుగుపెట్టిన రాహుల్.. అవిశ్వాస తీర్మానంపై చేయనున్న తొలి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇప్పటి వరకు స్వతంత్ర భారత దేశంలో ఎన్నిసార్లు ప్రతిపాదించారు? ఎవరూ నెగ్గారు? ఎవరూ ఓడిపోయారు? ఎవరిపై ఎక్కువసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.. చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగం.. ఏం మాట్లాడనున్నారు? గత ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలకు, దేశానికి జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించబడింది. ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో వాటిని పడగొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ►దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి 2018లో నరేంద్ర మోదీ వరకు అనేకమంది నేతలు ఈ అవిశ్వాన్ని ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1963లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విపక్ష నేత ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో భారత్ ఓడిపోవడంతో ఆగస్టులో నెహ్రూపై ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత చదవండి: ‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు ►మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. అయితే అన్నింట్లోనూ ఆమె విజయం సాధించారు. ► లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్తోపాటు 1999లో వాజ్పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ► దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. తాజాగా మోదీ ఎదుర్కొంటున్నది 28వ తీర్మానం. ►చివరి సారి 2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగా.. 199 ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం మరోసారి మోదీ ప్రతిపక్షాల నుంచి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లోనూ బీజేపీ సర్కార్ తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం అంటే.. అవిశ్వాస తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పార్లమెంటరీ సాధనం. దీనిని స్పీకర్ ఆమోదీస్తే విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రతిపక్షాల ఆయుధం ప్రతిపక్షాలు తరచుగా ఓ వ్యూహాత్మక సాధనంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వారి వైఫల్యాలను ఎత్తిచూపడానికి, వీటన్నింటినీ సభలో చర్చించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ఈ తీర్మానం కీలక పాత్ర పోషిస్తోంది. అదే సభలో తీర్మానం ఆమోదం పొందితే ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి. లోక్సభ ప్రత్యేక హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం కేంద్ర కేబినెట్ సమిష్టిగా లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. అవిశ్వాస ప్రతిపాదనను కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెట్టగలవు. అలాగే లోక్సభలో మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో ప్రతిపాదించేందుకు అనుమతి లేదు. పార్లమెంటులో సభ్యత్వం కలిగిన ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వం తప్పక తన మెజారిటీని నిరూపించుకోవాలి. చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం ఎలా ప్రవేశపెడతారు.. లోక్సభ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లోక్సభ నియమాలు 198(1), 198(5) ప్రకారం స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. లోక్సభకు తీసుకురావాల్సిన సమాచారాన్ని ఉదయం 10 గంటలలోపు సెక్రటరీ జనరల్కు ఆయన కార్యాలయంలో లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సభలో అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. తీర్మానం ఆమోదం పొందితే.. చర్చకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనిపై అధికార పార్టీతో సహా, ప్రతిపక్షాలు చర్చిస్తాయి. అంతేగాక రాష్ట్రపతి సైతం తమ మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ స్వయంగా ప్రకటిస్తారు. మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలలుగా మణిపూర్ హింస రుగులుతున్నా పరిస్థితులను అదుపు చేయడంలో, శాంతి భద్రతలు పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి(జూలై20) దీనిపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాల మొండిపట్టుతో సభలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. -
'ప్రధాని మోదీకి కూడా వారిలాగే..' అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు. లోకమాన్య తిలక్ అవార్డ్ అందుకోవడానికి ప్రధాని మోదీ మహారాష్ట్రకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్.. ప్రధాని మోదీని కొనియాడారు. దేశంలోనే గాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ప్రతి రోజూ 18 గంటలపాటు పనిచేస్తున్నారు. దివాళీ సందర్భంగా దేశమంతా ఇంట్లో పండగ చేసుకుంటే ఆయన మాత్రం సరిహద్దుల్లో సైన్యంతో దివాళీ జరుపుకుంటారని అజిత్ పవార్ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.. ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకెవరికీ లేవు అంటూ అజిత్ పవార్ మోదీని కొనియాడారు. ఇందిరా గాంధీకి అప్పట్లో ఇదే విధమైన గౌరవం దక్కింది. మళ్లీ రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుంది. అదే విధమైన గౌరవాన్ని ప్రధాని మోదీ పొందుతున్నారని అజిత్ అన్నారు. ఇటీవలే ఎన్సీపీని చీల్చి అధికార బీజేపీ పార్టీలో చేరిన అజిత్ పవార్.. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నిజాన్ని మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అభివృద్ధే ప్రధానమని తెలిపిన అయన.. ప్రతిపక్షంలో ఉంటే సాధించలేమని అన్నారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు, ఆందోళనలు మాత్రమే చేయగలం.. అభివృద్ధి కాదంటూ అజిత్ పవార్ మాట్లాడారు. 'మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలందరూ స్వాగతం పలికారు. నేను, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ కాన్వాయ్లోనే ఉన్నాం. ఎవరు కూడా నల్ల జెండాలను చూపించలేదు. రోడ్డుకు ఇరువైపులా నిలపడి మోదీకి స్వాగతం పలికారు. దేశంలో రక్షణ పరంగా మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానియైనా కోరుకుంటారు. మణిపూర్ అంశాన్ని ఎవరు కూడా మద్దతివ్వరు. ప్రధాని ఆ సమస్యను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది. మణిపూర్ అంశాన్ని అందరం ఖండిస్తున్నాం.' అని అజిత్ పవార్ అన్నారు. ఇదీ చదవండి: గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు -
ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates. — Narendra Modi (@narendramodi) June 25, 2023 భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. Torture , imprisonment, murder , stifling the voice of free press - 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR — Smriti Z Irani (@smritiirani) June 25, 2023 వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం -
చరిత్ర చెప్పడానికి రెడీ అవుతున్న రెండు సినిమాలు
డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ‘బాఘా జతిన్’, డైనమిక్ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్గా దేవ్ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్డేట్స్ ఈ విధంగా... అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది ‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్ అధికారి తాజా లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) బయోపిక్గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్’. ఈ చిత్రంలో బాఘా జతీన్గా నటించి, నిర్మించారు దేవ్ అధికారి. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, జతీంద్రనాథ్కి బాఘా జతీన్ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్ పేరు ‘భాఘా జతీన్’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో ‘భాఘా జతీన్’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్ 20న ‘భాఘా జతీన్’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్ అధికారి. భారత్ అంటే ఇందిరా...! ‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్స్తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా టీజర్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్ 25 తేదీతో టీజర్ ఆరంభమవుతుంది. ‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్ ఈ టీజర్ని షేర్ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఒదిగిపోయినట్లు ఆమె లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన రాత్రి
జూన్ 25, 1975 రాత్రి: 1, సఫ్దర్ జంగ్ రోడ్డు, న్యూఢిల్లీ, దేశ ప్రధాని ఇందిరాగాంధీ నివాసం. కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ్ శంకర్ రేతో సీరియస్గా ముచ్చటిస్తున్నారు ఇందిరాజీ. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల అగ్ర నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయి, చంద్రశేఖర్ ఒకే వేదికపై నుండి, అలహాబాదు హైకోర్టు జడ్జిమెంట్ను ప్రస్తావించి ఇందిరాజీని ప్రధాని పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఇందిర ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. ఇంతకూ అలహాబాద్ కోర్టు తీర్పేమిటో చూద్దాం. 1975 జూన్ 12 నాడు ఇందిరాగాంధీ నిలిచి గెలిచిన రాయబరేలి లోక్సభ ఎన్నిక (1971) చెల్లదనీ, ఆరేళ్లు ఆమె ఎన్నికల్లో పోటీచేయరాదనీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడంతో, పాక్షిక ఉపశమనంగా జస్టిస్ కృష్ణయ్యర్, ఆమెను తాత్కాలికంగా ప్రధాని పదవిలో కొనసాగిస్తూ, పార్లమెంటులో ఓటు హక్కును మాత్రం వినియోగించుకోరాదని స్టే ఆర్డర్ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగ జారుతున్న రోజులవి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి పెరిగి పోతున్నాయి. ‘ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు నేను రాజీనామా చేసి, దేవకాంత్ బరూవాను కొంతకాలం మధ్యంతర ప్రధానిగా నామినేట్ చేయాలనుకుంటున్నాను’ అని మనసులోని మాటను సిద్ధార్థ్ శంకర్ రేతో బహిర్గతం చేశారు మేడం గాంధీ. ఆమె అనటమే తడవు, ‘నో మమ్మీ! నువ్వు రాజీనామా చేసే ప్రసక్తే లేదు’ అన్నారు ప్రధాని చిన్న కుమారుడు 29 ఏళ్ల సంజయ్. సిద్ధార్థ బాబుతో, ‘రాజ్యాంగం దృష్ట్యా దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి’ అన్నారు సంజయ్. ‘ఇప్పటి దేశ సమస్యల రీత్యా మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 352ను అనుసరించి ‘అంతర్గత ఆత్యయిక పరిస్థితి’ (ఇంటర్నల్ ఎమర్జెన్సీ) విధించవచ్చనీ, దీనికి క్యాబినెట్ సమ్మతి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్సు అవసరం అనీ, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందనీ లీగల్ సలహా ఇచ్చారు రే. ‘మరేం ఫర్లేదు, క్యాబినెట్ ఆమోదం రేపు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రాత్రికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రక్రియ మాత్రం పూర్తి చేద్దాం’ అన్నారు సంజయ్. ప్రధాని చేతి లోని పరిపాలనా పగ్గాలు అనధికారికంగా, అనుకోకుండానే అలా సంజయ్ చేతి లోకి వెళ్లాయి. హుటాహుటిన పర్సనల్ స్టాఫ్తో ఒక తెల్ల కాగితం మీద డ్రాఫ్ట్ టైప్ చేయించారు శంకర్ రే. ‘ప్రస్తుతం దేశం అంతర్గత అల్లర్ల దరిమిలా శాంతి భద్రత లకు తీవ్ర అపాయం వాటిల్లు తున్నందులకు రాజ్యాంగం ఆర్టి కల్ 352(1)ని అనుసరించి అత్యవసర పరిస్థితి విధించడం అనివార్యం. దీనితో జత పరచిన ఆర్డినెన్సుపై మీ సంతకం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు సమయం లేనందున, బిజినెస్ రూల్స్, 1961 ప్రకారం, రేపు ఉదయమే ఈ విషయం క్యాబినెట్ కమిటీలో చర్చించి, మంత్రివర్గ సమ్మతి మీకు అంద జేస్తా’మని ఆ లెటరులో రాసి, ప్రధాని ఇందిర సంతకం చేయించారు రే. ఆయనే స్వయంగా ఆ లేఖ తీసుకొని రాష్ట్రపతి భవన్కు చేరుకునేటప్పటికి రాత్రి 11 దాటింది. అప్పటికి గాఢనిద్రలో ఉన్న రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ను అర్జంట్ పని అని చెప్పి నిద్ర లేపమని సిబ్బందిని కోరారు. పది నిమిషాల తర్వాత నైట్ గౌనులో ప్రెసిడెంట్ హాలులోకి రావడంతో తను వచ్చిన విషయం వివరించారు రే. వెంట తెచ్చిన ప్రధాని ఉత్తరం, ప్రొక్లమేషన్ కాపీ ఆయనకు అందించారు. అనిష్టంగానే ప్రొక్లమేషన్ కాపీపై సంతకం చేసి రాష్ట్రపతి సీల్ ముద్ర వేశారు. ఆ రాత్రి ప్రధాని కార్యాలయంలోని సిబ్బంది... సంజయ్ గాంధీ, సిద్ధార్థ్ శంకర్ రే పర్యవేక్షణలో చకచకా పనుల్లో మునిగి పోయారు. మొట్ట మొదట న్యూఢిల్లీలోని జాతీయ పత్రికల కార్యాలయాల్లో కరెంటు కట్ జేశారు. మరుసటి రోజు రావలసిన వార్తా పత్రికల ముద్రణ ఆగిపోయింది. పలు రాష్ట్రాల్లోని పోలీసు హెడ్ క్వార్టర్స్కు ప్రముఖ ప్రతిపక్ష నాయకులను వెంటనే కస్టడీలోకి తీసుకోవలసిందిగా ఆర్డర్లు జారీ అయ్యాయి. జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, వాజ్పేయి, అడ్వాణీలను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. తెల్లవారటంతోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్జీవన్ రామ్, వైబీ చవాన్, స్వరణ్ సింగ్, బ్రహ్మానంద రెడ్డి ఇళ్ళ ఆవరణలో సీఐడీ అధికారులను నియమించి, అటు వస్తూ వెళ్ళే ఆగంతకులపై ఒక ‘నజర్’ ఉంచాల్సిందిగా ఆర్డర్లు వెళ్లాయి. 26 జూన్, ఉదయం 10 గంటలకు ప్రధాని నివాసంలో క్యాబినెట్ కమిటీ మీటింగు ఏర్పాటు చేశారు. ఇందిర తన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులను వివరిస్తూ, ప్రతిపక్ష నాయకులు... ప్రభుత్వాన్నీ, పోలీసు వ్యవస్థనూ, ప్రజలనూ పెడతోవ పట్టిస్తున్న విషయాలు వివరించి, దీనికి ఉపశమనంగా కొంతకాలం అత్యవసర పరిస్థితి అవసరమని చెప్పారు. గత రాత్రి నుండే పరిస్థితులు అనూన్యంగా మారిన విషయం క్యాబినెట్ మంత్రులకు అవగతమవటంతో, భయాందోళన రీత్యా, ప్రధానికి వ్యతిరేకంగా రేకెత్తుతున్న కొన్ని గళాలు నాటకీయంగా మూగవోయి ఆమె చర్యకు పూర్తి మద్దతు తెలిపాయి. ఏకగ్రీవంగా అత్యవసర పరస్థితికి మద్దతు తెలిపి తయారు చేసిన రిజల్యూ షన్ రాష్ట్రపతికి పంపింది క్యాబినెట్ కమిటీ. కేవలం 90 నిమిషాల పాటు జరిగిన ఆ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, రాజ్యాంగం ప్రజలకందించిన ప్రజాసామ్య హక్కులు వారి నుండి 18 జనవరి, 1977 వరకు హరించబడ్డాయి. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ‘ 98190 96949 (ప్రణబ్ ముఖర్జీ ‘ద డ్రమెటిక్ డికేడ్’, కుల్దీప్ నయ్యర్ ‘బియాండ్ ద లైన్స్’ ఆధారంగా) -
ఇందిరాగాంధీ పాత్రలో కంగన..‘ఎమర్జెన్సీ’ టీజర్ చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగన .. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తూ టీజర్ని విడుదల చేశారు మేకర్స్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందిరా ఈజ్ ఇండియా..ఇండియా ఈజ్ ఇందిరా అనే డైలాగ్లో టీజర్ ముగుస్తుంది. (చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్) 1975 నుంచి 1977 వరకు దేశంలో విధించిన ‘అత్యవసర పరిస్థితి’ నేపథ్యంలో ఎమర్జెనీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ని కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘రక్షకుడా లేక నియత? మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజుగా ఉంది’అని రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్లో విడుదల కానుంది. -
ఎమర్జెన్సీ.. ఒక చీకటి యుగం
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్కీ బాత్ ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్లో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం నుంచి కచ్ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఉపేక్షించలేని ప్రదర్శన!
చూడడానికి అది ఆరు సెకన్ల వీడియోనే కావచ్చు. కానీ, సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టిన ఆ వివాదాస్పద వీడియో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే పరిస్థితి తెచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్వయంగా ఆమె అంగరక్షకులే పొట్టనపెట్టుకున్న ఘట్టాన్ని సమర్థిస్తూ రూపొందించిన ప్రదర్శన శకటం ఒకటి కెనడాలోని బ్రాంప్టన్ నగరవీధుల్లో తిరిగిన వైనం భారత్, కెనడాల్లో విస్తృత చర్చ రేపింది. వేర్పాటువాద ఖలిస్తాన్ మద్దతుదారుల ఈ శకట ప్రదర్శన ఏ రకంగా చూసినా ఆక్షేపణీయమే. భారత వ్యతిరేక వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు బలం పుంజుకుంటున్న వైనానికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణ. మన దేశ రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో కెనడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. క్షమాపణ కోరాయి. కెనడా సైతం వెంటనే విచారం వ్యక్తం చేసింది కానీ, ఆ మాట సరిపోతుందా? భారత్తో సత్సంబంధాలు కొనసాగాలని ఆ దేశం నిజంగా కోరుకుంటే, చేయాల్సింది చాలానే ఉంది. అమృత్సర్ స్వర్ణదేవాలయంలో దాగిన సిక్కు తీవ్రవాదుల ఏరివేత కోసం 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వివాదాస్పద సైనిక చర్య ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు దిగడం, అనంతరం కొన్నాళ్ళకు సొంత బాడీ గార్డ్లే విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆమెను పొట్టనపెట్టుకోవడం చరిత్రలో మహా విషాదం. ఆపరేషన్ బ్లూస్టార్ 39వ వార్షికోత్సవ సందర్భాన రెండు రోజుల ముందే జూన్ 4న కెనడాలో ఈ 5 కిలోమీటర్ల ప్రదర్శన శకటాల కవాతు జరిగింది. ప్రదర్శనలు జరిపే స్వేచ్ఛ కెనడా ప్రభుత్వం తన పౌరులకు ఇవ్వవచ్చు. కానీ, ఆ శకటంపై సిక్కు గార్డులు తుపాకీలు ఎక్కుపెట్టగా, చేతులు పైకెత్తి, తెల్లచీరలో ఎర్రటి రక్తపు మోడుగా మారిన మహిళ (ఇందిర) బొమ్మ పెట్టి, ‘దర్బార్ సాహిబ్పై దాడికిది ప్రతీకారం’ అంటూ వెనకాలే పోస్టర్ ప్రదర్శించడం సహించ రానిది. దారుణహత్యను సైతం ప్రతీకారంగా పేర్కొంటున్న ఈ ప్రదర్శనను అనుమతించే సరికి పొరుగుదేశ ప్రధాని హత్యను సమర్థిస్తున్నవారిని కెనడా వెనకేసుకొస్తోందని అనిపిస్తుంది. పంజాబ్లో తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నరోజుల్లో కెనడా, అమెరికా తదితర దేశాలు ఈ వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించాయి. విదేశాల్లో స్థిరపడ్డ వేర్పాటువాదులు అక్కడ నుంచి భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తున్నారు. అక్కడ నుంచి రెచ్చగొట్టే ప్రకట నలు చేస్తూ, వేర్పాటువాదానికి నిధులు సమకూరుస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి ఊపిరులూదు తున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. భారత వ్యతిరేక రిఫరెండమ్లు, కార్యక్రమాలు జరపడమే కాదు... హిందూ ఆలయాలపై దాడులు, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో భారతీయులపై హింసాకాండ ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. ఈ ఏడాది బ్రిట న్లో భారత హైకమిషన్ కార్యాలయంలో ఖలిస్తానీలు పాల్పడ్డ భద్రతా ఉల్లంఘన ఘట్టం లాంటివి ఆందోళన పెంచుతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో తాజా శకట ప్రదర్శన పరాకాష్ఠ. చిత్రం ఏమిటంటే – భారత్లో, మరీ ముఖ్యంగా అమృత్సర్లో ఆపరేషన్ బ్లూస్టార్ స్మరణోత్స వాలు ఏళ్ళు గడిచేకొద్దీ హేతుబద్ధంగా మారాయి. పంజాబీలు పాత చేదు జ్ఞాపకాలను వెనక్కినెట్టి, చాలా ముందుకు వచ్చారు. శాంతిని కోరుకుంటున్నారు. అకాల్తఖ్త్ సైతం ఈ ఏడాది మాదక ద్రవ్యాలు, ఇతర సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న గ్రామాల్లో సంస్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. పంజాబ్లో పరిస్థితులు ఇలా ఉంటే, పరాయిగడ్డ మీది సిక్కులు వేర్పాటువాద ఉగ్రవాదానికి నారుపోసి, నీరు పెట్టాలనుకోవడం శుద్ధ తప్పు. కెనడాలో దాదాపు 2 శాతం జనాభా (దాదాపు 8 లక్షలు) ఉన్న సిక్కుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ దేశ నేతలేమో ఖలిస్తానీల్ని లాలించి, బుజ్జగిస్తున్నారు. సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం సిక్కు ఓటర్లను ఆకట్టుకొనేందుకు గతంలో అధికారిక నివేదికల నుంచి ఖలిస్తానీ తీవ్రవాద ప్రస్తావనలను సైతం తొలగించిన రకం. 2018లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గతంలో భారత మంత్రిపై హత్యా యత్నం చేసిన ఖలిస్తానీ నిందితుడితోనే కలసి ఫోటోలు దిగడం వివాదాస్పదమైంది. 1985 ప్రాంతంలో టొరంటో నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తానీ తీవ్రవాదులు పేల్చివేయగా, అందులోని 329 మందీ మరణించిన ఘటనను కెనడా నేతలు మర్చి పోయారా? ఆ మృతుల్లో అత్యధికులు కెనడియన్లే అయినా, ఓటుబ్యాంక్ లెక్కలతో దాన్ని ఇప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషాదంగానే పరిగణిస్తున్న వైనాన్ని ఏమనాలి? పాలు పోస్తున్న పాము రేపు తమ చేతినే కాటు వేయదన్న నమ్మకం ఏముంది? ఇప్పటికైనా కెనడా కళ్ళు తెరవాలి. ప్రజాస్వామ్యం, బహుళ జాతీయతలకు తమ దేశం ప్రతీక అని జబ్బలు చరుచుకొంటూ ప్రజా స్వామ్యం, శాంతి, సౌభ్రాత్రం, చట్టబద్ధ పాలనపై భారత్కు తరచూ ఉపదేశాలిచ్చే ట్రూడో ముందు తమ పెరట్లో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలి. బోలెడంత భవిష్యత్తున్న భారత, కెనడా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాల్లో కాలిముల్లుగా తయారైన ఖలిస్తాన్ లాంటి అంశాలపై నిర్ద్వంద్వమైన అవగాహనకు రావాలి. భారత విచ్ఛిన్నాన్ని కోరుతున్న శక్తులపై కఠినంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో కెనడాపై దౌత్య, రాజకీయ ఒత్తిడి పెంచాలి. విద్వేషం వెదజల్లే వారిని నయానో, భయానో వంచాలి. ఒక్క కెనడాలోనే కాక వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ నిరసనలపై దృష్టి సారించి, విస్తృత దౌత్య వ్యూహంతో వాటిని మొగ్గలోనే తుంచాలి. ఇంటా, బయటా మరో ఆపరేషన్ బ్లూస్టార్ అవసరం రాకుండా చూడాలి. -
కెనడాలో ఇందిరా గాంధీ హత్యను ప్రతిబింబిస్తూ శకటం ప్రదర్శన
-
నిజాయితీయే నిజమైన విలువ
చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే తాజా పుస్తకం ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినది. పుస్తకంలోని రహస్యోద్ఘాటనలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా! ఇందిరా గాంధీలోని ఎవరికీ తెలియని మరికొన్ని కోణాలను కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా దేశాధినేతల గురించి, వారికి సమీపంగా దీర్ఘకాలం ఉన్నత పదవులను నిర్వహించినవారు తమ డైరీలలో నిజాయితీగా రాసి పెట్టుకున్న విశేషాలతో తెచ్చిన పుస్తకాలు ఎంతో విలువను, ప్రతిష్ఠను కలిగి ఉంటాయి. డైరీలు రాసే సంప్రదాయం మన దగ్గర గట్టిగా లేకపోవడం సిగ్గు చేటు. మళ్లీ బ్రిటిష్ వాళ్లకు ఆ భాగ్యం ఉంది. అక్కడి శామ్యూల్ పెపిస్ నుంచి రిచర్డ్ క్రాస్మన్ వరకు, ఆపై ఉడ్రో వ్యాట్ దాకా... పఠనాన్ని మంత్రముగ్ధం చేస్తూ డైరీలు రాశారు. మరీ ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న స్త్రీ, పురుషుల గురించి వారు తమ డైరీలలో మొత్తం బహిర్గతం చేశారు. లేకుంటే మనం ఆ విశేషాలను ఎప్పటికీ తెలుసుకోగలిగేవాళ్లం కాదు. వారి నిజాయితీనే ఆ డైరీలకుండే నిజమైన విలువ. ఉడ్రో వ్యాట్ రాసిన మూడు సంపుటాల డైరీల గురించి నాటి ‘సండే టైమ్స్’ ఎడిటర్ ఆండ్రూ నీల్, ‘‘ఈ దేశ పాలకులు, సామాజిక విశిష్టులకు సంబంధించి చేర్పులు లేని వాస్తవాలను ఇవి కలిగి ఉన్నాయి’’ అని కితాబునిచ్చారు. మార్గరెట్ థాచర్ జీవిత చరిత్ర కారుడైన ప్రముఖుడు చార్ల్స్ మోర్, ‘‘ఆమె తన సన్నిహితుల సమక్షంలో ప్రజా కార్యక్రమాలపై వ్యక్తం చేసిన వ్యక్తిగత ప్రతిస్పందనలు తరచు ఆ డైరీలలో కనిపించేవి’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, అమూల్యమైన అంతర్నేత్ర దృష్టికి వారి డైరీలు నెలవుగా ఉండేవి. ఇన్నాళ్లకు, మనకూ అలాంటి ఒక పోల్చుకోదగిన డైరీ లభ్యమైంది! చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే పుస్తకం ఆనాడు ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినదే. పుస్తకంలోని విశేషాంశాలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా. మరోలా చెప్పా లంటే... ప్రధానమంత్రి వెనుక ఉన్న అసలు స్వరూపాన్నీ (కొన్నిసార్లు ఆ స్వరూపం లోపభూయిష్టంగా ఉంటుంది), అదే సమయంలో... అందరిలాంటి ఒక మామూలు మనిషినీ ఈ పుస్తకం దృగ్గోచరం చేస్తుంది. మొదట చిన్న విషయాలు. సమావేశాలలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ తన చేతి గోళ్ల ఎగుడు దిగుడులను అందంగా సమం చేసుకుంటూ కనిపించేవారు. అయినప్పటికీ, ‘‘సమావేశంలోని ఏ మాటా ఆమె చెవులను దాటి వెళ్లేది కాదు’’. ఆమెకు కొన్ని గాఢమైన నమ్మ కాలు ఉండేవి. ‘‘ఇంటి నుండి ఆఫీసుకు బయల్దేరవలసిన ఘడియ లను కూడా ఆమె జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు’’. ఆమెలో హానికరం కాని ‘పట్టిపీడించే ఆలోచనలు’ (అబ్సెషన్స్) కొన్ని ఉండేవి. ‘‘లేఖలు రాయడాన్ని ఇందిరా గాంధీ ఇష్టపడేవారు. అంతకంటే కూడా లేఖల చిత్తుప్రతుల్ని, ప్రసంగ పాఠాలను, సందేశాలను స్వయంగా సవరించడానికి ఆసక్తి కనబరిచేవారు’’. ఇక ఆ పూట భోజనంలోకి ఏయే వంటకాలు ఉండాలన్నది నిర్ణయించడానికి గంటల సమయం వెచ్చించేవారు. కామన్వెల్త్ సదస్సుకు హాజరైన ప్రభుత్వాధినేతల కోసం ఆమె భారత దౌత్యవేత్త శంకర్ బాజ్పేయితో కలిసి మెనూ తయారీకి 45 నిముషాల సమయం తీసుకున్నారు. బ్రిటన్ రాణిగారికి ఉదయం పూట అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం విందులోకి ఏమేమి తయారు చేస్తున్నారో ఆ జాబితానూ ప్రతిరోజూ తను చూడాలని కోరుకునేవారు. బ్రిటన్ పట్ల ఇందిరా గాంధీ వైఖరి గురించి ఘరేఖాన్ తన పుస్తకంలో రాసిన విషయాలను చదివి నేను పరవశుడినయ్యాను. ‘‘ప్రధాని ఇందిరా గాంధీ బ్రిటన్ను, ప్రధానంగా బ్రిటన్ రాచకుటుంబీకులను ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా లేరు’’. 1983లో రాణిగారికి లండన్లోని ఇండియన్ హై కమిషనర్ నివాస గృహంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు... న్యూయార్క్ నుంచి నేరుగా భారత్కు తిరిగి వస్తున్న ఇందిరా గాంధీ అర్ధంతరంగా లండన్లో దిగి... భారత హై కమిషనర్, ఆయన భార్య ఆ ప్రత్యేక భోజన సందర్భాన్ని చక్క గానే నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. ‘‘రాణి గారి సమక్షంలో ఎలా ప్రవర్తించవలసిందీ హై కమిషనర్కు చెప్పారు’’. (ఎప్పుడూ కూడా రాణిగారి వైపు మీ వీపు భాగం తిరిగి ఉండకూడదని సూచించారు). ఇందిరా గాంధీ తోట పని చేసేవారు. ఇంట్లో ఫర్నిచర్ అమరికల్లో తరచు మార్పులు చేస్తుండేవారు. వాకిళ్లకు, కిటికీలకు వేసే పరదాలలో కొత్త డిజైన్ల ఎంపిక కోసం ఇంటి అలంకరణ నిపుణులకు – ప్రత్యేక అతిథులను తోడుగా ఇచ్చి – విదేశాలకు పంపుతుండేవారు. ఆ ప్రత్యేక అతిథులలో రాజవంశీయుడైన మాధవరావు సింధియా కూడా ఒకరు. 1981లో ప్రిన్స్ చార్ల్స్ వివాహ మహోత్సవానికి హాజరు అయేందుకు అమితమైన అసక్తిని కనబరిచి కూడా చివరికి హాజరు కాలేకపోయినందుకు ఇందిరా గాంధీ ఎంతగానో నిరాశకు లోనయ్యా రని ఘరేఖాన్ రాశారు. ‘‘అప్పుడు ఆమెలో కనిపించిన ఆ స్థాయి నిస్పృహను మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని ఘరేఖాన్ తన డైరీలో పేర్కొన్నారు. చార్ల్స్ పెళ్లి వేడుకకు తను వెళ్లడం లేదని మొదట చెప్పిన రాష్ట్రపతి ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ప్రధాని ఆగిపోవలసి వచ్చింది. ఇందిరా గాంధీ నోబెల్ శాంతి బహుమతిని అమిత ఆపేక్షగా కోరుకున్నారని కూడా పుస్తకంలో ఉంది. బహుమతిని దక్కించే ప్రచారం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీకి ఘరేఖాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి ‘ఘనత’ పట్ల ఆమె భ్రాంతికి ఇదొ క్కటే నిదర్శనం కాదు. ‘‘ఇతర నాయకులను, చివరికి రాష్ట్రపతులను కూడా ఆమె తన దగ్గరికి పిలిపించుకోవడాన్ని గొప్పగా భావించే వారు’’. ఆమె ప్రత్యేక సహాయకుడు ఆర్.కె. ధావన్ ఆమెను కలవ వలసిందిగా రాష్ట్రపతులకు ప్రొటోకాల్కు విరుద్ధంగా సమాచారం పంపేవారు. ఇందిరా గాంధీలో ఉన్న ఒక వింతైన కోణాన్ని కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. 1983 ఓస్లో పర్యటన సందర్భంగా సోనియా గాంధీ భారత రాయబారికి దిగువన ఉన్న వరుసలో కూర్చో వలసి వచ్చింది. ‘‘అప్పుడు ప్రధాని ఇందిర... సోనియాను పైవరుసకు చేర్చారు’’. అదేమీ నార్వే దేశ ప్రొటోకాల్కు అనుగుణంగా జరిగింది కాదు. సోనియాకు ప్రాముఖ్యం కల్పించడమే ఇందిరా గాంధీకి ప్రధానం అయింది. నిజానికి రాయబారులను తక్కువగా చూడటం అసాధారణ మేమీ కాదన్నట్లుగా కనిపించే అనేక సంఘటనల్ని ఈ పుస్తకం పేర్కొంది. ‘‘ఇందిరా గాంధీ ఎంతో అలవోకగా రాయబారులతో ఉదాసీనంగా, ధిక్కారంగా ప్రవర్తించడాన్ని నేను గ్రహించాను’’ అని రాసుకున్నారు ఘరేఖాన్. ఘరేఖాన్ పేర్కొన్న సందర్భాలు ఎంత ఆసక్తిని రేకెత్తించేవీ,ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేసేవీ అయినప్పటికీ... అవి ఇందిరా గాంధీ మరణించిన నలభై సంవత్సరాల తర్వాత పుస్తకంగా బయటికి వచ్చినవి. అదే మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలోని రాజకీయ ప్రముఖులెవరైనా డైరీలు రాసి ఉంటే అవి ఇప్పుడు ఇంకెంత ఆకట్టుకునేలా ఉంటాయో కదా? రచయితలకు కూడా ఆ డైరీలు ఆకర్షణీయతను తెస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల కాలం పూర్తైంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నాం. ఎన్నికల వరకు రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే మోదీ లక్ష్యం. గత పాలనలోని మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోదీదే. గతంలో ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదం మంచిదే. ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశ్యంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందించడం సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో కేంద్ర పథకాల విషయంలో రూపాయి పేదవాడికి పంపిస్తే 15 పైసలు మాత్రమే అందుతున్నాయని రాజీవ్ గాంధీ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీబీటీ విధానంతో లబ్ధిదారుడికి నేరుగా ప్రధాని మోదీ ప్రయోజనం చేకూరుస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘మానవత్వం లేని కేసీఆర్ ప్రభుత్వం’ -
.. నాకు ఎమర్జెన్సీ గుర్తొస్తుంది!
.. నాకు ఎమర్జెన్సీ గుర్తొస్తుంది! -
పులులు గర్జిస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలోమీటర్లలో ఉన్న 9 టైగర్ రిజర్వు ఫారెస్ట్లతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్ రిజర్వు ఫారెస్ట్లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి. కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది. ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది. వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్ ప్రాజెక్టు బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు రాహుల్ నానమ్మ(ఇందిరా గాంధీ) చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 356ని 150 సార్లు ప్రయోగించారన్నారు. అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది. (చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్పై సుప్రీం చీఫ్ జస్టిస్ మండిపాటు) -
ఇందిరా గాంధీనే ఆనాడు అలా మాట్లాడలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు చర్చించేందుకు ముందుకు వస్తేనే.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఆస్కారం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇండియా టుడే కన్క్లేవ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ సమక్షంలో ఇరు వర్గాలు కూర్చుని చర్చించాలి. పార్లమెంటరీ వ్యవస్థ కేవలం ఖజానాతో లేదంటే ప్రతిపక్షంతో మాత్రమే నడవదని హోంమంత్రి అన్నారు. ఇరు వర్గాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్లు తమకు దక్కట్లేదని గగ్గోలు పెడుతున్న వాక్ స్వాతంత్రం వాళ్లకు దక్కినట్లవుతుంది. ఈ విషయంలో వాళ్లు రెండడుగులు ముందుకు వేస్తేనే.. మేం కూడా రెండడుగులు ముందుకు వేయగలం. అప్పుడే పార్లమెంట్ సజావుగా నడుస్తుంది. కానీ, వాళ్లు కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం లాభం.. ఇలా జరగకూడదు కదా అని అభిప్రాయపడ్డారాయన. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లండన్ కేంబ్రిడ్జి ప్రసంగంపైనా షా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఇంగ్లండ్లో పర్యటించారు. ఆ సమయంలో షా కమిషన్ ఏర్పాటయ్యింది. ఆమెను జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఇంగ్లండ్లో ఓ జర్నలిస్ట్ ఆమెను.. మీ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. దానికి ఆమె ‘మా దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ, వాటి గురించి ఇక్కడ నేను మాట్లాడదల్చుకోలేదు. నా దేశంలో అంతా సవ్యంగానే ఉంది. నా దేశం గురించి ఏం మాట్లాడదల్చుకోలేదు. ఇక్కడికి నేను ఒక భారతీయురాలిగా వచ్చా అని ఆమె బదులిచ్చారు.. అని షా చెప్పుకొచ్చారు. అలాగే.. మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ప్రతిపక్షంలో ఉండగా.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం దక్కిందాయనకు. ఆ టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కూడా అక్కడ రాజకీయాల ప్రస్తావన రాలేదు. కేవలం కశ్మీర్ అంశంపై చర్చ కోసమే ఆయన్ని పిలిచారు. ఆయనా దాని గురించే మాట్లాడారు కూడా. ఇలాంటి సంప్రదాయం రాజకీయాల్లో ప్రతీ ఒక్కరూ పాటించాలని నేను కోరుకుంటా. అలాకాకుండా.. విదేశాలకు వెళ్లి భారత్ గురించి, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ఆరోపణలు చేస్తామా? ఇతర దేశాల చట్ట సభలకు వెళ్లి భారత్ గురించి ప్రతికూల కామెంట్లు చేస్తామా?.. కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసర ఉందని పేర్కొన్నారాయన. ఒకవైపు రాహుల్ గాంధీ లండన్ ప్రసంగంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటుకై డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు. ఇరు పార్టీల ఆందోళనల నడుమ.. బడ్జెట్ రెండో దఫా పార్లమెంట్ సమావేశాలు వారం నుంచి సజావుగా సాగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ.. భారత వ్యతిరేకి! -
నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లో తన తండ్రి డాక్టర్ కె.సుబ్రమణ్యంను రక్షణ శాఖ కార్యదర్శి పదవి నుంచి తొలగించారని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ‘‘రక్షణ వ్యవహారాల్లో అతి లోతైన పరిజ్ఞానమున్న వ్యక్తిగా నాన్నకున్న పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు. 1979లో కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆయన కార్యదర్శి అయ్యారు. అప్పట్లో అత్యంత పిన్న వయస్కుడైన కార్యదర్శి బహుశా ఆయనే. కానీ 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వస్తూనే మా నాన్నను తొలగించారు’’ అని మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘నాన్న చాలా ముక్కుసూటిగా వ్యవహరించేవారు. బహుశా అదేమైనా ఆమెకు సమస్యగా మారిందేమో తెలియదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఇందిర చర్య వల్ల మా నాన్న కెరీర్లో ఎదుగుదల శాశ్వతంగా ఆగిపోయింది. తర్వాత ఎన్నడూ కేబినెట్ కార్యదర్శి కాలేకపోయారు. రాజీవ్గాంధీ హయాంలో ఆయన కన్నా జూనియర్ కేబినెట్ కార్యదర్శిగా ఆయన పై అధికారి అయ్యారు. అందుకే మా అన్న కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి ఎదిగినప్పుడు నాన్న చాలా గర్వపడ్డారు. కానీ నేను కార్యదర్శి అవడం చూడకుండానే 2011లో కన్నుమూశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. జై శంకర్ కూడా 2018లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా రిటైరవడం తెలిసిందే. అనుకోకుండా మంత్రినయ్యా కేంద్ర ప్రభుత్వోద్యోగిగా రిటైరయ్యాక తాను రాజకీయాల్లోకి రావడం, మంత్రి కావడం పూర్తిగా తలవని తలంపుగా జరిగిన పరిణామమేనని జైశంకర్ అన్నారు. ‘‘కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఫోన్ రావడంతో ఎంతో ఆశ్చర్యపోయా. రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆలోచించా. ఎందుకంటే నేనప్పుడు అందుకు సిద్ధంగా లేను’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘నా ఉద్యోగ జీవితమంతా రాజకీయ నాయకులను మంత్రులను దగ్గరగా గమనిస్తూనే గడిపాను. అయినా సరే, నిజాయితీగా చెప్పాలంటే మంత్రి అయ్యాక ఆ పాత్రలో రాణించగలనని తొలుత నాకు నమ్మకం కలగలేదు. కానీ మంత్రిగా నాలుగేళ్ల కాలం చాలా ఆసక్తికరంగా సాగింది. ఎంతో నేర్చుకున్నా’’ అన్నారు. మంత్రి అయ్యాకకూడా బీజేపీలో చేరాల్సిందిగా ఎలాంటి ఒత్తిడీ రాకున్నా తనంత తానుగా చేరానన్నారు. -
ఇందిరాగాంధీ నా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్
విదేశాంగ మంత్రి జై శంకర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో విదేశాంగ అధికారి నుంచి క్యాబినేట్ మంత్రి వరకు సాగిన తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. తాను ప్రభుత్వాధికారుల కుటుంబానికి చెందినవాడినని అన్నారు. తనకు 2019లో కేంద్రమంత్రిగా రాజకీయ అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ.. తన తండ్రి డాక్టర్ కె సుబ్రమణియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారని, 1980లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని తొలగించారని చెప్పారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమయంలో తన తండ్రి కంటే జూనియర్ క్యాబినేట్ సెక్రటరీ అయ్యారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న తన తండ్రి సుబ్రమణ్యం 1979 జనతా ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన డిఫెన్స్ ప్రొడెక్షన్ సెక్రటరీ. అయితే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగింపబడ్డ తొలి వ్యక్తి నా తండ్రే. అందువల్లే తన అన్నయ్య సెక్రటరీ అవ్వడంతో తన తండ్రి ఎంతగానో సంతోషించాడున్నారు. బహుశా అందువల్లే కాబోలు తాను కూడా మంచి అధికారిగానే కాకుండా విదేశాంగ కార్యదర్శి పదవికి ఎదగాలని కోరుకున్నా. కానీ తాను తన తండ్రి మరణించాకే విదేశాంగ కార్యదర్శిని అయ్యానన్నారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినేట్లో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని చేసిన ఫోన్కాల్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ తర్వాత తాను కేంద్ర మంత్రి వర్గంలో చేరినట్లు చెప్పారు. అయితే విదేశాంగ కార్యదర్శిగా జీవితాంతం ఎందరో రాజకీయ నాయకులను చూశానన్నారు.కానీ తాను పార్లమెంట్ సభ్యుడిని కాకపోవడంతో రాజకీయాల్లోకి చేరడం, రాజసభ సభ్యుడు కావడం, అన్ని ఒక్కొక్కటిగా తనకు తెలియకుండానే సాగిపోయాయని చెప్పుకొచ్చారు. ఒక ప్రభుత్వాధికారితో పోలిస్తే కేంద్ర మంత్రి ఎక్స్పోజర్ వేరే స్థాయిలో ఉంటుందన్నారు జైశంకర్. ఫారెన్ సర్వీస్ అధికారిగా, మంత్రిగా విభిన్న ప్రపంచ ఉండటమే గాక ఒక సవాలుగా కూడా ఉంటుందన్నారు. ఐతే బ్యూరోక్రాట్ కంటే మంత్రి వేగంగా ఆలోచించగలడని అన్నారు. ప్రతి సమస్య వెనుకు ఒక రాజకీయ కోణం దాగి ఉంటుందని, అది ఒక చాలెంజింగ్గా ఉంటుందన్నారు మంత్రి జై శంకర్. కాగా, 2015 నుంచి 2018 వరకు జై శంకర్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. (చదవండి: ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్: ఇద్దరికీ ఝలక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం) -
‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే’
ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి.. గాంధీ కుటుంబాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలేనని అవి బలదానాలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా బలిదానం అనేది గాంధీ కుటుంబాల గుత్తాధిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో జరిగిన ఆ రెండు హత్యలు ప్రమాదాలేనన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ శ్రీనగర్లోని భారత్జోడో యాత్ర ముగింపులో ప్రసంగిస్తూ దేశ సేవలోనే తన తండ్రి, నానమ్మలు ప్రాణాలు వదిలారంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జోషి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ యాత్ర సజావుగా సాగడంలో ప్రధాన మంత్రి మోదీ ఘనత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. అక్కడ భారత్ జోడో యాత్ర జయప్రదం కావడంలో ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఆయన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అందువల్లే రాహుల్ లాల్చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగారని జోషి అన్నారు. కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు ప్రసంగంలో తన నానమ్మ, నాన్న చనిపోయారన్న దుర్వార్తను ఫోన్కాల్ ద్వారానే తెలుసుకున్నామని, నాటి ఘటనలు తలుచుకున్నా బాధగ అనిపిస్తుందని చెప్పారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ బాధ కేవలం ఒక ఆర్మీ మనిషికే అర్థమవుతుంది. పుల్వామాలో మరణించిని సీర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి అవగతమవుతుంది. ఆ విషాద ఘటనల తాలుకా కాల్స్ ఎలా ఉంటాయో కాశ్మీరులు కూడా బాగా అర్థం చేసుకోగలరని అన్నారు రాహుల్ గాంధీ. (చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. ప్రజల బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ముగింపు సభలో రాహుల్.) -
రాజమండ్రి ఎంపీగా జమున రాజకీయ ప్రస్థానం
సీటీఆర్ఐ(రాజమ హేంద్రవరం)/అమలాపు రం టౌన్/సామర్లకోట/కొవ్వూరు: గోదారీ గట్టుంది.. గట్టుమీన సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది..ఈ పాట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది గలగల పారే గోదావరి మాత్రమే కాదు..అమాయకత్వాన్ని..అందాన్ని..అభినయాన్ని మూటగట్టుకున్న అలనాటి సినీనటి జమున..గోదావరిని..ఆ నదీమతల్లి పేరును తెరకు బలంగా పరిచయం చేసిన ఆమె మూగ మగమనసులు ఎప్పటికీ చిరస్మరణీయం ..రాజమహేంద్రవరానికి చెందిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తాను అమితంగా ప్రేమించే గోదావరిని 1964లో ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు. గోదారి గట్టుంది పాటకు తన అభినయంతో జమున ప్రాణం పోశారు. శుక్రవారం ఉదయం జమున కన్నుమూశారని తెలియగానే జిల్లా ప్రజానీకం కంటతడి పెట్టింది. ఈ అందాల తారతో తమ గోదారి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. చాలామంది ఈమెను గోదావరి జిల్లా వాసిగా భావిస్తారు. కర్నాటక హంపీలో పుట్టినా ఈమె మన జిల్లాతో మమతానురాగాలను పెనవేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు కూడా ఆమెను తమ ఆడపడుచుగా ఆదరించారు. గలగల పారుతున్న గోదారిలా.. 1953లో జమున పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేసినా అంత గుర్తింపు రాలేదు. 1964లో ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన మూగమనసులు చిత్రంలో ఈమె గౌరమ్మ పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా జమున ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. అదే సినీమా హిందీలో మిలన్గా రీమేక్ చేస్తే అందులో కూడా నటించి మెప్పించారు. ఉత్తమ సహాయనటిగా ఫిల్మిఫేర్ అవార్డు అందుకున్నారు. సఖినేటిపల్లి–నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి గట్ల పైన..పడవలపైన ఈమెతో తీసిన ‘గోదారి గట్టుంది.. పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘నా పాట నీ నోట పలకాలా చిలకా’ పాట కూడా గోదావరి అందాల బ్యాక్ డ్రాప్లోనే చిత్రీకరించారు. గోదావరికీ జమునకు విడదీయరాని బంధముందేమో. 1974లో చిత్రీకరించిన గౌరి సిమిమాలో ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటలో కృష్ణతో ఇక్కడి గోదావరి పాయల్లోనే నర్తించారు. 2014లో జరిగిన గోదావరి పుష్కరాలకు ఆమె పనిగట్టుకుని మరీ వచ్చారు.‘గోదారి గట్టుంది’ పాట తాను జీవించి ఉన్నంత కాలం గుర్తుంటుందని చెప్పడం విశేషం పెద్ద మనసున్న నటి 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనతో కనివీని ఎరుగని నష్టం వాటిల్లింది. ఆ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఎనీ్టఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రతారలతో కలిసి జమున జోలె పట్టి చందాలు వసూలు చేశారు. ఇక్కడి ప్రజలు తమ ఆడపడుచు వచ్చినట్లుగా భావించి స్పందించారు. వంద రూపాయలిస్తే షేక్హ్యాండ్ ఇస్తానని సరదాగా అనడంతో అభిమానులు ఎగబడి ఆమెకు కరచాలనం చేసి విరివిగా విరాళాలు అందజేశారు. రాజమండ్రి ఎంపీగా.. ఇందిరాగాంధీ మీద ఉన్న అభిమానంతో జమున రాజకీయాలలో అడుగుపెట్టారు. తనను సినీరంగంలో ఆదరించిన రాజమండ్రి నుంచి 1989లో పోటీ చేశారు. లోక్సభ సభ్యురాలిగా 1991 వరకూ కొనసాగారు. తెలుగు ఆర్టిస్ట్ ల అసోసియేషన్ను ప్రారంభించారు. రంగ స్థల వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తరుణంలో సామర్లకోట మండలం మాధవపట్నం శివారున ఉన్న తోలుబొమ్మ కళాకారుల జీవన పరిస్థితులు చూసి చలించిపోయారు. అప్పటి కలెక్టర్తో వారి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. గ్రామ సమీపంలో సుమారు 10 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి మూడేసి సెంట్లు వంతున 176 మంది కళాకారులకు ఇళ్ల స్థలాలుగా అందజేశారు. ఎంపీగా ఉన్నప్పుడు తమ వద్దకు వచ్చి యోగ క్షేమాలు అడిగే వారని ఈ కళాకారుల సంఘ నాయకులు తోట బాలకృష్ణ, తోట గణపతి, రాష్ట్ర బొందిలిల కార్పోరేషన్ డైరెక్టర్ తోట సత్తిబాబులు గుర్తు చేసుకున్నారు. అందుకే మాధవపట్నం శివారు ప్రాంతాన్ని జమునానగర్గా వ్యవహరిస్తున్నారు. ♦ఎంపీ హోదాలో జమున రాజమహేంద్రవరంలో 1991 ఏప్రిల్ 5న ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొవ్వూరు మండలం నందమూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన వైనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ♦ 1989లో కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రఫీయుల్లా బేగ్ తరఫున జమున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాపవరంలో రఫీ మోటారు బైకు ఎక్కి ఆమె ప్రధాన వీధుల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాజమహేంద్రి ఆడపడుచు జమున: ఎంపీ భరత్ రాజమహేంద్రవరం రూరల్: జమున మృతికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె నటన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమేనన్నారు. అగ్ర కథానాయకుల చెంత దీటుగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సత్యభామ పాత్రలో ఆమె జీవించారన్నారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారన్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంత ఆడపడుచుగా పేరొందారని నివాళులరి్పంచారు. జెట్ మిత్ర రండి... జమున రాజమహేంద్రవరం నగరానికి ఎప్పుడు వచ్చినా జెట్ మిత్ర రండి అని నన్ను పిలిచేవారు. మేడమే నా పేరు జిత్ మోహన్ మిత్ర అని చెబితే మీరు పిలవగానే జెట్ స్పీడ్తో వస్తారు కదా ..అందుకే జెట్ మిత్ర అని పిలుస్తున్నాను అనేవారు. అమె ఎంపీగా పోటీ చేసినప్పుడు అమె దగ్గర ఉండి తోడ్పాటు అందించాను. పెద్ద తార అయినప్పటికీ భేషజం చూపించేవారు కాదు. – శ్రీపాద జిత్మోహన్మిత్ర, సినీయర్ నటుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలి... 2016 శ్రీమహాలక్ష్మీ సమేత చినవేంకటేశ్వర స్వామి పీఠం బ్రహ్మోత్సవాలలో సర్వేజనా సుఖినోభవంతు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జమునకు కళాతపస్విని అనే బిరుదును ప్రదానం చేశాం. రాజమహేంద్రవరం ఆడపడుచుగా ఆమెను సత్కరించుకున్నాం. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామిజీ -
‘అలాంటి అమ్మాయి అయితే ఓకే’.. పెళ్లిపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయారు. అయితే, తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన రాహుల్.. పెళ్లిపై పలు విషయాలు పంచుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇరువురి గుణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్. ఈ క్రమంలో ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని అడగగా ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను(నా ఆలోచనల్లో లేదు). కానీ, నా తల్లి, నాయనమ్మల గుణాలు కలగలిసి ఉంటే మంచిది.’ అని సమాధానమిచ్చారు రాహుల్. ఈ సందర్భంగా మోటర్ సైకిల్, సైకిల్ నడపడానికి తాను ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు రాహుల్. ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే చైనా సంస్థను గుర్తు చేసుకున్నారు. తన ఇంటర్వ్యూను ట్విట్టర్లో షేర్ చేసిన రాహుల్ తనకు కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద ఉన్న సీఆర్-వీ కారు తన తల్లిదని స్పష్టం చేశారు. కార్లు, బైకుల అంటే తనకు ఇష్టం లేదని, కానీ, రైడ్కు వెళ్లడమంటే ఇష్టమని చెప్పారు. ఇదీ చూడండి: రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్! -
ఇందిర చేసిన తప్పే రాజీవ్ను బలి తీసుకుందా?
రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్టు జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్లు, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నింటినీ పరిశీలించి LTTE చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 1998 జనవరి 28న నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలమ్ పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండ దండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో.. కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి, ప్రజలకు రక్షణ కల్పించాలని మిత వాదులు భావిస్తే ఈలమ్ ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTE పురుడుపోసుకుంది. 1954లో పుట్టిన వేలుపిళ్లై ప్రభాకరన్ 1976 మే 5న LTTEని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట.. జాఫ్నా మేయర్ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్.. తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్తో లంకలో హింసాత్మక పద్దతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలు పంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్ను ఇరుకునపెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో LTTEని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు DMK, అన్నాడీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చేయి వేశాయి. లంక సర్కార్పై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం MGR కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తర్వాత లంక విషయంలో భారత సర్కార్ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్లో తమిళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపులు జరిపి LTTE ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ను నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్ధతుగా DMK సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం LTTE ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్లోనూ LTTE పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. LTTE దాడులను అరికట్టడానికి రాజీవ్గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ.. ప్రభాకరన్కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్దనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు.. LTTE మూకలను చీల్చి చెండాడాయి. ఇది LTTEకి ఊపిరిసలపనివ్వలేదు. 1991లో భారత్లో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి LTTE భయపడిపోయింది. రాజీవ్గాంధీ మళ్లీ ప్రధాని ఐతే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన LTTE అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. రాజీవ్గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి ఐదో తేదీన జరిగిన ఓ మీటింగ్ ప్రభాకరన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి ఐదో తేదీన LTTE కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్.. శ్రీలంక సమస్య గురించి రాజీవ్గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. ఐతే కాశీ వచ్చింది రాజీవ్ను చంపడానికి. రాజీవ్ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్తో LTTE.. కాశీని ఢిల్లీ పంపించింది. అయితే, రాజీవ్తో భేటీ తర్వాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి మంచిదంటూ ప్రభాకరన్కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్కు మంట పుట్టించింది. చంపి రమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్.. అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఎంత పకడ్బంధీగా చేసినా నేరస్థులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులోనూ అదే జరిగింది. అత్యంత పకడ్బంధీ ప్లాన్తో రాజీవ్ హత్య చేశామని చంకలు గుద్దుకున్న LTTEకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఓ రసీదు.. ఓ కెమెరా.. నేరస్థుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు LTTE ఎలా ప్లాన్ వేసిందో బయటపడింది. రాజీవ్ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్కు అప్పగించింది. అసలు పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962లో పుట్టిన అమ్మన్ 1981లో LTTEలో చేరాడు. స్వల్ప కాలంలోనే LTTEలో కీలక నేతగా ఎదిగిన అమ్మన్కు ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో బాగా తెలుసంటారు. దాంతో.. ప్రభాకరన్కు అమ్మన్పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్ను హతమార్చే పనిని అమ్మన్కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్.. 1991 ఏప్రిల్ 28న జాఫ్నాలోని మధకల్లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు మూడు వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, ధాను, శుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్రరాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. రాజీవ్ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, ధాను తదితరులకు నూరి పోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతకముఠాను ప్రిపేర్ చేశాడు. శివరాజన్.. రాజీవ్ హంతక ముఠాకు లీడర్ ఇతనే. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. రాజన్, దురై, అరవింద్, శివరాజ్ ఇలా చాలా మారు పేర్లే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్.. 1983లో అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984లో LTTEలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణదళానికి సహకరిస్తున్న EPRLF నేత పద్మనాభన్ను హత్యచేసింది ఇతనే. దాంతో పొట్టుఅమ్మన్కు శివరాజన్పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్ను చంపిన ఏడాదికే.. రాజీవ్ను హతమార్చే బాధ్యతను శివరాజన్పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. పద్మనాభన్ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారు పేర్లు ఉన్నాయి. అతనితో పాటు శుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె LTTE షాడో బృందం సభ్యురాలు. ఇక మానవబాంబుగా ధాను ఎంపికైంది. 22 ఏళ్ల ధాను అసలు పేరు కళైవాణి. ముద్దు పేరు అన్బు. బట్టికలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో LTTEలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందన్లు హంతకముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివ రూపన్. ఇతను పొట్టు అమ్మన్కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్లెస్ ఆపరేటర్. LTTEలో రహస్యాలు తెలిసిన అతి కీలక వ్యక్తుల్లో శివరూపన్ కూడా ఒకడు. ఇక ముఠాలో మరో ఇద్దరు సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ముఠా తయారైంది. శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ధాను, తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం ఏప్రిల్ 30న హంతక ముఠా శ్రీలంకలోని మధకల్ నుంచి నాటు పడవలో బయల్దేరి మే ఒకటో తేదీన తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. LTTE రాజకీయ విభాగంలో పని చేస్తూ మద్రాస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్, డిక్సన్లు కూడా వారితో చేరిపోయారు. హంతకముఠా వేదారణ్యంలో అడుగుపెట్టేనాటికి LTTE మద్రాస్లో పూర్తి స్కెచ్తో రెడీ ఐంది. చెన్నైలో LTTE కార్యకలాపాలకు కేంద్రమైన శుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీస్ యజమాని శుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. LTTE సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రమణీయం అలియాస్ బాల సుబ్రమణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్లు కలిసి.. కుట్రదారులను తయారు చేశారు. ముత్తు రాజన్ తదితరులు వారికి సహరించారు. శుభా సుందరం, సుబ్రమణ్యం, మురుగన్లు కలిసి ఫోటో గ్రాఫర్ హరిబాబు, అరివు పెరారీ వాలన్, నళిని, ఆమె తమ్ముడు భాగ్యనాధన్లను తమ కుట్రలో పావులుగా చేసుకున్నారు. ధాను మానవబాంబు.. ఆమెకు స్టాండ్ బైగా మరో మానవబాంబు శుభ. ఐతే నళినితో ప్రేమలో పడిన మురుగన్.. ఆమెను కూడా మానవబాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. ఐతే స్టాండ్ బై మానవ బాంబుగా శుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇక పెరారీ వాలన్ బెల్టు బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్ను హతమార్చాలని కంకణం కట్టుకున్న LTTE.. అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న వీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ వీఐపీ వద్దకు వెళ్లి మానవబాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20 తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. 1991 మే 21.. జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవబాంబు ధాను, శుభాలతో కలసి నళిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు పారిస్ కార్నర్కు వెళ్లి పూంపుహార్ అనే షో రూమ్లో ఒక చందనమాల కొన్నాడు. ధాను, శుభ, నళిని, హరిబాబు, మురుగన్లను తీసుకొని శివరాజన్ శ్రీ పెరంబుదూర్ బయల్దేరాడు. 21 సాయంత్రం ఏడున్నర గంటలకు.. హంతకముఠా శ్రీ పెరంబుదూర్ చేరింది. మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించాడు. ధాను ధరించిన బెల్ట్బాంబుకు 2 స్విచ్లున్నాయి. ఒకటి సేఫ్టీ స్విచ్ కాగా మరొకటి బాంబ్ను పేల్చే స్విచ్. రాజీవ్కు పాదాభివందనం చేసే నెపంతో కిందికి వంగిన ధాను.. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివ రాజన్కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా రెండో స్విచ్ నొక్కేసింది. అంతే 10.25 ప్రాంతంలో అక్కడ మారణహోమం జరిగిపోయింది. కన్నుమూసి కన్ను తెరిచేంతలో కనివినీ ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. హంతకముఠాకు లీడర్గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం.. సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగత వాళ్లు పోలీసులకు దొరికిపోయారు. -
...అయినప్పటికీ చెరగని ముద్ర
సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యా యానికి తెర లేచిన చీకటి రోజులు నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి. 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదనీ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా 1975 జూన్ 12న చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్ష ణమే రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు ముక్త కంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాంగాన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బం ధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత – సమైక్య తలకు తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, 1975 జూన్ 25, అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాలరాసింది. అంత ర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాదిమందిని జైల్లో పెట్టించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు అంటూ... జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. ‘మీసా’ వంటి చట్టాలను కాంగ్రెస్ అధిష్ఠానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది. ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్ గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చి వేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికి వాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్. హఠాత్తుగా, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగ తాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాశ్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’ అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకూ చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిర అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీకి వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్లోని ‘యంగ్ టర్క్స్’ కూడా వారితో జత కట్టారు. 1977 మార్చ్ 20న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనూ, ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశం లోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అవిశ్వాస తీర్మానం కారణంగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టడం, రాజీనామా చేయడం; దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిన విషయమే. ఆ లోక్సభ ఎన్నికలలో 529 స్థానాలకుగాను 351 స్థానాలు గెలుచుకుని తన సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్– హర్మందిర్ సాహిబ్పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధీ హత్యకు గురై 38 సంవత్సరాలు నిండాయి. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న దనడంలో మాత్రం సందేహం లేదు. వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 (నేడు ఇందిరాగాంధీ 38వ వర్ధంతి) -
టీ కప్పులో దౌత్యపు తుపాను
దౌత్య రంగంలో చిన్న ఘటన కూడా ఎంత సంక్షోభానికి దారితీయగలదో రుజువు చేసే ఘట్టమిది. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు 1983లో ఢిల్లీలో జరిగింది. ఆ సందర్భంలోనే మదర్ థెరెసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను రాష్ట్రపతి భవన్లో అందించాలని బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ కార్యక్రమం ‘నిర్ణయమైంది’. ఈ విషయంలో ప్రధాని ఇందిరాగాంధీ సంతోషంగా లేరు. భారత రాష్ట్రపతి తప్ప మరెవరూ రాష్ట్రపతి భవన్లో అధికారిక కార్యక్రమం నిర్వహించకూడదు. దీన్ని లోక్సభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ఆ సమయంలో ఇందిర సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. అటువైపున్న శక్తిమంతమైన మహిళలూ అలాగే స్పందించడంతో పెద్ద దౌత్య సంక్షోభం ‘టీ’ కప్పులో తుపానులా సమసిపోయింది. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు న్యూఢిల్లీలో 1983 నవంబర్లో జరిగింది. ఈ భేటీకి ప్రధాన సమన్వయ కర్తగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను నియ మించారు. కామన్వెల్త్ అధినేతగా బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ ఈ సందర్భంగా న్యూఢిల్లీకి విచ్చేశారు. భర్త ప్రిన్స్ ఫిలిప్తో పాటు ఆమె రాష్ట్రపతి భవన్లో విడిది చేశారు. అయిదేళ్ల పదవీకాలం పూర్తయిన సర్ సానీ రాంఫల్ (గయానా రాజకీయ నాయకుడు) స్థానంలో కామన్ వెల్త్కు నూతన సెక్రటరీ జనరల్ను ఎన్నుకోవడం అనేది ఎజెండాలో తొలి అంశం. రాంఫల్ మరో అయిదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాలని ఇందిరాగాంధీ కోరుకున్నారు. కానీ బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్ దానికి సుముఖంగా లేరు. ఇందిర ఆ సమావేశానికి చైర్మన్గా ఉండేవారు. దాంతో ఆమె తన పలుకుబడిని ఉపయోగించి, రాంఫల్ రెండో దఫా పదవిలో కొనసాగేలా చేశారు. ఆ సందర్భంగా కామన్వెల్త్ సదస్సు వెలుపల ఒక చిన్న సంక్షోభం వచ్చినట్లే వచ్చి పక్కకు తప్పుకుంది. నాకు గుర్తున్నంత వరకూ అది సదస్సు రెండో రోజు. మదర్ థెరెసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను ఇవ్వడానికి రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారా అని రాష్ట్రపతి భవన్ అధికారులను నెమ్మదిగా అడిగి కనుక్కోమని ప్రధాని ఇందిర నాకు చెప్పారు. ప్రధానమంత్రి విన్నది నిజమేనని రాష్ట్రపతి భవన్ అధికారులు నిర్ధారించారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదాన కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు జారీ చేశారు. దానికి బకింగ్హామ్ ప్యాలెస్ స్టేషనరీని వాడారు. నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ కార్యదర్శిని లేదా సైనిక కార్యదర్శిని సంప్రదించకుండానే ఆ పని చేసేశారు. నేను ఈ విషయాన్ని ఇందిరాగాంధీకి చేరవేశాను. తాను విన్నదాంతో ఆమె సంతోషంగా లేరు. ఈలోగా ఎంపీ హెచ్ఎన్ బహుగుణ ప్రధానికి ఉత్తరం పంపారు. రాష్ట్రపతి భవనలో మదర్ థెరెసాకు బ్రిటిష్ రాణి అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్లు తనకు తెలిసిందన్నది ఆ లేఖ సారాంశం. అయితే తాను విన్నది నిజం కాదని భావిస్తున్నట్లు ఆయన ముక్తా యించారు. భారత్లో రాష్ట్రపతి మాత్రమే ఆయన ఆధికారిక భవ నంలో పురస్కార కార్యక్రమం నిర్వహించగలరు. ఒకవేళ బ్రిటిష్ రాణి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికే ముందుకు వెళ్లినట్లయితే తానూ, ఇతర ప్రతిపక్ష నేతలూ కలిసి ఈ విషయాన్ని లోక్సభలో లేవనెత్తాల్సి ఉంటుందని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. బహుగుణ చెప్పింది నిజం. బ్రిటిష్ రాణి సిబ్బంది తెలీకుండా తప్పు చేశారు. ఆ తప్పును తప్పకుండా సవరించాల్సి ఉంది. చోగమ్ (కామన్వెల్త్ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సదస్సు) ప్రధాన సమన్వయకర్తగా, కనీవినీ ఎరుగని అసాధారణమైన ప్రోటోకాల్ ఉల్లంఘనతో నేను వ్యవహరించాల్సి వచ్చింది. నాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్కు ఈ విషయం తెలియజేసి ఆమె ఏం చెబుతారో తన దృష్టికి తీసుకురావాలని ఇందిరా గాంధీ నన్ను కోరారు. ఆనాడు భారత్లో అధికార బాధ్యతల్లో ఉన్న బ్రిటిష్ హై కమిషనర్ ఒక విజయవంతమైన, నిపుణుడైన దౌత్యవేత్త. రాష్ట్రపతి భవన్లో అలాంటి పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించకూడదని థాచర్కూ, బ్రిటిష్ రాణికీ ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా నేను బ్రిటిష్ హైకమిషనర్ను కోరాను. భారత్లోని బ్రిటన్ హైకమిషన్లో లేదా బ్రిటిష్ కమిషనర్ నివాసంలో ఆ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని నేను తెలియజేశాను. బ్రిటిష్ రాణి అంటే మాకు అపారమైన గౌరవం ఉందనీ, ఇక మదర్ థెరీసా అయితే మా దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ నేను ఆయనతో చెప్పాను. అదే సమయంలో ఈ విషయంలో మనం ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి రాకూడదనీ వివరించాను. బ్రిటిష్ హైకమిషనర్ నాకు రెండు గంటల్లో ఫోన్ చేశారు. రాణి తలపెట్టిన వేదికను మార్చడానికి కూడా సమయం దాటిపోయిందని నాకు చెప్పారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంచడం అయి పోయిందనీ, పైగా ఈ విషయం చెబితే రాణి చాలా ఇబ్బంది పడతారనీ ఆయన చెప్పారు. పైగా బ్రిటన్ ప్రెస్కు ఈ కార్యక్రమం గురించి తెలిసిపోయింది. ఇది నిజంగా చెడ్డవార్తే. మార్గరేట్ థాచర్ ప్రతిస్పందనను భారత ప్రధాని ఇందిరాగాంధీకి తెలియజేస్తానని నేను బ్రిటిష్ హైకమిషనర్కు చెప్పాను. అయితే ఒక విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. రాష్ట్రపతి భవన్లో అలాంటి అధికారిక పురస్కార ప్రదాన కార్యక్రమానికి మనం అంగీక రించ కూడదని ప్రధాని ఇందిరాగాంధీకి నేను సిఫార్సు చేస్తానని తేల్చి చెప్పాను. ఇక్కడ మాముందు అత్యంత ప్రమాదకరమైన ప్రొటో కాల్ మందుపాతర సిద్ధంగా ఉంది. నలుగురు ప్రపంచ ప్రముఖ మహిళల ముందు జరుగుతున్న నాటకీయ పరిణామం అది. ఇద్దరు శక్తిమంతులైన ప్రధానమంత్రులు, ఒక రాణి, మరొకరు సన్యాసిని కంటే ఎక్కువైన మహిళ. ఈ కథ గానీ బయటపడిందంటే భారత్ మీడియా ఏం చేస్తుంది? అది వెలిగించే పెద్ద భోగిమంటను తల్చుకుంటేనే వణుకు పుట్టింది. తర్వాత బ్రిటిష్ ప్రధాని చెప్పిన మాటలను నేను ఇందిరాగాంధీకి నివేదించాను. ఇందిర ముఖంలో వెంటనే చిరాకును చూశాను. ఒక క్షణం అలాగే ఉండి, తర్వాత ఆమె గొప్ప నైపుణ్యంతో ఒక దౌత్యపరమైన గూగ్లి వేశారామె. ‘‘నట్వర్, థాచర్ వద్దకు వెళ్లి రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ రాణి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని నా మాటగా చెప్పు. కానీ ఈ విషయాన్ని మరుసటి రోజు భారత పార్లమెంటులో తప్పకుండా లేవనెత్తుతారని ఆమెకు చెప్పు. దీనిపై తప్పకుండా విమర్శలు చెలరేగుతాయి. పైగా రాణి పేరును కూడా దీంట్లోకి లాగుతారు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది.’’ నిజంగానే ఒక అద్భుతమైన ప్రతిస్పందన అటువైపు నుంచి వెంటనే వచ్చింది. రాష్ట్రపతి భవనలో మదర్ థెరెసాకు అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనేలేదు. మదర్ థెరెసాను ఎలిజబెత్ రాణి ఉద్యాన వనంలో తేనీటి విందుకు ఆహ్వానించారు. అక్కడే ఆమె నోబెల్ గ్రహీత అయిన మదర్ థెరెసాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లోనే నిర్వహించి ఉంటే దౌత్యపరంగా ఎంత కల్లోలం చోటు చేసుకునేదో మదర్ థెరెసాకు అయితే అసలు తెలిసేది కాదు. చివరకు ఈ సమస్య పరిష్కారమైన తీరు నన్ను కూడా వ్యకిగతంగా ఎంతో సంతోషపెట్టింది. ఆ తర్వాత కామన్వెల్త్ దేశాధి నేతల సదస్సు ముగింపు సందర్భంగా బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్ నన్ను ప్రశంసిస్తున్నట్టుగా సైగ చేశారు. భారత్ పర్యటనను ముగించుకుని బ్రిటన్ వెళ్లిపోయేముందు ఎలిజబెత్ రాణి నన్ను పిలిచారు. నా పట్ల ఆమె ఎంతో దయతో వ్యవహరించారు. మరింకె వరికీ అది దక్కి ఉండదనిపించింది. అంతే కాకుండా నాకు ఆమె ఒక రాచ బహుమతిని కూడా ప్రసాదించారు. కె. నట్వర్ సింగ్, వ్యాసకర్త మాజీ విదేశాంగమంత్రి (‘ఫస్ట్ ఇండియా’ సౌజన్యంతో) -
సోనియాకు బిగ్ పంచ్.. ‘ఆమె’ నాకు తల్లిలాంటిది: ఆజాద్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని ధారపోశానని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాంగ్రెస్పై ఆజాద్ విరుచుకుపడ్డారు. కశ్మీర్లో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. నేను వాటిని రైఫిల్తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే తాను.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. మరోవైపు.. తాను 52 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్ గాంధీని సోదరుడిగా భావించినట్లు ఆజాద్ చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం.. ఆజాద్ సొంత పార్టీని పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. Ghulam Nabi Azad Says “Congress Fired Missiles At Me, I Only Retaliated With Rifle” https://t.co/3QxAW5TzoT — ZOKR (@zokrofficial) September 9, 2022 -
స్వతంత్ర భారతి : భారత్ తొలి మహిళా నాయకురాలు
ప్రధాని పీఠంపై ఇందిర: అది 1966 జనవరి 19 వ తేదీ. భారతదేశ కొత్త నాయకురాలి ప్రసంగం ఇలా సాగింది. ‘‘ఈ క్షణాన మీ ముందు నిలచిన నాలో, మహా నాయకుల గురించిన ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి. నేను మహాత్మా గాంధీ పాదాల చెంత పెరిగాను. నా తండ్రి పండిట్జీ, లాల్ బహదూర్ శాస్త్రి – వారు నా మార్గదర్శకులు. వారు నడిచిన మార్గంలో నేనూ నడవాలనుకుంటున్నాను’’ అని. ఈ నెహ్రూ కుమార్తె.. ప్రధానమంత్రి పదవిని చేపట్టాక అసమాన ఆత్మబలం ఉన్న నాయకురాలిగా రూపొందారు. క్షీర విప్లవం: 1966లో గుజరాత్లోని కొద్ది మంది గ్రామస్థులు, 275 లీటర్ల ప్రాసెసింగ్ ప్లాంట్తో ప్రారంభమైన ప్రయత్నం 23 రాష్ట్రాల్లోని 170 జిల్లాలకు, 90 వేల గ్రామ సహకార సంఘాలకు విస్తరించింది. స్ఫూర్తిదాయకమైన వర్ఘీస్ కురియన్ నాయకత్వం.. భారతదేశాన్ని పాడి ఉత్పత్తుల కొరత నుంచి సమృద్ధికి చేర్చింది. ఈ విప్లవ ఉత్పత్తుల బ్రాండ్ పేరు ‘అమూల్’ అన్న సంగతి తెలిసిందే. (చదవండి: శతమానం భారతి విదేశీ వాణిజ్యం) -
ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి
1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా ఆమె జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మానవత్వంతో ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు. కిరణ్ బేడీ అమృత్సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్లో పొలిటికల్ సైన్స్ టీచర్గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనేముంది? అయినా ఏదో ఒక సందర్భం ఉండాలంటే మాత్రం.. ఈరోజు (జూన్ 9) కిరణ్ బేడీ జన్మదినం. -
Rajiv Gandhi వర్ధంతి.. ఆ దుర్ఘటనే రాజకీయాల్లోకి లాక్కొచ్చింది
వెబ్డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం. ► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్మూర్తి హౌజ్లో గడిచింది. ఆపై డెహ్రూడూన్లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్లో చదువుకున్నాడు. ► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన. ► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది. ► ఇంగ్లండ్ నుంచి భారత్కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్లో ఆయన పైలెట్ కాగలిగారు. ► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు. ► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు. ► రాహుల్, ప్రియాంక.. రాజీవ్గాంధీ-సోనియాగాంధీల సంతానం. ► తమిళనాడు శ్రీపెరంబుదూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు. -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ బడ్జెట్ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్బ్లాక్లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
ఐయామ్ సారీ జెంషెడ్ టాటా!.. ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు?
ఎయిరిండియాను టాటా సన్స్ తిరిగి సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ల మధ్య ఉన్న బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఎయిరిండియా విషయంలో అప్పటి టాటా చైర్మన్ జెంషెడ్ రతన్ టాటా, భారత ప్రభుత్వంల మధ్య జరిగిన పలు విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించిన వివరాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఓ లేఖలో జెంషెడ్జీ టాటాకు వెల్లడించారు. ఇప్పుడా లేఖను మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందిరాగాంధీ రాసిన లేఖకు జెంషెడ్ రతన్ టాటా రాసిన ప్రత్యుత్తరాన్ని సైతం జైరామ్ పోస్టు చేశారు. ఏవియేషన్ రంగంపై మక్కువ పెంచుకున్న జెంషెడ్జీ టాటా స్వయంగా విమానం నడపడం నేర్చుకుని పైలెట్ లైసెన్సు పొందారు. ఆ తర్వాత టాటా ఎయిర్లైన్స్ పేరుతో 1932లో దేశంలో తొలి విమాన సర్వీసులు ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా సర్వీసులను విస్తరిస్తూ పోయారు. ఈ క్రమంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత టాటాల ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్ ఇండియాను 1952లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. రూ. 2.8 కోట్లు చెల్లించి టాటాల నుంచి పూర్తిగా ఎయిర్ ఇండియాను కొనేసింది. అయితే ఆ ఎయిర్ ఇండియాకి చైర్మన్గా జెంషెడ్ టాటానే నియమించింది. అలా 1952 నుంచి 1978 వరకు ఆ పదవిలో జెంషెడ్ రతన్ టాటా కొనసాగారు. అయితే 1978లో భారత ప్రభుత్వం ఏకపక్షంగా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో దేశ ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో అంటే 1978 ఫిబ్రవరి గువహాటి నుంచి కొల్కతాకు విమానంలో ప్రయాణిస్తూ జెఆర్డీ టాటాకి ఇందిరాగాంధీ ఈ లేఖ రాశారు. నన్ను క్షమించండి డియర్ జే, నన్ను క్షమించండి , ఎయిరిండియాతో మీ అనుబంధం ముగిసింది. మీరు ఇకపై ఎంత మాత్రం దానిలో భాగస్వామి కాదు. ఎయిరిండియా నుంచి మిమ్మల్నీ దూరం చేయడం అంటే మీ నుంచి మిమ్మల్ని దూరం చేయడమే. మీరు కేవలం ఎయిర్ఇండియాకు చైర్మన్ మాత్రమే కాదు. అందులో విమానాల డెకరేషన దగ్గర నుంచి ఎయిర్ హోస్టెస్లు ధరించే చీరల వరకు ప్రతీ చిన్న విషయాన్ని , మీరే దగ్గరుండి చూసుకునేవారు. మీవల్లే ప్రపంచంలోనే ఎయిర్ ఇండియా గొప్ప సంస్థలలో ఒకటిగా ఎదిగింది. మిమ్మల్నీ, మీరు నిర్వహించిన ఎయిర్ఇండియాను చూసి మేము గర్విస్తున్నాం. ఈ పని చేసినందుకు మీకు కలిగిన ఆత్మసంతృప్తిని మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఈ విషయంలో ప్రభుత్వం మీకు రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఎంతో ఒత్తిడి తెచ్చారు కొన్ని విషయాల్లో మన మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. అలా ఎందుకు జరిగిందనే విషయాలను నేను మీకు వివరించలేను. ప్రభుత్వ నిర్వాహణలో ఉన్నప్పుడు.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మీకు ప్రత్యర్థులుగా ఉన్న వారు నాపై ఎంతో ఒత్తిడి తెచ్చేవారు. ఇంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను అంటూ ఆ లేఖను ఇందిరాగాంధీ ముగించారు. ఈ లేఖలో జెంషెడ్ టాటాను ఎయిర్ఇండియా చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు అనేక ఒత్తిళ్లు వచ్చాయని, అయినా సరే తాను ఆ పని చేయలేదనే అర్థం వచ్చేలా ఇందిరాగాంధీ తెలిపారు. అలా ఒత్తిడి తెచ్చిన వ్యక్తులే.. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న మురార్జీదేశాయ్పై ఒత్తిడి తెచ్చి జెంషెడ్ టాటాను చైర్మన్ పదవి నుంచి పక్కకు తప్పించారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ అలా ఒత్తిడి తెచ్చిన ఆ వ్యక్తులు ఎవరు అనే ఆసక్తి నెలకొంది. ఇక ఇందిరాగాంధీ నుంచి లేఖను అందుకున్న పద్నాలుగు రోజుల తర్వాత 1978 ఫిబ్రవరి 28న ముంబై నుంచి ఇందిరాగాంధీకి జెంషెడ్ టాటా తిరుగు ఉత్తరం రాశారు. వారి వాల్లే ఇదంతా ఎయిర్ ఇండియాతో నా అనుబంధాన్ని తెంచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ సమయంలో మీరు నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. ఎయిర్ ఇండియా ఉన్నతికి నేను చేసిన కృషిని మీ లేఖలో వివరించిన తీరు నా మనసుని ఆకట్టుకుంది. ప్రభుత్వ సహకారం, స్నేహితుల ప్రోత్సాహం, ఉద్యోగుల విధేయత, కష్టించే తత్వం వల్లనే ఎయిరిండియా ఆ స్థాయికి చేరుకుంది. వారు చేసిన పని ముందు నేను చేసింది చాలా తక్కువ. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను అంటూ జెంషెడ్ టాటా చెప్పారు. In February 1978, JRD Tata was summarily removed by the Morarji Desai Govt as Chairman of Air India—a position he had occupied since March 1953. Here is an exchange that followed between JRD and Indira Gandhi, who was then out of power. Her letter was handwritten. pic.twitter.com/8bFSH1n6Ua — Jairam Ramesh (@Jairam_Ramesh) October 9, 2021 చదవండి : వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా -
పాపం.. ఆ రూపం కోసం ఎంత కష్టపడ్డారో!
‘ఒక శిల్పం అందంగా ఉందంటే ఆ గొప్పదనం అంతా శిల్పానిదే కాదు.. దానిని చెక్కిన శిల్పిది కూడా’.. అన్నాడో మహాకవి. ఒక సినిమా వెనుక నటీనటుల కష్టం ఎంతున్నా.. బిహైండ్ సీన్లో కష్టపడే టెక్నీషియన్ల కష్టం కూడా అంతే ఉంటుంది కూడా. అయితే గుర్తింపు దక్కనంత వరకు వాళ్ల కష్టం తెర వెనుకే ఉండిపోతుంది కూడా. అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాలో లారా దత్తా అచ్చుగుద్దినట్లు ‘ఇందిరా గాంధీ’ లుక్తో మెస్మరైజ్ చేయగా.. దాని వెనుక మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ అండ్ టీం శ్రమ దాగుంది. బెల్ బాటమ్ పిరీయాడికల్ ఫిల్మ్ కావడంతో తన టీం కాస్త ఎక్కువే కష్టపడ్డట్లు చెప్తున్నాడాయన. ఆ ‘ప్రోస్తెటిక్’ కష్టాలేంటో వాళ్ల మాటల్లోనే విందాం. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టలేరని పందెం! విక్రమ్ గైక్వాడ్ మాటల్లో.. ఈ జనరేషన్కి ప్రోస్తెటిక్ మేకప్, మేకప్ ట్రిక్స్, గ్రాఫిక్స్ జిమ్మిక్కుల గురించి బాగా అవగాహన ఉంది. మేకప్లో కొంచెం తేడాలు కనిపిస్తే.. తిట్టడానికి, ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇందిరాగాంధీలాంటి ఛరిష్మా ఉన్న నేత క్యారెక్టర్ లారా దత్తాది. కానీ, ఇద్దరి ముఖాలకు కొంచెం కూడా పొలికలు లేవు. అందుకే కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అని అంటున్నాడాయన. ముక్కుతోనే.. ఇందిరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాత్రింబవలు కూర్చుని చూసింది మా టీం. ఇందిరాగాంధీ ముఖంలో కనుబొమ్మలు, ముక్కు, హెయిర్స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాం. లారా కోసం ప్రోస్తెటిక్ ముక్కు కోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయినా ఎక్కడో ఒక అనుమానం. చివరికి లుక్ టెస్ట్ టైంలో లారా అవతారం చూసి మా కళ్లారా మేమే నమ్మలేకపోయాం. ఆపై దర్శకుడు రంజిత్ తివారీ, నిర్మాత జక్కీ భాగ్నానీ, హీరో అక్షయ్ కుమార్ ఆ లుక్ చూసి స్టన్ అయిపోయారు. అంత కష్టపడ్డాం గనుక లుక్ అవుట్పుట్ అంత బాగా వచ్చింది.. నెటిజన్స్ నుంచి అభినందనలు దక్కాయి అని తెలిపాడు విక్రమ్. ఇదే అసలు ఛాలెంజ్ ప్రోస్తెటిక్ మేకప్లో భాగంగా విడివిడి భాగాల్ని రూపొందించడం ఒక ఎత్తు అయితే.. వాటి అంచులు స్కిన్కు సూట్ అయ్యేలా చూసుకోవడం అసలు ఛాలెంజ్ అని చెబుతున్నాడాయన. ఈ క్రమంలో తన టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని సంబురపడుతున్నాడు. అయితే విక్రమ్ గైక్వాడ్ సామాన్యుడేం కాదు.. నాలుగు సార్లు నేషనల్ అవార్డు గ్రహీత కూడా. ‘ఓంకార, ఢిల్లీ-6, త్రీఇడియట్స్, ఇష్కియా, కమీనే, భాగ్ మిల్కా భాగ్, హంటర్, ఓకే కన్మణి, మిర్జయా, దంగల్ సినిమాలకు పని చేశాడు. అంతేకాదు తుకారాం, లోక్మాన్య ఎక్ యుగపురుష్, లపాచ్ఛపి సినిమాల్లో నటించాడు కూడా. ఫ్లైయిట్ హైజాకింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన బెల్ బాటమ్.. రిలీజ్పై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇందిరా గాంధీ, జేఆర్డీ టాటా మధ్య ఆసక్తికర లేఖ..!
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1966 నుంచి 1977 వరకు మూడు పర్యాయాలు, 1980లో నాలుగో సారి ప్రధానమంత్రిగా పనిచేశారు. పలు రాజకీయ నేతలు ఇందిరాగాంధీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఉద్ధేశ్యంతో ఇందిరా హటావో అనే నినాదంతో ప్రచారం చేస్తే..వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి గరీబీ హటావో అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన నేర్పరి ఇందిరాగాంధీ. తన నాయకత్వంలో పలు విప్లవత్మాక నిర్ణయాలను తీసుకున్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ, దేశంలో పంటల ఉత్పత్తి పెంచడం కోసం హరిత విప్లవం, 20 సూత్రాల పథకము వంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయోంకా ఆసక్తికర ఉత్తరాన్ని మంగళవారం రోజున ట్విటర్లో షేర్ చేశారు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పలు టాటా సంస్థల వ్యవస్తాపకుడు జేఆర్డీ టాటాకు 1973 జూలై 5 న ఉత్తరాన్ని రాశారు. అంతకుముందు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి జేఆర్డీ టాటా తన కంపెనీకు చెందిన పర్ఫ్యూమ్ బాటిళ్లను పంపారు. ఇందిరా గాంధీ తన లేఖలో బదులుగా... ‘డియర్ జే.. మీరు పంపిన పర్ఫ్యూమ్స్తో ఆశ్చర్యానికి గురైయ్యాను. పర్ఫ్యూమ్స్ను పంపినందుకు ధన్యవాదాలు. సాధారణంగా నేను పర్ఫ్యూమ్లను వాడను. అలాంటి వాటికి దూరంగా ఉంటాను . మీరు పంపినందుకు ఒకసారి ట్రై చేస్తాను. మీరు అనుకూలమైన లేదా విమర్శనాత్మకమైన అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మోహమాట పడకుండా నన్ను సంప్రదించవచ్చున’ని ఇందిరా గాంధీలో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయోంకా ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘శక్తివంతమైన ప్రధానమంత్రి, దిగ్గజ పారిశ్రామికవేత్త మధ్య జరిగిన వ్యక్తిగత లేఖ. పరిపూర్ణ స్థాయి.’ అంటూ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ లేఖ పునరుద్ధరించిన బాంబే హౌజ్లో ప్రదర్శనగా ఉంది. A very personal letter exchange between a powerful Prime Minister and a giant industrialist. Sheer class ! #Tata pic.twitter.com/RqDKEcSsBf — Harsh Goenka (@hvgoenka) July 20, 2021 -
ఇందిరా గాంధీ పాత్ర కోసం కంగనా ‘ఎమర్జెన్సీ’ మేకప్
కెరీర్లో మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. సాయి కబీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ పనులను మొదలు పెట్టారు కంగన. లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ చేయించుకుంటున్నారు. ఈ చిత్రానికి కంగన కూడా ఓ నిర్మాత కావడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో టైటిల్ రోల్ చేసిన కంగనా రనౌత్ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. ఈ సినిమాలు కాకుండా కంగన ‘ధాకడ్’, ‘తేజస్’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ
మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్కమింగ్ తారతో? పైపెచ్చు, హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్తో..అదీ ఏ క్రైమ్ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు. లేచింది... నిద్రలేచింది మహిళాలోకం! అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’. సూపర్హిట్ శోభన్బాబు– వాణిశ్రీ ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్ టైటిల్తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ. ‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్బాబు కథానుగుణమైన ఆ టైటిల్కి ఒప్పుకోవడం విశేషం. శోభన్–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్’, ‘జీవనజ్యోతి’తో హిట్ పెయిర్గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలో చేసిన శోభన్ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్ సాధించడం ఓ చరిత్ర. తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే... దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్ – పంజు, భీమ్సింగ్లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కళారాధనలో... కమ్యూనిస్టులు అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్ నేషనల్ ఆర్ట్ థియేటర్’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్ ఫిలిమ్ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే! అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు. సెక్సప్పీల్ వల్లే సక్సెస్లా? ‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది. అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే! ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్! అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్. హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీల కెరీర్లో పాపులర్ క్లాసికల్ హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్ గా నటించిన ఎన్టీఆర్ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్ బెస్ట్ సాంగ్. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!! గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు. బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్ డిస్క్, వైర్ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది. – రెంటాల జయదేవ చదవండి: హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే! -
లేడీ బాస్
-
ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: 1975లో దేశంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం పొరపాటేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన నానమ్మ(ఇందిరాగాంధీ)కు ఆ విషయం తరువాత అర్థం అయిందన్నారు. ‘అప్పుడు జరిగింది పొరపాటే. కచ్చితంగా అది తప్పే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే అప్పుడున్న పరిస్థితి మౌలికంగా వేరైనది. కాంగ్రెస్ ఏ సమయంలోనూ దేశ మౌలిక వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు’ అన్నారు. కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో సంభాషణ సందర్భంగా మంగళవారం రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తాను కోరుకుంటున్నానని, అందువల్లనే యూత్ కాంగ్రెస్లో, విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో ఎన్నికలకు పట్టుబట్టానని రాహుల్ వివరించారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, సమానత్వం కోసం నిలిచిన పార్టీ అని గుర్తు చేశారు. ‘దేశ వ్యవస్థీకృత విధి విధానాలను మార్చే ప్రయత్నం, వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ శక్తి కూడా కాంగ్రెస్కు లేదు. మా పార్టీ రూపుదిద్దుకున్న విధానం కూడా అందుకు అంగీకరించదు. అందువల్ల మేం చేయాలనుకున్నా.. ఆ పని చేయలేం’ అని విశ్లేషించారు. అందుకు వ్యతిరేకంగా, ప్రాథమికంగానే వేరైన విధానాలను అధికార బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అవలంబిస్తోందన్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) (నరేంద్ర మోదీని నాగపూర్కు తరిమేద్దాం: రాహుల్ గాంధీ) -
ఉక్కు మహిళగా కంగనా
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో ‘తలైవి’ సినిమాను పూర్తి చేసిన కంగన ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. అది కూడా దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా (ఐరన్ లేడీ) పేరున్న ఇందిరా గాంధీ పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర కాదు... అయితే ఆమె జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భారతదేశంలో నెలకొన్న రాజకీయాలపై ఇప్పటి తరం వారికి మా సినిమా అవగాహన కల్పిస్తుంది. నా స్నేహితుడు సాయి కబీర్ (చిత్రదర్శకుడు)తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథలో నటిస్తున్నందుకు హ్యాపీ. ‘మణికర్ణిక’ చిత్రబృందమే ఈ సినిమాకు కూడా పని చేస్తుంది’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కంగనపై ఫొటోషూట్ కూడా చేశారు. ఇందిరాగాంధీ లుక్లో కంగన బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని కంగన పేర్కొన్నారు. ఇందులో లాల్బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ పాత్రలు కూడా ఉంటాయి. -
మరో పవర్ఫుల్ పాత్ర: ఇందిరాగాంధీగా కంగనా
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్ చేశారు. ఇందిరాగాంధీ లుక్లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్ స్టైల్, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది. ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ కూడా పూర్తయ్యింది. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్బహదూర్ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది. Kangana will essay the role of former Prime Minister Indira Gandhi in an upcoming political drama. "The script is in final stages. It is not a biopic but it is a grand period film that will help my generation to understand (the) socio-political landscape of current India." pic.twitter.com/0Ln3Pwtwa0 — Kangana Ranaut Daily (@KanganaDaily) January 29, 2021 -
కమలపై ప్రియాంక ట్వీట్: 50 ఏళ్ల కిందటే
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారిస్కు శుభాకాంక్షల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల అధినేతలు ఆమెను ప్రసంశిస్తూ సందేశాలు పంపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు కూడా ఆమెను అభినందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఓ మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందని, భారత్లో మాత్రం 50 ఏళ్ల కిందటే ఓ మహిళ (ఇందిరా గాంధీ)ను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తుచేశారు. (ప్రపంచానికి అమెరికా ఓ దిక్సూచి) నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రియాంక గురువారం ఓ ట్వీట్ చేశారు. మాజీ ప్రధానికి నివాళి అర్పిస్తూనే దేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని వర్ణించారు. 50 ఏళ్ల కిందటనే ఇందిరను ప్రధానిగా ఎన్నుకున్న దేశ ప్రజలు ఎంతో గొప్పవారని కొనియాడారు. అమెరికా మాత్రం ఈ ఘనతను సాధించేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందన్నారు. ట్విటర్లో ఆమె చిన్నప్పుడు ఇందిరతో దిగిన ఫోటోను జతచేశారు. 1966 జనవరిలో ఇందిరా గాంధీ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల హ్యారిస్ విజయం సాధించారు. 2021 జనవరి 20న వారు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్ పండిట్ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్కు దారి చూపిన మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్ నుంచి స్క్వేర్ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్’ అని ఈయన నవ్వేవారు. ఇక పార్లమెంట్ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్సభలో చరణ్సింగ్ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్.కి లీక్ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్ కోసం చూశారు. చరణ్కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. ప్రణబ్ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్కతా ఫోన్ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్ వచ్చింది. సంజయ్ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. గురుతుల్యులు శ్రీమతి గాంధీ మీరు లేకుండా కేబినెట్ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్. ప్రణబ్ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్ విత్ కేరింగ్ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్జంగ్ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్! ప్రణబ్ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్ బోర్డు చీఫ్ షర్మిల ఠాగోర్ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీనే. సినిమాను మహదేవ్ రోడ్డులోని ఓ థియేటర్లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు. సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. ఒక విధంగా ప్రణబ్ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు. మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు. కూతురు శర్మిష్ఠ -
కాంగ్రెస్ కుట్ర : ప్రణబ్ ప్రధాని అయ్యేవారు
సాక్షి, న్యూఢ్లిలీ : కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మూడు తరాల నాయకులకు నమ్మకమైన వ్యక్తిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ మృతిచెందారు. నిజ జీవితంలో, రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగఢించి ప్రణబ్ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవచేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ దేశానికీ తీరనిలోటుగా పలువురు వర్ణిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకు ఆపరేషన్ సమయంలో కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు తరాలను ముందుండి నడిపించారు.. 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లో జన్మించిన ప్రణబ్ముఖర్జీ ఎమ్ఏ, న్యాయవాద విద్యలనూ పట్టా అందుకున్నారు. అనంతరం కొంతకాలంపాటు లెక్చరర్గా పనిచేశారు. తొలినుంచి సామాజిక దృక్పథం కలిగిన ప్రణబ్.. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి1969 కోల్కత్తాలోని మిడ్నాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించించారు. వెంటనే ప్రణబ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన అక్కున చేర్చుకుంది. అనంతరం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎంపికై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీ మరణం అనంతరం రాజీవ్కు అండగా నిలబడి.. కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పీవీ నరసింహారావు హాయంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా నియమితులైయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంలో కీలకపాత్ర పోషించారు. ఇందిరా గాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ కాంగ్రెస్కు అండగా నిలిచి.. నాలుగు తరాలను ముందుండి నడిపించారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరు.. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీయే ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు సమర్థవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ను గుర్తింపబడ్డారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత అవార్డును ప్రకటించడం గమనార్హం. 2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2018లో ఆరెస్సెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరైన తొలి మాజీ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలతో పాటు.. అజాతశత్రుగా కూడా పేర్కొనబడ్డారు. కాంగ్రెస్ కుటిల రాజకీయం.. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా హత్య తర్వాత తానే నిజమైన వారసుడిగా భావించిన ప్రణబ్ డిమాండ్ను తోసిపుచ్చి రాజీవ్ను తెరపైకి తీసుకువచ్చారు. అనుకున్న పదవి దక్కకపోవడంతో 1984లో కాంగ్రెస్కు ప్రణబ్ గుడ్బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు.1989లో రాజీవ్గాంధీ ఆయన్ని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్లోకి తీసుకువచ్చారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధాని అయ్యేందుకు ప్రణబ్ ప్రయత్నాలూ చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని కాదనుకుని పీవీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల ఫలించకపోతే ప్రణబ్ ఎప్పుడో దేశ ప్రధాని అయ్యేవారిని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆరు దశాబ్ధాల పాటు రాజకీయల్లో కొనసాగిన దాదా.. పార్లమెంటు వ్యవహారాల్లో ఆయన్ని మించిన వారు లేదనే విధంగా మెలిగారు. తెలంగాణ బిల్లుపై సంతకం.. ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుభందం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు. ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’ పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. -
54 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు దొరికింది
1966 నాటి విమాన ప్రమాదం గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. అప్పట్లో ఈ ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 707 విమానం.. మాంట్ బ్లాక్ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని ఈ మాంట్ బ్లాక్ హిమానీ నదం కరుగుతున్న కొద్ది దానిలో దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆల్ఫ్స్ పర్వత సానువుల్లో మానవ అవశేషాలు దొరికినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 1966 నాటి నేషనల్ హెరాల్డ్, ది ఎకనామిక్ టైమ్స్ వార్తా పత్రికల కట్టలు వెలుగు చూశాయి. ఇవి నాటి విమానం ప్రమాదం జరిగినప్పుడు ఇవి నదిలో పడి ఉంటాయని భావిస్తున్నారు. సుమారు 55 ఏళ్లు కావస్తున్నప్పటికి ఇవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయని సమాచారం. వీటిలో బ్యానర్ హెడ్డింగ్ ఏంటనుకుంటున్నారు... ‘ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి’. తిమోతీ మోటిన్ అనే రెస్టారెంట్ ఓనర్కి ఈ పేపర్లు దొరికాయి. ఇతను దాదాపు 4455 అడుగుల ఎత్తులో చామోనిక్స్ స్కీయింగ్ హబ్ సమీపంలో లా కాబేన్ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్ను నడుపుతున్నాడు. బోసన్స్ హిమానీ నదానికి కేవలం 45 నిమిషాల కాలినడక దూరంలో తిమోతీ రెస్టారెంట్ ఉంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘దాదాపు ఆరు దశాబ్దాల మంచు ఇప్పుడు కరిగిపోయింది. ఈ పేపర్లు నా కంటపడటం నా అదృష్టం. ఇప్పటికి కూడా ఇవి చాలా మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎండిన తర్వాత వీటిని చదువుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత ఈ పేపర్లను సందర్శనకు ఉంచుతాన్నారు’ తిమోతీ మోతీ. -
కాంగ్రెస్ని వెంటాడుతున్న చేదు జ్ఞాపకం..
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యంపై జరిగిన హేయమైన దాడి. ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం. కాంగ్రెస్ పార్టీని నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం. దేశ ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించిన ఆ ‘అత్యవసర పరిస్థితి’ విధించి నేటికి 45 ఏళ్లు. ఆనాడు తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలు పాలయ్యారు. చిత్రవధ అనుభవించారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిణామాలను పరిశీలించినట్లయితే.. గూంగీ గుడియా నుంచి ఐరన్ లేడీగా కాంగ్రెస్ పార్టీ 1971 సాధారణ ఎన్నికల్లో 352 సీట్లు కైవసం చేసుకుంది. అప్పటికే బ్యాంకులను జాతీయం చేయడం, లౌకికవాదిగా.. పేదల పెన్నిధిగా ప్రజాభిమానం చూరగొని.. ప్రియతమ ప్రధానిగా పేరొందిన ఇందిరా గాంధీ.. భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు(పాకిస్తాన్తో యుద్ధం)లో ప్రధాన పాత్ర పోషించి తిరుగులేని నేతగా ఎదిగారు. తనను విమర్శించిన వాళ్లతోనే అపరకాళిక అవతారమంటూ ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇందిరకు ఉన్న గూంగీ గుడియా(మూగ బొమ్మ) అనే ఇమేజ్ తొలగిపోయి దుర్గామాత, ఐరన్ లేడీగా అత్యంత శక్తిమంతురాలైన మహిళగా ఆమె అవతరించారు.(ఇందిరా గాంధీపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు) అయితే నాలుగేళ్ల తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. దేశంలో కరువు, కాటకాలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాస్తవానికి జూన్ 25 అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధించినట్లు కనిపించినా.. అంతకు దాదాపు 10 రోజుల ముందు అంటే జూన్ 12నే ఇందుకు బీజం పడిందని సీనియర్ పాత్రికేయులు, జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరి అభిప్రాయపడ్డారు. దేశంలోని పరిస్థితులకు తోడు ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.(కాంగ్రెస్లో ఎమర్జెన్సీ పోకడలు.. అమిత్ షా ఫైర్) ఆరేళ్ల పాటు దూరంగా ఉండాలి.. 1971 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్ సోషలిస్టు పార్టీ తమ అభ్యర్థిగా రాజ్నారాయణ్ను నిలబెట్టింది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇందిర తన పదవి, పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడి, ఓటర్లకు లంచాలు ఇచ్చి విజయం సాధించారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 1975, జూన్ 12న తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా.. ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందిర ఎన్నికను రద్దు చేయడమే గాక.. మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీర్పునిచ్చారు. దీంతో ప్రధాని పదవి నుంచి ఇందిర దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నిక చెల్లదు కానీ.. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు 1 సఫ్దార్జంగ్ రోడ్లోని ప్రధాని అధికార నివాసంలో ఇందిర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తనకు విశ్వాసపాత్రులైన నాయకులు, సన్నిహితులను సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అప్పుడు ఇందిర తనయుడు సంజయ్ గాంధీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్దామని ఆమెకు చెప్పారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అనుసరించి ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు ఒక ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇందిర వ్యతిరేక, అనుకూల నిరసనలు మిన్నంటాయి. అందుకే ఎమర్జెన్సీ.. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందిగా ఇందిర అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ను కోరారు. ఆయన ఆమోదంతో భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణ ప్రకారం జూన్ 25న అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నాయకులు జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మొరార్జీ దేశాయ్ అరెస్టయ్యారు. అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా దాదాపు 11 లక్షల మందిని జైళ్లల్లో నిర్బంధించారు. అదే విధంగా భావప్రకటనా స్వేచ్చను హరిస్తూ అన్ని వర్గాలను అణగదొక్కారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలను సెన్సార్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో ఇందిర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల నేపథ్యంలోనే ఎమర్జెన్సీ విధించామంటూ తనను తాను సమర్థించుకున్నారు. వాస్తవానికి అప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి గాక ప్రధాని నివాసం నుంచి పాలన కొనసాగింది. నాలుగుసార్లు ఆరు నెలల చొప్పున ఎమర్జెన్సీ పొడిగిస్తూ.. ఎట్టకేలకు 1977, మార్చి 21న ఎత్తివేశారు. కానీ నాయకుల స్వప్రయోజనాలకు బలైన ప్రజలు మాత్రం తమ స్వేచ్ఛను హరించిన.. ఎమర్జెన్సీకి కారణమైన వారిని అంతసులువుగా మర్చిపోలేదు. 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పారు! -
ఏడు గుర్రాల జోడీ
బాల్యానికి బ్రాండెడ్ వెర్షన్ అట్లాస్ సైకిల్ యవ్వనానికి.. ఏడు గుర్రాల జోడీ! బతుకు బాధ్యతల్లో.. బ్యాలెన్స్ తప్పనివ్వని.. హ్యాండిల్. డెబ్బై ఏళ్ల అలసటతో ఇప్పుడు గోడకు వాలింది. చక్రాలు తిరగడం ఆగినంత త్రాన జ్ఞాపకాలు ‘ట్రింగ్’మనడం మానేస్తాయా! ‘‘కష్టంగా ఉంది. రోజు గడిచేటట్లుగా లేదు. డబ్బిచ్చేవాళ్లు లేరు. ముడి సామాను కొనడానికి కూడా కటకటగా ఉంది. బండిని నడపలేం.’’ – జూన్ మూడున ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్లో ఒక సైకిల్ ఫ్యాక్టరీ బయట గేటుపై కనిపించిన నోటీసు. రెండుముక్కల్లో ఈ నోటీసుకు అర్థం.. ‘అట్లాస్ మూసివేత’! ర్యాలీ, హీరో, హెర్క్యులస్, హంబర్, బి.ఎస్.ఎ.. తరానికొక సైకిల్ ఉంటుంది ప్రతి ఇంట్లో. అన్ని తరాలనూ వారసత్వంగా మోసుకుంటూ వస్తున్న దేశవాళీ సైకిల్ ‘అట్లాస్’ ఒక్కటే. తొక్కే సైకిల్గా మాత్రమే అట్లాస్ను మిగతా సైకిళ్లతో పోల్చలేం. బాధ్యతల్ని భుజానికెత్తుకున్న ఇంటిపెద్ద అట్లాస్. సైకిల్మీద కనిపించే గుర్తు కూడా అదే. భూగోళాన్ని మోస్తుంటాడు కండలు పొంగిన దృఢకాయుడైన మనిషి. స్వతంత్ర భారతదేశపు తొలినాళ్ల బతుకు చక్రం అట్లాస్. అట్లాస్ మీద ఆఫీస్కి. అట్లాస్ మీద కాలేజ్కి, అట్లాస్ మీద నాన్న వెనుక సీట్లో బజారుకు. ఇప్పుడు పెద్దవాళ్లుగా ఉన్న ప్రతి ఒక్కరి బాల్యానికి బ్రాండెడ్ వెర్షన్.. అట్లాస్. పెడల్ తొక్కిన కాళ్లు, బెల్లుని ‘ట్రింగ్’ మనిపించిన బొటనవేళ్లు, హ్యాండిల్ని తిప్పిన చేతులు ఎప్పటికీ యాక్టివేట్ అవుతూనే ఉంటాయి.. గోడకు వాల్చిన అట్లాస్నో, అటకమీద ఉన్న అట్లాస్నో చూసినప్పుడు! యవ్వనానికి కూడా ఒక బ్రాండెడ్ జోడీ అట్లాస్. ముందుకు వంగి దమ్ము తీసుకుంటూ డబుల్స్ త్రిబుల్స్ కొట్టడం, రేస్లు కట్టడం.. కాలం కలిసొస్తే కనుక స్నేహితురాలిని క్యారేజీపై సైడుకు కూర్చోబెట్టుకుని గాలివాటున.. ‘నువ్వంటే నాకిష్టమనీ అన్నది ప్రేమా..’ అని ఆ అమ్మాయి అన్నట్లు ఊహించుకోవడం.. ఇవన్నీ రెండు చక్రాలపై భూభ్రమణం చేసినట్లే ఉండేవి. చదువులై, ప్రేమలై, పెళ్లిళ్లయి, జీవితపు పరుగుల్లో పడ్డాక.. సైకిల్చైన్ పడినప్పుడు గానీ గుర్తుకు వచ్చేది కాదు.. కొంచెం పరుగులు ఆపాలని. రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాలోలా సైకిళ్లకు (ఆ సినిమాలో ఒక సైకిలే మాట్లాడుతుంది) మాటలొస్తే.. ఏ బ్రాండూ చెప్పలేనన్ని కథల్ని చెబుతుంది అట్లాస్. లూజ్ అయిన నట్టు, టైట్ అయిన బ్రేకు, పంక్చర్ అయిన టైరు, వంకర తిరిగిన హ్యాండిల్, ఒరిగిన స్టాండు, విరిగిన ఊచ.. ప్రతి పార్ట్లోనూ పార్ట్–వన్, పార్ట్–టు సీక్వెళ్ల జీవితపు క్షణాలు ఉంటాయి. రయ్యిన మనం తొక్కడమే కాదు.. మొరాయించి మన భుజాలకెక్కి ఎండలో, వానలో మనల్ని ‘చల్ ఛల్ గుర్రం’ అని తోలి, అట్లాస్ తనని నడిపించుకున్న సందర్భమూ అపురూప జ్ఞాపకమే. యాభైలలో సైకిల్ యుగం మొదలైంది. వట్టి సైకిల్ యుగం కాదు. అట్లాస్ సైకిల్ యుగం. నెహ్రూ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండో టెర్మ్ నాటికే ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చేసింది అట్లాస్. పెద్ద ఆహ్వానం మీద ఎక్కడికైనా వెళ్లడం కన్నా, అట్లాస్ మీద వెళ్లడం పెద్ద గొప్ప అయింది ఆ సైకిలొచ్చిన కొత్తల్లో! గవర్నమెంట్ సైకిల్లా ఉండేది. ఇండియాలో కలిసిపోతానని కశ్మీర్ ఓటు వేసినప్పుడు ఆ ఫలితాలను అట్లాసే ఇంటింటికీ వెళ్లి పేపర్గా వేసింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు అట్లాసే కార్యకర్తల పూలగుచ్ఛాలకు వాహనం అయింది. శ్రీమతి గాంధీ ప్రధాని అయ్యేనాటికే అట్లాస్ దేశవిదేశాల్లో ప్రముఖ సైకిల్ కంపెనీ. ఆ తర్వాత ప్రత్యేక అతిథిగా అట్లాస్ ఫ్యాక్టరీని శ్రీమతి గాంధీ సందర్శించారు కూడా! జానకీదాస్ కపూర్ కంపెనీ యజమాని. అప్పటికి ఆయన లేరు. ఆయన వారసులు జయదేవ్ కపూర్, జగదీశ్ కపూర్ శ్రీమతి గాంధీకి ఫ్యాక్టరీ అంతా తిప్పి చూపించారు. అట్లాస్ సైకిల్ ఫ్యాక్టరీలో ఇందిరా గాంధీ చిన్న షెడ్డులో 1951లో హర్యానాలో ప్రారంభం అయిన అట్లాస్ సరిగ్గా పన్నెండు నెలల్లో ఇరవై ఐదు ఎకరాల్లో పెద్దఫ్యాక్టరీగా విస్తరించింది. తొలి ఏడాది 12 వేల సైకిళ్లను మార్కెట్లోకి పంపింది. ఎనిమిదో ఏడాది ఫారిన్కి సైకిళ్లను ఎక్స్పోర్ట్ చేసింది. తర్వాత ఇరవై ఏళ్లకు తొలి రేసింగ్ సైకిల్ని తయారు చేసింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్కి అధికారిక సైకిళ్లు అట్లాస్వే! తర్వాత మరో ఇరవై ఏళ్లు దేశంలో అట్లాస్దే హవా. అప్పటికే బయటి కంపెనీలు ఇండియాలో కట్లు కొట్టడం, ముందు టైర్ను పైకి లేపి వెనక టైర్తో తమ బ్రాండ్లను ప్రదర్శించడం మొదలైంది. అట్లాస్ కూడా గట్టి పోటీని ఇస్తూనే వచ్చింది. ఎంటీబీ (మౌంట్ బైక్), లేడీస్, జూనియర్, కిడ్స్, రోడ్స్టర్స్, అక్వాఫైర్, రోర్, అల్టిమేట్, పీక్ వంటి బ్రాండ్లతో దీటుగా నిలిచింది. నెహ్రూతో అట్లాస్ సంస్థ వ్యవస్థాపకులు జానకీదాస్ కపూర్ కానీ పోటీ పడలేకపోయింది. 2004 నాటికి తన బ్రాండ్లను నిలుపుకోడానికి సునీల్ శెట్టి, సానియా మీర్జా అవసరం అయ్యారు అట్లాస్కి. ఆ ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు కూడా ఏమీ ప్రభావం చూపలేకపోయారు. ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాను ఆయుధంగా ప్రయోగించింది అట్లాస్. ఆ అస్త్రమూ ఫలించలేదు. చివరికి 2014లో మధ్యప్రదేశ్లోని మలన్పూర్ ప్లాంటును మూసేసింది. 2018లో హర్యానాలోని సోనేపట్ యూనిట్లో పని ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్ ఫ్యాక్టరీ గేటుకు నోటీసు పడింది. డెబ్బయ్ ఏళ్లుగా నడుస్తున్న సైకిల్ చక్రాలు తిరగడం ఆగిపోయాయి. మనిషిలాంటిదే.. మనిషిని మోసి, నడిపి, తిప్పి, పరుగెత్తించిన సైకిల్ కూడా. మనిషి నడక ఆగిపోయినప్పుడు జ్ఞాపకాలు తిరగడం మొదలౌతుంది. ఆ జ్ఞాపకాలలో మనిషెప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అలాగే అట్లాస్ సైకిల్ అట్లాస్ సైకిల్పై పల్లెల్లో తిరుగుతున్న అమర్త్యాసేన్ (పూర్వపు ఫొటో) నోబెల్ మ్యూజియంలో అమర్త్యాసేన్ అట్లాస్! స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని ‘నోబెల్ మ్యూజియం’లో అమూల్యమైన వస్తు జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ నోబెల్ బహుమతి గ్రహీతలవి, నోబెల్ వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్వి. మ్యూజియం భవంతిలో ఇనుప కమ్మీలకు వేలాడదీసిన నలుపు రంగు అట్లాస్ సైకిల్ ఒకటి సందర్శకులకు కనిపిస్తూ ఉంటుంది! ఆ సైకిల్ మన నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్ వాడినది! పశ్చిమ బెంగాల్లోని మారు మూల ప్రాంతాల్లో పేదరికాన్ని, అసమానతల్ని అధ్యయం చేసేందుకు ఆ సైకిల్ మీదనే అమర్త్య ఊళ్లన్నీ తిరిగారు. నోబెల్ మ్యూజియంలో అమర్త్యాసేన్ అట్లాస్ సైకిల్ -
ఢిల్లీ అల్లర్లు: ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’
చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీలో ఇంతకుముందు కూడా అల్లర్లు జరిగాయని.. ఇవన్నీ జీవితంలో భాగమేనంటూ హర్యానా మంత్రి రంజిత్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు 35 మంది మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రంజిత్ చౌతాలా 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ...‘‘అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. ఇందిరా గాంధీని హత్యగావించబడిన సమయంలో.. ఢిల్లీ మొత్తం అట్టుడికిపోయింది. ఇదంతా జీవితంలో భాగమే. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.(అర్ధరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ) ఇదిలా ఉండగా... ఢిల్లీలో చెలరేగిన హింసను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రం హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి మెమొరాండం సమర్పించింది. మరోవైపు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపిన ఢిల్లీ హైకోర్టు జడ్జిని బదిలీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ విషయంపై స్పందించిన న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొలీజియం సిఫారసులు మేరకే సదరు న్యాయమూర్తిని బదిలీ చేశామని వివరణ ఇచ్చారు.(రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ పార్టీ బృందం) చదవండి: ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్ సింగ్లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన నేపథ్యంలో ఆనాడు దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఢిల్లీలో చెలరేగిన హింసలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో.. ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదనే కారణంతో 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేశారు. తదనంతర కాలంలో తమకు న్యాయం జరగాలంటూ సిక్కు నేతలు డిమాండ్ చేయడంతో ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)చే విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డారని, ఇవి ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని సిట్ నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్, నరేశ్లకు శిక్షలు ఖరారు చేస్తూ ఢిల్లీ పాటియాల కోర్టు 2018లో వెలువరించింది.(భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్ దోవల్) #WATCH Haryana Minister Ranjit Chautala on #DelhiViolence: Dange toh hote rahe hain. Pehle bhi hote rahe hain, aisa nahi hai. Jab Indira Gandhi ka assassination hua, toh puri Delhi jalti rahi. Yeh toh part of life hai, jo hote rehte hain. pic.twitter.com/b2zeJRbfmp — ANI (@ANI) February 27, 2020 -
'శ్వాస ఉన్నంత వరకు ఓటు వేస్తూనే ఉంటా'
ఢిల్లీ : 'నా దృష్టిలో ఓటు అనే పదానికి చాలా విలువ ఉంది. ఈ ఆయుధంతోనే రాజకీయ పార్టీల భవితవ్యం ముడిపడి ఉంటుంది.అందుకే నా చివరి శ్వాస వరకు నేను ఓటు వేస్తూనే ఉంటానని' 110 ఏళ్ల వృద్దురాలు కలితారా మండల్ పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలితారా మండల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్రానికి పూర్వం కలితారా మండల్ కుటుంబసభ్యులు బంగ్లాదేశ్లోని బరిసాల్ ప్రాంతంలో నివసించేవారు. అయితే బంగ్లాదేశ్ విభజన అనంతరం వీరి కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ నేపథ్యంలో మండల్ను ఒక మీడియా చానెల్ పలకరించింది. విభజన తర్వాత తొలిసారి ఓటు ఎప్పుడు వేసారని కలితారా మండల్ను అడగ్గా..' నాకు ఆ విషయం గుర్తు లేదు గాని కాంగ్రెస్ పార్టీకి ఎక్కవసార్లు ఓటు వేశాను. విభజన అనంతరం మా కుటుంబం చాలా కాలం శరణార్థుల శిబిరంలో జీవించాము.ఆ తర్వాత మేము అక్కడి నుంచి చత్తీస్ఘర్కు వెళ్లిపోయాము. నా పెద్దకొడుకు సుఖ్రాజన్ మండల్ ఉద్యోగ విషయమై ఢిల్లీకి బదిలీ అవ్వడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. తర్వాత నా చిన్నకొడుకు వ్యాపారాన్ని ఢిల్లీకి మార్చడంతో అప్పటి నుంచి మేము ఢిల్లీలోనే నివసిస్తున్నాం. అప్పటి నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ప్రధాని మోదీ బొమ్మను చూశాను. ఆయన గురించి నా కుటుంబసభ్యులు వివరించడంతో అప్పటి ఎన్నికలలో హస్తం గుర్తుకు కాకుండా పువ్వు గుర్తుకు ఓటు వేశాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు ఢిల్లీలో తలెత్తిన భీతావహ పరిస్థితులు నాకు ఇంకా గుర్తున్నాయి' అంటూ కలితారా మండల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో కలితరా మండల్ ఓటు వేయనున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పమని అడిగితే.. తనకు హస్తం, పువ్వు తప్ప ఇంక ఏం గుర్తులు తెలవదని మండల్ సమాధానమిచ్చారు. 2014లో ఢిల్లీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కలితారా మండల్ తన మనవడిని తీసుకొని వీల్చైర్లో వెళ్లి ఓటు వేసి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పోస్టల్ బాలెట్ ద్వారా మండల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఆర్మీ కుటుంబసభ్యలకు మాత్రమే పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే ఢిల్లీ ఎన్నికల సంఘం రాష్ట్రంలో 80ఏళ్లు పైబడిన వృద్దులకు పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. మండల్తో పాటు మొత్తం 4వేలమంది పోస్టల్ బాలెట్ ద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనున్నారు. -
‘ఇందిరా గాంధీ.. ఆ డాన్ను కలిసేవారు’
ముంబై: దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ ముంబైకి వచ్చినపుడల్లా ఆనాటి డాన్ కరీం లాలాను తరచుగా కలిసేవారని పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో చాలాసార్లు మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. ‘ ఒకప్పుడు.. ముంబై పోలీసు కమిషనర్గా ఎవరు ఉండాలి... మంత్రాలయం(అసెంబ్లీ)లో ఎవరు కూర్చోవాలి అనే విషయాలను దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, శరద్ శెట్టి నిర్ణయించేవారు. ఇందిరా గాంధీ కూడా తరచుగా కరీం లాలాను కలిసేవారు. అండర్ వరల్డ్ ఎలా ఉంటుందో మేమంతా చూశాం. కానీ ఇప్పుడు ఇదంతా చాలా చిల్లర వ్యవహారంగా అనిపిస్తోంది’ అని అన్నారు. అదే విధంగా తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇందిరా గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ సహా గాంధీ కుటుంబంలోని అందరిపై తనకు గౌరవ భావం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరా గాంధీపై విమర్శలు వచ్చిన ప్రతీసారీ తాను ఆమెకు మద్దతుగా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. ఇక ముంబై పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘ కరీం లాలాను కలవడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చేవారు. అతను ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన పఠాన్ వర్గ నాయకుడు. కాబట్టి వారి వల్ల తలెత్తుతున్న సమస్యల గురించి వివరించేందుకు అతడిని కలిసేవారు. అంతేకాదు దావూద్ ఇబ్రహీంతో నేను ఓ సారి ఫొటో సెషన్ ఏర్పాటు చేశాను. దావూద్ను నేరుగా చూసిన అత్యంత తక్కువ మందిలో నేనూ ఒకడిని. తనతో చాలాసార్లు మాట్లాడాను కూడా. అయితే కొన్నిసార్లు అతడి నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాను’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. కాగా స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, కిడ్నాపులు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలతో ముంబైను దాదాపు రెండు దశాబ్దాల పాటు వణికించిన కరీం లాలా(90) 2002లో మరణించిన విషయం తెలిసిందే. Sanjay Raut, Shiv Sena: There was a time when Dawood Ibrahim, Chhota Shakeel, Sharad Shetty used to decide who would be Police Commissioner of Mumbai & who would sit in 'Mantralaya'. Indira Gandhi used to go and meet Karim Lala. We've seen that underworld, now it's just 'chillar' pic.twitter.com/aLC6KoujRZ — ANI (@ANI) January 15, 2020 -
నానమ్మ కోకిలమ్మ
ఇంగ్లిష్ కవి విలియమ్ ఎర్నెస్ట్ హెన్లే రాసిన ‘ఇన్విక్టస్’ (అజేయం) లోని కొన్ని పంక్తులను పొందుపరుస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 19న తన నానమ్మ ఇందిరా గాంధీ 102వ జయంతికి ప్రేమపూర్వకమైన నివాళి అర్పించారు. ‘పిడిగుద్దులకు నా తల బద్దలై రక్తం ఓడుతున్నా.. నేను తలవంచను’ అని అర్థం వచ్చేలా ఉన్న ఆ పంక్తులు ఇందిరలోని పోరాట పటిమను శ్లాఘించాయి. బాల్యంలో తను నానమ్మతో కలిసి ఆడుకుంటున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రియాంక ఈ హెన్లే కవిత్వాన్ని జోడించారు. ఈ ఏడాది అక్టోబర్ 31న కూడా ప్రియాంక తన నానమ్మ వర్ధంతికి ఒక శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘అజ్ఞానం నుంచి వాస్తవం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మరణం నుంచి అమర్త్యం వైపు నన్ను నడిపించు.. ఓం శాంతి శాంతి శాంతి’ అనే ఆ శ్లోకం నానమ్మ తనకు, సోదరుడు రాహుల్కి నేర్పిన తొలి శ్లోకం అని గుర్తు చేసుకున్నారు. శ్రావ్య గాయని లతా మంగేష్కర్ నేటికింకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఊపిరి పీల్చడంలో తలెత్తిన ఇబ్బంది కారణంగా నవంబరు 11న ఈ మెలడీ క్వీన్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ వివిధ రంగాల్లోని ప్రసిద్ధులంతా ఆమెను పరామర్శించి వస్తున్నారు. బయటికి వచ్చాక ‘ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని వాళ్లు చెబుతున్న ఆ ఒక్క మాట మాత్రమే దేశ విదేశాల్లోని లత అభిమానులకు ఊరట చేకూరుస్తోంది. ఆసుపత్రికి వెళ్లి ఆమెకు ఇబ్బంది కలిగించకూడదని అనుకున్నవారు సోషల్ మీడియాలో ఆమె కోలుకోవాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. బాలీవుడ్ పూర్వపు హీరో ధర్మేంద్ర ట్విట్టర్లో ఆమె పాత ఫొటో ఒకటి షేర్ చేసి.. ‘‘ప్రపంచానికి ప్రాణమా.. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండు’ అని కామెంట్ రాశారు. ఆ నలుపు తెలుపు ఫొటోలో ఒక పెయింటింగ్ పక్కన నిలబడి, పెయింట్ బ్రష్ను మునిపంట పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు లత. అరుదైన గాయని అరుదైన చిత్రమది. -
ఇందిర జన్మించిన ఇంటికి పన్ను నోటీసులు
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మించిన ఆనంద్భవన్కు అధికారులు రూ. 4.35 కోట్ల పన్ను నోటీసులు జారీచేశారు. గతంలో నెహ్రూ కుటుంబం నివాసం ఉన్న ఈ ఇల్లు ఢిల్లీలోని ప్రయాగరాజ్లో ఉంది. ప్రస్తుతం ఈ భవంతి జవహార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. ఈ ట్రస్ట్కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇంటి పన్ను కట్టకపోవడంతో మున్సిపల్ శాఖాధికారులు రూ.4.35 కోట్ల మేర పన్ను నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. గతంలోనే పన్ను నోటీసులు పంపించామని, దానిపై ఎలాంటి స్పందన రానందున పూర్తి సర్వే చేశాకే మళ్లీ నోటీసులు ఇచ్చామన్నారు. 2013 నుంచి పన్ను బకాయి చెల్లించలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జవహార్ మెమోరియల్ ఫండ్ అనేది ఓ చారిటబుల్ ట్రస్ట్ అని, దీనికి(ట్రస్ట్లకు) పన్ను మినహాయింపు ఉంటుందని వారు చెప్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ అయిన ఆనంద్ భవన్కు పన్ను నోటీసులు ఎలా జారీచేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
నాయనమ్మకు కవితాంజలి అర్పించిన ప్రియాంక
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 102వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘనంగా నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా, కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వినూత్నంగా ఓ కవితతో నివాళి అర్పించారు. నాయనమ్మ ఇందిరా గాంధీతో తనకున్న అనుబంధాన్ని సూచించే ఫొటోను సోషల్మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఇందిరా గాంధీ.. ప్రియాంక చేతులు పట్టుకుని ఆడిస్తూ నవ్వులు చిందిస్తున్నారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ అత్యంత ధైర్యవంతురాలిగా ఆమె కొనియాడారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో నేను ఏడుస్తూ కూర్చోలేదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను.. నెత్తుటి మరకలనూ సహించానే తప్ప కుంగిపోలేదు’ అన్న ప్రముఖ ఇంగ్లిష్ పద్యాన్ని ఆమెకు అంకితం చేశారు భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న జన్మించారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత ప్రధానిగా తన సేవలను అందించారు. అనంతరం 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్ వరకు మళ్లీ ప్రధాని బాధ్యతలను చేపట్టారు. అనతి కాలంలోనే ప్రపంచం గుర్తించదగ్గ నేతల్లో ఒకరిగా ఖ్యాతి గడించారు. 1984 అక్టోబర్ 31న ఆమె వ్యక్తిగత బాడీగార్డు చేతిలో హత్యకు గురయ్యారు. In memory of the bravest woman I have known. #IndiraGandhi “In the fell clutch of circumstance I have not winced nor cried aloud. Under the bludgeonings of chance My head is bloody, but unbowed. pic.twitter.com/ifmXkighYo — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 19, 2019 -
‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు వెబ్ సిరీస్ల మీద పడింది. ఇప్పటికే బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దిన్ సిద్ధిఖి వంటి ప్రముఖులు వెబ్ సిరీస్లలో నటిస్తూ డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి తాజాగా విద్యాబాలన్ కూడా చేరారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్లో విద్యాబాలన్ నటించనున్నారని సమాచారం. ఈ సిరీస్కి విద్యాబాలనే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. దీని గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘ఇందిరా గాంధీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం హక్కులను రెండేళ్ల క్రితమే నేను తీసుకున్నాను. అయితే ఆ సమయంలో నాకు వెబ్ సిరీస్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. సినిమాకు, వెబ్ సిరీస్కు చాలా తేడా ఉంది. సినిమాతో పోలీస్తే వెబ్ సిరీస్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందిరా జీ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు కాస్త ఎక్కువ సమయమే కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పలేను కానీ ఏడాది, రెండేళ్లలో ఈ వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాను’ అన్నారు విద్యాబాలన్. -
పేట చేనేతకు వందేళ్ల చరిత్ర..
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది.. ఆ కళాకారులది. చేనేత కార్మికులు నైపుణ్యంతో దేశీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, రాజోళి, నారాయణపేట చీరల పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో అద్భుతమైన చీరలు తయారవుతున్నాయి. సాధారణ నూలుతోనే ఆకర్షించే చీరలు నేస్తూ..విభిన్నమైన చీరలు రూపుదిద్దడంలో తమకు తామే సాటని చాటుతున్నారు. మగ్గాలపై తమలోని తృష్ణను బయటకు తీసి, చీరలపై అందమైన డిజైన్లుగా మారుస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, మహబూబ్నగర్(నారాయణపేట) : పల్లె నుంచి పట్నం వరకు అడిగిమరి కొనే చీరల్లో నారాయణపేట పట్టు ఒకటి. ఇక్కడి చేనేతకు వందేళ్ల చరిత్ర ఉంది. అంతటి మన్నికైన.. అపురూపమైన డిజైన్ల చీరలను తయారు చేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభ. పేట చీరల చీరల తయారీకి పట్టణంతో పాటు జాజాపూర్, కోటకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. 1900 సంవత్సరం నుంచే ఇక్కడ పట్టుచీరలు తయారుచేస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. మగ్గాలపై చీరలు నేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించిన నారాయణపేట కార్మికులు నాలుగు సంవత్సరాల క్రితం జియోగ్రాఫికల్ నుంచి పెటెంట్హక్కును సాధించుకున్నారు. అగ్టిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు నారాయణపేట పట్టుచీరలు దేశ, విదేశాల్లో సైతం ఖ్యాతిని సంపాదించుకున్నాయి. పెద్ద, పెద్ద పట్టణాల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్కు అనుగుణంగా చీరలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అగ్గిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి సైతం ఈ చీరలు కట్టుకుందంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం పరిపాటి. పట్టులో రకాలు పట్టు చీరల్లో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. టెంపల్ గర్భరేషన్, నిఖల్, పారాస్, పైటీనియా, సైటనీ, నీవాళి దనవతి, శివశంభు, నివాళి శివశంలలో కడ్డి మరియూ ప్లేన్ రకాలతో పాటు స్పెషల్ బార్డర్ వంటివి ప్రత్యేక ఆకర్శణగా ఉంటాయి. వీటికి తోడు కొత్తగా వస్తున్న మాడల్స్కు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరగడంతో చీరల ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో చీర నేయడానికి రెండు నుంచి మూడు రోజలు సమయం పడుతుంది. గల్లి నుంచి ఢిల్లీ వరకు విక్రయాలు ‘పేట’ నేత కార్మికుల కుటుంబాలు తయారు చేసిన పట్టు చీరలు ఢిల్లీ వరకు అమ్మకానికి వెళ్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, వరంగల్, పూణె, ముంబాయి, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, అహ్మదాబాద్, నాగ్పూర్, రాయిచూర్, గుల్బర్గ, యాద్గీర్, బెంగుళూర్, విజయవాడ, విషాఖపట్నం దుకాణాల్లో ప్రత్యేకంగా అమ్ముతుంటారు. డిల్లీలో సైతం ‘పేట’ పట్టు చీరలు దొరకడం విశేషం. పెళ్లిలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. గద్వాల టౌన్: సంస్థానాధీశుల కాలం నుంచి నేటి తరం ఆధునిక మహిళల మనస్సును కట్టిపడేసే డిజైన్లను అద్దుకున్న గద్వాల చీర నేడు దేశ, విదేశీ వనితల ఆదరణ పొందుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. కాటన్ చీరకు జరీ అంచుతో డిజైన్ చేయబడిన నాటి తరం సంప్రదాయాన్ని కొనసాగిస్తునే నేటి అదునిక అవసరాలకు అనుగుణంగా సీకో(కాటన్, సిల్క్)లను కలిపి దారంతో సరికొత్త డిజైన్లతో మహిళలను మనస్సుకు నచ్చేలా గద్వాల ప్రాంత చేనేత కార్మికులు చీరల నేతలను కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడిన నాలుగు వందల ఏళ్ల నాటి నుంచి గద్వాల చీరకు ప్రత్యేక కాలగుణంగా ప్రత్యేకత ఉండేలా చేనేతకు ప్రాణం పోస్తున్నారు. ఆదునిక సాంకేతకను జోడిస్తూ గద్వాల చీర ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఇక్కడి చేనేత వృత్తిని సగర్వంగా కాలంతో వస్తున్న పోటీలో నిలుస్తున్నారు. చీరల తయారీలో మాస్టర్ వీవర్స్, వీవర్స్ తమ వృత్తిలో నిల్చునేలా, గద్వాల చీరకు ప్రత్యేకత, గుర్తింపు, మహిళల ఆదరణ ఉండేలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. సంస్థానాధీశుల కాలంలో చేనేత కార్మికులు తమ చేనేత కళ ప్రతిభతో అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా తయారు చేసేవారు. ఆ నాటి నుంచి తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే దసర బ్రహ్మోత్సవాలలో గద్వాలలో నిష్టగా తయారు చేసిన ఎరవాడ పంచెలను ధరింప చేస్తున్నారు. అంతటి ప్రత్యేక గద్వాల చీరలకు, చేనేత ప్రతిభకు ఉంది. రూ.1200 నుంచి రూ.40వేల విలువ వరకు... కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్లో గద్వాల వారసత్యంగా వస్తున్న డిజైన్లతో పాటు, నేటి ఆదునిక డిజైన్లను నేస్తున్నారు. జరీలో వెండి, రాగి, బంగారుతో తయారైన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మద్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభతో అందాలను అద్దుతున్నారు. గద్వాల చీర రూ.12 వందల నుంచి రూ.40 వేల విలువ వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్ను మరింత ఖరీదుతో చేయాలంటే ముందస్తు ఆర్డర్ను ఇవ్వాల్సింటుంది. -
ఆదర్శప్రాయుడు ‘కాసు’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, హిందుస్థాన్ కేబుల్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర దిగ్గజ సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించి రాష్ట్రం పారిశ్రామికంగా సుసంపన్నం కావడానికి దోహదపడిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 110వ జయంతి నేడు. ‘నాలుగు కోట్ల ఆంధ్రుల మనఃఫల కంబుల కాసు వంశ భూపాలుని పేరు ముద్రపడి భాసిల్లుచున్నది తెల్గురాణి...’ అంటూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చేసిన ప్రశంసకు ఆయన అన్నివిధాలా అర్హులు. తెలుగుజాతికి చేసిన సేవలు అటువంటివి మరి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్లలో వెంకటకృష్ణారెడ్డి, శాయమ్మ దంపతులకు 1909 జూలై 28న జన్మించిన బ్రహ్మానందరెడ్డి తిరువనంతపురం వర్సిటీలో న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఆ వృత్తిలోకి ప్రవేశించారు. అచిర కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. జిల్లా బోర్డుకు 1936లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వాతం త్రోద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు అరెస్టయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మహాత్మా గాంధీని స్వయంగా కలుసుకున్నాక ఆయన స్ఫూర్తితో ఖద్దరు వస్త్రధారణకు మారారు. 1964 ఫిబ్రవరి 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రాన్ని బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దారు. బాలికా విద్యకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. వారికి సెకండరీ స్థాయి వరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు. అంతేకాదు... బాలికల కోసం విస్తృతంగా ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు... జిల్లా పరిషత్తులకు సంపూర్ణ అధికారాలిచ్చారు. బీసీల రిజర్వేషన్లు అమలుచేసి, మున్నూరు కాపుల్ని ఆ జాబితాలోకి తీసుకొచ్చారు. ఎస్టీ వర్గాల పురోగాభివృద్ధికి కృషిచేశారు. ఆ రోజుల్లో రూ.10 కోట్లు ఎల్ఐసీ రుణంతో బలహీన వర్గాలకు తొలిసారి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. స్వయానా క్రీడాకారుడైన ఆయన సీఎంగా క్రీడలకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం ఆయన హయాంలోనే నిర్మాణమైంది. బ్రహ్మానందరెడ్డి 1964 మొదలుకొని 1971 వరకూ ఏడేళ్లపాటు సీఎంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రత కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆరో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధీ రాజీనామా చేసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయనతో ఇందిరాగాంధీకి విభేదాలు తలెత్తి ఇందిరా కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే 1980లో తన నాయకత్వంలోని కాంగ్రెస్ను ఆయన ఇందిరా కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజీవ్గాంధీ హయాంలో మహారాష్ట్ర గవర్నర్గా పని చేశారు. 1994 మే నెలలో కన్ను మూసిన బ్రహ్మానందరెడ్డి చివరివరకూ విలువలకు కట్టుబడి జీవించారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తింపుగా స్మృతివనం ఏర్పాటుచేస్తే సముచిత నివాళి అర్పించి నట్టవుతుంది. -వందవాసి అవంతి, గుంటూరు -
72ఏళ్ల బడ్జెట్ ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ : 2019-20 సంవత్సారానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా శుక్రవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. రక్షణశాఖ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మహిళగా రికార్డులకెక్కనున్నారు. ఆర్థిక సవాళ్లను అధిగమించి అన్ని వర్గాలకు అనుగుణంగా బడ్జెట్ను ప్రవేశపెడతారో లేదో చూడాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముకం షెట్టి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టి భారతీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 72 ఏళ్ల బడ్జెట్ ప్రస్థానం పై ఓ లుక్కేద్దామా.. చదవండి: వరాల సీతమ్మ స్వతంత్ర భారత తొలి బడ్జెట్ భారతదేశానికి స్వాతంత్రం లభించిన మూడేళ్లకు 1950 సంవత్సరంలో రెండో ఆర్థిక మంత్రిగా జాన్మెతాయ్ నేతృత్వంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటుకు బాటలు పరిచిన ఈ బడ్జెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు జవహర్లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బడ్జెట్ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1973-74 సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ రావు చౌహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్గా అభివర్ణించారు.అప్పటికే ఇంధనానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి మంత్రి చౌహన్ బడ్జెట్ లో పెద్దమొత్తంలో బొగ్గు గనుల వెలికితీత, ఇన్యూరెన్స్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో దీనికి బ్లాక్ బడ్జెట్గా పేరు వచ్చింది. క్యారెట్ స్టిక్ బడ్జెట్ వీపీ సింగ్ ప్రభుత్వం పిబ్రవరి 28, 1986లో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 'పర్మిట్ లైసెన్స్ లేదా లైసెన్స్రాజ్' ను మొదటి సారి తీసుకొచ్చిన బడ్జెట్గా నిలిచింది. వివిధ రకాల వస్తువుల కొనుగోలుపై వినియోగదార్లు కట్టాల్సిన పన్నులపై భారం తగ్గించేందుకు మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్( మోడ్వాట్) పేరుతో అమల్లోకి తీసుకువచ్చిన ఘనత వి.పి.సింగ్ ప్రభుత్వానికే దక్కుతుంది. చారిత్రాత్మక బడ్జెట్ 1990ల కాలంలో సోవియట్ యూనియన్ విచ్చిన్నం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అప్పుడు భారతదేశానికి పీ.వీ నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతీయ బడ్జెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మొదటిసారి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవటైజేషన్ పేరుతో విడదీసి ఆర్థికంగా ఎదుగదలను చూపారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకొని భారతదేశాన్ని బలీయమైన ఆర్థికశక్తిగా తయారుచేసింది డ్రీమ్ బడ్జెట్ 1997-98 మధ్య కాలంలో అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టారు. కొత్త విధాన పన్ను విధాన సంస్కరణలను ప్రవేశపెట్టడంతో దీన్ని డ్రీమ్ బడ్జెట్ అని పేర్కొంటారు. అపర చాణక్యుడైన పి.చిదంబరం 2004లోనూ యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించి పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మిలీనియం బడ్జెట్ 1999లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రేసేతర పార్టీగా 2000సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు. మిలీనియంలోకి అడుగు పెట్టిన తర్వాత భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఆ సమయంలోనే ఐటీ రంగం దేశంలో అడుగుపెట్టి దూకుడుగా పరిగెడుతుంది. యశ్వంత్ సిన్హా అప్పటి బడ్జెట్లో ఐటీ సంస్కరణలకు, పెట్టుబడులకు పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ యాక్ట్-2002 చట్టం తీసుకువచ్చి నూతన అధ్యాయానికి తెరతీశారు. ఇక చివరగా 72 వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో.. ఇప్పటివరకు అత్యధికంగా మొరార్జీ దేశాయ్ 10సార్లు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి వ్యక్తిగా మొదటిస్థానంలో ఉన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక మహిళ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది లేదు. ఇంతకు ముందు ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్థిక మంత్రిగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్లారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం భారతీయ చరిత్రలో బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 100 మంది ఆర్థికవేత్తలు బడ్జెట్ తయారీకి పది రోజుల ముందే ఒక దగ్గరకు చేరి సంవత్సరంలో సాధించిన ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఆర్థికమంత్రికి ఒక నివేదిక రూపంలో అందజేస్తారు. బడ్జెట్ ప్రవెశపెట్టే ప్రతీసారీ ఆర్థికమంత్రే స్వయంగా హల్వా తయారు చేసి అధికారులకు తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో హల్వా కార్యక్రమం ముగిసిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులను ఢిల్లీలోని నార్త్బ్లాక్ కార్యాలయానికి గోప్యంగా తరలిస్తారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు దానికి సంబంధించిన ప్రతులను ఎక్కడా లీకవ్వుకుండా గోప్యంగా ఉంచడమే వీరి కర్తవ్యం. ఒక్కసారి బడ్జెట్ ప్రతులకు సీలింగ్ వేసిన తర్వాత ఆర్థిక మంత్రి కి కూడా ముట్టుకునే అధికారం ఉండదు. 1950 సంవత్సరం వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవనలో ముద్రించేవారు. అయితే తరలించేటప్పుడు కొన్ని బడ్జెట్ ప్రతులు లీకవ్వడంతో అక్కడి నుంచి మింట్ రోడ్లోని గవర్నమెంట్ ప్రెస్కు తరలించారు. 1980 తర్వాత నుంచి బడ్జెట్ ప్రతులను ఢిల్లీలోని నార్త్బ్లాక్లోనే గోప్యంగా ముద్రణ కొనసాగిస్తున్నారు. -
1975 జూన్ 25.. అప్పుడేం జరిగింది?
భారతదేశ చరిత్రలో చీకటి రోజు అది. ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు. సరిగ్గా 44 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారంకోసం యావత్ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించిన రోజు. అప్పటి ఇందిర ప్రత్యర్థి రాజ్ నారాయణ్ తరఫున వాదించిన లాయర్లలో ఒకరైన జేపీ గోయెల్ అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజు జరిగిన ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. గోయెల్ చెప్పిన ఆ విషయాలను ఆయన కుమార్తె రమా గోయెల్ ‘సేవింగ్ ఇండియా ఫ్రం ఇందిర’పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అందులోని వివరాల ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నారాయణ్ ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఇందిర రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 25వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని బయటకు చదివి వినిపించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని కానీ, తుది తీర్పు వెలువడే వరకు ఆమె ఎంపీగా కొనసాగరాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇందిర మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని ఆ తీర్పులో పేర్కొ న్నారు. తీర్పు కాపీతో నేను బయటకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఆవరణ ఒక జనసంద్రంగా మారింది. పత్రికా విలేకరులు, ఇతర లాయర్లందరినీ దాటు కొని చాంబర్కు వెళ్లడానికి గంటకు పైగా పట్టింది. ప్రతిపక్షాల తీర్మానం చాంబర్లోకి వెళ్లిన కాసేపటికే రాజ్ నారాయణ్ ఆయనకు ఫోన్ చేశారు. అలహాబాద్ ఉత్తర్వులపై సుప్రీం పూర్తిస్థాయిలో స్టే విధించకపోవడంతో ఇందిర దిగిపోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ అభ్యర్థించారు. అప్పటికే విపక్ష నేతలందరూ మొరార్జీ దేశాయ్ నివాసానికి చేరుకున్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ కలిసి కూర్చొని కనిపించారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ తన తీర్పులో ఇందిర ప్రధాని పదవిలో ఉండాలని తీర్పు ఇచ్చినప్పటికీ ఆమె దోషి అన్న అర్థం వచ్చేలా రాజకీయ పరమైన ఆస్తులు, ప్రజాస్వామ్య ధర్మాలు వంటివి ప్రస్తావించారు. దీంతో ఇందిర దిగాల్సిందేనంటూ కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్దళ్, జన్సంఘ్, సోషలిస్టు పార్టీ, అకాలీదళ్లతో కూడిన అయిదు పార్టీలు తీర్మానించాయి. అదే రోజు సాయంత్రం జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ప్రసంగించారు. ఇందిర వెంటనే గద్దె దిగకపోతే అయిదు విపక్షాల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులందరూ శాంతియుతంగా సత్యాగ్రహానికి దిగుతామని ప్రకటించారు. ఆ సభలో రాజ్ నారాయణ్ కూడా మాట్లాడారు. సభ ముగిసేసరికి రాత్రి 9.30 గంటలైంది. రాజ్ నారాయణ్ వాళ్లింటికి రమ్మని కోరడంతో వెళ్లాను. జరగరానిదేదో జరగనుందని అనుమానించిన రాజ్.. అక్కడే ఉండాలని కోరడంతో అక్కడే ఉండిపోయా. క్లైమాక్స్ ఎలా మారిందంటే.. నాకింకా నిద్ర పట్టలేదు. అప్పట్లో రాజ్ నారాయణ్ కార్యదర్శిగా ఊర్మిలేశ్ నన్ను లేపారు. ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్నారు. అప్పటికే జయప్రకాశ్ నారాయణ్ని అరెస్ట్ చేశారని సమాచారం అందినట్టు తెలిపారు. నేను హుటాహుటిన రాజ్ నారాయణ్ గదిలోకి వెళ్లేసరికి పోలీసులు ఆయనను అంతర్గత భద్రతా వ్యవహారాల చట్టం, 1971 (మిసా) కింద అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మాకు అర్థమైంది ఇందిర రాత్రికి రాత్రి ఎంతకి తెగించారో. అన్నింటికీ సిద్ధపడిన రాజ్ నారాయణ్ స్నానం చేసి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చేవరకు పోలీసులు ఎదురు చూశారు. తర్వాత ఆయనను అరెస్ట్చేసి తీసుకువెళ్లిపోయారు. ది స్టేట్స్మన్, హిందూస్తాన్ టైమ్స్ మరో రెండు పత్రికలు తప్ప మిగతావేవీ మర్నాడు రాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్352 ప్రకారం అంతర్గత భద్రత ముప్పుగా మారడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినట్టు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఉత్తర్వులే అన్ని పత్రికల్లో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత హిందూస్తాన్ టైమ్స్ పత్రిక నా స్పందన కోరితే నేను చెప్పింది ఒక్కటే. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి కాదు. తన పదవి కాపాడు కోవడానికి ఇందిర విధించిన వ్యక్తిగత అత్యవసర పరిస్థితి. ఈ దేశంలో ప్రజాస్వామ్యమే నశించింది. అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇందిర పదవి దిగిపోయి ఉంటే హుందాగా ఉండేది.. అని లాయర్ జేపీ గోయల్ ముక్తాయించారు. ‘ఎమర్జెన్సీ హీరో’లకు ప్రధాని సెల్యూట్ న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిని ఎదురించి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ప్రధాని మోది నివాళులర్పించారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన మహనీయులందరికీ దేశం సెల్యూట్ చేస్తోంది. నియంతృత్వ విధానాలపై భారత దేశ ప్రజాస్వామ్య విలువలు విజయం సాధించాయి. 1975లో ఇదే రోజు అధికారం కోసం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఎందరో భారతీయ జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ నేతలు ముందుండి పోరాడారు’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటిరోజులుగా మిగిలిపోయాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారందరికీ నివాళులర్పించారు. ఐదేళ్లుగా సూపర్ ఎమర్జెన్సీ:మమత అప్పటి ప్రభుత్వం ఇదే రోజు 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి దాదాపు రెండేళ్లు కొనసాగిందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
నాడు ఇందిరా గాంధీ.. నేడు నిర్మల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలిలో ఆర్థిక శాఖ ఎంతో కీలకమైనది. ఆ శాఖ బాధ్యతలు చేపట్టాలంటే ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతులై ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థపై మంచి అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా ఆ శాఖ మంత్రి సమర్థులై ఉండాలి. ఇప్పుడీ అవకాశం కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి నిర్మలా సీతారామన్కు దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు ఈ అరుదైన ఘనత సాధించారు. శుక్రవారం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో.. అనుహ్యాంగా నిర్మలా సీతారామన్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో దేశ ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మల చరిత్ర సృష్టించారు. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970-71లో ఆర్థిక శాఖను ఆమె వద్దే అంటిపెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖను నిర్వహించిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. కాగా దేశ తొలి మహిళా రక్షణ శాఖమంత్రిగా కూడా నిర్మల రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మోదీ గత కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంగా మంత్రి పదవి చేపట్టడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఆ అవకాశం నిర్మలా సీతారామన్ను వరించింది. తమిళనాడులో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నిర్మల అనంతరం.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్యూ నుంచి ఎంఫిల్ పట్టాపొందారు. నిర్మలకు ఇంతకు ముందే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభం ఉంది. వాణిజ్య శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా కేంద్ర కేబినెట్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన నిర్మల.. రఫేల్ వివాదంలో ప్రధాని మోదీకి అండగా నిలిచారు. రక్షణ శాఖపై పార్లమెంటులో ప్రతిక్షాలు లేవనెత్తిన అంశాలపై ధీటైన సమాధానాలు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
గెలుపు సంబరాలతో సెలవు ప్రకటించిన ఇందిర..!
న్యూఢిల్లీ : సరిగ్గా ముప్పయ్ఆరేళ్ల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కపిల్దేవ్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై 1983 ప్రపంచకప్ సాధించింది. దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్ అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత నిలిచి మాంచి జోష్లో ఉండగా.. ఫైనల్లో ఆ జట్టును ధీటుగా ఎదుర్కొన్న టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్ల కృషికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఫిదా అయ్యారు. ఫైనల్లో మనదేశం విజయం సాధించిందని తెలియడంతో.. క్రికెట్లో భారత్ విశ్వవిజేతగా అవతరించిన (25 జూన్, 1983) మరుసటి రోజున దేశంలో సెలవు దినంగా ప్రకటించారు. వివిఎన్ రిచర్డ్స్ ఔట్.. లార్డ్స్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు కేవలం 183 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. చేజింగ్కు దిగిన విండీస్ను భీకర ఫామ్లో ఉన్న వివిఎన్ రిచర్డ్స్ గెలుపుదిశగా తీసుకెళ్తున్న తరుణంలో మదన్లాల్ అతన్ని ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. కపిల్దేవ్, మదన్లాల్, అమర్నాథ్ అద్భుత బౌలింగ్తో విండీస్ 140 పరుగులకే చాపచుట్టేసింది. భారత శిగన ప్రపంచకప్ చేరింది. స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు రివార్డులిచ్చేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేకపోవడం గమనార్హం. పెద్ద మనసుతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ వారికి ఆపన్నహస్తం అందించారు. మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా వచ్చిన రెండు లక్షల రూపాల్ని వారికి రివార్డుగా ఇచ్చి సత్కరించారు. -
‘గాంధీ’ అంటే మహాత్మ గాంధీ కాదు..
ముంబై : కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ.. వారి ఇంటి పేరులోని ‘గాంధీ’.. ‘మహత్మా గాంధీ’ని సూచించదు.. ‘ఫిరోజ్ గాంధీ’ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ గాంధీ అని అందరికి తెలిసిన సంగతే. అయితే నెహ్రూకు, ఫిరోజ్కు మధ్య అంత మంచి సంబంధాలు ఉండేవి కావనే విషయం కూడా విదితమే. మధ్యప్రదేశ్ విదిశలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఉమాభారతి.. ‘మన మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనను తాను రాజా అని చెప్పుకుంటారు. కానీ సోనియా గాంధీ ఇంటి బయట క్యూలో నిల్చుంటారు. దత్ తివారి.. సంజయ్ గాంధీ చెప్పులు మొసుకొచ్చేవారు. పెద్ద పెద్ద నాయకులు సైతం ఇందిరా గాంధీ ముందు చేతులు జోడించి నిల్చునేవారు. వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే.. వారి పేరు చివర ‘గాంధీ’ అని తగిలించుకున్నారు. అయితే ఇక్కడ ‘గాంధీ’ అంటే ‘జాతిపిత’.. మహాత్మ గాంధీ కాదు.. ‘ఫిరోజ్ గాంధీ’’ అని ఉమా భారతి తెలిపారు. అంతేకాక ‘‘గాంధీ’ అనే ఇంటి పేరును వాడుకునే హక్కు ఆ కుటుంబానికి లేదు. అయినా వాడుకుంటున్నారు. ఎందుకంటే ‘గాంధీ’ అనే ఇంటి పేరు వారికి గౌరవాన్ని కల్గిస్తుందని తెలుసు. అందుకే ఆ పేరును వాడుకుంటున్నారు. కానీ ఆయన ఆదర్శాలను మాత్రం పాటించరు. మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడిచే ఏకైక వ్యక్తి మోదీ మాత్రమే’ అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక ‘కాంగ్రెస్ నాయకులు మేము తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నామా.. అధికారంలో ఉన్నామా అనే దాని గురించి మా పార్టీ పట్టించుకోదు. ప్రజలకు మేలు చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తుంద’ని చెప్పుకొచ్చారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కులుస్తారని ఉమా భారతి పేర్కొన్నారు. -
విప్లవోద్యమ అగ్నికెరటం !
సాక్షి, తెనాలి : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవోద్యమ అగ్నికెరటం అన్నాప్రగడ కామేశ్వరరావు.చిరుప్రాయంలోనే బ్రిటీష్ సైన్యంలో చేరినా, నాలుగేళ్లకే తిరుగుబాటు చేశాడు. మడమ తిప్పని పోరాటంతో బ్రిటిష్ పోలీసులు, గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ఫోర్డ్కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆ క్రమంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపారు. తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై గుంటూరు జిల్లా మొదటి ఎమ్మెల్యేల బృందంలో సభ్యుడయ్యారు. రాజకీయాలపై ఏవగింపు కలిగి పూనేలో స్థిరపడ్డారు అన్నాప్రగడ కామేశ్వరరావు. యుక్తవయసులోనే విప్లవ భావాలు.. నాదెండ్ల మండలం కనుపర్తిలో 1902 అక్టోబర్ 21న అన్నాప్రగడ రోశయ్య, లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడిగా కామేశ్వరరావు జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే వయసు ఎక్కువ చెప్పి బ్రిటిష్ సైన్యంలో చేరారు. బ్రిటిష్ అధికారుల ఆదేశంతో 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లారు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తి ప్రేరేపితుడయ్యాడు. అనంతరం సైన్యంలో ఉంటూనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఖైదు చేశారు. 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1922 జనవరి 22న ఆయన విప్లవ పోరాటంలో తొలిసారిగా నరసరావుపేటలో అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు ఏడాది శిక్ష విధించింది. రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా వేలాది ప్రజలు అడ్డుకున్నారు. ‘నా బిడ్డతోపాటు స్వాతంత్య్రం కోసం నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను’ అని అన్నాప్రగడ తల్లి లక్ష్మీదేవి చేసిన ఉపన్యాసం ప్రజల్ని ఉత్తేజపరచింది. విప్లవయోధులతో స్నేహం, వివాహం రాజమండ్రి జైల్లో గదర్ పార్టీ నాయకులు పండిత్ జగం రామ్, గణేష్ రఘరామ్, వైశంపాయన్లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్ సభలకు వెళ్లారు. 1924లో సావర్కరు, అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్ చేరారు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భటుకేశ్వరదత్తు, సురేంద్రనాథ్ పాండే, రాజగురుతో స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నారు. లాహోరు కుట్రకేసులో పోలీసులు అరెస్టు చేయబోగా, బరోడా మహారాజు శాయోజీ గైక్వాడ్ సహకారంతో తప్పించుకున్నాడు. భగత్సింగ్ను జైలునుంచి తప్పించాలని.. అన్నాప్రగడ కొంతకాలం మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం వద్ద రహస్య జీవితం గడిపారు. భగత్సింగ్ను జైలు నుంచి తప్పించి విదేశాలకు పంపించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ఎ.కె.రావు పేరుతో 1931 సెప్టెంబర్ 22న నకిలీ పాస్పోర్టు సంపాధించినా ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. 1931 మార్చి 23న భగత్సింగ్ బృందాన్ని ఉరితీశాక అదే నకిలీ పాస్పోర్టుతో అన్నాప్రగడ తన భార్యాపిల్లలను దక్షిణాఫ్రికా తీసుకెళ్లి బంధువుల ఇంట్లో వదిలేశారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఆర్మీ గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ పొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు.. 1935–36లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1939లో స్వగ్రామం కనుపర్తిలో గృహనిర్బంధం నుంచి తప్పించుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు దేశరక్షణ చట్టం కింద అరెస్టయ్యారు. కమ్యూనిస్టు పార్టీతో విభేదించిన కామేశ్వరరావు క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. 1946లో తెనాలి– గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయ కాలుష్యం కారణంగా రాష్ట్రాన్ని వదిలి 1956లో పూనాలో స్థిరపడ్డారు. ఇందిరాగాంధీ హయాంలో ఆమె ఆదేశాల ప్రకారం అఖిల భారత స్వాతంత్య్రసమరయోధుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా దేశమంతటా తిరిగి స్వాతంత్య్రసమరయోధులకు పింఛన్లు ఇప్పించటంలో కీలకపాత్ర వహించారు. అన్నాప్రగడ 1987 జనవరి 30న తుదిశ్వాస విడిచారు. -
‘ఇందిరకో న్యాయం.. మోదీకో న్యాయమా’
గాంధీనగర్ : పాకిస్తాన్ను విడదీసి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన ఘనతను ఇందిరా గాంధీకి ఆపాదించినప్పుడు.. సర్జికల్ స్ట్రైక్స్ ఘనత నరేంద్ర మోదీకి దక్కడంలో తప్పేంటని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. గాంధీనగర్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో మన దేశం విజయం సాధించింది. ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఈ ఘనత అంతా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీదే అంటూ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల కూడా అభినందించాయి. ఈ యుద్ధం తర్వాత బీజేపీ నాయకుడు వాజ్పేయి కూడా ఇందిరా గాంధీని పొగిడారు. ఆమె నిర్ణయాన్ని దేశ ప్రజలంతా కొనియాడుతున్నారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు ఉగ్రశిబిరాల మీద సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇందుకు మోదీని అభినందిస్తే తప్పేంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ‘ముష్కరులు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. ఇందుకు ప్రతీకారంగా మోదీ మన సైన్యానికి అన్ని అధికారాలు మంజూరు చేశారు. మన జవాన్ల మీద దాడి చేసిన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం బాలాకోట్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఎన్నికల జిమ్మిక్కుగా విమర్శించడం దారుణం. అంటే మోదీ సాధించిన విజయానికి ఆయన క్రెడిట్ తీసుకోవద్దా’ అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఏళ్లుగా అద్వాణీ పోటీ చేస్తూ వస్తోన్న గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఈ సారి అమిత్ షా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఇందిరా గాంధీకి లేటెస్ట్ వెర్షన్
రూపురేఖల్లో మాత్రమే ప్రియాంక నాయనమ్మను పోలివుందా? జనం మదిని గెలవడంలోనూ, ప్రజల హృదయాలను తాకడంలోనూ, అన్న రాహుల్తో పోలికే లేదా? జనంతో మమేకమవుతున్న తీరు, స్వీయ భద్రతను సైతం తోసిరాజని ప్రజల దరి చేరేందుకు ఆమె చూపుతోన్న చొరవ ప్రియాంకా ఛరిష్మాను రెట్టింపు చేస్తున్నాయన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆలయాల్లో దైవ దర్శనం నుంచి, పార్టీ కార్యకర్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వరకు ప్రియాంక తీరు చూస్తోంటే, కాంగ్రెస్కి పునర్వైభవం వచ్చినట్టేనన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. చీరకట్టు మొదలుకొని పెద్దలకు నివాళ్లర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం వరకూ ఆమె ప్రతి అడుగూ నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తోందంటున్నారు ఆమె సభలకు హాజరైన ప్రముఖులు. రాజకీయవేత్తగా ప్రియాంక వాద్రా పరిణతి చెందడానికి ఇంకా సమయముందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నా.. రాజకీయాల్లో ఆమె తొలిఅడుగులు ఆమెలోని సహజసిద్ధ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతున్నాయి. మాటల్లో పరిణతి.. చాలా కాలంగా ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నా.. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేతికి వచ్చాక, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో విజయాలు సాధించిన తరువాతే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోవడం ఆమెకు రాజకీయాల్లో ఉన్న సానుకూలతను ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఇప్పటికీ పార్టీలోని చాలామంది ప్రియాంక రాజకీయ ప్రవేశం ఇంకా ముందే జరిగి ఉండాలనే అభిప్రాయంతో ఉన్నా.. ఎంట్రీ ఎప్పుడిచ్చినా అది అన్న రాహుల్ నాయకత్వానికి సానుకూలతను సాధించిపెట్టడానికే అన్న భావన ప్రస్ఫుటమౌతోంది. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడిన మాటలు ఆమె పరిణతి వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. జనంతో మమేకం.. ఎన్నికల ప్రచారానికి నిర్దేశించిన టైమ్ షెడ్యూల్ని ప్రియాంక వాద్రా ఎప్పుడూ పాటించలేదు. నిజానికి ఆమె జనంలోకి వెళ్లాక ఆమెను పట్టుకోవడం గగనమే. జనం మధ్యలోంచి దూసుకెళుతోన్న కారుని ఆమె ఏ క్షణంలోనైనా ఆపేసి కారు దిగి రోడ్డువారగా బారులుతీరిన జనంతో కరచాలనం చేస్తుంది. భద్రతాసిబ్బంది వారిస్తున్నా వినకుండా జనం మధ్యలోకి వెళ్లిపోతుంది. నిజానికి రాహుల్ కన్నా ప్రియాంక ఎంతమంది జనం మధ్యలో ఉన్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కలగలిసిపోగలదు. అంతేకాదు. తన కారులోనే పార్టీ కార్యకర్తలను ఎక్కించుకొని ఒక నాయకురాలి సరసన కూర్చునే అవకాశంతో పరవశించిపోయిన వారి ముఖాల్లో ఆనందాన్ని ఆస్వాదించనూగలదు. నాయనమ్మ శైలిలో.. ఆనంద్భవన్కి వెళ్లి పెద్దల ఫొటోల వద్ద పూలు ఉంచి నివాళ్లర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం నాయనమ్మ ఇందిరాగాంధీని తలపిస్తోంది. ప్రచారంలో సైతం నాయనమ్మ చీరలనే ప్రియాంక కట్టుకుంటున్నారు. అయితే ఇందిరాగాంధీ కన్నా ప్రియాంక కాస్త పొడవు కావడంతో ఇందిరాగాంధీ కట్టిన చీరలు రెండింటిని కలిపి కుట్టించి ప్రియాంకా ధరిస్తోంది. ఎటువంటి దర్యాప్తులకూ భయపడనని స్పష్టం చేస్తోన్న ప్రియాంకా వాద్రా తను ఎక్కడున్నా పెదవులపై చిరునవ్వుని చెరగనివ్వకపోవడం ఆమె స్థైర్యాన్ని చెప్పకనే చెపుతోంది. మొదట ఆలయం.. ఆపై ప్రచారం స్వతహాగా ప్రియాంక బుద్ధిస్టు అయినప్పటికీ తను ఎక్కడ ప్రచారం ప్రారంభించాలన్నా ముందుగా ఆ ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆపై ప్రచారానికి శ్రీకారం చుడతారు. గుళ్లో నుంచి బయటకు వచ్చిన ప్రియాంకను ‘మీ సోదరుడి కోసం మీరు ప్రార్థించారా?’ అని మీడియా ప్రశ్నిస్తే మతాన్ని రాజకీయాల నుంచి వేరుగా చూడాలని వ్యాఖ్యానించడంలోని అంతరార్థం ఆమె రాజకీయ పరిణతికి నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రియాంకాలో ఎన్ని ప్రత్యేకతలున్నా తన దారిలో ఎదురైన అన్ని అడ్డంకులనూ దాటుకొని విజయతీరాలను చేరుకోవడం నల్లేరు మీద నడకైతే కాదు. ఇంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్ను గట్టెక్కించడం కష్ట సాధ్యమే. దీర్ఘకాలిక ప్రణాళికతో తన ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు కూడా ప్రియాంక కనిపిస్తోంది. దళితులకు దగ్గరవడం కోసం బీజేపీలో చేరాలని భావించి, ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోన్న దళిత నాయకురాలు సావిత్రీబాయి ఫూలేని వెంటబెట్టుకొని దళిత ఓటర్లదగ్గరికి వెళుతున్న ప్రియాంక ఎత్తుగడలు నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ పలువురు వెనుకబడిన వర్గాల ప్రజలను కలుస్తున్నారు. బోటులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆమె పక్కన చాలామంది కూర్చోవాలనే కుతూహలంతో ఉన్నా, ఆమె పక్కన స్త్రీలకెప్పుడూ చోటుంటుంది. కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక యూపీలో ఇదే ఆమె తొలి ప్రచార కార్యక్రమం. దీని తరువాత ఆయోధ్య, రాయ్బరేలిలో కూడా ప్రియాంక పర్యటించనున్నారు. ప్రియాంకకు ఉన్న ఛరిష్మా, కలిసిపోయే మనస్తత్వం కాంగ్రెస్ విజయానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. ఒంటరి పోరు.. అయితే ఇంత చేస్తున్నా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో ప్రియాంకా వాద్రా కనిపించకపోవడం విచిత్రం. అలహాబాద్ నుంచి వారణాసి వరకూ ప్రియాంక ప్రచార కార్యక్రమాన్ని గురించి కనీసం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో ప్రస్తావించ లేదు. అయితే సరిగ్గా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హోదాలో మార్చి 17 నుంచి, 20 వరకూ జరిగిన ప్రియాంక ప్రచార కార్యక్రమ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మోదీపై విమర్శనాస్త్రాలతో సహా వివిధ అంశాలపై మొత్తం 100 ట్వీట్లు చేసింది. వీటిలో ఒక్కటీ ప్రియాంక ప్రచారం గురించి లేవు. అయితే సోషల్ మీడియాలో తనపై వస్తోన్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ సహకారం లేకుండానే ప్రియాంకా ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. -
పేదరికానికి కాంగ్రెస్సే కారణం
సాక్షి, బెంగళూరు: దేశంలోని పేదరికానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరోపించారు. 1971లో గరిభీ హఠావో అని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపునిచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ కూడా అదే రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. దేశంలోని పేదరికానికి ఎప్పటికీ కారణం కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. కర్ణాటకలోని ఉడుపిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ టీ–షర్ట్లు అమ్ముతూ, యాప్ ద్వారా ప్రచారం చేస్తే తప్పేమిటి’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి విరుద్ధంగా కాంగ్రెస్ మహా కూటమిని స్థాపించారని, అసలు ఎన్డీఏకు, ఆ కూటమికి పోలికే లేదని ఆమె వ్యాఖ్యానించారు. దొంగ దొంగ అని పిలవడానికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు ఏంటని కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఉడుపి–చిక్కమగళూరు లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజేను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. -
ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ..
మెదక్ పార్లమెంట్ స్థానం జాతీయ స్థాయి నాయకుల అడ్డా. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మెదక్తో పాటు, ప్రస్తుతం మెదక్లో భాగమైన సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి మొదటి నుంచీ ఉద్దండులు పోటీ చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన వారు కేంద్ర మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇందిరాగాంధీ అయితే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రధానిగా భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటిన ఇందిరాగాంధీ రాజకీయ ప్రస్థానం అమేథీ నుంచి ప్రారంభమైనా.. చివరిసారిగా మాత్రం ఆమె మెదక్ లోక్సభ స్థానం నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చి ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్గా విడిపోయిన సందర్భంలో 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున ఇందిర ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. అప్పట్లో ఆమెపై ఎస్.జైపాల్రెడ్డి పోటీకి నిలిచారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మెదక్లో పోటీకి దిగిన ఇందిరాగాంధీకి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టి.. 2,19,124 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అయితే మెదక్ ఎంపీగా ఉన్న తరుణంలోనే 1984, అక్టోబర్ 31న జరిగిన కాల్పుల్లో ఆమె మరణించారు. -
నరేంద్ర మోదీ ‘పద క్రీడ’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొందరు రాజకీయ నాయకులు ఉపయోగించిన పదాలు చరిత్రలో ఎల్లకాలం మిగిలిపోతాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో (దారిద్య్రాన్ని నిర్మూలించండి)’ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ‘అచ్చేదిన్ (మంచి రోజులు)’ అలాంటి పదాలే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్ ఆనా వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’ అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. ఆయన చెప్పిన అచ్చేదిన్ వచ్చాయా ? అంటే బాలీవుడ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కోయి లౌటా దే మెరే బీతే హుహే దిన్’ పాట గుర్తుకు వస్తుంది. గతించిన రోజులను ఎవరైన తీసుకరాగలరా ? నరేంద్ర మోదీ రాజకీయ పరిభాషలో ఉపయోగించిన ఎన్నో హిందీ, ఇంగ్లీషు పదాలు ఎన్నో ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2016లో భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని ఆయన తొలి ‘సర్జికల్ స్ట్రైక్స్’ అని వర్ణించారు. అదే సంవత్సరం నవంబర్లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘ఇది దేశంలోని నల్లడబ్బు, ఉగ్రవాదులకు అందే నిధులు, మాదకద్రవ్యాల డబ్బుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అని అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలం అవడంతో ప్రతిపక్ష పార్టీలు ‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ విమర్శించాయి. నరేంద్ర మోదీ ప్రజా సభల్లో ప్రసంగించినప్పుడల్లా ‘భాయియో ఔర్ బహెనో’ అని సంబోధించడం ఆయనకు అలవాటు. అయితే పాకిస్థాన్పై జరిపిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆయన ‘మిత్రో, మేరే ప్యారీ దేశీవాసీయోం’ అంటూ ప్రజలను సంబోధించడం ప్రారంభించారు. అవి కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వచ్ఛ్ (భారత్), గోరక్షక్, న్యూస్ ట్రేడర్, ప్రెస్టిట్యూట్ పదాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ‘నా మున్కిన్ అబ్ మున్కిన్ హై’ నినాదం పేరిట వాణిజ్య ప్రకటనలతో అదరగొట్టగా ‘మోడీ హైతో మున్కిన్ హై’ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పదాల పటాటోపం ఏ మేరకు ఓట్లను కురిపిస్తుందో చూడాలి!. -
ఆవూ ఓడింది–దూడా ఓడింది!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని పదవిలో ఉండగా లోక్సభకు పోటీచేసి ఓడిపోయిన ఏకైక నేత ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ (1975–77) తర్వాత 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పాలకపక్షమైన కాంగ్రెస్ పరాజయంతోపాటు ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్బరేలీలో ఓడిపోయారు. ఇందిరను జనతా పార్టీ తరఫున పోటీచేసిన సోషలిస్ట్ నేత రాజ్నారాయణ్ 55,202 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో పొరుగున ఉన్న కొత్త నియోజకవర్గం అమేధీ నుంచి కాంగ్రెస్ తరఫున మొదటిసారి నిలబడిన ఇందిర చిన్న కొడుకు సంజయ్గాంధీకి కూడా ఓటమి తప్పలేదు. సంజయ్పై జనతా అభ్యర్థిగా పోటీచేసిన రవీంద్రప్రతాప్ సింగ్ 75,844 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ ఎన్నిక గుర్తు ఆవు, దూడ. హిందీలో గాయ్ ఔర్ బఛడా అంటారు. తల్లీకొడుకులిద్దరూ ఒకేసారి ఒకే ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోవడంతో ‘గాయ్ భీ హారీ, బఛడా భీ హారా’ (ఆవూ ఓడింది–దూడా ఓడిపోయింది) అనే నినాదం మార్మోగింది. ఆ తర్వాత ప్రధాని పదవిలో ఉండగా లోక్సభకు ఓడిపోయినవారెవరూ లేరు. మాజీ ప్రధాని హోదాలో ఉండగా పోటీచేసి లోక్సభ ఎన్నికల్లో ఓసారి ఓడిన ఘనత హెచ్డీ దేవెగౌడకే దక్కుతుంది. ఆయనను 2004 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సమీపంలోని కనకపురా స్థానంలో గౌడను కాంగ్రెస్ అభ్యర్థి తేజస్వినీ గౌడ ఓడించారు. -
సాదా సీదా ప్రియాంక గాంధీ
సాక్షి, వెబ్ ప్రత్యేకం : ‘నేనేమి అద్భుతాలు సష్టించలేను. పార్టీ కార్యకర్తలే పార్టీని బూతు స్థాయి నుంచి అభివృద్ధి చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో నాకు మీ సహకారం కావాలి. ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు. అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తాం’ అని ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే యూపీలోని బులంద్షహర్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కఠిన పదాలను కూడా మదువుగా చెప్పే మృదుభాషిణి. చెప్పదల్చుకున్న మాటలను సూటిగాను, అర్థవంతంగాను చెప్పగలిగే మాటల నేర్పరి. హిందీలో రాహుల్ గాంధీకన్నా, అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఆమె సొంతం. ఆమె బాలివుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ తల్లి తేచి బచ్చన్ (తేజ్వంత్ కౌర్) వద్ద హిందీ కవిత్వాన్ని నేర్చుకున్నారు. ఇక ఆహార్యంలో ఆమె నిరాడంబరత చూస్తే గాంధీ వారసత్వం గుర్తుకు వస్తుంది. ఎక్కువగా తెల్లటి పొడువు చేతుల చొక్కా, నల్లటి పాయింట్ ధరించే ప్రియాంక గాంధీ ఎక్కువ వరకు చేనేత చీరలనే ధరిస్తారు. నుదిటన బొట్టు, మెడలో నగా నట్ర ధరించకుండా, మొఖాన పౌడరు తప్ప ఎలాంటి మేకప్ లేకుండా సంచరించే ప్రియాంకలో ఎప్పుడూ చురుకుదనం కనిపిస్తుంది. సన్నటి సొట్ట పడే ఆమె బుగ్గల మీద కనిపించే చిద్విలాసమే ఆమెకు ప్రధాన అలంకారం. ఇందిర వారసత్వం ‘నేను ఎంతమాత్రం నరేంద్ర మోదీ కూతుర్ని కాను, నేను రాజీవ్ గాంధీ కూతుర్ని’ అని ఆమె ముక్కు సూటిగా మాట్లాడడం ’ప్రియాంక గాంధీ ఇంకేమాత్రం చిన్న పిల్ల కాదు. రాజకీయ స్ఫురద్రూపి’ అన్న ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాటలను గుర్తు చేస్తాయి. 2014, మే నెలలో దూరదర్శన్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ, ప్రియాంక తన కూతురు లాంటిదని వ్యాఖ్యానించడం తెల్సిందే. పొట్టి జుట్టు, ముక్కు సూటిగా మాట్లాడంలోనే కాకుండా అనేక అంశాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీలాగానే ఆమె ఉంటారని, ఆమె వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తే ఎంతో రాణించగలరని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆమెకు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ‘రాజకీయాల్లో అందరు రాణించలేరు. ఇప్పుడు నేను గడుపుతున్న జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొందరికి కొన్ని పడవు. అది అంతే. దయచేసి నన్ను క్రియాశీలక రాజకీయాల్లోకి లాగకండి’ ఎన్డీడీవీ తరఫున సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. ప్రియాంక రాజకీయ నేపథ్యం 2004లో లోక్సభ ఎన్నికల సందర్భంగా యూపీలో సోనియా గాంధీకి ఎన్నికల ప్రచార మేనేజర్గా, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 2007లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి, రాయబరేలి ప్రాంతంలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. 2009లో లోక్సభ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్గా రంగ ప్రవేశం చేశారు. ఇదివరకటిలా అమేథి, రాయ్బరేలీలకు పరిమితం కాకుండా అమేథి నుంచి సుల్తాన్పూర్ వరకు పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. జగదీష్పూర్లో ఆమె సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఉల్లంఘించి ప్రజల్లోకి చొచ్చుకు పోవడం చర్చనీయాంశం అయింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతానికే పరిమితమై ప్రచారం చేశారు. 2019లో ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనవరి 23వ తేదీన నియమితులయ్యారు. యూపీ తూర్పు ప్రాంతం పార్టీ ఇంచార్జిగా బాధ్యతలను ఆమె ఫిబ్రవరి 4వ తేదీన స్వీకరించారు. ఆ సందర్భంగా రాహుల్తో కలిసి ఆమె నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు విశేషంగా తరలి వచ్చారు. జీవిత నేపథ్యం 47 ఏళ్ల ప్రియాంక గాంధీ 1972, జనవరి 12వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ దంపతులకు జన్మించారు. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె జీసస్ అండ్ మేరీ కాలేజీలోనే సైకాలోజీలో డిగ్రీ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బౌద్ధంలో ఎంఏ (2010)లో పట్టభద్రులయ్యారు. ఢిల్లీ వ్యాపార వేత రాబర్ట్ వాద్రాను 1997, ఫిబ్రవరి 18వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. బౌద్ధంలో ఆమె ఎంఏ పూర్తిచేశాక ఆమె బౌద్ధం స్వీకరించారు. ఆమెకు రాయ్హాన్, కూతురు మిరయా ఉన్నారు. -వి. నరేందర్ రెడ్డి -
నేతల జాతర–విలువల పాతర!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సామాన్య ప్రజలలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం సహజం. దృశ్యశ్రవణ ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు కనిపించవలసిన చోట కనిపించాలనీ, మాట్లాడవలసిన మాట మాట్లాడాలని రాజకీయ నాయకులు తాపత్రయ పడతారు. కొందరు రాజకీయ నాయకులు తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావించే దృశ్యాన్ని వదిలిపెట్టరు. లాభసాటి దృశ్యాలలో ఉనికి కోసం ఎంత దూరమైనా వెడతారు. ప్రత్యర్థులపై దారుణాఖండల శస్త్రతుల్యమైన పదజా లంతో దాడి చేస్తారు. నిన్న పొగిడిన నోటితోనే నేడు తెగుడుతారు. సంవత్సరం కిందట సంజీవని కానిది ఈ రోజు ప్రాణప్రదమైన ఔషధి అవుతుంది. పొత్తు ఉన్నప్పుడు ఇంద్రుడూచంద్రుడూ అంటూ నెత్తికెత్తుకొని ఊరేగినవారే పొత్తు రద్దయిన తర్వాత దుష్టుడూ దుర్మార్గుడూ అంటూ నేలకేసి కొడతారు. ఒకటి, రెండు మినహాయింపులు తప్పిస్తే అన్ని పార్టీల నాయకులదీ ఇదే వరుస. ఎన్నికల బరిలో దిగే ముందు మాటల ఈటెలకు పదును పెడుతున్నారు. ఇటు వంటి రాజకీయంలో నిజానిజాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. రాజ్యాంగస్ఫూర్తి అసలే లేదు. తాము నిన్నామొన్నా ఏమని చెప్పామో, ఇప్పుడు ఏమి చెబుతున్నామో అన్న స్పృహ బొత్తిగా లేదు. ప్రతిపక్షాలపై దాడే వ్యూహమా? అధికార పార్టీలు వ్యవహరించిన రీతినీ, ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను అమలు చేసిన తీరునీ ఎన్నికల సమయంలో చర్చించడం సంప్రదాయం. తమ సాఫల్యవైఫల్యాలను అధికార పార్టీలు గుర్తించి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయిందీ వివరించే రోజులు పోయాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా, సరికొత్త సంక్షేమపథకాలు పదవీకాలం ముగియనున్న తరు ణంలో అట్టహాసంగా ఆరంభించడం ద్వారా, లక్షల కోట్లు ఖర్చు చేయవలసిన ప్రాజెక్టులకు అలవోకగా శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజలను మెప్పించి మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగాలని కలలు కంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఈ విన్యాసాలు ఫలించవు. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకొని నాలుగు సంవత్సరాలు చెట్టా పట్టాలేసుకొని యుగళగీతాలు ఆలపించిన విషయాన్ని ప్రజలు మరచిపోవాలని మోదీ, బాబూ కోరుకుంటున్నారు. ప్రత్యేకహోదాపైన మోదీ, బాబూ ఇద్దరూ ఆడిన నాటకాన్ని ప్రజలు విస్మరించాలనీ, తాజా డ్రామాను మాత్రమే వీక్షించి మైమరచిపోవాలనీ వారి ఆకాంక్ష. రఫేల్ వివాదంపై రగడ చేస్తున్న కాంగ్రెస్ నాయకులనూ, ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులనూ దేశద్రోహులుగా, దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్న దుర్మార్గులుగా చిత్రించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ హయాంలో బోఫోర్స్ సహాlఅనేక కుంభకోణాలు జరిగిన వాస్తవాన్ని ప్రస్తావించ కుండా రఫేల్ను మాత్రమే ప్రజల ముందుకు ప్రముఖంగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకుల ఆరాటం. చిట్ఫండ్ అక్రమార్కుల కొమ్ముకాయడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తు న్నారని బీజేపీ ప్రవక్తల వాదన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపైన కేసులు బనాయించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించి అప్రదిష్టపాలు చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని మమతాదీదీ, తదితర ప్రతిపక్ష నేతల ఆరోపణ. ‘ఏమిటి నన్ను జైల్లో పెడతారా?’ అంటూ చంద్రబాబు బీజేపీ శాస నసభ్యులవైపు చూస్తూ హుంక రిస్తారు. ప్రజాధనాన్ని దుబారా చేశారనీ, నిధులు కాజేయడం కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టారనీ, పోలవరం నిధులకు లెక్క చెప్పడం లేదనీ, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నదనీ వస్తున్న ఆరోపణలపైన కేంద్రం విచారించలేదు. బీజేపీ నాయకులే స్వయంగా చేస్తున్న విమర్శలు గాలిలోకి కలసిపోతున్నాయి కానీ వాటిలోని నిజానిజాలు తేల్చే బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదు. ఇంతటి అనుకూల పరిస్థితులలో సైతం చంద్రబాబుకి జైలుభయం పట్టుకోవడం ఆశ్చర్యం. భయంలోనుంచి బుకాయింపు పుట్టుకొచ్చింది. సీబీఐ గీబీఐ జాన్తానై అంటున్నారు. ఈడీ లేదూ గీడీ లేదూ అంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు. కేంద్రంపైన ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తినా, మమతా బెనర్జీ తిరుగు బాటు బావుటా ఎగరవేసినా వారి పక్కన దృశ్యంలో కనిపించేందుకు చంద్ర బాబు అన్ని పనులూ వదులుకొని శ్రమకోర్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకీ, కోల్కతాకీ వెడుతున్నారు. మోదీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కానీ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. అందుకు అవసరమైన సామగ్రి వారి దగ్గర ఉన్నది. కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. చంద్రబాబుని తమ ప్రధాన ప్రత్యర్థిగా మోదీ భావించడం లేదు. ఈ రోజు గుంటూరు సభలో చంద్రబాబుపై నరేంద్రమోదీ అమిత్షా లాగానే విమర్శలు చేయవచ్చు. మామూలు విమర్శలతో సరిపెట్టకుండా మమతాబెనర్జీపై చేసినంత కరకుగా మోదీ తనపైన కూడా వాగ్దాడి చేయాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. అందుకే ‘ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారు మోదీ?’, అంటూ రెచ్చగొడుతున్నారు. మోదీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా తేలాలని తాపత్రయం. ఆంధ్రప్రదేశ్లో అంతటి దృశ్యం లేదు. పశ్చిమబెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అమిత్షా, నరేంద్రమోదీ, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్సింగ్ చౌహాన్ తదితరులు పర్యటించి, దీదీని రకరకాల విమర్శలు చేసి వాతావరణం వేడెక్కించారు. బెంగాల్పైన ఎందుకు దృష్టి పెట్టారు? సమాజ్వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమా జ్పార్టీ (బీఎస్పీ)ల ఎన్నికల పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్లో ఈ సారి తమ పప్పులు ఉడకవని బీజేపీ నాయకత్వానికి తెలుసు. 2014లో గెలుచుకున్న 71 స్థానాలలో సగం దక్కితే ధన్యులమనుకునే పరిస్థితి. యూపీలో కోల్పోయే స్థానా లను బెంగాల్లో సంపాదించాలని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో జనాదరణ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ తర్వాత స్థానం బీజేపీదే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి విజ యావకాశాలు లేవు. అందుకే ఇక్కడికి మాటవరుసగా పర్యటనకు వచ్చి ఒకట్రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెడతారు కానీ ఆంధ్రప్రదేశ్పైనా, చంద్ర బాబుపైనా దృష్టి కేంద్రీకరించే దండగమారి పని బీజేపీ అధినేతలు చేయరు. చంద్రబాబు తన అనుయాయులతో కుండల ప్రదర్శన చేయించినా, నల్ల బ్యాడ్జీలు ధరింపజేసినా, ‘మోదీ గోబ్యాక్’ అంటూ టీవీ చానళ్ళ కేమేరాల ముందు విచిత్ర విన్యాసాలు వేసినా, తానే స్వయంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఇదే గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు. భావి ప్రధాని అంటూ పొగిడారు. అనంతరం శాసనసభలో మోదీ అత్యున్నతమైన ప్రధాని అంటూ కీర్తించారు. వాజపేయి కంటే ఉన్నతుడనే విధంగా ప్రశంసల వర్షం కురిపించారు. వైఫల్యాలను ఒప్పుకుంటే మేలు అధికారంలో ఉన్నవారికి ఇది పరీక్షాసమయం. సాధించిన విజయాలు ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. వైఫల్యాలు ఉంటే ఒప్పుకోవాలి. దొంగలను ఉపే క్షించనంటూ, అందుకే ఈ చౌకీదార్ను ప్రజలు నియమించారంటూ పార్లమెంటు లోనూ, వెలుపలా మోదీ మిడిసిపడుతూ గంభీరమైన ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలు ప్రభావితులై మూకుమ్మడిగా మళ్ళీ బీజేపీకి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. లక్షల కొద్దీ ఉద్యోగాలను ఏన్డీఏ ప్రభుత్వం కల్పించిందంటూ ఎంత గట్టిగా మోదీ దబాయించినా ప్రజలు విశ్వ సించరు. అనుకున్న విధంగా ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాలేదో, స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొని రావడంలో ఎందుకు విఫలమైనారో, గోరక్షకుల హింసాత్మక ధోరణిని ఎందుకు అరికట్టలేకపోయారో సవినయంగా వివరిస్తే ప్రజలు మన్నిస్తారు. రంకెలు వేసినంత మాత్రాన వైఫల్యాలు విజయాలుగా మారవు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ప్రసంగాలు చేసినా, సీబీఐని దుర్వినియోగం చేయడం లేదంటూ ఎంత గట్టిగా చెప్పినా లాభం లేదు. ఈ విషయం ప్రస్తావించే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు. చంద్రబాబు చరిత్రా అటువంటిదే. కాంగ్రెస్తో చేతులు కలిపి సీబీఐతో ప్రధాన ప్రత్యర్థి వ్యక్తిత్వహననం చేయడానికి ప్రయత్నించిన ఘనుడాయన. విపక్షానికి చెందిన ఎంఎల్ఏలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చరిత్ర ఆయనది. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ వ్యవ స్థకూ తాను నిధులూ, విధులూ వికేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయనకు ఇతరులను తప్పుపట్టే యోగ్యత ఉంటుందా? నామినేషన్లపైన వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు కట్టబెట్టే వారికీ, వారి ప్రయోజనం కోసమే అమరావతి నగర నిర్మాణం విషయంలో రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించినవారికీ ఇతరులను ప్రశ్నించే నైతికత ఉంటుందా? ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోదీ చంద్ర బాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం. అందుకు మోదీని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. ప్రధాని పర్యటలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. కానీ బీజేపీతో మొన్నటివరకూ అంటకాగిన టీడీపీ నిరసన ప్రదర్శనలు చేయడం విడ్డూరం. తమ స్వానుభవానికి విరుద్ధంగా నేతలు ఏమి చెప్పినా ప్రజలు విశ్వసించరు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి అది కనిపించదు. చుట్టూ ఉన్న వందిమాగధులు కనిపించనీయరు. ఇందిర ఘోరపరాజయం ఉదాహరణకు ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 19 మాసాలు దేశాన్ని నిరంకుశంగా ఏలిన తర్వాత అంతే అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేయాలనీ, రెండు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాలనీ ఆమె 1977 జనవరి 18న ప్రకటించారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోతుందని ఆనాడు అత్యధికులు ఊహిం చలేదు. అంతవరకూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి పరాజయం లేదు. చుట్టూ ఉన్నవారు అదే ఎన్నికలకు అనువైన సమయం అంటూ ఊదరకొట్టబట్టే ఆమె ఎన్నికలు జరిపించడానికి నిర్ణయించారు. జైళ్లలో బంధించిన వందలాదిమంది ప్రతిపక్ష నాయకులకు అనూహ్యంగా స్వేచ్ఛ లభించింది. ఎన్నికల ప్రచారానికి రెండు మాసాలే వ్యవధి. నిధుల సేకరణ సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఎదురు నిలిచే సత్తా కలిగిన పార్టీ లేదు. ఆత్యయిక పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందిందనీ, ప్రతిపక్షాల ఆందోళనలను అరికట్టగలిగామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ ఇందిరాగాంధీ భావించారు. సంజయ్గాంధీకి పూర్తిగా పగ్గాలు అప్పగించాలా లేక అర్ధసింహాసనం ఇవ్వాలా అన్నదే ఆలోచన కానీ పరాజయం గురించి ఆమెకు చింత లేదు. తనకు పోటీ ఎవరున్నారు? ‘తాను తప్ప దేశానికి వేరే దిక్కు ఎవ్వరూ లేరని ఆమె గట్టిగా విశ్వసించింది,’ అంటూ ఇందిర మేనత్త కూతురు, ప్రఖ్యాత రచయిత నయనతార సెహగల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాటి ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇందిరాగాంధీపై రాజ్నారాయణ్ గెలుపొందారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను జైలు జీవితం కలిపింది. రైతు నాయకుడూ, భారతీయ లోక్దళ్ అధినేత చరణ్ సింగ్, జనసంఘ్ నాయకులు అడ్వాణీ, వాజపేయి, సోషలిస్టు నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రాజ్నారాయణ్, కరడుకట్టిన మితవాది, కాంగ్రెస్ (వో) నాయకుడు మొరార్జీ దేశాయ్ వంటి నానాగోత్రీకులను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క తాటిపైకి తెస్తారని ఎవరు ఊహించారు? మొరార్జీ దేశాయ్ని ప్రధానిగా వీరంతా అంగీకరిస్తారని ఎవరు కలగన్నారు? తనకు ప్రత్యామ్నాయం లేరని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడు అనుకున్నా అది శ్రుతిమించిన స్వాను రాగమే. ఇప్పుడు మోదీకీ, చంద్రబాబుకీ భజన చేసినట్టే అప్పుడు ఇందిరా గాంధీకి పత్రికలు ఊడిగం చేశాయి (ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి కొన్ని పత్రికలు తప్ప). ఇందిరమ్మకు అన్నీ సకారాత్మక ఊహా చిత్రాలే కనిపించాయి. పరాజయ సూచనలు కానరాలేదు. అప్పటికింకా ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్ళు రాలేదు. ఇప్పుడు టీవీల హంగామా అధికారంలో ఉన్న వారిని భ్రమలలో ముంచెత్తు తుంది. ఆకాశవీధిలో విహరింపజేస్తుంది. నేల విడవకుండా నిజాయతీగా సాము చేసేవారిదే విజయం. -కె. రామచంద్రమూర్తి -
రాహుల్ గాంధీ బయోపిక్
ఎన్నికలు సమీపించడంతో రాజకీయ నాయకుల కథలను తెర మీద ఆవిష్కరించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు దర్శకులు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోది మీద సినిమా తయారవుతుండగా సౌత్లో ఎన్టీఆర్, వైయస్సార్, ఎంజీఆర్, జయలలిత మీద సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా సినిమా రూపొందుతోంది. రూపేశ్ పౌల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రకథ ఇందిరా గాంధీ హత్య నుంచి మొదలై, ప్రస్తుత ఎన్నికల వరకూ సాగుతుందట. ‘మైనేమ్ ఈజ్ రాగా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాహుల్గా అశ్వినీకుమార్ నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అపజయాలు ఎదుర్కొని విజయం సాధించిన రాహుల్ కథను చెప్పదలిచాను. అతని పోరాట పటిమను చూసి స్ఫూర్తి పొంది ఈ చిత్రం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. అంతేకాక ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు. -
‘మా అమ్మలానే.. తను చాలా స్ట్రాంగ్’
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ వాద్రా(47) రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనపడుతోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో కార్యకర్తలతో పాటు అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నతనంలో ప్రియాంక.. తమ నానమ్మ ఇందిరా గాంధీతో ఆడుకుంటున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటు ‘మా అమ్మలానే ప్రియాంక కూడా చాలా స్ట్రాంగ్’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన ఓ మాటను కూడా కోట్ చేశారు. ‘బలమైన మహిళలు.. బలమైన మహిళల్నే పెంచుతారం’టూ పోస్ట్ చేసిన ఈ ఫోటోతో పాటు ‘నానమ్మలానే మనవరాలు కుటుంబం, ప్రేమ’ అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీ వాద్రాను తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. View this post on Instagram Strong women raise strong women. . . #ThrowbackThursday #TBT #LikeGrandmotherLikeGranddaughter #Family #Love #womenempowerment A post shared by Congress (@incindia) on Jan 24, 2019 at 12:49am PST లోక్సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఆమె తన సోదరుడు రాహుల్కు సహాయకారిగా పనిచేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. -
ఇందిరా గాంధీని పొగిడిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. మరో వైపు మహిళా రిజర్వేషన్ల గురించి కూడా ఆందోళన ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారంటూ పొగిడారు. నాగపూర్లోని ఓ కార్యక్రమానికి హజరైన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం కాను. కానీ కులం, మతం ప్రతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లను నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశిస్తూ.. ఆమె ప్రధాని అయ్యేనాటికి పార్టీలో ఎందరో గొప్ప పురుష రాజకీయ నాయకులున్నారు. కానీ ఆనతికాలంలోనే ఆమె గొప్ప రాజకీయనాయకురాలిగా ఎదిగారు. అది కూడా ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా అంటూ చెప్పుకొచ్చారు. జ్ఞానం ఆధారంగా ఒక మనిషి గొప్పతనాన్ని గుర్తించాలి కానీ కులం, భాష, ప్రాంతం, మతం ఆధారంగా కాదంటూ వ్యాఖ్యనించారు. -
ఆలస్యంగా అయినా దక్కిన న్యాయం
వటవృక్షం నేల కూలితే భూమి ఆమాత్రం కంపిం చదా? ఇది 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యా ఘటన అనంతరం దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఢిల్లీలో సిక్కులపై ఊచకోత ఘటనల నేపధ్యంలో తదనంతర ప్రధాని రాజీవ్గాంధీ చేసిన సంచలన ప్రకటన. ఆ ఊచకోత ఘటనలో 3000 మంది పైగా తమ ప్రియతములను కోల్పోయిన బాధిత కుటుంబాలను మాత్రం ఈ అసాధారణ ప్రకటన రూపంలోని ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. నేల కూలిన వటవృక్షానికి, ఆ కాళరాత్రి ఊచకోతల్లో తాముకోల్పోయిన వారికి ఏ సంబం ధం ఉందని బాధిత కుటుంబాలు వేస్తున్న ప్రశ్న ఇప్పటికీ అరణ్య ఘోషలాగే ఉంది. ఆ మారణ కాండ జరిగిన 34 ఏళ్ల తర్వాత నాటి అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలకు గురైన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ని దోషిగా గుర్తిస్తూ ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించడం కారుచీకట్లో కాంతిరేఖ మాత్రమే. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, 1984 కాళరాత్రి మచ్చకు కారకుడిగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్కి ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. అతడిపై వచ్చిన ఆరోపణలను జాతి హత్యాకాండగా, సామూహిక హత్యాకాండగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం 73 ఏళ్ల సజ్జన్ కుమార్ 1984 నవంబర్ 1 రాత్రి ఢిల్లీలోని రాజ్ నగర్లో ఒక గురుద్వారాను తగులబెట్టిన ఘటనలో ఒక కుటుంబంలోని అయిదుగురు సభ్యుల హత్యకు కారకుడయ్యాడనే ఆరోపణను కోర్టు ధృవీకరించింది. ఈ సందర్భంగా ఎన్నిసవాళ్లు ఎదురైనా సత్యం రుజువవుతుందని బాధితులకు హామీ ఇవ్వడం చాలా ముఖ్యం అని కోర్టు చేసిన వ్యాఖ్య బాధితులకు కాస్త ఉపశమనం కలిగించింది. ఎందుకంటే తమ వారిని కోల్పోయిన బాధ కంటే న్యాయం జరగాలని చేసిన పోరాటం సందర్భంగా గత 34 ఏళ్లుగా బాధితులు ఎదుర్కొన్న బెదిరింపులు, దౌర్జన్యాలు మరింత భీతి కలిగించేలా తయారయ్యాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న సిక్కు బాడీగార్డులు కాల్చి చంపిన ఘటన అనంతరం చెలరేగిపోయిన మూకలు నవంబర్ 1 నుంచి 4 దాకా 3 వేలమంది సిక్కులను టార్గెట్ చేసి మరీ చంపారు. దేశరాజధాని ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇదే కేసులో సజ్జన్ కుమార్ని నిర్దోషిగా పేర్కొంటూ అయిదేళ్ల క్రితం ఢిల్లీలోని ట్రయల్ కోర్టు అతడిపై కేసు కొట్టేయడం జరిగింది. 2002 డిసెంబర్ నెలలో సెషన్స్ కోర్టు సజ్జన్ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ సీబీఐ 2005 అక్టోబర్ 24న అతడిపై మరొక కేసును నమోదు చేసింది. 2010లో ఈకేసును ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదలాయించారు. 2013 ఏప్రిల్ 30న ట్రయల్ కోర్టు సజ్జన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ మరో అయిదుగురిని దోషులుగా నిర్ధారించింది. తీర్పుచెప్పిన న్యాయమూర్తిపై కోర్టు హాలులోనే నిరసనకారులు చెప్పులు విసిరిన ఘటన సంచలనం రేపింది. తర్వాత సీబీఐ, బాధితురాలు, నాటి ఘటనకు సాక్షి అయిన జగదీష్ కౌర్ ట్రయల్ కోర్టు తీర్పుకు నిరసనగా అపీల్ చేశారు. మరొక ప్రధాన సాక్షి చామ్ కౌర్ 1984లో రాజధాని ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో మూకను ఉద్దేశించి మాట్లాడుతున్న సజ్జన్ని తాను స్వయంగా చూశానని, మన అమ్మను చంపారని, సిక్కులను మనం కూడా చంపుదామని చెబుతున్న అతడి మాటలను విన్నానని చెప్పడంతో సాక్ష్యానికి బలం చేకూరింది. నవంబర్ 2న గుంపు తన కుమారుడు కపూర్ సింగ్ని, తండ్రి సర్దార్జీ సింగ్ను దాక్కున్న చోటినుంటి లాగి చితకబాది తగులబెట్టారని కౌర్ చెప్పారు. ఈ సాక్ష్యం ఆధారంగా 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. మనుషుల్ని సజీ వంగా తగులబెట్టి చంపిన ఘటనకు బాధ్యులైన నేరస్తులు రాజకీయ అండదండలను పొంది ప్రాసిక్యూషన్ని, శిక్షను కూడా ఇన్నాళ్లుగా తప్పించుకుంటూ వచ్చారని కోర్టు వ్యాఖ్యానించడం న్యాయానికి ఈ దేశంలో పడుతున్న గతి ఏమిటో తేటతెల్లం చేస్తోంది. రాజకీయంగా బలంగా ఉన్న శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తలపెట్టిన సామూహిక నేరాలకు కారకులైనవారిని శిక్షించడానికి దశాబ్దాల కాలం పట్టడం విషాదకరమని మన న్యాయవ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ సుదీర్ఘ జాప్యం సూచిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ దేశంలో న్యాయం రాజకీయనేతలకు, పలుకుబడి కలవాళ్లకు చుట్టంగా ఎలా మారిపోయిందో సజ్జన్ కుమార్ ఉదంతం తెలుపుతోంది. కె. రాజశేఖరరాజు -
అసమ్మతికి ఆచార్యపీఠం
జూన్ 14–15, 1947. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక సమావేశాలు ఆ తేదీలలోనే జరిగాయి. చర్చనీయాంశం– వేయేళ్ల చరిత్రలో చెప్పుకోదగిన ఒక ఘట్టం. అప్పటికి సరిగ్గా 12 రోజుల క్రితం ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్బాటన్ ప్రతిపాదించిన భారత విభజన ప్రణాళికకి అంగీకారం తెలియచేసే తీర్మానం ఆమోదించడానికి అక్కడ అంతా కూర్చున్నారు. ఇలాంటి బాధాకరమైన ప్రణాళికకు ఎవరిని అడిగి తలూపి వచ్చారంటూ సిం«ద్ ప్రాంత కాంగ్రెస్ ప్రముఖుడు ఛోతారామ్ గిద్వానీ, ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు పురుషోత్తమదాస్ టాండన్ నిప్పులు చెరుగుతున్నారు. గాంధీజీ, నెహ్రూ మధ్య కొన్ని పరుష వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ ఇద్దరితో పాటు ఇంకా సర్దార్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (జాతీయ కాంగ్రెస్), జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా (కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ) ఇంకా పలువురు కూడా ఆ కీలక సమావేశంలో ఉన్నారు. తలనొప్పిగా ఉందంటూ గాంధీ ఇబ్బందిగా కూర్చున్నారు. అలాంటి కీలక సందర్భంలో, చరిత్రాత్మకమైన ఒక తీర్మానం ఆమోదించే వేళ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఆ నాయకుడు కూడా ఎంతో ఆవేదనగా, ముఖం నిండా ఖేదంతో ఇబ్బందిగా ఉన్నారు. ఆయనే జేబీ కృపలానీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో.... భారత ఉపఖండం భారత్–పాక్ అనే రెండు దేశాలుగా విడిపోయిన విషాద ఘడియలలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నవారు కృపలానీ. అంతేకాదు, జూన్ 3, 1947న మౌంట్బాటన్ ఇచ్చిన విభజన ప్రణాళికకు ఆమోదం తెలియచేసిన వారిలో నెహ్రూ, పటేల్తో పాటు ఉన్న మరొక కాంగ్రెస్ సభ్యుడు కృపలానీయే. ఆ సమావేశానికి గాంధీజీని కాకుండా, కాంగ్రెస్ అధ్యక్ష హోదాతో కృపలానీని నెహ్రూ సిఫారసు చేశారు. ఒక్క గాంధీ తప్ప, మిగిలిన కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ప్రదర్శించిన ‘నైతిక పిరికితనమే’ దేశ విభజనకి కారణమని తన ఆత్మకథ (మై టైమ్స్, కృపలానీ మరణానంతరం, 22 ఏళ్లకు, 2004లో అచ్చయింది)లో కృపలానీ ఆరోపించడం ఈ దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే కొసమెరుపు. జీవత్రామ్ భగవాన్దాస్ కృపలానీ సిం«ద్, గుజరాతీ మూలాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. స్వస్థలం సిం«ద్ హైదరాబాద్. ప్రాథమిక విద్య అంతా అక్కడే సాగింది. తరువాత బొంబాయిలోని విల్సన్ కళాశాలలో చేరారు. ఆంగ్ల కవిత్వం ఆయన అభిమానాంశం. అలాగే చరిత్ర కూడా. అక్కడ ఉండగానే కృపలానీ మొదటిసారి రాజకీయ పోరాటంలో పాల్గొన్నారని అనుకోవచ్చు. అప్పుడే బెంగాల్ విభజనోద్యమం దేశమంతా వ్యాపించింది. విల్సన్ కళాశాల విద్యార్థులు జరిపిన ఆందోళనలో కృపలానీ కూడా పాల్గొన్నారు. దీనితో కళాశాల నుంచి బహిష్కరించారు. ఆపై కరాచీ వెళ్లి అక్కడ డీజే కళాశాలలో చేరారు. ఈ కళాశాల నుంచి కూడా బహిష్కరణ తప్పలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారందరినీ బహిష్కరించారు. అప్పుడు కృపలానీ పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో చేరి ఎంఏ ఆంగ్ల సాహిత్యం, చరిత్ర పూర్తి చేశారు. మొదట ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించారు కృపలానీ. తరువాత ముజఫర్పూర్ విశ్వవిద్యాలయం (బిహార్), కాశీ విశ్వవిద్యాలయాలలో కొద్దికాలం పనిచేశారు. ఆ సమయంలోనే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. 1917లో చంపారన్ సత్యాగ్రహం సమయంలో రెండవసారి గాంధీజీని కలుసుకున్నారు కృపలానీ. ఇక తుదిశ్వాస విడిచేవరకు గాంధీ సిద్ధాంతాన్నే నమ్మారు. 1920–27 మధ్య గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీuŠ‡కు ఆయనే ప్రిన్సిపాల్. అక్కడ ఉండగానే ఆయనను ‘ఆచార్య’ అని పిలవడం ఆరంభమైంది. 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఆయన గాంధీ వెంటే ఉన్నారు. 1927 తరువాత మాత్రం ఉత్తరభారత దేశానికి వెళ్లి అక్కడ ఆశ్రమాలు స్థాపించి గాంధీ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 1934 నుంచి 1945 వరకు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. కానీ ఆయన ఎప్పటికీ వ్యవస్థ పట్ల తన అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. ఒక విధంగా ఆయన జీవితమంతా ఉద్యమకారునిగా ఉన్నారు. చాలా విషయాలలో అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. సిద్ధాంతం మాత్రం గాంధీగారిదే. 1946లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ కాంగ్రెస్ «అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్న తరువాత ఆచార్య కృపలానీ ఆ పదవికి ఎంపికయ్యారు. భారతదేశ చరిత్రలో ఆ సంవత్సరాన్ని గురించి చెప్పే ప్రతి అక్షరం రక్తసిక్తంగానే కనిపిస్తుంది. ముస్లింలీగ్ ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో జరిగిన హింస, ప్రతిహింస ఘోరమైనవి. బెంగాల్ హత్యలు, బిహార్ రక్తపాతం, ఆపై నౌఖాలీ ఊచకోత, ఇంకా పంజాబ్లో హత్యాకాండ ఇవన్నీ కూడా ఆ కాలంలోనే జరిగాయి. ఇందుకు పరోక్షంగా బాధ్యత వహించవలసినది జాతీయ కాంగ్రెస్ పార్టీయే. గాంధీజీ సిద్ధాంతం హఠాత్తుగా మాయమై, ఒక అరాచక నెత్తుటి క్రీడ స్వైర విహారం చేసిన సమయం. ఇక 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత పంజాబ్లో జరిగిన హింసాకాండ కూడా ఎంతో అమానుషమైనది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కృపలానీ వంటి వారికి ఆ రకమైన స్వాతంత్య్ర సిద్ధి ఆనందించదగినదో, దుఃఖం కలిగించేదో చెప్పడం పెద్ద కష్టం కాదు. 1947లోనే పంజాబ్లోని ఒక గురుద్వారాలో జరిగిన సిక్కు–ముస్లిం ఘర్షణ, ఆ హత్యాకాండ కారణంగా ఆ గ్రామ సిక్కు మహిళలంతా ఆ గురుద్వారా వెనుక ఉన్న పెద్ద బావిలోకి ఉరికి మూకమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడం కృపలానీని ఎంతో కలవరపరిచింది. ఈ హత్యాకాండ గురించే జూన్ 14, 15 నాటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కృపలానీ ఎంతో క్షోభతో, మనస్తాపంతో ప్రస్తావించారు. ఆ సంవత్సరం నవంబర్లో కృపలానీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు (తరువాత బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు). తరువాత కూడా కృపలానీ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. 1948లో గాంధీజీ మరణించారు. కాంగ్రెస్లో కృపలానీ ప్రాధాన్యం మరింత తగ్గిపోయింది. నిజానికి నెహ్రూ విధానాలలో కొన్నింటిని కృపలానీ అభిమానించేవారు. కానీ ఆనాడు చాలామంది భారతీయులు, ఇంగ్లిష్ వాళ్లు కూడా భావించినట్టే కృపలానీ కూడా పటేల్ను మితవాదిగానే భావించారు. కానీ ఒక్క విషయంలో మళ్లీ ఆ ఇద్దరి నుంచి కృపలానీ ఒకే రకమైన నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీ అధ్యక్షునిగా ఆయన నెహ్రూకు, పటేల్కు ఒక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం గురించి పార్టీకి తెలియాలి. కానీ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ ప్రమేయం ఉండడం సాధ్యం కాదని నెహ్రూ, పటేల్ కూడా తేల్చి చెప్పేశారు. కృపలానీ ఉద్దేశం ఏదైనా అదొక పాటించదగిన ఆదర్శంగా నిలిచిపోయింది. 1950లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అప్పటికే నెహ్రూ, పటేల్ విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి రహస్యమేమీ కాదు. నెహ్రూ, ఆయన వామపక్ష సహచరులు అంతా కలసి కృపలానీని సమర్థించారు. కృపలానీకి ప్రత్యర్థిగా పటేల్ వర్గం, అంటే ఆనాటికి ఏర్పడిన శిబిరాల పదజాలం ప్రకారం, మితవాద పక్షం సమర్థించిన వ్యక్తి పురుషోత్తమదాస్ టాండన్. 1950 నాటికి దేశంలో పరిస్థితులు కొంచెం క్లిష్టంగానే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి రెండున్నరేళ్లయింది. ఆ సమస్యలు సరే. దీనితో పాటు సోమనాథ్ దేవాలయం, దాని మీద నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్ విభేదాలు, జనసంఘ్ ఏర్పడుతున్న జాడలు, ముస్లిం జనాభా మార్పిడి కోసం నెహ్రూ,లియాఖత్ అలీ మధ్య జరిగిన ఒప్పందం, నెహ్రూ ఆర్థిక విధానాల మీద సంకోచం, సందిగ్ధం బలంగా ఉన్న సమయమది. కొద్దిపాటి తేడాతోనే అయినా కృపలానీ ఓడిపోయారు. టాండన్ గెలిచారు. అంటే నెహ్రూ అభ్యర్థి ఓడిపోగా, పటేల్ అభ్యర్థి గెలిచారన్నమాట. నిజానికి ఆ తరువాత పటేల్ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. చిత్రం, అధ్యక్ష ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కృపలానీ కూడా కాంగ్రెస్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. ఇంకా చిత్రం– ఆ మరుసటి సంవత్సరమే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిందిగా నెహ్రూ టాండన్ను కోరారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటమి కృపలానీని బాగా కుంగదీసిన మాట నిజం. నిజానికి నెహ్రూలో కూడా అంతే నిర్వేదం ఏర్పడిందని చెబుతారు. కాంగ్రెస్ గాంధేయ సిద్ధాంతాలకు దూరంగా జరుగుతున్నదన్న క్షోభ కూడా కృపలానీకి అప్పటికే ఉంది. గాంధీగారి గ్రామ స్వరాజ్యం నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆయనను బాధించింది. దానితో స్వతంత్ర భారతంలో గాంధీజీ స్వప్నం భగ్నమైనట్టు భావించారాయన. ఈ నిరసన ఇలా కొనసాగిస్తూనే ఆయన రాజ్యాంగ పరిషత్లో పని చేశారు. కృపలానీ 1936లో సుచేతను వివాహమాడారు. ఆమె కూడా గాంధీగారి శిష్యురాలే. కానీ భర్త కాంగ్రెస్ వీడినా, ఆయన వెంటన ఆమె నడవలేదు. చివరిదాకా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కృపలానీ ఇద్దరితో కలసి 1951, జూన్లో కృషక్ మజ్దూర్ ప్రజాపార్టీని స్థాపించారు. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రఫుల్ల చంద్ర ఘోష్. రెండవ నాయకుడు మద్రాస్ ముఖ్యమంత్రి – టంగుటూరి ప్రకాశం పంతులు. ఇది తొలి లోక్సభ ఎన్నికలలో 16 స్థానాలకు పోటీ చేసింది. 9 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువగా మైసూర్ స్టేట్లో (నేటి కర్ణాటక) వచ్చాయి. తరువాత జరిగిన శాసనసభలలో ఎన్నికలలో కూడా మంచి ఫలితాలను సాధించింది. అన్నీ కలిపి 77 స్థానాలు గెలిచింది. తరువాత సోషలిస్టు పార్టీతో విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీగా అవతరించింది. కానీ 1954లోనే కృపలానీ ఈ పార్టీని విడిచిపెట్టారు. స్వతంత్ర రాజకీయవేత్తగా ఉండడం ఆయన ఉద్దేశం. కృపలానీ పార్లమెంట్లో కూడా చాలా కీలకంగానే వ్యవహరించారు. 1952, 1957, 1963, 1967 లోక్సభ ఎన్నికలలో ఆయన గెలిచారు. 1961లో వీకే కృష్ణమీనన్ మీద పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. మొదట నెహ్రూ విధానాలను అభిమానించినప్పటికీ తరువాత ఆయనను తీవ్రంగా వ్యతిరేకించడం ఆరంభించారు. గాంధీ సిద్ధాంతాలను నెహ్రూ నిర్లక్ష్యం చేస్తున్నారని కృపలానీ భావన. చైనా యుద్ధంలో భారత్ ఓటమికి చలించిపోయిన కృపలానీ 1963లో నెహ్రూ ప్రభుత్వం మీద అవిశ్వాసం కూడా ప్రవేశపెట్టారు. 1971లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కూడా ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కోద్దికాలం వినోభా ఆశ్రమంలో గడిపారు. అది ఎంతో కాలం సాగలేదు. 1972లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం ఆరంభమైంది. ఆమె నియంతృత్వ పోకడలకు నిరసనగా జయప్రకాశ్ నారాయణ్ వంటివారి నాయకత్వంలో సంపూర్ణ విప్లవం పేరుతో అది మొదలయింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కృపలానీ. జేపీతో కలసి దేశమంతా తిరిగి ఇందిర పోకడలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1971నాటి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు, దరిమిలా సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే, ఆ వెంటనే దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి ప్రకటన వేగంగా జరిగిపోయాయి. జూన్ 25, 1975 అర్ధరాత్రి దేశ వ్యాప్తంగా జేపీ, మొరార్జీ, అశోక్ మెహతా, కేఆర్ మల్కానీ వంటి ఎందరినో అరెస్టు చేశారు. వారిలో కృపలానీ కూడా ఉన్నారు. ఇలా అనేక రాజకీయ ఆటుపోట్లను చూసిన కృపలానీ 1982లో 94వ ఏట కన్నుమూశారు. అసమ్మతిలో కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించినందుకు ఆయనను చరిత్ర గుర్తుంచుకుంది. - డా. గోపరాజు నారాయణరావు -
మక్తల్లో ఇందిరమ్మ ప్రచారం..
సాక్షి, మక్తల్ : మక్తల్ నియోజకవర్గానికి 1978 జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున నర్సిములు నాయుడు పోటీ చేశారు. ఈ మేరకు ఆయనకు మద్దతుగా మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చారు. మక్తల్లోని రాయచూర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిపన బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆనాటి ఇందిరాగాంధీ హిందీ ప్రసంగాన్ని రైల్వేశాఖ మాజీ శాఖ సహాయమంత్రి మల్లికార్జున్ తెలుగులోకి అనువదించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు ఓటమి పాలయ్యారు. కానీ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నర్సిములునాయుడు మాత్రం జనతా పార్టీ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డి, రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రరావు కల్యాణి వంటి వారిని ఓడించి మక్తల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
మెతుకు సీమ ఘన చరిత్ర
మెతుకు సీమకు ఘన చరిత్ర ఉంది. ఇక్కడ శతాబ్దాల కాలం కాకతీయుల పాలన కొనసాగింది. ఇక్కడి నుంచే చారిత్రక ఖిల్లా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి కూడా ఇక్కడి చరిత్రకు ప్రత్యేక ఆనవాళ్లు. దేశానికి ప్రధాన మంత్రిని అందించి చరిత్రపుటల్లో రాజకీయంగా చెరగని ముద్ర వేసుకుంది మెదక్ నియోజకవర్గం. మెదక్లో 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీలు గెలుపొందాయి. సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్ఎస్లు ఒక్కోసారి గెలిచాయి. నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణ అనంతరం చోటుచేసుకున్న మార్పులతో ప్రస్తుతం మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, పాపన్నపేట మండలాలుగా విస్తరించింది. 2004 ఎన్నికల ముఖ చిత్రం పన్నెండో శాసనసభ (2004–09)కు జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల కూటమికి ఎదురు నిలిచి కుదేలైంది. ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు కాంగ్రెస్, నాలుగు టీఆర్ఎస్, జనతా పార్టీ ఒకటి చొప్పున గెలుచుకున్నాయి. సిద్దిపేట నుంచి వరుసగా ఆరోసారి గెలిచి కేసీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే హరీశ్రావు వైఎస్ మంత్రివర్గంలో చేరి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్దిపేటలో అరంగేట్రం చేసి గెలుపొందారు. మొత్తంగా ఏడు కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టాయి. వైఎస్ కేబినెట్లో జిల్లాకు పెద్దపీట వేశారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మెదక్ నియోజకవర్గ ముఖచిత్రం ఘన చరితకు.. రాజకీయ చతురతకు నిలయం మెతుకుసీమ. కాకతీయుల పాలన నుంచి దేశానికి ప్రధానిని అందించడం వరకు చరగని ముద్ర వేసింది. ఇక్కడి సీఎస్ఐ చర్చి ప్రపంచానికే తలమానికం. 1952 నుంచి ఇప్పటివరకు శాసనసభకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్, జనతాపార్టీ, టీఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కరణం రామచంద్రారావు అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగారు. 2014లో గెలుపొందిన పద్మాదేవేందర్రెడ్డి డిప్యూటీ స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మెదక్ భౌగోళిక చరిత్ర నియోజకవర్గాల పునర్వివిభజనకు ముందు మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మరోలా ఉండేవి. అప్పట్లో మెదక్, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్ మండలాలు ఉండగా పునర్విభజన అనంతరం మెదక్ మున్సిపాలిటితో పాటు మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాలతోపాటు నూతనంగా ఏర్పాటు అయిన రామాయంపేట మున్సిపాలిటీ మెదక్ నియోజకవర్గంలోకి చేరాయి. మెదక్ నుంచి గెలిచి ప్రధానిగా.. 1980 సంవత్సరంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. స్వయంగా దేశనాయకత్వానికే నాయకత్వం అందించిన మెదక్ చరిత్ర రాజకీయ చరిత్రలో చెదరని ముద్రవేసుకుంది. వెంకటేశ్వరరావు రెండుసార్లు.. మెదక్ పట్టణానికి చెందిన వెంకటేశ్వరరావు వరుసగా రెండుసార్లు 1952, 1957 సంవత్సరంలో శాసనసభకు ఎంపికయ్యారు. రెండు సార్లు గెలుపొందిన వ్యక్తిగా మెదక్ చరిత్రలో నిలిచారు. మొదటిసారి గెలిచి డిప్యూటీ స్పీకర్గా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటి సారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి పద్మాదేవేందర్రెడ్డి గెలుపొందారు. ఆమె డిప్యూటీ స్పీకర్గా పదవి బాధ్యతలను నిర్వహించారు. ఐదుసార్లు గెలిచిన కరణం.. కరణం రామచంద్రారావు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన పేరు. ఆయన పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామస్తుడు. సాధారణ వ్యవసాయ కుంటుంబంలో జన్మించిన ఆయన మెదక్ నుంచి శాసనసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు కొనసాగారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆయన 1983, 1985, 1994, 1999 సంవత్సరాల్లో టీడీపీ తరఫున గెలుపొందారు. రామాయంపేట మండలం మొత్తం ఓటర్లు 28,341 మహిళలు 14,474 పురుషులు 13,867 -
ఇందిరమ్మకు ప్రముఖుల నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు శక్తిస్థల్ కు వచ్చి నివాళులర్పించారు. దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘ఇందిరా గాంధీ మాకు శాశ్వత ప్రేమను ఇచ్చారు. ఆమె ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తన జీవితాంతం ప్రజల బాగు కోసం పాటు పడ్డారు, ఆమెను ఆనందంతో స్మరించుకుంటున్నాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ట్వీటర్ ద్వారా ఇందిరా గాంధీకి నివాళులర్పించారు. దేశం కోసం ఆమె చేసిన కృషిని విషయాన్ని మరిచిపోలేమని ఆయన అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దంపతులకు 1917, నవంబర్ 19న ఇందిరా గాంధీ జన్మించారు. 1966లో అప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్ర్తి ఆకస్మిక మరణంతో ప్రధాని పదవిని చేపట్టి 1977 వరకు ఆ పదవిలో ఉన్నారు. మళ్లీ 1980లో మరోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. 1984 అక్టోబర్ 31న అంగరక్షకులు చేతిలో హత్యగావించబడ్డారు. -
దేశమంతా వ్యతిరేకం...తెలుగుగడ్డపై బ్రహ్మరథం
దేశ చరిత్రలో ఎమర్జెన్సీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందిరాగాంధీ నియంతృత్వంగా వ్యవహరించి 1975–77 మధ్య దేశవ్యాప్తంగా అత్యయికస్థితిని కల్పించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందరో మేధావులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా ప్రతినిధులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు.. 1978లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశమంతా ఇందిర ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్పునిస్తే.. తెలుగు ప్రజలు మాత్రం ఇందిరకు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రెండోసారి చీలినా.. (1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటిసారి) ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) చావుదెబ్బతిని మూడోస్థానానికి పరిమితమైంది. దేశం నివ్వెరపోయేలా! 1977 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో (నీలం సంజీవరెడ్డి స్థానం మినహా) 41 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణలోని మొత్తం 15 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే ఏకపక్షంగా విజయఢంకా మోగించారు. అయితే.. 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చీలింది. ఇందిరాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ (ఐ) ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ హస్తం గుర్తుతోనే పోటీచేసింది. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్(ఆర్) పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ (రెడ్డి) సర్కార్ నేతృత్వంలోనే (జలగం సీఎంగా) 1978 ఎన్నికలు జరిగాయి. హస్తం జోరు... 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. అప్పటివరకు ఆవు–దూడ ఎన్నికల చిహ్నంతో కాంగ్రెస్ పార్టీ పోటీచేసింది. 1978 శాసనసభ ఎన్నికల నుంచి హస్తం గుర్తుపై బరిలో దిగింది. ఈ ఎన్నికలతో హస్తం గుర్తుకు ప్రజాదరణ పెరిగింది. మొత్తం 294 సీట్లలో 175 స్థానాల్లో (తెలంగాణలోని 107 స్థానాల్లో 65 సీట్లు) ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. జనతాపార్టీ 60 సీట్లతో రెండోస్థానంలో నిలవగా రెడ్డి కాంగ్రెస్ 30 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. తెలంగాణ ప్రాంతంలో ఇందిరాకాంగ్రెస్ 65, జనతాపార్టీ 15, కాంగ్రెస్(ఆర్) 12, సీపీఎం 05, సీపీఐ 03, ఇండిపెండెంట్లు 7 సీట్లలో గెలిచారు. తగ్గుతూ వస్తున్న మహిళా ఎమ్మెల్యేలు తెలుగురాష్ట్రంలో 54 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీచేయగా.. 10మంది విజయం సాధించారు. ఇందులో ఏడుగురు ఆంధ్ర ప్రాంతం నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం (ఎస్సీ) స్థానం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీచేసిన సుమిత్రాదేవి, జనతాపార్టీ అభ్యర్థిగా హిమాయత్నగర్ నుంచి తేళ్ల లక్ష్మీకాంతమ్మ విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఎం నేత మల్లు స్వరాజ్యం ఎన్నికయ్యారు. జుక్కల్ (ఎస్సీ) సీటు నుంచి పోటీచేసిన రిపబ్లికన్పార్టీ నేత జెట్టి ఈశ్వరీబాయి, కార్వాన్ నుంచి జనతాపార్టీ టికెట్పై పోటీచేసిన టీఎన్ సదాలక్ష్మీ ఓటమి పాలయ్యారు. మలక్పేట స్థానం కాంగ్రెస్ (ఐ) నుంచి పోటీ చేసిన సరోజినీపుల్లారెడ్డి కూడా ఓడిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ (ఆర్) డిపాజిట్లు గల్లంతు 257 స్థానాలకు పోటీ చేసిన రెడ్డి కాంగ్రెస్కు 130 చోట్ల ధరావతు దక్కలేదు. ఇందిరా కాంగ్రెస్ 290 సీట్లలో పోటీచేయగా 18 స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు కోల్పోయింది. 270 చోట్ల అభ్యర్థులను నిలిపిన జనతాపార్టీ 36 చోట్ల, 31 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ 12 చోట్ల, సీపీఎం 22 సీట్లలో పోటీచేసి ఒక చోట ధరావతు కోల్పోయాయి. ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 640 మంది ఇండిపెండెంట్లు పోటీచేయగా.. 593 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎంపీలుగా యోధానుయోధులు మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి (నంద్యాల), కాసు బ్రహ్మానందరెడ్డి (నరసారావుపేట), పీవీ నరసింహారావు (హన్మకొండ) ఈ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి ఎంపీలైన వారిలో కొత్త రఘురామయ్య (గుంటూరు), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), పూసపాటి విజయరామ గజపతిరాజు (బొబ్బిలి), పి.రాజగోపాల నాయుడు (చిత్తూరు), ద్రోణంరాజు సత్యనారాయణ (విశాఖపట్నం), వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ (పార్వతీపురం–ఎస్టీ) ఉన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన వారిలో పీవీతోపాటు జి.వెంకటస్వామి (సిద్దిపేట–ఎస్సీ), రాజా రామేశ్వరరావు (పాలమూరు), ఎం.ఎం.హాషీం (సికింద్రాబాద్), కె.సత్యనారాయణ (హైదరాబాద్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), జలగం కొండల్ రావు (ఖమ్మం), మహ్మద్ అబ్దుల్ లతీఫ్ (నల్లగొండ) తదితరులున్నారు. ఫిరాయింపుల జోరు 1978 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొంతకాలానికే.. కాంగ్రెస్(ఐ)లోకి రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. రెడ్డి కాంగ్రెస్ నుంచి 27 మంది (మొత్తం 30), జనతాపార్టీ టికెట్పై 44 మంది (మొత్తం 60) ఇందిరా కాంగ్రెస్లో చేరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో వెంకయ్య గెలుపు ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యేలుగా ఉదయగిరి నుంచి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జనతాపార్టీ టికెట్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. సర్దార్ గౌతులచ్చన్న (సోంపేట–జనతాపార్టీ), పుచ్చలపల్లి సుందరయ్య (గన్నవరం–సీపీఎం), శత్రుచర్ల విజయరామరాజు (నాగూరు–జనతాపార్టీ), పూసపాటి అశోకగజపతిరాజు (విజయనగరం–జనతాపార్టీ), భాట్టం శ్రీరామమూర్తి (పరవాడ– కాంగ్రెస్–ఆర్), ముద్రగడ పద్మనాభం (ప్రత్తిపాడు–జనతాపార్టీ),నాదెండ్ల భాస్కరరావు (విజయవాడ– కాంగ్రెస్–ఐ), కోనేరు రంగారావు (కంకిపాడు–కాంగ్రెస్–ఐ), వడ్డే శోభనాద్రీశ్వరరావు (ఉయ్యూరు–జనతాపార్టీ), కాసు వెంకటకృష్ణారెడ్డి (నరసారావుపేట–కాంగ్రెస్–ఆర్), ఎరాసు అయ్యపురెడ్డి (పాణ్యం–జనతాపార్టీ) గెలిచిన మహామహుల్లో ఉన్నారు. రంగంలోకి ఇందిర సీఎం జలగం వెంగళరావు సహా మెజారిటీ కాంగ్రెస్నాయకులు రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగడంతో కాంగ్రెస్ (ఐ)లో సీనియర్లు పెద్దగా చేరలేదు. ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పటివరకు గవర్నర్గా ఉన్న డా.మర్రి చెన్నారెడ్డికి అప్పగించారు. అయితే సీనియర్లంతా కాంగ్రెస్ (ఆర్)లో ఉండటంతో కాంగ్రెస్ (ఐ)పై పోటీ చేసేందుకు కొత్తవారికి అవకాశం దక్కింది. ఎమర్జెన్సీ ప్రభావం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇందిరా కాంగ్రెస్పై ప్రతికూలంగా కనిపించలేదు. పైగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీని బహిష్కరించినందుకు ఆమెపై ఓట్ల రూపంలో సానుభూతిని కురిపించారు. ఏపీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిర స్వయంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, హస్తం గుర్తుకు ప్రజాదరణ పెరిగేలా చేయగలిగారు. అయిదేళ్లలో నలుగురు సీఎంలు... ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించినా.. ఇందిరా కాంగ్రెస్లో అంతర్గత కలహాలు రోడ్డునపడ్డాయి. గ్రూపుల సంస్కృతి కారణంగా రాజకీయ శూన్యత ఏర్పడింది. మొదట మర్రి చెన్నారెడ్డి సీఎం కాగా.. రెండేళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతానికే చెందిన టి.అంజయ్య ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన భవనం వెంకటరామిరెడ్డిని సీఎం చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో రాయలసీమకు చెందిన కోట్ల విజయభాస్కరరెడ్డిని సీఎంగా నియమించారు. వైఎస్, పీజేఆర్, చంద్రబాబు విజయం కాంగ్రెస్ (ఆర్) టికెట్పై పులివెందుల నియోజకవర్గంనుంచి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 20,496 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం టి.అంజయ్య కేబినెట్లో మెడికల్ సర్వీసెస్ మంత్రిగా వ్యవహరించారు. చంద్రగిరి నుంచి నారా చంద్రబాబునాయుడు ఇందిరా కాంగ్రెస్ టికెట్పై 2,494 మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రయ్యారు. కేఈ కృష్ణమూర్తి (ఇందిరా కాంగ్రెస్) తదితరులు కూడా మొదటిసారి గెలిచిన వారిలో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి ఆలె నరేంద్ర (జనతాపార్టీ)పై పి.జనార్దన్రెడ్డి (కాంగ్రెస్–ఐ) 654 ఓట్లతో గెలుపొంది అంజయ్య కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. భువనగిరి నుంచి జనతాపార్టీ టికెట్పై పోటీచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఓడిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి రెడ్డి కాంగ్రెస్ నేత, అప్పటి సీఎం జలగం వెంగళరావు చేతిలో ప్రజా కవి కాళోజీనారాయణరావు (జనతాపార్టీ) ఓటమిపాలయ్యారు. గెలిచిన వారిలో జైపాల్ రెడ్డి (కల్వకుర్తి–జనతాపార్టీ), చెన్నమనేని రాజేశ్వరరావు, సయ్యద్ సలావుద్దీన్ ఒవైసీ (చార్మినార్–మజ్లిస్) తదితర ప్రముఖులున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బెస్ట్ పీఎమ్ అవార్డు గోస్ టూ..
న్యూఢిల్లీ : ఇప్పటివరకూ భారత దేశ ప్రధాని పీఠం అధిరోహించినవారిలో నరేంద్ర మోదీనే ఉత్తమ ప్రధాని అంటూ సర్వేలు తేల్చేశాయి. తరువాత స్థానంలో దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయిలు ఉన్నారు. అయితే ఈ సర్వేలో స్వతంత్ర భారతావని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాలుగో స్థానానికి పరిమితమయ్యారని ‘ఎమ్ఓటీఎన్’(మూడ్ ఆఫ్ ది నేషన్) పోల్ ప్రకటించింది. ఇప్పటి వరకూ దేశ ప్రధాని పదవిని అలంకరించిన వారిలో, ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉందో తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో పోల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ పోల్లో దాదాపు 12,100 మంది పాల్గొన్నారు. వీరిలో 26 శాతం ఓట్లు సాధించి, మోదీ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, 12 శాతం ఓట్లు సాధించిన అటల్ బిహారీ వాజ్పేయి మూడో స్థానంలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ 10 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, హెచ్డీ దేవేగౌడ చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ సర్వేలో మోదీ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికి గతంతో పోలిస్తే ఈ సారి ఆయనకు వచ్చిన ఓట్లు తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది(2017) జులైలో నిర్వహించిన ‘ఎమ్ఓటీఎన్’ పోల్లో మోదీ 33 శాతం ఓట్లు సాధించగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పోల్లో 28 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుతం (జులైలో) నిర్వహించిన పోల్లో 26 శాతం ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. మోదీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నప్పటికి ఆయనకు వస్తున్న ఓట్లు మాత్రం తగ్గుతున్నట్లు సమాచారం. అయితే మోదీకి ఓటు వేసిన వారిలో ఎక్కువగా హిందూవులే ఉండటం గమనార్హం. దాదాపు 28 శాతం హిందూ ఓటర్లు మోదీకి మద్దతుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇందిరా గాంధీకి ముస్లిం ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాదాపు 26 శాతం మంది ముస్లింలు ఇందిరకు మద్దతు ఇవ్వగా, మోదీకి కేవలం 11 శాతం ముస్లింలు మాత్రమే ఓటు వేసినట్లు సమాచరం. ఉత్తర, తూర్పు భారతదేశంలో మోదీకి ఎక్కువ మంది మద్దతుదారులు ఉండగా.. ఇందిరకు పశ్చిమం, దక్షిణ భారతంలో ఎక్కువ మంది మద్దతు దారులు ఉన్నారు. ఇక అటల్ బీహార్ వాజ్పేయి అన్ని దిశల వారి మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు. -
‘తండ్రిని రాముడిగా, కూతుర్ని దుర్గగా వర్ణించారు’
న్యూఢిల్లీ : రాజకీయాల్లో అజాతశత్రవుగా ఎదిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూశారు. పదిసార్లు లోక్సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిక్కచ్చిగా, సూటిగా మాట్లాడే వాజ్పేయి అంటే విపక్ష నేతలకు కూడా అభిమానమే. జవహర్లాల్ నెహ్రూ అంటే తనకు చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించేవారు వాజ్పేయి. రాజకీయ రంగంలో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అయితే వాజ్పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో జోస్యం చెప్పారు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది వివరాలు.. 1957లో వాజ్పేయి తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ నుంచి రెండో లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా లోక్సభలో క్రీయాశీలంగా ఉండేవారు వాజ్పేయి. ఆయన ఉత్సాహం నెహ్రూను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నెహ్రూ, వాజ్పేయిని బ్రిటీష్ ప్రధానికి పరిచయం చేస్తూ.. ‘ఇతను మా లోక్సభలో యువ ప్రతిపక్ష నేత. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. నాకు మాత్రం ఇతనికి గొప్ప భవిష్యత్తు ఉండబోతోందనిపిస్తోంది. మా దేశంలో వికసిస్తోన్న యువ పార్లమెంటేరియన్లకు ఇతను ప్రతీక’ అంటూ వాజ్పేయి భవిష్యత్తు గురించి స్వయంగా నెహ్రూ అనాడే జోస్యం చెప్పారు. వ్యక్తిగతంగా అభిమాని.. రాజకీయాల్లో ప్రత్యర్థి ఒకసారి వాజ్పేయి నెహ్రూని విమర్శిస్తూ.. ‘పండిట్జీ మీరు శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ దేశంలో జరిగే విషయాలను కూడా అలా తలకిందులుగానే చూస్తానంటే కుదరదం’టూ విమర్శించారు. వ్యక్తిగతంగా నెహ్రూ అంటే ఎంతో అభిమానమున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి తన బాధ్యతలను విస్మరించేవారు కారు. అందువల్లే నెహ్రూ 1961లో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రతా మండలీలో వాజ్పేయిని నియమించారు. ఆయన శ్రీరాముడిలాంటి వారు నెహ్రూ పట్ల తన గౌరవాన్ని చూపించడంలో వాజ్పేయి ఎవరికి భయపడేవారు కారు. 1964లో నెహ్రూ మరణించినప్పడు వాజ్పేయి మాట్లాడుతూ.. ‘ఒక కల చెదిరిపోయింది.. విశ్వంలో ఒక జ్వాల మరుగునపడిపోయింది. ఆకలి, భయమంటే తెలియని ప్రపంచం గురించి కలగన్న గులాబీ నేడు రాలిపోయింది. చీకటితో పొరాడి మాకు దారి చూపిన వెలుగు అస్తమించిందం’టూ నివాళులు అర్పించారు. అంతేకాక నెహ్రూ చాలా నిజాయితీ గల వ్యక్తి, చర్చలంటే భయపడే వారు కారంటూ నెహ్రూను, వాజ్పేయి శ్రీరామునితో పోల్చారు. కూతురితోనూ ఢీ... అయితే వాజ్పేయికి నెహ్రూతో ఉన్నంత మంచి సంబంధాలు ఆయన కూతురు ఇందిరా గాంధీతో లేవు. 1970లో ఒకసారి పార్లమెంట్లో వాడివేడి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇందిరా గాంధీ జన్ సంఘ్ను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక తాను తల్చుకుంటే జన్సంఘ్ను 5 నిమిషాల్లో నాశనం చేస్తానంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఇందిరా గాంధీ. అయితే తర్వాత మాట్లాడిన వాజ్పేయి ప్రధాని ఇందిరా గాంధీ మాటలకు ధీటుగా బదులిస్తూ ‘ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధాని ఇలా మాట్లాడటం సమంజసమేనా’ అంటూ విమర్శించారు. అంతేకాక ఆమె(ప్రధాని ఇందిర) జన్సంఘ్ను కేవలం 5 నిమిషాల్లో నాశనం చేస్తానని అన్నారు... 5 నిమిషాల్లో ఆవిడ తన జుట్టునే సరిచేసుకోలేరు అలాంటిది జన్సంఘ్ను ఎలా మారుస్తారంటూ’ వాజ్పేయి ప్రశ్నించారు. అంతేకాక నెహ్రూజీ కూడా కోప్పడేవారని, కానీ ఇలా మాత్రం మాట్లాడేవారు కారంటూ గుర్తు చేశారు. ఇందిరను దుర్గా దేవిగా అయితే మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగడటానికి వాజ్పేయి ఏ మాత్రం సిగ్గుపడే వారు కారు. అందుకే1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో వాజ్పేయి, పార్లమెంట్ సాక్షిగా ఇందిరా గాంధీని దుర్గామాతాతో పోల్చారు. అలానే కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోను వాజ్పేయికి మంచి స్నేహం ఉండేది. వాజ్పేయి చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం ‘రాజకీయ చదరంగం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ప్రజస్వామ్యం ఎన్నటికి నిలిచి ఉంటాయి’. -
ఆర్కే ధావన్ కన్నుమూత
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత విశ్వసనీయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాజీందర్ కుమార్ (ఆర్కే) ధావన్ (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని బీఎల్ కపూర్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 7 గంటలప్పుడు ధావన్ మరణించినట్లు ఆయన కుటుంబ సన్నిహితుడొకరు వెల్లడించారు. కేంద్రమంత్రిగానూ పనిచేసిన ధావన్ను వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో గత మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కేన్సర్ ఉంది. రక్తంలో ఇన్ఫెక్షన్ పెరగడం, మూత్రపిండాలు దెబ్బతినడంతో ధావన్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘కాంగ్రెస్ సీనియర్ నేత ధావన్ మరణించారు. ఆయన మృతికి మా సంతాపం తెలుపుతున్నాం. కాంగ్రెస్ కోసం ఆయన చూపిన అవిశ్రాంత స్ఫూర్తి, అపరిమిత నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కూడా ధావన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇందిర కాలంలో విశేషాధికారాలు 1962–84 మధ్య ఇందిరా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా ధావన్ పనిచేశారు. 1975లో అత్యవసర స్థితి విధించినప్పుడు ఇందిరకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ధావన్ ఒకరు. వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో ధావన్కు విశేషాధికారాలు ఉండేవనీ, ఇందిరను ఎవరు కలవాలి? ఆమెకు ఏయే సమాచారం అందించాలి, ఏ విషయాలు చెప్పకూడదు? లాంటివన్నీ ధావన్ నియంత్రించేవారని అంటుంటారు. ఇందిర హత్యలో ధావన్కు హస్తముందని గతంలో ఆరోపణలొచ్చాయి. దీంతో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక ధావన్ను పక్కన బెట్టారనే వాదన ఉంది. అయితే రాజీవ్ హయాంలోనే 1990లో ఆయన కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ అయ్యారు. సీడబ్ల్యూసీలో సభ్యుడిగా ఉన్నారు. 1995–96 కాలంలో గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా చేశారు. 74 ఏళ్ల వయసులో, 2012లో పెళ్లి చేసుకున్నారు. -
కృష్ణమ్మ పరవళ్లకు 51ఏళ్లు
నాగార్జునసాగర్ : తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేసి నేటికీ 51ఏళ్లు నిండాయి. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ మానవ నిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆనాడు రైతుల కళ్లల్లో ఆనందం తొ ణికిస లాడింది. కాల్వల్లో నీరు పారడంతో బీళ్లుగా ఉన్న భూముల్లో రైతులు సిరులు పండిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 3లక్షలు, కుడి, ఎడమ ఎడమ కాల్వల ద్వారా రూ. 25 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. తాగు, సా గునీటికి కొదువలేకుండా పోయింది. ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, కోదాడ, హాలియా, నేరేడుచర్ల, హూజూర్నగర్ ప్రాంతాలు నేడు ఆరి ్థకంగా అభివృద్ధి పథంలో ఉన్నాయి. నేటికీ నెరవేరని లక్ష్యం ఇన్నేళ్లు గడిచినా ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు ఆధునికీకరణలో కొన్ని ప్రాంతాలకు నీరు చేరువైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లోని కాల్వ చివరి భూములకు నేటికీ నీరందడం లేదు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి అంచనా వ్యయం కేవలం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో రూ.4,444.44కోట్లతో ప్రణాళిక తయారుచేసి పనులను ప్రారంభిం చారు. 2016లో పనులు పూర్తి చేశారు. ఆధునికీకరణతో పూర్తిస్థాయిలో నీరుసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణతో గ్యాప్ ఆయకట్టు లక్ష ఎకరాలకు సాగు నీరందడంతో పాటు మరికొంత భూమి టేలాండ్గా మారకుండా ఉంది. కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగి అనుకున్న సమయానికి పొలాల్లోకి నీరు చేరుతోంది. ఆఫ్ ఆన్ పద్ధతిలో నీరిచ్చి రైతులకు అదనపు దిగుబడి వచ్చేలా చేశాం. - సునీల్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ -
చిన్న కష్టానికే అంతగా చలించిపోవడమా!!!
అమ్మ తిట్టింది...ఆత్మహత్య! ఒక్క మార్కు తక్కువొచ్చింది... ఆత్మహత్య!... ప్రతి చిన్నదానికీ ఏదో నిరాశ.. చేతిలోంచి జారిపడిన మట్టిముద్ద నేలపాలవుతుంది. మళ్ళీ లేవదు. అదే బంతి కిందపడితే వెంటనే పైకి లేస్తుంది. విద్యార్థులుగా మీరు నిభాయించుకోగలగాలి. తప్పయితే క్షమించండని అడగాలి. ఒప్పయితే ఒప్పని నిలబడాలి. ఒక్క మార్కు తక్కువొస్తే వచ్చేసారి కాలేజి ఫస్ట్ రా, యూనివర్శిటీ ఫస్ట్ రా...అదీ సాధన. అప్పడు నీవు చరిత్రకెక్కుతావు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీ...ఒకనాడు తండ్రికి భారం కాకూడదని 20 కి.మీ. నడిచివెళ్ళి చదువుకుంది. ఐఏఎస్కి ప్రయత్నించింది. ఐపిఎస్కు ఎంపికయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిగా రికార్డుకెక్కింది. ఇందిరాగాంధీ ఆమెకు ఆదర్శ మహిళ. ప్రధానమంత్రిగా శ్రీమతి గాంధీ ఉన్న కాలంలో జరిగిన ఏషియాడ్ క్రీడలప్పుడు ట్రాక్ ఇంచార్జిగా కిరణ్ బేడీని నియమించారు. ఒకరోజు విధుల్లో ఉండగా ట్రాక్ దగ్గర ప్రధానమంత్రి కారు ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా పార్క్ చేసి ఉంది. అది ప్రధానమంత్రి కారు అని చెబుతున్నా పట్టించుకోకుండా క్రేన్తో వ్యాన్లో పెట్టించి పోలీస్ స్టేషన్కు తరలించింది. సామాన్యుడికి ఒక రూలు, ప్రముఖులకు మరో రూలా? ససేమిరా అంగీకరించేది కాదు. నియమోల్లంఘన జరిగితే ఎవరినీ లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినందుకు చరిత్రలో బహుశా ఆమె పొందినన్ని బదిలీలు మరెవరూ పొంది ఉండలేదేమో. అయినా సరే. వెనకడుగు వేయలేదు. ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాట్లను అత్యుత్తమంగా నిర్వహించినందుకు ఇందిరాగాంధీ ఆమెను ఆహ్వానించి తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు. కక్షసాధింపు బదిలీల్లో భాగంగా ఒకసారి ఆమెను తీహార్ జైలుకు డీజీగా పంపారు. ఒక్క తప్పుచేసి జీవితంలో ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బతకాలని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి ఆమె దానిని అతి కొద్దికాలంలోనే ఆశ్రమంగా మార్చేసారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఆమె ఒక పుస్తకాన్ని రాసారు. ఆ రోజున ఆమె ఉన్న స్థాయికి ప్రధానమంత్రిని అడిగినా వెళ్ళి ఆవిష్కరించి ఉండేవారు. కానీ పేరు మోసిన నేరస్థుడు, ఖైదీ ఛార్లెస్ శోభారాజ్తో ఆవిష్కరింపచేసారు. ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఆవిడకేం ఒక్క రోజులో రాలేదు. జీవితంలో అన్ని కష్టసుఖాలకు ఓర్చి నిలబడింది. ఒక సంకల్పంపెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అంతపెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారు ఒక కచ్చేరీ చేయాలంటే ఆరుగంటలు సాధన చేసి వెళ్ళేవారు. అదీ నిబద్ధత. దాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. అబ్దుల్ కలాం మంచి దార్శనికుడు. ఫెయిల్ (ఊఅఐఔ) అన్నమాటకు కొత్త నిర్వచనం చెప్పాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ (ఊజీటట్ట అ్ట్ట్ఛఝp్ట ఐn ఔ్ఛ్చటnజీnజ) అంటే నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం చేసినవాడు.. అని. విఫలమయితే నిరాశపడకూడదు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే... మరోసారి ప్రయత్నించు. ‘‘నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్లు రేకురేకుగా వికసనం పొందాలి. వాళ్ళు అటువంటి ఆత్మ స్థయిర్యం పొందాలి.’’ అని కలాం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేయడమే ఆయనకు మీరు అర్పించే నివాళి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నెహ్రూ హయాం నుంచే అవిశ్వాసం
-
ఇందిరమ్మ విగ్రహం ధ్వంసం
మాచర్ల: పట్టణంలోని రైల్వేస్టేషన్కు వెళ్లే రహదారిలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విగ్రహం వద్ధ ధర్నా నిర్వహించారు. జోహార్ ఇందిరా.. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు పలువురు లారీ ఢీకొనడం వల్ల విగ్రహం ధ్వంసమైనట్లు తెలిపారు. లారీకి ట్రాక్టర్ అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయి విగ్రహాన్ని ఢీకొన్నట్లు వివరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది కుట్ర అని, తమ పార్టీని బతకనివ్వకూడదన్న దురుద్దేశంతో కొందరు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ను సీఎం చేసిన ఘనత ఇందిరాగాంధీదే
సాక్షి, కర్నూలు: ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన బ్రాహ్మణకొట్కూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. తడబడుతూ చేసిన ప్రసంగంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. వర్ధంతిని జయంతి అనడం, జయంతిని వర్ధంతి అనడం, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందనడం, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లు అనడం ఇంతకుముందు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించిన మంత్రి వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకను, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పాతబస్తీలోని ఉస్మానియా కళాశాల మైదానంలో మైనార్టీ పొదుపు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ బడ్జెట్లో రూ.16,000 కోట్ల మేర లోటు ఉండేదని, ఆ లోటును సీఎం చంద్రబాబు పూడ్చడమే కాకుండా లోటు రహిత బడ్జెట్ను రూపొందించారని చెప్పారు. మంచి పాలన చూసి ఓర్వలేక ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని విమర్శించారు. గొంతెమ్మ కోరికలు కోరొద్దు! వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన పలువురిపై మంత్రి లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరిన ఉద్యోగులపై ఆగ్రహించారు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరవద్దన్నారు. ఇది రాష్ట్ర పరిధిలో లేని విషయం అని మీకు తెలియదా అంటూ మండిపడ్డారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత మెడికల్ సీట్ల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే మొదటి విడత కౌన్సెలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు మంత్రి లోకేశ్ కాన్వాయ్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద అడ్డుకున్నారు. ఐదుగురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విద్యార్థి నేతలతో మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ సీట్ల భర్తీ విషయం తన శాఖ పరిధిలోకి రాదంటూ తప్పించుకున్నారు. -
1974 నాటికి నేటికి తేడా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) విధించడం కాంగ్రెస్ చేసిన పాపమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడమే కాకుండా అది రాజ్యాంగాన్ని కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని కూడా ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. ఇందులో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది? నాడు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన 1974 పరిస్థితులు నేడున్నాయా? తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం నాటి ఎమర్జెన్సీ గురించి ప్రస్థావించడం లేదని, నాటి పరిస్థితులు గురించి తెలుసుకొని భవిష్యత్తులో మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత నేటి, భవిష్యత్ తరాలపై ఉందని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకు ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఏమిటీ? నేటి పరిస్థితులకు నాటి పరిస్థితులకు పోలికలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు నేడు అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉందా? దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేటి లేదా భవిష్యత్ తరాలకు వస్తుందా? 1973లో పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పాలనపై ప్రజలు విసిగెత్తారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ముందుగా గుజరాత్లో, ఆ తర్వాత బీహార్లో తిరుగుబాటు తలెత్తింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలంటూ, ప్రభుత్వాలను రద్దు చేయాలంటూ పట్టణ మధ్య తరగతికి చెందిన యువకులు తిరుగుబాటు లేవనెత్తారు. ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల వారు, ఉన్నత వర్గాల వారు, వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్ తిరుగుబాటుకు మద్దతు తెలిపారు. ఇందిర ప్రభుత్వం దళితులు, ఎస్సీలు, ఎస్టీలను రాజకీయ రంగంలోకి తీసుకరావడం, వారి సంక్షేమం కోసం ఉచిత, ఆకర్షణీయ పథకాలను అమలు చేయడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. అప్పటికే పాలనా వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతిని ఆయుధంగా చేసుకొని ఆ వర్గాల వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. 1974లో జరిగిన రైల్వే సమ్మెను అణచివేయడం ఉద్యమాలకు మరింత ఊపునిచ్చింది. దళితులు, బడుగువర్గాల సంక్షేమం పేరిట సీపీఐతో సత్ససంబంధాలు పెట్టుకున్న ఇందిరాగాంధీ వామపక్ష భావాలు కలిగిన వీఆర్ కృష్ణ అయ్యర్ను 1973లో సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారు. ముగ్గురు జడ్జీల సీనియారిటీ కాదని ఆయన్ని సుప్రీం కోర్టు జడ్జీగా నియమించడం వివాదాస్పదమైంది(పేదలు, బడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలన్న ఉద్దోశంతో ఎన్నో న్యాయ సంస్కరణలను తీసుకొచ్చిన కృష్ణ అయ్యర్ కేరళ వామపక్షాల ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు లా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు). 1975లో పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ తీర్పును ఇందిర సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆమె నియమించిన జడ్జీ వీఆర్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ తీర్పుపై షరతులతో కూడిన స్టేను మంజూరు చేశారు. బేషరతుగా స్టేను ఇవ్వనందుకు అప్పట్లో ఆయన్ని ప్రశంసించిన ప్రజలు కూడా ఉన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిరను ప్రధాని పదవికి రాజీనామా చేయలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఆ మరుసటి రోజే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే వీఆర్ కృష్ణ అయ్యర్ తీర్పును వ్యతిరేకిస్తూ నలుగురు సుప్రీం జడ్జీలు తమ పదవులకు రాజీనామా చేశారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ దేశంలో ఆర్థిక ప్రగతి మందగించడం, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, గుజరాత్, బీహార్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై అంతులేని అవినీతి ఆరోపణలు రావడం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. పార్టీలో ఇందిర ఏకఛత్రాదిపత్యం చెలాయించడం పార్టీ సీనియర్ నాయకులకు, రాష్ట్రాల నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. తోటి నాయకుల అభిప్రాలను కాదని ఆమె ఆనాడు వివి గిరిని రాష్ట్రపతిని చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను ముందే దెబ్బతీసిన ఇందిర ఎమర్జెన్సీ పేరిట ఇటు న్యాయవ్యవస్థ, అటు పత్రికా స్వేచ్ఛను హరించి వేశారు. మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఉండే కార్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలనుకున్న ఇందిర పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ ‘1971’లో మారుతి సంస్థను తీసుకొచ్చి అందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలపై ఒత్తిడి తెచ్చారు. అది కూడా పారిశ్రామిక వేత్తల ఆగ్రహానికి కారణమైంది(సంజయ్ సూచన మేరకు ‘పీపుల్స్ కార్’ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇందిర కేబినెట్ ఆమోదించింది. సూర్యరామ్ మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్గా ఏర్పడిన ఆ సంస్థకు సంజయ్ తొలి డైరెక్టర్గా వ్యవహరించారు). దేశ పురోభివృద్ధికి పెరుగుతున్న అధిక జనాభే కారణమన్న ఉద్దేశంతో కుటుంబ నియంత్రణను దౌర్జన్యంగా సంజయ్ గాంధీ అమలు చేయించడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మానవ హక్కులు కూడా పూర్తిగా హరించుకు పోవడంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసంఘ్, సీపీఎం, నక్సలైట్లు, జయప్రకాష్ నారాయణ్ తదితరులు ఉద్యమాలు నిర్మించారు. జయప్రకాష్ నారాయణ్ 1974లోనే బీహార్, గుజరాత్ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నాటి పరిస్థితులు నేడున్నాయా? నాటి లాగే నేడు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ఏడు శాతాన్ని దాటలేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అందులో మూడో వంతు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. నాటి ఇందిర ‘గరీబీ హఠావో’ నినాదం లాగానే నేడు మోదీ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అబాసు పాలయింది. నాటి అవినీతి మరకలు నేడు లేకున్నా ‘పెద్ద నోట్ల రద్దు’తో బీజేపీ నేతలు లాభ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ ప్రాభవానికి వన్నె తగ్గినట్లే నేడు బీజేపీ ప్రాభవం పడిపోతోంది. నాడు కాంగ్రెస్పై మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు తిరుగుబాటు చేయగా, నేడు బీజేపీకి వ్యతిరేకంగా దిగువ తరగతి, దళితులు, నిమ్న వర్గాల ప్రజలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఆనాటి స్థాయిలో ఆందోళనలు, అరెస్ట్లు నేడు కనిపించకపోయినా అశాంతి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గోరక్షణ పేరిట, హిందూత్వం పేరిట దాడులు జరుగుతున్నాయి. కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కొలీజియం చేసిన సిఫార్సులను రెండు సార్లు ప్రధాని కార్యాలయం తిరస్కరించడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను ప్రశ్నిస్తోంది. మీడియాపై కూడా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందిరకు మోదీకి తేడా ఏమిటీ? నాడు ఇందిరా గాంధీ ఏకఛత్రాధిపత్యంగానే దేశాన్ని పాలించారు. దాదాపు అదే స్థాయిలో నేడు నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఎలాంటి కఠోర నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనకాడని మనస్తత్వం ఆమెది. ఆచితూచి వ్యవహరించకపోయినా అంతటి కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసం మోదీ చేయలేరు. -
హిట్లర్తో ఇందిరను పోల్చడంపై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇందిరను నియంత హిట్లర్తో బీజేపీ పోల్చడాన్ని తప్పుపట్టింది. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా దిగ్గజ నేతగా వెలుగొందారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఆమెను హిట్లర్తో పోల్చడం చరిత్రను వక్రీకరించడమేనని ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీని బీజేపీ నేత అరుణ్ జైట్లీ హిట్లర్తో పోల్చడం అర్థం చేసుకోదగినదేనని, జైట్లీ ఆరెస్సెస్-బీజేపీ నేపథ్యంలో నుంచి వచ్చిన నేత ఇలానే మాట్లాడతారని అన్నారు. హిట్లర్ వంటి నియంతలు, ఫాసిస్టులను వీరు అనుసరిస్తారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ విధించారని, దీనికి స్వయంగా ఇందిరా గాంధీయే విచారం వ్యక్తం చేశారని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ జ్ఞాపకశక్తి కోల్పోయారని, నియంతలు ఎన్నికలు నిర్వహించరని అయితే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా హుందాగా ఓటమిని అంగీకరించారని అన్నారు. -
చీకటి రాజ్యం
-
ఆమె పాత్రలో నటించాలనదే నా కోరిక..
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బయోపిక్లో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా నటిస్తారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాలు క్రితం ఇందిరాగాంధీ బయోపిక్లో నటించడానికి మనీషా సంతాకం చేసినట్లు సమాచారం. ఇందిరాగాంధీ బయోపిక్లో నటించాలని ఉందని మనీషా తాజాగా ఓ ఇంటార్యూలో చెప్పారు. ‘ఆమె చాలా శక్తివంతమైన మహిళ. తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆమె ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అంతటి పవర్ఫుల్ లేడీ పాత్రలో నటించాలనదే నా కోరిక’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె పాత్రలో నటించాడం నాకు చాలా ఇష్టమని మనీషా తెలిపారు. అంతేకాక గతంలో ఈ బయోపిక్ కోసం సంతాకం చేసిన విషయాన్ని ఆమె మరొసారి గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎన్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. మనీషా ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్లో నర్గిస్ దత్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా వెల్లడించారు. -
ఇందిర ఆత్మ, జాతి వాణి హక్సర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ రచించిన ‘ఇంటర్ట్వైన్డ్ లివ్స్: పీఎన్ హక్సర్ అండ్ ఇందిరాగాంధీ, ఎ బయాగ్రఫీ ఆఫ్ హక్సర్‘ పుస్తకాన్ని జూన్ 19న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధి కృష్ణమోహన్రావుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ దౌత్యం, విదేశీ విధానాలపై విస్తృతానుభవం కలిగిన పీఎన్ హక్సర్ని 1950లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంపిక చేసుకున్నారని, పదిహేనేళ్లపాటు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేసిన హక్సర్ని 1967లో ఇందిరాగాంధీ మళ్లీ ఎంపిక చేసుకున్నారని జైరాం చెబుతున్నారు. హక్సర్.. భారతీయ రాజకీయ చరిత్రలోని సంక్లిష్ట దశలో, అత్యంత సంక్షుభిత సంవత్సరాల్లో చాణక్యుడి పాత్రను పోషించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. జాతి వాస్తవ చైతన్య ప్రదాతగా, ఇందిరాగాంధీకి విశ్వసనీయ వ్యక్తిగా చరి త్రకెక్కారు. సంజయ్ గాంధీ కలల ప్రాజెక్టు అయిన మారుతి కారు తయారీపై విభేదించిన హక్సర్, ఇంది రకు దూరం జరిగారు. జైరాం రమేష్ ఇంటర్వ్యూ సంక్షిప్తపాఠం సాక్షి పాఠకులకు అందిస్తున్నాం. హక్సర్పై పుస్తకం రాయడానికి కారణం? ఇందిరాగాంధీ హయాంలో 1967–73 మధ్యకాలంలో పీఎన్ హక్సర్ అత్యంత ప్రభావశీలుడైన, శక్తిమంతుడైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్పై విజయం, 1971 లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, 1972లో సిమ్లా ఒప్పందం, పాకిస్తాన్, న్యూ ఢిల్లీ మధ్య 1973 నాటి ఒప్పందం వంటి ఇందిర సాటిలేని విజయాలన్నింటికీ సూత్రధారి హక్సర్. ఈ అన్నింటిలో హక్సర్దే ప్రధాన పాత్రా? ఇందిరాగాంధీ రాజకీయనేత. కానీ ఈ పరిణామాలన్నింటిలో కీలకపాత్ర వహించింది మాత్రం పీఎన్ హక్సర్. ఇద్దరి భాగస్వామ్యమే ఈ విజయాలకు మూలం. సుదీర్ఘకాలంగా నెహ్రూ, ఇందిర కుటుం బంతో హక్సర్ సన్నిహిత సంబంధాలు నెరిపారు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉండిన హక్సర్ 1970లలో భారత ఆర్థిక వ్యవస్థ వామపక్షవిధానాల వైపు మొగ్గు చూపడానికి తానే బాధ్యుడు. 1969లో బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోవడం, తదుపరి పరి ణామాలన్నింట్లో హక్సర్ ఇందిర వెన్నంటే ఉన్నారు. ఇందిరకు భావజాలపరంగా, నైతికంగా మూలస్తంభంగా హక్సర్ వ్యవహరించారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీతో విభేదాల కారణంగా 1973 జనవరి 15న హక్సర్ ఇందిరకు దూరం జరిగారు. ఇందిరకు హక్సర్ పంపిన చివరి సూచన పీవీ నరసింహారావుకు సంబంధించింది కావడం విశేషం. మొదట జై తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత జై ఆంధ్రా ఉద్యమాన్ని బలపర్చిన పీవీ తన్ను తాను పూర్తి అసమర్థుడిగా నిరూపించుకున్నారని, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృఢవైఖరి అవలంబించాలని ఇందిరకు హక్సర్ సలహా ఇచ్చారు. హక్సర్ అంత శక్తివంతుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధునిక భారత చరిత్రలో కానరారు. ఇందిర నియంతృత్వానికి హక్సరే కారణమా? లేదు.. లేదు. 1973 జనవరిలో ఇందిరకు హక్సర్ దూరం జరిగారు. కానీ ఆమె ఆయన్ని మళ్లీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమించారు. ఈ స్థానంలో హక్సర్ 1975 మార్చి వరకు ఇందిరతో పనిచేశారు. 1975లో ఇందిర విధించిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితిని హక్సర్ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సంజయ్ గాంధీ బాధితుడైనప్పటికీ, ఇందిరకు విధేయుడిగానే ఉండేవారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బహిరంగంగా దాని గురించి వ్యాఖ్యానించలేదు. జరుగుతున్న పరిణామాల గురించి హక్సర్ ఇందిరను వ్యక్తిగతంగా కలిసి చెప్పేవారు. బ్యూరోక్రాట్గా హక్సర్ ఔన్నత్యం ఏమిటి? పాలనా వ్యవహారాల్లో హక్సర్ అత్యంత నిజాయితీపరుడు. అందుకే 1987లో రాజీవ్ గాంధీ చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం హక్సర్ను చైనాకు పంపారు. ఆ తర్వాతే రాజీవ్ 1988లో చైనా పర్యటించారు. పాలనపై హక్సర్ ప్రభావం స్థాయి ఏమిటి? పాలనలో సరైన వ్యక్తులను ఎంచుకోవడమే హక్సర్ గొప్పదనం. ఆయన ఎంపిక చేసినవారే ఆధునిక భారత వ్యవస్థ నిర్మాతలయ్యారు. ఆయన తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ అత్యున్నత వ్యవసాయ శాస్త్రజ్ఞుడై హరిత విప్లవానికి ఆద్యుడయ్యారు. ఇక ఆయన ఎంపిక చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1970లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అయ్యారు. ఇస్రో చైర్మన్గా హక్సర్ ఎంపిక చేసిన సతీష్ ధావన్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు పితామహుడయ్యారు. ఇక హోమీ సేత్నా పొఖ్రాన్ అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. హక్సర్ సలహమేరకే సోనియా గాంధీ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అలా పీవీ ప్రధాని కావడానికి కూడా హక్సరే ఆద్యుడు. 1973లో పీవీ అసమర్థుడని పేర్కొన్న హక్సర్ 1991లో కాంగ్రెస్లో లుకలుకలు లేకుండా వీవీ చేయగలడని నిర్ధారించుకోవడం విశేషం. సంజయ్గాంధీతో విభేదాలకు కారణం? భారత్కు ప్రజా రవాణా ముఖ్యం కానీ కార్లు కావని హక్సర్ అభిప్రాయం. రెండోది ప్రధానమంత్రి నివాసంలో ఉంటూ ఆమె కుమారుడు కారు తయారీలో పాలుపంచుకోవడంతో హక్సర్ విభేదించారు. అయితే మారుతి కార్ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చనుందని గుర్తించగానే హక్సర్ ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. జైరాం రమేష్ -
ఒంటరి స్వేచ్ఛ నిలబడదు
ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! గడచిన అర్థ శతాబ్దకాలంలో చూస్తే భారతదేశ చరిత్రలో శక్తిమంతులైన ముగ్గురు ప్రధానమంత్రులు కనిపిస్తారు. ఈ ముగ్గురికీ కూడా పూర్తి ఆధిక్యం ఉంది. వారివి స్థిరమైన ప్రభుత్వాలు. వీరిలో మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. మార్చి, 1971లో జరిగిన ఎన్నికలలో ఆమె, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ (ఐ) విపక్షాలను తుడిచి పెట్టడం కనిపిస్తుంది. తరువాత రాజీవ్ గాంధీ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 1984లో ఘన విజయం సాధించారు. మనకున్న శక్తిమంతుడైన ఆ మూడో ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఐదేళ్ల పాలన ఇప్పుడు చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతోంది కూడా. అయితే స్పష్టత కోసం 1980–84 ఇందిర పాలనను ఇందులో చేర్చడం లేదు. అప్పుడు హత్యకు గురికావడంతో ఆమె పదవీకాలం అర్థాంతరంగా ముగిసిపోయింది. తరచి చూస్తే ఈ మూడు ప్రభుత్వాల నడుమ ఒక సారూప్యతను మీరు కనుగొనగలరు. ఇందుకోసం ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ వంటి ఒక ఆధారం కూడా నన్ను ఇవ్వనివ్వండి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ ఐదేళ్ల పాలన ఆఖరి సంవత్సరాలలో ఏం చేయడానికి ప్రయత్నించారో ఆలోచించండి! ఇప్పటికీ ఊహించడం దగ్గరే ఉన్నారా? అయితే మరొక ఆధారం ఇస్తున్నాను– పత్రికా రచయిత మాదిరిగా ఆలోచించండి! వాస్తవాలు ఇక్కడున్నాయి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ పాలన చివరి ఏడాదిలో మీడియా స్వేచ్ఛను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ ఐదేళ్ల పాలనలోని సరిగ్గా చివరి సంవత్సరంలోనే అత్యవసర పరిస్థితి ప్రకటించి, పత్రికల మీద సెన్సార్ నిబంధనలను విధించారు (ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత, అందుకు తనకు తాను ఇచ్చుకునే కానుక అన్నట్టు పార్లమెంట్ కాలపరిమితిని ఒక సంవత్సరం, అంటే ఆరేళ్లకు పొడిగించుకున్నారు). స్వార్థ ప్రయోజనాలూ భారత్ను అస్థిరం చేయాలన్న కుట్ర కలిగిన ‘విదేశీ హస్తం’ కనుసన్నలలో మెలగుతున్న పత్రికారంగం (అప్పటికి ఈ రంగాన్ని ఎవరూ మీడియా అని పిలిచేవారు కాదు) ప్రతికూలతను, విద్వేషాన్ని వెదజల్లుతున్నదని ఇందిర వాదన. ఏవో కొన్ని తప్ప పత్రికలన్నీ దారికొచ్చేశాయి. దారికి రాని పత్రికల వారు జైళ్లకు వెళ్లవలసి వచ్చింది. ఆయా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. రాజీవ్ కూడా అంతే. తన ఐదేళ్ల పాలన తుది అంకంలో అంటే 1987–88 సంవత్సరంలో సదరు పరువు నష్టం బిల్లు తీసుకువచ్చారు. బొఫోర్స్ కుంభకోణం, జైల్సింగ్ సవాలు, వీపీ సింగ్ తిరుగుబాటు వంటి వాటితో సతమతమవుతున్న రాజీవ్ కూడా సహజంగా పత్రికారంగాన్ని తప్పుపట్టారు. ఆ బిల్లు అసలు లక్షణాలు ఏమిటో గ్రహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆంగ్లపత్రికను – ఇండియన్ ఎక్స్ప్రెస్–ఏకాకిని చేసి ‘శిక్షించేందుకు’ దాని మీద వందలాది దొంగకేసులు నమోదు చేయించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘నకిలీ వార్త’ మీద పోరాటం పేరుతో ప్రధానస్రవంతి మీడియా మీద దాడిని కొనసాగించే యత్నం చేస్తున్నది. అయితే ప్రధాని జోక్యంతో అలాంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు నాటకీయంగాను, అంతే సంతోషంతోను తప్పుల తడక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు. అలా ప్రకటించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయవలసి ఉందన్నదే నిజం. పైగా ఒక ఆధారం ఇస్తున్నట్టుగానే ఆ ఉపసంహరణ ప్రకటన వెలువడింది. ఎలాగంటే డిజిటల్ మీడియాకు నియమావళిని రూపొందించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అందులో ఉంది. ఈ వాదన ఎలా ఉందంటే, పత్రిక, ప్రసార రంగాలకు వాటి నిబంధనావళి వాటికి ఉంది (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ). ఎటొచ్చీ ఇబ్బందికరంగా ఉన్న డిజిటల్ మీడియాకే ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆ మీడియాను పనిచేయడానికి అనుమతించరాదు. పత్రికారంగ పూర్వపు నిబంధనలలో ‘మూడు ఉదాహరణల నిబంధన’ ఒకటి. మూడింటిని ఒకేసారి స్పృశిస్తే అవి ఒకే విషయాన్ని బోధపరుస్తాయి. ఏక ఖండంగా ఉన్న దారంలా కనిపిస్తాయి. కాబట్టి, శక్తిమంతమైన ప్రభుత్వాలు చివరి అంకంలో ప్రవేశించనప్పుడు వాటికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే వారిని చెడ్డవార్తల సంగతి చూసేటట్టు చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటేæ, అది వేరే చర్చ. వారి ఆకస్మిక పతనాన్ని వారే నమ్మలేకపోవడం, లేదా మరోసారి ప్రభుత్వంలోకి రావడం గురించి ఉన్న అభద్రతా భావం చెడువార్తలను ప్రచురిస్తున్నాయంటూ పత్రికలను తప్పు పట్టేట్టు చేస్తాయి కాబోలు. 1975 ఆరంభం నాటి పరిస్థితి ఏమిటో మనకి తెలుసు. 20 శాతానికి మించిన ద్రవ్యోల్బణంతో, లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో ఇందిరాగాంధీ పతనావస్థకు చేరుకున్నారు. అయినా పత్రికలను అదుపు చేయాలన్న ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారు. ఎందుకంటే చాలా పత్రికలు తలొగ్గాయి. అయితే పత్రికల మీద విధించిన సెన్సార్ నిబంధనల కారణంగా ప్రజలు శిక్షించడం వల్లనే ఇందిర ఓటమి పాలయ్యారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడమనే ఘోర తప్పిదానికి ఆమె పాల్పడకుండా ఉండి ఉంటే, అత్యవసర పరిస్థితి కాలం నాటి ‘క్రమశిక్షణ’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ ఆమె శత్రువులు అధికారంలోకి రావడంతో ఆమె జైలుకు వెళ్లారు. ఒక సాంఘిక ఒప్పందం అక్కడ ఆవిర్భవించింది. ఆ మేరకు సెన్సార్ నిబంధనలలోని క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించి పత్రికా స్వేచ్ఛకు పూచీ పడ్డారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేని దేశంలో ఇలాంటì మలుపు పెద్ద పరిణామం. ఆ మేరకు పత్రికా రంగాన్ని అదుపులో పెట్టాలన్న ఇందిర ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. రాజీవ్గాంధీ కూడా తన తప్పిదాలను పత్రికల మీదకు నెట్టివేసి, వాటిని శిక్షించాలని ప్రయత్నించారు. ఆయన కూడా అందులో విఫలమైనారు. ఆయన తల్లికి జరిగినట్టే ఆయన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దేశంలో ప్రముఖ పత్రికా సంపాదకులు, ఆఖరికి యజమానలు వారి వారి స్పర్థలను, వైరుథ్యాలను కూడా పక్కన పెట్టి ప్లకార్డులు పట్టుకుని జనపథ్ రోడ్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి సంఘీభావం అత్యవసర పరిస్థితి కాలంలో ఎప్పుడూ కనిపించలేదు. రాజీవ్ వెనక్కి తగ్గారు. మీడియా గొంతు నొక్కే ఉద్దేశంతో ఆ రెండు ప్రభుత్వాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు చివరికి మీడియా స్వేచ్ఛను బలోపేతం చేస్తూ ముగిశాయి. ఇలాంటి ప్రయత్నం పునరావృతమవుతుందా? అలాగే ఇలాంటి ప్రయత్నం మూడోసారి చేసి విజయం సాధించగలిగినంత బలంగా ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన చివరి దశకు చేరుకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అవి ఇంతకు ముందు చెప్పిన ఆ రెండు ప్రభుత్వాలు ఉనికి కోసం ఎదుర్కొన్న సవాళ్ల వంటివి కావు. 1975, 1988 కాలంతో పోల్చి చూస్తే ఇప్పుడు భారతీయ మీడియా ఎంతో బలంగా ఉంది. ఎంతో పెద్దది, శక్తిమంతమైనది, వైవిధ్యభరితమైనది. అలా Vó గతంలోని ఆ రెండు సందర్భాలను బట్టి చూస్తే ప్రస్తుత మీడియాకు రెండు బలమైన ప్రతికూలాంశాలు కూడా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న ఆ సామాజిక ఒప్పందం ఇప్పుడు గందరగోళంలో పడింది. ఈ సంగతి నేను గతంలో చాలాసార్లు చెప్పాను కూడా(https://theprint.in/opinion/fake-news-order-we the-indian-media-have-ignored-warning-bells/46741/).. మరొకటి– ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! విస్తారంగా ఉన్న మీడియాను చీలికలు పేలికలు చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. ఇందులోని సాధ్యాసాధ్యాలు కూడా చర్చనీయాంశమే. అయితే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, డిజిటల్ మీడియా ఈ మూడు కూడా నడుపుతున్న పెద్ద మీడియా సంస్థలు దీనితో తమకేమీ ప్రమాదం ఉండదని ఆలోచిస్తాయి. ఎందుకంటే, దాని నుంచి రక్షించే తమవైన వ్యవస్థలు ఉన్నాయని వారి నమ్మకం. అంటే అచ్చమైన డిజిటల్ మీడియా సంస్థలు వాటి బాధలు అవి పడాలి. చాలా కాలం నుంచి నడుస్తున్న మీడియా సంస్థలకు కూడా ఈ చర్య నచ్చుతుంది. ఎందుకంటే, అచ్చమైన డిజిటల్ మీడియా పాత మీడియా సంస్థలని అవినీతి నిలయాలనీ, అసమర్థమైనవనీ విమర్శిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటర్నెట్ను అదుపు చేయడం ఎవరి వల్లా కాదనీ, ఏ ప్రభుత్వం కూడా అదుపు చేయలేదనీ కొత్త డిజిటల్ మీడియా అధిపతుల నమ్మకం. అది నిజం కాదు. ఇంటర్నెట్ అనేది సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమం, ఆఖరికి ఎంతో లోతైన ఉదారవాద వ్యవస్థలు కూడా ఇంటర్నెట్ను అదుపు చేయడానికే మొగ్గుతున్నాయి. నిజంగా అదే జరిగితే, ఒంటిరిగా పోరాడడం నీ వల్ల కాదు. కాబట్టి అప్పుడు మళ్లీ సంప్రదాయ మీడియా మద్దతు అవసరమవుతుంది. అందుచేత దానిని తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. తీర్పులు ఇవ్వడం సరికాదు. కథువా (జమ్మూకశ్మీర్), ఉన్నవ్ (యూపీ) వంటి అన్యాయపు కేసులు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్ల కూడా పాలక వ్యవస్థ అహంకారపూరిత ధోరణి కారణంగా న్యాయం దిగ్బంధనమైంది. లైంగిక అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మీద కేసు కూడా నమోదు కాలేదు. కానీ మీడియా నిర్వహించిన కృషి వల్ల ఈ అన్యాయం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు సాగుతోంది. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే మనమంతా కలసి పోరాడవలసిందే. లేదంటే చీలికలు పేలికలైపోయి కునారిల్లిపోవడానికి సిద్ధంగా ఉండడమే. నీ విరోధులు స్వేచ్ఛను కాపాడగలిగినప్పుడే నీ స్వేచ్ఛను నీవు కాపాడుకోగలుగుతావు. స్వేచ్ఛ చీలికలు పేలికలై పోకూడదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పాత బాణీ విడనాడాలి
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్లో మూడురోజులు పర్యటించి వెళ్లారు. నాలుగేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రమే కాదు... తన తొలి విదేశీ పర్యటనకు ఓలి మన దేశాన్ని ఎంచుకోవడంవల్ల కూడా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో వ్యవసాయరంగంలో భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్యా ఉన్న రైల్వే లైన్లను విస్తరించుకోవడం, జలమార్గాలను ఏర్పాటు చేసుకోవడం, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం, వాణి జ్యాన్ని పెంపొందించుకోవడం వగైరా అంశాల్లో అవగాహన కుదిరింది. ఒకప్పుడు నేపాల్ మనకు అత్యంత సన్నిహిత దేశం. తన అవసరాలన్నిటికీ మనపైనే ఆధా రపడే దేశం. మన కనుసన్నల్లో నడిచే దేశం. ఆ దేశ రాజకీయాలను శాసించగలిగే స్థితిలో భారత్ ఉండేది. కానీ అక్కడ రాచరిక పాలన అంతమయ్యాక వరసబెట్టి జరుగుతున్న పరిణామాలు మనకు ఇబ్బందికరంగానే పరిణమిస్తూ వచ్చాయి. దాంతో సంబంధం లేకుండానే మన దేశం నేపాల్ను నిర్లక్ష్యం చేయడం అంత క్రితమే మొదలైంది. 1997లో అప్పటి ప్రధాని ఇందర్కుమార్ గుజ్రాల్ తర్వాత 2014లో నరేంద్ర మోదీ వచ్చేవరకూ మన ప్రధాని ఎవరూ ఆ దేశం పర్యటించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకన్నా ఆశ్చర్యకరమేమంటే... ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ 1987లో ఏర్పాటైనప్పుడు రెండేళ్లకోసారి ఆ కమిషన్ సమావేశం కావాలని నిర్ణయించగా 2014 వరకూ ఏ ప్రభుత్వమూ ఆ ఊసెత్తలేదు. ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవడమే రివా జైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ సంబంధాలు 2015లో మరింత దిగ జారాయి. అప్పట్లో తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు రాజ్యాంగంలో తమ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో రహ దార్లను దిగ్బంధించాయి. దాంతో మన దేశం నుంచి అక్కడకు వెళ్లాల్సిన వంట గ్యాస్, నిత్యావసరాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. అంతక్రితమే వచ్చిన భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ ఈ దిగ్బంధంతో ఊపిరాడని స్థితికి చేరుకుంది. మాధేసీలకు మద్దతిస్తున్న మన దేశం ఈ దిగ్బంధనానికి పరోక్షంగా సహకరించిందని, కష్టకాలంలో తమను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిందని నేపాలీ పౌరుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఆ సమయంలో నేపాల్ రిపబ్లిక్ తొలి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విద్యాదేవి భండారీ చైనాతో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నారు. మాధేసీల హక్కుల పరిరక్షణకు సంబం« దించిన సమస్యతోపాటు... తాము వద్దని అనధికారికంగా చెప్పినా రాజ్యాంగంలో నేపాల్ను లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్గా పేర్కొనడంపై కూడా మన దేశానికి అభ్యంతరం ఉందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే నేపాల్ ఆంతరంగిక అంశాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా అవి అత్యవసర సరఫరాలు నిలిచిపోయే స్థితికి వెళ్లకుండా చూసి ఉంటే అది మన ప్రయోజనాలకే తోడ్పడేది. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నదని అక్కడి పౌరుల్లో అభిప్రాయం ఏర్పడటం మంచిది కాదని గుర్తిస్తే బాగుండేది. నేపాల్ జనాభా 2.9 కోట్లు. భౌగోళికంగా కూడా చిన్న దేశం. కానీ ఆ దేశంతో మనకు 1,850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుల్లో అరడజను ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా పేచీలున్నాయి. కాలా పానీ నదీ జలాల వివాదం ఉంది. ఇరు దేశాల మధ్యా రాకపోకలకు వీసా నిబంధన లేకపోవడం వల్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం బెడద సమస్యలు ఏర్పడుతున్నాయి. సరిహద్దు భద్రతలో రెండు దేశాలమధ్యా సహకారం చాలా అవసరం. సఖ్యత ముఖ్యం. అయితే నేపాల్లో జరిగిన పరిణామాలన్నీ మన ప్రభుత్వానికి అసంతృప్తి కలిగి స్తూనే వచ్చాయి. మూడు నెలలక్రితం అక్కడ జరిగిన ఎన్నికల్లో ఓలి నాయ కత్వంలోని వామపక్ష సీపీఎన్(యుఎంఎల్)–సీపీఎన్(మావోయిస్టు) కూటమి ఘన విజయం సాధించింది. ఓలి, ఆయన నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) చైనాతో సఖ్యంగా ఉండాలని ఆదినుంచీ వాదించేవారు. 2015నాటి దిగ్బంధం సమయంలో కూడా యూఎంఎల్ భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అందువల్లే ఓలి రాకతో భారత్–నేపాల్ సంబంధాలు దెబ్బతినొచ్చునన్న ఊహాగానాలు వెలు వడ్డాయి. దీనికితోడు గత నెలలో ఓలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని అబ్బాసీ నేపాల్ పర్యటించారు. భారత్–పాక్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ఈ పర్యటన మంచి సంకే తాలు పంపదని అక్కడి మీడియా ఓలిని హెచ్చరించింది. లోగడ ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు చైనాతో బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓలిపై భారత వ్యతిరేకి అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆయన గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్నే ఎంచుకున్నారు. అంతేగాక భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకుపోవాలన్న కృత నిశ్చయంతో ఈ పర్యటన జరుపుతున్నానని చెప్పారు. కనుక గతాన్ని మరిచి నేపాల్తో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి మన దేశం కూడా గట్టిగా ప్రయత్నించాలి. మూడు నెలలనాటి ఎన్నికల తర్వాత అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. నేపాల్ ఆంతరంగిక పరిస్థితులు బాగా మారాయని గుర్తించడంతో పాటు మన నిర్లక్ష్యం పర్యవసానంగా ఇప్పటికే అక్కడ చైనా ప్రభావం పెరిగిందన్న సంగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేపాల్ ఆర్థికాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఈ తరుణంలో మన నుంచి అందే సహకారం చైనాతో పోలిస్తే మెరుగ్గా ఉన్నదన్న అభిప్రాయం కలిగించగలగాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మించి నేపాల్ ఒక సార్వభౌమాధికార దేశమని, దానితో ఆ విధంగానే వ్యవహరించాలని మన దౌత్య వ్యవహర్తలు గుర్తిస్తే మంచిది. -
ఏనుగు..సైకిల్.. హస్తం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 1978లో చీలిపోయిన తర్వాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్(ఐ) కోసం ఏనుగు, సైకిల్, హస్తం గుర్తులు పరిశీలనకు రాగా, ఇందిర ‘హస్తం’ గుర్తుకు ఆమోద ముద్ర వేశారని పొలిటికల్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తెలిపారు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం ‘బ్యాలెట్– టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమొక్రసీ’లో కిద్వాయ్ వివరించారు. కాంగ్రెస్(ఐ) ఏర్పాటుతో ఇందిర ‘ఆవు–దూడ’ గుర్తును వదులుకోవాల్సి వచ్చిందని కిద్వాయ్ ఈ పుస్తకంలో తెలిపారు. ‘అప్పటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బూటా సింగ్ తమకు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని ఈసీకి లేఖ రాశారు. దీంతో ఏనుగు, హస్తం, సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించింది. ఈ సమయంలో ఇందిర ఆంధ్రప్రదేశ్లో పార్టీ నేత పీవీ నరసింహారావుతో సమావేశమై ఉన్నారు. ఎన్నికల గుర్తుపై తుది నిర్ణయం తీసుకోలేని సింగ్.. ఇందిరకు వెంటనే ఫోన్ చేశారు. హస్తం గుర్తును ఎంపిక చేద్దామని సూచించారు. అయితే సాంకేతిక కారణమో లేక సింగ్ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడంతోనో ఫోన్లో ఇందిరకు హాత్(హస్తం) అన్న పదం హాథీ(ఏనుగు)గా విన్పించింది. బూటా సింగ్ ఏనుగు గుర్తునే మళ్లీ మళ్లీ సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహించిన ఇందిర.. చివరికి ఫోన్ను పీవీ నరసింహారావు చేతికిచ్చా రు. బహుభాషా పండితుడైన నరసింహారావు రిసీవర్ అందుకున్న వెంటనే సింగ్ చెబుతున్నదేంటో అర్థం చేసుకున్నారు. హాత్ అనడం ఆపి పంజా అనాలని పీవీ ఆయనకు ఫోన్లో గట్టిగా జవాబిచ్చారు. చివరికి పీవీ అసలు విషయాన్ని ఇందిరకు చెప్పడంతో హస్తం గుర్తుకు ఆమె అంగీకరిం చారు’ అని కిద్వాయ్ వివరించారు. -
కర్ణాటకపై కన్నేసిన రాహుల్
-
చేస్తారా? తీస్తారా?
నవ్వు ఒకటి కాదు. దేహాకృతి ఒకటి కాదు. హావభావాలు ఒకటి కాదు. మరెలా ఆవిడ పాత్రను ఈవిడ పోషించడం? బాలన్.. ఇందిర పాత్రను పోషించగలరా లేదా అన్నది తర్వాతి సంగతి. ముందైతే ఈ సంగతి చెప్పండి. నటనలో ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని అనుకరించడానికి ఈ పోలికలన్నీ నిజంగా అవసరమా? ప్రధానిగా దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు, చిన్న కొడుకు సంజయ్ గాంధీతో తలనొప్పులు వచ్చినప్పుడు, రాజకీయాల్లో కల్లోలం చెలరేగినప్పుడు ఇందిరాగాంధీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో.. అంత స్ట్రాంగ్నెన్ లైఫ్లో ప్రతి మహిళలోనూ ఉంటుంది. విద్యాబాలన్లోనూ ఉండి తీరుతుంది. ఆ శక్తి చాలు కదా ఇందిరగా బాలన్ నటించానికి. సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిర : ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకానికి విద్యాబాలన్ రైట్స్ కొనుక్కున్నారు. దాంతో ఆ పుస్తకాన్ని సినిమాగా తియ్యబోతున్నారా, ఇందిరగా విద్యాబాలన్ సూట్ అవుతారా అనేది ఇప్పుడు టాపిక్ అయింది. రైట్స్ అయితే బాలన్ దగ్గరున్నాయి. విద్యే ఇందిరగా నటించాలనేముందీ? ఇంకెవరి చేతైనా యాక్ట్ చేయించవచ్చు కదా.. నిర్మాతగా మారి! -
మోదీ ఇందిరను అనుకరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పటివరకు పనిచేసిన ప్రధానుల్లో ఇందిరాగాంధీ అత్యం త శక్తివంతమైన నాయకురాలని.. ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాల్లో ఆమెను అనుకరిస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్, ‘ఇందిరా.. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్మినిస్టర్’పుస్తక రచయిత్రి సాగరికా ఘోష్ అన్నారు. సంఘ్ పరివార్ సైతం నెహ్రూ, సోనియా, రాహుల్గాంధీ విధానాలను లక్ష్యంగా చేసుకుంది కానీ.. ఇందిరను ఎప్పుడూ టార్గెట్ చేయలేదన్నారు. ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి సునీతారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సాగరిక మాట్లాడుతూ.. ఇందిరాగాంధీపై 120 జీవిత చరిత్ర పుస్తకాలు అచ్చయ్యాయని.. వాటిలో 80 పుస్తకాలను చదివిన తర్వాత అందులో స్పృశించని పలు కోణాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిపారు. భిన్న వైరుధ్యాలున్న మహిళ ఇందిర అని, ఆమె హయాంలో ప్రజాస్వామ్యం కంటే వ్యక్తిస్వామ్యానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందిర స్ఫూర్తివంతమైన నాయకురాలు, మానవతావాది, గొప్ప పాలకురాలు అని, బ్యాంకుల జాతీయికరణ, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్తో యుద్ధం, అమెరికాతో దౌత్యం వంటి అంశాల్లో ఆమె అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిం చారన్నారు. కోటరీ రాజకీయాలు, అవినీతి, కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, రాజనీతి, వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకంలో ఆవిష్కరించే యత్నం చేసినట్లు తెలిపారు. -
విద్యాబాలన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి
సాక్షి, కొరుక్కుపేట: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుకున్న విద్యాబాలన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని సినీ దర్శక, నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలీవుడ్లో సినిమా, సీరియల్గా నిర్మిస్తున్న స్వర్గీయ ఇందిరాగాంధీ జీవిత కథలో విద్యబాలన్ నటించాలనుకోవడం సహించరాని విషయమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప మహిళానేత పాత్రలో మిమ్మల్ని చూపించడం కష్టమన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. లేకపోతే ఇందిరమ్మ అభిమానుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన అన్నారు. కళాకారులు ఏ పాత్రైనా పోషించవచ్చన్నారు. కానీ గతంలో వారు నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని తెలిపారు. ప్రజాగ్రహానికి గురై కోర్టుల చుట్టూ తిరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు. కనిమొళిపై చర్యలు తీసుకోవాలి.. తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కనిమొళిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొశారు. వివాదం సృష్టించడం వార్తల్లో నిలవడం ఇది కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. 2006లో నిర్భంధ తమిళ భాష బోధన చట్టాన్ని తీసుకువచ్చి మైనార్టీల హక్కులను హరించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కనిమొళి తిరుమల వేంకటేశ్వరస్వామిపై తిరుచ్చిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా ఆమె ఇలా మాట్లాడడం సబబుకాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేతిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో స్టాలిన్, స్టాలిన్ భార్య వెంకన్న భక్తులన్నారు. ఇవే వ్యాఖ్యలు ఇతర మతస్థులపై చేసే దమ్ము మీకు ఉందా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. నాస్తికత్వంపై ప్రసంగంలో వేంకటేశ్వరస్వామిని ఉదాహరణగా చూపడం కోట్లాది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వెంటనే కనిమొళిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇందిరాగాంధీగా విద్యాబాలన్
తమిళ సినిమా: నటి విద్యాబాలన్ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీగా మారనున్నారు. అలనాటి శృంగార తార సిల్క్స్మిత జీవిత చరిత్రతో తెరకెక్కించిన దర్టిపిక్చర్స్ చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్ తాజాగా ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో నటించనున్నారు. మహాత్మాగాంధీ హత్య ఉదంతం అనంతరం అంతకుపైగా కలకలం పుట్టించిన దుర్ఘటన ఇందిరాగాంధీ దారుణ హత్య. 16 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రిగా పరిపాలించిన ఏకైక మహిళా ప్రధానిగా కీర్తిగడించిన ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31 ఢిల్లీలోని తన స్వగృహంలో, తన సెక్యూరిటీ చేతే కాల్చబడి నేలకూలిన సంఘటన దేశాన్ని కదలించింది. కాగా అలాంటి అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రను బుల్లితెర నిర్మాత, రచయిత్రి సహారిక పుస్తకంగా రచించారు. ఈ నవలను నటి విద్యాబాలన్, రాయ్కపూర్ పొడెక్షన్స్తో కలిసి చిత్రంగా రూపొందించడానికి హక్కులను పొందారు. ఈ విషయాన్ని రచయిత సహారికా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. -
భార్యలు 1, 2, 3...8, అందరినీ మోసం..
కోయంబత్తూరు : సరకు రవాణా వ్యాపారం అంతగా లాభసాటిగా సాగడం లేదు. అందుకే ‘పెళ్లి’ని వ్యాపారంగా మార్చి.. తాళిని ఎగతాళి చేయాలని భావించాడో ఘనుడు. అందులో విజయం సాధించడమే కాక భార్యలను మోసంగించి కోట్లకు పడగలెత్తాడు. వరుసపెట్టి ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని వారిని రూ.4.5 కోట్ల మేర ముంచాడు. కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి. పురుషోత్తమన్(57) కోయంబత్తూర్లోని వెల్లలూర్లో నివాసం ఉండేవారు. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఆయనకు కుమార్తె గీతాంజలి(18) ఉంది. కోయంబత్తూర్లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్న పురుషోత్తమన్.. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎనిమిదేళ్లలో మొత్తం ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. చెన్నైకు చెందిన ఇందిరా గాంధీ(45) కూడా పురుషోత్తమన్ చేతిలో మోసపోయారు. లెక్చరర్గా పనిచేస్తున్న ఇందిరా గాంధీకి మాయమాటలు చెప్పి పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండడంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్లో కొనుగోలు చేయాలని చెప్పాడు. పురుషోత్తమన్ మాటలు నిజమేనని నమ్మి రూ.1.5 కోట్లకు అమ్మి డబ్బును అతని చేతిలో పెట్టింది. డబ్బు చేతికి అందిన మరుక్షణం నుంచి మళ్లీ అతడు ఇందిర కంటికి కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పురుషోత్తమన్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఇందిరా నిర్ఘాంతపోయారు. కుముదవల్లి అనే మహిళను కూడా పురుషోత్తమన్ ఇలానే మోసం చేశాడని తెలిసి కుప్పకూలిపోయారు. తనకు రావాల్సిన రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని పురుషోత్తమన్ కుముదవల్లిని కోరాడని పోలీసులు తెలిపారు. అతడిని గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టిందని చెప్పారు. ఆ తర్వాత పురుషోత్తమన్ కనిపించకుండా పోయాడని వివరించారు. పురుషోత్తమన్పై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. -
‘లౌకికత’నే లేకుండా చేస్తే..!
లౌకిక రాజ్యం అనే పేరు వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు భావిస్తున్న కేంద్రం, రాజ్యాం గంలో లౌకికత అనే పేరు లేకుండా చేయాలని భావిస్తోంది. అలా మన దేశం కూడా మతతత్వరాజ్యమైన పాకిస్తాన్ దుస్థితికి వెళ్లాలని పాలకుల ప్రయత్నం. అప్పట్లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు, ‘రాజ్యాంగాన్ని సవరించేం దుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితిలో భారత రాజ్యాంగం అన్న పేరు, దాని పీఠికలో ప్రజాస్వామ్య లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్ అన్న విశేషాలకు పర్యాయపదాలుగా అలానే ఉంచి, లోపల పేజీలలో వీటి వివరణలు అన్నింటినీ సవరించవచ్చు’ అని కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ సమాధానమిచ్చారు. ‘అలా అయితే ప్రాథమిక హక్కులు, పౌరులకు జీవించే హక్కు సంగతేమిటి?’ అని న్యాయమూర్తులు అడిగారు. ‘దాన్ని కూడా పూర్వపక్షం చేస్తూ సవరణ చేయవచ్చు’ అని అదే అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ పాలనలో ప్రధాని మోదీ, అమిత్ షాల ద్వయం పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీలో వలే మన భారతదేశమైన ఈ దేశ ప్రజలం, మాకై మేము నిర్మించుకున్న ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్ అన్న పేరు మాత్రం మిగిలింది. మచ్చుకు స్థూలంగా చూద్దాం! మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రాజ్యాంగం. కానీ ప్రజలను తమ బూటకపు వాగ్దానాలతో వంచించి, అధికారంలోకి వచ్చిన పిదప, ఆ వాగ్దానాలన్నింటినీ తుంగలోతొక్కి తద్విరుద్ధమైన ప్రజావ్యతిరేక విధానాలతో, అధికారంలో కులుకుతున్నా, అదీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమేనట. ఇందుకు గత 3, 4 ఏళ్ల బాబు అబద్ధపు పాలనను మించిన సరైన ఉదాహరణ ఏముంటుంది? మరో ఘోరం ఏమంటే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని పలు రకాల భయభ్రాంతులకు గురిచేసి, ధన, పదవీ ప్రలోభాలతో లోబర్చుకుని ఫిరాయింపచేసి.. వారిని తమ వెన్నుపోటు పార్టీలో చేర్చుకున్నారు. మన రాజ్యాంగంలో మరో మౌలిక అంశం సోషలిజం. నేటికీ మన రాజ్యాంగ స్వరూపం పేరుకు మాత్రమే నిలిచివుంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆ పేరును కూడా తొలగించడమే తరువాయిగా ఉంటోంది. కాంగ్రెస్ పాలకుల ఆచరణ ఎలా ఉండినా, అప్పుడప్పుడు సోషలిజం అనే పదాన్ని కలలో గుర్తుకొచ్చినట్లు అయినా అనేవారు. నేడు మోదీ, షా ద్వయం ఆ పదం ఉచ్చరించడం సరే, వినేందుకు కూడా ఘంటాకర్ణులే. మహాభారతంలో ఘంటాకర్ణుడు అని ఒక పాత్ర ఉంది. ఇతడు కృష్ణుడు అనే పదాన్ని సైతం వినడట. అందుకే చెవులకు గంటలు కట్టుకుని కృష్ణ అన్న పదం వినబడితే చాలు గంటల చప్పుడు చేసుకునేవాడట. మనందరం మోదీ పెద్దనోట్ల రద్దు వ్యవహారం చూశాం. కుబేరుల నల్లధనాన్ని తెల్లగా శుభ్రం చేసి, చలామణిలోకి తెచ్చే ప్రయత్నమే. ఎవరో ఎందుకు, మన బాబుగారి కుటుంబం మర్నాడు పెద్ద నోట్ల రద్దు కానున్నాయన్న ఉప్పందుకుని ఆ రోజే తమ హెరిటేజ్ కంపెనీ షేర్లను అమ్మేసి, తమ నల్లడబ్బును దర్జాగా వేల కోట్లు తెల్లగా మార్చి, తెల్లదొరలల్లే తిరుగుతున్నారు కదా. నరేంద్ర మోదీ తన ఈ ‘విప్లవ సోషలిస్టు’ చర్యవలన కుబేరులు, కోటీశ్వరులు కునుకు పట్టక తల్లడిల్లుతున్నారని ప్రచారం చేసుకున్నారు. తీరా జరిగిందేమిటి? నల్ల డబ్బు కనబడకుండా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు నిర్భయంగా తిరుగుతున్నారు. మోదీ పాలనలో మరో మహా గొప్ప చర్య జీఎస్టీ పన్నుల విధానం. దీని దెబ్బకు సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు వీరందరి నడ్డి విరిగింది. ఉన్న కొన్ని ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండింటినీ రెండుచేతులతో ఆహ్వానించిన మన బాబు ప్రస్తుతం కిమ్మనడం లేదు. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనవంతుల చేతిలో 90 శాతం సంపద పోగైతే, కడు పేదవారిలో 20 శాతం మందికి ఒక శాతం కూడా సంపద లేకుండా తిండి, నిలువనీడ కూడా కరువై కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు. మరి ఆ పెద్దల సేవలో తరిస్తున్న ప్రభువుల పాలనలో సోషలిజమా? మన రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిజం పదం ప్రపంచీకరణకు గురై కుంచించుకుపోతోంది. ఇక లౌకిక రాజ్యం. మోదీ, షాలకు ఈ లౌకిక అన్న పదం వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు ఎలర్జీతో వొళ్లంతా దురద. వీరికి, వీరి గురువులకు కావలసింది అఖండభారత హిందూ రాజ్యం. మన లౌకిక రాజ్యంలో ఎవరి మతం వారు స్వీకరించవచ్చు. ఎవరి విశ్వాసాలను వారు పాటించవచ్చు. కానీ పరమత ద్వేషమే పునాదిగా కలిగిన మతతత్వవాదులకు ఎవరికైనా మన రాజ్యాంగంలోని లౌకికత నచ్చదు. వీరందరికీ మన దేశం కూడా పాకిస్తాన్ ఆదర్శంలో నడవాలనే దుగ్ధ. దేశంలో గోసంరక్షకుల పేరుతో, మానవభక్షక సమూహాలు పేట్రేగి పోతున్నారు. గోసంరక్షణ వంకతో ముస్లిం, క్రైస్తవులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. కాగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రాచీన కాలంలో మన దేశంలో అంతరిక్ష వాహనాలు, పుçష్పకవాహనాలు ఉండేవని, ప్లాస్టిక్ సర్జరీతో తెగిన శిరస్సులను కూడా అతికించేవారని ప్రసంగం దంచిన నేపథ్యంలో మన హేతువాదులకు, ప్రగతిశీలురకు రక్షణ ఎక్కడ? అందుకే గౌరీలంకేశ్ వంటివారు హత్యకు గురవుతున్నారు. రోహిత్ వేముల వంటి దళిత మేధావి తన దళిత పుట్టుకే తన మృత్యువైందంటూ హృదయం బద్దలై ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నింటినీ చూస్తే లౌకికత్వమా ఎక్కడున్నావు, రాజ్యాంగ పీఠికలో మాత్రమే ఉన్నావు అనాలనిపిస్తుంది. వీటన్నింటికీ తీసిపోనిది, మన దేశ ఫెడరల్ స్వభావాన్నే మార్చి, రిపబ్లిక్ బదులు, ఏకశిలా సదృశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పన్నుల విధానం, ఒక జాతి అంటూ ఉన్మత్త జాతీయత పెచ్చరిల్లుతున్నది. ఇక మిగిలింది ‘ఒకే నేత మోదీ’ అన్నదే. లెనిన్ తన రోజుల్లో రష్యన్ పార్లమెంటు డ్యూమాను బాతాఖానీ క్లబ్ అన్నాడు. కులక్కులు, భూస్వాముల సభగా మిగిలిపోయిన డ్యూమాను రద్దు చేసి, దాన్ని నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సభగా మారుస్తామని ప్రకటించారు. మన దేశ పార్లమెంటు కూడా బాతాఖానీ క్లబ్గా తయారైందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆచరణలో సాధించేది ఏమీ లేదని అందుకే సాయుధ పోరాటం, తదితర పోరాట మార్గాలను ఎంచుకోవలసిందేనని కొన్ని విప్లవ కమ్యూనిస్టు గ్రూపులు, ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రచారం చేయడమే కాకుండా పరిమితంగానైనా గత 50 ఏళ్లుగా అదే పంధాను కొనసాగిస్తోంది. వారిని తీవ్రవాదులని, అంతర్గత ప్రజాస్వామ్య విచ్ఛిన్నకులని ఆరోపిస్తున్న నేటి కేంద్ర, రాష్ట్ర పాలకుల వ్యవహార శైలిని చూస్తుంటే ప్రజలు తమ అనుభవం ద్వారా ఆ మావోయిస్టుల ప్రచారానికి ప్రభావితులయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. తస్మాత్ జాగ్రత్త. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 19848 06972 -
‘మా కుటుంబంతా శివ భక్తులమే’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించే చేసిన సంతకంపై చెలరేగుతున్న వివాదంపై రాహుల్ స్పందించారు. హిందువులు రిజిస్టర్లోనే సంతకం చేసినట్లు ఆయన చెప్పారు. అయితే పొరపాటున పార్టీ కార్యకర్తలు.. ఇతరులు రిజిస్టర్లో సంతకం చేసినట్లు ప్రకటించాని ఆయన చెప్పారు. నానమ్మ ఇందిరాగాంధీ నుంచి మా కుటుంబమంతా శివభక్తులమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నానమ్మ శివుడిని ఆరాధించేదని రాహుల్ గుర్తు చేసుకున్నారు. నానమ్మ ప్రేరణతో తామంతా పరమేశ్వరుడికి భక్తులుగా మారిపోయాని.. మొత్తం కుటుంబమంతా శివారధాన చేస్తుందని ఆయన చెప్పారు. మతాన్ని, భగవంతుడిని రాజకీయ లబ్దికోసం ఉపయోగించునే సంస్కృతి తనకు లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మతం అనేది వ్యక్తుల ఆంతరగింక, వ్యక్తిగత విషయని ఆయన స్పష్టం చేశారు. మతం పేరనుతో వ్యాపారాలు, రాజకీయాలు చేయడం తగదని ఆయన చెప్పారు. ’నేను సోమనాథ్ ఆలయంలో హిందూ సందర్శకులు రిజిస్టర్లోనే సంతకం చేశానని.. కొన్ని మీడియా వర్గాలు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేశాయని’ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH Congress VP Rahul Gandhi says, my grand mother was a Shiv-bhakt & so is my family. We don't talk about these things as they are personal. (Source: Amateur video) pic.twitter.com/fV8H8udRf8 — ANI (@ANI) 30 November 2017 -
వందేళ్లు మాకే అధికారం
మోర్బీ: గుజరాత్లో శాసనసభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తొలిదశలో పోలింగ్ జరగనున్న సౌరాష్ట్ర ప్రాంతంలోని పటీదార్లకు పట్టున్న మోర్బీ పట్టణంలో మోదీ బుధవారం ఓ ర్యాలీలో ప్రసంగించారు. 22 ఏళ్లుగా గుజరాత్లో అధికారంలోనే ఉన్న తమ పార్టీ... నర్మదా నది నుంచి కరువు ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్లకు పైపులైన్లు నిర్మించి, అక్కడి ఆనకట్టలు నింపి నీరు అందించి ఎంతో మంచి చేసిందన్నారు. ‘ఇక్కడి వారి కోసం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించిన వారిని గౌరవించడం ఈ నేల సంప్రదాయం. మేం ఎంతో చేశాం. మరో 100 ఏళ్లపాటు ప్రజలు బీజేపీకే ఓటేసి అధికారమివ్వాలి’ అని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను రాహుల్గాంధీ షోలే సినిమాలోని బందిపోటు దొంగ పాత్రతో పోలుస్తూ అది ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ అని విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, రాహుల్పై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎవరైతే జీవితమంతా ప్రజలను దోచుకోవడంలోనే నిమగ్నమై ఉంటారో వారికి బందిపోటు దొంగలు మాత్రమే గుర్తుంటారు’ అంటూ విరుచుకుపడ్డారు. కొత్త ఆర్థిక వేత్త పుట్టుకొచ్చాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే జీఎస్టీ శ్లాబ్ పెట్టి పన్ను రేటును 18 శాతంగా నిర్ణయిస్తామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యంగా స్పందించారు. ‘జీఎస్టీపై ఆయన ‘అత్యంత చెత్త ఆలోచన’ (గ్రాండ్ స్టుపిడ్ థాట్–జీఎస్టీ)ను వ్యాప్తి చేస్తున్నారు. అందరూ వాడే నిత్యావసరమైన ఉప్పు నుంచి కోటీశ్వరులు మాత్రమే కొనే రూ.5 కోట్ల విలువైన కార్ల వరకు అన్నింటికీ 18% పన్నునే వేస్తారట. ఆయనకు ఎంతటి తెలివి? అంటే ఆహారం, బట్టలు, చెప్పుల వంటి అందరికీ అవసరమైన వస్తువుల రేట్లను పెంచి... మద్యం, సిగరెట్ల ధరలను తగ్గించాలని అనుకుం టున్నారా. అలాగైతే ప్రతి ఇంట్లో ఓ కేన్సర్ రోగిని తయారు చేసినట్లే. మద్యం ధరలు తగ్గించడం ద్వారా ఆయన ఏ వ్యాపారికి లబ్ధి చేకూర్చాలని అనుకుంటున్నారు?’ అంటూ చురకలంటించారు. సర్దార్ పటేల్ వల్లే ఆలయ పునర్నిర్మాణం గిర్ సోమ్నాథ్ జిల్లాలోని సోమ్నాథ్ ఆలయాన్ని రాహుల్ బుధవారం సందర్శించగా, ఆ ఆలయ పునర్నిర్మాణాన్ని అప్పట్లో తొలి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని మోదీ ఆరోపించారు. మహ్మద్ గజినీ సుల్తాన్ ఆలయాన్ని ధ్వంసం చేయగా దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవ వల్లే పునర్నిర్మాణం పూర్తయిందన్నారు. మరోవైపు సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో తాను హిందువును కాదంటూ రాహుల్ రిజిస్టర్లో పేర్కొన్నారంటూ కొత్త వివాదం పుట్టుకొచ్చింది. రాహుల్ హిందువే ననీ, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే బ్రాహ్మణుడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ మండిపడింది. నేను శివ భక్తుణ్ని: రాహుల్ జునాగఢ్ జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాట్లాడుతూ తాను శివభక్తుడినని స్పష్టం చేశారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోదీ మౌనం వహిస్తుండటాన్ని ప్రశ్నించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాను మోదీకి మూడు ప్రశ్నలు వేశాననీ, ఆయన ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇందిర ఇలా ముక్కు మూసుకున్నారు మోర్బీలో 1979లో సంభవించిన మచ్చు ఆనకట్ట వరద విషాదాన్ని మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. అప్పుడు తాను ఇక్కడ ఆరెస్సెస్, జన్సంఘ్ల కార్యకర్తగా సహాయ కార్యక్రమాలు చేపట్టాననీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారని మోదీ చెప్పారు. ‘ఇందిరా గాంధీ ఇక్కడకు రావడం నాకు గుర్తుంది. మరుసటి రోజు ఓ స్థానిక పత్రిక ఇందిర పర్యటనకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రచురించింది. అందులో ఇందిర దుర్వాసన దరిచేరకుండా కర్చీఫ్తో ముక్కు మూసుకున్నారు. ఆ ఫొటో కిందే మరో ఫొటో ఉంది. అందులో ఆరెస్సెస్ కార్యకర్తలు మృతదేహాలను తరలిస్తున్నారు’ అని మోదీ వివరించారు. కష్టకాలంలో సహాయం చేసిన వారిని మీరు గుర్తుంచుకోవాలి అంటూ తమ పార్టీకే ఓట్లేయమని ప్రజలను మోదీ పరోక్షంగా కోరారు. -
'ఇందిరా ముక్కు మూసుకోవడం నాకింకా గుర్తే'
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నక కొద్దీ అధికార బీజేపీ, పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న పాటిదార్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మోర్బీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మోర్బీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. 'నాకు ఇప్పటికీ గుర్తుంది. గతంలో ఈ మోర్బీ పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చెడు వాసన వస్తుందంటూ ముక్కు మూసుకున్నారు. ఓ గుడ్డతో ముక్కు మూసుకుని అసౌకర్యంగా ఇందిరా కనిపించే ఫొటో చిత్రలేఖ మ్యాగజైన్లో వచ్చింది. ఆ ఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. కానీ జన్సంఘ్, ఆరెస్సెస్లకు మాత్రం ఈ మోర్బీ వీధులు సుగంధాన్ని వెదజల్లుతాయి. మానవత్వపు పరిమాళాలను మా నేతలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని' వ్యాఖ్యానించారు. 'కష్టకాలంలోనూ మోర్బీని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. కానీ కాంగ్రెస్ హయాంలో అలాంటి పరిస్థితులు లేవు. గుజరాత్ ఫేమస్ మోడల్స్లో మోర్బీ ఒకటి. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 13 ఏళ్ల సమయంలో మోర్బీ అభివృద్ధికి పాటుపడ్డాను. నేనే సీఎం అవకముందు కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో విద్యుత్, నీటికి కటకట ఉండేది. కానీ పలు ప్రాజెక్టులు చేపట్టి మీకు నీటిని అందించిన ఘనత బీజేపీదే. నర్మద నదీ జలాలను గుజరాత్కు అందించినా కాంగ్రెస్ మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటోంది. చేతిపంపులు లాంటి మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి అని కాంగ్రెస్ భావిస్తుందంటూ' మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సౌరాష్ట్రలో మూడు ర్యాలీలు, సూరత్లో ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ డిసెంబర్ 9న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. -
లౌకికత్వం కోసం పోరాడారు
న్యూఢిల్లీ: ప్రజలను, దేశాన్ని కులమతాల పేరుతో విభజించాలనుకున్న వారికి వ్యతిరేకంగా, లౌకికవాదం కోసం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇందిర శత జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, జీవన విధానంపై ఆదివారం ‘ఎ లైఫ్ ఆఫ్ కరేజ్’ పేరుతో ఢిల్లీలో చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సోనియా మాట్లాడుతూ ‘ఇందిరను కొందరు ఉక్కు మహిళగా అభివర్ణించడాన్ని నేను విన్నాను. ‘ఉక్కు’ అనేది ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మానవత్వం, ఉదారత అనేవి ఆమెకున్న అనేక సద్గుణాలలో కొన్ని’ అని పేర్కొన్నారు. . ప్రముఖుల నివాళి... ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం ప్రముఖులు నివాళులర్పించారు. ‘జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని జాతి స్మరిస్తోంది’ అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఓ ట్వీట్తో ఇందిరకు నివాళి అర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనూ లోక్సభ స్పీకర్ మహాజన్, బీజేపీ నేత ఆడ్వాణీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్æ తదితరులు నివాళులర్పించారు. ఇందిర సమాధి ‘శక్తి స్థల్’ వద్ద ప్రణబ్, మన్మోహన్, రాహుల్గాంధీ పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. ఇందిర దేశానికి అమ్మ అని బీజేపీ ఎంపీ, ఇందిర మనవడు వరుణ్ గాంధీ శ్లాఘించారు. మన్మోహన్కు శాంతి బహుమతి... ఈ ఏడాదికి ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి’ బహుమతిని మాజీ ప్రధా ని మన్మోహన్ అందుకోనున్నారు. 2004 –14 మధ్య దేశాభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆయనను ఈ బహుమతికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
ఇందిర త్యాగం నిరుపమానం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రిగా దేశంకోసం ఇందిరాగాంధీ చేసిన త్యాగం నిరుపమానమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీభవన్లో పార్టీ జెండాను ఆదివారం ఎగురవేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్ నుంచి గాంధీభవన్ వరకు బైక్ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో, బలహీనవర్గాల సంక్షేమంలోనూ, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపుతెచ్చిన ఘనత ఇందిరమ్మది అని కొనియాడారు. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తొలి గురువు నానమ్మే’
సాక్షి, న్యూఢిల్లీ : నానమ్మే నా తొలి గురువు, నా మార్గదర్శి‘ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ జయంతి సందర్భంగా రాహుల్గాంధీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘దాదీ.. నీతో గడిపిన ఆనందక్షణాలు నాకింకా గుర్తున్నాయి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆదివారం ఇందిరా గాంధీ వందవ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు శక్తిస్థల్లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరాగాంధీతో సన్నిహింతగా ఉన్న ఒక ఫొటోనే ట్విటర్లో పోస్ట్ చేశారు. I remember you Dadi with so much love and happiness. You are my mentor and guide. You give me strength. #Indira100 — Office of RG (@OfficeOfRG) 19 November 2017 Remembering Smt. #IndiraGandhi on her Birth Centenary. Her steely determination, clarity of thought & decisive actions made her a towering personality. Undoubtedly and rightfully India's #IronLady. pic.twitter.com/oY5TLVz5tW — Pranab Mukherjee (@CitiznMukherjee) 19 November 2017 -
అసాధారణ వ్యక్తిత్వం ఆమె సొంతం
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి నేడు. నిరుడు ఇదే రోజున ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలకు ఇవాళ తెరపడుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేవి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ నెహ్రూ, ఇందిరలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. కాంగ్రెస్ హయాంలో అంతగా ప్రశస్తి దక్కనివారికి ఇప్పుడు కాస్త అధికంగానే ప్రశంస ఉంటుంది. ఏ దేశంలోనైనా అధికారంలో ఉన్న పార్టీకి ఎవరి పట్ల గౌరవం ఉంటే వారికి బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఆధిపత్యంలోనే మనుగడ సాగిస్తున్న కారణంగా, దాదాపు యాభై సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా నెహ్రూ వంశజుల ప్రభ చాలాకాలం వెలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రను సవరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వాల ప్రా«థమ్యాలు మారినా, పాలకులు ఎవరి స్తోత్రం వల్లించినా ప్రజల హృదయాలలో కొందరు నేతలు శాశ్వతంగా ఉండిపోతారు. అటువంటి నాయకులలో ఇందిర ఒకరు. సిండికేట్పై విజయం నలభై నాలుగు సంవత్సరాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న విద్యార్థులం ప్రొఫెసర్ బషీరుద్దీన్ నాయకత్వంలో ఢిల్లీ, ముంబయ్, పుణెలో పర్యటించాం. ఢిల్లీలో నాటి ప్రధాని ఇందిర నివాసానికి వెళ్ళి, ఆమెకు అభిముఖంగా పచ్చికపైన కూర్చొని, పత్రికారంగంపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, భవిష్య పాత్రికేయులమైన మాకు చేసిన ఉద్బోధ ఆలకించిన క్షణాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అప్పటికే ఆమె పాకిస్తాన్పై విజయఢంకా మోగించి, తూర్పు పాకిస్తాన్ను జయించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసి, విజయేందిరగా దేశ ప్రజల హారతులందుకున్నారు. 1966లో లాల్బహద్దూర్ శాస్త్రి హఠాన్మరణం అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన ఇందిరాగాంధీ సిండికేటు పెద్దల (నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, కామరాజ్ నాడార్, ఎస్కే పాటిల్ తదితరులు) ఆధిపత్యాన్ని ఛేదించారు. ఆ సందర్భంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వరాహగిరి వెంకటగిరి (వివి గిరి)ని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దించి ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయాలంటూ కాంగ్రెస్ చట్టసభల సభ్యులకు చెప్పారు. గిరిని గెలిపించారు. ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీని చీల్చడం, సిండికేటు సభ్యులను పూర్వపక్షం చేయడం అప్పటికే చరిత్ర. మేము చూసింది ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న ఇంది రని. ఒక మహిళ పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గుకు రావడం అంత తేలికకాదు. నెహ్రూ కుమార్తె అయినప్పటికీ కాకలు తీరిన నేతల వ్యూహాలను ఎదుర్కోవడం కష్టం. ప్రధాని పదవిలో ఉండటం ఆమెకు కలసివచ్చిన అంశం. 1967 ఎన్నికల సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వందల బహిరంగ సభలలో మాట్లాడారు. ఆ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆమె రాజకీయ ప్రస్థానానికి అవసరమైన మెలకువలు అప్పుడే లభిం చాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే ఆమె సమాజంలోని వ్యత్యాసాలను గమనిం చారు. భూమి ఉన్నవారికీ, భూమి లేని పేదలకూ మధ్య అగాధాన్ని అర్థం చేసుకున్నారు. దళితుల, ఆదివాసుల బతుకులలో చీకటి తొలగలేదని గుర్తించారు. ఆమె ప్రత్యర్థులందరూ సంపన్నవర్గాలకు అనుకూలమైన భావజాలాన్ని విశ్వసించేవారనే ముద్ర వేయగలిగారు. స్వయంగా వామపక్ష భావజాలాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలను రద్దు చేశారు. పత్రికలతో, ప్రాంతీయ నాయకులతో నిమిత్తం లేకుండా నేరుగా పేద, మధ్యతరగతి ప్రజలను సంబోధించడం, వారితో సంభాషించడం అలవరచుకున్నారు. పేద ప్రజలతో బంధం ఏర్పాటు చేసుకున్నారు. వారి హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తిరుగులేని జాతీయ నేతగా ఎదిగారు. సంక్షేమ విధానం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు రూపొందించడం తమిళనాడులో డిఎంకె 1967లోనే ప్రారంభించింది కానీ కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్న సందర్భం లేదు. ‘గరీబీ హఠావో’ నినాదంలో రాజకీయ పార్శ్వం ఉన్నప్పటికీ అది అవకాశవాదం మాత్రం కాదు. పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పం గుండె నిండా ఉన్నది. తమలో ఆత్మవిశ్వాసం ప్రతిష్ఠించిన అధినేతగా ఆమెను దళితులూ, ఆదివాసులూ ఎప్పటికీ మరచిపోరు. సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది ఆమె ప్రభుత్వమే. అంతకు పూర్వం ప్రభుత్వ విధానాలలో, కార్యక్రమాలలో సంక్షేమానికి ప్రాధాన్యం ఉండేది కాదు. నవభారత నిర్మాణంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా వివిధ రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నమే జరిగింది కానీ, సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరాన్ని అంతగా పట్టించుకోలేదు. షెడ్యూల్డ్ తరగతుల అభివృద్ధి కార్పొరేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అధారిటీ (ఐటీడీఎల్) ఇందిరాగాంధీ ప్రమేయంతో వెలసినవే. భూసంస్కరణలు, పేదలకు భూమి ఇవ్వడం, పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదలు పెట్టినవే. ఐఐటి వంటి జాతీయ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసింది ఆమె ప్రభుత్వమే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించింది, అణు, అంతరిక్ష పరిశోధనలో అసాధారణ ప్రగతి సాధించింది ఆమె హయాం లోనే. పర్యావరణ చట్టాలు తెచ్చింది కూడా ఆమే. శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఇందిరాగాంధీ–ఎ లైఫ్ ఇన్ నేచర్’ పేరుతో పుస్తకం రాశారు. విజయేందిర తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది శరణార్థులు వచ్చి పడటం వల్ల తలెత్తిన సమస్యను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఇందిర విస్తృతంగా పర్యటిం చారు. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సేవలు కూడా ఇందుకోసం వినియోగించుకున్నారు. యుద్ధ సన్నాహాల కోసం భారత సైన్యానికి అవసరమైన సమయం ఇచ్చేందుకు దౌత్యనీతిని ఆశ్రయించారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇందిరను ‘ది విచ్’(మంత్రగత్తె) అంటూ నిందించాడు. దౌత్యం వల్ల వచ్చింది ఏమీ లేదు సైన్యం అడిగిన సమయం లభించడం తప్ప. నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ యాహ్యాఖాన్ తూర్పు పాకిస్తాన్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకొని యుద్ధం ప్రకటించే సమయానికి భారత సైన్యం సరి హద్దు దాటి ఢాకా వైపు వంద కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయింది. వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్తో ఇరవై సంవత్సరాల మైత్రీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల నిక్సన్ పంపిన యుద్ధ నౌక అడుగు ముందుకు వేయలేకపోయింది. పదిహేను రోజుల్లో యుద్ధం ముగిసింది. జనరల్ నియాజీ నాయకత్వంలోని పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఇందిరాగాంధీ జీవితంలో అత్యున్నత విజయం. ఇంతటి ఘనకార్యం సాధించిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలకే ఆమె పతనం ఆరంభమైంది. అవినీతిని ఉపేక్షించారు. పార్టీ సహచరులలో ఎవరినైనా పదవి నుంచి తొలగించాలంటే వారిపైన ఉన్న అవినీతి ఆరోపణలను ఉపయోగించుకునేవారు. తెలంగాణ ఉద్యమం అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించేందుకు అదే అస్త్రం ప్రయోగించారు. ఆర్ కె ధవన్ చూపించిన ఫైలు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా లేఖ రాయించింది. ఇదే విధంగా ఈ అస్త్రాన్ని అనేకమందిపైన ఉపయోగించారు. జేపీ నేతృత్వంలో అవి నీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఇందిరలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ప్రతిపక్ష నాయకులంతా ఉద్యమాన్ని సమర్థించడంతో ఆమెలో అభద్రతాభావం పెరిగింది. ఎవరో తనని తరుముతున్నట్టూ, తనను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నట్టూ భయపడేవారని ఇందిరకు సన్నిహితురాలు పపుల్ జయకర్ తన పుస్తకంలో రాశారు. జేపీ ఉద్యమం ఉధృతమైంది. ప్రజలకు వ్యతిరేకమైనవిగా కనిపించిన ఆదేశాలు పాటించనవసరం లేదంటూ పోలీసులకూ, సైనికులకూ ఉద్బోధించారు. రైళ్ళు ఉద్యమకారులను చేరవేస్తూ పూటల తరబడి ఆలస్యంగా నడిచేవి. విద్యాసంస్థలు మూతపడినాయి. ప్రభుత్వం లేనట్టే లెక్క. ఇటువంటి పరిస్థితిలో అలహాబాద్ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఇందిర తరఫున నానీ పాల్కీవాలా వాదించారు. ఈ తీర్పుపైన సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. అక్కడ షరతులతో కూడిన స్టే వచ్చింది. అప్పటికే గాభరాపడిపోయిన ఇందిర తనయుడు సంజయ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్థశంకర్ రే చెప్పిన సలహా పాటించి 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది ఆమెకు తీరని మచ్చ తెచ్చిన నిర్ణయం. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో కుక్కారు. ప్రజాస్వామ్య సంస్థలనూ, సంప్రదాయాలనూ ధ్వంసం చేశారు. ఆత్యయిక పరిస్థితి విధించారు కనుక ఈ కేసులో వాదించజాలనని పాల్కీవాలా చెప్పారు. ఆయనపైన కక్షసాధింపు చర్యలు తీసుకున్నారు. టాటా కంపెనీల బోర్టుల నుంచి ఆయనను తొలగించే విధంగా ఒత్తిడి తెచ్చారు. విమర్శను తట్టుకోలేకపోవడం, ప్రత్యర్థులను అణచివేయడం. నిరంకుశంగా వ్యవహరించడం ఇందిరాగాంధీలో కొట్టొచ్చినట్టు కనిపించిన అవలక్షణాలు. తన నీడను సైతం శంకించే పరిస్థితి. ఎవ్వరినీ నమ్మలేని దౌర్బల్యం ఆమెను ఆవహించింది. సంజయ్పైన ఇందిర ఆధారపడటం ఎక్కువయింది. ఉత్తరాదిలో పోలీసుల జులుం పెరిగింది. ప్రెస్ సెన్సార్షిప్ విధించారు. దాదాపు అన్ని పత్రికలూ ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి ‘జో హుకుం’ అంటే, ప్రభుత్వాన్ని విమర్శించింది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు పత్రికలు మాత్రమే. ఆ రోజుల్లో బెంగుళూరులో ‘ఆంధ్రప్రభ’లో పని చేస్తూ ఆత్యయిక పరిస్థితిని వ్యతిరేకించడం, అరుణ్శౌరీ బృందంతో కలసి తిరగడం, తరచు రిపోర్టింగ్కి వెళ్ళడం గర్వంగా ఉండేది. 1977లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇందిరగాంధీ ఖమ్మం సందర్శించినప్పుడు నేను సెలవుపైన అక్కడే ఉన్నాను. టాపు లేని జీపులో చేతులు జోడించి ప్రయాణం చేస్తున్న ప్రధాని మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాలలో 41 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకున్నది కానీ, ఉత్తరాదిలో పార్టీ చావుదెబ్బ తిన్నది. ఇందిర సైతం ఓడిపోయారు. జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మొరార్జీ, హోంమంత్రి చరణ్సింగ్ చాకచక్యం లేకుండా మొండిగా వ్యవహరించడం ఆమెకు బాగా అనుకూలించింది. అంతఃకలహాల కారణంగా జనతా ప్రయోగం చతికిలపడింది. 1980 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందిరాగాంధీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగిన ఆరు మాసాలకే సంజయ్గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. మళ్ళీ కోలుకోలేదు. ఇదివరకటి చురుకుదనం, వ్యూహరచనా నైపుణ్యం, యుద్ధకౌశలం అదృశ్యమైనాయి. దేశంకోసం ప్రాణత్యాగం సైనిక బలగాలు స్వర్ణదేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి భింద్రన్వాలే, ఆయన అనుచరులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టగానే వారు లొంగిపోతారనీ, కాల్పులు జరగవనీ, మరణాలు ఉండవనీ జనరల్ వైద్య, లెఫ్టినెంట్ జనరల్ సుందర్జీ హామీ ఇచ్చిన తర్వాతనే సైనిక చర్యను ఇందిరాగాంధీ అనుమతించారు. రెండు గంటలలో పూర్తి కావలసిన పని రెండు రోజలు పట్టింది. తర్వాత స్వర్ణదేవాలయం సందర్శించి సమీపంలోని సరోవర్లో తేలుతున్న మృతదేహాలు చూసి ఇందిర దిగ్భ్రాంతి చెందారు. ఇందుకు ఆమే మూల్యం చెల్లించారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దేశ సమైక్యత, సమగ్రతలకోసం అత్యున్నతమైన ప్రాణత్యాగం చేశారు. నెహ్రూ నుంచి నరేంద్రమోదీ వరకూ ప్రధానులందరి పదవీకాలాలనూ, జీవితాలనూ పరిశీలిస్తే ఇందిర వ్యక్తిత్వం అర్థం అవుతుంది. ఆమె ఎదుర్కొన్న సవాళ్ళను మరెవ్వరూ ఎదుర్కోలేదు. ఆమె సాధించిన విజయాలను ఇంకెవ్వరూ సాధించలేదు. 16 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తప్పొప్పులు ఉండటం సహజం. కానీ ఆమె దేశభక్తినీ, చిత్తశుద్ధినీ శంకించడం అపచారం. - కె. రామచంద్రమూర్తి -
మూగబొమ్మే మహారాణి!
నేడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి. ఆమె మరణించిన 30 ఏళ్ల తర్వాత కూడా మన రాజకీయ దిఙ్మండలంలో ఒక మహామూర్తిలాగా నిలిచి ఉంటున్నారు. ఇందిర ఒక రాజకీయవేత్త అనే అంశంతో మొదలుపెడదాం. ఆమెను మనం నేటికీ అత్యంత గౌరవభావంతో చూస్తున్నట్లుగా ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. కానీ ఆమె గొప్ప ప్రధానమంత్రా లేక దీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న వ్యక్తా? ఇందిర ప్రధానమంత్రిత్వానికి సంబంధించినంతవరకు 1970–71 నాటి బంగ్లాదేశ్ సంక్షోభం, తూర్పుపాకిస్తాన్ లొంగుబాటు అత్యంత కీలకమైనవని చాలామంది అంగీకరిస్తున్నారు. భారత సైన్యాన్ని సన్నద్ధపరిచేందుకు అవసరమైన సమయాన్ని ఫీల్డ్ మార్షల్ మానెక్షాకు ఇచ్చే విజ్ఞత ఆమెకుండింది. భారత వైఖరికి మద్దతును కూడగట్టడంలో అలుపెరుగని అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించే నైపుణ్యం కూడా ఆమెకుండేది. ఇందిర విజయాలపై భిన్నాభిప్రాయాలూ తలెత్తుతున్నాయి. మొదటిది, తూర్పు పాకిస్తాన్ పతనం తర్వాత యుద్ధాన్ని నిలిపివేయడంలో ఆమె తప్పుగా వ్యవహరించారా? పశ్చిమరంగంలో పాకిస్తాన్తో పోరాడటానికి, కశ్మీర్ వ్యవహారాన్ని తేల్చివేయగలిగిన ఒక అవకాశాన్ని ఆమె చేజార్చుకున్నారా? లేదా అలా చేసి ఉంటే భారత్ తట్టుకోలేని అంతర్జాతీయ ఉత్పతనాలను ఎదుర్కొనేదా? సిమ్లా సదస్సులో నాటి ప్రధాని జుల్ఫికర్ భుట్టో కశ్మీర్పై ఆడినమాటను విశ్వసించడంలో ఇందిరది తప్పు అంచనాయేనా? లేక ఆమెముందు అప్పుడు మరో ప్రత్యామ్నాయం లేదా? బంగ్లాదేశ్ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత 1975లో విధిం చిన అత్యవసర పరిస్థితి ఆమె అధోగతికి చిహ్నం. ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ నిస్సందేహంగా ఇందిర బలహీనతే. కానీ అతడు తలపెట్టిన సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, మురికివా డల నిర్మూలన కార్యక్రమాల గురించి ఆమెకు నిజంగానే తెలీదా? అయితే 1977లో ఓటమి తప్పదని తెలిసి కూడా సార్వత్రిక ఎన్నికలకు ఆమె పూనుకున్నారా? మరోమాటలో చెప్పాలంటే అది ఆమె పశ్చాత్తాపం ప్రకటించే ప్రయత్నమా? లేదా నిఘా వ్యవస్థలు ఆమెను తప్పుదోవ పట్టించాయా? ప్రధానిగా రెండో దఫా పదవీ కాలంలో సిక్కుల్లో అశాంతితో ఆమె వ్యవహరించిన తీరు ఆపరేషన్ బ్లూ స్టార్గా పరిణమించింది. అయితే అది ఆమెముందున్న ఏకైక అవకాశమేనా లేక స్వర్ణదేవాలయానికి విద్యుత్తు, నీరు, ఆహా రాన్ని అందకుండా చేయడం ద్వారా మిలిటెంట్లను బయటకు నెట్టేలా ఆమె ఒత్తిడి చేసి ఉంటే బాగుండేదా? నిజమే.. అకాలీలను అణిచివేయడానికి, తర్వాత అతడిని ఒక క్రూర రాక్షసుడిగా మార్చడానికి బింద్రన్వాలేను కాంగ్రెస్ పార్టీనే పెంచిపోషించి ఉండవచ్చు. స్వర్ణదేవాలయ పరిస్థితితో తప్పుగా వ్యవహరించినందుకు పలువురు జీవిత చరిత్రకారులు ఇందిరాగాంధీని నిందిస్తున్నారు కానీ ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత కూడా సిక్కు గార్డులను తన అంగరక్షకులుగా కొనసాగించిన ఘనతకు ఆమె ప్రశంసార్హురాలు కాదా? ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆ గార్డుల్లో ఇద్దరు ఆమెను చంపడానికి వీలుకల్పించిందా? ప్రధానమంత్రికి రాజకీయాలు విలక్షణ అంశం కావచ్చు కానీ ఆర్థిక వ్యవస్థతో ఆమె వ్యవహరించిన తీరు సందేహాస్పదమైంది. ఒకవైపు ఆమె హరిత విప్లవానికి నేతృత్వం వహించారు, మరోవైపున లైసెన్స్ రాజ్ను సృష్టించారు. రాజకీయ కారణాలతోటే ఆమె బ్యాంకుల జాతీయీకరణను దుస్సాహసికంగా అమలు చేశారు. 1970లు, 80లలో భారత్ పేలవమైన ఆర్థిక పనితీరుకు ఆమెనే తప్పుబట్టాల్సి ఉందా? కాంగ్రెస్ పార్టీపై ఆమె ప్రభావాన్ని మీరు తోసిపుచ్చలేరు. నెహ్రూ కంటే ఎక్కువగా వంశపాలనా సంప్రదాయాన్ని ఇందిరే ప్రారంభించారు. పార్టీపై ఆమె నియంత్రణ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, భారత్లో అతి పురాతన పార్టీని గాంధీ కుటుంబ ఉపాంగంగా కుదించి వేసిందా? ఇందిరాగాంధీ కెరీర్ పూర్తిగా నాటకీయ ఉత్తానపతనాలతో కూడి ఉంది. 1966 నాటి ఒక మూగబొమ్మ (గూంగీ గుడియా) 1971 నాటికి భారత మహారాణిగా పరివర్తన చెందింది. 1977లో అధికారాన్ని కోల్పోయినా మళ్లీ 1980లో గోడకుకొట్టిన బంతిలా అధికారానికి చేరువయ్యారు. 1984లో హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించడంలో ఆమె నైపుణ్యాన్ని అతికొద్దిమంది మాత్రమే సందేహిస్తారు. ఇందిరను ఒక శక్తివంతమైన మగధీరుడిలాగా మనం భావిం చవచ్చు, నిజానికి మనోజ్ఞమైన హాస్య చతురత, సాటిలేని అభిరుచి, శైలికి ఆమె మారుపేరు. కొన్ని సమయాల్లో ఆమెది తొందరపాటు మూర్తిమత్వం కూడా. అయితే విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ధైర్యసాహసాలతో వ్యవహరించేది. అంతిమంగా, అలాంటి మహిళ అస్వస్థతతోనో, వృద్ధాప్యం తోనో చనిపోవాలనుకున్నారా? పదవీ విరమణ కాలానికి ఆమె హత్యనే ఎంచుకుని ఉండవచ్చని లేక ఓటమిలో భ్రష్టత్వాన్ని ఎంచుకుని ఉండవచ్చని సూచించడం కాల్పనికతే అవుతుందా? - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net