Launched
-
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్సైకిల్పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్తో 5 స్పీడ్ గేర్బాక్స్ను ఈ బైక్లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
'కలర్స్ హెల్త్ కేర్'లో ఐశ్వర్య రాజేష్ సందడి
-
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్తో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 14 సిరీస్లో రెండు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్మీ 14 ప్రో ప్లస్ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్సెట్లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్ చేంజింగ్ ఫీచర్తో లభ్యమవుతున్నాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్3 (Snapdragon 7s Gen 3) చిప్సెట్తో నడుస్తుంది. ఇక రియల్మీ 14 ప్రోలో మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్మీ 14 ప్రో సిరీస్లోని రెండు హ్యాండ్సెట్లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.ధరలివే..భారత్లో రియల్మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్కు రూ.24,999, 8GB+256GB వేరియంట్కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్లలో లభిస్తుంది. ఇక రియల్మీ 14 ప్రో ప్లస్ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.ఈ ఫోన్ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్ (Flipkart), రియల్మీ ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ ఛానెల్ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్, 1500 నిట్స్ బ్రైట్నెస్తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే.⇒ స్నాప్డ్రాగన్ 7S జెన్ 3 చిప్సెట్⇒ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh టైటాన్ బ్యాటరీరియల్మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్⇒ వనిల్లా మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్⇒ GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాహై-రెస్ సర్టిఫికేషన్తో డ్యూయల్ స్పీకర్లుఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీకలర్ చేంజింగ్ ఫీచర్ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్మీ 14 ప్రో ప్లస్ 5G, రియల్మీ 14 ప్రో 5G ఫోన్లలో పెరల్ వైట్ వేరియంట్లలో రియల్మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది. -
Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. 2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇవే..ఢిల్లీ-పట్నా ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.మీరట్-లక్నో మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.మదురై-బెంగళూరుమదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.చెన్నై-నాగర్కోయిల్తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్కోయిల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్కోయిల్తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.టాటానగర్-పట్నా టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ జార్ఖండ్లోని టాటానగర్ను బీహార్లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.భాగల్పూర్-హౌరాభాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ను 2024 సెప్టెంబర్ 15న బీహార్లోని భాగల్పూర్ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.బ్రహ్మపూర్-టాటానగర్బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ను టాటానగర్తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ.. -
‘వన్ డే వన్ జినోమ్’ లక్ష్యం ఏంటంటే..
న్యూఢిల్లీ: మానవ ఆరోగ్యంతోపాటు వ్యవసాయం, పర్యావరణ రంగాల్లోనూ ఎన్నోవిధాలుగా ఉపయోగపడే సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకో గొప్ప ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (బ్రిక్)లు సంయుక్తంగా ఈ పనిని చేపట్టాయి. ‘వన్ డే వన్ జినోమ్’ పేరుతో న్యూఢిల్లీలో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర సూక్ష్మజీవులపై విసృ్తతస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. వాటి జన్యుక్రమాలను నమోదు చేయడమే కాకుండా.. విశ్లేషించనున్నారు. తద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సూక్ష్మజీవులను మన ప్రయోజనాలకు ఉపయోగించుకోనున్నారు. ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ ‘వన్ డే వన్ జినోమ్’ కార్యక్రమం మొదలైంది. నీతీఆయోగ్ మాజీ సీఈవో జీ20 షేర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. జీవావరణ వ్యవస్థలో మైక్రోఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు చాలా కీలకం. మట్టి ఏర్పాటు మొదలుకొని ఖనిజాల శుద్ధీకరణ వరకూ బోలెడన్ని పనులు చేస్తూంటాయి ఇవి. వ్యవసాయం విషయానికి వస్తే నేలలో పోషకాలను రీసైకిల్ చేయడం, నైట్రోజన్ను మట్టిలోకి చేర్చడం, చీడపీడల నియంత్రణ, వంటి పనులన్నింటికీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే కారణం. అంతేకాదు.. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో కలసిమెలిసి ఉంటూ నీరు పోషకాలు సక్రమంగా అందేలా చేస్తాయి. మానవ శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయంటేనే వాటి ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో, శరీరానికి పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తూంటాయి. అలాగే మనకొచ్చే ఇన్ఫెక్షన్లకూ ఈ సూక్ష్మజీవుల్లోని కొన్ని కారణమవుతుంటాన్నది మనకు తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే వీటి గురించి మరింత విసృ్తత స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరమం ఉందంటోంది ‘వన్ డే వన్ జినోమ్’!అయితే ఇప్పటివరకూ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది చాలా తక్కువే. అందుకే వేర్వేరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించే లక్ష్యంతో వన్ డే వన్ జినోమ్ కార్యక్రమం మొదలైంది. తద్వారా ఏ సూక్ష్మజీవుల ద్వారా ముఖ్యమైన ఎంజైమ్లు లభిస్తున్నాయి? రోగాలకు చెక్పెట్టేందుకు ఉపయోగపడే రసాయనాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. వ్యవసాయంలోనూ మొక్కకు మేలు చేయగల, దిగుబడి పెంచగల సూక్ష్మజీవులను గుర్తించే వీలేర్పడుతుంది. బ్రిక్తోపాటు బయోమెడికల్ జినోమిక్స్ కూడా చురుకుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా అందుబాటులో ఉందో? వాటి లక్షణాలేమిటో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన -
వివో నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్..
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ పోర్ర్టెయిట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్ ధర రూ. 21,999 కాగా 8GB+256GB వేరియంట్ ధర రూ.23,999. ఈ ఫోన్కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.నవంబర్ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ కార్డ్, బీవోబీ కార్డ్ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్బ్యాక్ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్ స్మార్ట్ఫోన్లకు బాలీవుడ్ నటి సుహానా ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది. -
సెలూన్ ఓపెనింగ్లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
భారత్ అమ్ముల పొదిలో ‘అరిఘాత్’
సాక్షి, విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్’చేరింది. అరిహంత్ క్లాస్లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ను విశాఖ నేవల్ డాక్యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారుతోందన్నారు.దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్ మోడ్లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.అరిఘాత్ ప్రత్యేకతలు..పొడవు: 111.6 మీటర్లు వెడల్పు: 11 మీటర్లు డ్రాఫ్ట్: 9.5 మీటర్లు బరువు: 6,000 టన్నులు సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్. మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు -
రెస్ట్రో బార్పై కోహ్లీ సిక్స్..
సాక్షి, సిటీబ్యూరో: సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు.. కానీ వారి వ్యాపారాలకు హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకోవడం ఈ మధ్య విరివిగా జరుగుతోంది. నగరంలో బాలీవుడ్ హీరోలు మొదలు మనీష్ మల్హోత్రా వంటి ఫ్యాషన్ ఐకాన్స్ నుంచి ప్రముఖ భారతీయ క్రీడాకారుల వరకూ సొంత వ్యాపారాలను ప్రారంభించిన వారే. విభిన్న సంస్కృతులతో పాటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసేలా నగర జీవనం కొనసాగించడం ఒక కారణం. ఐతే నగరంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం సొంతంగా వన్–8 కమ్యూన్ అనే సరికొత్త రెస్ట్రో బార్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్ వంటి పసందైన వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తున్నాయి.విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటి వినూత్న అనుభూతిని అందించటం వన్–8 కమ్యూన్ ప్రత్యేకత. రిచ్ ఫుడ్.. వింటేజ్ లుక్.. ఇటీవలే హైదరాబాద్లోని హైటెక్ సిటీ నడి»ొడ్డున ప్రారంభించిన వన్–8 కమ్యూన్ నగరానికున్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ నగరానికి చేరుకోవడంతో ఫుడ్ లవర్స్తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్గా మారింది.కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడే..ఈ స్పాట్ రాయల్ లుక్ ఇంటీరియర్తో పాటు కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. కోహ్లీ అభిమానులు ఈ వంటకాలను రుచి చూడటానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం విశేషం. స్థానికంగా ఆదరణ పొందుతున్న ఫుడ్ రెసిపీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న మోడ్రన్ రుచులును తయారు చేస్తున్నారు. అంతే కాకుండా మద్యాన్ని ఇష్టపడే వారికి టలిస్కర్, గ్లెన్లివెట్, గ్లెన్ మెరంగే, గ్లెన్ ఫిడిచ్, క్రాగన్మోర్ వంటి విభిన్న టాప్ బ్రాండ్లు కొలువుదీరాయి. ఇవన్నీ దాదాపు పది–పన్నెండేళ్ల సరుకు కావడం విశేషం.సెలబ్ స్పాట్...హైటెక్ సిటీ వేదికగా కొలువుదీరిన ఈ రెస్టారెంట్ నగరంలోని సెలబ్రిటీలకు మంచి స్పాట్గా మారింది. దీని ప్రారం¿ోత్సవాలు ముగియకముందే మంచు మనోజ్ వంటి సినీతారల పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం మరింత ఆసక్తి పెంచింది. వన్–8 కమ్యూన్ను ఇప్పటికే సినీ ప్రముఖులు మంచు లక్షి్మ, నాని, అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జ, సు«దీర్ బాబు, సందీప్ కిషన్, ఆకాష్ పూరి, అభిరామ్ వంటి టాలీవుడ్ నటులు సందర్శించారు.సామాజిక, సాంస్కృతిక అనుసంధాన వేదిక..ఎల్లప్పుడూ ఆహారంతో పాటుగా సామాజికంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చే స్థలాన్ని సృష్టించడం వన్–8 కమ్యూన్ ప్రధాన లక్ష్యం. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులను ఆహారంతో అనుసంధానం చేసే కేంద్రంగా వన్–8 నిలుస్తుంది. స్థానిక ఫుడ్తో పాటు కాంటినెంటల్ ఫుడ్ను సైతం హైదరాబాద్ నగరం ఆహా్వనించింది, ఆస్వాదిస్తోంది. ఈ ఆదరణకు మెచ్చే విరాట్ కోహ్లీ ఈ రెస్ట్రో బార్ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ నగరం, ప్రజలు సరికొత్త రుచులను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. – వర్తిక్ తిహారా, వన్–8 కమ్యూన్ కో–ఫౌండర్ -
ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్స్టర్ ప్రో , రోడ్స్టర్, రోడ్స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్కు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.చౌకైన రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ మోడల్లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్లతో వస్తాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఓలా రోడ్స్టర్ ఎక్స్రోడ్స్టర్ ఎక్స్ 11 kW గరిష్ట మోటార్ అవుట్పుట్ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు 4.3-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్ ధర రూ. 99,999.ఓలా రోడ్స్టర్రోడ్స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్టీ టచ్స్క్రీన్, ప్రాక్సిమిటీ అన్లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్లతో వస్తుంది. మోటార్సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.ఓలా రోడ్స్టర్ ప్రోఈ శ్రేణి మోటర్ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్పుట్, 105 Nm టార్క్తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్సైకిల్గా కూడా నిలిచింది. రోడ్స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్స్క్రీన్, USD (అప్సైడ్ డౌన్) ఫోర్క్లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్లకు ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది. -
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
-
Realme 12 సిరీస్ 5G ను అన్ బాక్స్ చేసిన సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రాజెక్ట్’ చేపట్టింది. భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. 6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 జవహర్ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీపై ఎస్హెచ్సీ మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సాయిల్ టెస్టింగ్ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రేపు జీఎస్ఎల్వీ ఎఫ్–14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్ను ప్రయోగించనున్నారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయో గ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యా బ్) వారికి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజ రాజన్ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్ సమావేశం నిర్వహించారు.శుక్రవా రం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వీ సిరీస్లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. -
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్ అనిపిస్తోంది
‘‘ముఖ్య గమనిక’ టీజర్ చూశాను. మంచి థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్గా విరాన్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తానికి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివిన్ప్రోడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బేనర్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్. -
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
Krithi Shetty: నెల్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభించిన ఉప్పెన భామ కృతిశెట్టి (ఫొటోలు)
-
రూ.7,499లకే సరికొత్త స్మార్ట్ఫోన్..
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్లో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పోకో సీ65 స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ వేరియంట్ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్ సేల్ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 6.74 అంగుళాల HD+ 90Hz డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ C-టైప్ ఛార్జర్ సపోర్ట్ -
Kajal Aggarwal : కూకట్పల్లిలో సందడి చేసిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
కొత్త క్యారెక్టర్కి క్లాప్
హీరో రవితేజ కెరీర్లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్కు స్క్రిప్ట్ను అందించారు. ‘‘ఒక పవర్ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
Nani's New Movie: హీరో నాని కొత్త చిత్రం షురూ (ఫొటోలు)
-
Jayasudha : బెనకా గోల్డ్ కంపెనీని ప్రారంభించిన సహజనటి జయసుధ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా తనిష్క్ కాకతీయ కలెక్షన్స్ ప్రారంభం (ఫోటోలు)
-
స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్కు కష్టమే!
Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. తద్వారా ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్ జోన్ పేరుతో వాటిని లాంచ్ చేసింది. దాదాపు యాపిల్ ప్రీమియంహెడ్ఫోన్లు AirPods Max ధర లోనే డైసన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్బీ-సీ చార్జింగ్ సిస్టం, లిథియం అయాన్ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్ యాప్తో ఈ హెడ్ఫోన్స్ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్ను బట్టి హెడ్ఫోన్స్ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది. (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం) New Dyson Zone Absolute+ air purifying noise-cancelling headphones🎧 pic.twitter.com/XS7j3pbq7s — Milez (@MilezGrey) May 8, 2023 -
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
హెచ్సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్నగర్ నుంచి వర్చువల్గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
మోదీ మార్క్ శంఖారావం!
(మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అటు అధికారిక కార్యక్రమాలతో అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. ఇటు బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలతో రాజకీయ ప్రసంగం చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్లను తీరుస్తూ పసుపుబోర్డు, గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా.. తెలంగాణకు బీజేపీ మేలు చేస్తోంది అన్నట్టుగా సంకేతాలు పంపారు. తెలంగాణప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూనే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరుస్తామని చెప్పారు. మహిళా బిల్లును ఆమోదించడం, హైవేల నిర్మాణంతో ప్రయోజనాలు, కేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేస్తున్నట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. సభ సాంతం.. మోదీ నామస్మరణతో.. అధికారిక కార్యక్రమం, ఊరేగింపు, సభా వేదికపై ప్రసంగం సమయంలో సభా ప్రాంగణమంతా మో దీ.. మోదీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అరుపులు, కేకలతోపాటు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది చూసిన మోదీ.. ‘మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు నేను ధన్యుడిని అయ్యాను. ఇంత ప్రేమను చూసి ముగ్దుడిని అయ్యాను. మీరు, మేము కలసి తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళదాం. ఈ సభ విజయవంతం కావడం, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపడాన్ని వరుణదేవుడు కూడా హర్షాన్ని వెలిబుచ్చి వర్షాన్ని కురిపించాడు. (ప్రసంగం సాగుతున్నపుడు వర్షం పడుతుండటాన్ని ప్రస్తావిస్తూ..). తెలంగాణ ప్రజలను కలసిన నా జీవితం ధన్యమైంది..’’అని పేర్కొన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రసంగిస్తూ.. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో అంతా లేచి మోదీకి గౌరవసూచకంగా చప్పట్లు కొట్టాలని కోరారు. దీనితో వేదికపై ఆసీనులైన నేతలు, సభికులు లేచి ‘మోదీ నాయకత్వం వరి్ధల్లాలి’అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మోదీ రెండు చేతులు జోడించి, వంగి సభికులకు సమస్కారం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి జోష్ చూసి మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చి న్నారికి తన ఆశీస్సులు అందిస్తున్నట్టు చెప్పారు. పది నిమిషాల్లో మనసు విప్పుతా..! తొలుత అధికారిక కార్యక్రమ వేదికపై సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన మోదీ అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. చివరిలో మాత్రం.. ‘‘ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. కొన్ని అంశాలపై నన్ను నేను నియంత్రించుకున్నాను. ఓ పది నిమిషాల్లో మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నా.. అక్కడ మనసు విప్పి మాట్లాడుతా.. నేను మీకు మాటిస్తున్నా.. నేను ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా మాట్లాడుతా..’’అని పేర్కొనడం గమనార్హం. ఓపెన్ టాప్ జీప్లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. ఓపెన్ టాప్ జీప్లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్షిప్ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్లో పెట్రోల్, డీజిల్కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
థాయ్లాండ్లో డబుల్
‘ఇస్మార్ట్ శంకర్’ (2019) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో రామ్ పొతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభించాం. ఈ షెడ్యూల్లో రామ్, నటుడు సంజయ్ దత్పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి. -
Chandrayaan 3: విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 (ఫొటోలు)
-
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ను హైబ్రిడ్ మోటార్తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్.. రూ.2.35 కోట్ల కారు విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్షోరూంలో రూ.2.35 కోట్లు. -
మోటరోలా ఎన్విజన్ఎక్స్ 4కే టీవీ
బెంగళూరు: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్ ఎక్స్’ పేరుతో 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. ఎన్విజన్ ఎక్స్ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్ఈడీ డిస్ప్లే క్వాంటమ్ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది. -
స్వచ్ఛ సంకల్పం.. ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీని భారత్లో నెక్సా షోరూమ్ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్ల్యాంప్లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు -
కొత్త వ్యాపారం ప్రారంభించిన బజాజ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు. -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్ను తొలిసారిగా భారత్లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ
చైనీస్ ఇంటర్నెట్, టెక్ దిగ్గజం టెన్సెంట్ తన వుయ్చాట్ పే సేవ కోసం పామ్ రికగ్నేషన్ సర్వీస్ను ఇటీవల ప్రారంభించింది. ఇది మెట్రో ప్రయాణికులు స్కానర్పై అరచేతిని చూపి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు మెట్రో స్టేషన్ టర్న్స్టైల్స్లో స్కానర్పై చేతులు పెట్టి రాజధానిలోని డాక్సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో రైడ్ల కోసం చెల్లించవచ్చు. ప్రత్యేకమైన పామ్ ప్రింట్ రికగ్నేషన్ యూజర్ వుయ్చాట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపును ప్రేరేపిస్తుందని నివేదిక పేర్కొంది. టెన్సెంట్ ప్రకారం.. ఈ పేమెంట్ సర్వీస్ కోసం మెట్రో స్టేషన్లోని నిర్దేశిత యంత్రం వద్ద ప్రయాణికులు తమ అరచేతి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సాంకేతికత ఉపరితల స్థాయి అరచేతి ముద్రలు, చేతి సిరలు రెండింటినీ గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. కంపెనీకి చెందిన యూటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. టెన్సెంట్ త్వరలో కార్యాలయాలు, క్యాంపస్లు, రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లలో పామ్ పేమెంట్లను ప్రారంభించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ కూడా తన అలిపే సేవ కోసం ఇలాంటి టెక్నాలజీపై పని చేస్తోంది. యూఎస్లో అమెజాన్ 2020లో ఆఫ్లైన్ స్టోర్లలో అమెజాన్ వన్ అనే తన సొంత హ్యాండ్ స్కాన్ టెక్నాలజీని ప్రారంభించింది. -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్లాక్తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్కు వచ్చేశాయ్! ధరలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 2023 వర్షన్ ఎంట్రీ లెవెల్ సెడాన్ అయిన ఏ–క్లాస్ లిమోసిన్ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్ డిజిటల్ డిస్ప్లే, 17 అంగుళాల 5 స్పోక్ అలాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 7 ఎయిర్బ్యాగ్స్ పొందుపరిచారు. అలాగే ఎంట్రీ లెవెల్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్బ్యాక్ ఏ 45 ఎస్ ఏఎంజీ 4మేటిక్ ప్లస్ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఏఎంజీ పెట్రోల్ ఇంజన్తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. ఇదీ చదవండి: ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం -
Oppo F23 5G కొత్త ఫీచర్స్ ఇవే
-
మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ–స్ప్రింటో కొత్తగా ఎమెరీ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్ల రేంజి (మైలేజీ) ఇస్తుంది. 6 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0–40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Uber Green: ఉబర్లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 20–35 ఏళ్ల వయస్సు గల చోదకులు లక్ష్యంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. ఇందులో రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ–థెఫ్ట్ అలారం, మొబైల్ చార్జింగ్ సాకెట్ తదితర ఫీచర్లు ఉంటాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు అతుల్ గుప్తా తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్ షోరూం)గా ఉంటుంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
జగనన్నకు చెబుదాం వెబ్ సైట్ లాంచ్
-
మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో మహీంద్ర బొలెరో మాక్స్ పికప్
-
ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..
గత కొంతకాలంగా ఎగిరే కార్లు వినియోగంలోకి వస్తాయన్న చాలామంది కలలు కంటూనే ఉన్నారు. అయితే ఈ కల ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యింది. స్వీడన్ స్టార్టప్ కంపెనీ 'జెట్సన్ వన్' అనే ఫ్లైయింగ్ కారుని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డ్రోన్ మాదిరిగా గాలిలో ఎగిరే ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 98,000 డాలర్లు (సుమారు 80.19 లక్షల రూపాయలు). అయితే కస్టమర్ ఇప్పుడు కేవలం 8,000 డాలర్లు (దాదాపు 6.5 లక్షల రూపాయలు) చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉంటుంది. చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిలో ఎగురుతూ సురక్షితంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ కారుని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని బరువు 86 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది eVTOL అల్ట్రాలైట్ వాహనాల కోసం US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ నియమాలు కేవలం అమెరికాలో మాత్రమే వర్తిస్తాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) జెట్సన్ వన్ అనే ఫ్లైయింగ్ కారు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కాక్పిట్లో రెండు జాయ్స్టిక్లు ఉంటాయి. ఒకటి ఎత్తుని కంట్రోల్ చేయడానికి కాగా, మరొకటి దిశను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారు కూడా చాలా తక్కువ సమయంలో ఆపరేటింగ్ నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. జెట్సన్ వన్ 88 కేజీల బ్యాటరీ కలిగి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇందులో ఉన్న ప్రొపెల్లర్లు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ల్యాండింగ్ చేయడానికి సెన్సర్లను ఉపయోగించి సులభంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని గురించి కంపెనీ వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) మార్కెట్లో విడుదలైన కొత్త జెట్సన్ వన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పారాచూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులో హ్యాండ్స్-ఫ్రీ హోవర్ ఫంక్షన్లు ఉండటం వల్ల మోటార్ చెడిపోయినప్పుడు కూడా సురక్షితంగా ఎగురుతూ ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు కావాలనుకున్న వారు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలో త్వరలోనే ప్రారంభమవుతాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఇప్పటికే వందల సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్బిల్ట్గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్వాచ్లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్వాచ్లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్మీ భారత మార్కెట్లో సి–55 మోడల్ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్హెచ్డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు ఉంది. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైన్ ఛానెల్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
భారత్లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు
సిఎన్జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ & ధరలు: మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ. వేరియంట్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి మూడు వేరియంట్స్లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ & ఫీచర్స్: బ్రెజ్జా సిఎన్జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) పవర్ట్రెయిన్: కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్జెట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్లో 101 హెచ్పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్లో 88 హెచ్పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!) ప్రత్యర్థులు: మారుతి సిఎన్జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్జి పవర్ట్రెయిన్ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా. -
సుచిత్రలో నిహారిక, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
హైటెక్స్లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
ఏపీ సర్కార్ మరో ముందడుగు..
సాక్షి, విశాఖపట్నం: పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్ ప్రారంభం
స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేగాదు ఈ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్కి రూ. 325లకి, ప్రైవేట్ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్కు సంబంధించిన వ్యాక్సిన్ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: అండమాన్లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు) -
టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ లాంచ్; ధర వింటే..!
సాక్షి,ముంబై: టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. తన స్పార్క్ సిరీస్ను రిఫ్రెష్ చేస్తూ టెక్నో స్పార్క్ గో 2023ని Tecno ఆవిష్కరించింది. త్వరలోనే ఇండియాలోకూడా ఇది లాంచ్ కానుంది. ఎంట్రీ-లెవల్ ఫోన్ పోకో సీ50, రెడ్మిఏ1 లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ను ఫోన్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న మోడల్ కాస్త అప్గ్రేడ్చేసి దీన్ని తీసుకొచ్చింది. స్పార్క్ గో 2023 మూడు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. అలాగే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 4జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎండ్లెస్ బ్లాక్, ఉయుని బ్లూనెబ్యులా పర్పుల్లో లభ్యం. టెక్నో స్పార్క్ గో 2023 ఫీచర్లు 6.56-అంగుళాల IPS LCD MediaTek Helio A22 SoC Android 12 HiOS 12.0 రియర్ డ్యూయల్ కెమెరా f/1.85 ఎపర్చర్తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా QVGA సెన్సార్ , LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చువల్ గా ప్రారంభించిన మోడీ
-
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
డిజిటల్ రూపాయిని లాంచ్ చేసిన RBI
-
లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!
హైదరాబాద్: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్లో ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్యూవీని పరిచయం చేసింది. ప్రారంభ ధర ఎక్స్షోరూంలో రూ.4.22 కోట్లునుంచి ప్రారంభం. స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు ఎక్కువ. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తెలిపారు. -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్లో S-CNG వెర్షన్ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
'నయా భారత్ కా సప్నా' ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్
Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. Koo App One step for the nation. #nayebharatkasapna #swatantratasankalp View attached media content - Karan Johar (@karanjohar) 1 Aug 2022 -
100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్ చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్ గ్లాసెస్ కెమెరా ' స్మార్ట్ గ్లాస్ను విడుదల చేసింది. షావీమీ 'మిజియా ఏఆర్ స్మార్ట్ గ్లాస్ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్ స్మార్ట్ గ్లాస్ను భారత్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. మిజియా ఏఆర్ గ్లాసెస్ ఫీచర్లు రూ.29,030 విలువైన మిజియా ఏఆర్ గ్లాసెస్లో డ్యుయల్ కెమెరా సెటప్, 50 మెగా పిక్సెల్ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్ ఆప్టికల్ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుండగా 15ఎక్స్ హైబ్రిడ్ వరకు జూమ్ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు. పనితనం అంటే ఇదే మరి కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్ గ్లాస్ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్ స్టాప్గా రికార్డ్ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. స్టోరేజీ ఎంతంటే స్నాప్ డ్రాగన్ 8చిప్ సెట్తో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాస్లో 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్తో ఓఎల్ఈడీ స్క్రీన్తో వస్తుండగా.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. -
జక్కన్న విడుదల చేసిన 'దోచేవారెవరురా'.. ఆసక్తిగా టీజర్..
SS Rajamouli Launches Dochevarevarura Teaser: ''నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న 'దోచేవారెవరురా' సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉంటుదని నమ్ముతున్నా'' అని తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి. 'మనీ', 'మనీ మనీ', 'సిసింద్రీ', 'హ్యాండ్సప్', 'మొండి మొగుడు పెంకీ పెళ్లాం', 'లక్కీ ఛాన్స్', 'పట్టుకోండి చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శివ నాగేశ్వర రావు. తాజాగా ఆయన దర్శకత్వంలో మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, ప్రణవ చంద్ర తదితరులు కీలక పాత్రలుగా పోషించిన చిత్రం 'దోచేవారెవరురా'. ఈ సినిమా టీజర్ను శుక్రవారం (జులై 29) దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
ఎట్టకేలకు ‘సిట్రోయెన్ సీ3’ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివిగో!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం. ఇంజన్, ఫీచర్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్పీఎం వద్ద 81 బీహెచ్పీ, 115 టార్క్ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్పీఎం వద్ద, 108 బీహెచ్పీని, 1150 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ సీ3 ధరలు లైవ్: రూ. 5,70,500 ఫీల్: రూ. 6,62,500 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500 దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్గా అందుబాటులో ఉంది. -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్ప్లస్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న ఇటలీ సంస్థ పియాజియో భారత మార్కెట్లో ప్యాసింజర్ విభాగంలో ఆపే నెక్ట్స్ ప్లస్ త్రిచక్ర వాహనం ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ఎక్స్షోరూం ధర రూ.2.35 లక్షలు. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలో ఈ మోడల్ను రూపొందించారు. సీఎన్జీ వేరియంట్ కేజీకి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ట్యూబ్లెస్ టైర్స్, విశాలమైన కూర్చునే స్థలం, డ్యూయల్ టోన్ సీట్స్, పారదర్శక కిటికీలు వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ విక్రయిస్తున్న మోత్తం యూనిట్లలో సీఎన్జీ వాటా ఏకంగా 50 శాతముంది. డీజిల్ మోడళ్లకు మహమ్మారి ముందస్తు స్థాయిలో 20 శాతం లోపే డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. -
ఆల్ న్యూ మారుతి బ్రెజా వచ్చేసింది, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్లో 6 ఎయిర్బ్యాగ్లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది. మొత్తం 10 వేరియంట్లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్లైట్లు, టెయిల్ లైట్లతో సహా ఎక్ట్సీరియర్లో డిజైన్లో అనేక మార్పులను పొందింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
రాకింగ్ రాకేష్ హీరోగా 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'..
Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్లు ఈ చిత్రం టైటిల్ను అనౌన్స్ చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ–‘‘కామెడీతో కూడుకున్న హారర్ సినిమా ఇది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘76 సూపర్ హిట్స్ ఇచ్చిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అన్నారు తుమ్మల ప్రసన్నకుమార్. చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్. చదవండి:👇 నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందిన 'వాణిజ్య భవన్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. (ఎన్ఐఆర్వైఏటీ) నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఇలా ఉంది. ♦వాణిజ్య భవన్,ఎన్ఐఆర్వైఏటీ పోర్టల్తో ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలు నెరవేరుతాయి.వాణిజ్య-వ్యాపార సంబంధాలతో పాటు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సానుకూల ఫలితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ♦వాణిజ్య భవన్తో వ్యాపార-వాణిజ్య రంగాలకు చెందిన వారితో పాటు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ♦గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే సమయంలో భారత్ 670 బిలియన్ల(భారత కరెన్సీలో రూ.50లక్షల కోట్లు) ఎగుమతులు చేసింది. ♦దేశ ప్రగతికి ఎగుమతులు కీలకం. 'వోకల్ ఫర్ లోకల్' వంటి కార్యక్రమాలు దేశ ఎగుమతులను వేగవంతం చేసేందుకు దోహద పడ్డాయని మోదీ తెలిపారు. ♦గతేడాది దేశం ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పటికీ ఎగుమతుల విషయంలో భారత్ 400 బిలియన్ల పరిమితిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం అనూహ్యంగా 418 బిలియన్ డాలర్లు అంటే 31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతితో సరికొత్త రికార్డ్ను సృష్టించాం. ♦ఈరోజు ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం 'పూర్తి ప్రభుత్వ' విధానంతో ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి." ఎంఎస్ఎంఈ, మంత్రిత్వ శాఖ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయం,వాణిజ్య మంత్రిత్వ శాఖ..ఇలా అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభం
-
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షురూ..
Kiran Abbavaram Rules Ranjan Movie Launched: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల 'సెబాస్టియన్ పీసీ 524'తో ఆకట్టుకున్న కిరణ్ అంతకుముందు 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో హిట్ కొట్టాడు. తాజాగా 'సమ్మతమే' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా రత్నం కృష్ణ దర్శకత్వంలో 'రూల్స్ రంజన్' అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో సినీ అతిరథుల సమక్షంలో వైభవంగా జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన తొలి ముహుర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్ క్లాప్ కొట్టారు. దర్శక నిర్మాత ఏఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శుక్రవారం (మే 27) నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, అజయ్, వెన్నెల కిశోర్, వైశాలి, హిమాని, జయవాణి, ముంతాజ్, సత్య బాలీవుడ్ నటీనటులు అన్ను కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చులే అలరించనున్నారు. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
బలం పెరగాలి బ్రదర్!
దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే ప్రయత్నంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. కరోనా దెబ్బతో నిర్మాణం ఆలస్యమైన దేశీయ జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’ బుధవారం ముంబయ్లోని మజగావ్ డాక్స్లో జలప్రవేశం చేసింది. ‘మేకిన్ ఇండియా’ మాటలకు మచ్చుతునకగా నిలిచింది. హిందూ మహాసముద్రంలోని విలక్షణ మత్స్యజాతి పేరు పెట్టుకొన్న ఈ మెరైన్ అనేక కఠిన పరీక్షలు, ప్రయోగాల తర్వాత వచ్చే ఏడాది చివరలో భారత నౌకాదళంలో భాగం కానుంది. పెరుగుతున్న సరిహద్దు పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర తీర భద్రతలో ఎక్కడ ఉన్నామో పునరాలోచించుకొనేందుకు ఇది సరైన సమయం. అందుకోవాల్సిన లక్ష్యాలను పునశ్చరణ చేసుకొనేందుకు చక్కని సందర్భం. విదేశీ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని, దేశీయంగా మెరైన్ల నిర్మాణానికి మన దేశం ఎప్పుడో ప్రణాళిక వేసుకుంది. 1999లో ఆమోదం పొందిన ఆ ప్రణాళికలో భాగంగా ‘పి–75’, ‘పి–75ఐ’ అనే రెండు వేర్వేరు శ్రేణుల మెరైన్లను సిద్ధం చేస్తూ వస్తున్నాం. ‘పి–75’ ప్రాజెక్ట్ కింద మన దేశం సమకూర్చుకుంటూ వచ్చిన ఫ్రెంచ్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములలో ఆరవదీ, ఆఖరుదీ – ఈ కొత్త ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’. 2005 అక్టోబర్లో కుదుర్చుకున్న 375 కోట్ల డాలర్ల ఒప్పందంలో భాగంగా నేవల్ గ్రూప్ నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ జరిగింది. ఆ పరిజ్ఞానంతో మన దగ్గరే మజగావ్ డాక్స్లో రూపొందిన ‘ఐఎన్ఎస్ కల్వరి’– 2017 డిసెంబర్లో, ‘ఖండేరీ’– 2019 సెప్టెంబర్లో, ‘వాగిర్’– 2020 నవంబర్లో, ‘కరంజ్’– గత ఏడాది మార్చిలో, ‘వేలా’– నవంబర్లో కమిషనింగ్ జరుపుకొన్నాయి. చివరిగా ఇప్పుడు ‘వాగ్షీర్’వచ్చింది. ఈ డీజిల్ యుద్ధ జలాంతర్గామి ప్రత్యర్థి మెరైన్లపై పోరుకూ, నిఘా సమాచార సేకరణకూ, మందుపాతరలు పెట్టడానికీ, ప్రాంతీయ నిఘాకూ తోడ్పడుతుంది. అయితే, ‘వాగ్షీర్’ చేతికి అంది రావడానికి మరో ఏణ్ణర్ధం పడుతుంది. ఏణ్ణర్ధం క్రితం జలప్రవేశం చేసిన ‘వాగిర్’ సైతం ఇంకా ట్రయల్స్లోనే ఉంది. వెరసి, మన సామర్థ్యం ఇనుమడించిందని అలసత్వం వహించడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే, మన దేశ జలాంతర్గాముల దళం కొంత వెనుకబడిందని గత ఏడాది చివరలో సైతం వార్తలు వచ్చాయి. నౌకాదళంలో, మరీ ముఖ్యంగా జలాంతర్గాముల సామర్థ్యంలో మన కన్నా చైనా ఎంతో ముందుకు దూసుకు పోయింది. జలాంతర్గాముల ఆధునికీకరణలో మనం కనీసం ఓ దశాబ్ద కాలం వెనుకబడ్డామని నిపుణుల కథనం. ఈ పరిస్థితుల్లో మన సముద్రతీర భద్రత రీత్యా మరిన్ని సబ్మెరైన్లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా మరిన్ని నౌకలు, సబ్మెరైన్లను మోహరించనున్న నేపథ్యంలో అది మరింత అవసరం. అలాగే, మన ప్రత్యర్థి పాకిస్తాన్కు 8 సబ్మెరైన్లు, 4 యుద్ధ విధ్వంసక నౌకలను చైనా కట్టబెడుతోంది. వాటన్నిటినీ చైనాకు బినామీగా పాక్ వాడే ప్రమాదం ఉంది. పాతవాటి స్థానంలో కొత్తవి చేర్చుకుంటూ ఏ క్షణంలోనైనా కనీసం 65 నుంచి 70 సబ్మెరైన్లు అందుబాటులో ఉండేలా చైనీస్ నౌకాదళం చూసుకుంటోందని అమెరికన్ నిఘా సంస్థ నివేదిక. పైగా, గడచిన 15 ఏళ్ళలో చైనా 12 అణు జలాంతర్గాముల్ని నిర్మించుకోవడం గమనార్హం. సాంప్రదా యిక సబ్మెరైన్ల కన్నా నీటిలో చాలా వేగంగా వెళ్ళగల ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఆకాశంలో ఫైటర్ జెట్ల లాంటివి. ఇవి బ్యాటరీలతో నడవవు కాబట్టి, సిబ్బందికి కావాల్సిన సరుకుల కోసమే తప్ప, ఛార్జింగ్ చేసుకోవడానికని నీటి నుంచి పైకి రావాల్సిన పని ఉండదు. ఎంతకాలమైనా నీటిలోనే ఉండగలవు. ఎస్ఎస్ఎన్లుగా పేర్కొనే ఈ మెరైన్లున్న 6 దేశాల్లో భారత్ కూడా ఒకటి. మిగతావి – అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. 1987లోనే రష్యా నుంచి తొలి ఎస్ఎస్ఎన్ను తెచ్చుకున్న మనం దేశ రక్షణ అవసరాల రీత్యా మరిన్ని అణు జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాల్సి ఉంది. దేశీయంగా రూపొందిస్తున్న 12 మెరైన్లలో సగం ఎస్ఎస్ఎన్లనే చేయాలని ప్రభుత్వం ఆ మధ్య మంచి నిర్ణయమే తీసుకుంది. అంతా అనుకున్న విధంగా జరిగి, ప్రాజెక్ట్ వేగంగా సాగినప్పటికీ, 2035 –40కి కానీ మన తొలి దేశవాళీ ఎస్ఎస్ఎన్ బరిలోకి దిగదని అంచనా. ఈలోగా రష్యా నుంచి 2 ఎస్ఎస్ఎన్లను మనం లీజు మీద తీసుకుంటున్నాం. కానీ, అందులో మొదటిది కూడా 2025 నాటికి కానీ మన చేతికి రాదు. ఉక్రెయిన్ యుద్ధవేళ అది మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితులన్నిటి రీత్యా దేశీయంగా రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కీలకం. మన నేవీ సైతం ‘కల్వరి’ మొదలు ఈ స్కార్పీన్ శ్రేణి మెరైన్లన్నిటినీ రీఫిట్ చేసేటప్పుడు ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (ఏఐపి) మాడ్యూల్ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నదీ అందుకే! దేశీయంగా ఏఐపి మాడ్యూల్ను అభివృద్ధి చేసేందుకు మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చేస్తున్న కృషి ఇప్పుడు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. ఈ మార్చి నాటి ప్రాథమిక వ్యయ నివేదిక ప్రకారం దేశ రక్షణ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో సైన్యానికి కేటా యించిన బడ్జెట్లో 99.5 శాతాన్ని వినియోగించడం గమనార్హం. కానీ, ఇప్పటికీ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం మనదే. అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశమైన మనం ఆ కథను తిరగ రాయాల్సి ఉంది. ‘మేకిన్ ఇండియా’ అంటూ ఇటీవల రూ. 47 వేల కోట్ల విలువైన 9 విదేశీ ఆయుధ ఒప్పందాలను పక్కనపెట్టిన మనం త్వరితగతిన ఆ కలను సాకారం చేసుకోవడం అవసరం. -
మార్కెట్లలోకి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్..200 కిమీపైగా రేంజ్, ధర ఎంతంటే..?
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. ఒకి-90(Okhi-90) హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తెచ్చింది. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్తో రానుంది. ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త Okhi 90 అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఒకి-90 స్పెసిఫికేషన్లలో అదుర్స్..! హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకి-90 అదిరిపోయే స్పెసిషికేషన్స్తో రానుంది. Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.6kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో పాటు 3.8kW ఎలక్ట్రిక్ మోటార్తో రానుంది. ఇది IP-65 సర్టిఫికేట్ పొందింది. ఎకో , స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్లను కల్గి ఉంది. ఒకి-90 స్పోర్ట్ మోడ్లో గరిష్టంగా 160 కిమీ రేంజ్ వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఎకో మోడ్లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీల వరకు ప్రయాణిస్తోంది. ఈ స్కూటర్లో 40 లీటర్ల భారీ బూట్ స్పేస్ను కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే..! ఫీచర్ల పరంగా, Okhi-90 దాని బేస్ వేరియంట్లో ఆల్-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో రానుంది. కాగా టాప్-స్పెక్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్తో టీఎఫ్టీ స్క్రీన్ను పొందుతుంది. బేస్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ టాప్ మోడల్ కంటే ఇది రూ. 4,000 - రూ. 5,000 చౌకగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నాబ్-స్టైల్ ఆటోమేటిక్ కీలెస్ స్టార్ట్, బూట్లో యూఎస్బీ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90 kmph. బ్యాటరీ జీరో నుంచి 100 శాతం నిండేందుకు 3-4 గంటల సమయం పట్టనుంది. ధర ఎంతంటే..! ఒకి-90 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.21 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ) ప్రారంభంకానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆయా రాష్ట్రాలు అందించే ఫేమ్-2 పథకం సబ్సిడీ వర్తించనుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేదా ఆఫ్లైన్లో సమీప డీలర్షిప్ని సందర్శించడం ద్వారా ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్స్ కోసం రూ. 2,000 టోకెన్ అమౌంట్ను చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: మెరుపు వేగంతో దూసుకెళ్లనున్న ఎలక్ట్రిక్ బైక్.. టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? -
కొత్తగా హోండా ఆఫ్రికా ట్విన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఆధునీకరించిన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.16 లక్షలు. డ్యూ యల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ ధర రూ.17.55 లక్షలు ఉంది. 1,083 సీసీ ఇంజిన్తో ఇది తయారైంది. 2–చానెల్ ఏబీఎస్, హోండా సెలక్టేబుల్ టార్క్ కంట్రోల్, బ్లూటూ త్ కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 2017లో భారత్లో ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ను కంపెనీ పరిచయం చేసింది. -
హల్చల్ చేస్తోన్న భారత తొలి క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 220కిమీ..
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. ఇప్పటివరకు భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ను కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ లాంచ్ చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 220 కిమీ ప్రయాణం..! ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్స్, హై స్పీడ్ స్కూటర్స్ , ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను జరుపుతోంది. భారత్లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ‘ కొమాకీ రేంజర్’ను గత ఏడాది డిసెంబర్లో టీజ్ చేసింది. అప్పట్లో కొమాకి రేంజర్ క్రూజర్ బైక్ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 220 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. ధర ఎంతంటే..! కొమాకీ రేంజర్ క్రూజర్ బైక్ సంప్రదాయ క్రూజర్ బైక్స్ ధరల కంటే కాస్త తక్కువగా ఉంది. కొమాకి రేంజర్ బైక్ ధర రూ. 1.68 లక్షలు(ఎక్స్షోరూమ్ ధర). ఈ క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ జనవరి 26 నుంచి కంపెనీకి చెందిన డీలర్షిప్లన్నింటిలో అందుబాటులోకి రానుంది. ఇది గార్నెట్ రెడ్, డీప్ బ్లూ, జెట్ బ్లాక్ అనే మూడు విభిన్న రంగులతో రానుంది. కొమాకి రేంజర్ ఫీచర్స్ అంచనా..! కొమాకి రేంజర్ క్రూజర్ బైక్లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్తో రానుంది. కొమాకి రేంజర్లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో రానుంది. 4000-వాట్ల మోటారుతో పనిచేయనుంది. లగ్జరీ కార్లకు ఉండే ఫాక్స్ ఎగ్జాస్ట్ను ఏర్పాటుచేశారు. లెగ్గార్డ్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా కన్పించనుంది. బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, డ్యూయల్ స్టోరేజ్ బాక్స్తో కూడిన రేంజర్ను అమర్చింది. చదవండి: పది నిమిషాల్లో హోం డెలివరీ.. అలా చేస్తే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం -
బందరు రోడ్డులో దసరా ఉత్సవాల సందర్బంగా హెలికాప్టర్ రైడ్
-
5జీ సపోర్ట్తో శాంసంగ్ నుంచి నయా స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్లో భాగంగా కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలోనే భారతీయ మార్కెట్లలోకి లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం పోలాండ్లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 ఉండనుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 32, 900 ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 5జీ ఫీచర్స్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 ప్రాసెసర్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ అమ్లోడ్ ప్లస్ డిస్ప్లే 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64 ఎమ్పీ రియర్ కెమెరా 12 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా టైప్ సీ సపోర్ట్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 25వాట్ ఛార్జింగ్ చదవండి: ప్రపంచ రికార్డును నెలకొల్పనున్న నటుడు...! -
యమహా కొత్త స్కూటర్.. ఏరోక్స్155
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా సరికొత్తగా ఏరోక్స్–155 స్కూటర్ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.1.29 లక్షలు. 15 పీఎస్ పవర్, సీవీటీ ట్రాన్స్మిషన్తో 155 సీసీ ఇంజిన్, స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్, సింగిల్ చానల్ ఏబీఎస్, 14 అంగుళాల టైర్లు, బ్లూటూత్, 24.5 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ హెడ్లైట్ వంటివి పొందుపరిచారు. కంపెనీ ఆధునీకరించిన వైజెడ్ఎఫ్–ఆర్15 బైక్ను సైతం ఆవిష్కరించింది. దీని ధర రూ.1.67 లక్షల నుంచి ప్రారంభం. 155 సీసీ, 4 స్ట్రోక్, 18.4 పీఎస్ పవర్తో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, క్విక్ షిఫ్టర్, బ్లూటూత్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హంగులు ఉన్నాయి. -
శిక్షక్ పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్ విడుదల..
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మార్కెట్లలోకి గూగుల్ పిక్సెల్ 5ఏ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ గూగుల్ 4ఏ 5జీ మాదిరగానే ఉండనుంది. డిజైన్ మాత్రమే కాదు, చాలా స్పెసిఫికేషన్లు అలాగే ఉన్నాయి. పిక్సెల్ 5 ఎ స్మార్ట్ఫోన్ను కస్టమర్లకు మరింత చౌక ధరకు అందించేందుకు ఈ స్మార్ట్ఫోన్లో కొద్ది మార్పులను చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కాస్త పెద్ద డిస్ప్లేతో రానుంది, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ను మార్కెట్లలోకి రిలీజ్ చేసింది. పిక్సెల్ 4ఎ 5జీ మోడల్తో పోలిస్తే చాలా పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్ఫోన్లో అమర్చారు. పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్ చార్జర్తో పాటురానుంది. కాగా పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లకు చార్జర్ రాదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కేవలం ఒకే కలర్ బ్లాక్ కలర్లో రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ కేవలం యూఎస్ఏ, జపాన్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలోనే భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్ 5ఏ 5జీ ధర సుమారు రూ. 33,400 ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 అపరేటింగ్ సిస్టమ్ 6.34-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లే విత్ 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ 20: 9 యాస్పెక్ట్ రేషియో, 413ppi పిక్సెల్ డెన్సిటీ+ హెచ్డీఆర్ సపోర్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765జీ ఎస్ఓసీ అడ్రినో 620 జీపీయూ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ 12.2+ 16మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 118.7 ఫీల్డ్ ఆఫ్ వ్యూ IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4,680mAh బ్యాటరీ -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్ఫోన్ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్ఫోన్ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్ఫోన్ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్ను డిజైన్ చేసింది. ఈ మొబైల్కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్కు సపోర్ట్గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
డుకాటీ బైక్ @ 23 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత్లో రెండు అడ్వెంచర్ టూరర్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర మల్టీస్ట్రాడా వీ4 రూ.18.99 లక్షలు కాగా వీ4–ఎస్ రూ.23.10 లక్షలు ఉంది. 10,500 ఆర్పీఎంతో 170 హెచ్పీ పవర్ వీ4 గ్రాన్టూరిస్మో ఇంజిన్ పొందుపరిచారు. రోడ్, ఆఫ్–రోడ్ వినియోగం కోసం ఇంజిన్ను డిజైన్ చేశారు. రైడింగ్ మరింత సౌకర్యవంతం చేసేందుకు వీ4 ఎస్ మోడల్కు రాడార్ టెక్నాలజీని వినియోగించారు. ఇది వేగాన్ని నియంత్రించడంతోపాటు వెనుక నుంచి వాహనాలు వస్తే హెచ్చరిస్తుంది. -
అతి తక్కువ ధరకే షావోమీ నుంచి 5జీ ఫోన్...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మొబైళ్ల తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ 5జీను మంగళవారం రోజున లాంచ్ చేసింది. షావోమి నుంచి రెడ్మీ బ్రాండ్తో భారత్లో రిలీజైన తొలి 5జీ స్మార్ట్ఫోన్. రెడ్మీ నోట్ 10 సిరీస్ నుంచి వచ్చిన ఐదో ఫోన్ రెడ్మీ నోట్ 10టీ 5జీ. రెండు రకాల స్టోరేజ్ వేరియంట్తో ఫోన్లను లాంచ్ చేశారు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ను జూలై 26 నుంచి అమెజాన్ , ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ హోమ్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. మొబైల్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రెడ్ మీ 10టీ 5జీ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18వాట్స్ ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
భారత మార్కెట్లోకి లంబోర్ఘిని కొత్త కారు విడుదల..ధర ఎంతంటే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి హురాకాన్ ఎస్టిఓ కారును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా హురాకాన్ ఎస్టీఓను నవంబర్ 2020లోనే రిలీజ్ చేయగా, హురాకాన్ ఎస్టీఓ ప్రస్తుతం ఉన్న హురాకాన్ పెర్ఫార్మంటే కారును రిప్లెస్ చేయనుంది. ఈ కారు బాడీ తయారీలో సుమారు 75 శాతం వరకు కార్బన్ ఫైబర్ను వినియోగించారు. లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీవోలో వీ10 ఇంజన్ ఏర్పాటు చేశారు. 630 బీహెచ్పీ సామర్థ్యంతో 565ఎన్ఎమ్ టార్క్ను ఉత్సత్తి చేస్తోంది. సున్నా నుంచి 100 స్పీడ్ను కేవలం మూడు సెకండ్లలోనే అందుకుంటుంది. కారు 200కెఎమ్పీచ్ స్పీడ్ను తొమ్మిది సెకండ్లలో అందుకుంటుంది. కారు టాప్ స్పీడ్ 310కేఎమ్పీహెచ్. కారులో మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ను అమర్చారు. ది రోడ్ ఒరియంటెడ్ ఎస్టీవో, ట్రాక్ ఫోకస్డ్ ట్రోఫీ, రెయిన్ మోడ్లను అమర్చారు. కార్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో భాగంగా కొత్త హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ (హెచ్ఎంఐ) గ్రాఫిక్స్ ఫీచర్స్ను అమర్చారు. అంతేకాకుండా కారులో డ్రైవ్ మోడ్ ఇండికేటర్, ఎల్డివిఐ సిస్టమ్, టైర్ ప్రెజర్, బ్రేక్ ఉష్ణోగ్రతలతో సహా కారు విధులను నిర్వహిస్తుంది. పూర్తిగా అనుసంధానించబడిన టెలిమెట్రీ వ్యవస్థతో డ్రైవర్లు హురాకాన్ STO ను రేస్ట్రాక్లపై రయ్రయ్మంటూ దూసుకువెళ్లొంచును. భారత్లో లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీవో ఎక్స్షోరూమ్ ధర రూ. 4.99 కోట్లుగా నిర్ణయించారు. -
సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. బొలెరో నియో సబ్కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్4, ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది. బొలెరో నియో ఎక్స్షోరూమ్ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది. సరికొత్త బొలెరో నియో రివైజ్డ్ డీఆర్ఎల్ హెడ్ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్తో రానుంది. కారు ఇంటీరియల్స్ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇనోఫో సిస్టమ్ విత్ బ్లూటూత్ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, బ్లూ సెన్స్యాప్తో బొలెరో నియో రానుంది. బొలెరో నియో ఇంజన్ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్తో, గరిష్టంగా 100పీఎస్ పవర్, 260ఎన్ఎమ్ పీక్ టార్క్ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్ఎమ్ టార్క్ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్, రాకీ బీజ్ ఆరు రకాల కలర్ వేరియంట్లతో రానుంది. -
సలోని హీరోయిన్గా ‘రాజుకు నచ్చిందే రంభ’
రావంత్, సలోని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. ర్యాలీ శ్రీనివాసరావు దర్శకత్వంలో వి. చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్కుమార్ యాదవ్ (వెంకట్) నిర్మిస్తున్నారు. ర్యాలీ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. ఒక హీరోయిన్గా సలోని నటిస్తుండగా, మరో హీరోయిన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. చంద్రబోస్, రామజోగయ్యల పాటలకి నా మార్క్ మిస్ కాకుండా బాణీలు ఇస్తా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కృష్ణ మోహన్ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి, లైన్ ప్రొడ్యూసర్: కావిడి ఆనంద్, సహనిర్మాతలు: వల్లాల రమేష్ యాదవ్, ఎ. రాజు సాగర్, కోన సత్యనారాయణ చౌదరి -
టీవీఎస్ నుంచి హై స్పీడ్ స్కూటర్
ముంబై: టీవీఎస్ మోటార్ మంగళవారం ఎన్టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూంలో దీని ధర రూ.89,192 గాఉంది. 125 సీసీ సిగ్మెంట్లో 10 పీఎస్ పైగా పవర్తో భారత్లో రూపొందిన ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. రేస్, స్ట్రీట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఎన్టార్క్ 125సీసీ రేస్ ఎక్స్పీ బైక్లో అధునాత ఫీచర్లను టీవీఎస్ జత చేసింది. అందులో వాయిస్ అసిస్టెంట్, కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రేస్ మోడల్లో గంటకు 98 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. -
PUBG: అందరికీ అందుబాటులో బీజీఎమ్ఐ
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తాజాగా బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా దేశీ గేమింగ్ ప్రియుల కోసం తయారు చేసిందని పేర్కొంది. ఈ ఏడాది మే 18న ప్రీ–రిజిస్ట్రేషన్స్ ప్రారంభించగా ఏకంగా 4 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయని తెలిపింది. జూన్ 17న గేమింగ్ ప్రియులకు ముందస్తుగా అందుబాటులోకి తెచ్చామని, సుమారు 2 కోట్ల మంది ప్లేయర్లు దీన్ని ఆడి, అభిప్రాయాలు తెలిపారని క్రాఫ్టన్ వివరించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీ–టు–ప్లే మల్టీప్లేయర్ గేమ్గా అందుబా టులో ఉంటుందని పేర్కొంది. క్రాఫ్టన్ అనుబం ధ సంస్థ పబ్జీ కార్పొరేషన్కి చెందిన పబ్జీ గేమ్ను, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం గతేడాది నిషేధించింది. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ సంస్థ పబ్జీని భారత్లో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ కంపెనీకి భారత్లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్జీ కార్పొరేషన్ అప్పట్లో తెలిపింది. తాజాగా దాని స్థానంలో క్రాఫ్టన్ కొత్త గేమ్ను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. -
అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..!
ముంబై: జర్మనీ విలాస కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తన ‘మినీ బ్రాండ్’ నుంచి మంగళవారం మూడు కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఆల్-న్యూ మినీ 3-డోర్ హ్యాచ్ ధర రూ.38 లక్షలు, ఆల్-న్యూ మినీ కన్వర్టబుల్ ధర రూ.44 లక్షలు, ఆల్-న్యూ మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ ధర రూ.45.5 లక్షలుగా ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్లలో లభ్యమయ్యే ఈ మినీ శ్రేణి కార్లు కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్లోకి దిగుమతి అవుతాయి. మినీ 3-డోర్ హ్యాచ్ 6.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇదే వేగాన్ని అందుకునేందుకు మినీ కన్వర్టబుల్ మోడల్కు 7.1 సెకన్ సమయం అవసరం. ఈ కార్లలో అధిక ధర కలిగిన మినీ జాన్ కాపర్ వర్క్స్ హ్యాచ్ 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మినీ 3-డోర్ హ్యాచ్, మినీ కన్వర్టబుల్ రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో వస్తున్నాయి. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
కేటీఎం అడ్వెంచర్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్సైకిళ్ల బ్రాండ్ కేటీఎం శుక్రవారం కొత్త మోడల్ ‘‘కేటీఎం 250 అడ్వెంజర్’’ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256 గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో అమర్చిన 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 30 హార్స్పవర్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ స్లిప్పర్ క్లచ్ సాయంతో సిక్స్–స్పీడ్ గేర్ బాక్స్(6–గేర్లు) వ్యవస్థతో పనిచేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ బైక్కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్పల్స్ మోడళ్లు ఉన్నాయి. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ మోడల్ను ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచస్థాయి ఫీచర్లతో రూపకల్పన చేసిన ఈ మోడల్ను కస్టమర్లు ఆదరిస్తారని కంపెనీ ఆశిస్తోంది. అడ్వెంజర్ టూరింగ్, అవుట్డోర్ ప్రయాణాలు పట్ల ఆసక్తి చూపుతున్న యువతకు ఇది సరైన ఎంపిక అని బజాజ్ ఆటో బైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ తెలిపారు. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) -
కరోనాతో సహజీవనం చేయాల్సిందే: బాలకృష్ణ
-
కళలు, చేతి వృత్తులను బతికించుకుందాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆప్కో- లేపాక్షి ఆన్లైన్ వెబ్స్టోర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీట : 'దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం. ఆ వర్గాలకే చెందిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా ఇవాళ రెండు ఆన్లైన్ స్టోర్లు ప్రారంభిస్తున్నాం.వాటి ద్వారా మన కళలు, చేతి వృత్తులను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం అది మాత్రమే కాదు, ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. (చదవండి : సీఎం జగన్ను కలిసిన మంత్రాలయం ప్రతినిధులు) ఆప్కో–లేపాక్షి : ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా మన రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు మరింత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వాటికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఎవరు కొనుగోలు చేసినా, అన్నీ సక్రమంగా అందేలా పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది. ఈ–ప్లాట్ఫామ్లలో అందుబాటు : అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా, వంటి ఈ–ప్లాట్ఫామ్లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటేరియల్స్, బెడ్షీట్లు పొందవచ్చు.ఇక లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కళంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలుబొమ్మలు పొందవచ్చు.అలా మన కళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం లభిస్తుంది. ఆ విధంగా ఆ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లభిస్తుందని 'ఆశిస్తున్నాను. హస్త కళాకారులకు ఆర్థిక సహాయం : 'హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నాం. ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్కు అవకాశం, మరోవైపు ఏటా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ రెండింటి వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. జిల్లాలలో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్లోకి తీసుకురావాలి.ఈ కళలు కలకాలం ఉండాలంటే, వాటికి అండగా నిలవడం ఎంతో అవసరం.ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బ్రతుకుతోంది. అలాంటి వృత్తులు బ్రతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం .' అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించిన జగన్ ఆన్లైన్లో ఒక చీరను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, లేపాక్షి అధికారులతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.(చదవండి : స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. “క్విక్ వ్యూ” డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 జీ సాక్ ప్రధాన ఫీచర్లుగా ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటరోలా రేజర్ 5జీ ధర, లాంచ్ ఆఫర్లు భారతదేశంలో మోటరోలా రేజర్ 5జీ స్మార్ట్ఫోన్ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 1,24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. గ్రాఫైట్ కలర్ ఆప్షన్లో లభ్యం. ఈ రోజు నుండి ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ లావాదేవీలపై 10,000 తక్షణ తగ్గింపు. జియో కస్టమర్లు రూ. 4,999 వార్షిక ప్రణాళికలో డబుల్ డేటా ఆఫర్ చేయనుంది. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఓఎల్ఈడీ ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియో: భారత్లో తొలిసారి ఇన్–ఫ్లైట్ సేవలు
-
జియో.. పోస్ట్పెయిడ్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టారిఫ్లు, బ్రాడ్బ్యాండ్ సేవల్లో ధరల యుద్ధానికి తెరలేపి సంచలనం సృష్టించిన రిలయన్స్కు చెందిన టెలికం సంస్థ జియో.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.199 పోస్ట్పెయిడ్ ప్లాన్కు పరిమితమైన ఈ కంపెనీ కొత్తగా పోస్ట్పెయిడ్ ప్లస్ పేరుతో నూతన సేవలను మంగళవారం ప్రకటించింది. నెల టారిఫ్ రూ.399తో మొదలుకుని రూ.1,499 వరకు ఉంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్లాన్, డేటా రోల్ఓవర్ ఆకర్షణీయ ఫీచర్లుగా నిలవనున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు తొలిసారిగా ఇన్ఫ్లైట్ కనెక్టివిటీ ప్రవేశపెట్టారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ యాక్టివేట్ చేస్తారు. ప్రీపెయిడ్ స్మార్ట్ఫోన్ విభాగంలో 40 కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నామని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పోస్ట్పెయిడ్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సేవలను పరిచయం చేశామన్నారు. పోస్ట్పెయిడ్ ప్లస్ విశేషాలు.. ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జీ నిముషానికి 50 పైసల నుంచి ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ ద్వారా భారత్కు నిముషానికి రూపాయికే కాల్ చేయవచ్చు. డేటా రోల్ఓవర్ పేరుతో అదనంగా డేటాను ఆఫర్ చేస్తోంది. దీని కింద ఇచ్చినదాంట్లో మిగిలిపోయిన డేటానే తదుపరి నెలకు జమ అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ప్యాక్నిబట్టి ఫ్యామిలీ ప్లాన్ కింద అదనపు కనెక్షన్లు పొందవచ్చు. ఇలా అదనంగా కనెక్షన్ తీసుకున్న కుటుంబ సభ్యులు ప్యాక్ కింద వచ్చిన డేటాను వాడుకోవచ్చు. ఇవీ నూతన టారిఫ్లు..: రూ.399 ప్యాక్లో 75 జీబీ డేటా లిమిట్ ఉంది. అలాగే డేటా రోల్ఓవర్ కింద 200 జీబీ ఇస్తారు. 100 జీబీ డేటాతో కూడిన రూ.599 ప్యాక్లో డేటా రోల్ఓవర్ 200 జీబీ, ఫ్యామిలీ ప్లాన్ కింద ఒక సిమ్ అదనం. రూ.799 ప్యాక్లో 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్ఓవర్, ఫ్యామిలీ ప్లాన్లో 2 అదనపు సిమ్లు పొందవచ్చు. రూ.999 ప్యాక్లో 200 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్, 3 అదనపు సిమ్లు లభిస్తాయి. రూ.1,499 టారిఫ్లో 300 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్తోపాటు యూఎస్ఏ, యూఏఈలో అన్లిమిటెడ్ డేటా, వాయిస్ ఆఫర్ చేస్తున్నారు. -
ఎన్ శంకర్ విడుదల చేసిన ‘తెరవెనుక’ ఫోస్టర్
హైదరాబాద్: ప్రముఖ స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విజయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా ‘తెరవెనుక’ అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై ఎన్. శంకర్ మాట్లాడుతూ ప్రవీణ్ చంద్ర టాలెంట్ ఉన్న దర్శకుడని, విభిన్న కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెరవెనుక సినిమాకు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్. శంకర్ ధన్యవాదాలు తెలిపారు. తెరవెనుక చిత్రంలో అమన్తో పాటు విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి తదితరులు నటిస్తున్నారు. -
మున్సిపాలిటీల్లో ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు అన్ని మున్సిపాలిటీల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో పచ్చదనాన్ని పెంచే అత్యుత్తమ పురపాలికలకు ఏటా అవార్డులు ఇస్తామని, తద్వారా పోటీతత్వం పెంచుతామని వెల్లడించారు. గ్రీన్ స్పేస్ ఇండెక్స్లో భాగంగా వినూత్న డిజైన్లు, రోడ్ల పక్కన పచ్చదనం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు. మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న గ్రీన్ కవర్ను మదించేందుకు జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), ఉపగ్రహ చిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ పద్ధతుల ద్వారా రికార్డు చేస్తామని వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా వచ్చే ఏడాది ఆయా పట్టణాల్లో గ్రీన్ కవర్ ఎంత మేర పెరిగిందనే అంశాన్ని తిరిగి మదింపు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్ కవరేజీకి 85 శాతం, గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు 5 శాతం, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్కు మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తామన్నారు. అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీల్లో అవార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
డా.రెడ్డీస్ కరోనా ఔషధం : హోం డెలివరీ కూడా
సాక్షి, హైదరాబాద్ : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మరో శుభవార్తను కూడా సంస్థ అందించింది. కరోనా బాధితులకు వేగంగా ఈ ఔషధాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. అవిగాన్ రెండు సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్ల పూర్తి థెరపీ ప్యాక్లో వస్తుందన్నారు. అలాగే వారమంతా (సోమవారం-శనివారం వరకు) ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఒక హెల్ప్లైన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతానికి వారు జపాన్ నుండి దీనిని దిగుమతి చేసుకుంటున్నారని, త్వరలో దేశీయంగా తయారు చేస్తామని రమణ తెలిపారు. అలాగే కరోనాకు సంబంధించి మరో ఔషధమైన రెమ్డెసివిర్ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్ (ఫావిపిరవిర్) ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
కరోనా కట్టడికి మరో వంద కోట్లు
సాక్షి, సిద్దిపేట: కరోనా వైద్యం కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని, ఎన్సాన్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే వంద కోట్లు కేటాయించారని, ప్రస్తుతం మరో వంద కోట్లు అదనంగా కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట వైద్య కళాశాలకు ఆర్టీపీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్) అనుమతి రావడం గొప్ప విషయమని చెప్పారు. -
కరోనా వస్తే ఆగం కావొద్దు
సిరిసిల్ల: ప్రపంచమంతా కరోనా వైరస్ విస్తరిస్తుంటే కొందరు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోబోమని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును, ఐసోలేషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనాపై ప్రతిపక్షాలది విజ్ఞత లేని విమర్శలని పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎందుకు తిరుగుతున్నారని పలువురు అంటున్నారని, కానీ ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తాను పర్యటనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా సోకిన వారికి వైద్యం చేయడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మాత్రమే ధైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి అందరూ అండగా ఉండాలని కోరారు. మీడియా కూడా నెగెటివ్ కోణాన్ని వీడి పాజిటివ్గా ఆలోచించాలని సూచించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ చేయడం పరిష్కారం కాదని తేలిపోయిందని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారి పట్ల మానవతా కోణంలో స్పందించి సాయం అందించాలని, వారిని వెలివేసినట్లుగా చూడొద్దని కోరారు. వృద్ధుల ఆత్మహత్య కలచివేసింది హైదరాబాద్లో ఇద్దరు వృద్ధులకు కరోనా సోకడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. నిజానికి కరోనాకు మందే లేదని, నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. ఎంతో మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని వివరించారు. వయసులతో సంబంధం లేకుండా.. బాగయ్యారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావును ఉదహరించారు. మరణాలు చాలా తక్కువ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో కరోనా మరణాలు చాలా తక్కువని, ఒక్క శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా వస్తే.. భయపడి బెంబేలెత్తాల్సిన పని లేదన్నారు. అలాగని నిర్లక్ష్యం తగదన్నారు. ఎవరికి వారు ధీమాగా ఉంటూనే.. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ సూచించారు. నాకు కరోనా వస్తే కోలుకుని ప్లాస్మా ఇస్తా.. తనకు కరోనా వస్తే కోలుకున్నాక ప్లాస్మా ఇచ్చి ఆదర్శంగా ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకి కోలుకున్న టీఆర్ఎస్ నాయకులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని ఆగస్టు నుంచి సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోని శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. జిల్లాలో మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కోసం తాను సొంతంగా రూ.20 లక్షలు ఇస్తున్నానని, సీఎస్ఆర్లో మరో రూ.2.28 కోట్లు సమకూర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. కొత్తగా మంజూరైన ఐదు అంబులెన్స్లను మంత్రి ప్రారంభించారు. నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి పూల మాల వేశారు. -
ఐసోలేషన్ రోగులకు ‘హితం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్కు హోం ఐసోలేషన్ ట్రీట్మెంట్ అప్లికేషన్ మేనేజ్మెంట్ (హితం) అనే పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ట్రయల్స్లో ఉన్న ఈ యాప్ రెండు మూడు రోజుల్లో రోగులకు అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఈ యాప్ను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు డాక్టర్ల సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. పూర్తిగా డాక్టర్లతోనే ఈ యాప్ను నడిపిస్తారు. ఒక్కో డాక్టర్కు 50 మంది కరోనా రోగులను కేటాయిస్తారు. రోగులతో డాక్టర్లు ప్రతీరోజూ మాట్లాడుతారు. అలాగే రోగులు కూడా రేయిపగలూ అన్న తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు తనకు కేటాయించిన డాక్టర్తో మాట్లాడవచ్చు. యాప్లో అత్యవసర బటన్ నొక్కితే ‘108’కు కనెక్ట్... కరోనా సోకినవారిలో దాదాపు 9 వేల మంది వరకు ఇళ్లల్లోనే (హోం ఐసోలేషన్) ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే చాలాచోట్ల ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉన్నవారికి సరైన చికిత్స, డాక్టర్ల సలహాలు, సూచనలు అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కూడా చెప్పేవారు లేరన్న ఆరోపణలు వచ్చాయి. ఐసోలేషన్ కిట్లు కూడా చాలా మందికి అందడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ‘హితం’పేరుతో యాప్ను తీసుకువస్తోంది. ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉన్న వారికి ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే డాక్టర్లను సంప్రదించవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే యాప్లో ఉండే అత్యవసర బటన్ నొక్కితే జీపీఎస్ సిస్టం ద్వారా నేరుగా ‘108’కు కనెక్ట్ అవుతుంది. దీంతో రోగి ఉండే ఇంటికే 20 నిముషాల్లో నేరుగా 108 వాహనం వచ్చి సమీపంలోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్తుంది. రోగికి కేటాయించిన డాక్టర్కూ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రోగుల సమాచారాన్ని మొత్తం యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. వారిలో ఎవరికి ఎలాంటి లక్షణాలు, ఇతర జబ్బులున్నాయో కూడా నిక్షిప్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వైద్యాధికారి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స మరోవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసింది. అన్నిచోట్లా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చే సింది. మరికొన్ని లక్షల యాంటిజెన్ కిట్లకు ఆర్డర్ చేసింది. గ్రామాల్లో స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఈఎస్ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్
అమీర్పేట: కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం సనత్నగర్ ఈఎస్ ఐ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆమె ప్రారంభించి, తొలి ప్లాస్మా దాత సంతోష్గౌడ్ను అభినందించారు. అనంతరం వార్డులో తిరిగి వైద్యసేవలపై వాకబు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వైరస్ నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను ఇతర రోగులకు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన అత్యాధునిక పీఏపీఆర్ కిట్ను ఆసుపత్రిలో ప్రదర్శించారు. వైద్య కళాశాల డీన్తో పాటు ఈఎస్ఐసీ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలో.. నాతో.. వైయస్సార్
వైయస్సార్ సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో నిన్న ఆవిష్కరించారు. డాక్టర్ వైయస్సార్గారి సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్ వైయస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం. జీవితంలో తాను అనుభవించిన, తన గుండెల్లోనే దాచుకున్న భావోద్వేగాలను – ‘వైయస్సార్ తన కుటుంబంగా భావించిన’ అభిమానులందరితో పంచుకోవాలని శ్రీమతి వై.ఎస్. విజయ రాజశేఖరరెడ్డి చేసిన రచనే ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్.’’ మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని మరికొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని శ్రీమతి విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్ వైయస్సార్ ఒక కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా శ్రీమతి విజయమ్మ వివరించారు. తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, జగన్; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు, శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఆయç¯ జీవితం తెరిచిన పుస్తకమని; ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఒక ముఖ్యమంత్రి భార్య నుంచి ఇలాంటి రచన రావడం ఇదే ప్రథమం. ఎమెస్కో పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించిన ఈ పుస్తకం ఆమెజాన్లో లభ్యం. పుస్తకం తొలి పుటల్లో... ‘‘జీపులో వెనక సీట్లో కూర్చోబోతుండగా, ‘అక్కడ కూర్చోడమేంటి, వచ్చి ముందు కూర్చో విజయా’ అన్నారు ఆ వ్యక్తి. దాంతో చాలా ఇబ్బందిగా, బిడియంగా, దించిన తల ఎత్తకుండా ముందుసీట్లో ఈయన పక్కనే కూర్చున్నాను. బిగుసుకుపోయి కూర్చున్నానని గమనించినట్టున్నారు ఈయన. కాసేపాగి – ‘ఎందుకు టెన్షన్ పడుతున్నావు... ఫ్రీగా కూర్చోవచ్చు కదా’ అన్నారు. అయినా నేను అలాగే బిగుసుకుని ఉండడంతో, లాభం లేదనుకున్నారో ఏమో, మాటల్లోకి దించారు. అప్పుడు కాస్త భయం తగ్గిందనుకుంటా, నేను కూడా మెల్లమెల్లగా ఓ రెండు మాటలు మాట్లాడడం మొదలెట్టాను. ఎందుకో మాటల మధ్యలో ధైర్యం చేసి, ఈయనను మొదటిసారి కళ్ళు ఎత్తి చూశాను... ఆ కోరమీసాలు, చందమామ లాంటి ముఖం, కాంతివంతమైన చిరునవ్వు, ఆ ముఖవర్చస్సు, ఉట్టిపడుతున్న రాజసం... నా గుండె దడ పెరిగింది. ఎప్పుడూ లేని కొత్త ఆలోచనలు కలిగాయి. ఇలాంటి వ్యక్తితో జీవితం అంతే అందంగా ఉంటుందేమో అనిపించింది. ఈయన్ని అలా చూడగానే, నాన్న ఎన్నోసార్లు అమ్మతో అన్న మాటలు గుర్తొచ్చాయి – ‘జాతకం ప్రకారం నా కూతురు రాణి అవుతుంది... వచ్చేవాడు రాజు అవుతాడు’ అని! -
కరోనా మృతుల కోసం ‘లాస్ట్ రైడ్ సర్వీస్’
రాయదుర్గం: కరోనాతో చనిపోయిన వారిని ఖనన స్థలానికి తరలించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ‘లాస్ట్ రైడ్ సర్వీస్’అంబులెన్స్ వాహనాన్ని శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో కమిషనర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన వారిని ఆస్పత్రి నుంచి ఖననానికి తీసుకెళ్లడం, ఖననం చేయడం సమస్యగా మారిందన్నారు. అటువంటి సమయంలో ఫీడ్ ది నీడీ టీమ్ కరోనా, నాన్ కరోనా మృతుల ఖననం కోసం ఈ వాహన సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయకుమార్, ఫీడ్ ది నీడీ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఎన్జీఓ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ప్రతినిధి కళ్యాణ్ రూ.50 వేల చెక్కును సైబరాబాద్ సీపీ సజ్జనార్కు అందించారు. లాస్ట్ రైడ్ సర్వీస్ సేవలిలా.. కరోనాతో లేదా ఇతరత్రా చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసే స్థలానికి అంబులెన్స్ ద్వారా ఉచితంగానే తరలిస్తారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వర కు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్: 84998 43545. -
భారత్లో ట్విట్టర్ ‘ఫ్లీట్స్’ ఫీచర్
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా భారత్ మార్కెట్లో తమ ఫ్లీట్స్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్ 24 గంటల తర్వాత ఇక కనిపించకుండా మాయమయ్యేలా ఈ ఫీచర్ ఉంటుంది. ‘అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలను యూజర్లు పంచుకునేందుకు ఫ్లీట్స్ ఉపయోగపడుతుంది. ఇవి 24 గంటల తర్వాత ఇక కనిపించవు. వీటికి రీట్వీట్స్ గానీ లైక్స్ గానీ పబ్లిక్ కామెంట్స్ గానీ ఉండవు‘ అని ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ ఆ అంశంపై సదరు యూజరుతో గానీ ఫాలోవర్లు సంభాషించదల్చుకుంటే ప్రైవేట్గా డైరెక్ట్ మెసేజీలు పంపవచ్చని పేర్కొంది. కొత్తగా అప్డేటెడ్ యాప్ వెర్షన్స్లో ఫ్లీట్స్ లభిస్తుందని వివరించింది. యూజర్లు ప్రొఫైల్ పిక్చర్పై ట్యాప్ చేయడం ద్వారా ఈ తరహా ట్వీట్స్ చేయొచ్చు. ప్రస్తుతం బ్రెజిల్, ఇటలీలో ఫ్లీట్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. -
కరోనాపై పోరుకు ముందుకు రండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరులో ప్రభుత్వానికి సహకరించేందుకు పలు సంస్థలు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్కు చెందిన నౌ ఫ్లోట్స్ కంపె నీ రూపొందించిన సమీకృత ఆన్లైన్ వీడియో క్లినిక్ సాఫ్ట్వేర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. దేశంలోని 1.15 మిలియన్ల (11.5 లక్షలు) మంది వైద్యులతో రోగులు తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించా రు. వైద్యుల అపాయింట్మెంట్, వీడియో ద్వారా ముఖాముఖి, ప్రిస్కిప్షన్ మేనేజ్మెంట్, రోగుల రికార్డుల నిర్వహణ, బిల్లుల చెల్లింపు వంటివి దీని ద్వారా సులభతరం అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ను కొన్ని జిల్లాల్లో వెంటనే విని యోగిస్తామన్నారు. డాక్టర్ల సాయంతో డిజిటల్ సేవ లు పొందే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు వంటి వాటిలో ఈ సాఫ్ట్వేర్ను సులభంగా ఉపయోగించవచ్చని, దేశంలోని 500 మిలియన్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అనుకూలంగా ఉం టుందని నౌ ఫ్లోట్స్ వెల్లడించింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నౌఫ్లోట్స్ రీసెర్చ్ హెడ్ నిఖిల్ సల్కర్ పాల్గొన్నారు. -
సమాచారమంతా ‘టీ కోవిడ్–19’లో
సాక్షి, హైదరాబాద్: కోవిడ్పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘టీ కోవిడ్–19’యాప్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తోందన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపకరించేలా ఏడబ్ల్యూఎస్, సిస్కోతో పాటు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ క్వాంటెలా సహకారంతో రాష్ట్ర ఆరోగ్య, ఐటీ మంత్రిత్వ శాఖలు ‘టీ కోవిడ్–19’యాప్ను రూపొందించాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనవసరమైన భయాందోళనకు గురి కాకుండా పౌరులు తమ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. కాల్ హెల్త్ అనే టెలీమెడిసిన్ మాడ్యూల్తో ఈ యాప్ను అనుసంధానం చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా బులెటిన్లు, ప్రభుత్వ ప్రకటనలు, ఇతర అత్యవసర సేవలు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయని కేటీఆర్ వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆల్ ఇన్ వన్ తరహాలో కోవిడ్కు సంబంధించి పౌరులకు అవసరమైన సమాచారం ఈ యాప్లో అందుబాటులో ఉంటుందని క్వాంటెలా వ్యవస్థాపకులు శ్రీధర్ గాంధీ వెల్లడించారు. కలిసికట్టుగా సంక్షోభాన్ని ఎదుర్కొందాం కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం త్వరలో గట్టెక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ శాఖకు చెందిన సుమారు 100 మంది వ్యాపారవేత్తలతో ఆయన శనివారం భేటీ అయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధింపు తదితర పరిణామాలపై మంత్రి వివరిస్తూ, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. లాక్డౌన్తో లక్షలాది మంది జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు. లాక్డౌన్ మూలంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అభినందించింది. -
కరోనాపై వాట్సాప్ ‘చాట్ బాట్’ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా వివిధ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించిందని’రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లాక్డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని సూచించారు. కరోనాపై సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాట్సాప్ ‘చాట్ బాట్’ను కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. 9000658658 నంబరుపై ‘‘TS Gov Covid Info’’ పేరిట రూపొందించిన ఈ వా ట్సాప్ చాట్ బాట్ ద్వారా కరోనా గురించిన సమాచారంతో పాటు కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన ఎస్.బి.టెక్నాలజీస్, మెసెంజర్ పీపుల్ సంస్థతో కలిసి రాష్ట్ర ఐటీ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ చాట్ బాట్ను రూపొందించాయి. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఇలా చేయాలి... చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి 9000658658 నంబరుకు ‘HI’లేదా ‘Hello’లేదా ‘Covid’అని వాట్సాప్లో సందేశం పంపించాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింకును మొబైల్ నుండి క్లిక్ చేయాలి. సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈ మెయిల్ చేయవచ్చు. -
కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్పై ఇప్పటికే లాక్డౌన్ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డిజిటల్ వార్కు దిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్డేట్స్ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రెండ్రోజుల క్రితం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఈ యాప్ వినియోగంలోకి వచ్చింది. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు ఇంకా మందు రాలేదు. అవగాహనతోనే దీనిని ఎదుర్కోగలమని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లేస్టోర్లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’పేరు నమోదు చేసిన వెంటనే యాప్ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ► జీపీఎస్ ఆధారంగా లొకేషన్ ఎంపిక చేసుకున్నాక మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ప్రస్తుతం 11 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్ నిరంతరం ఆన్లో ఉండాలి. అప్పుడే ఈ యాప్ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది. అప్రమత్తం చేస్తుందిలా.. ► యాప్ను ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా ఇన్స్టాల్ చేసుకున్నారు. యూజర్లు 4.6 పాయింట్ల రేటింగ్ ఇచ్చారు. 13,330 మంది సానుకూలమైన రివ్యూలు రాశారు. ► ఈ యాప్ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ► కరోనా వైరస్ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్ ఐసోలేషన్ ఎలా పాటించాలో సూచిస్తుంది. -
ఏమవ్వా ఎట్లుందే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘గ్రేటర్ హైదరాబాద్లో ‘పరిచయం’ కార్యక్రమంతో పారిశుధ్య సిబ్బంది, వార్డుల్లో ఉండే కుటుంబాలతో పరిచయం పెంచుకొనేలా చేశాం. సిబ్బంది తమ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఆ ప్రాంత ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా నగరంలో పారిశుధ్యం మెరుగుపడుతోంది. ప్రజలు కూడా శానిటేషన్పై శ్రద్ధ వహిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరాలంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు కావాలి. అందుకు ఇక్కడి నుంచే మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశిస్తున్నా’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిచయం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా నియమించిన పారిశుధ్య సిబ్బంది పేరు, సెల్ఫోన్ నంబర్లను విధిగా ఆయా ప్రాంతాల్లో గోడలపై రాయించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన మహబూబ్నగర్లో పర్యటించారు. ముందుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. పాత తోట మురికివాడలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్ధానిక మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు, తాగునీరు వస్తున్నాయా లేదా ఆరా తీశారు. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు మంత్రికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని వేడుకున్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం అప్పన్నపల్లిలోని వైట్హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ప్రగతి–అమలు అంశంపై నూతనంగా నియమితులైన వార్డు అధికారులు, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇప్పటికే తడి, పొడి చెత్త కోసం ప్రత్యేక డబ్బాలు పంపిణీ చేస్తే కొందరు వాటిలో బియ్యం, పప్పు నిల్వ ఉంచుకున్నారని మంత్రి చెప్పారు. తడిచెత్తతో వర్మి కంపోస్టు ఎరువులు, పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చనే విషయాన్ని గ్రహించాలన్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం వల్ల వాటిని రైతులకు విక్రయిస్తున్న మెప్మా సభ్యులు ప్రతి నెల రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారని మంత్రి వివరించారు. అన్ని మున్సిపాలిటీలకు కేటాయించిన బడ్జెట్లో పచ్చదనం కోసం 10 శాతం పచ్చదనం పరిరక్షణ కోసం కేటాయించామన్నారు. పట్టణప్రగతిలో భాగంగా నియమించిన గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు వార్డుల్లో పర్యటిస్తూ.. ప్రతి ఇంటికి ప్రజలు ఏ మొక్కలు అడిగినా ఆ మొక్కల్ని పంపిణీ చేయాలన్నారు. మొక్కలు పెరిగేలా సంబంధిత కౌన్సిలర్లే చొరవ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం వరకు బతకకపోతే కౌన్సిలర్ తన పదవిని కోల్పోతారని హెచ్చరించారు. ఏప్రిల్ రెండు నుంచి టీఎస్బీపాస్.. పురపాలికల్లో అవినీతి రహిత పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2 నుంచి టీఎస్బీపాస్ను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇళ్లు, భవన నిర్మాణాల కోసం ప్రజలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పారు. 75 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు అవసరం ఉండబోవని స్పష్టం చేశారు. 75 గజాల నుంచి 600 గజాల వరకు నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోపే అనుమతులు వస్తాయన్నారు. రాలేదంటే మున్సిపల్ కమిషనర్, టౌన్ప్లానింగ్ అధికారి అనుమతులను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారన్నారు. స్వీయ ధ్రువీకరణతో ఇంటి పనులు నిర్ణయించుకుని చెల్లించొచ్చని, ఇచ్చిన సమాచారం తప్పని నిర్ధారణ అయితే అందుకు 25 రేట్లు అధికంగా జరిమానా పడుతుందన్నారు. ఇంటి నిర్మాణ సమాచారం తప్పుగా ఇస్తే అనుమతులు రద్దు అవుతాయన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకే.. ‘వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లేవు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన సంస్కరణలు, పథకాలకు శ్రీకారం చుడుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇలా ఏ కార్యక్రమమైనా ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఉద్దేశం. ఇందులో రాజకీయ ఆపేక్ష ఏ మాత్రం లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎసేతర కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులనూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రెండు నూతన పథకాలకు శ్రీకారం
-
అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోన్ ఎ31(2020)ని ఇండోనేషియా మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. బడ్జెట్ రేంజ్లో తీసుకొని వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.13,500గా నిర్ణయించింది. త్వరలోనే ఈ ఫోన్ను భారత్లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒప్పో ఎ31(2020) ఫీచర్లు ♦ 6.5 ఇంచుల డిస్ప్లే, ♦ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్ ♦ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ♦ 12, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ♦ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ♦ బ్లూటూత్ 5.0 ♦ ఆండ్రాయిడ్ 9 పై ♦ 4230 ఎంఏహెచ్ బ్యాటరీ. -
‘ఈఫ్లూటో’ స్కూటర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బ్యాటరీల తయారీకి కీలకమైన లిథియం పదార్థాన్ని దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, బొలీవియా నుంచి సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.కె.సారస్వత్ తెలిపారు. ప్యూర్ ఈవీ అనే సంస్థ ఐఐటీ–హైదరాబాద్ సాయంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ను సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనం తరం సతీష్రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలు రక్షణ రంగానికి ఉపయోగపడే పరికరాలు, టెక్నాలజీ అభివృద్ధికి ప్రయత్నించాలన్నారు. ఈప్లూటో 7జీ ప్రత్యేకమైంది.. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో తాము అభివృద్ధి చేసిన ఈ ప్లూటో 7జీ విద్యుత్ స్కూటర్ ప్రత్యేకమైందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వడేరా తెలిపారు. బ్యాటరీ విడిభాగాలను దిగుమతి చేసుకున్నప్పటికీ మిగిలిన అన్ని టెక్నాలజీలను ఇక్కడే అభివృద్ధి చేశామని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ను ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీలో ఈప్లూటో 7జీని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూటర్ ధర రూ. 79,999లని తెలిపారు. -
భారత్కు తొలి 5జీ స్మార్ట్ఫోన్ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ భారత్కు ఫిబ్రవరిలో ఎంట్రీ ఇస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్తో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనుంది. భారత్లో ఇదే తొలి 5జీ మోడల్ కానుంది. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనున్నట్టు ఐకూ మార్కెటింగ్ డైరెక్టర్ గగన్ అరోరా తెలిపారు. 2020లో దేశీయంగా 10 లక్షల యూనిట్లను విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ దూసుకొస్తోంది. తొలుత ఆన్లైన్ను వేదికగా చేసుకోనున్న ఈ బ్రాండ్, రానున్న రోజుల్లో ఆఫ్లైన్లోనూ స్మార్ట్ఫోన్లను విక్రయించనుంది. చైనాలో వివో సబ్ బ్రాండ్గా కార్యకలాపాలు సాగించిన ఐకూ.. ప్రస్తుతం సొంత బ్రాండ్లో మార్కెట్ చేస్తోంది. భారత్లోనూ ఇదే విధానాన్ని అనుసరించనుంది. బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. -
మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా జెడ్ఎస్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 20.88 లక్షల నుంచి రూ. 23.58 లక్షల దాకా ఉంటుంది. అయితే, జనవరి 17 అర్ధరాత్రిలోగా బుక్ చేసుకున్న వారికి ఈ కారును రూ. 19.88 లక్షలు–రూ. 22.58 లక్షలకే (ఢిల్లీ ఎక్స్షోరూం) అందిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. అంతర్గతంగా 1,000 కార్ల బుకింగ్ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 2,800 కార్లకు బుకింగ్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని రాజీవ్ వివరించారు. ముందుగా నెలకు 200 యూనిట్ల తయారీ ప్రణాళిక వేసుకున్నప్పటికీ.. వచ్చే మూడు నాలుగు నెలల్లో 300–400 యూనిట్లకు పెంచుకోవాల్సి రానున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 27 నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
హ్యుందాయ్ ఆరా వచ్చేసింది
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సెగ్మెంట్లో అధికంగా అమ్ముడవుతున్న మారుతీ డిజైర్, హోండా అమేజ్లకు గట్టిపోటీనివ్వగలదని భావిస్తున్న ఆరా ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. బీఎస్ –6 నిబంధనలను పాటించే 1.2 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ ఎస్.ఎస్. కిమ్ తెలిపారు. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతమున్న తమ మోడల్ ఎక్సెంట్ పెద్దగా అమ్మకాలు సాధించడం లేదంటూనే... ఆరా మాత్రం మంచి అమ్మకాలు సాధించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్ కారు 20 కిమీ, డీజిల్ కారు 25 కిమీ. మైలేజీనిస్తాయని తెలియజేశారు. ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. -
ఒన్ నేషన్..ఒన్ రేషన్ షురూ..
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో బుధవారం ప్రారంభించింది. నూతన సంవత్సరం తొలిరోజున ఏపీ, తెలంగాణా, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణ, రాజస్ధాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో ప్రారంభించింది. ఈ 12 రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు వారు ఏ రాష్ట్రంలో నివసిసున్నా తమ రేషన్ వాటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. 2020 జూన్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒన్ నేషన్..ఒన్ రేషన్ సదుపాయానికి అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద నూతన ఫార్మాట్లో రేషన్ కార్డును రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. జూన్ 1, 2020 నుంచి నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే రేషన్ కార్డులు ఇక స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి. -
అతివలకు అభయం ‘హాక్–ఐ’
అత్యవసర సమయాల్లో అతివలకు హాక్ ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ యాప్ను ఇప్పటివరకు 8,96,554 మంది సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. దీంతో 7,689 ఫిర్యాదులు వస్తే.. 5,212 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారు. చాలామంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నా వినియోగిస్తున్న వారి సంఖ్య అతి తక్కువ. పగలు, రాత్రితో సంబంధం లేకుండా పనిచేసే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లో ఉన్న ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’అన్నది నొక్కడం ద్వారా దీని షార్ట్కట్ మొబైల్ స్క్రీన్పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీతో పాటు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు సెల్ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారుడు పొందుపరిచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓ సారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బా«ధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ‘వందకూ’వర్తింపు... హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’డయల్ చేసి కాకుండా ఈ యాప్ ద్వారా సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్–ఐ ద్వారా కాల్ చేస్తే... ఆ ఫిర్యాదుదారుల లోకేషన్ సైతం ఎస్ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్లో స్క్రీన్స్పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మక దశలో ఉన్న దీని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని అధికారులు ప్రస్తుతం గమనిస్తున్నారు. క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్... మహిళల భద్రత కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగం ‘క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్’. వారు పని చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో, ఇంట్లో... ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఈ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఈ విభాగంలో ఉన్న ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించే ఐటీ సెల్ ఫిర్యాదు స్వభావాన్ని బట్టి పోలీసులు, షీ–టీమ్స్, సైబర్ పోలీసులకు సమాచారమిస్తారు. అలాగే డయల్ ‘100’, పోలీసు ఫేస్బుక్, వాట్సాప్ (హైదరాబాద్:9490616555, సైబరాబాద్: 9490617444, రాచకొండ: 9490617111) ద్వారా ఎలాంటి సహాయం కావాలన్నా పొందవచ్చు. -
ఫేస్బుక్ ‘ఫేస్బుక్ పే’ లాంచ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఫేస్బుక్ లో ఫేస్బుక్ పే పేరుతో అమెరికాలో లాంచ్ చేసింది. ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్, మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా డిజిటల్ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే వినియోగదారులకు అందించనుంది. కాలక్రమేణా ఎక్కువ మందికి, ఎక్కువ ప్రదేశాలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నామని చెప్పారు. ఫేస్బుక్ పే దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్ ద్వారా చెల్లింపులను చేసుకోచ్చు. ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు, వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో వచ్చే వారం నుంచి మెసేంజర్, ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో వివిధ బిజినెస్ల కొనుగోళ్లు చేసుకోవచ్చని లియు తెలిపారు. ఎలా చేయాలి? ఫేస్బుక్ యాప్ లేదా వెబ్సైట్లోని "సెట్టింగ్" అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆపై "ఫేస్బుక్ పే" కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించి లావాదేవీ పూర్తి చేయవచ్చు. అంతేకాదు వినియోగదారులు డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం పిన్ నెంబర్, టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి బయోమెట్రిక్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా భారతదేశంలో, ఫేస్బుక్ వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెడ్ 6 ప్రొ ఫీచర్లు అదుర్స్!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ లెనోవో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. లెనోవో జెడ్ 6 ప్రొ, లెనోవో కే 10 నోట్, లెనోవో ఏ6 నోట్ పేర్లతో వీటిని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ప్రధానంగా ప్రీమియం మోడల్ జెడ్ 6 ప్రొ లో 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను, 12 జీబీ ర్యామ్, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీతో పాటు, నాలుగు కెమెరాలను, 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ను అమర్చింది. లెనోవో జడ్ 6 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+16+ 8+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ. 33,999 లెనోవో కే 10 నోట్ ఫీచర్లు 6.30 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+ 8+5 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ.13,999 లెనోవో ఏ 6 నోట్ ఫీచర్లు 6.09 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియా టెక్ హీలియో పీ 22 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 7999 ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయానికి లభ్యం. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన ఆఫర్స్ను కంపెనీ అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. -
మార్కెట్లోకి సుజుకీ ‘జిక్సర్ 250’
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్)..‘జిక్సర్–250’ మోడల్ బైక్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫోర్–స్ట్రోక్ 249సీసీ ఇంజిన్తో విడుదలైన ఈ బైక్ ధర రూ.1,59,800 (ఢిల్లీఎక్స్షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థను అందించడంలో భాగంగా డ్యూయల్ ఛానల్ యాంటీ–లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబీఎస్) అమర్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్ఎంఐపీఎల్ హెడ్ కోచిరో హిరావ్ మాట్లాడుతూ..‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుజుకీ సంస్థ మోటార్సైకిళ్లను అభివృద్ధి చేస్తుందనే అంశానికి ఈ నూతన బైక్ అద్దం పడుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన బైక్ల విడుదలతో మా వృద్ధి వేగాన్ని కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
పవర్ పాక్డ్ ఇకో ఫ్రెండ్లీ ‘కోనా’ వచ్చేసింది
దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హుందాయ్ మొదటిసారి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును భారత మార్కెట్ విడుదల చేసింది. ‘కోనా’. పేరుతో నేడు( మంగళవారం) లాంచ్ చేసింది. గ్రీన్ ఫ్యూచర్లో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలనే తమ నిబద్ధతతోపాటు ప్రతి వినియోగదారుడికి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ తెలిపారు. హౌస్పీడ్ చార్జింగ్కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి ఎంపిక చేసిన నగరాలతోపాటు హ్యుందాయ్ స్పెషల్ డీలర్ల వద్ద కూడా చార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫైవ్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనా ధరను రూ. 25 .3 లక్షల (ఎక్స్ - షోరూమ్) గా నిర్ణయించింది. చెన్నైలోని హుందాయ్ ప్లాంట్ లో రూపొందించిన ఈ కారు ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల డిజిటల్ డ్యాష్ బోర్డు, హెడ్ అప్ డిస్ప్లే, వైర్లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ప్లే ప్రధాన ఫీచర్లుగాఉన్నాయి. అలాగే కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఏయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సర్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 39.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ, 136 పీఎస్ శక్తిని అందిస్తుంది. 403 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్ను అందిస్తెంది. 10 సెకన్లలో 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 57 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు మహీంద్ర ఇ2ఓ ప్లస్, ఇ-వెరిటో. ఆడి ఈ ట్రాన్ వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. ఎంజీ మోటార్స్, నిస్సాన్ కంపెనీలు ఈ ఏడాదిలోనే ఎలక్ట్రీక్వాహనాలను తీసుకురానుండగా, మారుతిసుజుకి వచ్చే ఏడాది నాటికి ప్లాన్ చేస్తోంది. Drive into the future with India’s First All - Electric SUV. Unleashing the stylish #KONAElectric, with a 452km range per full charge. Eco-friendly and packed with power*, the #KONAElectric truly delivers an electric performance! Test Drive today! pic.twitter.com/cq9M2TtH1v — Hyundai India (@HyundaiIndia) July 9, 2019 -
డుకాటీ షోరూమ్ ప్రారంభోత్సవంలో మామా అల్లుళ్లు
-
హ్యాపీ లావణ్యం
-
దిగ్గజాలకు షాక్...అతి తక్కువ ధరకే టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో దిగ్గజాలు శాంసంగ్,ఎల్జీ, సోనీ, షావోమీలాంటి సంస్థలకు షాక్చిచేలా బడ్జెట్ ధరలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. డీటెల్ సంస్థ ఇపుడిక టీవీల రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్సీడీ టీవీని లాంచ్ చేసింది. డీ 1 పేరుతో తీసుకొచ్చిన 19 అంగుళాల టీవీని కేవలం రూ.3,999 లకే అందిస్తోంది. డీ1 ఎల్సీడీ టీవీని ధర మొదట్లో రూ.4,999 గా ఉన్నప్పటికీ, తాజాగా రూ.3,999కే అందిస్తున్నామని డీటెల్ ప్రకటించింది. 19 అంగుళాల ఏ ప్లస్గ్రేడ్ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చని, 1366x768 రిజల్యూషన్, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్లు , 12 వాట్స్ రెండు స్పీకర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్నర్లు B2BAdda.com అనే వెబ్సైట్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడిచింది. నూతన ఆవిష్కరణలు కస్టమర్లను ఉత్సాహపరుస్తాయనే విశ్వాసాన్ని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా వ్యక్తం చేశారు. టీవీల రేట్లు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో ప్రతి ఇంటికి టీవీ అనే తమ మిషన్లో భాగంగా సరసమైన ధరలో టీవీలను వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో తమ టీవీ లక్షలాది మందిని ఆకట్టుకుంటుందన్నారు. కాగా గతంలో 299 రూపాయిలకే డీటెల్ ఒక ఫీచర్ ఫోన్ను లాంచ్ చేసింది. -
స్టన్నింగ్ లుక్లో హ్యుందాయ్ కొత్త శాంట్రో
సాక్షి, ముంబై: ఎప్పటినుంచి వార్తల్లో నిలిచిన హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు ఆకర్షణీయంగా వచ్చేసింది. బడ్జెట్ ధరలో కస్టమర్లకు ఆకట్టుకున్న బెస్ట్ కారును సరికొత్తగా విడుదల చేసింది. భారత్లో హ్యుందాయ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో అనే చెప్పాలి.అయితే ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును మార్కెట్నుంచి తొలగించింది. భారీ డిమాండ్ నేపథ్యంలో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది పెట్రోల్ వెర్షన్లో లభించనుంది. త్వరలోనే సీఎన్జీ వేరియంట్లలో కూడా లాంచ్ చేయనుంది. అక్టోబర్ 10 నుంచి ప్రిబుకింగ్కు లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్గా మొదటి 50వేల కస్టమర్లకు 11,100 రూపాయలకే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్బ్యాక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో హ్యుందాయ్ శాంట్రో, పాత శాంట్రోతో పోలిస్తే కారు పొడవును, వీల్బేస్ను విస్తరించింది 1.1 లీటర్ కెపాసిటి నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ను అమర్చింది. ఇది 68 బిహెచ్పి పవర్, 99 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్లతో లభ్యం కానుంది. ఇది లీటర్కు సుమారుగా 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ను జోడించామని, గంటలకు 150 కి.మీ వేగంతో దూసుకుపోతుందని వెల్లడించింది. మధ్య తరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త శాంట్రో ఇంటీరియర్ను కూడా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో తీర్చిదిద్దింది. ధర. రూ. 3.7లక్షలు -
ఆస్టిన్ మార్టిన్ కొత్త కారు.. ధర ఎంతంటే..
అతి విలాసవంతమైన కార్లకు పెట్టిందిపేరైన ఆస్టిన్ మార్టిన్ లగ్జరీ కారును విడుదల చేసింది. బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీ 2019 ఆస్టన్-మార్టిన్ వాన్టేజ్ అధికారికంగా ఇండియాలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. .2.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. దేశంలో ఈ కొత్తకార్లను 15-20 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్ ప్రారంభం. 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్, 6000 ఆర్పీఎం, వద్ద 503బీహెచ్పీ, 2000-5000 ఆర్పీఎం వద్ద 685 ఎన్ఎం పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజీన్లను కూడా ఒక కొత్త 8- స్పీడ్ స్పోర్ట్ షిఫ్ట్- 2 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేసింది. కేవలం 3.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 315 కీ.మి టాప్ వేగంతో దూసుకుపోతుంది. -
వివో కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్
వివో కొత్త స్మార్ట్ఫోన్నులాంచ్ చేసింది. వీ7 ప్లస్కు రీబ్రాండెడ్ వెర్షన్గా ఈ డివైస్ను విడుదల చేసింది. వివో జెడ్ 10 పేరుతో ఆవిష్కరించింది. అయితే 3 వీ7ప్లస్లా కాకుండా 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్తో కాకుండా 64జీబీ నిల్వతో తీసుకొచ్చింది. ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. దీని 14990 రూపాయలుగా ఉంటుంది. వివో జెడ్ 10ఫీచర్లు 6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 18: 9 కారక నిష్పత్తి క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 4జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్ 24 ఎంపీ సెల్పీ కెమెరా 16 ఎంపీ రియర్ కెమెరా 3225 ఎంఏహెచ్ బ్యాటరీ -
విజయ్ దేవరకొండ "డియర్ కామ్రేడ్" ప్రారంభం
-
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్జి ఎస్ 63 కుపే
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరో సరికొత్త కారును విడుదల చేసింది. కూపే వేరియంట్లో ఏఎంజీ సిరీస్లో ‘ ఏఎంజీ ఎస్ 63 కూపే ’పేరుతో ఖరీదైన కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. రూ. 2.55 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో ఈ కారును ప్రారంభించింది. తద్వారా ఏఎంజీ పోర్ట్ఫోలియోను 15కు విస్తరించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ జోప్ మాట్లాడుతూ మెర్సిడెస్-ఏఎంజీకి భారత్లో చాలా అనూహ్యమైన మార్కెట్ ఉందన్నారు. ఇకనుంచి భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి డీజిల్ కారు బీఎస్-6ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నామని చెప్పారు. ట్విన్ టర్బో 5.5లీటర్ల ఇంజీన్కు బదులుగా 4లీటర్ల వీ8 బిటుర్బో ఇంజిన్తో తయారుచేసిన ఈ కారు కేవలం 3.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది., అలాగే గంటకు 300 కిలోమీటర్ల గరిష్టవేగాన్ని అందిస్తుంది. నాలుగు వైపులా 20-అంగుళాల పరిమాణంలో ఉన్న 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ స్పెషల్ ఎట్రాక్షన్, 9-స్పీడ్ ఏఎమ్జి స్పీడ్ షిఫ్ట్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్ తోపాటు ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చింది. 2015 నాటికి మెర్సిడెస్ అతిపెద్ద విక్రయ లగ్జరీ కార్ బ్రాండ్గా పేరు గాంచింది. 2017 లో దేశంలో లగ్జరీ కార్ మార్కెట్లో టాప్ 15,300 యూనిట్లు విక్రయించగా, అందులో బీఎండబ్ల్యూ 9,800 యూనిట్లు, ఆడి 7,876 యూనిట్లు విక్రయాలు నమోదుయ్యాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో మెర్సిడెస్ 4556 యూనిట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది త్రైమాసికంలో కంపెనీ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ 1.33 లక్షల ఏంఎజీ కార్లు అమ్ముడుపోగా ఇండియాలో 400 పైగా యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
అల్కాటెల్ 3వీ స్మార్ట్ఫోన్, బడ్జెట్ ధర, ఫీచర్లు అదుర్స్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. ఇప్పటికే షావోమి, వివో, లెనోవా లాంటి కంపెనీలు ఆకట్టుకునే స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా అల్కాటెల్ అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. 'అల్కాటెల్ 3వి' పేరుతో తాజా డివైస్ను మంగళవారం విడుదల చేసింది. ముఖ్యంగా రూ.9,999 ధరలో ఈ నెల 31వ తేదీ నుంచి వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఫేస్ అన్లాక్ ఫీచర్కూడా ఈ స్మార్ట్ఫోన్లో పొందుపర్చింది. అంతేకాదు ఫోన్ను కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్, ఇతర ఆఫర్లను అందిస్తోంది. జియో కస్టమర్లకు ఈ ఫోన్పై రూ.2200, రూ.3700 ల క్యాష్బ్యాక్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు వెయ్యి రూపాయలు, రూ.500 విలువ చేసే మింత్రా, క్లియర్ ట్రిప్ గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ సదుపాయం కూడా లభ్యం. ప్రీమియం బ్రాండ్లో కసమర్లు ఆశించే ఫేస్ అన్లాక్ సహా అన్ని ఫీచర్లతో తాజా స్మార్ట్ఫోన్ను లాంచ్ చేశామని భారత్లో అల్కాటెల్ పరికరాలను విక్రయిస్తున్న చైనాకు చెందిన టిసిఎల్ కమ్యూనికేషన్ రీజనల్ డైరెక్టర్ ప్రవీణ్ వలేచా తెలిపారు. అల్కాటెల్ 3వి ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 1.45 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.14వేలకే ల్యాప్టాప్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల్లో ల్యాప్టాప్ లను అందించే ఐబాల్ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. కాంప్బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్టాప్ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.13,999 ధరకే ఈ ల్యాప్టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్టాప్లో సెల్రాన్ ఎన్3350 ప్రాసెసర్ , మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర, రీజనబుల్ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 11.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ 2.4గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్రాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. 5000 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ 0.3 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా డ్యుయల్ బ్యాండ్ వైర్లెస్ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంకోసం ప్రీమియం డిజైన్తో ఆల్-ఇన్-వన్ ల్యాప్ట్యాప్కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. -
టయోటా కామ్రీ హైబ్రిడ్ కారు
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కొత్త కామ్రీ హైబ్రిడ్ కారును లాంచ్ చేసింది. కామ్రీ హైబ్రిడ్ 2018 వెర్షన్ను భారత మార్కెట్లో 37.22 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. దీని ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొత్తగా అప్ గ్రేడ్ చేసింది. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో నావిగేషన్ ఫీచర్ను జోడించింది. టయోటా కామ్రీ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 2.5 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజీన్, 160 పీఎస్, 5,750 ఆర్పీఎం, గరిష్ట టార్క్ 213 ఎన్ఎం, 12 స్పీకర్ స్టీరియో వ్యవస్థ , వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 17ఇంచెస్ అల్లోయ్ వీల్స్ , రేడియల్ టైర్స్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 9 ఎయిర్ బాగ్స్, యాంటి లాకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటివి సెక్యూరిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఎకో, ఈవీ రెండు డ్రైవింగ్ మోడ్స్లో ఈ హైబ్రిడ్ కారు అందుబాటులో ఉంది. -
కొత్త బైక్: ఈ నెలలో బుక్ చేస్తే స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త మోడల్ బైక్ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బైక్స్తో యూత్ను ఆకట్టుకుంటున్న కవాసాకి నింజా 400ను లాంచ్ చేసింది. రూ.4.69 లక్షల (ఎక్స్-ఫోరూమ్, ఢిల్లీ) ధరలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 300సీసీ మోడల్ కన్నా శక్తివంతమైందనీ, పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. షార్ప్ లుక్స్తో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల కస్టమర్లు సులభంగా రైడింగ్ చేసేందుకు ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని కవాసాకి మోటార్స్(ఇండియా) ప్రకటించింది. అప్డేటెడ్ ఇంజీన్తో మరికొన్ని వారాల్లో డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొంది. నింజా సిరీస్లో మంచి ఫ్యామిలీని సృష్టించాం. ఇప్పటి వరకు నింజా 400 మోడల్ బైకులు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే భారత్లో నింజా 300 ఇప్పటికీ మా ఫ్లాగ్షిప్ మోడల్గానే కొనసాగుతోంది. నింజా సిరీస్లోని మిగతా మోడళ్లతో పాటు దీన్ని కూడా కొనసాగిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యుతాకా యమషిత వెల్లడించారు. చెప్పారు. అంతేకాదు ఏప్రిల్మాసంలో బుక్చేసిన వారికి స్పెషల్ ఆఫర్ కూడా ఉందని ప్రకటించారు. అయితే దీనిపై మరింత సమాచారం కోరినపుడు ఆఫర్ మొత్తాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. సో.. ఈ ఆఫర్పై మరిన్ని వివరాలు షోరూంల్లోనే లభ్యం. 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్, 48.3 బీహెచ్పీ, 38ఎన్ఎం గరిష్ట టార్క్, 6 స్పీడ్ గేర్బాక్స్లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే నింజా 300 మోడల్తో పోలిస్తే ప్రీమియం డిజిటల్ డిస్ప్లేతో కొత్త ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ను అమర్చింది. గ్రీన్ కలర్లో కెఆర్టీ ఎడిషన్) ఇది అందుబాటులోఉంది. యమహా వైజెడ్ఎఫ్, కెటీఎం ఆర్సీ390 , టీవీఎస్ అపాచీ లాంటి బైక్లను కవాసాకి నింజా 400 గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
హువాయి కొత్త స్మార్ట్ఫోన్లు: ఫీచర్లు గమనించారా?
బీజింగ్: హువాయి మూడు కొత్తస్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఎంజాయ్ సిరీస్కు కొనసాగింపుగా ఎంజాయ్ 8, 8ప్లస్, 8ఇ మోడల్ మొబైళ్లను విడుదల చేసింది. ఈ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో లభ్యం. కాగా అన్ని డివైస్లలో డ్యుయల్ రియర్ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి.ఎంజాయ్ 8 3జీ వేరియంట్ 1299 యెన్గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్ ధర 1499యెన్లుగా ఉండనుంది. ఎంజాయ్ 8ప్లస్ ధర 1699యెన్స్ (సుమారు రూ.17,606) 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1899గా (రూ.19,679)ను ఉంటుంది. ఎంజాయ్ 8ఇ 1099 (రూ.11,388) యెన్గాను నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్లు మూడు బ్లూ, పింక్, బ్లాక్ కలర్స్లో లభ్యం. ఎంజాయ్ 8 ఫీచర్లు 5.99 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3/4జీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే సదుపాయం 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8 ప్లస్ ఫీచర్లు 5.93 డిస్ప్లే 1080x2160 రిజల్యూషన్ ఆక్టాకోర్ కిరిన్ 659ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 4జీబీ 64/128జీబీ స్టోరేజ్ 256 ఎక్స్పాండబుల్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8ఇ 5.7 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధరలో నోకియా1: జియో క్యాష్బ్యాక్
సాక్షి,న్యూఢిల్లీ: నోకియా బడ్జెట్ ధరలో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.5,499గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి( బుధవారం) దీని విక్రయానికి అందుబాటులో ఉంటుదని కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 1 గో ఎడిషన్ను పరిచయం చేసింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు రిలయన్స్ జియో ద్వారా క్యాష్ బ్యాక్ఆఫర్ కూడా ఉంది. జియో క్యాష్బ్యాక్ ఆఫర్ టెలికం సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ జియో రూ. 2,200, క్యాష్ బ్యాక్ తో ఈ స్మార్ట్ఫోన్ రూ. 3,299 లభ్యం కానుందని హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది. అంతేకాదు 60జీబీ డేటా ఉచితం. అలాగే కోటక్ 811 పొదుపు ఖాతా తెరవడంద్వారా మొబైల్ 12 నెలల ప్రమాదం బీమా రెడ్బస్లో ఫస్ట్బుకింగ్పై 20 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది. నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఫీచర్లు 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే 480x854 పిక్సెల్ రిజల్యూషన్ 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజీ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ వెనుక కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా 2150 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ లాంచ్
బీజింగ్: చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కొత్త హైఎండ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2ఎస్ పేరుతో స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. బెజెల్ లెస్ స్క్రీన్తో తన జాగా ఫ్లాగ్షిప్ డివైస్ను మంగళవారం లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్, 6 జీబీ/128 స్టోరేజ్, 6 జీబీ/64 స్టోరేజ్ వెర్షన్లను అందుబాటులో ఉంచింది. చైనాలో 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 37,000, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, వైర్లెస్ చార్జర్, ఫింగర్ ప్రింట్ రీడర్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. దీంతోపాటు ఎంఐ గేమింగ్ ల్యాప్టాప్, ఎంఐ స్పీకర్ మినీని లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2 ఎస్ ఫీచర్లు 5.9 బెజెల్ లెస్ స్క్రీన్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 2160×1080 ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 12+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ