Intermediate
-
ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ను, సీబీ ఎస్ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తు త (2024–25) విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోకి మారింది. వచ్చే నెలలో (మార్చిలో) పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 వి ద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ విధానాలు అమలుచేస్తారు. ఇంటర్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం, 2026–27లో రెండో సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో మార్పులుఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పనిదినాలు ఉండేవి. అయితే, సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ ఒకటిన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తిచేసి వేసవి సెలవులు ఇస్తారు. పని దినాలు సైతం నెల రోజులు పెరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే మొదటి సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు (రెగ్యులర్/ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైనవారిని తొలగిస్తారు.ప్రభుత్వ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్ శిక్షణ రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాస్తున్నందున ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకురెండు గంటలు జేఈఈ, ఎంసెట్ శిక్షణ ఇస్తారు. -
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
హలో సార్... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలనా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్కు విజిట్ చేసి చూడండి.సార్ గుడ్ ఈవెనింగ్, కార్తీక్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్ (BTECH) కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం... ...టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద రిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్ కాకముందే కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి..తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు. మరోవైపు పీఆర్ఓలు... వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్కు సంబంధించి ‘సూపర్, స్టార్, సీఓ’ బ్రాంచ్ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదీ చదవండి: బడి బయటే బాల్యం -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సబ్జెక్ట్తో పనిలేకుండా డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులో అయినా చేరొచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది. డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు. ‘‘ లెవల్ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు. డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్ నుంచి 50 శాతం క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్ చెప్పారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి–2025లో పరీక్షలు రాయనున్న మొదటి రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఈ గడువు తర్వాత అవకాశం ఉండదని అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్కు సూచించామని తెలిపారు. 15 వరకు ప్రైవేటు విద్యార్థుల ఎన్రోల్ ఇంటర్ పరీక్షలు ప్రైవేటుగా రాయదలచిన విద్యార్థులకు అటెండెన్స్ మినహాయింపునిచ్చారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ వరకు రూ.1500, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పదో తరగతి పాసై ఏడాది పూర్తయిన వారు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండేళ్లు దాటిన వారు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చు. -
ఇంటర్ సిలబస్ మార్పు
ఇంటర్మీడియెట్లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.వాస్తవానికి ఇంటర్ సిలబస్పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్సార్ సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. – సాక్షి, అమరావతి పుష్కర కాలంగా పాత సిలబస్సేరాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్ను మార్చనున్నారు.పరీక్షల సరళిలో మరిన్ని మార్పులుఇంటర్ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్ట్ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.సైన్స్లో జాతీయ స్థాయి ఆర్ట్స్లో స్టేట్ సిలబస్ప్రస్తుతం ఇంటర్లో బోధిస్తున్న సిలబస్ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్ను జాతీయ సిలబస్కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్ సిలబస్కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్సీఈలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోను వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీల్లో ఇంటర్మీడియట్ సబ్జెక్టు లెక్చరర్లు నలుగురు నుంచి ఎనిమిది మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్టు లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. -
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ (జనరల్) ఫలితాల కోసం క్లిక్ చేయండిఇంటర్ ఫస్ల్ ఇయర్ సప్లమెంటరీ(వొకేషనల్) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
AP: ఒక్క క్లిక్తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్లెట్లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ’సాక్షి’ప్రతినిధికి తెలిపారు. ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. -
ఇంటర్ ఫలితాలు.. అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు. ఒకేషనల్లోనూ బాలికలదే పైచేయి.. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామన్నారు. మార్కుల లిస్టులు డిజిలాకర్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్ గౌర్ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్మెంటల్’ అని సరి్టఫికెట్పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్తో సమానంగానే ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు. బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది. కిరణ్మయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది. -
గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను గాలికొదిలేశాయి. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటీర్మీడియట్ బోర్డు గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి మే నెల 31వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని గురుకుల సొసైటీలు... పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే తరగతులు ప్రారంభించాయి. ఇంటర్మీడియ్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పాఠ్యాంశాన్ని ప్రారంభించగా... ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. ఏయే సొసైటీలంటే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఎస్), మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలేన్సీ(సీఓఈ) జూనియర్ కాలేజీలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) మాత్రం రంజాన్ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సీఓఈలకు ప్రత్యేకమంటూ... రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు పాఠశాలలు నిర్వహిస్తుండగా.. జూనియర్ కాలేజీని ప్రత్యేక ప్రిన్సిపల్తో నిర్వహిస్తున్నారు. గురుకుల సొసైటీలకు పాఠశాలలతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సీఓఈల పేరిట ప్రత్యేక పాఠశాలలున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 30, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 12 సీఓఈల్లో ఇంటర్మీడియట్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీ కార్యదర్శులు వేరువేరుగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. సీఓఈల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫస్టియర్ కేటగిరీకి మే 15వ తేదీ వరకు, సెకండియర్ విద్యార్థులకు మే 26వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నా రు. ముందస్తుగా పాఠ్యాంశాన్ని ముగించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సొసైటీ కార్యదర్శులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే బాటలో ప్రైవేటు కాలేజీలు.. గురుకుల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తుండడంతో పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం ఇదే బాట పట్టాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా తరగతులను నిర్వహిస్తున్నాయి. వేసవి సీజన్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండగా కనీస ఏర్పాట్లు చేయకుండా పలు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుంటే సిలబస్ మిస్సవుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతున్నట్లు వాపోతున్నారు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్లైన్లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
‘నేను పేదవాడిని.. పాస్ చేయండి’.. సమాధాన పత్రంలో వింత అభ్యర్థనలు!
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు. ‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు. జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు. -
AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్ల స్వీకరణకు 08645–277707, టోల్ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు. -
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
Intermediate Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
54 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్యే బీఏ పరీక్షలు!
చదువుకు వయసు ఒక ఆటంకం కాదంటారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్పూర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలకు హాజరవుతున్నారు. బీఏ మొదటి సంవత్సరం హిందీ సబ్జెక్టు పరీక్షను రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నానని ఆయన మీడియాకు తెలిపారు. తాను లా కోర్సు పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని రాజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని అన్నారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టవచ్చని అన్నారు. -
టెన్త్, ఇంటర్లో భారీగా రీ అడ్మిషన్లు
-
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
ఏపీలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
-
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఇంకా ఇతర అప్డేట్స్
-
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్లో ఇంగ్లిష్లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్ఫోన్ ‘2021లో స్మార్ట్ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్లో మోటివేషనల్ స్పీచ్లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
‘డిజి లాకర్’లో ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ఫ్లాట్ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేసి, డిజి లాకర్లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. ఐఐటీ, నీట్తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్లో పొందవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుని నకళ్లు (డూప్లికేట్) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇలా.. 2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. విద్యార్థులు తమ పాస్ మెమోల కోసం డిజి లాకర్ యాప్లో మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ‘క్లాస్ గీ మార్క్షీట్’ ఓపెన్ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్’పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్తో సైన్ ఇన్ అయ్యి సర్టిఫికెట్ను పొందవచ్చు. సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు మొబైల్ ఫోన్లోని డిజి లాకర్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్ మెమో, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్ ఫోన్లో డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్తో https://digilocker.gov.in లో లాగిన్ చేయాలి. వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్లో నింపి సబ్మిట్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేస్తే అందులో ‘క్లాస్ గీఐఐ’ ఓపెన్ చేస్తే ‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిపై ‘క్లిక్’ చేయాలి. రోల్ నంబర్/ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువు మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు. దీంతో మరికొంత గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడ్మిషన్లు సరిగా జరగడం లేదని జిల్లాల్లోని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరికొంత గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రవేశాల గడువు పెంపునకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లోనే సమస్య ఉందని అధికారులు తెలిపారు. హెచ్చరికతో ప్రైవేటు కాలేజీలు అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది (2022–23) కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా, 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాలను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తున్న మాయాజాలంపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ‘సాక్షి’ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. -
‘20లోపు ఇంటర్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి’
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్–2023 పరీక్ష రాసినవారు ఈ నెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ సి.శోభాబిందు శుక్రవారం తెలిపారు. ఏపీ ఈఏపీసెట్–2023లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్లో మొత్తం 2,52,717 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42వేల మంది విద్యార్థులకు ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల జాబితాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
నియోజకవర్గ ప్రతిభావంతులకు నేడు సత్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. నియోజకవర్గస్థాయిలో విద్యార్థులను గురువారం సత్కరించేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలో విద్యాసంస్థలున్నాయి. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులు 662 మంది ఉన్నారు. విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. నియోజకవర్గస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఇంటర్మీడియట్లో గ్రూప్ టాపర్కు రూ.15 వేలు చొప్పున ఇస్తారు. 20న రాష్ట్రస్థాయిలో.. రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యాలను ఈనెల 20న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించనున్నారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన 42 మందిని, ఇంటర్లో మొదటి స్థానంలో నిలిచిన 28 మందిని ఆయన సన్మానించనున్నారు. పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండోస్థానంలోని వారికి రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ఇంటర్ టాపర్స్కు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. 17న జిల్లాస్థాయిలో.. జిల్లాస్థాయిలో టాపర్స్గా నిలిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఈ నెల 17న ఆయా జిల్లా కేంద్రాల్లో సన్మానించనున్నారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్లలోని సంస్థల్లో ఒక్కో మేనేజ్మెంట్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులను సన్మానిస్తారు. ఇంటర్మీడియట్లో కూడా వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాస్థాయిలో పదో తరగతి విద్యార్థులు 606 మందిని, ఇంటర్ టాపర్స్ 392 మందిని సత్కరించనున్నారు. పదో తరగతిలో జిల్లా టాపర్కు రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.15 వేలు నగదు బహుమతి అందిస్తారు. ఇంటర్లో ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తారు. -
జగనన్న ఆణిముత్యాలు.. టెన్త్లో 1,250 మంది.. ఇంటర్లో 1,585 మంది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున 1,585 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్మాస్టర్లను శాలువ, మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురిని సత్కరించనున్నారు. అంతకు ముందు ఈ నెల 17న జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను, ఏడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. ఈ నెల 15న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు బహుమతులు ► పదో తరగతిలో 42 మందికి, ఇంటర్మీడియట్లో 35 మందికి ప్రతిభా అవార్డులు ►పదో తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు రూ.1,00,000, రెండో స్ధానం సాధించిన విద్యార్థులకు రూ.75,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000 చొప్పున నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురేసి విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 జిల్లా స్థాయిలో.. ► పదో తరగతిలో 606 మందికి, ఇంటర్లో 800 మందికి ప్రతిభా అవార్డులు ► పదిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000, రెండో స్థానం సాధించిన వారికి రూ. 30,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000 ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 నియోజకవర్గ స్థాయిలో.. ► పదో తరగతిలో 602 మందికి, ఇంటర్మీడియట్లో 750 మందికి ప్రతిభా అవార్డులు ► టెన్త్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15,000, రెండో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.5000లు నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 అందరి సమన్వయంతో కార్యక్రమాలు: సీఎస్ జగనన్న ఆణిముత్యాలు సత్కార కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్లు, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ కమిషనర్కు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్కు సూచించారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర శాఖలను, అధికారులను సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నియోజకవర్గస్థాయిలో మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూలు లేదా కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, దీనికి మండల విద్యాధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులను సంప్రదించి సత్కార కార్యక్రమ వేదికను కలెక్టర్ ఎంపిక చేయాలని చెప్పారు. చదవండి: ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్ -
ఇంటర్ సీట్లకు పెరిగిన డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్ ఫలితాలు వెల్లడితో కార్పొరేట్ కళాశాలల సీట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా ప్రదర్శిస్తున్న ఆసక్తి విద్యా సంస్థలకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ ఒకటి, రెండ్లు సీట్లు మాత్రమే ఉన్నాయంటూ ఇష్టానుసారం ఫీజుల మోతను మోగిస్తున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచేసిన విద్యా సంస్థలు తాజాగా సీట్లకు పెరిగిన డిమాండ్తో మరింత పెంచి ఎలాంటి తగ్గింపు లేకుండా వసూళ్లు దిగాయి. పేరొందిన కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డే స్కాలర్కు కనీసం రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు చెబుతున్నారు. హాస్టల్ సౌకర్యమైతే దీనికి రెండింతలు అధికంగా ఫీజు. ఒకే కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన వివిధ బ్రాంచ్లలో ఫీజులు ఒక్కో విధంగా ఉంటున్నాయి. మొన్నటి దాకా అధికారికంగా ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించి కోర్సుల వారీగా.. ముందస్తు అడ్మిషన్లైతే డిస్కౌంట్ (లాక్ ఫీ) ఉంటుందని పేర్కొనగా, తాజాగా సీట్లకు డిమాండ్ పెరగడంతో డిస్కౌంట్ లేకుండా పూర్తి ఫీజు అంగీకరిస్తేనే సీటు అని తెగేసి చెబుతున్నాయి. మరోవైపు సీటు రిజర్వేషన్ కోసం రూ.10,500 చెల్లించక తప్పడం లేదు. పెను భారంగా.. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఫీజుల దోపిడీతో తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. మూడేళ్ల క్రితం కరోనా సమయం 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో చాలా వరకు విద్యా సంస్థలు దానిని అమలు చేశాయి. పైగా ఆన్లైన్ క్లాసులు జరగడం వల్ల మెయింటెనెన్స్ భారం తగ్గడంతో పాత ఫీజులు తీసుకున్నాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడంతో మళ్లీ ఫీజులు పెంచడం ప్రారంభించాయి. గత విద్యా సంవత్సరంలోనే భారీగా ఫీజులు పెంచిన యాజమాన్యాలు ఈసారి మరో 20 శాతం పెంచేశాయి. అమలుకు నోచుకోని నివేదిక.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై నియంత్రణ లేకుండా పోయింది. ఫీజుల నియంత్రణపై 2017 డిసెంబర్లో ఆచార్య తిరుపతి రావు కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది అయిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కమిటీ సిఫారసులు అమలుకు నోచుకోలేకపోయాయి. మరోవైపు ఫీజుల రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురావాలని గతేడాది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా ఈ చట్టం తయారు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రతి విద్యా సంవత్సరం పాత ఫీజులకంటే పది శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదని సూచించింది. విద్యా సంస్థల్ని నియంత్రించేలా ఇతర సూచనలను చేస్తూ సూచనలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫీజులపై నియంత్రణా లేకపోవడంతో విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
TS: తప్పులు లేకుండా ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం పరీక్షల విభాగం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. స్పాట్ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ, ఆన్లైన్లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ప్రతీ సంవత్స రం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈసారి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇదే స్ఫూర్తిని ఫలితాల వెల్లడిలోనూ కనబరచాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దని, అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్ సూచించారు. ఆన్లైన్ ఫీడింగ్లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికారులు లోతుగా అధ్యయనం చేశా రు. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయి? సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలా? వ్యక్తుల తప్పిదాలా? అనే అంశాలపై మిత్తల్ ఆరా తీశా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్వేర్ను పూర్తిస్థాయిలో నిపుణుల చేత పరిశీలించాలని సూచించారు. పరీక్షలు రాసిన 9 లక్షల మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి దాదాపు 9 లక్షల మంది ఈసారి పరీక్ష రాశారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందని భావిస్తే, మార్కులను మాన్యువల్గా తెప్పించి చూడటం ఆలస్యమవ్వొచ్చు. దీన్ని దృష్టి లో ఉంచుకుని ఆన్లైన్లో వీలైనంత త్వరగా విద్యార్థి రాసిన పేపర్ను పరిశీలించే ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్యపడకుండా చర్యలు తీసుకోవాలని మిత్తల్ సూచించారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నారు. -
నోటికొచ్చిందే ఫీజు!
హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుమారుడు ధీరజ్ ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ధీరజ్ను ఇంటర్మీడియట్లో చేర్చేందుకు శ్రీనివాస్ ఎల్బీనగర్ వైపున్న ఓ కార్పొరేట్ కాలేజీని (రెసిడెన్షియల్) సంప్రదించారు. ఏడాదికి రూ.2.10 లక్షల ఫీజు అని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. చేసేదేం లేక సమీపంలోని మరో కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన కాలేజీలో సంప్రదించారు. అక్కడ ఏడాదికి రూ.2.20 లక్షలని చెప్పడంతో అవాక్కయ్యారు. డిసెంబర్, జనవరి సమయంలోనే వస్తే రూ.1.90 లక్షలకే సీటు ఇచ్చేవారమని, ఇప్పుడు సీట్లు నిండిపోతుండటంతో ఫీజు పెరిగిందని సదరు కళాశాలల సిబ్బంది చెప్పడం గమనార్హం. కరీంనగర్ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం సింగరేణిలో చిన్న ఉద్యోగి. తన కుమార్తె మీనాక్షి కోసం షామీర్పేట ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో సంప్రదించగా.. ఫస్టియర్కు రూ.2.40 లక్షలు, సెకండియర్కు రూ.2.60 లక్షలు ఫీజు ఉందని చెప్పారు. ఆలోచించుకొని రెండు రోజుల్లో వస్తానని సుబ్రమణ్యం చెప్పివచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లేసరికి సీట్లు లేవన్నారు. వస్తానని చెప్పాను కదా ఎలాగైనా సీటు కావాలని కోరగా.. సిబ్బంది సార్తో మాట్లాడతామని చెప్పి వెళ్లారు. కాసేపటికి వచ్చి ఫస్టియర్కు రూ.2.60 లక్షలు, సెకండియర్కు రూ.2.80 లక్షలు ఫీజుకు ఓకే అంటే సీటు ఇస్తామని తెగేసి చెప్పారు. -సాక్షి ప్రతినిధి, నల్లగొండ .. ఇది ఆ రెండు, మూడు కాలేజీల్లోనో, ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రుల పరిస్థితి మాత్రమేనో కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రముఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల బాగోతం, లక్షల కొద్దీ ఫీజులు కట్టడం కోసం సతమతం అవుతున్న తల్లిదండ్రుల ఆందోళన. ఆశనే బలహీనతగా మార్చుకొని.. ఫలానా కాలేజీలోని ఫలానా బ్రాంచీలో ఇంటర్మీడియట్ చదివిస్తే జేఈఈలో, ఎంసెట్లో మంచి ర్యాంకులు వస్తాయని.. తద్వారా బీటెక్ సీటు మంచి కాలేజీలో వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆశను కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయి. నోటికే వచ్చిందే ఫీజు అన్నట్టుగా అడ్డగోలుగా నిర్ణయించి, రూ.10వేలు అడ్వాన్స్గా తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి. అసలు పదో తరగతి పరీక్షలైనా జరగకముందే.. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసి, అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అడిగేవారు లేరని, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడమే లేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోనే అత్యధిక కాలేజీలు రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ శాఖల పరిధిలోని 850 వరకు ఉన్న గురుకుల కాలేజీలతోపాటు 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఐదు కార్పొరేట్, ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే 300 వరకు ఉండగా.. వీటిలో 220 కాలేజీల దాకా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్ చదివే దాదాపు 5లక్షల మంది విద్యార్థుల్లో సగం మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఆయా కాలేజీల్లో చదివిస్తే తమ పిల్లలకు మంచి చదువు వస్తుందని, మంచి ర్యాంకు వస్తుందన్న ఆశలతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజు విధానం ఊసే లేక.. ఇంటర్ బోర్డు నిర్ణీత ఫీజుల విధానాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు నిర్ణయించిన ఫీజు రూ.3 వేలలోపే. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం సాధారణ ప్రైవేటు కాలేజీలు స్థాయిని బట్టి రూ.20 వేల వరకు వసూలు చేస్తుండగా.. కార్పొరేట్ కాలేజీలు హాస్టల్ వసతి కలుపుకొని రూ.1.50 లక్షల నుంచి రూ.2.70 లక్షలవరకు తీసుకుంటున్నాయి. 2009లో లవ్ అగర్వాల్ ఇంటర్ విద్య కమిషనర్గా ఉన్న సమయంలో ఫీజుల విధానానికి చర్యలు చేపట్టినా ముందుకు సాగలేదు. 2013లో ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ కమిటీ.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా రూ.3,500, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.6,500 ఫీజు నిర్ణయించాలని సూచించింది. ఆ సిఫార్సులు ఆచరణలోకి రాలేదు. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా ఇంటర్మీడియట్ ఫీజుల విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదు. -
ఈఏపీసెట్లో ‘ఇంటర్’కు వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రకటించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపేవేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్కు దరఖాస్తు చేయడానికి ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్కు ఆన్లైన్ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు.. కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. సిలబస్పైనా స్పష్టత కాగా ఈఏపీసెట్–2023 సిలబస్పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది. (చదవండి: అంగన్వాడీల్లో 243 పోస్టులు) -
ఈఏపీసెట్లో ‘ఇంటర్’కు వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రకటించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్కు దరఖాస్తు చేయడానికి ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్కు ఆన్లైన్ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు.. కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. సిలబస్పైనా స్పష్టత కాగా ఈఏపీసెట్–2023 సిలబస్పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది. బోర్డు తీసేసిన అంశాలను సిలబస్ నుంచి మినహాయించి ఈఏపీసెట్ను నిర్వహించింది. 2022లో కూడా 30 శాతం సిలబస్ కుదింపు అంశాన్నే కొనసాగించింది. అప్పట్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ 30 శాతం సిలబస్పై బోధన జరగలేదు. ఆ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. వీరు ఇంటర్ ఫస్టియర్లో బోర్డు మినహాయించిన 30 శాతం అంశాలను అధ్యయనం చేయలేదు. దీంతో ఈసారి కూడా ఈఏపీసెట్ సిలబస్లో ఇంటర్ సెకండియర్ సిలబస్ను పూర్తిగా, ఫస్టియర్ సిలబస్ను 30 శాతం మేర కుదించి పరీక్ష నిర్వహించనున్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే నర్సింగ్ సీట్లు కాగా ఈసారి కొత్తగా నర్సింగ్ సీట్లనూ ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అనుబంధ నోటిఫికేషన్ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ ఈఏపీసెట్–2023 ర్యాంకుల ఆధారంగానే ఉంటాయని తెలిపింది. డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని వెల్లడించింది. -
ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈసారి మేలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా దాని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆదేశాలు జారీ అయి రెండు నెలలైనా ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభం కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జాప్యాన్ని నివారించాలనుకుంటున్నా.. ఏటా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ విద్యాసంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ జరుగుతుండటంతో గుర్తింపు రాకుండానే చాలా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనలు పాటించనందుకు ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నప్పటికీ అప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది విద్యాశాఖకు తలనొప్పిగా మారుతోంది. దీన్ని నివారించేందుకే ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసేలోగా గుర్తింపు పక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలు.. రాష్ట్రంలోని 1,856 ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో దాదాపు 400 కాలేజీలు ఇరుకైన ప్రదేశాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకున్నా ఆయా బోధన సాగిస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస మౌలిక వసతుల్లేవు. దీనిపై ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా నోటీసులిస్తున్నా యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే ఆయా యాజమాన్యాలు తాము నడిపే కాలేజీల ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే గుర్తింపు ప్రక్రియ సాధ్యం కానుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్, మే నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ముందే అనుబంధ గుర్తింపు ఎలా ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుర్తింపు అనుకున్నట్టు పూర్తవ్వడం కష్టమేనని బోర్డు వర్గాలు అంటున్నాయి. డిగ్రీ సీట్లపై స్పష్టత ఏది? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4.6 లక్షల సీట్లున్నాయి. వాటిల్లో ఏటా భర్తీ అవుతున్నవి సుమారు 2.25 లక్షల సీట్లే. సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని కోర్సుల్లో జీరో ప్రవేశాలుంటున్నాయి. వాటిని రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ఏటా చెప్పడమే తప్ప కార్యాచరణకు దిగడం లేదు. ఈ ఏడాది దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేయగా వచ్చే ఏడాది ఇలాంటి సమస్య రాకుండా కాలేజీలే అవసరం లేని సీట్లను వదులుకోవాలనే అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా విభిన్న కోర్సుల సమ్మేళనంతో డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్ట్స్ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుచేసే అవకాశం ఇస్తామంటున్నారు. ఇది జరగాలంటే ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవాలి. వచ్చే మే నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. కానీ ప్రైవేటు కాలేజీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు కోర్సులను మార్చుకోవడం, అందుకు తగ్గ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నాయి. వర్సిటీలను అప్రమత్తం చేశాం మార్పులను స్వాగతించేలా ప్రైవేటు కాలేజీలకు నచ్చజెప్పి వారి భాగస్వామ్యాన్ని పెంచుతాం. ఈ దిశగా అన్ని వర్సిటీలను అప్రమత్తం చే స్తాం. విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులనే తీసుకోవడం కాలేజీలకు మంచిది. డిమాండ్ లేకుండా అనుమతులివ్వడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరి ప్రైవేటు కాలేజీలతో లావాదేవీలు జరిపితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎప్పటికప్పుడు పరీక్షలపై సమాచారం తెప్పించుకుంటుందని, విద్యార్థులు కూడా సమస్య ఉంటే తక్షణమే తెలియ జేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని మిట్టల్ తెలిపారు. కేవలం విద్యార్థులకుకలిగే అసౌకర్యాలను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో యంత్రాంగం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్కు 3,65,931 విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 3,65,931 మంది ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరవుతున్నారు. వీరిలో 94,573 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 2,201 ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. కానీ ఈ ఏడాది వరకూ విద్యార్థి చదివే కాలేజీల్లోనే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జంబ్లింగ్ లేకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండా, ఇన్విజిలేటర్లను ప్రభావితం చేసి, ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఏడాది ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని ఇంటర్బోర్డ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇన్విజిలేటర్ల ఎంపికలోనూ ట్రాక్ రికార్డును పరిశీలించి మరీ ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు విద్యార్థులను ఏ కాలేజీ అయినా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ సమస్య తలెత్తినా విద్యార్థులు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డ్లోని కంట్రోల్ రూంకు ఫోన్ చేయొచ్చు. తక్షణమే స్పందిస్తాం. విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాళ్ల సందేహాలను నివృత్తిచేసేందుకు ఈ కంట్రోల్ రూంను వాడుకోవచ్చు. 040 –24600110 ఫోన్నెంబర్తో పాటు, helpdesk-ie@telangana.gov.in ను సంప్రదిస్తే సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం. – జయప్రదాభాయ్ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంటర్ బోర్డ్) -
ఇంటర్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లోని 20 వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియెట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్తో గురువారం మంత్రి సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్ర భుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో 60 శాతం మార్కు లు పొందిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన వారికి ఆన్లైన్లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, అది పూర్తయ్యాక హెచ్సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపా టు ఇంటర్న్షిప్ ఉంటుందన్నారు. ఇంటర్న్షిప్లో నెల కు రూ.10 వేలు ఉపకారవేతనం ఇస్తారని, ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, 16 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్.. ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్.. మార్చి 15న 2nd లంగ్వేజ్ పేపర్ 1 మార్చి 16న 2nd లాంగ్వేజ్ పేపర్ 2 మార్చి 17న ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 18న ఇంగ్లీష్ పేపర్ 2 మార్చి 20న మాథ్స్ పేపర్1A బోటనీ పేపర్ 1 పొలిటికల్ సైన్స్ పేపర్ 1 మార్చి 21న మాథ్స్ పేపర్2A బోటనీ పేపర్2 పొలిటికల్ సైన్స్ పేపర్ 2 మార్చి 23న మాథ్స్ పేపర్ 1B జూవాలజీ పేపర్ 1 హిస్టరీ పేపర్1 మార్చి 24న మాథ్స్ పేపర్ 2B జావాలజి పేపర్ 2 హిస్టరీ పేపర్ 2 మార్చి 25న ఫిజిక్స్ పేపర్ 1 ఎకనామిక్స్ పేపర్1 మార్చి 27న ఫిజిక్స్ పేపర్2 ఎకనామిక్స్ పేపర్ 2 మార్చి 28న కెమిస్ట్రి పేపర్ 1 కామర్స్ పేపర్ 1 మార్చి 29న కేమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్2 -
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్కు ముందు ఇదే సిలబస్తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
Panchakshari Nagini: టాలెంట్కు మూ'ల'కం
కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్పాస్గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు. స్మార్ట్ ఆలోచనతో ఆన్లైన్లో రికార్డ్ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేటర్గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్ రైటింగ్.. అన్నింటా తానే ఫస్ట్ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్ చదివి ఆపై సివిల్స్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్గా క్లాసులు చెబుతుంటుంది. స్కూల్ నుంచి ఇస్రోకు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్ టాలెంట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్ లెవల్ సైన్స్ ఫేయిర్లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్ రైటింగ్లోనూ గోల్డ్మెడల్ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది. టాలెంట్ టెస్ట్ కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్లైన్ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే 22 సెకన్లలో 118 మూలకాల పేర్లు చదివి కలాం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్లైన్లో జరిగిన నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ‘లర్న్ సంథింగ్ విత్ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్లో చానల్ నిర్వహిస్తోంది. మోటివేటర్గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది. ఆన్లైన్ రికార్డులు నా లక్ష్యం సివిల్స్ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్పాయింట్లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ఫోన్ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది. – పంచాక్షరి నాగిని – ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఇంటర్లో గురుకులాల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన ఇంటర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 950కి పైగా మార్కులు పొంది న విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను 2,755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2,544 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్లోని గురుకుల కాలేజీ ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెరుపులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా, రాష్ట్రవ్యాప్త ఉత్తీర్ణత 64.25% మాత్రమే కావడం గమనార్హం. 17 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్లో ఏకంగా 93.23 శాతం మంది (రాష్ట్ర ఉత్తీర్ణత 68.68%) ఉత్తీర్ణులయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. సెకండియర్లో 82.09 శాతం, ఫస్టియర్లో 78.75 శాతం ఫలితాలు వచ్చాయి. తేజావత్ భావనశ్రీ 984 మార్కులతో సెకండియర్ టాపర్గా నిలిచారు. ఇక రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 94.18 సగటుతో ఉత్తీర్ణులై తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మైనారిటీ గురుకులాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
పదిలో ఆరు.. ఇంటర్లో ఏడు
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో అభ్యసిస్తున్న పది, ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాను టెన్త్లో ఆరోస్థానం, ఇంటర్లో ఏడో స్థానంలో నిలిపారు. జిల్లా ఫలితాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ గార పగడాలమ్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డి.సూరపునాయుడు విడుదల చేశారు. పదో తరగతిలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 41.82 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచారు. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులు 56.37 శాతం ఉత్తీర్ణతను సాధించి ఏడో స్థానంలో నిలి,చారు. జిల్లా నుంచి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1277 మంది విద్యార్థులు హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1350 మంది హాజరుకాగా 761 మంది ఉత్తీర్ణత పొందారు. చదవండి: Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు -
Telangana: ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటర్ సిలబస్ను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ కళాశాలలను ఆదేశించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది. (క్లిక్: రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ) -
Sociology: సామాజిక శాస్త్రాన్ని అభ్యసించాలి
ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గల కారణం మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపద రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం (సోషియాలజీ). సమాజ పరిణామ దశలనూ, సమాజంలోని మానవ సంబంధాలనూ, సమాజ మనుగడనూ; ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలనూ ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజం లోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీ కరణ, సామాజికీకరణ, స్తరీకరణ ఏవిధంగా ఉండాలో తెలుపుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగే పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి మార్పులకు గురవుతున్నాయి. అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరవవుతోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సామాజిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా దాదాపు కనుమరుగై పోయింది. కేవలం కొన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుగానే ఇది అందుబాటులో ఉంది. (క్లిక్: 124–ఏ సెక్షన్ను ఎందుకు రద్దు చేయాలి?) గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరిరక్షించడానికీ తోడ్పడుతుంది. అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేక పోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశ పెట్టి, సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. (క్లిక్: ఒక కొత్త వ్యవస్థ అవసరం) – డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా -
జూన్ 20 నాటికి ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగం పెంచారు. వాస్తవానికి సంస్కృతం పేపర్ మూల్యాంకనం ఈ నెల 12నే ప్రారంభమైంది. తాజాగా ఆదివారం సబ్జెక్టుల మూల్యాంకనం చేపట్టారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ పరీశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకన విధానంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మూల్యాంకనం కోసం ఇంటర్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి ఇంటర్ పరీక్షలు విభిన్నమైన వాతావరణంలో జరిగాయి. కోవిడ్ వల్ల టెన్త్ పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందారు. ఫస్టియర్ పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరం కొనసాగించినా, ఆ తర్వాత మళ్లీ పరీక్షలు పెట్టారు. కానీ 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే వచ్చింది. కోవిడ్ వల్ల క్లాసులు జరగకపోవడం వల్లే పాస్ అవలేకపోయామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వాళ్లంతా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరి కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించింది. పరీక్ష ఫలితాలను జూన్ 20 నాటికి వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పెడతామని తెలిపారు. -
పాపం! లక్ష్మీదేవి.. ఆర్టీసీ బస్సు రిపేర్.. 10 నిముషాలు పరీక్షకు ఆలస్యమవడంతో
సాక్షి, మిడ్జిల్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీదేవి సోమవారం ఎకనమిక్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరింది. ఆ బస్సు మధ్యలో మొరాయించడంతో (మరమ్మతులకు గురైంది) పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీదేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని అధికారులకు చెప్పినా వినిపించుకోవడంలేదని లక్ష్మీదేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్ నాయక్ ఆమెకి సర్ది చెప్పి పంపించారు. చదవండి👉🏾పెళ్లైన 4 నెలలకే మరొకరితో ఉంటూ పరువు తీసిందని.. ‘ఇంటర్’ మూల్యాంకన పారితోషికం పెంపు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని ఇంటర్ బోర్డు 25 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66.. ఇతర విధులకు రోజుకు రూ.641 నుంచి రూ.800 లకు పెంచారు. చదవండి👇 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్పై కేటీఆర్ ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు -
సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం
స్టేషన్ఘన్పూర్: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో సిబ్బంది సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన జనగామ జిల్లా నమిలిగొండ శివా రు మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్కు చెందిన హర్షి త శనివారం సంస్కృతం పేపర్ రాసేందుకు నమిలిగొండ శివారు మోడల్ స్కూల్లోని పరీక్ష కేంద్రానికి హాజరైంది. ఆమెకు ఇన్విజిలేటర్ సంస్కృతం పేపర్కు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. అది తన సబ్జెక్ట్ కాదని తెలిసినా.. ఏం చేయాలో తోచక సదరు విద్యార్థిని పరీక్ష ముగిసే వరకు కూర్చుండిపోయింది. బయటకు వచ్చాక తండ్రికి విషయం చెప్పగా.. ఆయన సిబ్బందికి, సెంటర్ ఇన్చార్జి శ్రీకాంత్ డీఐవో శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఎప్పటినుంచీ అంటే..
సాక్షి, అమరావతి: జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు 2021–22 విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు మే 25వ తేదీ నుంచి అమలవుతాయని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 19 వరకు ఈ సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 20 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీలు ప్రారంభం అవుతాయి. కొన్ని కళాశాలలు వేసవి సెలవుల్లో కూడా పనిచేస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అన్ని యాజమాన్యాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు 2021–22 వార్షిక క్యాలెండర్ ప్రకారం మే 25 నుంచి జూన్ 19 వరకు వేసవి సెలవుల కోసం జూనియర్ కాలేజీలు మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలన్నారు. విద్యార్థులను బలవంతం చేయడానికి/ఒప్పించడానికి /ఆకర్షించడానికి ఏ కళాశాల కూడా అనవసరమైన ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు. కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని కలిగించే హోర్డింగ్లు, కరపత్రాలు, వాల్ రైటింగ్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొదలైన వాటి ద్వారా ఎలాంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ పబ్లిక్ పరీక్షలో పనితీరు లేదా విజయానికి ఎలాంటి హామీని ఇవ్వకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరించారు. హాల్ టికెట్లు సిద్ధం రాష్ట్రంలో మార్చి 2022 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (థియరీ) హాజరు కానున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లు (జనరల్, ఒకేషనల్) ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ (జ్ఞాన భూమి) లాగిన్లో అప్లోడ్ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్ టికెట్లు పొందాలన్నారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాల్లోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు తెలియజేయాలని ఆదేశించారు. -
ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల పట్ల భయం, ఒత్తిడి సహా ఇతర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారు బోర్డు సూచించిన ఫోన్ నెంబర్ల ద్వారా మానసిక వైద్యులు క్లినికల్ సైకాలజిస్టులను సంప్రదించవచ్చని సూచించింది. వారి వ్యక్తిగత నెంబర్లను బోర్డు విడుదల చేసింది. -
Telangana: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఆ నిబంధన సడలింపు
TS EAMCET 2022 Eligibility Criteria: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్కు అర్హత లభిస్తుంది. వాస్తవానికి ఇంటర్లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ నిబంధనను సడలించారు. టెన్త్ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్ ఫస్టియర్కు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. వీరికి గత మార్చిలో కూడా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, ఆ తర్వాత అక్టోబర్లో వీళ్లందరికీ పరీక్షలు పెట్టారు. కానీ, కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్లో సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీ లుంది. ఇదే క్రమంలో జూన్ ఆఖరులోగా ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోంది. -
ఉదయమో గంట.. సాయంత్రమో గంట
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అదనపు క్లాసులు మొదలుకాబోతున్నాయి. ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజూ రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్పబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ కాలేజీల్లో ఈ తరహా ఏర్పాట్లు చేస్తామని బోర్డు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ తొలి, రెండో సంవత్సర పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదల చేయడం.. కరోనా వల్ల కొన్ని కాలేజీల్లో ఇంకా 50 శాతం కూడా సిలబస్ పూర్తవకపోవడంతో మార్చిలోగా సిలబస్ పూర్తి చేసేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 70% సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంటర్ విద్యార్థులకు సాధారణంగా జూలై, ఆగస్టులో క్లాసులు మొదలవ్వాలి. కరోనా వల్ల సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించారు. దాదాపు నెల పాటు ఆన్లైన్లోనే బోధన సాగింది. గత నెల కూడా థర్డ్ వేవ్ వల్ల 25 రోజులు క్లాసులు నిర్వహించలేదు. దీంతో సిలబస్ పూర్తి చేయలేకపోయామని అధ్యాపకులు అంటున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల బోధనలో విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఆప్షనల్ సబ్జెక్టుల విషయంలో సిలబస్ ఆశించిన మేర పూర్తవ్వలేదని ఇటీవల బోర్డు గుర్తించింది. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో ఇప్పటికే 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా కొన్ని కాలేజీల్లో 50 శాతం కూడా పూర్తవ్వలేదని తెలిసింది. దీంతో ఈసారి కూడా 30 శాతం సిలబస్ను తగ్గించింది. మార్చి ఆఖరు కల్లా 70% సిలబస్ పూర్తి చేసేలా.. సాధారణంగా ఇంటర్ బోధన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సంబంధిత అధ్యాపకులు బోధించే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు 70 శాతం సిలబస్ పూర్తి చేసి వారం రోజులు రివిజన్ చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు అధ్యాపక వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ సిలబస్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ నెల 15 తర్వాత రివిజన్ చేపట్టేందుకు ఆ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులూ ఉన్నారు. ప్రత్యక్ష క్లాసుల వల్ల పోటీ పరీక్షల టైం మార్చుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. సరిపడా అధ్యాపకులున్నారా? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న లెక్చరర్ల సంఖ్య 725 మాత్రమే. అతిథి లెక్చర్లు 1,658, కాంట్రాక్టు లెక్చరర్లు 3,700, పార్ట్టైం, మినిమమ్ టైం స్కేల్ మరో 100 మంది ఉంటారు. అయితే గెస్ట్ లెక్చరర్ల సేవలను సెప్టెంబర్ నుంచి 5 నెలల పాటు తీసుకుంటూ గతంలో ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పటివరకు వీరిని పొడిగించేందుకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రత్యేక క్లాసుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 317 జీవో అమలులో భాగంగా దాదాపు 78 మందికి స్థానచలనం జరిగి కొన్ని ఖాళీలేర్పడ్డాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ విషయాలను బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆన్లైన్ తరగతులు కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్ పూర్తవ్వలేదని, ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. ఈ సమస్య రాకుండా టీ–శాట్ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు. (క్లిక్: కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి) -
ఆన్లైన్ తరగతులు అర్థం కాలేదు.. ఫెయిలైనందుకు క్షణికావేశంలో..
సాక్షి,ఆదిలాబాద్టౌన్: ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బుధవా రం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన బుర్రివార్ గజానంద్– సంగీత దంపతుల కు కూతురు నందిని (17), కుమారుడు ఉన్నారు. నందిని 10వ తరగతి వరకు బంగారుగూడ మోడల్ స్కూల్లో చదివింది. కరోనా కారణంగా పరీక్షలు రా యకుండానే పదో తరగతి ఉత్తీర్ణులైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్లో చేరింది. అయితే గత శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా నందిని ఫెయిలైంది. దీంతో అదే రోజు సాయంత్రం ఇంట్లోని వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆన్లైన్ తరగతులు అర్థం కాక.. కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరగలేదు. ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సాగింది. ఆన్లైన్లో విన్న పాఠాలు సరైన రీతిలో అర్థం కాలేదు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం ప్రథమ సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించింది. పరీక్షలు రాసిన ఈ విద్యార్థిని నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వెలువడ్డాయి. కాలనీలో విషాదం.. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం 6గంటల ప్రాంతంలో విద్యార్థిని ఇంట్లోని వాస్మొల్ ఆయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
గుణపాఠాలు నేర్చుకోరా?
సాక్షి, హైదరాబాద్: గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణమని, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు, తదనంతర పరిణామాలు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఆ లక్షణం లోపించినట్టు అర్థమవుతోందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ఇంటర్ బోర్డును సంస్కరిస్తారని ఆశించినా అది జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారని, ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఆన్లైన్ బోధనలకు అనుగుణంగా ఇంటర్నెట్, కంప్యూటర్లులాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదువుకు నే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఏ మేరకు ఈ సదుపాయాలు కల్పించారన్నది ప్రశ్నార్థకమని రేవంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళానికి, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణులు కాని వారిలో ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంస్కరించాలని, ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో సీఎంను రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఇంటర్ ప్రవేశాల గడువు 30 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్లో ప్రవేశానికి గడువును మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు ఫస్టియర్లో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, సంక్షేమ కాలేజీలకు ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,500కు పైగా ఇంటర్ కాలేజీలున్నాయి. ఇందులో 300 ప్రైవేటు కాలేజీలకు ఇప్పటికీ ఇంటర్ బోర్డు గుర్తింపు లభించలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో (మిక్స్డ్ ఆక్యుపెన్సీ) నడుస్తున్న ఈ కాలేజీలకు ఫైర్ సేఫ్టీ అనుమతి రాలేదు. కాగా, కాలేజీల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇటీవల వాటికి అనుమతి ఇచ్చింది. అయితే ఇంటర్ బోర్డు పరిధిలో ఈ అంశం పరిశీలన దశలోనే ఉంది. దీంతో ఈ కాలేజీల్లో చేరిన లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కాలేజీలకు అనుమతి లభించకపోవడం, ఇంటర్ ప్రవేశాల గడువు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు ప్రవేశాల గడువు పొడిగించింది. ఈలోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే వీలుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
ఇంటర్ సిలబస్ 70 శాతానికి కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఫస్టియర్ సిలబస్ను గతేడాది 70 శాతం అమలు చేశారు. దీనికి కొనసాగింపు పాఠ్యాంశాలు రెండో సంవత్సరంలో ఇంతకాలం బోధించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరో వైపు ఈ ఏడాది కూడా ప్రత్యక్ష బోధన ఆలస్యంగా మొదలైంది. ఆన్లైన్ క్లాసులు జరిగినా కొంతమంది విద్యార్థులు దీన్ని అందుకోలేకపోయారు. మారుమూల గ్రామాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, మొబైల్ సిగ్నల్స్ అందకపోవడం వల్ల బోధన అరకొరగా జరిగిందని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా ఇదే తరహాలో సిలబస్ తగ్గింపుపై ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇంటర్ బోర్డ్ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి తగ్గింపుపై నివేదిక పంపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో 30 శాతం సిలబస్ తగ్గింపు నిర్ణయాన్ని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. తగ్గించిన సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలను విద్యార్థుల కోసం బోర్డ్ వెబ్సైట్లో అందుబాటుల ఉంచినట్టు బోర్డ్ తెలిపింది. -
గంట ముందే కేంద్రానికి రావాలి
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల మూల్యాంకనం నవంబర్ మొదటి వారంలో మొదలువుతుందని, వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. బోర్డు జాయింట్ సెక్రటరీలు శ్రీనివాసరావు, నాయక్, ఓఎస్డీ సుశీల్తో కలసి జలీల్ శుక్రవారం మీడియాకు పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా ప్రమోట్ అయ్యారని గుర్తు చేశారు. వరుసగా రెండో ఏడాది పరీక్షలు నిర్వహించలేకపోతే వారి భవిష్యత్కు ఇబ్బంది ఉంటుందనే ఫస్టియర్ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 శాతం సిలబస్లోంచే ప్రశ్నాపత్రం రూపొందించామని, మునుపెన్నడూ లేని విధంగా 40 శాతం ఐచ్చిక ప్రశ్నలిస్తున్నామని తెలిపారు. తాము విడుదల చేసిన స్టడీ మెటీరియల్ను అనుసరిస్తే పరీక్షల్లో విజయం సాధించడం తేలికేనని జలీల్ చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయిన 25 వేల మంది ఇన్విజిలేటర్లను గుర్తించామని వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ తర్వాత అస్వస్థతగా ఉన్న విద్యార్థులను ఇందులో ఉంచుతామని చెప్పారు. పరీక్ష రాయగలిగితే ఐసోలేషన్లోనే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో పరీక్షకు వెళ్లవచ్చన్నారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు... ►పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు, వి ద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందు కు ప్రతీ జిల్లాలోనూ కలెక్టర్ నేతృత్వంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఐఈవో, సీనియర్ ప్రిన్సిపల్, జేఎల్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ►విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీతో సమన్వయం చేసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మెడికల్, విద్యుత్, పోస్టల్ సిబ్బంది ప్రత్యేక సేవలందిస్తారు. పరీక్ష కేంద్రాలు, ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ►హాల్టికెట్లలో తప్పులుంటే నోడల్ అధికారిని, ప్రిన్సిపాల్ను సంప్రదించి సాయం పొందొచ్చు. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రానికి అనుమతించరు. 8.45 గంటలకు ఓఎంఆర్ అందజేస్తారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. కోవిడ్ జాగ్రత్తలు ►పరీక్ష విధుల్లో పాల్గొనే ఇన్విజిలేట ర్లు, అధికారులు, చీఫ్ సూపరింటెం డెంట్ సహా అందరినీ వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే ఎంపిక చేశారు. పరీక్ష కేంద్రాన్ని శానిటైజేషన్ చేస్తారు. ప్రతీ విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్లు తెచ్చుకోని వారికి పరీక్ష కేంద్రాల్లో అందజేస్తారు. అంతేతప్ప ఆ కారణంతో పరీక్ష రాసేందుకు నిరాకరించరు. ►పరీక్షలు జరిగే వరకూ కేంద్రంలో స్టా ఫ్ నర్సు ఉంటారు. ఒక్కో పరీక్ష కేం ద్రంలో 250కి మించి విద్యార్థులు లే కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉం చుకుని బెంచ్కు ఒకరు లేదా ఇద్దరిని కూర్చోబెడతారు. విద్యార్థులు 50 ఎంఎల్ శానిటైజర్లు తెచ్చుకోవచ్చు. -
AP: ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 391282578 వాట్సాప్ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫలితాలను education.sakshi.com వెబ్సైట్లో చూడొచ్చు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి ఈ వెబ్సైట్లలో ఫలితాలు.. www.sakshieducation.com https:bie.ap.gov.in https://examresults.ap.nic.in https://results.apcfss.in -
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్
సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్చంద్ర, అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్లో ఉండిపోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు. (చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’) ‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని బలోపేతం చేస్తాం’’ అన్నారు. (చదవండి: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి) తెలుగు అకాడమీ పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ: లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’ చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
25 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్ను తప్పించి, 70 శాతం సిలబస్లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది. -
పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా
ఛండీగఢ్: ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్ట్తో ఆయన పదో తరగతి అర్ధంతరంగా ఆపేసిన ఆయన ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో ఇప్పుడు పాసయ్యాడు. దీంతో ఆయన పదో తరగతి గండాన్ని గట్టెక్కాడు. ఆయనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించాడు. చౌతలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదో తరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఆయన ఇంగ్లీశ్ సబ్జెక్ట్తో పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీశ్ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీశ్ 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు. కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. లేటు వయసులో లేటెస్ట్గా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడం విశేషం. -
సందేహాలు తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఆన్లైన్ విద్యా విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై బోధన వ్యవధిని ప్రభుత్వ కాలేజీలు కేవలం అరగంటకే పరిమితం చేశాయి. దీంతో అరకొరగా పాఠం వినడానికే సమయం సరిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యక్ష బోధనలోనైతే పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలు అడిగే వీలుంటుంది. లెక్చరర్లు ప్రధానంగా దీనికే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థి సృజనాత్మకత ఇక్కడే గుర్తిస్తామని లెక్చరర్లు అంటున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో ఎవరి సత్తా ఏంటనేది తెలుసుకునే వీల్లేకుండా పోతోందని కరీంనగర్కు చెందిన శేషుకుమార్ అనే లెక్చరర్ చెప్పారు. ‘సందేహాలు, సమాధానాలు’లేకపోతే బోధన అసంపూర్తిగానే ఉన్నట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నుంచీ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గణితంలో కఠినమైన ఫార్ములాల గురించి లెక్చరర్లతో సంభాషించే అవకాశం ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సవాలక్ష డౌట్లతో పాఠాలు సరిగా అర్థం కావడంలేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థుల నుంచి ఈ ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయి. పుస్తకాలు మారినా... వాస్తవానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు, మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పుస్తకాలు మారాయి. విద్యాశాఖ మంత్రి ఈ మధ్యే వీటిని విడుదల చేసినా ప్రభుత్వ కాలేజీలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కోవిడ్ కారణంగా ప్రింటింగ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. నిజానికి మారిన పుస్తకాలను ముందుగా లెక్చరర్లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాలి. వారి నుంచి అనేక సందేహాలు వస్తుంటాయి. వీటిని మళ్లీ అధ్యయనం చేసి నివృత్తి చేయాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలైనా ఇంత వరకూ కొత్త పుస్తకాల మొఖమే చూడలేదని, ఇలాంటప్పుడు బోధనలో నాణ్యత ఎలా ఉంటుందని ప్రభుత్వ కాలేజీలు అంటున్నాయి. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే గందరగోళం కన్పిస్తోంది. పోటీ పరీక్షల కోణంలో విద్యార్థులకు లోతుగా చెప్పేందుకు ముందుగా వారికి ఉన్న సందేహాలను గుర్తించాల్సి ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. బుర్రకెక్కడం లేదు – అన్విత్ (విద్యార్థి), భద్రాద్రి కొత్తగూడెం ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ క్లాసులు వింటున్నా. మేథ్స్ విన్నాక అనేక డౌట్స్ వస్తున్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ చేయాలంటే కష్టంగా ఉంది. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. కాలేజీలో అయితే లెక్చరర్ను అడిగి తెలుసుకునే వీలుంటుంది. ఇంత వరకూ ఇంగ్లిష్ బుక్ చూడలేదు – పల్లవి (విద్యార్థి), హన్మకొండ ఇంగ్లిష్ పాత పుస్తకాలు చూశాం. కానీ బుక్ మారింది. కొత్త పుస్తకం చూడలేదు. పాఠాలూ జరగడం లేదు. పుస్తకాలూ అందుబాటులులో లేవు. ఇతర సబ్జెక్టుల్లోనూ డౌట్స్ వస్తున్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఆన్లైన్ క్లాస్ తర్వాత లైన్ కట్ అవుతోంది. బోధకులేరీ? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు పెరిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా లక్షకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. అయితే లెక్చరర్ల కొరత వేధిస్తోందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 405 కాలేజీలుంటే... రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నది కేవలం 751 మంది మాత్రమే. 3,599 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 1,658 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతీ అకడమిక్ సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్స్ సర్వీసును పొడిగిస్తారు. ఈసారి కొన్ని కోర్టు వివాదాల నేపధ్యంలో ఇంతవరకూ వారికి పొడిగింపు ఇవ్వలేదు. దీంతో 25 శాతం వరకూ లెక్చరర్ల కొరత ప్రభుత్వ కాలేజీల్లో ఉంది. ఇన్ని సమస్యలుంటే విద్యాబోధన సాఫీగా ఎలా సాగుతుందని అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఆన్లైన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్కు తొలిసారిగా ఆన్లైన్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు తేదీలను ప్రకటించింది. అయితే గడువు పొడిగించాలని అనేకమంది విన్నవించడంతో దరఖాస్తు గడువును 27 వరకు పొడిగించింది. మార్చి పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరికీ హాల్టికెట్లు కాగా, తమ మార్కులను పెంచుకునేందుకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది. ఈ విషయంలో సబ్జెక్టులను నిర్ధారించుకునేందుకు విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించనక్కర్లేదని వివరించింది. ఇంటర్ – మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు వారి అనుకూలతను బట్టి ఒకటి లేదా అంతకు మించిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజులు చెల్లించని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలనుకుంటే నేరుగా ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించింది. దీనికోసం ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సిన అవసరం లేదని వివరించింది. -
ఏపీ: ఇంట్లో నుంచే ఇంటర్ సీటు.. తొలిసారి ఆన్లైన్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నానికి చెందిన ఎస్సీ విద్యార్థి హరీశ్ టెన్త్లో 10 జీపీఏ సాధించాడు. కానీ దగ్గరలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలో అతడికి సీటు లభించలేదు. కారణం కాలేజీ అడిగిన ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడమే. హరీశ్ లాంటి విద్యార్థులకు ఇక ఇలాంటి సమస్యలుండవు. వారు కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు పొందవచ్చు. స్మార్ట్ఫోన్, లేదా కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంటే ఇంట్లో నుంచే ఇంటర్మీడియెట్ కోర్సులో చేరవచ్చు. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశానికి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకు చెక్ పెడుతూ ఇంటర్ బోర్డు ఆన్లైన్ అడ్మిషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ జూనియర్ కాలేజీల్లోని జనరల్, ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానంలోనే కొనసాగనున్నాయి. సమస్యలకు స్వస్తి టెన్త్ పాసయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరటం ఇప్పటివరకు పెద్ద ప్రహసనంలా ఉండేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు మాత్రం అడిగిన మేర రూ.లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరడమేగాక విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి మెరిట్ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ‘డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాలేజీలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన కాలేజీలో ఆశించిన గ్రూపులో సీటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ను అనుసరించి బోర్డు ఆయా విద్యార్థుల ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయిస్తుంది. అది పూర్తికాగానే అభ్యర్థి వెబ్సైట్లోని అడ్మిన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా కాలేజీలో ఫీజు చెల్లించి చేరవచ్చు. గతంలో ప్రైవేట్ కాలేజీల్లో సదుపాయాలు, బోధన సిబ్బంది సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఆయా కాలేజీల్లోని సదుపాయాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, భవనాలు, సిబ్బంది సమాచారం కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని పరిశీలించుకుని కాలేజీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. రిజర్వేషన్ల అమలు ఇప్పటివరకు రిజర్వేషన్లను ప్రభుత్వ కాలేజీలు తప్ప ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ విధానంలో అన్ని కాలేజీల్లోనూ రిజర్వేషన్ల కోటా ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు నిర్దేశించిన కోటా ప్రకారం ఆయా కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 33.33 శాతం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీ సీట్లకు అర్హులు లేకపోతే జనరల్ కోటాలో భర్తీచేస్తారు. బీసీ కోటా సీట్లను ఆయా ఉపవర్గాల వారీగా అభ్యర్థులు లేకపోతే వేరే ఉపవర్గానికి కేటాయిస్తారు. వారూ లేనిపక్షంలో జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. లోకల్, నాన్ లోకల్ వారీగా సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్)–1974 ప్రకారం లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, నాన్ లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు ఆయా కాలేజీల్లో కేటాయిస్తారు. అభ్యర్థులకు వారికి టెన్త్లో వచ్చిన గ్రేడ్లు, మార్కుల ఆధారంగా మెరిట్ను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. నార్మలైజేషన్ పద్ధతిలో ఆయా అభ్యర్థులకు గ్రేడ్ల వారీగా ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల మెరిట్ను అనుసరించి ఆయా గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. జనరల్ సెక్షన్లో 88 సీట్లు ప్రతి కాలేజీలో ఆయా గ్రూపుల్లో జనరల్ సెక్షన్కు 88, ఒకేషనల్ పారా మెడికల్లో 30, నాన్ పారా మెడికల్లో 40 సీట్లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ అడ్మిషన్లను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అడ్మిషన్ కమిటీలను బోర్డు ఏర్పాటు చేసింది. ఇవిగాకుండా ప్రతి జిల్లాలో జిల్లా హెల్ప్లైన్ కేంద్రాలతోపాటు కాలేజీ స్థాయిలో హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయాలో పలు సూచనలతో సవివరంగా యూజర్ మాన్యువల్ను బోర్డు అందుబాటులో ఉంచింది. 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు సెప్టెంబర్ 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో ఫస్టియర్ ఇంటర్మీడియెట్ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. -
ఏపీలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఏపీలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు ఇంటర్బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. bie.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల కోసం apoasis అనే మొబైల్ అప్లికేషన్ రూపకల్పన చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు సులువుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కాగా విద్యార్ధులు ఎటువంటి ఒరిజనల్ సర్టిఫికేట్స్ కళాశాలలకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది. ధరఖాస్తు సమయంలో కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రతీ కాలేజ్లో.. ప్రతీ జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు, ఇంటర్ రెండు సంవత్సరాలతో పాటు వొకేషనల్ విద్యార్ధులకి ఆన్ లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించారు. ధరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకి రూ.100, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్లకి రూ. 50గా నిర్ణయించారు. విద్యార్దుల సందేహాలకి టోల్ ఫ్రీ నంబర్ 18002749868 కాల్ చేయాల్సిందిగా సూచించారు. నెలాఖరు లోపు ధరఖాస్తులని పరిశీలించి విద్యార్ధులకి అడ్మిషన్ లెటర్స్ పంపనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. -
ఏపీ: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులు (మినిమం పాస్ మార్కులు)తో సెకండియర్ (2021–22)లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ సెకండియర్ (2020–2021) పూర్తి చేసిన విద్యార్థులకు.. ►ఐపీఈ మార్చి 2021కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు.. వారి మార్కులు (ఫస్టియర్, సెకండియర్) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ►ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ►ఐపీఈ–మార్చి 2021/అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ► ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు. ►హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావాలి. ►విద్యార్థులంతా నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్), పర్యావరణ విద్య (ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో) క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి. ►ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పిన, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్కు హాజరుకావాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు.. ►2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో చేరి ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్లోకి ప్రమోషన్ ►కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ►ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు. ►ఐపీఈ–2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి. -
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఎంసెట్’ మాక్ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్లైన్ మాక్ ఎంసెట్ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత...లాగిన్ ID, Password ను ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్లైన్ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్ను పొందవచ్చు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాబట్టి పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఆశ్రయించారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని, ఇంటర్ మొదటి ఏడాది మార్కులే ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయని విద్యార్థులు అంటున్నా రు. రెండో ఏడాది ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో చదివామని చెబుతున్నారు. పైగా పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇంటర్లో కనీసం 50% మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుంటే తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అంటున్నారు. కాగా తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చిన సంగతి తెలిసిందే. తాజా విన్నపాలతో నోటిఫికేషన్ జారీచేసి కోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలని యోచిస్తుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిసింది. కరోనా థర్డ్వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. -
రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రత్యక్ష బోధనను రోజు విడిచి రోజు చేపట్టాలని.. నడుమ రోజుల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఇష్టమైతేనే భౌతికంగా తరగతులకు హాజరుకావొచ్చని, హాజరు నిబంధన ఏమీ అమలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు గురువారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులను ప్రారంభించాలని సూచించింది. విద్యార్థులకు ఒక రోజు ప్రత్యక్ష (ఆఫ్లైన్) బోధన చేపడితే.. తర్వాతి రోజు జూమ్, వీబాక్స్, గూగుల్ మీట్ వంటివాటి ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థుల నుంచి అంగీకారపత్రం (కన్సెంట్) కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. 75 శాతం హాజరు తప్పనిసరి కాదని తెలిపింది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా 70శాతం సిలబస్ నే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సిలబస్పై జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో అమలు చేస్తామని వెల్లడించింది. తరగతుల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆన్లైన్ బోధన, ఇతర సమాచారం కోసం లెక్చరర్లు, విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించింది. బడులు, కాలేజీలకు టీచర్లు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఈ నెల 25 నుంచి స్కూళ్లు, కాలేజీలకు హాజరుకానున్నారు. జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించనున్న నేపథ్యంలో.. ప్రత్యక్ష/ఆన్లైన్ బోధన కోసం టీచర్లు, లెక్చరర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ, ఇంటర్ బోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశాయి. ఇక స్కూళ్లలో జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులకే ప్రత్యక్ష బోధన నిర్వహిస్తారా? మిగతా తరగతులకూ చేపడతారా అన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కాగా జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయకుండా విద్యా బోధన ఎలా ప్రారంభిస్తారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1,658 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్ అకాడెమీస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిం ది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్(బీజీ ఇంటర్ సెట్–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ► ఏపీఎస్డబ్ల్యూఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు 2021–22. ► అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్ సెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ► వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. ∙విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్ సెట్లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయోసైన్స్ 15 ప్రశ్నలు, సోషల్ సైన్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్(కాంప్రెహెన్షన్ అండ్ గ్రామర్) 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ► ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ పరీక్ష ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ను ఎంచుకొని.. బీజీ ఇంటర్ సెట్లో మెరిట్లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు:ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021 ► పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు ► వెబ్సైట్: https://apgpcet.apcfss.in/Inter చదవండి: ఇంటర్తోనే.. కొలువు + చదువు డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించనున్నామని, ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 100 చెల్లించాలన్నారు. విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీ.జీవోవీ.ఐఎన్’ లేదా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. దరఖాస్తును ప్రింట్ తీసుకొని జూన్ 30వ తేదీలోగా సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు. ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించబోరని చెప్పారు. -
ఇంటర్ తర్వాత ఏంటి?
-
VIT Webinar: ఇంటర్ తర్వాత ఏంటి?
ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకుందామని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ఇంటర్మీడియట్ కోర్సు అయిపోయిన తర్వాత కెరీర్లో ముందుకు సాగాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంటర్ పూర్తైన తర్వాత కొంతమంది సంప్రదాయ కోర్సు డిగ్రీ వైపు మళ్లితే.. మరికకొందరు ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు వృత్తి విద్యా కోర్సులను ఎంచుకుంటారు. అయితే మనం ఎంచుకునే మార్గం సరైనదా కాదా అనే డౌట్ చాలామందికి వస్తుంది. అలాంటి వారి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మే 18న సాక్షి, VIT AP యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'కెరీర్ గైడెన్స్ వెబినార్'కు అటెండ్ అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెబినార్ అటెండ్ అవ్వండి.. మీ సందేహాలు తీర్చుకొండి. To Register Logon: https://www.arenaone.in/webinar/ -
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నా.. విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం నిలిపేసింది. ముంద స్తు షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇం టర్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నా యాలను పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్ పరీక్షలు లేకుండా మార్కులు వేయ డం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాక్టికల్ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాక్టికల్ ఏప్రిల్ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు. అందుకే ప్రాక్టికల్స్ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్స్కు బదులు మరేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఇచ్చి వాటినే ప్రాక్టికల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది. ఆందోళనలో 2,62,169 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సిన సైన్స్ కోర్సులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,62,169 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 48,026 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,287 మంది, జాగ్రఫీ విద్యార్థులు 557 మంది ప్రాక్టికల్స్కు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,58,814 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,73,523 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అయితే పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారనేది ఆసక్తిగా మారింది. కరోనా వ్యాప్తి కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంటర్ సిలబస్ను 30 శాతం తగ్గించడమే కాకుండా ఇంటర్ మొదటి ఏడాది పనిదినాలు 108కి కుదించారు. ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి తరగతులు గతనెల 18వ తేదీన ప్రారంభమైన తరగతులు మే 4 వరకు కొనసాగుతాయి. షెడ్యూల్ మొదటి సంవత్సరం తేదీ పరీక్ష 5 సెకండ్ లాంగ్వేజ్ 7 ఆంగ్లం 10 గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం 12 గణితం పేపర్ 1బీ, జీవశాస్త్రం, చరిత్ర 15 భౌతికశాస్త్రం, అర్ధశాస్త్రం 18 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్ 22 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ రెండో సంవత్సరం తేదీ పరీక్ష 6 సెకండ్ లాంగ్వేజ్ 8 ఆంగ్లం 11 గణితం పేపర్ 2ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం 13 గణితం పేపర్ 2బీ, జువాలజీ, చరిత్ర 17 భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం 19 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మేథ్స్ 23 మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలన్నీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మార్చ్ 24న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చ్ 27న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించనున్నారు. -
అవకాశాలున్నాయ్.. ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా ఐదారు నెలలు విద్యాసంస్థలు తెరుచుకోక ఆన్లైన్ బోధనతో తాపీగా సాగిన ఇంటర్మీడియట్ చదువులు ఇప్పుడు తరగతుల ప్రారంభంతో ఉరుకులు పరుగులు అందుకున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతోపాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్ ముగించి రివిజన్ చేయించే సన్నాహాల్లో పడ్డాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 4 సార్లు పరీక్ష నిర్వహణతో ఎంతో వెసులుబాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 పరీక్షలను 4 సార్లు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. కోవిడ్తో పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి జేఈఈని ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు నాలుగుసార్లు రాయవచ్చు. ఎన్నిసార్లు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది. 13 భాషల్లో 384 ప్రశ్నపత్రాలు జేఈఈ మెయిన్ను ఇంగ్లిష్, హిందీతో పాటు దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, ఉర్దూ, పంజాబీ, ఒడియా, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామీ భాషల్లో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నందున విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉండనుంది. ప్రాంతీయ భాషలో రాసేవారికి ఇంగ్లిష్ ప్రశ్నలు కూడా అందుబాటులో ఉంటాయి. జేఈఈలో బీఈ, బీటెక్లకు పేపర్–1, బీఆర్క్కు పేపర్–2ఏ, బీ, ప్లానింగ్కు పేపర్–2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 384 ప్రశ్నపత్రాలను ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 4 లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేసింది. ఎన్టీఏ ఈసారి జేఈఈ సిలబస్, పరీక్షల ప్యాటర్న్లో కూడా మార్పులు చేసింది. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలో 30 చొప్పున ప్రశ్నలుంటాయి. -
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టికల్స్కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబస్కు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు. 14 డిమాండ్లు పరిష్కరించండి కాగా, పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న 14 అంశాలను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు యాజమాన్యాలు మంత్రిని కోరాయి. ఫీజలు రాక ఏడాది నుంచి విద్యా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధనను విధించాలని కోరాయి. అన్ని తరగతులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. -
18 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు
సాక్షి, అమరావతి: ఈనెల 18 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్లైన్లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో జరుపుతామని ఆయన తెలిపారు. అలాగే, త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు. ఇక జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులను ఈనెల 11న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేశామని.. ఈ నెల 7 నుంచే దరఖాస్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయని.. దరఖాస్తుల స్వీకరణకు 17 చివరి తేదీ అని, అదే రోజు అడ్మిషన్లు కూడా పూర్తవుతాయని మంత్రి తెలిపారు. 18 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయన్నారు. త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కాగా, 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలు వచ్చే ఏప్రిల్, మేలో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. కరోనా కారణంగా 30 శాతం మేర సిలబస్ తగ్గించామన్నారు. సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకారం పోటీ పరీక్షలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే, 2020–21 విద్యా సంవత్సరం ఈ ఏడాది మే వరకూ కొనసాగుతుందన్నారు. యథావిధిగా ప్రాక్టికల్స్ ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఉండకపోవచ్చునంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక అడ్మిషన్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కరోనా నిబంధనలకనుగుణంగా ఫీజులు వసూలు చేయాలన్నారు. గతేడాది వసూలు చేసిన ఫీజులలో 30 శాతం రాయితీ ఇచ్చి, 70 శాతం మేర ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసినా, కరోనా మార్గదర్శకాలను పాటించకున్నా ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటి గుర్తింపు సైతం రద్దుచేస్తామని మంత్రి సురేష్ హెచ్చరించారు. వీటిని బేఖాతరు చేసే కళాశాలల అక్రమాలను తమ దృష్టికి తీసుకురావాలనుకున్న వారు 9391282578 వాట్సాప్ నెంబర్కు గాని, ourbieap@gmail.com మెయిల్కుగాని సమాచారమందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నెల 5న విజయవాడ గొల్లపూడిలోని నారాయణ కాలేజీలో తనిఖీలు చేశామని.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు ఇంటర్ అడ్మిషన్ల సమయంలో పదో తరగతి మార్కుల జాబితా, ఇతర పత్రాలను పరిశీలించి, తిరిగి విద్యార్థులకు ఇచ్చివేయాలని మంత్రి సూచించారు. అలా ఇవ్వని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీని కోరామన్నారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్ష ఫీజులు పెంచడంలేదని.. మొదటి సంవత్సరం పరీక్షకు రూ.500లు, రెండో ఏడాదికి రూ.680లు చెల్లించాలన్నారు. 11న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు ఈ నెల 11న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు చేపట్టనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయనున్నామన్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది లబి్ధదారులను ఈ పథకానికి ఎంపిక చేశామన్నారు. -
అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!
సాక్షి, అమరావతి: దేశంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ కార్యదర్శి అమిత్ఖరే ఇటీవల మీడియాకు వెల్లడించారు. కేంద్రం గతేడాది నూతన విద్యావిధానం–2020ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేర్వేరుగా ఉన్న ఉన్నత విద్యా విభాగాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రతిపాదించింది. ఈ క్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ)ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలో వివిధ ఉన్నత విద్యాకోర్సులకు జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 54 ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలకు వేటికవే ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించుకుంటున్నాయి. ఇకపై జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్ తదితర కోర్సులకూ ప్రతిపాదన మెడికల్ కోర్సులకు నీట్ను నిర్వహిస్తున్నట్టు.. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. ఇదే ప్రతిపాదనను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కూడా చేసినా చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. ప్రస్తుతం ఉన్నత విద్య కమిషన్ ఏర్పాటుతో మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) తదితర సంస్థలను కమిషన్లో విలీనం చేస్తున్నారు. దీంతో ఆయా కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష పెడతామని నూతన విద్యావిధానంలో కేంద్రం ప్రతిపాదించింది. అయితే రాష్ట్రాల నుంచి ఏ మేరకు సానుకూలత ఉంటుందనేది అనుమానమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని విద్యా సంస్థల సీట్ల భర్తీ కష్టమే.. జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష వల్ల ఇక ఎంసెట్ వంటివి ఉండవు. కేవలం జాతీయస్థాయి పరీక్షల్లో వచ్చే మెరిట్ ఆధారంగానే రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు చాలా రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. మెడికల్ కాలేజీల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల నీట్ ద్వారా సీట్ల భర్తీ సాధ్యమవుతోంది. అయితే వందల సంఖ్యలో కాలేజీలు ఉండే సాంకేతిక వృత్తి విద్యాకోర్సులకు ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, మైనార్టీ కాలేజీలు తమ ప్రవేశ పరీక్షలను తామే నిర్వహించుకుంటున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి రకరకాల నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల స్థాయిలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోనివ్వాలని చెబుతున్నారు. ఇలా అయితేనే సీట్ల భర్తీకి వీలుంటుందని, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షతో సా«ధ్యం కాదని పేర్కొంటున్నారు. విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు వేర్వేరు ప్రవేశ పరీక్షలను రాయాల్సి వస్తోంది. వీటికి సన్నద్ధమవ్వడం, దరఖాస్తు చేసేందుకు రుసుములు చెల్లించడం వారిని వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. దీనివల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడితోపాటు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి జాతీయస్థాయిలో ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడమే దీనికి పరిష్కారమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు రాస్తున్న ప్రవేశపరీక్షలు ఇవీ.. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ► జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, గేట్, ఐఐటీ జామ్, యూపీఎస్ఈఈ, బీసీఈసీఈ, ఏసీఈఈ, కేఈఏఎమ్, డబ్ల్యూబీజేఈఈ, సీవోఎంఈడీకే యూజీఈటీ, టీఎస్ఎంసెట్, సీయూసెట్, ఏపీఎంసెట్, ఓజేఈఈ, ఎల్పీయూఎన్ఈఎస్టీ ► కేసీఈటీ, జేకేసీఈటీ, సీజీపీఈటీ, సీయూఎస్ఏటీ, జీయూజేసీఈటీ, జీసీఈటీ, యూకేఎస్ఈఈ, ఐఐఎస్సీ, ఐఐఎస్టీ, ఐఐఎస్ఈఆర్, టీఏఎన్సీఈటీ, టీఎన్ఈఏ, ఏపీఈసెట్, టీఎస్ఈసెట్. మెడికల్ ప్రవేశ పరీక్షలు.. ► నీట్, ఎయిమ్స్, జిప్మర్ ఎంబీఏ ప్రవేశపరీక్షలు.. ► క్యాట్, మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, జీఎంఏటీ, ఎన్ఎంఏటీ, ఆత్మ, ఐబీశాట్, స్నాప్, ఐఐఎఫ్టీ, కేఎంఏటీ (కేరళ), కేఎంఏటీ (కర్ణాటక), ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్. లా ప్రవేశపరీక్షలు.. ► లా, క్లాట్, ఏఐఎల్ఈటీ, ఏఐబీఈ, ఎల్శాట్, ఏపీలాసెట్, టీఎస్లాసెట్, ఎంహెచ్సెట్లా వర్సిటీ ప్రవేశపరీక్షలు.. ► బిట్శాట్, ఎస్ఆర్ఎంజేఈఈ, యూపీఈఎస్ఈఏటీ, వీఐటీఈఈఈ, ఎంయూసెట్, పీటీయూసెట్, బీవీపీసెట్, సింబయాసిస్ సెట్, ఎస్ఏఏటీ, కేఐఐటీఈఈ, ఏఎంయూ, పీఈఎస్ఎస్ఏటీ, ఐపీయూసెట్, జేఎన్యూఈఈ, బీహెచ్యూ సెట్, అలహాబాద్ వర్సిటీ సెట్, ఢిల్లీ యూనివర్సిటీ సెట్, ఏయూసెట్ ఫార్మసీ ప్రవేశపరీక్షలు.. ► జీప్యాట్, ఎంహెచ్సీఈటీ, పీయూసీఈటీ అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలు.. ► ఐసీఏఆర్ ఏఐఈఈఏ, ఓయూఏటీ, ఎంపీపీఏటీ, జేఈటీ అగ్రికల్చర్, జేసీఈసీఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది.. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ఎంపికలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దీంతో మెరిట్ విద్యార్థులతో రిజర్వేషన్ విద్యార్థులకు ఇబ్బందే. కేవలం ప్రవేశ పరీక్ష నిర్వహించి కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు రాష్ట్రాల పరిధిలోకి తీసుకువస్తే ఇబ్బంది ఉండదు. – డాక్టర్ డి.మురళీధర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోటెక్నాలజీ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఫీజుల భారం తగ్గుతుంది.. ఇంజనీరింగ్ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఫీజుల భారం తగ్గుతుంది. నాణ్యత కలిగిన కళాశాలలే మనగలుగుతాయి. విద్యార్థులకు ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇతర ప్రాంతాల్లోని మంచి కళాశాలల్లో చేరే అవకాశం వస్తుంది. ఇది మంచి నిర్ణయమే. అయితే.. విద్యార్థులకు తలెత్తే ఇబ్బందులపై ముందుగా అధ్యయనం చేయాలి. – ప్రొఫెసర్ జీఎన్ ప్రదీప్కుమార్,సివిల్ ఇంజనీరింగ్ విభాగం, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ