Lakshmi’s NTR
-
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్ఆర్పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్కుమార్, రంగస్థల నటుడు -
ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు. కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు(09-08-2019) ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతున్నాడు వర్మ. టైటిల్తోనే వివాదానికి తెర తీసిన వర్మ నిజంగా వివాదాలకు తావివ్వకుండానే ఈ సినిమా రూపొందిస్తున్నాడేమో చూడాలి. The most non controversial film “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am — Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2019 -
వస్తానన్నా.. వచ్చా : రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నంత పనీ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు ఆంధ్ర ప్రదేశ్లో అడ్డంకులు ఎదురుకావటంతో విజయవాడలోని పైపులరోడ్డులో ప్రెస్మీట్ పెట్టేందుకు వర్మ ప్రయత్నించాడు. కానీ పోలీసులు అడ్డుకొని వర్మను అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత కూడా పైపుల రోడ్డులో ప్రెస్మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మ, ఎండ తీవ్రత కారణంగా ఫిలిం చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్లో విడుదల కానుంది. I finally on Paipula road in Vijaywada garlanded NTR in NTR circle అనుకున్నది చేసేసా.. https://t.co/tJUI7mTCfX 💪💪💪 — Ram Gopal Varma (@RGVzoomin) 28 May 2019 -
పసుపు–కుంకుమ తీసుకుని ఉప్పు–కారం ఇచ్చారు
భీమవరం: ఏపీ మహిళలు పసుపు–కుంకుమ తీసుకుని టీడీపీకి ఉప్పు–కారం ఇచ్చారని ప్రముఖ సినీదర్శకుడు రామ్గోపాల్వర్మ చెప్పారు. ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేయగా కొంతమంది అడ్డుకున్నారని.. అందువల్లనే ఎన్టీరామారావు ఆగ్రహించి చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు. ఏపీలో సైకిల్కు పంక్చరైనందునే తాను కారులో వచ్చినట్టు చమత్కరించారు. ఎన్టీఆర్ జీవితం చివరి అంకంలో జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశాను తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని వర్మ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏనాడూ తనకున్న పవర్ను దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకోలేదన్నారు. -
ప్రజాసేవ చేయను: వర్మ
సాక్షి, భీమవరం: రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైకిల్ టైరు పంక్చర్ అయింది. అందుకే కారులో వచ్చామ’ని చమత్కరించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్కు పంక్చర్ పడిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్లో విడుదలకానుంది. -
చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందే చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. చిత్రం విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్కు పంక్చర్ పడిందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఫిలిం చాంబర్హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని సన్నివేశాలు 25 ఏళ్ల కిందట జరిగిన వాస్తవ సంఘటనలు అని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఆ సంఘటనల్లో పాల్గొన్న ప్రధాన పాత్రలు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారన్నారు. అప్పట్లో మీడియా లేకపోవడంతో ఎన్టీఆర్ జీవితంలో చివరిరోజుల్లో జరిగిన సంఘటనలపై రకరకాల కథలు వినిపిస్తున్నాయన్నారు. నిజంగా ఆ సమయంలో ఏం జరిగిందో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించినట్లు చెప్పారు. ఒక వ్యక్తిని నమ్మి ఎన్టీఆర్ పెద్ద తప్పు చేశారన్నారు. ఆ వ్యక్తే ఎన్టీఆర్ను ఏం చేశారో.. థియేటర్లో చూడవచ్చన్నారు. తాను కాంట్రవర్సీని మాత్రమే సినిమాగా తెరకెక్కించానని, చంద్రబాబు సినిమాను కాంట్రవర్సీ చేశారన్నారు. ఎన్టీఆర్ వెనుక కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉద్దేశం తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని వర్మ అన్నారు. ఈనెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నిజజీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో తానీ సినిమా తీశానని చెప్పారు. ఏపీలో చిత్రం విడుదల కాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్, కోర్టులు ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రం విడుదలైందన్నారు. ప్రస్తుత తన ప్రెస్మీట్కు పోలీసులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
అందుకే చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్దుకున్నారు : వర్మ
-
31న ఆ నిజాలేంటో చూపిస్తాం : వర్మ
సాక్షి, విజయవాడ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో నిజం చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ కొంతమందికి నచ్చక సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 75 ఏళ్లు రాజుగా బతికిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి ఈ సినిమా తీసినట్లు వర్మ తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : వర్మ ఆయన మరణానికి కారణమైన వారే 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫొటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లడం పెద్ద వెన్నుపోటులా అనిపించిందన్నారు. తాను సినిమా తీస్తే చంద్రబాబు వివాదం చేశారన్నారు. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలైందని, కానీ ఇక్కడ సైకిల్ జోరువల్ల విడుదల చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సైకిల్కు పంక్చర్ అవ్వడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలు భయటపెట్టడం మినహా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. జనసేన ఓటమిపై స్పందిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ బిజీ వల్ల పవన్ కల్యాణ్ గురించి అంతగా పట్టించుకోలేదన్న వర్మ.. జనసేనతో పోలిస్తే చిరంజీవి ప్రజారాజ్యం బాహుబలని అభిప్రాయపడ్డారు. ‘తన తదుపరి చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అని తెలిపిన వర్మ.. వెన్నుపోటు, అబద్దాలు, వైఎస్ జగన్, లోకేష్లే చంద్రబాబు దారుణ ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు. -
31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : వర్మ
-
దీని వెనుక ఎవరున్నారో తెలుసు : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోవటంపై స్పందించారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంక్షల కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను పోలింగ్ పూర్తి కావటంతో మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. గతంలో కోర్టు.. పోలింగ్ తరువాత విడుదల చేయవచ్చని ఉత్తర్వులు ఇవ్వటంతో రిలీజ్కు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తాజాగా ఎలక్షన్ కమీషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు మరోసారి బ్రేక్ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలపటంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోర్టు తీర్పుతో పాటు ఇచ్చిన ఈసీ లేకను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ, న్యాయపోరాటనికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు సినిమా విడుదలను అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత శక్తులెవరో అందరికీ తెలుసంటూ ట్వీట్ చేశారు. Point 8C in EC ‘s below letter combined with AP high court judgement is why we planned release today .we going to court against contradictory stand of EC now to stop film after giving permission to release for reasons best known to it and we all know the force behind responsible pic.twitter.com/TeI0XH3blT — Ram Gopal Varma (@RGVzoomin) 1 May 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్టేనా!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి ముగియటంతో ఇక రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్టే అని భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించటం లేదు. రేపు సినిమా విడుదల చేయనున్నట్లు సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకులు రాంగోపాల్ వర్మలు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని ఈ నెల 25న చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మే1 సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే ఈ ఏప్రిల్ 10వ తేదిన సినిమా విడుదలను ఆపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఉత్తర్వులు అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ, వాయిదాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. రేపే విడుదల
తిరుపతి తుడా /సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్రెడ్డి సాక్షికి తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయితే ఎన్నికల్లో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా ఎన్నికల వరకు చిత్రాన్ని ఏపీలో విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశాలు జరీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాకేష్రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్కు దగ్గరకావడానికి గల కారణాలు, రాజకీయంగా నమ్మిన వారే ఆయనను మోసం చేయడం, పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడవడంతో మానసిక బాధతో ఆయన అనారోగ్యం పాలవ్వడం, మృతి చెందే సమయంలో ఆయన పడ్డ క్షోభను రామ్గోపాల్ వర్మ ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు. భావవ్యక్తీకరణకు అడ్డుపడిన ఆపద్ధర్మ సీఎం : విజయచందర్ విజయవాడలో రామ్గోపాల్వర్మ విలేకరుల సమావేశం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు, ఆయన చేసిన తప్పేమిటి? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార విభాగం ఏపీ సమన్వయకర్త టీఎస్ విజయచందర్ ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదా... మరి సెన్సార్ బోర్డు ఉన్నదెందుకు? అని నిలదీశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కాల రాస్తున్నారని, భావవ్యక్తీకరణకు కూడా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. రాంగోపాల్వర్మను అడ్డుకున్న విధంగానే భవిష్యత్లో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ను ఏపీలోకి రాకుండా అడ్డుకోవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినీ డైరెక్టర్ విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితులలో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన చెందారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సారు బోర్డు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎన్నికల సంఘంతో పాటు కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని గుర్తు చేశారు. మరి అలాంటి చిత్రానికి చంద్రబాబు అడ్డుపడటం దేనికి? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవహారాలు చూస్తుంటే ఆయన మనో నిబ్బరం కోల్పోయినట్లు కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పాలన కావాలని ప్రజలంతా భావిస్తున్నారని, మే 23న వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు. రాంగోపాల్ వర్మను అడ్డుకోవడం తగదు: సీపీఎం మధు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. సినిమాపై సెన్సార్ బోర్డు, న్యాయస్థానాలు ఆంక్షలను విధించలేదని అయినా శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్ను సాకుగా చూపి పోలీసులు ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చంద్రబాబు గారూ...! రాంగోపాల్వర్మ చేసిన తప్పేంటి...? ట్విట్టర్లో ప్రశ్నించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: విజయవాడలో విలేకరుల సమావేశం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందని, పోలీసులను బంట్రోతుల కన్నా అధ్వానంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ‘ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’ అని జగన్ సూటిగా ప్రశ్నించారు. నిజాన్ని దాచలేరన్న విషయం చంద్రబాబు గ్రహించడం లేదు జగన్ గారూ: రామ్గోపాల్ వర్మ నిజాన్ని ఎప్పటికీ దాచలేమన్న విషయాన్ని ఈ వయసులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రహించలేక పోతున్నారని ప్రఖ్యాత దర్శకుడు రామ్గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు గారూ... రామ్గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?’ అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్కు వర్మ ప్రతి స్పందించారు. ‘జగన్ గారూ... నిజాన్ని దాచలేరన్న విషయాన్ని చంద్రబాబు ఈ వయసులో కూడా గ్రహించలేక పోతున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. -
వర్మ చిత్రానికి బాబు ‘బర్మా’?!
వర్మ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ను ఆంధ్రలో విడుదల కాకుండా చంద్రబాబు చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం.. పత్రికా మాధ్యమాలపైన, ప్రతిపక్ష చానళ్లపైన ప్రభుత్వాధినేత విరుచుకుపడుతూ వాటిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడనేందుకు నిదర్శనం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకోవటం ఎన్టీఆర్కు బాబు వెన్ను పోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని గుర్తించగలిగినప్పుడే.. ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు. పాత్రపోషణ చాలా కష్టం. అందులోనూ రాజకీయాల్లో మరీ కష్టం! ప్రాచీన కవి పిడపర్తి బసవనారాధ్యుడు ‘అహంకారం’ అనే మృగాన్ని నాయకుడనే వాడు ఎలా తొలగించుకుంటే సుఖపడతాడో లేదా ప్రజల మన్ననకు ఎలా పాత్రుడవుతాడో ‘ప్రభులింగలీల’లో వేదాంత సారాన్ని విప్పి చెప్పాడు. ఇంతకూ పాలకుడనేవాడు తన శరీరంలోనే తన మనస్సు పొరలలోనే గూడుకట్టుకుని జీవిస్తున్న ‘అహంకార’మనే మృగాన్ని ఎలా తొలగించుకోవాల్సి ఉంటుందో ఇలా చెప్పాడు: ‘‘అయ్యా, ఈ శరీరం అనే అడవిలో ఒక మృగం ఎప్పుడూ దాక్కునే ఉంటుంది. దాని పేరే అహంకారం (తనువను కానలో తావ లంబైయుండు/అరయ అహంకారమను మృగంబు)’’ అన్నాడు. మరి దాన్ని సాగనంపడం ఎలా అని ప్రశ్నించుకున్న పిడపర్తి కవికి ఒక ఆలో చన, ఒక పరిష్కారం దొరికిందట. అహంకారం తొలగించుకోవాలంటే ఒక ‘మందు’ కనిపెట్టాడాయన. ఆ మందు ఏది, ఎక్కడ దొరుకుతుంది అంటే ‘వివేకం’ అనే వేటగాడి వద్ద ఉంటుందట. వేటగాడి వద్ద ఉండాల్సింది ‘కత్తి’ కదా ‘వివేకం’ అంటాడేమిటి అనుకుంటున్నారా? పొరపడకండి, ఆ వేటగాడు ఎలాగూ వివేకి కాబట్టి ‘జ్ఞానం’ అనే అగ్నిలో వండి ‘అహంకార’ మృగాన్ని కూల్చి మరీ వివేకం ప్రదర్శిస్తాడట! ఇంతకీ ఆ వేటగాడు ఈ విద్యను తన గురువైన శివుడి వద్ద నేర్చుకున్నాడట. తన మూడు కన్నుల్లో (ముక్కంటి) శివుడు ఏ కన్ను విప్పాడో గానీ శివుడి శిష్యుడైన వేటగాడు ఎలాంటి జంకూ లేకుండా మూడో కన్ను విప్పి ఆ అహంకార మృగాన్ని కాస్తా కూల్చేశాడు. అలాంటి వేటగాళ్లు దుష్టపాలకుల విషయంలో మనకూ అవసరమే కదా! భారత, రామాయణాదులన్నీ దుష్ట శిక్షణ గురించి, శిష్ట రక్షణ గురించి వేల సంవత్సరాలుగా విసుగు లేకుండా బోధిస్తున్నవే, తల మొత్తేలా మొత్తుకుంటున్నవే! కథల్లో, కళల్లో, చిత్రాల్లో, వ్యంగ్య చిత్రాల్లో, చలన చిత్రాల్లో, వీధి నాటకాల్లో, బుర్రకథల్లో వీర గాధల ద్వారా అనాదిగా మనం వింటూ వస్తున్న ప్రబోధ రచనలే. మానవుడి లోని ఈ అహంకార, దురహంకార లక్షణాలన్నీ పలువురు చిత్రనిర్మా తలు, చిత్రదర్శకులు, స్త్రీ, పురుష నటులూ ఎండగడుతూ అసంఖ్యాక ప్రేక్షకులకు విజ్ఞాన ప్రబోధం చేసి కర్తవ్యాన్ని కళ్లముందుంచుతున్నవే. భారత రామాయణ, భాగవత పురాణ గాథలకు కొంత మసాలా కలిపి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కీర్తి ప్రతిష్టలు పొంది, తుదకు తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకను ప్రజాకంటక పాలకులకు వ్యతి రేకంగా ఎత్తి సమున్నత విజయాన్ని సాధించినవారు ఎన్టీ రామారావు! అంతవరకూ కాంగ్రెస్ ‘తెర’లో ఉన్న బాబు ఎవరి ప్రోత్సాహకంతోనో, మరెవరి ప్రోద్బలంతోనో ఎన్టీఆర్ దగ్గరకు జరిగి, ఆ ఇంటిలోనే ఓ ఇంటి వాడై, మామ అయిన ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి సీటు నుంచి కూలదోసి వెన్నుపోటు రాజకీయం ద్వారా అందలమెక్కిన గాథ అంతా లోకవి దితం. లోకానికి తెలిసిన ఈ బాబు బాగోతాన్ని తెరకెక్కించిన ప్రసిద్ధ దర్శకుడు రాం గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో ముందుకు వచ్చారు. ఈ బయోపిక్ వెలుగు చూడటానికి ముందు ఎన్టీఆర్ కొడుకు, ప్రసిద్ధ నటుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ‘కథా నాయకుడు’, ‘మహానాయకుడు’ అని రెండు బయో పిక్కులు తీశారు. ఈ రెండు చిత్రాలలోనూ ఏదీ ‘పిక్క’ లేదని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడం ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు తల వంపులు తెచ్చినంత పనైంది. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం దివంగతురాలైన పిమ్మట ఆయన విద్యావంతురాలైన లక్ష్మీపార్వతిని లక్షలాదిమంది తిరుపతి ప్రేక్షకుల సమక్షంలో పెళ్లాడింది మొదలు ఎన్టీఆర్పై చంద్రబాబు సాగిం చిన కుట్రలకు హద్దూపద్దూ లేదు. ఈ మొత్తం పూర్వ రంగం నుంచి కథా గమనాన్ని ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ మరణానికి పూర్వం, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా, పదవినుంచి త్రోసిరాజని తాను పదవిలోకి రావడానికి అల్లిన అబద్ధ ప్రచారాలు, ఎన్టీఆర్ను వెన్నుపోటు ద్వారా పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు పన్నిన కుట్రలు, అందుకు పార్వతి వ్యక్తిత్వాన్ని కించపరచ డానికి బాబు చేసిన కుట్రలు, కుహకాలు రాంగోపాల్ వర్మ చిత్రానికి పోపు అందించాయి. ఈ పురాగాథ చలన చిత్రం రూపంలో బయోపిక్గా బట్టబయలయితే బాలకృష్ణ రెండు బయోపిక్ పరువుప్రతిష్టలు (ఎన్టీఆర్ చరిత్రలో ఖూనీ అయిన సత్యాలు) గంగలో కలిసిపోతాయన్న భీతి ఆందోళన చంద్రబాబు మనస్సును ముప్పెరగొని, కకావికలు చేసి ఉంటుంది. బహుశా బాబులో చల్లారని అంతరంగ సంక్షోభమే ఆంధ్ర ప్రాంతంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాకుండా అడ్డుకోడానికి కారణం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంకో ముఖ్యాంశం– ఫిలిం సెన్సార్ బోర్డు ఆటంకాలు లేవు, ఎలెMý‡్షన్ కమిషన్ అయినా వర్మ తీసిన చిత్రం విడుదలను ఈ ఉద్రేక వాతావరణం మధ్య తాత్కాలికంగా నిలుపు చేసిందేగానీ అధికారికంగా నిషేధించలేదు. అయినా తెలుగు ప్రజలలో దాదాపు సగంమంది తెలంగాణలో వర్మ తీసిన బయోపిక్కు ఆనందాతిశయంతో ఆమోద ముద్ర వేశారు. ప్రజాముద్ర అన్నా, ప్రజా తీర్పు అన్నా అలా ఉండాలి. ప్రజల ఓటింగ్ ఫలితాలు ఏ ఎన్నికల సంఘ నిబంధనలకూ, ఏ సెన్సార్ నిబంధనలకూ అందేవి కావు, కట్టుబడేవీ కావు. కట్టుబడి ఉండాలని కోరు కోవటం గాడితప్పి అన్నిరకాల అవి నీతికి అలవాటుపడి అందలమెక్కిన నేటి రాజకీయ పాలక శక్తులకే అల వాటైన సంప్రదాయమని మరచి పోరాదు. పైగా భారత కేంద్ర ఎన్నికల సాధికార సంఘం ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిలోని అయిదవ అధ్యాయం (పే. 31–43) దేశమంతటా ఎన్నికల నిర్వహణ పరిపూర్తి అయి, నూతన ప్రభుత్వాలు అధికారం చేప ట్టేదాకా ఏ ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వమూ లేదా సీఎంలూ, మంత్రులూ మధ్యలో ‘కొత్త పథకాలను ప్రకటించడంగానీ, ద్రవ్య సంబంధమైన ఆర్థిక, పరిపాలనా సంబంధమైన నిర్ణయాలు ప్రకటించటంగానీ’ పూర్తిగా నిషిద్ధమని పాలకులను, అధికారులనూ ఆదేశించింది. అలాగే ఆర్థికపరమైన గ్రాంట్లనుగానీ, పునాదిరాళ్లు వేయడంగానీ, రోడ్ల నిర్మా ణంగానీ, మంచినీళ్ల సదుపాయం కల్పిస్తామనిగానీ ఎలాంటి హామీ లనూ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉండగా ఇవ్వరాదని ఆ ఆదే శంలో స్పష్టం చేసింది. అలాగే 19 (6వ అధ్యాయం)లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దశలో ‘ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ఖజానా నుంచి పాలకులు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు విడుదల చేయరాదని, సొంత ప్రచార హోర్డింగ్లు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోల ప్రదర్శన విష యంలో కూడా ఇదే వర్తిస్తుందని ఆదేశించింది. తన పాలన అవసాన దశలో ఉన్న సమయంలో బాబు బరితెగించి తనకు పడకపోచ్చని భావి స్తున్న ఓట్లను, సీట్లనూ ఆధునిక టెక్నాలజీ లోని మాయ మర్మాలన్నిం టినీ వినియోగించి తారుమారు చేయించే యత్నాల (ఐటీ గ్రిడ్స్) ఆధా రంగా, 2016లో అమెరికా పర్యటించినప్పుడే ప్రారంభించినట్లు ఆయన సన్నిహితులు కొందరి ద్వారా ఇప్పుడు తెలియవచ్చింది: ‘అక్కడ, నేను 2019 కోసం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను’ అని ఆయన అన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనితో ట్యాంపరింగ్కి బాబే పురోహితుడా అనే అనుమానాలు వ్యాప్తిలో ఉంటున్నాయి. ముంచుకొస్తున్న ఓటమి భయం కూడా పీడిస్తున్నందున బాబు తీసుకున్న తాజా నిర్ణయం– మీడియాపై విరుచుకుపడటం. వర్మ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ను ఆంధ్రలో విడుదల కాకుండా చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం ఇందుకు నిదర్శనం. వర్మ విజయవాడలో పత్రికా గోష్టిని అడ్డుకోవటం కోసం ఎన్నికల కోడ్ను కూడా విస్మరించి పోలీసుల్ని ప్రయోగించటం గన్నవరం విమానాశ్రయంనుంచే వెనక్కి హైదరాబా ద్కు బలవంతంగా పంపించివేయటం! అయినా ఈసీ వర్మ విషయంలో టీడీపీ ప్రభుత్వ వ్యవహారంపై సహితం కరకుగా వ్యవహరించకపో వడం చూస్తుంటే ప్రజలలో ఉన్న ఒక అనుమానాన్ని బలపర్చకపోయినా లోలోపల తొలగని ఒక శంకను మాత్రం–తీర్చలేకుండా ఉంది అది– బాబు బరితెగించి అన్ని కేంద్రీయ సంస్థల్నీ ధిక్కరించి, రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్పటికీ, బీజేపీలో మిగిలి ఉన్న పై స్థాయిలోని కొందరు ‘మిత్రుల’తో ఎక్కడో, ఏమూలనో బాబుకున్న సన్నిహిత సంబంధాలు ఇంకా తొలగ లేదని, కొనసాగుతూనే ఉండి ఉండాలన్న భావన లీలామాత్రంగా ప్రజల మనస్సుల్లో దోబూచులాడుతూనే ఉంది. సాంఘిక సంస్కరణల పూర్వ రంగంలో గతంలో దూసుకువచ్చిన ఎన్నో సినిమాలు, శక్తివంతమైన డాక్యుమెంటరీలూ ఉన్నాయి. వాటిలో కొన్ని స్వతంత్ర భారత పాలకులు ముందు నిషేధించి, తరువాత విడు దల చేసినవీ ఉన్నాయి. దీపా మెహతా ‘ఫైర్’ చిత్రం, ‘ది డావెన్సీ కోడ్’ (2006), ‘ఆరక్షణ్’ (2011) చిత్రాలు ఈ కోవలోనివే. ఇంతకూ బాబుకు ఒకటే ప్రశ్న: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకో వటం ఎన్టీఆర్కు బాబు వెన్నుపోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని ఆయన గుర్తిం చగలిగితే ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు, రేపటి నిజాన్ని చెవులారా విని, కళ్లారా చూసు కుని ఆయనే చెప్పుకున్నట్లు తాను ‘ఓడినా ఫర్వాలేదు.. పెళ్లాం, కొడుకు, మనవడు ఉన్నారు’ కాలక్షేపానికి! మనకు సినిమాల్లో ఏవీఎస్ అనే దివంగత ప్రసిద్ధ హాస్యనటుడు తనకూ ఏదో ఒక తృప్తి కలిగిందనడానికి వ్యంగ్యంగా అలా ‘నాకూ ‘తుత్తి’ ఉంది’ అంటూండేవాడు. పాత్ర పోషణ చాలా కష్టం, అందులోనూ రాజకీయాల్లో మరీనూ!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా?
సాక్షి, హైదరాబాద్ : విజయవాడలో మీడియా సమావేశం పెట్టకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని అర్థమా? విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? అని వర్మ ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఏయిర్ పోర్ట్ సెక్యూరిటీతో సంబంధంలేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ అధికారంతో తనను ఏయిర్ పోర్ట్లో ఆపారని వర్మ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ.. ఏపీలో ప్రెస్ మీట్కు కూడా అనుమతి ఇవ్వడం లేదంటే..మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెడతానంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా గురించి ఇప్పటికే అంతా చెప్పానని, కొత్తగా చెప్పేది ఏమి లేదన్నారు. ‘సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని అడిగినా పర్మిషన్ లేదంటున్నారు. పై అధికారులతో మాట్లాడతాం అంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా? లక్ష్మీస్ ఎన్టీఆర్ మే 1న విడుదల అవుతంది. మేం ఎలా ప్రమోషన్ చేసుకోవాలి? ఏపీకి రావాలంటే వీసా తీసుకోవాలా?’ అని వర్మ ప్రశ్నించారు. -
బాబు అది అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం : వర్మ
సాక్షి, హైదరాబాద్ : తన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకి వర్మ చేసిన తప్పేంటని వైఎస్ జగన్ చేసిన ట్విట్కు వర్మ స్పందించారు. ‘జగన్ గారు.. చంద్రబాబుకు ఇంత వయసు వచ్చిన నిజాన్ని ఎవరూ దాచలేరన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని వర్మ ట్విట్ చేశారు. చదవండి : ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్ జగన్ -
ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చదవండి : బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం? రామ్గోపాల్ వర్మ ప్రెస్ మీట్కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం?
నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. విజయవాడకు రాకూడదా? ఎవరితోనూ మాట్లాడకూడదా? హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం? – ట్విటర్లో రామ్గోపాల్ వర్మ సాక్షి, అమరావతి బ్యూరో, హైదరాబాద్ : బెజవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. సర్కారు తీరును చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకొనే పరిస్థితి నెలకొంది. రామ్గోపాల్, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ‘అసలు కథ’ అనేది ఉప శీర్షిక. రాకేశ్ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్ అయింది. అంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ అనుమతితో తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్లో మే1న రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆదివారం ప్రెస్మీట్ నిర్వహించాలనుకున్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి. హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు గన్నవరం చేరుకున్నారు. అంతలోనే నోవాటెల్లో ప్రెస్మీట్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారన్న విషయం తెలిసింది. దీంతో హోటల్ ఐలాపురంలో ప్రెస్మీట్కు ఏర్పాట్లు చేయబోగా.. అక్కడ కూడా నిరాకరిస్తూ సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మా చిత్ర బృందంతో నోవాటెల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్రెస్మీట్ నిర్వహించాలని నిర్ణయించాం. కానీ ఆ హోటల్ వాళ్లు, ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో అనుమతి నిరాకరించారు. మిగతా చోట్ల ప్రయత్నించినా అన్ని హోటళ్లు, క్లబ్బుల మేనేజ్మెంట్లు మనందరికీ తెలిసిన ఓ వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు. దీంతో పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడిరోడ్డు మీద ప్రెస్మీట్ నిర్వహించబోతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు, నా అభిమానులు, మీడియాను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా’ అని వర్మ ట్విటర్లో ట్వీట్ చేశారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అడ్డగింపు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి దర్మక నిర్మాతలు వర్మ, రాకేష్రెడ్డి అతని స్నేహితులు పైపుల రోడ్డు వైపు మధ్యాహ్నం 12.20 గంటలకు కారులో బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే బెజవాడ పోలీసులు వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. పైపుల రోడ్డులో ప్రెస్మీట్ పెట్టడానికి వీల్లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున తిరిగి హైదరాబాద్కు వెళ్లాలని కోరారు. అందుకు వర్మ ససేమిరా అన్నారు. తాను ప్రెస్మీట్ నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా మరో కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి లాంజ్లో ఉంచారు. అక్కడ ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్కు విమానంలో పంపించే ప్రయత్నం చేయగా, అందులో టికెట్లు దొరక్కపోవడంతో రోడ్డు మార్గంలో తరలించాలని చూశారు. తాను రోడ్డు మార్గంలో ప్రయాణం చేయనని వర్మ తేల్చి చెప్పడంతో రాత్రి 7.20 గంటలకు ఇండిగో విమానంలో వారిని హైదరాబాద్కు పంపించారు. ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్డే విమానాశ్రయం లాంజ్లో పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న వర్మ స్వయంగా ట్విటర్లో తన వీడియోను షేర్ చేశారు. ‘నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. మా కార్లను ఆపి, మమ్మల్ని బలవంతంగా వేరే కార్లలో ఎక్కించారు. విజయవాడకు రావడానికి వీలులేదు అని వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి విమానాశ్రయంలో పడేశారు. ఎందుకు ఇలా చేశారు? పోలీసులు చట్టపరంగా వ్యవహరించరా? వారికి బాధ్యత లేదా? విజయవాడకు రావడానికి వీలులేదు, ఏ హోటల్లోనూ ఉండటానికి వీలు లేదు.. అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను, నా నిర్మాత ఎంత అడిగినా పోలీసులు సమాధానం చెప్పకుండా ఇలా మమ్మల్ని విమానాశ్రయంలో పడేశారు. హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. అప్డేట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని వర్మ ట్వీట్ చేశారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్డే అని నా అభిప్రాయం. కోర్ట్, ఎలక్షన్ కమిషన్ వల్ల మా సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయడం కుదర్లేదు. అన్నీ అయిపోయి సినిమా రిలీజ్ చేయడానికి ప్రెస్మీట్ పెట్టడానికి విజయవాడ వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈవెంట్ కోసం నిర్మాత రాకేశ్ రెడ్డి నోవాటెల్ హోటల్ బుక్ చేశారు. వాళ్లు చివరి నిమిషంలో వీలు లేదని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఐలాపురంలో చేద్దామనుకుంటే వాళ్లూ అడ్వాన్సు తీసుకొని క్యాన్సిల్ చేశారు. ‘ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు మీద ప్రెస్మీట్ నిర్వహిస్తాను’ అంటూ నేనో ట్వీట్ పెట్టాను. మేం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే పోలీసులు దార్లో మమ్మల్ని ఆపేసి, బయటకు లాగి వేరే కార్లో బలవంతంగా ఎక్కించి ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లారు. ‘రోడ్డు మీద ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది’ అని చెప్పారు. అప్పుడు ఆ ప్రెస్మీట్ను అనుమతించకూడదు. అంతేకానీ మమ్మల్ని కార్లో ఎక్కించి ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లడమేంటి? విజయవాడ రాకూడదు.. ఎక్కడా ఏ హోటల్లో ఉండకూడదు.. హైదరాబాద్ వెళ్లి తీరాలి.. అనేలా బలవంతం చేశారు. 7 గంటల పాటు మమ్మల్ని బయటకు రాకుండా ఓ గదిలో కూర్చోబెట్టారు. ఎవ్వర్నీ కలవనీకుండా చేశారు. తర్వాత విమానం ఎక్కించి హైదరాబాద్ పంపించేశారు. దీనికి అర్థమేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిమ్మల్ని అలా చేయమని ఎవరు చెప్పారు? ఎవరి ఆదేశాలివి? మాకిచ్చిన నోట్లో కేవలం ప్రెస్ మీట్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని వివరించారు తప్పితే, మమ్మల్ని ఎందుకు పంపించేస్తున్నారన్న విషయం ఎక్కడా ఇవ్వలేదు. ఇదంతా రివేంజ్ డ్రామాలా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? అందరూ సినిమా చూశారు. చాలా మంది పైరసీలో చూశారు. నేనంత కన్నా చెప్పడానికి ఏమీ లేదు. ‘ప్రెస్ మీట్ పెట్టడానికి వీలులేదు, విజయవాడ రావడానికి వీలులేదు’ ఈ విషయం అంతు చూడాలనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. ఏ కారణంతో నన్ను ఆపుతున్నారు అన్నది లీగల్గా ప్రశ్నించదలుచుకున్నాను. ఏ గ్రౌండ్స్ మీద మమ్మల్ని వెనక్కు పంపించారు? ఓ పౌరుడిగా వీటిని ప్రశ్నించే హక్కు నాకుంది. ఇవాళంతా (ఆదివారం) ప్లాన్ చేసి ఎలా ముందుకు వెళ్తాం అనే విషయాన్ని రేపు (సోమవారం) డీటైల్స్తో సహా ఇస్తాను’’ అని వర్మ చెప్పారు. శాంతిభద్రలకు విఘాతమని అదుపులోకి తీసుకున్నాం ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 114 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయి. అందువల్ల ప్రెస్మీట్ నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలోని ఐబీఎం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. అందువల్ల అక్కడ ప్రెస్మీట్ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరాం. అందుకు ఆయన ససేమిరా అనడంతో అదుపులోకి తీసుకున్నాం. – ద్వారక తిరుమలరావు, పోలీసు కమిషనర్, విజయవాడ వర్మను నిర్బంధించడం ప్రభుత్వ పిరికిపంద చర్య గన్నవరం: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శక, నిర్మాతలు రాంగోపాల్వర్మ, రాకేష్రెడ్డిలను పోలీసులు అడ్డుకుని ఎయిర్పోర్టులో నిర్భందించడం టీడీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో టీడీపీ ఎందుకు ఇంతగా భయపడుతోంది? అంత పిరికితనమా? పోలీసులు కూడా భారీ బందోబస్తుతో ఇలా నిర్భంధించాలా? చట్టానికి వ్యతిరేకంగా ఇలా వ్యవహరించడం సబబేనా? సెన్సార్ బోర్డు సినిమా రిలీజ్కు అంగీకరించాక ప్రమోషన్ను అడ్డుకోవడం చట్ట వ్యతిరేకం. అప్పుడే ఇక్కడ ఈ సినిమా విడుదలైంటే చంద్రబాబు థియేటర్లు దొరక్కుండా చేసేవారు’ అన్నారు. అంబటితో పాటు వైఎస్సార్సీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. వర్మ గొంతు నొక్కేసింది ప్రభుత్వమే – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించి బలవంతంగా హైదరాబాద్ పంపడం ద్వారా వర్మను మాట్లాడనీయకుండా ప్రభుత్వమే ఆయన గొంతు నొక్కేసిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
అందుకే వర్మ ప్రెస్మీట్కు అనుమతించలేదు
సాక్షి, విజయవాడ: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్కు అనుమతి నిరాకరించడంపై విజయవాడ పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగరపరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 114 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయని, అందువల్ల ప్రెస్మీట్ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు విడుదల చేసిన ఓ నోట్లో పేర్కొన్నారు. చదవండి....(నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న ) (హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ) వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిపారు. బహరింగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్మీట్ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని వర్మను కోరారు. ఈ మేరకు విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో ఓ లేఖను విడుదల చేసి, రాంగోపాల్ వర్మకు అందించారు. కాగా తన ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, ట్విటర్ లైవ్ను పోలీసులు ఆపివేశారంటూ వర్మ మరో ట్విట్ చేశారు. I can’t communicate because they blocked my insta facebook twitter live — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2019 -
హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ
సాక్షి, గన్నవరం : ఏపీ పోలీసుల చర్యను దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో ఉండకుండా వెళ్లిపోవాలంటూ పోలీసులు తమపై బలవంతంగా వెనక్కి పంపించారని ఆయన మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయం లాంజ్లోనే వర్మతో పాటు నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని... తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిపై వర్మ మాట్లాడుతూ ... ‘నేనేమైనా ఉగ్రవాదినా... నన్ను ఎందుకు నిర్బంధించారు. నిర్బంధించడానికి ఎలాంటి హక్కు, అధికారం ఉంది.’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నలకు మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వలేదు. తన నిర్బంధంపై రాంగోపాల్ వర్మ.... ‘నేను నిజం చెప్పేందుకు యత్నిస్తే ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ ఈ సందర్భంగా ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రెస్మీట్ రద్దు...తిరిగి హైదరాబాద్కు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రద్దు అయినట్లు వర్మ ప్రకటించారు. పోలీసులు తనను బలవంతంగా నిర్భందించారని, దాంతో తాను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ‘హే సీబీఎన్..వేరీజ్ డెమోక్రసీ’ అంటూ వర్మ ట్విటర్లో సూటిగా ప్రశ్నించారు. చదవండి....(రాంగోపాల్ వర్మను అడ్డుకున్న పోలీసులు) -
నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్మీట్ పెట్టేందుకు సిద్ధమైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ఓ హోటల్లో చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో నడిరోడ్డు మీద ప్రెస్మీట్ పెడతానని ప్రకటించిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేశ్రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. వారు విజయవాడ వెళుతుండగా.. ప్రకాశ్నగర్ సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహిస్తే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిందేనని వర్మ, రాకేశ్రెడ్డిలపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, ఇందుకు వారు ససేమిరా ఒప్పుకోలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహించి తీరుతానని వారు పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తాము చేసిన తప్పు ఏంటని, ఎందుకు తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, సినిమా ప్రమోషన్లో భాగంగా తాము ప్రెస్మీట్ కూడా పెట్టుకోకూడదా? అని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వైఖరి మార్చుకోని పోలీసులు.. వర్మ, రాకేశ్రెడ్డిలను బలవంతంగా గన్నవరం ఎయిర్పోర్టుకు తరలించి.. విమానాశ్రయం లాంజ్లో ఇద్దరిని నిర్బంధించారు. తనను ఎయిర్పోర్టులో నిర్బంధించడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నేనేమైనా ఉగ్రవాదినా.. ఎందుకు నన్ను నిర్బంధించారు? నిర్బంధించడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? ఏం అధికారముంది?’ అంటూ పోలీసులపై వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. వర్మ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులు నీళ్లు నమిలారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా ఏపీలో చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడ నోవాటెల్లో ప్రెస్మీట్ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే, చివరి నిమిషయంలో నోవాటెల్ హోటల్లో తన ప్రెస్మీట్కు అనుమతి ఇవ్వలేదని, అంతేకాకుండా తాను ఇచ్చిన అడ్వాన్స్ తీసికొని కూడా హోటల్ యాజమాన్యం తన కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కొంతమంది పెద్దల బెదిరింపుల వల్లే హోటల్ యాజమాన్యం తనకు అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో విజయవాడలోని పైపులురోడ్డులో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన మేరకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వర్మ, రాకేశ్రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వర్మ వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్కు తిరిగి వెళ్ళాలని తనను ఎందుకు బలవంతం చేస్తున్నారని ఆయన పోలీసులను నిలదీశారు. ప్రెస్మీట్ వల్ల శాంతిభద్రతల సమస్య వస్తందనే ఉద్దేశంతో అనుమతించడం లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. దీంతో కనీసం తనను విజయవాడలోని హోటల్ వరకైనా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని వర్మ డిమాండ్ చేసినా పోలీసులు ససేమిరా ఒప్పుకోలేదు. ‘పోలీసులు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. నాకు మీడియా సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ లేదా’ అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. -
నడి రోడ్డు మీద ప్రెస్ మీట్: వర్మ
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్లో ప్రెస్మీట్ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు వర్మ ట్విటర్లో తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ‘నోవాటెల్ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా మనందరికీ తెలిసి ఒక వ్యక్తి భయంతో హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పారిపోయార’ని వర్మ పేర్కొన్నారు. అదే విధంగా ‘మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతివారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానమ’ని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని వర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. పైపుల రోడ్డులో NTR circle https://t.co/jvva4KotsW… దగ్గర today sunday 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం pic.twitter.com/vasqMPngil — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2019 -
ఎన్టీఆర్ అనుభవించిన నరకం చూస్తారు : వర్మ
సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రాంగోపాల్వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల కానుంది. మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఏపీలో విడుదల చేస్తున్నామని డైరెక్టర్ వర్మ వెల్లడించారు. ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని ట్విటర్లో తెలిపారు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైకోర్టు విచారణ) -
‘నీ తాట తీయనీకి వస్తున్నా’
లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్లుక్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్లో వివాదాలకు తెరతీశాడు వర్మ. ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్లో కనిపించనున్నారు. కేసీఆర్ తనయుడు తారకరామారావు (కేటీఆర్), కూతురు కవిత, హరీష్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించాడు వర్మ. On the eve of Andhra Pradesh Chief Minister @ncbn ‘s birthday , I am releasing this first look of Telangana Chief Minister KCR ‘s biopic #TIGERKCR pic.twitter.com/0uvX5f49KT — Ram Gopal Varma (@RGVzoomin) 20 April 2019 -
ఓట్ అండ్ సీ
వానొచ్చి మ్యాచ్ ఆగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది.ఫ్రైడేకి కొత్త సినిమాలేమీ లేకపోతే జీవితం మీదే విరక్తి కలుగుతుంది.బ్రేకింగ్ న్యూస్ చూడకపోతే ఆ పూట బ్రేక్ఫాస్ట్ చేయనట్లే ఉంటుంది. క్రికెట్.. సినిమా.. రాజకీయాలు.. ఈ మూడూ దేశానికి ఎప్పుడూ నిత్యావసర సరకులే!ఇప్పుడా సరకుల్లో ఒకదానికి తీవ్రమైన కొరత ఏర్పడింది.ఎన్నికలు పూర్తయ్యేవరకు పొలిటికల్ ఫిల్మ్స్ ఆడ్డానికి వీల్లేదనిఎన్నికల సంఘం తాత్కాలికంగా కొరత విధించింది!!ఈ విరామంలో నిరీక్షణే బయోపిక్ల వీక్షకులకు ఊరడింపు.ఓట్ అండ్ సీ! తీర్పు కోసం చినరాయుడి దగ్గరికి వెళ్లినప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. చినరాయుడికి కండువా సర్దుకోవడంతోనే సరిపోతోందనుకుని పెదరాయుడి దగ్గరకి పరుగెడితే.. పెదరాయుడు ఇంకేదో వ్యవహారం చూస్తూ ఉండొచ్చు. అప్పుడు మళ్లీ చినరాడి దగ్గరికి తిరిగొస్తే చినరాయుడిచ్చే తీర్పు వేరుగా ఉంటుంది. ‘కేసు పెదరాయుడి దగ్గర ఉన్నప్పుడు నేను తీర్పు చెప్పడం మర్యాద కాదు’ అనేస్తాడు చినరాయుడు. తొందరపాటు వల్ల జరిగే అనర్థం ఇది. అయితే తొందరపడకపోవడం వల్ల జరిగే అనర్థాలను ఊహించుకుని సినిమా ప్రొడ్యూసర్లు కింది కోర్టు నుంచి పైకోర్టుకు వెళుతుంటారు. దాంతో బాక్సు కోర్టులో ఉండిపోతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పుడు పెదరాయుడి దగ్గర ఉంది. ఏప్రిల్ 15న తీర్పు ఇవ్వబోయిన చినరాయుడు.. ‘ఎటూ పెదరాయుడు ఏప్రిల్ 22న దీని గురించి మాట్లాడదాం అన్నాడు కాబట్టి.. అప్పటి వరకు మనం ఆగడం పెదరాయుడికి గౌరవం’ అని అనేశాడు! పెదరాయుడి దగ్గర ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్కటే కాదు.. కేసీఆర్ ‘ఉద్యమ సింహం’ ఉంది. అసలు ఇవి రెండూ కాదు. మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ ఉంది. అది క్లియర్ అయితే, ఆటోమేటిగ్గా మిగతా రెండూ క్లియర్ అవుతాయి. మెయిన్ కేస్ మోదీ బయోపిక్ది. మే 19 లోపు ఇవేవీ క్లియర్ అవకపోవచ్చు. ఆ రోజు ఈ దేశానికి చివరి విడత ఎన్నికలు. అయితే ఎన్నికల కమిషన్ సినిమాను ఆపి ఊరుకోలేదు. సినిమా ట్రైలర్ను కూడా ఆపింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా ట్రైలర్ ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా కనిపించదు! ఈసీకి టైమ్ ఉంటుందా?! సుప్రీంకోర్టుకి ఈరోజు ఒక సీల్డ్ కవర్ రాబోతోంది! అందులో ఒక ‘ముఖ్యమైన అభిప్రాయం’ ఉంటుంది. ఆ ముఖ్యమైన అభిప్రాయం కేంద్ర ఎన్నికల సంఘానిది! రిలీజ్ ఆగిపోయిన బాలీవుడ్ బయోపిక్.. ‘పీఎం నరేంద్రమోదీ’పై ఎన్నికల సంఘం ఒపీనియన్ అది. సినిమా ఎలా ఉందన్నది కాదు కోర్టుకు కావలసింది. ఈ టైమ్లో రిలీజ్ చెయ్యడానికి తగినదా, తగనిదా అని. ఈ టైమ్లో అంటే.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న టైమ్లో. సినిమా ఎలాగూ బాగుంటుంది. తీసింది ఒమంగ్ కుమార్. ‘మేరీకోమ్’ ఆయన తీసిందే. హిట్ అయింది. ‘సరబ్జిత్ సింగ్’.. అదీ ఆయన్దే. హిట్ అయింది. ఇప్పుడు.. ‘పీఎం నరేంద్రమోదీ’. ఈ సినిమా ఏప్రిల్ 11నే విడుదల కావాలి. ఏప్రిల్ 10న ఎలక్షన్ కమిషన్ సడన్గా వచ్చి ‘స్టాప్’ అని అరిచింది. ‘ఎందుకు స్టాప్?’ అని నివ్వెరపోయి అడిగారు సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్. వాళ్లిద్దరూ ఆ సినిమా నిర్మాతలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద సినిమాను ఆపేసే పవర్ మాకుంది అంది ఈసీ. అర్థం కాలేదు అన్నారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కాలంలో ఓటర్లని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వం’ అంది. ఈ సినిమా చూస్తే కొందరికి లాస్, కొందరికి ప్రాఫిట్ ఉండే ప్రమాదం ఉంది అంది. అంటే మోదీకి లాభం. రాహుల్కి నష్టం.‘‘ట్రయిలర్ చూసి అదే సినిమా అనుకుంటే ఎలా?’’ అని నిర్మాతలు చికాకుపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏప్రిల్ 15న కేసు హియరింగ్కి వచ్చింది. ‘‘ఇదేం ఎన్నికల సంఘమండీ. సినిమాలు చూసి ఓటర్లు మారిపోయే పనైతే రాజకీయ నాయకులంతా ప్రచారం మానేసి, బయోపిక్లు తీయించుకునేవారు కదా’’ అని వాదించారు నిర్మాతల తరఫు న్యాయవాది. ఆ రోజు బెంచ్ మీద ఉన్నది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ‘‘నిజమే. ట్రైలర్ను చూసి సినిమాను ఆపేయాలని నిర్ణయానికి వచ్చినట్లున్నారు మీరు. బహుశా మీకు సినిమాను చూసే తీరిక లేక పోయుండాలి. అందువల్ల మీరొకసారి సినిమాను స్పెషల్గా వేయించుకుని చూసి శుక్రవారం లోపు (ఈరోజు) సీల్డ్ కవర్లో పెట్టి మీ అభిప్రాయాన్ని పంపండి’’ అని చెప్పారు. ‘‘మళ్లీ మనం ఏప్రిల్ 22 న ఈ కేసు గురించి ఆలోచిద్దాం’’ అని కూడా అన్నారు. నిన్నటి వరకైతే కోర్టుకు సీల్డ్ కవరేమీ వెళ్లినట్లు లేదు. ఈరోజు వచ్చినా ఉపయోగం ఏమీ లేదు. గుడ్ ఫ్రైడే కదా! కోర్టుకు సెలవు. ట్రైలర్లో ఏముంది?! ఏముంటుంది? గోద్రా దెయ్యం ఉంటుందా? ఉండదు. జింగోయిజం ఉంటుందా? ఉండదు. జింగోయిజం అంటే ‘మన దేశమే గొప్ప’ అనే వాదం. అది ఎందుకు ఉంటుంది, ఉన్నా డైరెక్టుగా ఎందుకు ఉంటుంది? మంత్రులతో కయ్యం నెయ్యం ఉంటాయా? ఉంటే అది ‘పీఎం నరేంద్ర మోదీ’ ఎందుకవుతుంది? మన్మోహన్సింగ్ మీద వచ్చిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ అవుతుంది కానీ. మరేం ఉంది ట్రైలర్లో?! ఎందుకు ఈసీ ‘అప్పుడే విడుదలొద్దు’ అనేసింది? మోదీని మించిన దేశభక్తుడు లేడన్నట్లుంది ట్రైలర్. వివేక్ ఒబెరాయ్ (మోదీ) కెమెరా వైపు కోపంగా చూస్తూ.. ‘‘పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నాను. మాపై చెయ్యెత్తితే ఆ చెయ్యిని నరికేస్తాం’’ అంటాడు! ఇలా అన్నంత మాత్రాన మోదీకి ఓట్లు పడిపోతాయని కాదు. తనకున్న నిబంధనల ప్రకారం వెళుతోంది ఎలక్షన్ కమిషన్.‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరి 27న గుజరాత్లో మొదలైంది. మోదీ బాల్యం, రాజకీయ ప్రయాణం.. ఇలాంటి ముఖ్యమైన సీన్లు కొన్ని ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో తీశారు. సినిమా చివరి సన్నివేశాల కోసం ముంబై వెళ్లారు. ఉత్తరకాశీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వివేక్ ఒబెరాయ్ గాయపడ్డారు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్. మార్చి మొదటి వారానికి సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ లోపు ఎన్నికల షెడ్యూలు వచ్చిపడింది. అరకొర ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాక ఏప్రిల్ 11న రిలీజ్ అనుకున్నారు కానీ, అదే రోజు ఎన్నికలు మొదలవడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. అయితే తన ధర్మం ప్రకారం ఎన్నికల విడతలన్నీ పూర్తయే వరకు బయోపిక్ల విడుదలకు అనుమతి ఇవ్వడం కష్టమని ఈసీ అంటోంది. ఇప్పుడు సీల్డ్ కవర్లోనూ అదే ఉంటుందనుకోవాలి. మోదీ పీఎం కదా అని రిలీజ్కి ఓకే చెప్పదు. రామ్గోపాల్ వర్మ ముక్కుసూటి డైరెక్టర్ కదా అని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ముకుతాడు వేయ కుండా ఉండదు. సాధారణంగా పైకోర్టులో కేసు నలుగుతున్నప్పుడు కింది కోర్టులు ఏమీ చెయ్యడానికి ఉండదు. నిర్మాతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న రిలీజ్ అనుకున్నారు. మార్చి 29కి వాయిదా పడింది. ఆ రోజున తెలంగాణలో విడుదలైంది. ఆంధ్రాలో బ్రేక్ పడింది. ఆ సినిమాలో చంద్రబాబును విలన్గా చూపించాడు వర్మ. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ సినిమా రిలీజ్ అయిందంటే.. పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని టీడీపీ నుంచి కొందరు కోర్టుకు వెళ్లారు. సినిమా ఆగిపోయింది. కేసు ఏప్రిల్ 3న హియరింగ్కి వచ్చింది. అప్పటికే నిర్మాత రాకేశ్రెడ్డి సుప్రీంకోర్టులో స్పెల్ లీవ్ పిటిషన్ ఫైల్ చెయ్యడంతో కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 15కి వాయిదా పడింది. ఈలోపు ఆంధ్రాలో ఎన్నికలు అయిపోయాయి. ‘ఉద్యమ సింహం’ విడుదల కూడా ఇలాగే, ఇవే కారణాలతో ఆగిపోయింది! అయితే యూట్యూబ్లో అందుబాటులో ఉంది. అది కేసీఆర్ బయోపిక్. అల్లూరి కృష్ణంరాజు డైరెక్టర్. ఫస్ట్ లుక్ 2018 నవంబరులోనే రిలీజ్ అయింది. 2019లో సినిమా రిలీజ్ అనుకున్నారు. ఈలోపు లోక్సభ ఎన్నికలు ఊడిపడ్డాయి. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కనుక ఇప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా. కానీ ఒకే కేసులో ఉన్న ఈ మూడు సినిమాలకూ ఒకే తీర్పు ఉంటుంది. అదింకా రాలేదు. అప్పుడే అన్నిటికీ ఒకేసారి విముక్తి. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైకోర్టు విచారణ
సాక్షి, అమరావతి : రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల పిల్పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించవల్సిందిగా ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే సినిమా విడుదలవుతుందని ఆంధ్రా ప్రేక్షకులు భావించారు. కానీ ఎన్నికలు పూర్తయి నాలుగు రోజులు కావస్తున్నా సినిమా విడుదలపై క్లారిటీ రావటం లేదు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్పై వర్మ ప్రకటన
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్పై హైకోర్టు స్టే విధించటంతో చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే రేపటితో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్టే అని భావిస్తున్నారు చిత్రయూనిట్. వర్మ టీం రిలీజ్కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా పేజ్లో ఓ ప్రకటన చేశారు. ఈ వారం ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అంటూ పోస్టర్ను రిలీజ్ చేశాడు వర్మ. pic.twitter.com/ClOuK8k5Pz — Ram Gopal Varma (@RGVzoomin) 9 April 2019 -
రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గన్ షాట్ ఫిలింస్ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బందుల్లో ఉన్న వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్తో మరోసారి సక్సెస్ ట్రాక్లో వచ్చాడు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై వర్మ బాధపడుతున్నాడు..!
ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని, లక్ష్మీ పార్వతి తన జీవితంలోకి వచ్చిన తరువాత జరిగన సంఘటనలు, చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా గత వారం ఏపీ మినహా అన్ని ప్రాంతాల్లో విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా కొన్ని శక్తులు అడ్డుతగులుతున్నాయి. అయినా సరే వాటిని ఎదుర్కొంటానని, ఏపీలో వీలైన తొందరగానే మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. కానీ, అదంతా ఈజీగా అయ్యేలా కనబడటం లేదని వర్మకు తెలిసివచ్చింది. ఏపీ హైకోర్టు సినిమాపై స్టే విధించగా.. సుప్రీం కోర్టు కూడా అదే ధోరణిలో వ్యవహరించింది. దీంతో ఈ చిత్రం విడుదలపై మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ చిత్రాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయకుండా ఆపేందుకే కొన్ని తెరవెనుక శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్పై కోర్టు తీర్పు ఇవ్వక పోవడం, మూవీ గురించి పోరాడి అలసిపోవడంపైనా.. వర్మ సెటైరికల్గా స్పందించాడు. కోతి బొమ్మల పెయింటింగ్ రూపంలో తన బాధను వర్ణించాడు. తల్లి కోతి (రామ్ గోపాల్ వర్మ).. పిల్ల కోతి (లక్ష్మీస్ ఎన్టీఆర్)ని ఓదార్చుతున్నట్టు తన బాధను ట్వీట్ చేశారు. Mother Rgv consoling #LakshmisNTR baby😢😢😢 Painting done by a truly truthful and deep visionary @DPrasannavarma pic.twitter.com/S4RTE5AEnN — Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2019 చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్పై కొనసాగుతున్న ఉత్కంఠ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై తమిళనాడులోనూ కుట్ర దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి -
దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి
సాక్షి, హైదరాబాద్ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విజయవంతం కావడమే కాక, వైఎస్సార్సీపీ తరఫున తాను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నాననే అక్కసుతో చంద్రబాబు కుటుంబీకులు కక్షకట్టి, తనపై లేనిపోనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ నిన్న (గురువారం) ఓ టీవీ చానల్ ప్రసారం చేసిన చర్చలో.. గతంలో తన అభిమానిగా ఉన్న కోటి అనే వ్యక్తిని బెదిరించి, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయించారని వాపోయారు. ఇటువంటి చర్యలు చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. -
గుండె మంట చల్లారింది : లక్ష్మీ పార్వతి
సాక్షి, ఒంగోలు : ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీ మినహా తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో విడుదలై మంచి టాక్తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అధికారం కోసం సొంతమామకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఈ సినిమాలో వర్మ పర్ఫెక్ట్గా చూపించారని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక పలు అవాంతరాల అనంతరం ఈ సినిమా విడుదల కావడం.. విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్తో తన గుండెమంట చల్లారిందని ఆమె వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి వీధి స్థాయి నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వైఎస్ షర్మిలపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, వారంతా సంస్కార హీనులని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలును మరచిపోయి నందమూరి బాలకృష్ణ ప్రవర్తిస్తున్నారని, బాలకృష్ణ ఇంటినుంచే షర్మిలపై దుష్ప్రచారం జరగడం బాధాకరమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళలను అవమాన పరచడం సరైంది కాదని హితవు పలికారు. ఆయనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం ఎన్నడూ మహిళలను కించపరచలేదని అన్నారు. మహిళలకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. (చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్పై కొనసాగుతున్న ఉత్కంఠ) -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై తమిళనాడులోనూ కుట్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై : చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై తమిళనాడులోనూ కుట్రలు జరుగుతున్నాయి. మొక్కుబడిగా సినిమాను రిలీజ్ చేసి రెండురోజుల్లో ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏపీలోని ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల వారికి చెన్నైకి వచ్చి సినిమా చూసే అవకాశం ఉందన్న కారణంతో ఒక పథకం ప్రకారం ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నారు. సినిమా రిలీజుకు ముందు సత్యం థియేటర్ కాంప్లెక్స్లో విడుదలయ్యే చిత్రాల జాబితాను దినపత్రికలకు విడుదల చేస్తుంటారు. విడుదలకు ముందు రోజు చిత్రం పేరును జాబితాలో పెట్టి వెంటనే ‘హోల్డ్’ అని ఉంచారు. దేశంలోని అనేక నగరాల్లో ఈ చిత్రం నాలుగు షోలతో 30 నుంచి 90 థియేటర్ల వరకు ప్రదర్శితం అవుతుండగా చెన్నైలో ఐదు నుంచి పది థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. వీటిల్లో రెండు, మూడు మినహా మిగిలిన థియేటర్లలో ఒకే షో, అది కూడా అసౌకర్యమైన వేళల్లో ప్రదర్శిస్తున్నారు. ఈరోజుంటే రేపు లేకుండా చేస్తూ థియేటర్లను, వేళలను తరచూ మారుస్తున్నారు. హౌస్ఫుల్గా సాగుతున్నా షోల సంఖ్య లేదా థియేటర్ల సంఖ్య పెంచడం లేదు. చెన్నై మినహా సరిహద్దు జిల్లాల్లో మరెక్కడా ప్రదర్శితం కాలేదు. చెన్నైలోని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమయ్యే సినిమాల జాబితాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడాలనుకునే ప్రేక్షకులను గందరగోళానికి గురిచేయడం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని చిత్రరంగంతో పరిచయం ఉన్న కొందరు తెలుగు ప్రముఖుల కుట్రలు చేస్తున్నారు. ఈనెల 11న ఏపీలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హౌస్ఫుల్గా నడుస్తున్న ఈ సినిమాను గురు లేదా శుక్రవారాల్లో పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్పై కొనసాగుతున్న ఉత్కంఠ
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమా చూసిన తరువాత విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం గతంలోనే వెల్లడించింది. అయితే రిలీజ్ పై స్టే విధించటాన్ని చిత్రయూనిట్ సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసింది. దీంతో విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమని, సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని హైకోర్టు న్యాయమూర్తులు కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేశారు. ఈ రోజు రిలీజ్ విషయంలో నిర్ణయం వెలువడుతుందని నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేసు వాయిదా వేయటంతో రిలీజ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదల కాకపోవటంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్ల హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. -
టీడీపీకి అసలు వారసుడెవరో చెప్పిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీకి షాక్ల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేశానంటున్న వర్మ, మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను టీడీపీ వర్గాలు అడ్డుకోవటంతో వర్మ రగిలిపోతున్నాడు. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో గుబులు పుట్టించే ట్వీట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకు ఓటు వేయాలని కోరారు. నారా లోకేష్ టీడీపీకి నిజమైన వారసుడు కాదన్న వర్మ.. జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. అంతేకాదు టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియరే అన్నాడు వర్మ. ఇక సినిమా విషయానికి వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయించేందుకు వర్మ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తాజాగా డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా రిలీజ్పై స్టే విదించటంతో తమకు కలిగిన నష్టాన్ని హైకోర్టుకు నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. All truly real and realistic honest fans of NTR and @tarak9999 should cast their vote only after seeing @ncbn in #LakshmisNTR ..@naralokesh is a false heir to @jaiTDP and only true heir is the fantastic @tarak9999 who should be the only true honest future of TDP — Ram Gopal Varma (@RGVzoomin) 2 April 2019 -
ఆ ప్రశంసను మరచిపోలేను
‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్గారిలా చేస్తానని ఎవరో రామ్గోపాల్ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్ పంపించి ఎన్టీఆర్గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్కుమార్. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్ కుమార్ ముఖ్య తారలుగా రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో నటించిన విజయ్ కుమార్ (ఎన్టీఆర్), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్ (బాబు) హైదరాబాద్లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో వందలకొద్దీ కళా పరిషత్లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఎన్టీఆర్గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్ స్టార్ట్ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్ రాలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నా కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా. వరుసగా బయోపిక్ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్గా ఉంది. నేను రెగ్యులర్ యాక్టర్గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్రాజ్, రావు రమేశ్గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్ నుంచి ఇర్ఫాన్ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు. యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చేశా. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్. కథ చాలా సెన్సిటివ్. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్ని పెట్టుకుని డైలాగ్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్ పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిత్రం విడుదలపై ఆంక్షలు విధించడాన్ని అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి దాఖలు పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీలో చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రేమ.. భయంకరమైన రాజకీయం
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో దర్శకుడు రామ్గోపాల్ వర్మది ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్ రిలీజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో మరోసారి ఆ విషయాన్ని నిరూపించారు. ఈ జానర్లో ఇది వరకు ‘రక్త చరిత్ర, వంగవీటి, 26/11 ఎటాక్స్’ తెరకెక్కించారు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడెప్పుడో వర్మ ప్రకటించిన శశికళ బయోపిక్ త్వరలోనే వస్తుందని తెలిపారు. దయలేని మగవాళ్లు, జైళ్లు, మన్నారగుడి గ్యాంగ్స్ వీటన్నింటినీ ఎదురించి నిలబడ్డ అనుబంధమే ఈ ‘శశికళ’ చిత్రం. టైటిల్కు ‘ప్రేమ.. భయంకరమైన రాజకీయం’ అనే ట్యాగ్లైన్ కూడా యాడ్ చేశారు వర్మ. మరి ఈ బయోపిక్తో తమిళ పాలిటిక్స్లో కూడా వర్మ ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి. -
వర్మ నుంచి మరో సెన్సేషనల్ బయోపిక్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో వేడి పుట్టించిన రామ్ గోపాల్ వర్మ.. చాలాకాలం తరువాత విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో ఆర్జీవీ అభిమానులు కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ కొట్టడంతో ఫామ్లోకి వచ్చిన ఆర్జీవీ.. మరో బయోపిక్ను టేకప్ చేశారు. తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శశికళ పేరుతో రాబోతోన్న ఈ చిత్రంలో .. శశికళకు జైలు శిక్ష, మన్నార్గుడి మాఫియాలను హైలెట్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కబోతోన్నట్లు సమాచారం. కాసేపటి క్రితమే అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్ మీడియాలో తెలిపారు. HAPPY TO ANNOUNCE! 💐💐💐COMING VERY SOON! 💪💪💪 pic.twitter.com/ZccF4mufNN — Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఏపీ ప్రేక్షకులు !
సత్తుపల్లి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని చూసేందుకు ఏపీ నుంచి ప్రేక్షకులు సత్తుపల్లికి వస్తున్నారు. స్థానిక బాలాజీ థియేటర్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా చూసేందుకు శనివారం ఏపీ నుంచి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో విడుదల కాలేదు. దీంతో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ‘సాక్షి’తో ప్రేక్షకులు చెప్పారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని ఈ సినిమాలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ చాలా చక్కగా చిత్రీకరించారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సీతానగరం, చింతంపల్లి, జంగారెడ్డిగూడెం, లింగగూడెం, కృష్ణా జిల్లా తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, పుట్రేల, చాట్రాయి ప్రాంతాల నుంచి వాహనాలలో ప్రేక్షకులు వచ్చారు. బండారం బయటపడేది.. చంద్రబాబు కుట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా ఆంధ్రాలో విడుదలైతే.. బాబు బండారం బయటపడేది. అందుకనే అడ్డుకున్నట్టున్నారు. ఈ సినిమా చూస్తే... చంద్రబాబు ఎంత నయవంచకుడో ఈ తరం వారికి తెలుస్తుంది. – వక్కలగడ్డ జార్జ్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే వక్కలగడ్డ ఆదాం తనయుడు వాస్తవాలు తెలుసుకుందామనే... ఆంధ్రప్రదేశ్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం చూసేందుకు అవకాశం లేదు. ఎన్టీఆర్ను ఎంత క్షోభకు గురిచేశారో, ఆనాడు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వచ్చాం. ఎన్టీఆర్కు అంతమంది సంతానం ఉన్నప్పటికీ తిండి పెట్టలేదంటే బాధేసింది. లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలు తెలుసుకున్నాం. – పి.రాధాకృష్ణ, నూజివీడు వాటికన్నా బాగుంది... బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్లు రెండూ చూశాను. అవి అస్సలు బాగాలేదు. చరిత్ర తెలుసుకోవాలంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూడాల్సిందే. ఎన్టీ రామారావుకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారో చూస్తే... కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పటం ఖాయం. – కాలేషావలీ, నూజివీడు కావాలనే అడ్డుకున్నారు... ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదలను కావాలనే అడ్డుకున్నారు. అక్కడ విడుదల చేసేంతవరకు దీనిని చూసేందుకు తెలంగాణ థియేటర్లకు వస్తూనే ఉంటాం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఓట్లు పడవనే భయంతోనే ఆంధ్రాలో సినిమా విడుదలను అడ్డుకున్నారు. – బొమ్మారెడ్డి స్నేహారెడ్డి, నూజివీడు ఆనాడేం జరిగిందోనని... ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలపై కోర్టు స్టే ఉంది. ఎన్టీఆర్ జీవితం చివరి రోజుల్లో ఏం జరిగిందోనని తెలుసుకునేందుకని సినిమా చూసేందుకు వచ్చాను. సినిమా చాలా బావుంది. ఏపీలో కూడా విడుదల చేస్తే... ఎన్టీఆర్ అభిమానులు చూసి తరిస్తారు. – పర్సా రాంబాబు, టీ నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్ను బిఫోర్ ఆర్జీవీ (రామ్గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్గోపాల్వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్గోపాల్వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
వెండితెరపై వెన్నుపోటు
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాకుండా అడ్డుకోగలిగారు కానీ, సినిమా చూడలనుకున్న ప్రేక్షకులను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి అభిమానులు తెలంగాణకు తరలివస్తున్నారు. వీరిలో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. రాజమండ్రిలో సినిమా రిలీజ్ కాకపోవటంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైదరాబాద్లో సినిమా చూశారు. (చదవండి : బాహుబలి 2, అర్జున్ రెడ్డిలను వెనక్కి నెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’) లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్లతో కలిసి అరుణ్ కుమార్ సినిమా చేశారు. ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్. #LakshmisNTR pic.twitter.com/GjcWoGbpIU — sirasri (@sirasri) 30 March 2019 -
టాప్లో ట్రెండ్ అవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
ఎన్నో అవాంతరాల తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా అన్ని చోట్లా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా ప్రమోషన్లో వర్మ తీసుకున్న జాగ్రత్తలతో పాటు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనల్లోని అసలు నిజం తెలుసుకునేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) తొలి షో నుంచే సినిమాకు పాజిటిల్ టాక్ రావటంతో కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి. చాలా థియేటర్లలో కథానాయకుడు సినిమా కలెక్షన్ల కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ వసూళ్లే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక మహానాయకుడైతే ఈ సినిమా దరిదాపుల్లో కూడా లేదు. అంతేకాదు ప్రముఖ ఫిలిం వెబ్ సైట్ ఐయండీబీ లో ట్రెండింగ్ తెలుగు మూవీస్ లిస్ట్(రియల్ టైం పాపులారిటీ)లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ లో నిలిచింది. 54.2% పేజ్ వ్యూస్తో బాహుబలి, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను కూడా వెనక్కి నెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సాధించటం విశేషం. ఇదే లిస్ట్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా తన సోషల్ మీడియా పేజ్లో వెల్లడించారు. సినిమాను ఆపేందుకు ఎన్ని కుట్రలు చేసిన ప్రేక్షకులు మాత్రం సినిమాను సూపర్హిట్ చేయటం పట్ట చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసేందుకు చట్టపరమైన అవకాశాలపై చర్చిస్తున్న వర్మ రెండు మూడు రోజుల్లోనే అక్కడ కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించారు. pic.twitter.com/IZxv3Mo4x1 — Ram Gopal Varma (@RGVzoomin) 29 March 2019 pic.twitter.com/Nylwe9TOzP — Ram Gopal Varma (@RGVzoomin) 29 March 2019 -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్హాఫ్లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్లో ఎన్టీఆర్ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
మరోసారి ఎన్టీఆర్గారికి వెన్నుపోటు పొడిచారు
‘‘ఎన్టీ రామారావుగారికి మరొక్కసారి వెన్నుపోటు జరిగింది. ఎందుకంటే.. అప్పట్లో ‘సింహగర్జన’ సభ పెట్టుకోకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ కానివ్వకుండా కుట్ర చేసి మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు రామారావుగారికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఆయన కుటుంబం, పార్టీ కార్యకర్తలు అందరూ వెన్నుపోటు పొడిచారు. కానీ ఇవాళ మేమందరం రాజ్యాంగ హక్కుల ద్వారా ఆయన సినిమా రిలీజ్ చేయిస్తాం. మాకు కచ్చితంగా విజయం దక్కుతుంది అనుకుంటున్నాను. ఎన్టీఆర్గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి ముఖ్యపాత్రల్లో రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీర్’. ఏ జీవి, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ చిత్రం నిన్న ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రిలీజ్ ఆపమని హై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కప్రాంతం మినహా సినిమా రిలీజ్ని ఆపడమనేది కరెక్ట్ కాదు. ఏ దర్శకుడైనా సినిమా తీసేది ప్రేక్షకుడికి చూపించడానికే. కొందరు చూడటానికి వీలు లేదు అని చెప్పడం అన్యాయమే కదా? అందరికీ సినిమా చూడాలనే కోరిక ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చూడకూడదంటే ఎలా? ఒక్కచోట రిలీజ్ అయితే అన్నిచోట్లా సినిమా రిలీజ్ అయినట్టే. సోషల్ మీడియా వల్ల మొత్తం తెలిసిపోతుంది. సినిమాను ఆపాలనుకుని ప్రయత్నిస్తే వాళ్లకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ►ఓ డెమోక్రటిక్ కంట్రీలో రియలిస్టిక్ మూవీ తీసినప్పుడు మీరు చూడకూడదని ఆపేయడం కరెక్ట్ కాదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాను నిర్మించిన రాకేష్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నాకు తెలియదు. ఒకవేళ తెలిసుంటే సినిమా తీయనని చెప్పడం లేదు. ఈ సినిమా వైసీపీకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ల మనిషిని ఎందుకు నిర్మాతగా పెడతారు. ఆ డబ్బేదో నాకే ఇస్తారు కదా? లేకపోతే ఊరూ పేరూ లేని వాళ్లతో తీయిస్తారు. సినిమాలో ఉన్న నిజానిజాలు బయటకు రాకూడదన్నది వాళ్ల భయం తప్పితే ఎవరు తీశారన్నది సమస్యే కాదు. ►ఎన్టీఆర్గారి జీవితంలో జరిగిన కథ అందరికీ తెలుసు. ఆ సంఘటనలను ఏ విధంగా చూపించాలా అనే ఎగై్జట్మెంట్తో ఈ మూవీ స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్గారు చక్రవర్తిలా బతికారు. వైస్రాయ్ ఘటన జరిగినప్పటి నుంచి చనిపోయేవరకు ఆయన పడ్డ మానసిక వేదనకు నేను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ►డెమోక్రసీలో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను చెప్పే హక్కు మనందరికీ ఉంది. ఈ మధ్య ‘పద్మావత్’, ఉడ్తా పంజాబ్’ సినిమా సమయాల్లో సుప్రీమ్ కోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక ఆ సినిమాను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు అన్నది దాని సారాంశం. కానీ ఊహించని విధంగా మా సినిమా రిలీజ్పై స్టే రావడం సర్ప్రైజ్. సాధారణంగా కోర్టులు నిష్పక్షపాతంగా ఉంటాయి. కోర్టుపై ఒత్తిడి ఎవరు తెచ్చి ఉంటారో మనందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పకపోవడం ధైర్యం లేకపోవడం కాదు. నేను చెప్పినా చెప్పకపోయినా దీని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి. ►కోర్టువాళ్లు ఆదేశించిన విషయాన్ని గౌరవిస్తూ సినిమాను ఆపేశాం. వేరే కోర్టును ఆశ్రయించడానికి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. నిర్మాత రాకేశ్ రెడ్డిగారు ఆ పనిలో ఉన్నారు. వీలున్నంత త్వరగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో కూడా విడుదలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ సినిమాను ఒకేసారి చూపించాలనుకుంటాం. కుదరకపోతే వాళ్లు అప్పుడూ గెలిచిట్టే, ఇప్పుడూ గెలిచినట్టే. ప్రేక్షకుడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పడానికి, రిలీజ్ అయిన థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్, హౌస్ఫుల్ బోర్డ్సే నిదర్శనం. ఎన్టీఆర్గారి జీవితం తుది దశలో ఏం జరిగిందో తెలుసు కోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిజం ఇవాళ బయటకు వచ్చింది. కొందరికి ఇవాళ తెలుస్తుంది. కొందరికి రేపు. కానీ అందరికీ కచ్చితంగా తెలుస్తుంది. దర్శకుడిగా మనం ఎలాంటి కథ చెబుతున్నాం అన్న విషయాన్ని బట్టి సీరియస్నెస్ వస్తుంది. నేను చెబుతున్నది ఎంతో చరిత్ర కలిగి ఉన్న రామారావుగారి కథ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీ పార్వతిగారికి, ఎన్టీఆర్గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఆ బంధాన్ని ఉపయోగించుకొని కొందరు రాజకీయ కుట్ర ఎలా నడిపించారు? ఆయన్ను ఎలాంటి మానసిక క్షోభకు గురి చేశారు? అనే అంశాలను చూపించాం. శేఖర్కపూర్ తీసిన ‘బాండిట్ క్వీన్’ సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ వాళ్లు చాలా కట్స్ చెప్పారు. ఆ తర్వాత రివైజింగ్ కమిటీకు వెళ్తే వాళ్లు సినిమా బ్యాన్ చేయాలన్నారు. దాన్ని దాటి పైదానికి వెళ్తే ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. మూడు కమిటీలు. మూడు భిన్న అభిప్రాయాలు. సినిమా రిలీజ్ అయింది. మళ్లీ ఎవరో కేస్ వేశారు. కేసు సుప్రీమ్ కోర్టుకు వెళ్లింది. కోర్టు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ►నిజం అనే దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. సరైన వీడియో ప్రూఫ్ లేనప్పుడు నిజాన్ని నిర్ధారించలేం. ఆ సమయంలో నేనూ లేను, మీరూ లేరు. 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అప్పుడు ఉన్నవాళ్లను అడిగినా కూడా వాళ్లకు అనుకూలంగానే చెబుతారు. నిజం అనేది నమ్మేట్టుగా ఉండాలి. ఒకవేళ కాదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చెప్పగలగాలి. అలా చెబితే మీ సినిమా మీరు తీసుకోండి. నేను రీసెర్చ్ చేసి, అందులో తెలుసుకున్న నిజాలను మనస్ఫూర్తిగా నమ్మి తీసిన సినిమా ఇది. ►హై కోర్టు కౌన్ కిస్కా వాళ్ల మాటలు వినదు కదా. స్టే ఎత్తేయడానికి సుప్రీమ్ కోర్టుకు వెళ్లాం. ప్రాసెస్లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని జోస్యం చెప్పలేను. ఎందుకంటే నేను కోర్టు నడపను, ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రినీ కాదు. ప్రధాన మంత్రిని కూడా కాదు. ఫైట్ చేస్తాం. ►ప్రతీ సినిమాకో సీజన్ ఉంటుంది. సంక్రాంతి, సమ్మర్, దసరా ఇలా. మా సినిమాలో పొలిటికల్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల సినిమాకు హైప్ తీసుకురావడానికి ఎలెక్షన్ టైమ్ ఎంచుకున్నాం తప్పితే ప్రేక్షకులను ప్రేరేపించాలనే ఉద్దేశమే లేదు. ►సినిమా ఓ ఎమోషన్ తీసుకొస్తుంది. అది చూసి ఇలా జరిగిందా? అని నమ్మితే మీకు అంతకుముందు ఆ నాయకుల మీద ఉన్న ఇంప్రెషన్ పోవచ్చు. ఎన్నికల ముఖ్య ఉద్దేశం నమ్మకమే. సినిమా వల్ల ఆ ప్రభావం కొంత పడొచ్చు. ఎంత పడుతుంది, ఏ రేంజ్లో పడుతుందో చెప్పలేను. సినిమాకు వస్తున్న స్పందన పట్ల 100 శాతం సంతృప్తి చెందాను. ‘ఎన్టీఆర్గారికి నిజమైన వారసుడు మీరే’ అని నాకు ఎవరో ఓ మెసేజ్ పంపారు. అదే నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాను కథకుడిగా తీశా. సినిమా డబ్బుతో కూడుకున్నది కాబట్టి వ్యాపారంగానే తీశాను. రాజకీయంగా మాత్రం తీయలేదు. నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఇవాళ తెలుగువారందరికీ శుభదినం. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకు బ్లాక్ డే. ఈ సినిమా ఏపీలో రిలీజ్ కాదని మేం ఎవ్వరూ ఊహించలేదు. వర్మగారి దమ్ము, ధైర్యాలు అందరికీ తెలిసిందే. సినిమాలో నిజం ఉంది కాబట్టే వాళ్లు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయం గెలుస్తుంది. కొందరు స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బడ్జెట్ ఎంత? వచ్చే డబ్బెంత? అని కాదు. వెయ్యి కోట్లకు సరి పడా పేరు వచ్చింది. -
‘మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ను చూడొద్దంటా’
-
ఇది నా కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్ : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా చోట్ల విడుదలై మంచి టాక్తో దూసుకుపోతోంది. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజునే ఎన్నో వాయిదాల తర్వాత తాను తీసిన ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సరిగ్గా అదే రోజు విడుదలవ్వడం అంతా యాదృచ్చికమే అయినా నమ్మలేకపోతున్నానని రామ్గోపాల్ వర్మ తెలిపారు. దేవుళ్ల దీవెనలు తమకే ఉన్నాయని పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్లో తెలుగు దేశం ఆవిర్భావం తేదీని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1989లో అక్కినేని శివ, 2019లో నందమూరి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రామ్గోపాల్ వర్మ గారు వొళ్లు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా అని ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు బీవీఎస్ రవి చేసిన ట్వీట్కు సర్, ఏదో పొరపాటు జరిగిపోయింది, మన్నించండి అంటూ వర్మ సరదాగా బదులిచ్చారు. ఎన్టీఆర్కు నిజమైన వారసుడు మీరే అనుకుంటున్నా అని హీరో హర్ష వర్ధన్ చేసిన ట్వీట్ తన కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్గా వర్మ పేర్కొన్నారు. This is the best compliment I got in my entire career 🙏 “ Sir just saw #LakshmIsNTR and I think YOU ARE THE ONLY TRUE SON OF NTR “ —Harshavardhan (actor) — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 సర్, .ఏదో పొరపాటు జరిగిపోయింది. మన్నించండి.🙏🙏🙏 https://t.co/vUD3ohyjnY — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 రామ్ గోపాల్ వర్మ 1989 - అక్కినేని "శివ" 2019 - నందమూరి "లక్ష్మీస్ ఎన్టీఆర్" — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 In an unbelievable coincidence #LakshmisNTR after all its postponements releases on the same day as Telugu Desam was founded .Gods are really blessing us 🙏🙏🙏 pic.twitter.com/seWh8VN0Ns — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2019 ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్రెడ్డికి సూచించింది. చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ -
ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా.. న్యాయం చేస్తా : వర్మ
సాక్షి, హైదరాబాద్ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల కానీయకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శించారు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఓ సినిమాను అడ్డుకోవడం ఇదే మొదటిసారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పౌరుడిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూనే.. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు రాకేష్రెడ్డి, దీప్తి బాలగిరి ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఒక రాష్ట్రంలో సినిమా విడుదలై మరో రాష్ట్రంలో నిలిచిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను అడ్డుకోవడం ద్వారా ఎన్టీఆర్కు మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్టీఆర్కు న్యాయం చేస్తామని..ఏపీలో సినిమా విడుదలకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో అక్కడా కూడా సినిమా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్కు న్యాయం చేస్తామని ప్రమాణం చేసి చెప్తున్నా’ అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం వర్మ ప్రెస్మీట్ నిర్వహించారు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) అన్యాయమే చూపించాం.. ఈ సినిమాలో.. ఎన్టీఆర్కు మోసం, ద్రోహం.. ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది చూపించాం. ఒక ఫిల్మ్ మేకర్గా ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూపించాలనే ఎక్జయిట్మెంట్తో సినిమా మొదలు పెట్టాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు వెల్లడించొచ్చు. పద్మావత్, ఉడ్తా పంజాబ్ సినిమా విడుదల సందర్భాల్లో.. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎట్టిపరిస్తితుల్లో సినిమా ఆపడానికి వీలులేదని కోర్టులు స్పష్టంగా చెప్పాయి. ఆ విధంగా నిబంధనలు కూడా వచ్చాయి. అందుకనే తెలంగాణ హైకోర్టు ఈ సినిమా విడుదలకు కోవర్డ్ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఊహించని విధంగా ఏపీలో సినిమాకు బ్రేక్ పడింది. ఈ సినిమాను ఆపడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారో అందరికీ తెలుసు. వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. పేరు చెప్పడానికి నాకు ధైర్యం లేదని కాదు. కానీ విషయం కోర్టు పరిధిలోఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు. (చదవండి : ఆ వెన్నుపోటుదారుడెవరో.. అసలు కథ ఇది!) సినిమా హౌజ్ఫుల్.. రిలీజైన అన్ని చోట్లా సినిమా హౌజ్ఫుల్గా ఆడుతోంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను అడ్డుకోవడం ద్వారా మీరు వెన్నుపోటుకు గురయ్యారా అన్నప్రశ్నకు.. సినిమాను అడ్డుకొని మహానాయకుడికి మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు. నాడు ఎన్టీఆర్ సింహగర్జన మీటింగ్కు అనుమతినివ్వలేదు. టీడీపీ నాయకులు, ఆయన కుటుంబం ఎన్టీఆర్కు మద్దతుగా నిలవలేదు. క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారు. కానీ, ఇవాళ మేమంతా ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుని ఎన్టీఆర్కు న్యాయం చేస్తామని ఆయన సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. (చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు బ్రేక్) -
హతవిధి.. ఆ ఘనత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’దే
తాను తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అమితాసక్తి కనబరుస్తున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. చంద్రబాబు గురించి మనం గొంతు చించుకుని చెప్పక్కర్లేదని ఈ సినిమా చూపిస్తే చాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో స్పందించారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) ‘చిత్తూరులో ఉన్నోళ్లు చైన్నైకి, అనంతపురం, కడపలో ఉన్నోళ్లు బెంగళూరుకి, కర్నూలులో ఉన్నోళ్లు పక్కనే ఉన్న కర్ణాటకకు, విజయవాడలో ఉన్నోళ్లు సూర్యాపేటకు, ఉత్తరాంధ్రలో ఉన్నోళ్లు ఒడిశాకు వెళ్లి లక్షీస్ ఎన్టీఆర్ సినిమా చూడాలనే బలీయమైన కోర్కెను వెలిబుచ్చుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ కాకుండా, తటస్థ ఓటర్లకు ఈ సినిమా చూపించే బాధ్యత పార్టీ తీసుకుని ఏర్పాటు చేయాలని నా మనవి. ప్రచారానికి పెట్టే ఖర్చులో పదోవంతు పెడితే చాలు.. చంద్రబాబు గురించి మనం గొంతు చించుకుని చెప్పక్కర్లేద’ని రాంగోపాల్ వర్మ ట్విటర్లో రాసుకొచ్చారు. సినిమా ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు అంటూ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఉన్న వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. సినిమా ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీ కి లేదు.. - ఎన్. టీ. ఆర్@RGVzoomin #NTR #LakshmisNTR #LakshmisNTRonMarch29 pic.twitter.com/GUovjtttg7 — Telugu Cinema (@TeluguCinema) 28 March 2019 ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హతవిధి!!! — Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019 తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ రేపు తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో ?. 😡😡😡😡😡 pic.twitter.com/AryuViAEHQ — Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019 సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు pic.twitter.com/9iImMjv5OL — Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ సంగీతం : కల్యాణీ మాలిక్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఈ సినిమానేనా..? కథ : లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు రావ్ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ. నటీనటులు : ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్ కుమార్ను ఎన్టీఆర్ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్ కుమార్ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎన్టీఆర్, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనాలు ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు బ్రేక్
సాక్షి, అమరావతి : ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్రెడ్డికి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్రావుతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ, టీడీపీని అప్రతిష్టపాలు చేయడానికి ఈ సినిమాను రూపొందించారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారన్నారు. ఈ చిత్ర నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి అభ్యంతరకర రీతిలో సన్నివేశాలు చిత్రీకరించారన్నారు. అందువల్ల ఎన్నికలయ్యేంత వరకు ఈ చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టును కోరారు. అలాగే రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్క సీట్లో రాకేష్రెడ్డి కూర్చొని ఉన్న ఫోటోను ధర్మాసనం ముందుంచారు. విమానంలో పక్క సీట్లో కూర్చొంటే....? దీనిపై నిర్మాత తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. విమానాశ్రయంలో ఎవరి పక్కన ఎవరి సీటు వస్తుందో తెలియదని, అంతమాత్రాన నిర్మాత ప్రతి పక్ష పార్టీతో సంబంధం ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను మొన్న విజయవాడ వచ్చేందుకు విమానం ఎక్కగా, తన పక్కన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఉన్నారని, ఎవరో ఫోటో తీసి జేసీ పక్కన ఉన్నాను కాబట్టి, తనకు టీడీపీతో సంబంధం ఉందంటే అందుకు తానెలా బాధ్యుడిని అవుతానని సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. పక్కన కూర్చున్నంత మాత్రాన దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఈ సమయంలో మీనాక్షి ఆరోరా అడ్డుతగులుతూ.. నిర్మాత రాకేష్రెడ్డికి ప్రతిపక్ష పార్టీతో సంబంధం ఉందో? లేదో సుధాకర్రెడ్డి మనస్ఫూర్తిగా చెప్పాలని కోరారు. దీనికి సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. ఈ చిత్ర నిర్మాతకు, ప్రతిపక్ష పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమా చూడకుండానే వ్యాజ్యాలా! అంతకు ముందు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసలు సినిమా చూడకుండా, అందులో ఏముందో తెలియకుండా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనని, దీని ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణా ర్హత లేదన్నారు. టీవీల్లో ప్రసారమయ్యే సినిమా ట్రైలర్ల విషయంలో తాము జోక్యం చేసుకోబో మని, కేవలం రాజకీయ ప్రకటనల విషయంలోనే స్పందిస్తామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పుడే తీర్పును వెలువరిస్తామని, కొద్దిసేపు వేచి ఉండాలని స్పష్టం చేసింది. అయితే రాత్రి 7 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రదర్శించవద్దని అనధికార ప్రతివాదులుగా ఉన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత రాకేష్రెడ్డి తదితరులను ఆదేశించింది. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మళ్లీ బ్రేక్
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మళ్లీ బ్రేక్
సాక్షి, అమరావతి : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈ చిత్ర విడుదలను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. ఏప్రిల్ మూడో తేదీ వరకు ఈ సినిమాను నిలిపివేసింది. ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం 4గంటలకు హైకోర్టు జడ్జి చాంబర్లోన్యాయవాదుల సమక్షంలో చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. సినిమాను వీక్షించాకే తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్ర నిర్మాత ప్రివ్యూకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సెన్సార్ బోర్డ్ ఒకసారి అనుమతించాక అడ్డు చెప్పడానికి వీలు ఉండదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. పద్మావతి సినిమా రిలీజ్పై సుప్రీం కోర్ట్ ఆదేశాలను ప్రస్తావించి.. తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతించిన విషయాన్ని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. -
‘వీకెండ్ సినిమా’ ద్వారా యూఎస్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
ఆసక్తికరంగా మొత్తం రెండు రాష్ట్రాలూ వేచి చూస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ని ఊహించనంత పెద్ద యెత్తున, మార్చ్ 28న, 120 కన్నా ఎక్కువ థియేటర్లలో USA లో వీకెండ్ సినిమా సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇది ఎన్టీఆర్ మీద వస్తున్న మూడో బయోపిక్ అయినా కూడా, ఈ సంవత్సరంలో అత్యంత ఉత్సుకత రేపిన సినిమా అని అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమా చేసింది కాంట్రవర్సీ లకు పితామహుడు రామ్ గోపాల్ వర్మ. తన మాటల్లో చెప్పాలంటే ఈ సినిమా ఒక గొప్ప కథానాయకుడి, ఒక గొప్ప మహానాయకుడిని పూర్తి చేసే నిజమైన సినిమా. ఈ చిత్రం రిలీజ్ కి చాలా అడ్డంకులను ఎదుర్కొంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దీని ముద్ర ఉంటుందేమో అన్న భయాలు దానికి కారణం. అన్ని అవాంతరాలను దాటి ఈ మార్చి28న, ఎలక్షన్ కి రెండు వారాల ముందు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి చివరి రోజుల గురించి చూపించిన విధానానికి ప్రేక్షకులు తరలి వచ్చి ఈ సినిమా చూస్తారు అని ఊహిస్తున్నారు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ కోసం కాకపోయినా, ఎన్టీఆర్ కోసం కాకపోయినా, ఒక సినిమా నిజంగా పొలిటికల్ సినారియోని మార్చగలుగుతుంది అని భయపడి అడ్డంకులు కలిగించిన కొందరి అభిప్రాయం నిజమా కాదా అని చూడాడానికైనా ఈ సినిమా తప్పకుండా చూడాలి. యూఎస్లో మార్చ్ 28న భారీ ఎత్తున ప్రీమియర్స్ తో ఈ సినిమా ప్రతి నగరంలో రిలీజ్ చేస్తుంది వీకెండ్ సినిమా. -
భీమవరంలో పవన్పై పోటీ చేస్తా : ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రోజు వార్తల్లో కనిపిస్తున్న వర్మ తాజాగా ఎన్నికల బరిలో దిగుతున్నడుగా ట్వీట్ చేశాడు. అది కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటిచేస్తున్న భీమవరం నుంచేనట. గతంలో పవన్ను టార్గెట్ చేస్తూ చాలా ట్వీట్లు చేశాడు. పవన్ తన అభిమాన నటుడు అంటూనే విమర్శలు గుప్పించిన వర్మ కొంత కాలంగా ట్వీటర్లో మెగా ఫ్యామిలీ మీద కామెంట్స్ చేయటం మానేశాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు మరో 24 గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఇలాంటి సంచల ట్వీట్తో మరో సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసినా తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉండాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. 12 గంటల తరువాత చేసిన మరో ట్వీట్లో ఇది అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ జోక్ అని తేల్చేశాడు. అంతేకాదు ఈ జోక్ను నమ్మేంత తెలివి తక్కువ వారు ఎవరూ ఉండరనే అనుకుంటున్నా అని కామెంట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. I am contesting against @PawanKalyan in Bhimavaram ..Await DETAILS — Ram Gopal Varma (@RGVzoomin) 27 March 2019 Inspite of nominations stopping I got special permission from the very top to contest against @PawanKalyan Await DETAILS 🤜🤜🤜💪💪💪 — Ram Gopal Varma (@RGVzoomin) 27 March 2019 This is just an advance April Fool Joke ..I hope no one was stupid enough to believe it 😎 https://t.co/4XUU5q9vsz — Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. కొనసాగుతున్న సస్పెన్స్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు సినిమా రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వటంతో ఇక రిలీజ్ కు లైన్క్లియర్ అని భావించారు అంతా. అయితే తాజాగా ఈ సినిమాపై మరో రెండు పిటీషన్లు వేశారు. సెన్సార్ బోర్డ్ అనుమతులపై పిటీషన్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ దాఖలైంది. ఈ రెండు పిటీషన్ల విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను శుక్రవారం రిలీజ్ చేస్తానంటున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ జోరు పెంచారు. తాజాగా సినిమాలో నేనేం చేశాను అంటూ సాగే మరో ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశాడు వర్మ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ హాట్ టాపిక్గా మారటంతో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్లో రికార్డ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలకు సంబంధించిన అసలు నిజాలను ఈ సినిమాతో బయటపెడతానని వర్మ చెప్పటం, టీడీపీ నాయకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఆ క్రేజ్ టికెట్ల అమ్మకాల్లోనూ కనిపిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభించిన 10 నిమిషాల్లో కేవలం ఒక్క థియేటర్లోనే 1000 టికెట్లు అమ్ముడైనట్టుగా వెల్లడించాడు వర్మ. ‘ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. హైదరాబాద్లోని ఏయంబీ సినిమాలో బుకింగ్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా జోడించాడు వర్మ. టికెట్స్ కొన్నవారందరూ అసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు వర్మ. ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే😎 కథానాయకుడు మహానాయకుడు కన్నా 🙄లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, 😜అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు💪💪💪. జై బాలయ్య💐💐💐 pic.twitter.com/sZnczj7WMb — Ram Gopal Varma (@RGVzoomin) 26 March 2019 1000 tickets of #LakshmisNTR sold within 10 mins of booking of one theatre AMB ..THESE ARE THE REAL NTR FANS Not the fake fans of M... N.......https://t.co/gBNTxmudZT — Ram Gopal Varma (@RGVzoomin) 26 March 2019 -
నిజాలను నిగ్గుతేల్చడానికి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శతక్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామంటున్నాడు. ఇప్పటికే కోర్టుల రిలీజ్కు అనుమతి ఇవ్వటంతో పాటు సెన్సార్బోర్డ్ కూడా క్లీ యు సర్టిఫికేట్ ఇవ్వటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు అడ్డంకులన్ని తొలిగిపోయినట్టైంది. దీంతో వర్మ ప్రమోషన్ జోరు పెంచాడు. తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా కమల్ అనే వ్యక్తి క్రియేట్ చేసిన యానిమేషన్ ట్రైలర్ను తన ట్విటర్లో రిలీజ్ చేశాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ స్వయంగా రిక్షా తొక్కుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ట్రైలర్ను రూపొందించారు. వర్మ, అగస్త్య మంజు తో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటిస్తుండగా లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టి కనిపించనున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నాడు. -
చంద్రబాబు ఇంత...: రామ్ గోపాల్ వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు అడ్డంకులన్ని తొలగిపొవటంతో రామ్ గోపాల్ వర్మ మరింత జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కావటంతో ఓపెనింగ్స్ సూపర్బ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఈ శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు వర్మ. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మను కలిసాడు. ఆ ఫోటోలను తన ట్విటర్లో పోస్ట్ చేసిన వర్మ. ఆసక్తికర ట్వీట్లు చేశాడు. ‘చంద్రబాబు ఇంత’ అంటూ రెండు అసంపూర్తి పదాలతో పాటు కోపంగా, చిరాగ్గా ఉన్న ఎమోజీలను జోడించాడు. మోహన్ బాబును ఉద్దేశిస్తూ మీరు ఇప్పటికైనా నిజాలు చెబుతున్నందుకు ఆనందంగా ఉంది సార్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ రెండు ట్వీట్ను చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు వర్మ. ఇప్పడు నాకు వెన్నుపోటుదారుల చెంప పగలగొట్టి, మోహన్బాబుకు చప్పట్లు కొట్టాలనిపిస్తోంది అంటూ మరో ట్వీట్ చేశాడు. I never thought @ncbn was this b...d 🙄🙄🙄 F...k 😡😡😡#LakshmisNTR pic.twitter.com/Hg05BMTmQ3 — Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019 Sir , I am happy that at least now u are telling the real truths about @ncbn #LakshmisNTR pic.twitter.com/7KIZlzJ0cB — Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019 I feel like slapping the VENNUPOTUDAARULU and clapping the @themohanbabu #LakshmisNTR pic.twitter.com/rnHkCKnwNt — Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019 Rowdylaki Rowdylu 💪💪💪 pic.twitter.com/scVBEqXHbF — Ram Gopal Varma (@RGVzoomin) 25 March 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సినిమా తీశామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా...రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండాలను తప్ప, పార్టీలను చూపించలేదన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్ క్లియరెన్స్ కూడా వచ్చిందని నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత రాకేష్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ... వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. దీంతో రాకేశ్ రెడ్డి ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగని ఉత్కంఠ
సాక్షి, అమరావతి : రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 25న ఓటర్ల తుది జాబితా ఈనెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చూశామని, కొత్త ఓట్ల చేర్పుపై దుష్ప్రచారం చేయవద్దని కోరారు.రాష్ట్రంలో ఎవరి ఓటు తొలగించలేదని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, ప్రతి రెండు లోక్సభ నియోజక వర్గాలకు ఓ పోలీస్ పరిశీలకుడు., ఓ సాధారణ పరిశీలకుడు,ప్రతి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఓ సాధారణ పరిశీలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.రాజకీయ పార్టీలు, ప్రజలు పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్లో రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్లైట్లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్స్టార్కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్షాప్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్గా కరెక్ట్గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
‘కాదండి.. బాధ ఉండదండి..’
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వర్మ ప్రమోషన్ జోరు పెంచాడు. ఇప్పటికే వరుస ఇంటర్య్వూలతో హల్చల్ చేస్తున్న ఆర్జీవీ. సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. గురువారం రాత్రి చంద్రబాబు నాయుడు తన మనవడ్ని ఎత్తుకున్న ఫోటోను ట్వీట్ చేసిన వర్మ ‘ఈ 29న మీ కుటుంబంతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడండి’ అంటూ కామెంట్ చేశాడు. Watch #LakshmisNTR this 29th to know my truth with ur entire family pic.twitter.com/K2ZIhDWE3U — Ram Gopal Varma (@RGVzoomin) 21 March 2019 ఈ ట్వీట్ పై ఓ అభిమాని ఆసక్తికరంగా స్పందించాడు. ‘నా కథ నన్నే చూడమంటున్నాడు. కాదండి.. బాధ ఉండదండి’ అంటూ వర్మకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైని రామ్ గోపాల్ వర్మ రీ ట్వీట్ చేశాడు. తాజాగా డోనాల్డ్ ట్రంప్ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు వర్మ. గతంలోనూ పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్టుగా మీమ్స్ను రిలీజ్ చేసిన వర్మ ఇప్పుడు అభిమానులు రిప్లై ఇస్తున్న మీమ్స్ను కూడా రీ ట్వీట్ చేస్తూ మరింత వేడి పెంచుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. నా కథ నన్నే చూడమంటున్నాడు..😈 pic.twitter.com/JIf5X91GSR — Tyrion Vardhan🔥 (@HarshaV855385) 21 March 2019 -
డోనాల్డ్ ట్రంప్ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి..
-
‘వాళ్లందరికీ ఈ విజయం ఓ చెంప దెబ్బ’
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్కు సమయం దగ్గర పడుతుండటంతో దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే ట్రైలర్లు, పాటలతో ఆకట్టుకున్న వర్మ తాజా మరో పాటను విడుదల చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలు విజయానందంలో ఉండగా వచ్చే పాటను బుధవారం రిలీజ్ చేశారు. వర్మ ఆస్తాన రచయిత సిరా శ్రీ సాహిత్యమందించిన ఈ పాటను కల్యాణీ మాలిక్ సంగీత సారధ్యం లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, మోహన బోగరాజు ఆలపించారు. (చదవండి : లక్ష్మీస్ ఎన్టీఆర్ని ఆపడం కుదరదు) ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తీర్పుతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు చట్టపరమైన అడ్డంకులన్ని తొలగిపోయాయి. ముందుగా ఈ సినిమా మార్చి 22నే రిలీజ్ చేయాలని భావించినా.. నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి కాకపోవటంతో సినిమాను వారం రోజులు ఆలస్యంగా మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. (చదవండి : త్వరలో ఎన్టీఆర్ నైట్ : వెన్నుపోటు ఈవెంట్) -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ 29న రిలీజ్
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు లైన్ క్లియర్
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయవద్దు అంటూ సత్యనారాయణ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. విచారణ జరిపిన హైకోర్ట్.. ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కావున ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని తేల్చి చెప్పింది. రిలీజ్ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా వాటిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సినిమా విడుదలకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ముందుగా ఈ నెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్ వీరగ్రంథం కూడా మార్చి 22నే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమాను అడ్డుకునేందుకు అధికార పక్షం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే అనివార్య కారణాల వల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమా మార్చి 22న రిలీజ్ చేయాలని భావించినా, నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో వారం ఆలస్యంగా మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించినట్టుగా ఇటీవల వార్తలు రావటంతో రామ్ గోపాల్ వర్మ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కానీ కొద్ది సేపటికే సెన్సార్ సర్టిఫై చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రకటించారు. తాజాగా సినిమా వాయిదా పడటంతో ఎలక్షన్లకు 12 రోజుల ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Get Ready to know all the truths on March 29 th #LakshmisNTR pic.twitter.com/GRGTC9K3jR — Ram Gopal Varma (@RGVzoomin) 19 March 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై కుట్ర : కేసు వేయనున్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్బోర్డ్ నిరాకరించిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. తొలి దశ పోలింగ్ (11-04-2019) పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్ బోర్డ్ తనకు లెటర్ ఇచ్చినట్టుగా తెలిపిన వర్మ, ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలతో కలిసి రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా యగ్న శెట్టి నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. I AM FILING A CASE ON THE CENSOR BOARD FOR ILLEGALLY TRYING TO STOP LAKSHMI’S NTR Read the details at https://t.co/nKcycB7gtg pic.twitter.com/vKIw43mVPN — Ram Gopal Varma (@RGVzoomin) 17 March 2019 -
త్వరలో ఎన్టీఆర్ నైట్ : వెన్నుపోటు ఈవెంట్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయినా వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో భారీ ఈవెంట్కు సంబంధించి ప్రకటన చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడపలో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది.. ఈవెంట్ పేరు ‘వెన్ను పోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచేయబడుతుంది.. జై ఎన్టీఆర్’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మాతలు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ . ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆపాలి
సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిలిపివేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, సాధినేని యామిని, గౌతు శిరిషా, సతీష్లు ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి కలిసి సినిమా విడుదలను ఆపాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్గా చూపించారన్నారు. (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు) ఎన్నికల వేళ ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ప్రతిష్టతను దిగజార్చేలా సినిమా ట్రైలర్ ఉందన్నారు. ఎన్నికలల్లో చంద్రబాబును దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేశారు. రామ్గోపాల్ వర్మ విడుదల చేసిన ట్రైలర్ వీడియోని సీఈఓకి ఇచ్చామని, ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చదవండి : టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన లక్ష్మీ పార్వతి -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు’
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు’
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ను హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్) ఓ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్మెన్ రనౌట్ చేయిస్తాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మన్ డిఫెన్స్ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మన్ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్ ఆడిన బ్యాట్స్మన్ బంతిని బౌలర్కు అందించి సహచర ఆటగాడు రనౌట్లో భాగస్వామ్యమవుతాడు. దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్కు గురైన బ్యాట్స్మన్ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్ బ్రదర్’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. (ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు) @RGVzoomin #LakshmiNTR ni minchina venupootu idhi!! pic.twitter.com/nxt3eVfk3F — Saketh Ram Peri (@saketh_4490) March 12, 2019 -
‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఈసీదే నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారని, ఆయన తెలిపారు. సీఈవో రజత్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆర్టికల్స్, న్యూస్ ఐటమ్స్ ప్రచారం చేయకూడదె, చూపకూడదు. అలాగే కులం, భాష ప్రాతిపదికగా ఓటు అడగకూడదు. గత ఎన్నికల్లో 26 లక్షలమంది కొత్తగా ఓటు నమోదు చేసుకుంటే వారికి ఉచితంగా గుర్తింపు కార్డు ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 3 లక్షలమంది నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వారికి కూడా ఉచితంగా ఓటర్ కార్డులు ఇస్తాం. మూడు రోజులుగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నాం. నాలుగున్నర లక్షల పోస్టర్లను తొలగించాం. సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే ఆర్వోలు చర్య తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు తొలగించాం. ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాం. 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాం. 33 జిల్లాలకు డీఈవోలను నియమించాం. నగదు, మద్యం పంపిణీపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. అనధికారికంగా నడిచే బెల్ట్ షాపులు నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. లిక్కర్ షాపులు సమయాపాలన పాటించాలి. 2014లో 1649 కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు కేసులులపై ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక 2018లో 922 కేసుల నమోదు కాగా, 71 కేసులపై చర్యలు తీసుకున్నాం.’ అని తెలిపారు. కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిలిపివేయాలంటూ టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడును ఆ సినిమాలో కించపరిచేలా చూపించారని, ఆ ప్రభావం ఓటింగ్పై పడే అవకాశం ఉందని అన్నారు. తొలివిడత పోలింగ్ పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను వాయిదా వేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్పై స్టే ఇవ్వాలంటూ టీడీపీ ఈసీని ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలో సినిమాలోని కీలకమైన వైస్రాయ్ హోటల్ సీన్లో సోషల్ మీడియాలో లీకైంది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను దాచిన వైస్రాయ్ హోటల్ ముందు చైతన్య రథంపై ఎన్టీఆర్ ప్రసంగించటంలో ఆయనపై ప్రత్యర్థులు చెప్పులతో దాడి చేయటం, దీంతో ఎన్టీఆర్.. అంతా కలిసి నన్ను చంపేశారు అంటూ బాధపడటం లాంటి అంశాలు ఈ లీకైన వీడియోలో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రంగస్థల నటుడు విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతిగా కనిపించనున్నారు. శ్రీతేజ్ చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన లక్ష్మీ పార్వతి
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను నిలిపివేయాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్పందించారు. దీనిపై మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను ఆపడం సరికాదని అన్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాలు బయటకు వస్తాయనే ఈ సినిమాను ఆపాలని చూస్తున్నారని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని నిలదీశారు.(‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు) కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను నిలిపివేయాలని టీడీపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లపై సినిమా ప్రభావం ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమాను నిలిపివేయాలని కోరారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆ చిత్ర దర్శకుడు వర్మ చంద్రబాబును విలన్గా చూపిస్తున్నారని టీడీపీ భావిస్తోందన్నారు. టీడీపీ నేతలు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలని.. నిజాన్ని ఎప్పుడు ఎవరు దాచలేరని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల ఆదారం తెరకెక్కించిన చిత్రాన్ని.. ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్న సమయానికి(మార్చి 22న) విడుదల చేస్తానని వర్మ ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
నిజాన్నిఎవరూ దాచలేరు.. టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి
-
‘లక్ష్మీస్ ఎన్డీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్ను కలిసి సినిమా విడుదల వాయిదా వేసేలా చొరవ చూపాలని కోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలివేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు’ కాగా ఈ విషయంపై చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబును నెగెటివ్గా చూపించారని టీడీపీ భావిస్తోంది. నిజాన్నిఎవరూ దాచలేరని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్ చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Those from TDP party complaining to Election commission to STOP release of #LakshmisNTR because it might show the Andhra Pradesh Chief Minister @ncbn in bad light should realise that no one can in hell can STOP TRUTH https://t.co/6qLZnbGPfy — Ram Gopal Varma (@RGVzoomin) March 12, 2019 -
ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్లు, వీడియో సాంగ్స్తో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఎన్టీఆర్ సందేశం పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు వర్మ. ‘ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు’ అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో రిలీజ్ చేశారు వర్మ. ‘చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు’ అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను ఎలా పంచుకున్నారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు అన్న అంశాలను రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో ఎన్టీఆర్ సందేశంగా వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబును ఉద్దేశింంచి ’నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్వీ’ అంటూ చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ప్రొమోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు వర్మ. Prime minister @narendramodi talking about how Andhra Pradesh Chief Minister @ncbn Back Stabbed NTR #LakshmisNTR promo pic.twitter.com/aQk7Dcem6B — Ram Gopal Varma (@RGVzoomin) 12 March 2019 రంగస్థల నటుడు పీ విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నాడు. -
నీతిగా రాజకీయాలు చేస్తే ఉలికిపాటు ఎందుకు..?
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి స్ఫూర్తి బాలకృష్ణ
‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనకాల నాకు ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నా’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. అగస్త్య మంజు, రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథపై నాకు అంత అవగాహన లేదు. ‘వైశ్రాయ్ హాటల్’ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి హైదరాబాద్లో ఏం జరుగుతోంది అన్నది వాస్తవంగా నాకు తెలియదు. కానీ, బయోపిక్లు స్టార్ట్ అయ్యాక నేను కొంతమందిని కలిశాను. వాస్తవాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు పరిశోధించా. బయోపిక్ తీయడానికి ముఖ్యంగా కావాల్సింది నిజాయతీ. ఎన్టీఆర్గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక వారి బంధం నాలుగైదేళ్లు ఉంటే దాన్ని 2:30 గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడం సినిమాటిక్గా సాధ్యం కాదు. అందుకే ఆ సోల్ అనేది మిస్ అవకుండా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ఈ సినిమా నా కెరీర్లో చాలా చాలా ప్రత్యేకం’’ అన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీగారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. 23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకుని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో.. ఇక అలిసిపోయి ఇంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదు అనుకున్న సమయంలో.. ఆర్జీవీగారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలీదు. ఇంతకుముందు ఆర్జీవీగారి ‘క్షణం క్షణం’ సినిమా చూశాను. ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. తమదైన మార్గంలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లే ఇలాంటివాళ్లు సమాజాన్నే శాసించగలరు అనిపిస్తుంది. ఈ రోజు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఏ పాత్ర అయితే పనికిరాదు అని వాళ్లు అన్నారో.. ఏ పేజీలైతే చింపేయాలని కుటుంబం అంతా భావించిందో .. ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్గారికి లేదు అని చెప్పి ఒక ముద్రవేయడానికి వాళ్ల మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో... ఆ పేజీలను తీసుకుని, ఆ చరిత్రను తీసుకుని నేను న్యాయం చేస్తానని ముందుకువచ్చిన ఆర్జీవీగారికి థ్యాంక్స్. ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఫారిన్ నుంచి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆర్జీవీగారిలో ఓ హీరోను చూస్తున్నాం అన్నారు వారందరూ. ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు.. మహిళలందరికీ న్యాయం జరిగినట్లే అని వారు మాట్లాడుతుంటే ...æ గ్రేట్ ఆర్జీవీగారు. థ్యాంక్ఫుల్ టు యు’’ అన్నారు. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూడగానే నేను మాట్లాడాను. అతను వైసీపీ మనిషి అందుకే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అలా మాట్లాడే వెధవలకు నేను ఒకటే చెబుతున్నాను. తప్పు జరిగింది కాబట్టే దర్శకుడు ఈ సినిమా తీశారు. దానికీ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఏదడిగినా ‘నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్లాను.. ఇక్కడికి వెళ్లాను’ అంటారు. 36 సంవత్సరాల క్రితం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఎన్టీఆర్గారిది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మడం తిప్పని నైజం, సంస్కృతికి చిహ్నం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు. ఈ ఫేస్ను ఎవరు చూస్తారండి? ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖరరెడ్డిగారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు. ‘అయ్యా చంద్రబాబు.. నువ్వు ఏ రోజూ నిజం మాట్లాడవు. ఒక మునీశ్వరుడి శాపం ఉంది నీ తలపై. నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలు అవుతుందని’. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అసలు కథ. ‘వైశ్రాయ్ సంఘటనకు’ నేనే సాక్ష్యం. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత నిబద్ధతగా డైరెక్టర్గారు చూపించిన వాస్తవాలు గొప్పా? మీరు మాట్లాడే అబద్ధాలు గొప్పా? అప్పట్లో సీడీలు లేవు. వీహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ సీడీలు తీసుకొచ్చి చూపిస్తాను’’ అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని బయటికి రానివ్వరు, ఫలానా పార్టీవాళ్లు ఆపేస్తారు.. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు. నువ్వు నిజాయతీగా ఉండొచ్చు కదా? నిజాయతీగా ఉండని, నీతిమంతమైన రాజకీయాలు చేయనివాడికి ఇలాంటి సమస్యలొస్తాయి. వాజ్పాయి, అద్వానీ, పుచ్చలపల్లి సుందరయ్య... ఇలా చాలామంది నిజాయతీపరులకు సమస్యలు రాలేదు కదా? బాధలు, కన్నీళ్లు అన్నవి అవినీతి పనులు చేసినవాడికి, వెధవ వేషాలు వేసినవాడికి, వెన్నుపోటు పొడిచినవాడికి వస్తాయి.. వాడే బాధపడుతుంటాడు. నవ్వు ఆ పనులు ఆ రోజు చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా? ఏ రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా? నవ్వు వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా తనపై తానే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలి పెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను పౌరుడు. ఓటరు.. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు 100 శాతం ఉంటుంది. ఈ సినిమా జరిగిన కథ. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా బయటికొస్తే ప్రజలు రియలైజ్ అవుతారు’’ అన్నారు.‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతే విజయవంతం చేయాలి’’ అన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఈ వేడుకలో ‘‘ఆర్టీవీ గన్షాట్ ఫిల్మ్స్’ లోగోని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ బదులిస్తూ... ► ఎన్టీఆర్గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. లక్ష్మీపార్వతిగారి ఎపిసోడ్ లేకుంటే నేను చేయనన్నాను. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉండాలన్న విషయంలో మా మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి కానీ, కథ విషయంలో కాదు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. ► నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. రాజకీయాలను పట్టించుకోను. అయితే ఈ స్టోరీలో రాజకీయాలున్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చేయొద్దని కొందరు బెదిరించారు. అలాంటి వారికి భయపడితే సినిమా తీయలేం. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొద్దని నన్ను బెదిరిస్తే మాత్రం నేను కూడా వాళ్లను బెదిరిస్తా. ► ఈ కథలోని విషయాలు అందరికీ తెలుసు. తెలియని విషయాలు నేను చెప్పడం లేదు. జనాలకు నిజం చెప్పడమే నా లక్ష్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశా. నేను ఎన్టీఆర్గారికి వీరాభిమానిని. ఆయన జీవితంలో ‘వైశ్రాయ్’ సంఘటన ఎగై్జట్మెంట్ ఇచ్చింది కాబట్టే ఈ చిత్రం చేశా. ఇందులో ఎన్టీఆర్గారి ఔన్నత్యాన్ని ఎక్కడా తగ్గించలేదు. కొత్తవారికి ఏ ఇమేజ్ ఉండదు కాబట్టి పాత్రలు ఎలివేట్ అవుతాయి. అందుకే కొత్తవారిని తీసుకున్నాం. -
‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెపుతున్నా’
-
‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెపుతున్నా’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబంధించి మరో ట్రైలర్ను రిలీజ్ చేశాడు. తొలి ట్రైలర్లో ఎన్టీఆర్కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్లో లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్కు దగ్గరైన తరువాత లక్ష్మీ పార్వతిని.. ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్లో చూపించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ నుంచి దూరం చేయడానికి ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయాలను ట్రైలర్లో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సంచలనాలు నమోదు చేయటంలో రెండో ట్రైలర్ కూడా యూట్యూబ్ లో రికార్డు సృష్టింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తన సోషల్ మీడియా పేజ్లో ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ ‘ఇది స్వర్గం నుంచి ఎన్టీఆర్ విసిరిన లక్ష్మీ ఆటం బాంబ్’ అంటూ ట్వీట్ చేశారు. -
స్వర్గం నుంచి ఎన్టీఆర్.. వర్మను తిట్టాడట!
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని, వినని తెలుగు వారుండరు. అంతగా తన సినిమాలతో, మాటలతో, వివాదాలతో ముద్ర వేశాడీ దర్శకుడు. గత కొన్నేళ్లుగా తన స్థాయిలో ఓ సినిమాను తీయాలని అభిమానులు ఆశిస్తుండగా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఆర్జీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తానని ప్రకటించాడు ఆర్జీవీ. ట్రైలర్ విషయంలో స్వర్గం నుంచి ఎన్టీఆర్ తనను తిట్టాడనీ, రేపు (మార్చి 8) ఉదయం 9.27 గంటలకు ప్రీపోన్ చేయాలని అన్నారని ట్వీట్ చేశాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. రెండో ట్రైలర్తో ఇంకెంత వేడిని పెంచేస్తుందో చూడాలి. NTR from heaven scolded me and asked me to prepone the release of #LakshmisNTR Theatrical Trailer to 9.27 Am tmrw 8 th morning 🔪 pic.twitter.com/eWdhJrNTR1 — Ram Gopal Varma (@RGVzoomin) March 7, 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. బాబుకు మరో ఝలక్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్ను రిలీజ్ చేశాడు. తొలి పాటలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతీల మధ్య ప్రేమాను రాగాలను చూపించిన వర్మ రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను టార్గెట్ చేశాడు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ప్రణయ గీతం) అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్గా చూపించాడు. వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ పాటతో పాటు రేపు (మార్చి 8) సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. (చదవండి : భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ) -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ముందే రిలీజ్ చేస్తారా!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న రిలీజ్ అంటూ ప్రకటించేశాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కాస్త ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావటంతో సినిమాకు అదే స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. అందుకే పెద్ద పోటి లేని సమయంలో రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు దొరకటంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయన్న ఆలోచనలో ఉన్నారట లక్ష్మీస్ ఎన్టీఆర్ టీం. మార్చి 22న ప్రేమకథా చిత్రం 2తో పాటు అల్లు శిరీష్ ఏబీసీడీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను వారం ముందుగానే మార్చి 15న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. ముందుగా రిలీజ్ చేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైన ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు నమోదు చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తానికి సినిమాను అమ్మేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రయూనిట్ ఖండించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబంధించిన గమనిక’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంచి లాభాలకు వర్మ సినిమాలను అమ్మేసినట్టుగా టాలీవుడ్ లో సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన వర్మ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు ...ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ పాట విడుదల
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ప్రణయ గీతం
ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న వర్మ, తాజాగా ఓ వీడియో సాంగ్ను రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రణయ గీతం వీడియోను రిలీజ్ చేశాడు. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అంటూ సాగే ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి వీడియో సాంగ్
యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు నిరాశపరచటంతో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మరో సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆసక్తి మరింత పెరిగింది. బాలకృష్ణ నిర్మించిన బయోపిక్లో చూపించని చాలా నిజాలు లక్ష్మీస్ ఎన్టీఆర్లో చూడొచ్చని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు. వర్మ కూడా తను తెరకెక్కిస్తున్నదే అసలు కథ అంటూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో పాటు లిరికల్ వీడియోలతో ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, రేపు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. సినిమాలో ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే పాట వీడియోను రేపు ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ పాటను ఎన్టీఆర్కు ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని తెలిపారు. First song video of #LakshmisNTR to release tomorrow sunday at 9.27 AM ..Sung by the legendary S P Balasubramaniam,who sang almost all the super hit songs of NTR pic.twitter.com/qpM4LoB75j — Ram Gopal Varma (@RGVzoomin) 23 February 2019 -
వాటీజ్ దిస్ అనేది..లక్ష్మీస్ ఎన్టీఆర్లోనే
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడద్దొంటూ చంద్రబాబు ఏవిధంగా చెబుతారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ నేతలకు ఏ సినిమా చూడాలో కూడా చంద్రబాబే చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. వాస్తవాలు ఉన్నాయి కనుకనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటే చంద్రబాబు భయపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్పై బాలకృష్ణ తీసిన సినిమాల్లో వాస్తవం లేదు కాబట్టే.. ఆ సినిమాలను ప్రజలు ఆదరించడం లేదన్నారు. ఆ సినిమాలతో బయోపిక్కు అర్థమే మార్చేశారని ఆమె ఎద్దేవా చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ధైర్యంగా, నిజాయితీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తెస్తున్నారని, ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని, లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వాటీజ్ దిస్ అనేది...ఈ సినిమాతోనే తెలుస్తుందన్నారు. బయోపిక్ అంటూ బాలకృష్ణ ఏం చూపించలేదో, తాను అది చూపిస్తానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెబుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసుకునే చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆయన పతనానికి కారణం అయిన చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అలా చేయలేదని ఖండించాలని సవాల్ విసిరారు. తాను చేసిన పాపాలన్నీ చంద్రబాబును నలువైపుల నుంచి కారు మేఘాల్లా కమ్ముకు వస్తున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఆ కారణంగా తనపై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మరణం, ఆనాటి పరిణామాలపై విచారణ కమిటీ వేయాలని తాను అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా అడిగినా, పట్టించుకోలేదని అన్నారు. చరిత్రను దిక్కు, మొక్కు లేకుండా చేయాలని చూసిన చంద్రబాబు దుర్మార్గం ఇన్నాళ్లకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపంలో బయటపడుతుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. -
వీడియో టీజర్తో కౌంటర్ ఇచ్చిన వర్మ
-
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఉలిక్కి పడ్డ చంద్రబాబు
-
భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ
ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అంతేకాదు సినిమాపై విమర్శలు చేస్తున్న వారిపై కూడా తనదైన స్టైల్లో విరుచుకు పడుతున్నాడు. తాజాగా పార్టీ నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అంతేకాకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడద్దొని...ఎన్టీఆర్ గురించి వాస్తవాలు తెలియాలంటే బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. (లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై చంద్రబాబు ఉలిక్కిపాటు..) ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వర్మ ఓ వీడియో టీజర్తో కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్తో భయపడిన సీబీన్ రియాక్షన్ అంటూ ఓ వీడియోనే తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్కు మీ నుండి వచ్చే రియాక్షన్ ఏంటి సార్’ అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా ‘మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే’ అని ఆవేశంగా చెప్పే డైలాగ్ను జోడించి వీడియో రిలీజ్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. వర్మ ముందు నుంచి చెపుతున్నట్టుగానే అసలు నిజాలను బయటపెడుతున్నాడంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాను మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వర్మ. -
లక్ష్మీస్ ఎన్టీఆర్పై చంద్రబాబు ఉలిక్కిపాటు..
సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి సీఎం చంద్రబాబు ఏకంగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ప్రస్తావించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని, అందుకే ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సినిమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ముక్తాయించారు. కాగా ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ దర్శకుడు వర్మ నిర్వహించిన ట్విటర్ పోల్కు భారీ స్పందనతో పాటు, నెటిజన్లు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే జై కొట్టారు. -
నిజాలను దాచేసే సినిమాలెందుకు?
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తే చంద్రబాబును విలన్గా చూపిం చాలి. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ జరిగిన ఘటనలను మహానాయకుడు చిత్రీకరిస్తే మాత్రం చంద్రబాబు పాత్రలో వక్రీకరణలు తప్పవు. ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. వి డోంట్ నీడ్ ఎన్టీఆర్ (మాకు ఎన్టీఆర్ అవసరం లేదు) అని ఎన్టీరామారావు నుంచి అధికారం లాక్కున్న కొద్ది రోజులకే ఒక స్థానిక ఆంగ్ల దిన పత్రికకు చంద్రబాబు నాయుడు ఇంటర్వూ్య ఇచ్చిన సమయానికి నందమూరి బాలకృష్ణ ఆయనతోనే ఉన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ మొదలయిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఉన్నారు. ఎన్టీ రామారావును దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకు ఉన్న ఫొటోలను తీసి మరుగు దొడ్ల పక్కన పడేస్తే మీడియా వాళ్ళు ఫొటోలు తీసి ప్రచురించిన విషయం ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రసీదు పుస్తకాల మీద పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రచురిస్తూ వచ్చిన ఎన్టీఆర్ బొమ్మను తొలగించేసిన చంద్రబాబు తరువాత హరికృష్ణ అలగడంతో తిరిగి ఆ రసీదు పుస్తకాలను మార్చి ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన విషయమూ తెలుసు. ఇప్పుడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ అని, ఆయన విగ్రహాలకు దండలు వేసినంత మాత్రాన ఆయన మీద చెప్పులు వేయించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఎన్నికలలో గెలుపు కోసం ఎన్టీఆర్ భజన తప్ప ఈ బృందం ఆయనను నిజాయితీగా గౌరవించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ స్తోత్ర పారాయణంలో స్వరం పెంచారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని పదవి కోణంలో నుండి చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు పరిపాలనను చూసిన జనం మార్పు కోరుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ను ఎన్నికలలో లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సినిమాల రూపంలో మొదలుపెట్టారు చంద్రబాబు. బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కిస్తుంటే చంద్ర బాబును ఎందుకు మధ్యలోకి తేవడం అని ఎవరయినా అనుకోవొచ్చు. చంద్రబాబు అన్నీ అట్లాగే చేస్తారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. మొదటిది ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం చివరన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే వరకే చూపించారు. ఎన్టీఆర్ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంలోకి రావడం ఇట్లాంటివన్నీ ఉండే రెండో భాగం ఎన్టీఆర్ మహా నాయకుడు ఎల్లుండి విడుదల కాబోతున్నది. మొదటి భాగం కథానాయకుడును జనం పెద్దగా ఆదరించలేదు. ఈ రెండో భాగం ఎట్లా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఎన్టీరామారావు రాజకీయాల్లో నిలబడటానికి, కొనసాగడానికీ విజయాలు సాధించడానికీ బాబు నిర్వహించిన గొప్ప పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎన్టీరామారావు కథానాయకుడిగా తీసిన మొదటి భాగం పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదు. రెండవ భాగం అట్లా కాదు రెండు ఆగస్టు సంక్షోభాలను ఇందులో తెరకెక్కించాలి. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు చేసింది ఎన్టీఆర్కు వెన్నుపోటు అయితే, 1995 ఆగస్టులో బాబు చేసింది కూడా ఎన్టీఆర్కు వెన్నుపోటే కావాలి, బాబు చేసింది ప్రభుత్వాన్ని, పార్టీని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టం మేరకు జరిగినదిగా భావిస్తే 84లో నాదెండ్ల చేసిందీ అదే అనుకోవాలి, అయితే నాదెండ్ల విఫలం అయ్యారు, బాబు సఫలం అయ్యారు. ఇవన్నీ ఎట్లా చూపిస్తారు ఈ సినిమాలో, అసలు చూపిస్తారా లేదా? ఆ రెండు ఎపిసోడ్లు లేకుండా ఎన్టీఅర్ రాజ కీయ జీవితాన్ని తెరకు ఎక్కించడం ఎట్లా సాధ్యం? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులనూ, రాజ కీయ పరిశీలకులనూ వేధిస్తూ ఉండవచ్చు. ఈ మధ్యలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవి తంలోని ఒక స్వల్ప ఘట్టం, ఎంతో ముఖ్యమయిన ఘట్టం కూడా, పాదయాత్రను ఆధారం చేసుకుని తీసిన యాత్ర సినిమా అద్భుత ప్రజాదరణ పొందింది. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కొంత లాభం చేస్తే చెయ్యొచ్చు కానీ అందుకోసమే తీసిన సినిమా కాదు, ఎందుకంటే ఇందులో ఎన్నికలలో లబ్ధి కోసం ఉద్దేశించిన వక్రీకరణలు లేవు. అటువంటి వక్రీకరణలకు ఈ సినిమాలో అవకాశం కూడా లేదు. యాత్ర తీసిన వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొం టున్న కొన్ని తీవ్ర సమస్యలకు అధికారంలోకి రాగానే కనుగొన్న పరిష్కారాలకు సంబంధించినంత వరకే పరిమితం అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ అందులో ప్రధానమైనవి. ఈ పథకాల కారణంగా రాజశేఖరరెడ్డి పరిపాలనలో లాభపడ్డ కోట్లాది మందికి కొత్తగా చెప్పాల్సింది, మెప్పించాల్సింది ఏమీ లేదు. ఇంకెవరికో రాజకీయ లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రజా జీవి తంలో వైఎస్ ఆర్ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం వరకే పరిమితం అయ్యారు కాబట్టి యాత్ర సినిమా అందరినీ ఆకట్టుకున్నది. మరి ఎన్టీఆర్ రాజకీయ జీవి తాన్ని తెరకు ఎక్కించాలనుకుంటున్న బాలకృష్ణ కేవలం ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తారా లేక చంద్రబాబు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా తీస్తారా అన్నది చూడాలి. నిజాయితీగా తీస్తే చంద్రబాబును విలన్గా చూపించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పిన చివరి మాటలు అవే కదా. జామాతా దశమగ్రహం అన్నాడు ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అతడిని నమ్మడమే అని కూడా చివరి మాటల్లో బాధపడ్డాడు ఎన్టీఆర్. పోనీ చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీస్తారా, అదెట్లా సాధ్యం? మా నాయకురాలు కోరితే మామ మీద అయినా పోటీ చేస్తాను అన్న దగ్గరి నుంచి వైస్రాయ్ కుట్ర దాకా చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ సినిమా ఎట్లా తీస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదు లక్ష్మీ పార్వతి లేకుండా కూడా ఈ సినిమా సంపూర్ణం కాదు. అయితే తనను గొప్ప రాజకీయ దురంధరుడిగా, లక్ష్మీపార్వతి ఒక చవకబారు స్త్రీగా చిత్రించే విధంగా గతంలో పుస్తకాలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. బాలకృష్ణ తీసే సినిమాలో కూడా బావగారి రాజకీయ చతురత, పరిపాలనా సామర్థ్యం ముందు పీఠిన ఉండి మొత్తానికి ఎన్టీఆర్ వ్యక్తిత్వం మరుగున పడే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ ఈ సిన్మా ఉంటే మాత్రం చంద్రబాబు పాత్రలో విపరీతమైన వక్రీకరణలు తప్పవు. ప్రజా జీవితంలో ఎన్టీఆర్ మహనీయతకు మహానాయకుడు సినిమాలో చంద్రగ్రహణం తప్పదు. నా తండ్రి వంగవీటి రంగాను హత్య చేయించింది తెలుగుదేశంవారు కాదు అని ఆయన కుమారుడు రాధా చేత చెప్పించి రాజకీయ నడివీధిలో అతడిని వదిలేయగలిగిన తెలివితేటలూ చంద్రబాబువి. అటువంటి చంద్రబాబు బాలకృష్ణ చేత ఈ సినిమాలో మా బావ బంగారం అనిపించకుండా ఉంటాడని ఎట్లా అనుకుందాం. ఎన్టీఆర్ మరణించిన 23 ఏళ్ళ తరువాత ఇప్పుడెందుకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని అని పించింది అంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే అనడంలో సందేహం లేదు. మరి రాజశేఖరరెడ్డి మీద సినిమా ఆయన మరణించిన పదేళ్లకు ఎందుకు తీయాల్సి వొచ్చింది అన్న ప్రశ్న కూడా చంద్రబాబు అభిమానులు అడగొచ్చు. రాజశేఖర్ రెడ్డి సినిమా తీసింది ఆయన కొడుకు కాదు, రాజకీయాల్లో కూడా లేడు. ఎన్టీఆర్ సినిమా తీస్తున్నది ఆయన కుమారుడు, రాజకీయంగా తన బావకు, తద్వారా తన అల్లుడికి లాభం చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తి. బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే ఇది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉంటుందనే భావన వెంటనే కలుగుతుంది, 1989లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయం నుండి ఆయన తుది శ్వాస దాకా ఉండే ఈ సినిమాలో అయినా లక్ష్మీపార్వతి పాత్రకు న్యాయం జరుగుతుందేమో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ : వర్మ
సాధారణంగా బయోపిక్ అంటే, జీవితంలోని అన్ని విషయాలూ కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే స్వర్గీయ ఎన్టీఆర్పై ఏకకాలంలో బయోపిక్లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఎన్టీఆర్ బయోపిక్లలో ఏది నిజాయితీతో, యధార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మపెట్టిన పోల్కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్ ఎన్టీఆర్కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్ రిజల్ట్ను పోస్ట్ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. Which film will be more honest and truthful ? — Ram Gopal Varma (@RGVzoomin) February 17, 2019 ఇక ఇప్పటికే వచ్చిన కథా నాయకుడు రిలీజ్ తర్వాత... అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. మహానాయకుడులో వెన్నుపోటు ఎపిసోడ్ని మేనేజ్ చేసి ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన ఆ భాగం చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
‘ఎన్టీఆర్ ఆశీస్సులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ వేడిని మరింత రాజేసింది. ఈ ట్రైలర్కు భారీ రెస్సాన్స్రావటమే కాదు రికార్డ్ వ్యూస్తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. రిలీజ్ అయిన గంటన్నరలోనే మిలియన్ వ్యూస్ సాధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి వ్యూస్ సాధించినట్టుగా వర్మ ప్రకటించాడు. వివిధ యూట్యూబ్ చానల్స్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలో కలిపి ఈ వ్యూస్ సాధించినట్టుగా వర్మ తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. 1 CRORE VIEWS on https://t.co/Otvxvi35u2 As per digital team5.7 MYouTube .TVNXT185K Hotshot684K MM35KYoung Andhra 66KOnline India245K Filmy Focus26K TFN386KTelugu Cinema.1M FB.287K Along with many other uploads on random FB pages and channels. NTR BLESSED #LakshmisNTR — Ram Gopal Varma (@RGVzoomin) 16 February 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: వాడిని నమ్మడమే నేను చేసిన ఏకైక తప్పు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజ్ అయింది. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్లో స్పష్టంగా చూపించాడు వర్మ. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్ష వ్యూస్ రావడం విశేషం. (‘ఎందుకు.. ఎందుకు.. లక్ష్మీ పార్వతి ఎందుకు..’) నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీవీ ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్కు ఒక రోజు ముందు ‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. రేపు మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ('లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్) -
‘మహానాయకుడు’తో పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన ‘యన్టిఆర్-మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్ను ప్రేమికుల రోజున విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. తాజాగా మహానాయకుడు రిలీజ్ డేట్ను ఫిక్స్ చేయడంతో.. తన సినిమా ట్రైలర్ను కూడా ఆ మూవీతో పాటు చూడండి అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ‘ఫిబ్రవరి 14న 9.27గంటలకు ట్రైలర్ను విడుదల చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ను ఫిబ్రవరి 22న మహానాయకుడుతో పాటు విడుదల చేస్తాము. మహానాయకుడు చూడటానికి వచ్చిన వారు మా మూవీ ట్రైలర్ను కూడా చూడొచ్చు’ట్విటర్లో పేర్కొన్నాడు. Trailer of #LakshmisNTR releasing 14 th feb 9.27 AM and Theatrical Trailer will release on Feb 22nd with Mahanayakudu ..So whoever comes to the theatre to see Mahanayakudu can see the trailer of #LakshmisNTR 💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019 -
నా సినిమాకు ప్రధాని పబ్లిసిటీ : ఆర్జీవీ
నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ.. ఆయన తీసే సినిమాలకు తనదైన శైలిలో పబ్లిసిటీ కల్పిస్తూ ఉంటాడు రామ్గోపాల్ వర్మ. ఆర్జీవీ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తన సినిమాకు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీనే పబ్లిసిటీ కల్పిస్తున్నాడు అంటూ ట్వీట్ చేశారు. నేడు (ఆదివారం) గుంటూరులో జరుగుతున్న సభలో నరేంద్రమోదీ ప్రసంగిస్తూ.. పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కొత్త కూటములు కట్టడంలో, మామాగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదగడంలో చంద్రబాబు తనకంటే సీనియర్ అని అన్న వీడియోను పోస్ట్చేశాడు. ఒక్కొక్క సాంగ్ను విడుదల చేస్తూ.. తన స్టైల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ను ప్రమోట్ చేస్తున్నాడు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. Prime Minister @narendramodi doing publicity for #LakshmisNTR https://t.co/dyZmafN1lX — Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2019 -
‘ఎన్టీఆర్ కథానాయకుడో.. మహానాయకుడో కాదు’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశాడు వర్మ. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేసిన వర్మ ఎన్టీఆర్ కథానాయకుడు కాదు.. మహానాయకుడు కాదు. ఆయన అసలు నాయకుడు కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అసలు సిసలు నాయకుడు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వ్యతిరేకిస్తున్న వారికి మరోసారి తనదైన స్టైల్ చురకలంటించారు. My tweet GV FILMS releasing trailer of the most dynamic love story ever of NTR and Lakshmi parvathi on Feb 14 th Valentine’s Day at 9.27 AM #LakshmisNTR is a love story mixed with ungrateful families disloyal followers nd backstabbing betrayers..GET READY FOR THE TRUE STORY pic.twitter.com/ygT0xNDIJU — Ram Gopal Varma (@RGVzoomin) 9 February 2019 Trailer release on February 14th at 9.27 AM #LakshmisNTR THE TRUE STORY pic.twitter.com/2y85HOhbYB — Ram Gopal Varma (@RGVzoomin) 9 February 2019 NTR is neither kadhanayakudu nor Mahanayakudu ...He is AsaluNayakudu but the one who backstabbed him is Asalu Sisalu Naayakudu pic.twitter.com/sDJJgw00md — Ram Gopal Varma (@RGVzoomin) 9 February 2019 -
అసలు నిజం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపిస్తా : వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి చంద్రబాబు ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాని వర్మ, తాజా ట్వీట్లో మాత్రం సీబీఎన్ అంటూ చంద్రబాబు పేరును కూడా తెరమీదకు తీసుకువచ్చాడు. వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ఈజ్ ఫిక్షన్ (కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది కథ), వై సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) బ్యాక్స్టాబడ్ ఎన్టీఆర్ ఈజ్ రియల్ (సీబీఎన్, ఎన్టీఆర్ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది నిజం).ఆ నిజమేంటో లక్ష్మీస్ ఎన్టీఆర్లో తెలుసుకోండి అంటూ మరో సంచలన ట్వీట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటోంది, యాజ్ఞ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఓ రంగస్థల నటుడ్ని పరిచయం చేయబోతున్నాడు వర్మ. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వర్మ తన స్టైల్లో జోరుగా నిర్వహిస్తున్నాడు. Why KATAPPA killed BAHUBALI is FICTION. Why CBN backstabbed NTR is REAL. Find out the TRUTH in #LakshmisNTR — Ram Gopal Varma (@RGVzoomin) 3 February 2019 -
‘స్వర్గంలో ఉన్న ఎన్టీఆరే అలా చేయమన్నారు’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ‘యన్.టి.ఆర్’ మూవీపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు.. తాను తెరకెక్కిస్తున్న బయోపిక్కు మాత్రమే ఉంటాయని పదే పదే చెపుతున్న వర్మ, తాజాగా మరిన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. తానే తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ తనకు సూచించారని ట్వీట్ చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ థియట్రికల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోయేది ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ను ప్రకటించటంపై ఆధారపడి ఉంది. మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్ నాకు సందేశం ఇచ్చారు. యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆయన సొంత కొడుకు కథానాయకుడును కాకుండా భార్య లక్ష్మీస్ ఎన్టీఆర్ను మాత్రమే ఆశీర్వదిస్తారు అనటానికి కథానాయకుడు రిజల్టే నిదర్శనం. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ల మధ్య పోటీని ఆయన స్వాగతిస్తారు’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్పై సందిగ్ధత ఏర్పడింది. తొలి భాగం డిజాస్టర్ కావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ఇదే అదునుగా వర్మ తన మాటలు, ట్వీట్లతో లక్ష్మీస్ ఎన్టీఆర్కు కావాల్సినంత ప్రమోషన్ చేసుకుంటున్నాడు. Main theatrical trailer of #LakshmisNTR will release on a date depending upon when #Mahanayakudu release date will be announced only because of technical psychological and much above all emotional reasons 😔😔😔 — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 Release date of #LakshmisNTR trailer will be announced the moment when release date of #Mahanayakudu is announced and this only because NTR from heaven instructed me to do so — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 NTR from heaven warned me to release the trailer of #LakshmisNTR within exactly 24 minutes of the official announcement of the release date of #Mahanayakudu — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 The very fact that NTR did not bless his own son’s #Kathanayakudu is proof that he will only and only bless his wife’s #LakshmisNTR and the proof of that will be the clash between the releases of #Mahanayakudu and #LakshmisNTR .. May NTR Bless🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఈ పాత్ర ఎవరిది?’
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్లో చేస్తున్నాడు. వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్న వర్మ పేర్లు వెల్లడించకుండానే ఆ స్టిల్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. తాజాగా షూటింగ్కు సంబంధించి మరికొన్ని స్టిల్స్ను రిలీజ్ చేసిన వర్మ, మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఈ పాత్ర ఎవరిది.?’ అంటూ ఓ స్టిల్ను పోస్ట్చేశాడు వర్మ. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఈ క్యారెక్టర్ హరికృష్ణదే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరో ఫొటోలో హరికృష్ణతో పాటు బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. I wonder who these characters are in #LakshmisNTR and why they are looking so upset with Lakshmi Parvathi ? pic.twitter.com/KAdAKrHIVR — Ram Gopal Varma (@RGVzoomin) 29 January 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరో అప్డేట్ ఇచ్చిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోనే కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైంది. ఇప్పటికే టీడీపీ వర్గాలు వర్మ సినిమాపై మండిపడుతున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు పాటలతో పాటు కీలక పాత్రల దారులను పరిచయం చేసిన వర్మ మరో అప్డేట్ ఇచ్చాడు. అంతేకాదు వర్మ ప్రకటనలకే పరిమితమయ్యాడా..? నిజంగానే సినిమా తీస్తున్నాడా అన్న అనుమానాలకు కూడా తెర దించాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్లోకేషన్ స్టిల్స్ను రిలీజ్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్తో పాటు మరో స్టిల్ను రిలీజ్ చేశాడు. వర్మ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటునే తనదైన స్టైల్లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కానిచ్చేస్తున్నాడు. ఈ నెలాఖరున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ను రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. A pic from #LakshmisNTR TheTrueStory pic.twitter.com/U3RN11pYnW — Ram Gopal Varma (@RGVzoomin) 21 January 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్కింగ్ స్టిల్స్
-
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
-
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్లో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్ మీడియా పోస్ట్లతో మరింత వేడి పెంచుతున్నాడు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి 2 టైటిల్స్ సమయంలో వచ్చిన బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫొటోషాప్లో గ్రాఫిక్స్ చేసిన ఇమేజ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ.. ‘ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. వీరిని గుర్తుపట్టడంలో నాకు సాయం చేయండి’ అంటూ కామెంట్ చేశాడు. వర్మ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈసినిమాలో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటించనున్నారు. These faces are vaguely reminding of two people I know ..can u please help me with my memory pic.twitter.com/Hgqb3tKNB5 — Ram Gopal Varma (@RGVzoomin) 19 January 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రంగస్థల నటుడు..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వర్మ కూడా తనదైన స్టైల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచాడు. ఇప్పటికే రెండు లిరికల్ వీడియోలను రిలీజ్ చేసి తన ఉద్దేశం ఏంటో..? సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు. తాజాగా వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్రధారిని పరిచయం చేశాడు. ఇప్పటికే చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రల్లో కనిపించబోయే నటుల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పాత్రలో కనిపించబోయే నటుడి టీజర్ను రిలీజ్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ గా కనిపిస్తున్న నటుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారుడని వెళ్లడించాడు వర్మ. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, డైలాగ్ డెలవరీ కోసం కొన్ని నెలలుగా అతడికి శిక్ష ఇస్తున్నామని తెలిపాడు. Contrary to some reports the person who is playing NTR In #LakshmisNTR is a telugu theatre actor from West Godavari who I put under training for months to catch NTR’s body language , demeanour , speech pattern etc https://t.co/TX6APEvZ1o — Ram Gopal Varma (@RGVzoomin) 19 January 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్ లుక్ విడుదల!
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్ లుక్ విడుదల!
వివాదాలకు కేరాఫ్.. సంచలనాలకు తెరలేపే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అలాంటి ఆర్జీవీ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను వదులుతూ హాట్ టాపిక్గా మారుతున్నాడు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరో అప్డేట్ను ఆర్జీవీ ప్రకటించేశాడు. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ప్రకటించిన ఈ ప్రోమోలో ఎన్టీఆర్ పాత్రను రివీల్చేశాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న ఎన్టీఆర్ లుక్ను తనదైన శైలిలో ఆర్జీవీ విడుదల చేశారు. వెన్నుపోటు పొడిచిన తరువాత ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్లో సజీవంగా తిరిగి వస్తున్నారు అంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ లుక్ను రిలీజ్ చేశాడు. After he was killed by backstabbing NTR comes back once again alive in Lakshmi’s NTR https://t.co/TX6APEeo9Q — Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2019 -
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ప్రకటన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ఒక్క అప్డేట్తో మరిన్ని వివాదాలకు తెరతీస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబంధించి మరో అప్డేట్ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో యాగ్న శెట్టి నటిస్తున్నారు. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోయే నటుడినే వర్మ ఈ రోజు ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. వర్మ ఈరోజు ఎలాంటి వివాదాలకు తెరలేపుతాడో తెలియాలంటే ఐదు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. Watch NTR become alive on his death anniversary at 5 pm today #LakshmisNTR The True Story pic.twitter.com/Bg1l4ZcLrg — Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2019 -
లక్ష్మీపార్వతి పాత్ర రివీల్ చేసిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి సంచలనం సృష్టించాయి. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరు కనిపిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీపార్వతి పాత్ర ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. యజ్ఞ శెట్టి గతంలో వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఈ చిత్రాని సంబంధించిన రెండో పాటలో ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయమ’ని చెప్పిన వర్మ.. సినిమాను త్వరలోనే సినిమాను విడుదల చేయనన్నట్టు తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. -
‘ఎందుకు.. ఎందుకు.. లక్ష్మీ పార్వతి ఎందుకు..’
ఓ వైపు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటించిన యన్.టీ.ఆర్ కథానాయకుడు విడుదలకు సిద్దమవుతుండగా.. రామ్గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం రేపుతున్నారు. వెన్నుపోటు సాంగ్ అంటూ రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ఎన్నో వివాదాలకు ఆజ్యంపోసింది. చివరకి కేసులు పెట్టుకునేదాక పోయింది. అయితే వెనుకడుగు వేస్తే.. ఆర్జీవీ ఎలా అనిపించుకుంటారు. మళ్లీ తన చిత్రంలోని రెండో సాంగ్ను రిలీజ్ చేసేశారు. అంతేనా.. ఈ పాట చివర్లో తన గాత్రంతో ఉన్న సంభాషణలు వింటే కొందరికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం. ఇరవై సంవత్సరాలకి పైగా నిజానికి అబద్దమనే బట్టలు తొడిగి.. వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటు దారుల అందరి బట్టల్ని ప్రజల కళ్ల ముందు చింపి అవతలపారేసి.. నిజం బట్టల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా విప్పి .. దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం’ అంటూ వర్మ తన స్టైల్లో చెప్పాడు. ఎందుకు ఎందుకు అంటూ జయసుధ, జయప్రధ, శ్రీదేవి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ.. సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ ఎన్నో కోణాల్లోంచి ప్రశ్నలను సంధించారు. సిరాశ్రీ ఈ పాటను రాయగా.. కళ్యాణీ మాలిక్, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఉతికి ఆరేయటమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ధ్యేయం : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా నుంచి రెండో పాట ‘ఎందుకు?’ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. తొలి పాట ‘వెన్నుపోటు’తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ, రెండో పాటలో ఎలాంటి వివాదాలకు తెర తీస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన టీజర్లోనూ వర్మ మరో బాంబు పేల్చబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ‘ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దాలుగా చెలామణీ అవుతున్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం’ అంటూ వర్మ మాటలతో రిలీజ్ చేసిన టీజర్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి వారందరినీ వదలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు..? అనే లిరిక్స్తో పాట కాన్సెప్ట్ను కూడా రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. Here’s a teaser trailer of Endhuku ? Song from #LakshmisNTR ..Full song releasing today at 5 PM pic.twitter.com/WctXXLNbpK — Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2019 -
ఎన్టీఆర్పై కేసు ఎందుకు పెట్టలేదు?
తనపై కేసు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గట్టి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో మోహన్రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని వెన్నుపోటు పాటలో చంద్రబాబును కించపరిచారని తన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై తాజాగా వర్మ స్పందించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎన్టీఆర్పై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వీ మోహన్రెడ్డిని ట్విటర్లో వర్మ ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికుండగా ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు) How come Kurnool MLA S V Mohan Reddy is not putting a police complaint on this man in the video who is talking so against Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu https://t.co/SxerDw5m6I — Ram Gopal Varma (@RGVzoomin) 28 December 2018 -
మరి ఎన్టీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలి..? : వర్మ
వెన్నుపోటు పాటతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన రామ్ గోపాల్ వర్మ వివాదాన్ని మరింత పెద్దది చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ పాట విషయంలో టీడీపీ శ్రేణులు మండిపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టుగా మరిన్ని ట్వీట్లు చేశాడు. తనకు వార్నింగ్లు ఇచ్చిన వారి వీడియోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేస్తూ ఇలాంటి వాటికి భయపడేది లేదన్నాడు. అంతేకాదు తనపై టీడీపీ శ్రేణులు కేసులు వేయటంపై కూడా వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేసిన వర్మ ‘నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?’ అంటూ కామెంట్ చేశాడు. ముందు ముందు ఈ వివాదం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి. నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?https://t.co/j70bgc1QhW — Ram Gopal Varma (@RGVzoomin) 23 December 2018 -
‘వెన్నుపోటు’పై ఎమ్మెల్యే ఫిర్యాదు
కర్నూలు: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ పాటపై ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాట తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అవమానించేవిధంగా ఉందని, ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట) మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన విధంగా ఈ పాటలో సృష్టించారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. చంద్రబాబు కీర్తిప్రతిష్టలు దిగజార్చేవిధంగా చిత్రీకరించిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు టూటౌన్లో మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. (ఆ పాటలో మీనింగ్ ఏంటి.. ఈ దిష్టిబొమ్మలేంటి: వర్మ) -
లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట : టీడీపీలో గుబులు
-
బయోపిక్ అంటే అన్ని చూపించాలి
-
ఆ పాటలో మీనింగ్ ఏంటి.. ఈ దిష్టిబొమ్మలేంటి : వర్మ
సాక్షి, హైదరాబాద్ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేయడంపై ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. శనివారం సాక్షితో మాట్లాడుతూ.. ముందుగా ఆ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని, అవసరమైతే దానికి కౌంటర్ ఇవ్వాలన్నారు. అంతేకానీ ఈ దిష్టిబొమ్మలు తగలబెడితే ఏం వస్తుందని ప్రశ్నించాడు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి నిలదీశాడు. జాతిపిత మహాత్మగాంధీ బయోపిక్లోనే అన్ని విషయాలు చూపించారని గుర్తు చేశాడు. బయోపిక్ అంటే అన్ని చూపించాలని, కొంత మాత్రమే చూపిస్తే అది బయోపిక్ ఎలా అవుతుందన్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు జరిగినదే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అని స్పష్టం చేశాడు. రియల్స్టార్ సినిమా కాబట్టే రియల్ పాత్రలకు సంబంధించిన ఫొటోలు వాడినట్లు పేర్కొన్నాడు. ఇది కల్పిత కథ కాదని, ఫిల్మ్మేకర్గా తాను పరిశోధన చేసి తెలుసుకున్న కథతో సినిమా తీస్తున్నానన్నాడు. ఒక్క పాటను చూసే ఎందుకు భయపడుతున్నారని, సినిమా చూస్తేనే ఎవరేవరేం చేశారో తెలుస్తుందని తెలిపాడు. వైస్రాయ్ హోటల్లో జరిగింది వెన్నుపోటేనని ఎన్టీఆరే చాలా సార్లు చెప్పారని, తానేం కొత్తగా కల్పించలేదన్నాడు. తనకు ఎవరీ మీద కోపం, ప్రేమ లేదన్నాడు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిందే నిజాయితీగా చూపిస్తానని, తనకు ఎవరీ మద్దతు అవసరంలేదన్నాడు. తన ట్విటర్ పోల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్కే మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా వర్మ పేర్కొన్నాడు. ప్రజలకు నచ్చకపోతే చూడరని, కానీ వారెందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు. నిజాలు బయటకు వస్తాయనే భయం ఉన్నవారే సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తారని వర్మ అభిప్రాయపడ్డాడు. ఇక వర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఎనౌన్స్మెంట్ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు. శుక్రవారం విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్లోని వెన్నుపోటు పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. పాట విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే ఈ పాటను దాదాపు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో టీడీపీ వర్గాల్లో గుబులు మొదలైంది. నిజ జీవిత గాథలను తెరకెక్కించటంలో వర్మకు మంచి రికార్డ్ ఉంది. దీంతో సినిమాలో వర్మ ఎలాంటి నిజాలను బయట పెడతాడో అని టీడీపీ వర్గాల్లో వణుకు పుడుతోంది. ఒక వర్గం వర్మపై కేసులు నమోదు చేస్తూ నిరసలకు దిగుతుంటే.. మరికొంత మంది వర్మ ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువవుతుందో చూడాలి. -
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను శుక్రవారం తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. పేరుకు తగ్గట్టే పాట ఫస్ట్లుక్లో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును, ఇతర నాయకులను, వెన్నుపోటుకు వేదికగా నిలిచిన వైశ్రాయ్ హోటల్ను చూపించారు. దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు అంటూ సాగుతున్న లిరిక్స్ ఎన్టీఆర్ మనోవేదనకు అద్దం పడుతున్నాయి. గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘కథానాయకుడు’ ఆడియో రిలీజ్ నాడే వర్మ వెన్నుపోటు పాటను రిలీజ్ చేయడం ద్వారా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి పెంచారు. రిలీజ్ చేసిన గంటలోనే దాదాపు లక్ష వ్యూస్ రావడం విశేషం. Here is #LakshmisNTR #వెన్నుపోటుపాట 🔪🔪🔪🔪..I thank the Music director and Singer @kalyanimalik31 and lyricist @Sirasri for bringing to life the dead truths of backstabbing 🔪🔪🔪🔪 NTRhttps://t.co/2c0xUTzF3P — Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2018 -
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్
-
‘వెన్ను పోటు’ ఫస్ట్లుక్ రిలీజ్ చేయనున్న వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఇటీవల దర్శకుడిగా వరుసగా ఫెయిల్ అవుతున్న ఆర్జీవీ తాజాగా భైరవ గీతతో నిర్మాతగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్లుక్ను డిసెంబర్ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ. అయితే వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫస్ట్లుక్ పోస్టర్తోనే సెన్సేషన్ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పాట కోసం రిలీజ్ చేస్తున్న పోస్టర్ను ఏ రేంజ్లో డిజైన్ చేశాడా అన్న ఆసక్తి నెలకొంది. The first look of వెన్ను పోటు Song from Lakshmi’s NTR will release on December 21st at 4 PM — Ram Gopal Varma (@RGVzoomin) 19 December 2018 -
వైస్రాయ్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ!
పిల్లనిచ్చిన ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డి దోవన దక్కించుకున్న చంద్రబాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాదా? ఎన్టీఆర్పై సినిమా ద్వారా బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? బాబు నాయకత్వంలో ఎన్టీఆర్కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు. అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి జీవితం ఇటీవలే తెరకెక్కింది. చాలావరకు వాస్తవానికి దగ్గరగా ఉంది ఆ సినిమా అని అందరూ చెప్పుకున్నారు. ఆ సినిమా తీసిన వాళ్ళు తప్పకుండా సావిత్రి జీవితానికి సంబంధించి అన్ని కోణాలనూ జాగ్రత్తగా పరిశీలించి, అధ్యయనం చేసి ఉంటారు. ఎందుకంటే ఒక మహానటి జీవితాన్ని తెరకు ఎక్కించాలన్న సదుద్దేశం తప్ప ఆ సినిమా నిర్మాతలకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు కాబట్టి. మహానటి సావిత్రి జీవించి లేరు, ఆమె వారసులెవరికీ సావిత్రి పేరు వాడుకుని ఇప్పుడు ఏదో లబ్ధి పొందాలన్న దుగ్ధ ఉండి ఉండదు. అసలా చిత్ర నిర్మాణంతో సావిత్రి కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి ఆ సినిమాలో నిజాయితీ కనిపిస్తుంది. అందుకే అందరి మన్ననలూ పొందింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏమిటీ సినిమా గోల అని విసుక్కోవచ్చు ఎవరయినా. నిజమే.. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. తెలంగాణాలో ఎన్నికల కోడి ముందే కూసింది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి, దాని వెనువెంటనే 2019 ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, లోక్ సభకూ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుంచో ఎన్నికల వేడి కొనసాగుతున్నది. ఏపీలో ఎన్నికలు జరిగేలోపే రానున్న రెండు సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఎన్నికలకు సినిమాలకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న వేయవచ్చు ఎవరయినా. నిజమే సాధారణంగా ఎన్నికల సమయంలో నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చెయ్యాలని కోరుకోరు. ఎన్నికల హడావుడిలో పడి జనం తమ సినిమాలు చూడరన్న అభిప్రాయం వారిది. అయితే ఇప్పుడు ఒక రెండు సిని మాలు మాత్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వస్తున్నాయి. మొదటగా ఒకే సినిమా రాజ కీయ అవసరాల కోసం ప్రారంభమైంది. అయితే దాని వెనువెంటనే ఇంకో సినిమా అదే ఇతివృత్తానికి దగ్గరగా రాబోవడం గమనార్హం. మహా నటుడి ఆత్మ క్షోభించనుందా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వేలాది మందికి రాజకీయ జన్మఇచ్చిన ఎన్టీఆర్ మరణించిన 22 సంవత్సరాలకు ఆయన జీవితాన్ని వెండితెరకు ఎక్కించాలన్న ఆలోచన ఆయన కొడుకు, సినిమా హీరో, టీడీపీ శాసన సభ్యుడు, ఏపీ సీఎం బావమరిది, ఆ రాష్ట్ర మంత్రి మామ బాలకృష్ణకు వచ్చింది. తండ్రిని అప్రజాస్వామిక పద్ధతిలో పదవి నుంచి దింపి మానసిక క్షోభకు గురిచేసి, ఆయన అకాల మరణానికి పరోక్షంగా కారకుడయిన కొడుకే తండ్రి జీవితాన్ని తెరకు ఎక్కించబూనుకోవడం విడ్డూరం. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డిదో వన దక్కించుకున్న బాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాక మరేమిటి? దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండవేసి ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి సినిమా తీసిన వాళ్ళకీ, ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్న ఆయన కొడుక్కీ ఏ మాత్రం పోలిక లేదు. అక్కడ నిజాయితీగా ఒక మహానటి జీవితాన్ని జనం ముందు ఉంచే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఒక మహానటుడి ఆత్మ క్షోభించే రీతిలో మరో సినిమా నిర్మాణం జరగబోతున్నది. ఒకసారి తప్పు చేస్తే దిద్దుకునే అవకాశమే ఉండదా ఇక, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా అని ఎవరయినా బాలకృష్ణ ప్రయత్నాన్ని సమర్ధించవచ్చు. కానీ, ఎన్టీఆర్ రాజకీయ పతనానికి మూలకారకుడయిన బాబు కానీ, అందుకు సహకరించి దాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ కానీ ఈ 22 ఏళ్ళలో ఏ ఒక్కసారయినా ఆనాడు ఎన్టీఆర్ను గద్దెదించి మేం తప్పుచేశాం అని చెంపలు వేసుకున్నారా? ఎన్టీఆర్ పేరిట బాలకృష్ణ సినిమా అనగానే మరో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని ఇంకో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో నిజంగా ఎవరు ఏ మేరకు వాస్తవంగా తీస్తారు, ఎవరు ఎటువంటి వక్రీకరణలకు పాల్పడుతారు అన్నది చూడాల్సి ఉంది. పరిపూర్ణ జీవిత చిత్రణకు మంగళమేనా? బాలకృష్ణ సినిమా షూటింగ్ మొదలయింది. తండ్రి పాత్ర బాలకృష్ణ తానే పోషిస్తున్నాడు. ఇందులో బాబు పాత్రకు మరో నటుడు రానాను ఎంపిక చేసారు. ఇంచుమించు తనను బాబులాగా కనిపించేటట్టు మేకప్ బాగానే చేశారు. అంటే ఎన్టీఆర్ సినిమా ఆయన జీవితంలోకి బాబు ప్రవేశించేంత వరకూ కథ ఉంటుందన్నమాట. అయితే మరి వైస్రాయ్ ఎపిసోడ్, ఎన్టీఆర్కు వెన్నుపోటు, ఆయన మరణం వరకూ జరిగిన పరిణామాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయా? ఉంటే బాలకృష్ణ తీస్తున్న ఈ సినిమా దర్శకుడు క్రిష్ నిజాయితీగా వాస్తవాలను తెరకు ఎక్కిస్తాడా? ఇప్పటికే ఒక దర్శకుడు తేజ ఈ సినిమా దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు. కారణం అందరికీ తెలిసిందే నిర్మాత చెప్పినట్టు వినడం కుదరక తప్పుకున్నాడని ప్రచారం. ఎన్టీఆర్ సినిమా ద్వారా నిర్మాత బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. సమాధానం కోసం పెద్దగా వెతుక్కోనక్కర లేదు. బాబు నాయకత్వంలో ఎన్టీఆర్కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ పుట్టుక నుంచి మరణం దాకా తెరకు ఎక్కిస్తే చాలా వివాదాస్పద అంశాలు తెరకు ఎక్కించాల్సి వస్తుంది. అందుకని ఆయన జీవితం చివరి దాకా కాకుండా 60 ఏళ్ళు నిండగానే రాజకీయరంగ ప్రవేశం చేసి 1983లో తొలిసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో సినిమా ముగుస్తుందని సినీ పరిశ్రమ వర్గాలే చెపుతున్నాయి. అంటే ఆయన నట జీవితం మాత్రమే ఈ సినిమాలో మనం చూస్తాం. పోనీ ఇంకాస్త దూరం వెళ్లి నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటును విఫలం చేసి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకూ చూపించవచ్చునని చెపుతున్నారు. బహుశా ఇదే జరగొచ్చు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు ఎపిసోడ్ ఉంటేనే బాబు పాత్రకు ప్రాముఖ్యత వస్తుంది. కానీ అక్కడో ఇక్కడో ముగించేస్తే ఎన్టీఆర్ జీవితాన్ని పరి పూర్ణంగా చూపించినట్టు కాదు. వెన్నుపోటును చూపించే నిజాయితీ ఎవరిది? అందుకే రాంగోపాల్ వర్మ మరో సినిమా తీయడానికి సిద్ధపడ్డట్టున్నాడు. బాలకృష్ణ సినిమా ఎక్కడ ముగిసి పోతుందో అక్కడి నుంచి ఆయన సినిమా మొదలవుతుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమయిన ఘట్టాలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. ఎన్నెన్ని మలుపులు, ఎన్ని మెరుపులు ఎన్ని మరకలు అన్నీ ఆ తరువాతి అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. 1984లో తిరుగుబాటును చిత్తుచేసి ఇందిరాగాం«ధీ అంతటి మహా నాయకురాలు ఒక మెట్టు దిగొచ్చి అధికారం తిరిగి తనకు అప్పగించేట్టు చేసుకున్న దగ్గరి నుంచీ, సొంత అల్లుడి చేతుల్లోనే ఘోరమయిన వెన్నుపోటు పొడిపించుకుని కొద్ది మాసాలకే చనిపోయేవరకూ ఎన్టీఆర్ జీవితం అంతా ఉద్వేగభరితమే. అందులో 85 –89 మధ్య కాలంలో ఆయన పాలన తీరు, వివాదాస్పద నిర్ణయాలు, 89లో ఓటమి ఆ తరువాత సొంత కుటుంబం నుంచే ఎదుర్కొన్న నిరాదరణ, అనారోగ్యం, రాజకీయ అవమానాలు, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించడం, ఆమెతో పెళ్లి, మళ్ళీ 1994లో కాంగ్రెస్ను మట్టి కరిపించి సొంత అల్లుడి అంచనాలనే తారుమారు చేసి అద్భుత విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్న తీరు అన్నీ రసవత్తర ఘట్టాలే. ఇవన్నీ రాంగోపాల్ వర్మ సినిమాలో ఉండే అవకాశం చాలా ఉంది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో చూపించే నిజాయితీ బాలకృష్ణ సినిమాకు ఉండదు. ఏ రకంగా చూసినా రాంగోపాల్ వర్మ సినిమా మాత్రమే ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తిపరుస్తుందని చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితం మొత్తం సమగ్రంగా తెలియాలంటే రెండు సినిమాలూ చూడాలి. అయితే ఆత్మకథలు రాసుకునే వాళ్లకు ఎంత నిజాయితీ ఉండాలో జీవిత చరిత్రలు రాసేవాళ్ళు, తెరకెక్కించే వాళ్ళూ వాస్తవాల చిత్రీకరణలో అంతే నిజాయితీ ఉండాలి. వివాదాస్పద సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్కు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
లక్ష్మీస్ ఎన్టీఆరే అసలైన బయోపిక్
-
లక్ష్మీస్ ఎన్టీఆరే అసలైన బయోపిక్: లక్ష్మీ పార్వతి
విజయనగరం: సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమానే అసలైన బయోపిక్ అంటున్నారు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఎలా లాక్కున్నారో ఈ సినిమా ద్వారా తెలుస్తోందని ఆమె అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వాస్తవాలు బయటకురావడం ఖాయమన్నారు. టీడీపీ నేతలకు ఎన్టీఆర్ మాటలు వినాలంటే భయంపట్టుకుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎలాంటి భయం లేకుండా ఎన్టీఆర్ ఎలా మరణించారో ప్రజలకు చూపిస్తారని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ మారినా తమకేమీ చేయలేదని మహిళలే చీదరించుకుంటున్నారన్నారు. -
వర్మను భయపెట్టే విషయం ఏంటంటే..!
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో హల్చల్ చేస్తున్నారు. ఇటీవల తిరుమల వేదికగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించిన వర్మ సినీ రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ సినిమా సందర్భంగా మీడియాకు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ సినిమాకు వీలైనంత ప్రచారం తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తాజాగా ఓ మీడియా ఇంటర్య్వూలో మాట్లాడిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు, సమాజం, బంధాలు లాంటి ఏ విషయానికి తాను భయపడనని చెప్పే వర్మ తనకు భయం కలిగించే విషయమేంటో బయటపెట్టాడు. తనకు మంచానికే పరిమితమై మరో వ్యక్తి మీద ఆధారపడి జీవించటం అన్నా.. ముసలితనం అన్న భయమని తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా జనవరి 24న రిలీజ్ కానుంది. -
ఔను.. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు : వర్మ
ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్? వర్మ: అవును. వెన్నుపోటు పొడిచారు. ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు? వర్మ: అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభించిన సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మంతో ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఎన్టీఆర్ కథను లక్ష్మీపార్వతి యాంగిల్లో చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ఆమె మీద ఉన్న అభిమానమా? వర్మ: నాకు లక్ష్మీపార్వతిగారి మీద ఎలాంటి ఇంప్రెషన్ లేదు. ఇలా చెప్పడానికి ముఖ్యకారణం ఏంటంటే ఎన్టీఆర్గారు మహా మహా అందగత్తెలతో నటించారు. అలాంటి ఆయనకు ఈవిడ ఎక్కడ దొరికారా? అని ఫస్ట్ ఫీలింగ్. ఇంకో డౌట్ ఏంటంటే ఎన్టీఆర్గారు ఆ అందగత్తెలను పెళ్లి చేసుకోకుండా ఈవిణ్ణి చేసుకోవడమేంటి? అనిపించేది. అలా లక్ష్మీపార్వతిగారి మీద నా ఫీలింగ్ నెగటివ్ ఇంప్రెషన్తో స్టార్ట్ అయింది. పొలిటికల్గా కూడా ఆవిడ్ని పెద్దగా ఫాలో అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ పెద్ద స్టార్గా మనందరికీ తెలుసు. ఆయన్ని అభిమానించాం. ఆయన మాట్లాడే విధానం మనకు తెలుసు. పాలసీల కోసం ఆయన తీసుకున్న స్టెప్స్ని మనం ఎక్కడా చూడలేదు. అందరూ ఆయన్ను పొగుడుతారు. ఎక్స్ట్రార్డినరీ మనిషి, మేధస్సు కలిగిన మనిషి. మొత్తం పొలిటికల్ సిస్టమ్నే మార్చేశారు అంటుంటారు. అయితే ‘ఈ ఒక్క విషయంలో... ’ అని అంటారు. ఈ ఒక్క విషయంలో అంటే? అనే విషయాన్ని సిన్సియర్గా ఆలోచించడం మొదలు పెట్టా. ఆ విషయాన్నే సినిమాగా తీయాలనుకున్నా. ‘ఆ ఒక్క విషయం’ గురించి చాలా సర్వేలు చేసి ఉంటారు. మీకెలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మనుషులని కలవడం స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్గారు ఉన్నప్పుడు పని చేసిన ఆఫీసర్స్, స్టాఫ్, ఆయనతో పరిచయం ఉన్న చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాను. ఒక మనిషి గురించి ఐదుగుర్ని అడిగితే ఐదుగురు ఐదు రకాలుగా చెబుతారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం అని మనం చెప్పలేం. ఏది నిజం అని తెలియదు. చిట్టచివరిగా నాకో ప్రత్యక్ష సాక్షి దొరికారు. ఆయనే ఎన్టీఆర్గారు. ఆయన చనిపోయే వారం రోజుల ముందు ఓ వీడియోలో లక్ష్మీపార్వతిగారి గురించి ఎక్స్ట్రార్డినరీ గౌరవాభిమానాలతో మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించిందేంటంటే.. వీళ్లందరూ ఆయన ఎంతో గొప్ప మనిషి అంటారు. మరి ఆయనే గౌరవించే మనిషిని తప్పుబట్టడం లాజికల్గా తప్పు కదా. అప్పుడు కొంచెం డీప్గా వెళ్లి, ఆమె మీద ఎందుకు నెగటివ్ దృష్టి వచ్చింది? ఎంతసేపూ ఆవిడ గురించి బయటవాళ్లు చెప్పిన మాటలు వింటున్నాం కానీ ఎన్టీఆర్ దృష్టిలో ఆమె ఏంటి? అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని బయోపిక్ అనలేమేమో? ఆయన జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటరైనప్పటి నుంచి ఈ సినిమా మొదలవుతుందా? బయోపిక్ అనేది ఆ వ్యక్తి తాలూకు సక్సెస్ అయినా ఉండాలి, ప్రోగ్రెస్ టు సక్సెస్ అయినా ఉండాలి. గాంధీ బయోపికే తీసుకుందాం.. బ్రిటిష్ అనే విలన్ ఉన్నాడు. బ్రిటిష్ లేకపోతే ఆ బయోపిక్కి ఆ విలువ ఉండదు. అలాగే ఎన్టీఆర్ చాలా స్ట్రగుల్ అయ్యి సక్సెస్ సాధించారా అంటే నాకు చాలా డౌట్. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చేతులు కట్టుకుని సినిమా ఆఫీసుల బయట నిలబడి ఉంటారా? అనిపిస్తుంది. ఆయన పుట్టుకతోనే చాలా సక్సెస్ఫుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ‘మేము మేము’ అని అనేవారు. ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో కన్విక్షన్ లేకపోతే అలా ఉండలేరు మనుషులు. ఒకవేళ స్ట్రగుల్ ఉన్నా కూడా మనం నోటీస్ చేయగలిగే స్ట్రగుల్ ఉండదని నా ఉద్దేశం. స్ట్రగుల్ ఫర్ సక్సెస్ లేకుండా, విలన్ లేకుండా బయోపిక్ ఎలా వస్తుంది? ఆయన లైఫ్లోకి శత్రువులు వచ్చి ఉంటే లక్ష్మీపార్వతిగారి రాకతో వచ్చి ఉండాలి. ఆ శత్రువులు ఎవరనేది నేను చెప్పను. అది రకరకాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు. ఆవిడ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరి జీవితంలో అయినా వాళ్ళు కలిసిన మనుషులు, జరిపిన సంభాషణలు, జరిగిన సంఘటనలు వాళ్ల జీవితాన్ని పూర్తి చేస్తాయి. నా దృష్టిలో రామారావుగారి లైఫ్లో అలాంటి డైనమిక్ ఫేజ్ లక్ష్మీ పార్వతిగారు ఎంటరైనప్పటి నుంచే. దాంట్లో మీకు ఆనందం ఉండచ్చు, దుఃఖం ఉండచ్చు. మోసం, కోపం ఏదైనా ఉండచ్చు. ఆ ఫేజ్లో అవన్నీ ఉన్నాయి. నా సినిమా బయోపిక్ కాదు.. ఒక ఘట్టం. లక్ష్మీ పార్వతిగారు ప్రవేశించినప్పటి నుంచి ఒక ఘట్టం స్టార్ట్ అయింది అంటాను. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటారా? ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని జడ్జ్ చేయడానికి నేనెవర్ని? ఆయనకు ఎవరు నచ్చారు? ఎందుకు నచ్చారు? ఏ కారణంతో మరో పెళ్లి చేసుకున్నారు అన్నది ఆయన నిర్ణయం. మనం ఎవరం అడగటానికి? మనం రామారావుగారిని గౌరవిస్తే ఆయన గౌరవించే వాళ్లను గౌరవించడం మన బాధ్యత అన్నది నా పాయింటాఫ్ వ్యూ. ఆ విధంగా మీకు లక్ష్మీ పార్వతిగారి మీద గౌరవం ఉంది అంటారు. 100 శాతం. అలాగే నేను గౌరవిస్తానని ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఏకీభవిస్తానని కాదు. గౌరవం వేరు, ఏకీభవించడం వేరు. అసలు ఈ సినిమాలో హీరో ఎవరు? నిజం. సినిమాలో నిజమే కథానాయకుడు. ఇద్దరి లవ్ గురించే ఎక్కువ స్టోరీ ఉంటుందా? లవ్ అనే పదం చాలా వేగ్ అయిపోయింది. ప్రతిదానికి వాడే పదం అయిపోయింది. ఈ పదాలు దాటి వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించాలన్నదే ఈ సినిమా తీయాలనుకోవడానికి ముఖ్య కారణం. ఆ బంధాన్ని చూపించడం కోసం మీరు లక్ష్మీపార్వతి నుంచి విషయాలు తెలుసుకున్నారా? నా ఉద్దేశంలో వాళ్లిద్దరూ సోల్మేట్స్. ఆవిడ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. చాలా మాట్లాడేశారు. దాచేయాలనుకుంటే నాతో కూడా పంచుకోరు కదా. ఆవిడతో ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. చాలా పుస్తకాలు, ఆర్టికిల్స్ చదివాను. రామారావుగారు పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఏ పనిలోనూ కలగజేసుకోలేదని ఓ ఆఫీసర్ చెప్పారు. ఇంకొకరేమో ప్రతిదాంట్లో కలగజేసుకునేవారు అన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు అని ఎలా చెప్పగలం? మరి మీరు ఎలా చూపించబోతున్నారు? బాగా దగ్గరిగా ఉండి సలహా ఇవ్వడం వేరు, కలగజేసుకోవడం వేరు అంటాను. మన అభిప్రాయాలను వేరే వాళ్ల మీద రుద్దడం అనేది నా దృష్టిలో కలగజేసుకోవడం. లక్ష్మీపార్వతిగారు అలా ఇంటర్ఫియర్ అయ్యారంటే అప్పుడు రామారావుగారి ఆలోచన ఏమైనట్టు? ఆయన్ను అనాలా? ఈవిడ్ని అనాలా? ఒకవైపేమో ఎన్టీఆర్ చాలా గొప్పవాడు అంటూ ఆయన మీద పార్టీలు నడుపుతున్నారు. ఆయన ఆమె మాట విని రాష్ట్రానికి సంబంధించిన పనులు చేస్తున్నారంటే ఎవరి తప్పు? లక్ష్మీ పార్వతిదా? ఎన్టీఆర్దా? నా పాయిం టాఫ్ వ్యూలో అడుగుతున్నా. ఒకరు చెబితే ఇన్ఫ్లుయన్స్ అయ్యే గుణం ఎన్టీఆర్కి ఉందంటారా? అస్సలు కాదు. ఆయన చాలా విజనరీ. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. అందరూ కూడా చేతులు కట్టుకొని ఓట్లు అడుక్కుంటుంటే ఒరేయ్ ఓట్లు వేయకపోతే మీ ఖర్మ అని స్పీచ్లు ఇచ్చి మరీ గెలిచిన వ్యక్తి ఆయన. ఎవరి మాట వినరు అని ఓ పేరుంది. అనుకున్నదే చేస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ని తగ్గించి లక్ష్మీపార్వతిని గ్లోరిఫై చేస్తే గొడవలు ఏమైనా అవుతాయంటారా? గొడవలంటే ఏం చేస్తారు? మహా అంటే టీవీల్లో అరుస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఈ సినిమాను ఆపాలంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్గారే ఆపాలి. మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు లాంటివి? మా ఇంటికి వచ్చినా అరుస్తారు.. అంతే. అరిచేవాళ్లు ఏమీ చేయలేరు. లక్ష్మీపార్వతిని ఎక్కువగా చూపించాలని మీరు అనుకుంటున్నారని కొందరు ఊహిస్తున్నారు. ఆవిడ్ని ఎక్కువగా చూపిస్తే ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావడం లేదు. సడన్గా లక్ష్మీపార్వతిగారు ఇంకో పార్టీ పెట్టేస్తారా? లక్ష్మీపార్వతిగారి మీద ఈ సినిమా తీయడం లేదు. లక్ష్మీపార్వతిగారితో ఆయనకున్న సంబంధం మీద సినిమా తెరకెక్కిస్తున్నా. సెంట్రల్ క్యారెక్టర్ లక్ష్మీపార్వతిగారు అయితే కాదు. సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో పూర్తవుతాయట. ఈ సినిమా దానికి సీక్వెల్గా ఉంటుంది అంటారా? 100 శాతం అనుకోవచ్చు. బయోపిక్ అనేది పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఉండేది. వాళ్ల ఉద్దేశమేంటో నాకు తెలియదు. అలాగే ఆ సినిమాల గురించి నేను మాట్లాడకూడదు. నేను విన్నది ఏంటంటే.. రామారావుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోతుందట. నా సినిమా దాని తర్వాత మొదలవుతుంది. ఈ మూడు సినిమాలు చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ చూసేసినట్టే. ఆ విధంగా రామారావుగారికి న్యాయం చేసినట్టే. పబ్లిక్ పర్సనాలిటీ చనిపోయాక ఆ వ్యక్తి గురించి సాధారణంగా నెగటివ్గా మాట్లాడరు. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు కొన్ని ఉండొచ్చేమో? నెగటివ్ అనేది మనిషి చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఒక మనిషి అలా చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితి తెలిసిన వాడికి అది నెగటివ్గా అనిపించకపోవచ్చు. అలాగని పాజిటివ్గానూ అనిపించకపోవచ్చు. నెగటివ్ అంటే క్రిమినల్ ఆలోచనతో చేశాడా? స్వార్థంతో చేశాడా? ఒక యాక్ట్ జరిగినప్పుడు మనం మనకు తోచినట్టుగా ఏదేదో ఊహించుకుంటాం. ఇందుకు చేశారు... అందుకు చేశారని. అక్కడ ఏ ఉద్దేశంతో చేశారన్నది మనకు అర్థం అయినప్పుడు హిస్టారికల్ కోణం వస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్ మూవీలో ఉన్నట్టు పాటలు, ఫైట్లు? ఫైట్లు, కామెడీ ఉండవు. పాటలు ఉంటాయి. అవి కూడా కేవలం బ్యాగ్రౌండ్లో వస్తుంటాయి. పొయిటిక్గా ఉంటాయి. కల్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక పాట రికార్డ్ చేశాం. మీరు పాడబోతున్నారా? లేదు. ఆ విషయంలో మీరు ఆనందించవచ్చు. ‘కత్తులతో సావాసం..’ అని ‘రక్త చరిత్ర’లో పాడారు. వాయిస్ బాగానే ఉంటుంది కదా? నా వాయిస్ కొంతమందికి నచ్చుతుంది. కొంతమంది ‘నీ వాయిస్తో పెట్టకు రా బాబు’ అంటుంటారు. మీ పాత హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఓ రియలిస్టిక్ ఈవెంట్తో సినిమా తీస్తున్నా అని ప్రకటించగానే ఓ బజ్ క్రియేట్ అవ్వడం ఎలా అనిపిస్తోంది? నా పాయింట్ ఏంటంటే.. తనకు వచ్చిన గొప్ప రోల్ వల్ల ఓ ఆర్టిస్ట్ గొప్ప యాక్టర్ అవుతాడు. తను టేకప్ చేసిన సబ్జెక్ట్ వల్ల దర్శకుడు గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఉన్న విషయం వల్ల వీడు ఈ ప్రాజెక్ట్ని బాగా టేకప్ చేయగలడు, బాగా హ్యాండిల్ చేయగలడు అనిపిస్తుంది. దాంట్లో నుంచి బజ్ వస్తుంది. అదే నేను ఇంట్రస్ట్ లేని వేరే ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేస్తే ఇంత ఉండకపోవచ్చు. ఇది ప్రపంచంలోని అందరి దర్శకులకు వర్తిస్తుంది. ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 40 సినిమాలు తీస్తే, నాకు గుర్తున్నవి నాలుగే. ఎందుకంటే ఆ 4 సినిమాల సబ్జెక్ట్ డిఫరెంట్గా, ఇంట్రస్ట్గా ఉండటమే. ఎన్టీఆర్ మీద రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిలో వారసులు నటిస్తున్నారు. మీ సినిమాలో లేరు. ఎందుకని? వారసుల పాత్రలు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించవు. కానీ వాళ్ల ప్రస్తావన ఉంటుంది. వాళ్ల వ్యక్తిగతం మాత్రం ఉండదు. అందుకే నాకు అవసరంలేదనిపించింది. పాత్రకు తగ్గ నటీనటులను తీసుకుంటాను. స్టార్స్ అయ్యుండాల్సిన అవసరం లేదు. సినిమా తీస్తున్నా అని వాళ్లను పర్మిషన్ అడిగారా? లేదు. ఈ సినిమాకు అవసరం కూడా లేదు. అడగలేదు అంటున్నారంటే.. ఈ సినిమా వాళ్లకు వ్యతిరేకం అనుకోవచ్చా? వ్యతిరేకం కాదు. నా స్క్రిప్ట్కు అవసరం లేదంతే. మరి.. లక్ష్మీపార్వతి పర్మిషన్ అడిగారా? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తి గురించి సినిమా తీసేటప్పుడు పర్మిషన్ అవసరంలేదు. అందుకే అడగలేదు. ఇందులో ఎవరెవరి పాత్రలు ఉంటాయి? అప్పుడు లక్ష్మీపార్వతిగారు ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటరయ్యాక ఉన్న పాత్రలన్నీ ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా కారణంగా పొలిటికల్గా వచ్చే ఎన్నికల్లో ఏదైనా మార్పు వస్తుందంటారా? అసలు నేను అంత దూరం ఆలోచించలేదు. ఒకవేళ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేసే పరిస్థితులు వస్తే..? ఆపను. ఈ ప్రాజెక్ట్కి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి. ఆయన తప్ప ఈ ప్రాజెక్ట్ని ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ పేరు పలికినప్పుడల్లా స్వర్గంలో ఉన్నారు అంటున్నారు. మీకెలా తెలుసు.. ఆయన స్వర్గంలోనే ఉన్నారని? నాకు దేవుడు చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి స్వర్గానికి వెళ్లకపోతే ఇక స్వర్గానికి ఎవరు వెళ్తారు? ఆయన్ను అంత పాజిటివ్గా చూస్తున్నారా? అవును.. 100 శాతం. రాజకీయాల్లో పెను మార్పుకి కారణమైన వ్యక్తి. అనుకున్నది సాధించగల ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి. మీరు ఆడవాళ్లను ‘సెక్స్ సింబల్’లా మాత్రమే చూస్తారని కొందరి ఫీలింగ్? కొందరిది కాదు అందరిదీ. నా ఫీలింగ్ కూడా అదే. అంటే.. స్త్రీ అంటే అంతేనా? వాళ్ల టాలెంట్ ఇంపార్టెంట్ కాదా? ఎన్నో సాధిస్తున్నారు కదా? సాధించేది ఎవరైనా సాధిస్తారు. ఏదైనా సాధించాలంటే అది జెండర్తో సంబంధం లేదు. స్త్రీ పైలట్ అవ్వగలదు, ఇంకోటి అవ్వగలదు. ఇంకోటి సాధించగలదు. అది మగవాడు కూడా అచీవ్ చేస్తాడు. అయితే స్త్రీకి ఉన్న మహా శక్తి ఏంటంటే.. అట్రాక్షన్. కానీ మగవాడు ఎప్పటికీ స్త్రీలా ఆకర్షణీయంగా అవ్వలేడు. స్త్రీ అంత అందంగా ఉండలేడు. అందుకే స్త్రీలను పొగుడుతాను కానీ కించపరచాలనే ఉద్దేశంతో అనను. అసలు స్త్రీలను ఎప్పుడూ తక్కువ దృష్టితో చూడను, చూడలేను. ‘మీటూ’ అంటూ తమపై జరిగిన లైంగిక దాడులను బయటకు చెప్పుకోవడానికి ఫీమేల్ ఆర్టిస్టులు వెనకాడటంలేదు? ఎవరి దగ్గరైనా మీరు తేడాగా ప్రవర్తించి ఉంటే అది బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకూ చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. నా పేరు ఎక్కడైనా వినిపించిందా? నేను ఏ ఆర్టిస్టునీ ఎప్పుడూ దేనికీ ఫోర్స్ చేయలేదు. నా లైఫ్లో ఒక స్త్రీని బలవంత పెట్టడం కానీ తనతో తప్పుగా ప్రవర్తించడం కానీ చేయలేదు.. చేయను కూడా. చెడుగా ప్రవర్తించే మగవాళ్లను ఏమంటారు? స్త్రీలంటే వాళ్లకు గౌరవం లేదు. యాక్చువల్గా ‘మీటూ’ అంటే ఓన్లీ సెక్సువల్ హెరాస్మెంట్ మాత్రమే కాదు. ‘నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను’ అనే పొగరు కొందరు మగవాళ్లకు ఉంటుంది. ఆ పొగరుతో స్త్రీలను తక్కువగా చూస్తారు.. వేధిస్తారు. అది ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసింది. దీనివల్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అవగాహన స్త్రీలకు వస్తుంది. నేను ‘మీటూ’కి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ‘మీటూ’ వల్ల మార్పొస్తుందనుకుంటున్నారా? చాలా మంచి ఉద్యమం. ఇప్పుడు మగవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు అనుకుంటున్నాను. కొంత మార్పు తప్పకుండా వస్తుందని అనిపిస్తోంది. అదే విధంగా చాలా ఉద్యమాల్లా ‘మీటూ’ కూడా శ్మశాన వైరాగ్యం అవుతుందేమో. కొన్ని రోజుల్లో దీన్ని కూడా మరచిపోయే అవకాశం ఉంది. మీరు దేవుణ్ణి విమర్శిస్తారు. మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ఏకంగా తిరుమల వెళ్లారు. మళ్లీ తెలివిగా ఆ ఎన్టీఆరే వెళ్లేలా చేశారన్నారు? ఇలా మాటలు తిప్పే నేర్పు ఎక్కడ్నుంచి వస్తుంది? ఏం తింటారు? తిండి తింటే తెలివితేటలు రావు. అసలు శ్రద్ధగా తిండి తినడం, పిల్లల్ని కనడం, వాళ్లని పెంచడం లాంటి వాటితో నేను నా టైమ్ని వేస్ట్ చేసుకోను. నా టైమ్ని తెలివితేటలు ఎలా పెంచుకోవాలా? అని ఆలోచించుకోవడానికి మాత్రమే స్పెండ్ చేస్తాను. నేను పుస్తకాలు విపరీతంగా చదువుతాను. చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. సమాజం ఎంతో విలువనిచ్చే పెళ్లి వేస్ట్ అంటారా? సమాజం అంటే ఏంటి? మనుషులే కదా? ఎక్కడో ఎవరో ఏదో అంటారు. మీరు గుడ్డిగా పాటిస్తారు. నేను గుడ్డివాణ్ణి కాదు.. కళ్లున్నాయి. ఒకసారి పెళ్లి చేసుకున్నారుగా? అప్పుడు గుడ్డివాణ్ణి. ఆ తర్వాత జ్ఞానోదయం అయింది. నూటికి 99 మంది పాటించే దాన్ని మీరెందుకు తప్పు అంటారు? నేను చాలా స్పెషల్ కాబట్టి. స్పెషల్ అనుకోవడం వల్ల స్పెషల్ అవుతారా? లేక మీ స్వభావమే అంతా? అటెన్షన్ సీకింగ్ అంటే ఇష్టం. నేను పొద్దున నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయే వరకూ నాకు ఆనందాన్ని ఇచ్చే పనులే చేస్తుంటాను. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్? అవును. వెన్నుపోటు పొడిచారు. ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు? అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం. ఫైనల్లీ.. మీరన్నట్లు అన్నీ నిజాలే చెబుతారా? నిజం మాత్రమే చెప్పాలని తీస్తున్నాను. – డి.జి. భవాని -
ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచారు : వర్మ
-
కచ్చితంగా వెన్నుపోటు పొడిచారు : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమాను తిరుపతిలో లాచనంగా ప్రారంభించిన వర్మ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ కథతో ఎవరెన్ని సినిమాలు తీసినా కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్కు మాత్రమే ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించిన వర్మ మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్కు అన్యాయం చేసిన పరిస్థితులు, పాత్రలను యదాతథంగా చూపించబోతున్నట్టుగా వెల్లడించారు. అదే సమయంలో ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ కోణంలోనే ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవటం నిజమేనన్న వర్మ చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడిన క్షోభను చూపించే ప్రయత్నం చేసినట్టుగా వెల్లడించారు. -
అంతా నిజమే చూపిస్తా!
-
వర్మాస్ ఎన్టీఆర్
-
తిరుమల: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్
-
ఎన్టీఆర్పై వర్మ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, తిరుమల: స్వర్గలోకంలో ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు ఆశీస్సులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకే ఉంటాయని ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేశారు. తిరపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి, చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, జీవీ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత బాలగిరి, చిత్ర యూనిట్తో కలిసి హాజరైన ఆయన అనంతరం సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా’ అంటూ మొదలెట్టిన వర్మ, సినిమాపై ఆసక్తి రేపేలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకొని కొందరు ఓట్లు అడుగుతున్నారు. వారందరి అసలు నిజాలు ఈ సినిమాలో చూపిస్తా. ఎన్టీఆర్కు సంబంధించి విషయాలను తెలుసుకుంటున్న సమయంలో లక్ష్మీపార్వతి గురించి ఆయన చెప్పిన ఓ పాత వీడియోను చూశా. తిరుపతి వెంకన్నపై ఎన్టీఆర్కు ఎలాంటి నమ్మకం, ఎమోషన్స్ ఉన్నాయో లక్ష్మీపార్వతిపై కూడా అంతే ఉన్నాయి. ఆ మహా మనిషి చరిత్ర గురించి సినిమాను ఎవరైనా తీయవచ్చు కానీ అసలు నిజమైంది ఏదో ప్రజలే నిర్ణయిస్తారు. ఈ సినిమా నిజం కాబట్టి ఎన్టీఆర్ ఆశీస్సులు మా సినిమాకే ఉంటాయి. ఇక ఈ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అసలు రాజకీయం కోసం ఈ సినిమాను తీయటం లేదు. నిజం కోసమే తప్పా ఏ పార్టీ కోసం ఈ చిత్రం ఉండదు. ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేస్తాం’ అంటూ వర్మ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: లక్ష్మీ పార్వతి తనకు జరిగిన అన్యాయంపై సినిమా రావడం ఆనందంగా ఉందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ‘ఆ మహానుభావుడి అసలు చరిత్రను ఎవరూ బయటకి తీయడం లేదని బాధపడేదానిని. అసలు చరిత్ర తెలపాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఆరోజు జరిగిన అవమానం తెలుగు ప్రజలకు తెలిపేలా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తెలియదు. కానీ ఎన్టీఆర్కు జరిగిన అన్యాయం, ఆయన పడిన బాధను తెలపండి. ఎన్టీఆర్ ఆస్తులను ఆయన కొడుకులు తీసుకున్నారు. కానీ నేను ఆయన నుంచి పోరాట స్పూర్తిని తీసుకున్నాను’ అంటూ లక్ష్మీ పార్వతి వివరించారు. -
నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోంది
-
20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: లక్ష్మీ పార్వతి
-
నిరూపించగలిగే నిజాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలననానికి తెర తీశారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సమయంలో తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న వర్మ సాయంత్రం సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించనున్నట్టుగా ప్రకటించారు. అయితే అంతకు ముందే అభిమానుల కోసం ఓపెన్ ఛాలెంజ్ పేరుతో ఓ వీడియో మెసేజ్ను రిలీజ్ చేశారు. ఈ మెసేజ్లో సినిమా తీసేందుకు కారణమైన పరిస్థితులు. సినిమా ఎవరి కోణంలో తెరకెక్కించబోతున్నారు. లక్ష్మీ పార్వతి తో కలిసి తిరుమల దర్శనానికి వెల్లడానికి కారణం. సినిమా నిర్మాణ వెనుక రాజకీయ ఉద్దేశాలు లాంటి అంశాలను వెల్లడించారు. అంతేకాదు కథ కోసం లక్ష్మి పార్వతితో పాటు ఆమె శత్రువులతోనూ చర్చించినట్టుగా వెల్లడించారు వర్మ. సినిమాను ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతోనూ తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపిన వర్మ జనవరి 24న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. -
శ్రీవారిని దర్శించుకున్న వర్మ
-
దేవునిపై నమ్మకంతోనే తిరుమలకు: వర్మ
తిరుపతి: ఎప్పుడూ ఎదొక విషయంతో వార్తల్లోకి వస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్స్ పేరు ప్రకటించి, ఆ పేరుతోనే సినిమా పై హైప్ క్రియేట్ చేయడం వర్మ స్టైల్. ఈ క్రమంలోనే ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానంటూ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వాస్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నట్టుగా వెల్లడించారు వర్మ. దీనిలో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి వర్మ శ్రీవారిని దర్శించుకున్నాడు. గురువారం కాణిపాకం సిద్ధివినాయకున్ని దర్శించుకున్న వర్మ.. ఈ రోజు కలియుగం దైవం వెంకన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. ‘దేవునిపై నమ్మకంతోనే స్వామి వారిని దర్శించుకున్నా. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వాస్తవాలను చూపించే విధంగా ఆశీర్వదించమని స్వామి వారికి మొక్కుకున్నా’ అని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతి శిల్పారామంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్టుగా తెలిపారు వర్మ. గతంలో తాను నాస్తికుడినని చాలా సందర్భాల్లో చెప్పుకున్న వర్మ.. తాజాగా తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడం విశేషం. నాగార్జున హీరోగా తిరుమల ఆయళ నేపథ్యంలో గోవిందా గోవిందా చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ.. ఆ సమయంలో కూడా వెంకన్న దర్శనం చేసుకోలేదని తెలిపారు. మరి, ప్రస్తుత వర్మ తీరు చూస్తుంటే నిజంగానే నాస్తికత్వం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నాడా అనేది చర్చనీయాంశమైంది. -
చంద్రబాబు డూప్ దొరికాడోచ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాత్రధారి కోసం సరిగ్గా ఆయన్ను పోలిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ ప్రారంభించిన వేట ఫలించింది. ఎక్కడో గుర్తు తెలియని ఓ ప్రాంతంలోని హోటల్లో సరిగ్గా చంద్రబాబును పోలిన ఓ వెయిటర్ హాఫ్ బనియన్, నిక్కర్ ధరించి వినియోగదారులకు ఆహారం వడ్డిస్తున్న వీడియో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వ్యక్తి ముఖం, గడ్డం కూడా దాదాపు చంద్రబాబును పోలి ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో వేల మంది సరదాగా షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ఆకర్షితుడైన రాంగోపాల్ వర్మ సదరు వ్యక్తి ఆచూకీని కనుక్కోవడంలో సహకరించినవారికి రూ.లక్ష అందజేస్తానని శనివారం ఫేస్బుక్లో ప్రకటన చేశారు. అతడే కాకపోయినా, అతడి(చంద్రబాబు)ని పోలిన మరో వ్యక్తి ఆచూకీ తెలిపినా ఈ బహుబమతి అందజేస్తానని వెల్లడించారు. ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్ సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ న్యూస్ చానల్లో పనిచేసే ముత్యాల రోహిత్ చంద్రబాబును పోలిన వెయిటర్ ఆచూకీని ఆర్జీవీకి పంపారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఆర్జీవీ ఫేస్బుక్ ద్వారా ధ్రువీకరించారు. ‘‘హే రోహిత్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా యూనిట్కు సీబీఎన్(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం..’’అని ఆర్జీవీ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా, చంద్ర బాబును పోలిన హోటల్ వెయిటర్ వివరాలను ఆర్జీవీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, ఈ వ్యక్తి పేరు ప్రభు అని, గతంలో అతడు త్రయంబకేశ్వర్లోని హోటల్లో పనిచేసేవాడని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడని ఓ వ్యక్తి ఫేస్బుక్లో పేర్కొన్నాడు. ఈ వ్యక్తికి సంబంధించి ఇటీవల వైరల్ అయిన వీడియో ఏడాది క్రితం తీసిందని అతడు వెల్లడించారు. ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది. వచ్చే జనవరి చివరి వారంలో విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు చంద్రబాబును పోలిన వ్యక్తి అంగీకరిస్తాడా? లేదా ? అన్నది వేచిచూడాలి. చదవండి : ఈ వ్యక్తిని పట్టిస్తే వర్మ నజరానా -
ఈ వ్యక్తిని పట్టిస్తే వర్మ నజరానా
-
ఈ వ్యక్తిని పట్టిస్తే వర్మ నజరానా
కొద్ది రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్లో సర్వ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్ అయిన వీడియో క్లిప్పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ‘ఈ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో ఎవరైనా నాకుసాయం చేస్తారా.? అతన్ని నాకు టచ్లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ అందిస్తా.’ అంటూ వర్మ ఆ వీడియోను తన ట్విటర్పేజ్ లో పోస్ట్ చేశాడు. చాలా రోజులు క్రితం వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అక్టోబర్19 నుంచి ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Can somebody help me track this man?..There will be a reward of 1 lak to anyone who can make him get in touch with me 💐 pic.twitter.com/8voaODqrAP — Ram Gopal Varma (@RGVzoomin) 13 October 2018 -
బాలయ్య ఎన్టీఆర్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్
-
బాలయ్య ఎన్టీఆర్కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
-
ఎన్టీఆర్ దొరికేశాడా..?
ప్రస్తుతం దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను ప్రకటించిన దగ్గరనుంచి ఎన్టీఆర్ బయోపిక్ వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. అయితే వర్మ మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా రిసెర్చ్ చేశానని చెప్పిన వర్మ, 2018 చివరకు సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు వర్మ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా వర్మ తెరకెక్కించే సినిమాల్లో నటీనటుల ఎంపికకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ముంబై ఎటాక్, వీరప్పన్ లాంటి సినిమాల కోసం వర్మ సెలెక్ట్ చేసుకున్న నటులు అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ పాత్రకు ఓ నటుడ్ని సెలెక్ట్ చేశాడట వర్మ, ప్రస్తుతం ఆ నటుడికి తన ఆఫీస్ లో ఎన్టీఆర్ మేనరిజమ్స్కు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
నమ్మకపోతే.. నరకానికే
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తాను తీయబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు ఇప్పటినుంచే ప్రచారాన్ని ఇచ్చుకుంటున్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో విలక్షణంగా స్పందిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ తనకో సందేశాన్ని పంపారంటూ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను నమ్మని వారు ఏకంగా నరకానికి పోతారంటూ శాపనార్థాలు పెట్టేశారు. ఎన్టీఆర్ ఆత్మే తన సినిమాను కథను నడిపిస్తోందని ఇప్పటికే చెప్పుకున్న వర్మ లేటెస్ట్ ఎఫ్బి పోస్ట్ ఇదే.. ‘‘సాక్షాత్తూ NTR గారే నాకీ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు. అన్నగారే నాకు ఈ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్ళందరూ ఖఛ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు’’.