losses
-
Stock Market: కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
-
రేడియో వ్యాపారం మూసివేత
ఇష్క్ 104.8 ఎఫ్ఎం(Ishq FM) బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్న రేడియో(Radio) వ్యాపారాన్ని వచ్చే ఆరు నెలల్లో మూసివేయనున్నట్లు టీవీ టుడే నెట్వర్క్(TV Today) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే మూసివేత నిర్ణయానికి కారణమని పేర్కొంది. టీవీ టుడే నెట్వర్క్ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మూడు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేడియో వ్యాపారం టర్నోవరు రూ.16.18 కోట్లుగాను, నష్టం రూ.19.53 కోట్లుగాను నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో రేడియో విభాగం వాటా 1.7 శాతంగా ఉంది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరువిస్తరణ బాటలో కామధేనుబ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై దృష్టి పెడుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను నెక్ట్స్’ తయారీ సామర్థ్యాన్ని 20 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. అలాగే చానల్ పార్ట్నర్ల నెట్వర్క్ను కూడా పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయి. రూ.1,299 కోట్లను అధిగమించాయి. అమ్మకాలు 4.5 శాతం బలపడి రూ. 1,810 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1,853 కోట్లయ్యింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది(2022–23) రూ. 1,732 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 1,133 కోట్ల నష్టం ప్రకటించింది. నెదర్లాండ్స్ దిగ్గజం ఇంకా హోల్డింగ్స్కు అనుబంధ సంస్థ ఇది. ఓమ్నిచానల్ ద్వారా కార్యకలాపాల విస్తరణ కోసం భారీ పెట్టుబడులు చేపట్టడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ధరలు పెంచకపోగా.. కొన్ని ప్రొడక్టులపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు పెంచుకోగలిగినట్లు ఐకియా ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చులు 2 శాతం అధికమై రూ. 196 కోట్లను దాటాయి. గతేడాది మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 3,152 కోట్లను తాకాయి. అంతక్రితం ఏడాది రూ. 2,895 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. కంపెనీ హైదరాబాద్, నవీముంబై, బెంగళూరు తదితర నగరాలలో లార్జ్ఫార్మాట్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈకామర్స్ కార్యకలాపాల ద్వారా ఆన్లైన్లోనూ విక్రయాలు చేపడుతోంది. -
నష్టపోయి'నారు'
దేవరపల్లి: ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో.. పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 23 వేల హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది.అయితే, గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి, ఇప్పటికే సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకూ నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది. గత ఏడాది కాసుల పంట గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి, రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు (6 వేల మొక్కలు) ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంత మంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బ తిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండూ ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం వచ్చింది. అప్పటి వరకూ గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలు దారులకు కాసుల పంట పండింది. ఆశ పడితే మొదటికే మోసం గత ఏడాది ధరలు చూసిన కౌలుదార్లు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు రూ.40 వేలు కాగా, ఈ ఏడాది అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పలికింది. అయినా సరే తగ్గేదేలే.. అన్నట్లు కౌలుదార్లు పోటీ పడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని నాలుగు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలకగా, నవంబరులో అది రూ.1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాథుడు లేక చాలా మంది రైతులు బోణీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80 శాతం కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని, ఏటా నారుమడులు కట్టి, నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తూంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి, నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.40 వేలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు అయ్యింది. రెండేళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. – గెల్లా గోవిందరాజు, సుబ్బరాయపురం, కౌలు రైతు, దేవరపల్లి కోలుకోలేని దెబ్బ ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.30 లక్షలు అయ్యింది. ఎకరం నారు ధర రూ.1,500 పలికింది. అది కూడా అడిగిన నాథుడే లేడు. ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు రూ.2 లక్షల నష్టం వస్తోంది. నారు రైతులు నిండా మునిగారు. – సీహెచ్ వెంకటేశు, కౌలు రైతు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం -
మైనింగ్పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్గా కేటాయించిన అమౌంట్ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్గా కాకుండా ప్రతి పర్మిట్పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు రాయల్టీ చెక్పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
డిస్కంల దివాలా బాట!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏటేటా నష్టాల్లో కూరుకుపోతు న్నాయి. అత్యధిక నష్టాలున్న డిస్కంలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని డిస్కంలకు కలిపి 2015–16లో రూ.3,74,099 కోట్ల నష్టాలు ఉండగా.. 2022–23 నాటికి అవి రూ.6,76,681 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో తెలంగాణ డిస్కంల నష్టాలు రూ.16,520 కోట్ల నుంచి రూ.60,922 కోట్లకు ఎగబాకాయి. రాజ్య సభలో ఎంపీ సంజయ్కుమార్ ఝా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ప్రభుత్వరంగ డిస్కంల నష్టాల్లో రూ.1,62,507 కోట్లతో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. రూ.92,070 కోట్ల నష్టాలతో రాజస్థాన్, రూ.91,632 కోట్ల నష్టాలతో ఉత్తరప్రదేశ్, రూ.64,843 కోట్ల నష్టాలతో మధ్యప్రదేశ్ వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. లాభాల్లో ప్రైవేటు.. నష్టాల్లో సర్కారీ సంస్థలుదేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచున నిలువగా, ప్రైవేటు రంగ డిస్కంలు మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ డిస్కంల లాభాలు రూ.12,146 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి రూ.23,116 కోట్లకు పెరిగాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 12 ప్రైవేటు డిస్కంలు ఉండగా, అవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 42 డిస్కంలు ఉండగా.. గుజరాత్లోని మూడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్లో ఒక్కో డిస్కం కలిపి మొత్తం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన 37 ప్రభుత్వ రంగ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. మోయలేని అప్పుల్లో దక్షిణ తెలంగాణ డిస్కంతెలంగాణలో రెండు ప్రభుత్వ రంగ డిస్కంలున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నష్టాలు 2015–16లో రూ.10,625 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.42,330 కోట్లకు చేరాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) నష్టాలు ఇదే కాలంలో రూ.5,895 కోట్ల నుంచి 2022–23 నాటికి రూ.18,592 కోట్లకు పెరిగాయి. భారీగా పెరిగిన అప్పులుదేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ డిస్కంల అప్పులు 2015–16లో రూ.4,08,941 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.6,61,263 కోట్లకు పెరిగాయి. ఇదేకాలంలో తెలంగాణ డిస్కంల అప్పుల రూ.13,944 కోట్ల నుంచి రూ.35,883 కోట్లకు పెరిగాయి. దేశంలోని డిస్కంల పరిస్థితి» మొత్తం ప్రభుత్వరంగ డిస్కంలు 42» నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ డిస్కంలు 37» 2022–23 నాటికి సర్కారు డిస్కంల నష్టాలు రూ.6,76,681 » లాభాల్లో ఉన్నవి 5» దేశంలో మొత్తం ప్రైవేటు డిస్కంలు 12» లాభాల్లో ఉన్న ప్రైవేటు డిస్కంలు 12 -
నిస్సాన్లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
గుడ్డు రైతుకు గడ్డు కాలం!
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతిగతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు. మేత ఖర్చులు తడిసి మోపెడు... ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది. 40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి సాధారణంగా ఫామ్లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.సిండికేట్తో ధరలు పతనం గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ మేత ఖర్చులు భారం.. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు
-
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్వేర్కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్కేర్లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
77,000 స్థాయి తాకి.. వెనక్కి
ముంబై: సరికొత్త రికార్డుల వద్ద ఐటీ, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారంతో ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 77,000 స్థాయిపై 77,079 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 23,412 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి.తదుపరి ఐటీ, ఫైనాన్స్ మెటల్, ఇంధన షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పతనమై 76,490 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 23,259 వద్ద నిలిచాయి. సరీ్వసెస్, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్, హెల్త్కేర్, పారిశ్రామికోత్పత్తి రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.04%, 0.56% చొప్పున రాణించాయి. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.136)తో పోలిస్తే 21% ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయ్యింది. ఆఖరికి 17% లాభంతో రూ.159 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.591.25 కోట్లుగా నమోదైంది. డీప్ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్ఎస్ఈకాగా, డీప్ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిష్కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్సే్చంజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.మేలో ఈక్విటీ ఎంఎఫ్ల రికార్డ్ మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు యంఫీ వెల్లడించింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్టీఐమైండ్ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
రికార్డు స్థాయిల్లో లాభాల స్వీకరణ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల అందడంతో రికార్డు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా స్టాక్ సూచీల అయిదు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకొని ప్రథమార్ధంలోనే జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 73,428 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 22,124 వద్ద ఆల్టైం హై స్థాయిలు తాకాయి. సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఐటీ, రియలీ్ట, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చేసుకోవడంతో సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టపోయి 73,427 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పతనమై 22,032 వద్ద ముగిశాయి. చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.31%, 0.43% చొప్పున పతనమయ్యాయి. మరోవైపు మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్అండ్గ్యాస్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలతో ఇటీవల భారీగా ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుకుంది. చిన్న, మధ్య తరహా షేర్ల విలువలు భారీ పెరిగిపోవడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగకపోవచ్చు. ట్రేడింగ్ను ప్రభావితం చేసే తాజా అంశాలేవీ లేకపోవడంతో ఎఫ్ఐఐలు నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. భౌగోళిక ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.331)తో పోలిస్తే షేరు బీఎస్ఈలో 12% ప్రీమియంతో రూ.372 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 34% ఎగసి రూ.445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 31% లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,851 కోట్లుగా నమోదైంది. ► క్యూ3 లో నికర లాభం 56% క్షీణించడంతో జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు 7% నష్టపోయి రూ.249 వద్ద నిలిచింది. ట్రేడింగ్లో 8% పతనమై రూ.247 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ ఒక్క రోజులోనే రూ.11,372 కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్సీఎల్ టెక్ 2%, విప్రో 2%, టెక్ మహీంద్ర 1.40%, ఇన్ఫోసిస్ 1.27%, టీసీఎస్ 1% చొప్పున నష్టపోయాయి. ► గతవారంలో 8% ర్యాలీ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 ఆర్థిక ఫలితాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.2747 వద్ద ముగిసింది. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
ఫస్ట్క్రై నష్టాలు పెరిగాయ్.. ఏకంగా ఆరు రెట్లు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో బ్రెయిన్బీస్ సొల్యూషన్ లిమిటెడ్ నికర నష్టాలు భారీగా పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 486 కోట్లను తాకాయి. ఫస్ట్క్రై బ్రాండ్ ఓమ్నిచానల్ బిజినెస్ నిర్వాహక కంపెనీ అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 79 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రెట్టింపునకుపైగా ఎగసి దాదాపు రూ. 5,633 కోట్లకు చేరింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం 2021–22లో రూ. 2,401 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. వెరసి సాఫ్ట్బ్యాంక్కు పెట్టుబడులున్న స్టార్టప్.. ఫస్ట్క్రై రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించిన స్టార్టప్ల జాబితాలో తాజాగా చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,568 కోట్ల నుంచి రూ. 6,316 కోట్లకు పెరిగాయి. కాగా.. కంపెనీ ఇటీవల పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో 90 కోట్ల డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో పీఈ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కంపెనీలో 40 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి నాటికి దేశమంతటా.. కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. రైతులపై పైసా కూడా భారం పడదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది. స్మార్ట్మీటర్లతో ఉపయోగాలు.. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులకు అభ్యంతరం లేదు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా -
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. -
గాడిన పడుతున్న ఎయిర్లైన్స్..
ముంబై: దేశీయ ఎయిర్లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. కరోనా కారణంగా ఎయిర్లైన్స్ కార్యకలాపాలు నెమ్మదించడం తెలిసిందే. దీని కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇవి రూ.17,500 కోట్ల వరకు నష్టాలను చవి చూశాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.3,000–3,500 కోట్లకు పరిమితం అవుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వైరస్ సమసిపోయి, ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దేశ, విదేశీ ప్రయాణాలు ఊపందుకోవడం తెలిసిందే. గతంలో నిలిచిన ప్రయాణాలు కూడా తోడు కావడంతో విమానయాన సర్వీసులకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విమాన ప్రయాణికుల రద్దీ 8–13 శాతం మధ్య పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 15–15.5 కోట్లకు చేరుకుంటుందని.. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో ఉన్న 14.1 కోట్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీలో చక్కని వృద్ధికితోడు, రాబడులు మెరుగుపడడం, వ్యయాలు స్థిరంగా ఉన్నందున ఈ పరిశ్రమకు స్థిరమైన అవుట్లుక్ను ఇస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలోనూ.. ఎయిర్లైన్స్ సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నష్టాలు ఎదురవుతాయని ఇక్రా తెలిపింది. ‘‘ప్రస్తుత స్థాయి నుంచి రాబడులు మరింత పెరిగే అవకాశాలు పరిమితమే. కనుక ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరే 2024–25లోనూ 3,000–5,000 కోట్ల మధ్య నష్టాలను నమోదు చేయవచ్చు’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ వివరించారు. విమానాశ్రయాల సదుపాయాల విస్తరణతో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం మాదిరే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రయాణికుల వృద్ధి ఉంటుందని ఇక్రా తెలిపింది. ఎనిమిది నెలల్లో 10 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) విమాన ప్రయాణికుల సంఖ్య 10.07 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 17 శాతం వృద్ధి కనిపిస్తోంది. కరోనా ముందు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 8 నెలల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం వృద్ధి నమోదైంది. భారత ఎయిర్లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2022–23లో 2.39 కోట్లుగా ఉంది. కరోనా ముందు నాటి గణాంకాల కంటే ఇది ఎక్కువ. 2018–19లో 2.59 కోట్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయి నమోదు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్లైన్స్ సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ఇక్రా అంచనా వేసింది. విమానయాన సంస్థలకు ధరలు నిర్ణయించే బలం చేకూరిందని, ఫలితమే రాబడులు మెరుగుపడడమని వివరించింది. విమానయాన సంస్థలకు 1500 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల నిదానంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మధ్య కాలానికి డిమాండ్–సరఫరా మధ్య సమతుల్యత ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్లో భారత ఎయిర్లైన్స్ సంస్థల వాటా 42 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రయాణికుల రికవరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్తో రూపాయి క్షీణతను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్ఆర్ఏ) ప్లాట్ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్అండ్వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్అండ్వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 66,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,812 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,560 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు బలపడి 19,850 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివర్లో పలు రంగాల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా లాభాలు కోల్పోయాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్క్యాప్ సూచీలు వరుసగా 0.70%, 0,40% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.264 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.113 కోట్ల షేర్లు కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సియట్ లిమిటెడ్ షేరు 4.50% లాభపడి రూ.2,197 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 11% దూసుకెళ్లి రూ.2,334 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది క్యూ2 సంస్థ నికర లాభం రూ.6.4 కోట్లుగా ఉంది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.388 కోట్లు పెరిగి రూ. 8,887 కోట్లకు చేరింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీ షేరు 4.09% లాభపడి రూ.295 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 5% పెరిగి రూ.298 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల మైలురాయిని అధిగమించి రూ.30,422 కోట్లకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు 133% దూసుకెళ్లింది. రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు కనబరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% పెరిగి రూ.1,541 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 2% ర్యాలీ చేసి రూ.1,558 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎల్రక్టానిక్ సేవల తయారీ సంస్థ సైయెంట్ డీఎల్ఎం షేరు 3% ఎగసి రూ.709 వద్ద స్థిరపడింది. క్యూ2 లో కంపెనీ నికర లాభం 106% వృద్ధి చెందడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్లో 8.50% ఎగసి రూ.748 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
నెల కనిష్టానికి సూచీలు
ముంబై: బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం కొనసాగడంతో స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 286 పాయింట్లు పతనమై 65,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 19,436 వద్ద నిలిచింది. రెండు సూచీలకు ముగింపు స్థాయిలు నెల కనిష్టం. ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 633 పాయింట్లు నష్టపోయి 65 వేల స్థాయి దిగువన 64,879 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు పతనమై 19,334 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,424 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,769 కోట్ల షేర్లను కొన్నారు. ► అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 3% పెరిగి రూ.2464 వద్ద స్థిరపడింది. అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్(ఐహెచ్సీ) ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆదానీలో తన వాటాను 4.98% నుంచి 5.04 శాతానికి పెంచుకోవడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► అప్డేటర్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో 0.03 స్వల్ప డిస్కౌంట్తో 299.90 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 6% క్షీణించి రూ.282 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచి్చంది. చివరికి 5.38% నష్టంతో 284 వద్ద నిలిచింది. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
66 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై మరింత ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్సీఐ 12%, కొచి్చన్ షిప్యార్డ్ 11%, ఎన్ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్కాన్ 8%, ఎన్సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి. రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి. -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు, మెరిసిన టైటన్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్ప్రదేశ్లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
అయ్యో వొడాఫోన్ ఐడియా! పాపం భారీ నష్టాలు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది. -
లూడో తెచ్చిన ముప్పు: లక్షలు గోవిందా! చివరికి..!
Online Gaming Ludo Bangalore Woman ఆన్లైన్ గేమ్కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూర్కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ కొంత నగదుతో సహా ఇంటి నుంచి పారిపోవడం మరింత సంచలనం రేపింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్లైన్ గేమింగ్కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్లైనింగ్ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో రూ. 50వేల పోగొట్టుకుంది. రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం. అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ అలాంటి పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్లైన్లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్ కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. -
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకుల దెబ్బ, భారీ నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్లో జోష్ మూడ్కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19,400 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ , దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలచాయి. యూపీఏ టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. క్యూ1 ఫలితాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469 కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది. కానీ ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438 కోట్లకు చేరుకుంది. రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన సూచీలు.. రిలయన్స్, ఐటీసీ షేర్లు పతనం
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, కుప్పకూలిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు ప్రధానంగా ఇన్ఫోసిస్ , అలాగే రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. ఇటీవల మార్కెట్ భారీగా ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ మార్చి 24 నాటి 57,527 తో పోలిస్తే 67,500 వేలకు ఎగువన ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది. ఒక్క ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద 234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బీపీసీఎల్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, హెచ్సీఎల్టెక్, హెచ్యూఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అదరగొట్టిన రిలయన్స్ మరోవైపు రిలయన్స్ నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది. రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్ మారకంలో భారత కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
భారీ నష్టాల్లో ఉత్తర డిస్కం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. 2023 జనవరి 1– మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి సంస్థ తాజాగా ప్రకటించిన ‘త్రైమాసిక విద్యుత్ ఆడిట్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ పరిధిలోని 17 జిల్లాల/విద్యుత్ సర్కిళ్లలో మొత్తం 38 విద్యుత్ డివిజన్లుండగా.. డివిజన్ల వారీగా విద్యుత్ సాంకేతిక, ఆర్థిక నష్టాల మొత్తాలను (ఏటీఅండ్సీ లాసెస్)ను సంస్థ ఈ నివేదికలో పొందుపరిచింది. మూడు డివిజన్లలో పరిధిలో ఈ నష్టాలు ఏకంగా 70–80 శాతానికి ఎగబాకినట్లు నివేదిక పేర్కొంది. అంటే ఈ డివిజన్లకు సరఫరా చేసిన మొత్తం విద్యుత్కు గాను కేవలం 20–30 శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయన్నమాట. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన విద్యుత్కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థూలంగా 36 శాతం నష్టాలు గత త్రైమాసికంలో టీఎస్ఎన్పీడీసీఎల్ మొత్తం రూ.4,726.60 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, రూ.3,203.89 కోట్లను (67.78శాతం) మాత్రమే వసూలు చేసుకోగలిగింది. అంటే 36.33 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. డిస్కంల సుస్థిర మనుగడ కోసం ఏటీ అండ్ సీ నష్టాలను 2019–20 నాటికి 6 శాతానికి తగ్గించుకోవాలని ఉదయ్ పథకం కింద కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. అయినా రాష్ట్ర డిస్కంలు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వసూలు కాని ‘ఇతర’ కేటగిరీ బిల్లులు గృహాలు, వాణిజ్యం, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారులు 90 నుంచి 100 శాతం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదిక తెలిపింది. ఇతర కేటగిరీలో మాత్రం చాలా డివిజన్లలో ఒక శాతం బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ డివిజన్ల పరిధిలోని కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్హౌస్ల విద్యుత్ కనెక్షన్లు ఇతర కేటగిరీలోనే ఉన్నాయి. ఏటీ అండ్ సీ నష్టాలు అంటే..? సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో డిస్కంలకు జరిగే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో.. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలంటారు. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో పాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి..అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ (ఏటీ అండ్ సీ లాసెస్) అంటారు. పెద్దపల్లిలో 80%..కరీంనగర్ రూరల్లో 78.99% నష్టాలు పెద్దపల్లి డివిజన్లో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం ఏకంగా 80.18 శాతానికి ఎగబాకి రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డివిజన్లో గత త్రైమాసికంలో రూ.435.08 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, కేవలం రూ.89.63 కోట్లు (20.6%) మాత్రమే వసూలయ్యాయి. డివిజన్ పరిధిలో 1,71,002 విద్యుత్ కనెక్షన్లుండగా, 421.55 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ సరఫరా చేశారు. 15.95 ఎంయూల (3.78 శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు (టీ అండ్ డీ లాసెస్) పోగా, మిగిలిన 405.6 ఎంయూల విద్యుత్ను వినియోగించినందుకు గాను వినియోగదారులకు రూ.435.08 కోట్ల బిల్లులు జారీ చేశారు. ♦ కరీంనగర్ రూరల్ డివిజన్లో 78.99 శాతం ఏటీఅండ్సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.445.67 కోట్ల బిల్లులకు గాను రూ.96.28 కోట్లు (21.6%) మాత్రమే వసూలయ్యాయి. ♦ భూపాలపల్లిలో 71.2 శాతం ఏటీఅండ్సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.205.7 కోట్ల బిల్లులకు గాను రూ.80.19 కోట్లే (38.98 శాతం) వసూలయ్యాయి. ఇక అక్కడ టీ అండ్ డీ నష్టాలు సైతం 26.13 శాతంగా ఉన్నాయి. చౌర్యం/సాంకేతిక లోపాలతో ఏకంగా 99.35 ఎంయూల విద్యుత్ నష్టం జరిగింది. ♦ ములుగు డివిజన్లో 61.58 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.122.36 కోట్ల బిల్లులకు గాను రూ.48.97 కోట్లు (40.02 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ♦కరీంనగర్ డివిజన్లో 48.86 శాతంఏటీఅండ్సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.444.12 కోట్ల బిల్లులకు గాను రూ.218.46 కోట్లు (49.10%) మాత్రమే వసూలయ్యాయి. ♦మంథని డివిజన్లో 44.12 శాతం ఏటీఅండ్ సీ నష్టాలున్నాయి. అక్కడ రూ.328.8 కోట్ల బిల్లులకు గాను రూ.144.48 కోట్లు (43.94%) మాత్రమే వసూలయ్యాయి. హన్మకొండ రూరల్లో 34.54 శాతం ఏటీఅండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.177.25 కోట్ల బిల్లులకు గాను రూ.124.79 కోట్లు (70.4శాతం) మాత్రమే వసూలయ్యాయి. మరో 7.04 శాతం టీ అండ్ డీ నష్టాలున్నాయి. పైన పేర్కొన్న ఈ డివిజన్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్హౌస్లతో పాటు దేవాదుల, సమ్మక్క సాగర్ వంటి భారీ లిఫ్టులు కూడా ఉన్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్తో నష్టాలు: అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై, రికార్డు స్థాయిని టచ్ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్,రియల్టీ ఇతర హెవీవెయిట్ షేర్లలో ఒత్తిడి, ప్రాఫిట్ బుకింగ్తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్ఎంసిజి నష్టపోగా, పిఎస్యు బ్యాంక్స్, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం. టాప్ లూజర్ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్గా నిలిచింది. గత మూడు నెలలో ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి. మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.12,000 కోట్లను నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ ఎం, టీసీఎస్ లాభపడగా, కోటక్ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్గా ముగిసింది. -
మూడు రోజుల లాభాలు పాయే: సెన్సెక్స్ పతనం, ఫార్మా జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఆరంభంనుంచీ స్తబ్ధుగా ఉన్న సూచీలు చివరికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 62,922వద్ద, 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,684 వద్ద 18,700 మార్క్ దిగువన ముగిసింది. సెక్టార్లలో, బ్యాంకింగ్ , రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. మేజర్గా ఫార్మా ఇండెక్స్ 1.4 శాతం ఎఫ్ఎంసిజి 0.5 పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ ,దివీస్ , రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ టాప్ విన్నర్స్గా నిలిచాయి.అలాగే హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు, విపప్రో, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 14పైసలు నష్టపోయి 82.19 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ అప్డేట్స్, బిజినెస్ వార్తల కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
నష్టాల్లో ముగిసిన మార్కెట్, బ్యాంకు, ఐటీ షేర్ల దెబ్బ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సూచీలు తొలి రెండు గంటలపాటు గ్రీన్లో కొనసాగాయి. కానీ మిడ్ సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 62,625.63 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ 71.10 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 18,563.40 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ లాభపడగా,బ్యాంకు, ఐటీ, మెటల్ , ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లునష్టపోయాయి. ఇండస్ ఇండ్, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, అదానీ లాభపడగా, హీరోమోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ, దివీస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. గత ముగింపు 82.57తో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి 11 పైసలు పెరిగి 82.46 వద్ద ముగిసింది. -
నాలుగు రోజుల రన్కు బ్రేక్: మార్కెట్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి. భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్ఫార్మ టాప్ విన్నర్స్గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ , హెచ్డీఎఫ్సీ బాగా నష్టపోయాయి. -
ఇండియా సిమెంట్స్ నష్టాలు పెరిగాయ్, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో ఆస్తుల మానిటైజేషన్ తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) డోంట్ మిస్ టూ క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ -
నష్టాల్లో సూచీలు: అదానీ , బ్యాంకింగ్ షేర్ల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రతికూల ప్రపంచ సూచనల మధ్య సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా కుప్పకూలింది. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్ల లాభాలతో నష్టాలనుంచి తెప్పరిల్లాయి. కానీ ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో లాభాల బుకింగ్ కనిపిస్తోంది. దీంతో బనిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 18306 వద్ద, 121 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 61864 వద్ద కొనసాగుతున్నాయి. సన్ ఫార్మా, టైటన్, డా.రెడ్డీస్, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్లు ఉండగా, కాఅదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు ఎస్బీఐ,ఐసీఐసీఐ, పీఎన్బీ తదితర బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. -
Today Market Closing: మూడో రోజు నష్టాలు, రూపాయి 22 పైసలు ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడో రోజూనష్టాల్లోనేముగిసాయి. దలాల్ స్ట్రీట్లో కొనసాగుతున్న ప్రాఫిట్-బుకింగ్తో ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 61432 వద్ద,నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 18, 130 వద్ద స్థిరపడింది.బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి మరోవైపు మే 26న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. బజాజ్ ఫైనాన్స్,కోటక్ మహీంద్ర, భారతి ఎయిర్టెల్,ఐసీఐసీఐ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివీస్ ల్యాబక్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, టైటన్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 22 పైసలు కుప్పకూలి 82.59 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ -
భారీ నష్టాల్లో సూచీలు: హెచ్సీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ను ఫ్లాట్గా ప్రారంభించిన సూచీలు ఆ తరువాత మరింత నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టంతో 61500 దిగువన ట్రేడవుతుండగా, 130 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,150 స్థాయిని కోల్పోయింది. ఐటీ , ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. నష్టాలు మరింత కొనసాగుతున్నాయి. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్ బాగా లాభపడుతుండగా హెచ్సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్ టాప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటన్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అదానీ హిండెన్బర్ వివాదంలో సెబీ అప్పీల్ను స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంల నేటి (బుధవారం)సెషన్లో అదానీ గ్రూప్ స్టాక్స్పై ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. -
సెన్సెక్స్ లాభం, నిఫ్టీ అక్కడే
ముంబై: జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మెటల్, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 59,538 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 369 పాయింట్ల పరిధిలో 59,413 వద్ద కనిష్టాన్ని, 59,781 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 23 పాయింట్లు పెరిగి 59,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 17,640 ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,554 – 17,663 వద్ద రేంజ్లో కదలాడింది. ఆఖరికి ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా గురువారం ముగింపు 17,624 వద్దే స్థిరపడింది. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, మీడియా, ఫార్మా షేర్లకు రాణించాయి. మెటల్, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్టీ, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాయి. కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 3కు ముందు విద్యుత్ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. నిర్లక్ష్యం ఫలితం... విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు... కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. సంస్కరణలతోనే డిస్కంల బాగు.. విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్ మీటరింగ్ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. -
ఆర్బీఐ పాలసీ రివ్యూపై దృష్టి, నష్టాల్లో స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్ఐ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58588 వద్ద,నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 17526వద్ద కొనసాగుతున్నాయి ఈ ఉదయం RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్మార్క్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వడ్డన ఉంటుందనేది ప్రధాన అంచనా. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఎస్బిఐ లైఫ్, ఐషర్ మోటార్స్ ,యాక్సిస్ బ్యాంక్ ఒక్కో శాతం చొప్పున ఎగిసి గిటాప్ గెయినర్లుగా ఉండగా, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ , ఎంఅండ్ ఎం టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్చి నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ ట్రేడింగ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదయం సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 57,752 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 455 పాయింట్ల పరిధిలో 57,495 వద్ద కనిష్టాన్ని, 57,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 40 పాయింట్ల నష్టంతో 57,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,032 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 16,914 –17,062 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 34 పాయింట్లు పతనమై 16,952 వద్ద ముగిసింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.79%, 0.42 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1531 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను విక్రయించారు. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 82.16 స్థాయి వద్ద స్థిరపడింది. వేదాంతా డివిడెండ్ రూ. 20.5 వేదాంతా లిమిటెడ్ వాటాదారులకు ఐదో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 20.5 చొప్పున చెల్లించనుంది. ఇందుకు ఏప్రిల్ 7 రికార్డ్ డేట్కాగా.. మొత్తం రూ. 7,621 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: వరుసగా నాలుగో రోజు నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు కూడా పతనమైనాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభం, అంతర్జాతీయమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆ తరువాత నష్టాలనుంచి కోలుకున్నప్పటికీ చివరల్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 337.66 పాయింట్లు లేదా 0.58 శాతం క్షీణించి 57,900 వద్ద, నిఫ్టీ 111 పతనంతో 17,043 వద్ద ముగిసాయి. ఒక దశలో నిఫ్టీ 17వేల కిందికి పడిపోయింది. అయితే డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టం వద్ద నమోదు కావడం ఊరట నిచ్చింది. మీడియా, ఫార్మా మినహా ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్లు వరుసగా 8, 4శాతం నష్టపోయాయి. టైటన్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ విన్నర్స్గా, ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. -
పెన్నీ స్టాక్స్తో జర జాగ్రత్త!
ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్లో మిడ్ క్యాప్ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: సాధారణంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అంతంత మాత్ర బిజినెస్లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్పై కన్నేసి ఉంచుతాయి. అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ తీరు గతేడాది నవంబర్ నుంచి సాఫ్ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్ షేరు 1,823 శాతం జంప్చేసింది. గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్ ఇండస్ట్రీస్ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కన్ను కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు. సాధనా బ్రాడ్క్యాస్ట్, షార్ప్లైన్ బ్రాడ్క్యాస్ట్ యూట్యూబ్ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్అండ్టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్ఆర్ రైల్ ఇంజినీరింగ్, టేలర్మేడ్ రీన్యూ, ఆస్కమ్ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!! -
నాలుగు నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది. -
TodayStockMarketClosing: తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలే!
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి మిడ్సెషన్ తరువాత కోలుకున్నప్పటికీ ఆ లాభాలనునిలబెట్టుకోవడం విఫలమైంది. సెన్సెక్స్ 124 పాయింట్లు కుప్పకూలి 60683 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17857 వద్ద ముగిసింది. మెటల్ షేర్లు భారీగా నష్టపోగా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, యూపీఎల్, సిప్లా, హీరోమోటో, లార్సెన్ టాప్ గెయినర్స్గా, అదానీ ఎంటర్పప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, కోల్ఇండియా టాప్ లూజర్స్గా నిలిచాయి. అలాగే పేటీఎంలో మొత్తం వాటాను అలీబాబా విక్రయించడంతో పేటీఎం షేరు దాదాపు 8శాతం కుప్పకూలింది. అటు ఎంఎస్సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ తగ్గించడంతో అదానీకి చెందినకొన్నిషేర్లు నష్టపోయాయి. -
Today StockMarket Opening: నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభ మైనాయి. అనంతరం మరింత అమ్మకాలు కొనసాగాయి. ఐటి, ఎఫ్ఎంసిజి, మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫలితంగా 65 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17827 వద్ద, సెన్సెక్స్ 198 పాయింట్లు కోల్పోయి 60610 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం కూడా అదానీ షేర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ విన్నర్స్గా హెచ్సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.63ప్రారంభమైనా 82.59 వద్ద పాజిటివ్గా ఉంది. -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్కు మెస్సేజ్లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి క్రెడిట్కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్సైట్కు మళ్లించి, ఫిషింగ్ లింక్పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్సైట్కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐటీ షాక్తో నష్టాల ముగింపు, రూపాయి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివర్లో నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి. తద్వారా 5 రోజుల లాభాలకు చెక్ పడింది. అమెరికా జాబ్ రిపోర్ట్ తరువాత ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఐటీ షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్, బీపీసీఎల్, టాప్ విన్నర్స్గా నిలిచాయి. దివీస్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదాంత టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరుమారకంలో రూపాయి సెప్టెంబర్ 22 తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది. 1.10 నష్టంతో 82. 72 వద్ద ముగిసింది. -
టైటన్ స్పీడ్ తగ్గింది, షేర్లు మాత్రం దౌడు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3) లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 913 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,012 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 10,094 కోట్ల నుంచి రూ. 11,698 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 8,750 కోట్ల నుంచి రూ. 10,454 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో జ్యువెలరీ విభాగం 11 శాతం పుంజుకుని రూ. 9,518 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ బాటలో వాచీలు, ఇతర విభాగం అమ్మకాలు సైతం 15 శాతం ఎగసి రూ. 811 కోట్లకు చేరాయి. ఐ కేర్ అమ్మకాలు 12 శాతం అధికమై రూ. 174 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో గురువారం నీరసించిన శుక్రవారం టైటాన్ షేర్లు దూసుకుపోయాయి. భారీగా లాభాలతో టాప్ గెయినర్గా దాదాపు 7 శాతంఎగిసి రూ. 2458 వద్ద ముగిసింది. -
స్మగ్లింగ్ కట్టడికి భారత్ నాయకత్వం వహించాలి
న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్) కారణంగా నష్టపోతున్న భారత్ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. స్మగుల్డ్ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో నా యకత్వ పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కలసికట్టుగా పోరాడాలి.. అంతర్జాతీయంగా స్మగుల్డ్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్ చేంజ్ ఫోరమ్ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘‘స్మగ్లింగ్ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్ అంశంపై భారత్ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. బ్రాండెడ్ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో ఈ ఫోరమ్ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్ యజమానాలను కార్పొరేట్ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది. -
ఎఫ్అండ్వోలో రిటైలర్లకు నష్టాలే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) రిటైల్ ఇన్వెస్టర్లు చేపట్టిన ఈక్విటీ డెరివేటివ్(ఎఫ్అండ్వో) లావాదేవీలలో 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నివేదిక తాజాగా వెల్లడించింది. ప్రతీ 10 మంది రిటైల్ ఇన్వెస్టర్లలో 9 మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లావాదేవీలలో నష్టపోయినట్లు పేర్కొంది. దీంతో అటు స్టాక్ ఎక్సే్ఛంజీలు, ఇటు బ్రోకర్లు అదనపు రిస్కులపై సమాచారాన్ని అందించేలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలియజేసింది. 2019–22 మధ్య కాలంలో టాప్–10 స్టాక్ బ్రోకర్ల వద్ద నమోదైన రిటైల్ ఇన్వెస్టర్ల గతేడాది ఎఫ్అండ్వో టర్నోవర్ ఆధారంగా అధ్యయనం చేపట్టింది. మొత్తం రిటైల్ క్లయింట్ల టర్నోవర్లో ఇది 67% వాటాకాగా.. 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు వెల్లడించింది. అంటే ప్రతీ 10 మందిలో 9 మంది ఎఫ్అండ్వో లావాదేవీల ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయినట్లు తెలియజేసింది. 90% యాక్టివ్ ట్రేడర్లను పరిగణిస్తే ఈ నష్టం రూ. 1.25 లక్షలుగా నమోదైనట్లు వెల్లడించింది. వెరసి డెరివేటివ్ విభాగంలో 11% మంది రిటైలర్లు మాత్రమే లాభాలు ఆర్జించారు. సగటున రూ. 1.5 లక్షల లాభం నమోదైంది. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు, ఐటీ షేర్ల ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు తరువాత 250 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 60093వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 17895వద్ద ముగిసింది. ఐటీ మినహా బ్యాంకింగ్, మెటల్, ఆటోఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. టెక్మహీంద్ర, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, హీరోమోటో భారీగా లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల, హిందాల్కో నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 39 పాయింట్లు నష్టంతో 81.64 వద్ద ఉంది. -
TodayStockMarketUpdate: బ్యాంకింగ్ దెబ్బ, మూడో రోజూ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్గా ఉన్నప్పటికీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్ల వారంవారీ గడువు ముగియనున్న నేపథ్యం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో లాభాలు ఆవిరై పోయాయి. రోజంతా ఊగిస లాడిన సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 59958 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 17858 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు, నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొన సాగాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోగా, ఐటీ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ దిగ్గజాల డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు, యుఎస్ ద్రవ్యోల్బణ డేటా అంచనాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగుతోంది. అల్టట్రా టెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, లార్సెన్. హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాల్లోనూ, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్పనష్టాలతో 81.55 వద్ద ముగిసింది. -
భారీ నష్టాలు, 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలన్నీ కోల్పోయి భారీ నష్టాల్లో ముగిసాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి, ఫెడ్ వడ్డీరేట్ల భయాల కారణంగా, మంగళవారం సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్ట పోయింది. ఆరంభంలోనే డీలా పడిన సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఐటీ, ఫైనాన్షియల్స్ బ్యాంకింగ్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 632 పాయింట్లు పతనమై 60115 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు నష్టంతో 17925 వద్ద ముగిసాయి. టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ , బీపీసీఎల్ లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ తదితర షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 62పైసలు ఎగిసి 81.85 స్థాయికి చేరింది. ఈ పతనంతో లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇ ఎం-క్యాప్ నమోదు ప్రకారం సోమవారం నాటి రూ.282.99 లక్షల కోట్ల విలువతో పోలిస్తే దలాల్ స్ట్రీట్ రూ. 3 లక్షల కోట్లను కోల్పోయింది. హెచ్డిఎఫ్సి ట్విన్స్ (హెచ్డిఎఫ్సి,హెచ్డిఎఫ్సి బ్యాంక్), ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ లాంటి ఫ్రంట్లైన్ స్టాక్ల పతనం మార్కెట్ను బలహీనపర్చింది. -
స్విగ్గీకి పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టాఫ్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 451 పాయింట్లు కుప్పకూలి 61735 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టంతో 18375 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐషర్, మారుతి లాంటి ఆటో షేర్లుకూడా బలహీనంగా ఉన్నాయి. ఐటీసీ, ఎం అండ్, నెస్లే, కోల్ ఇండియా, డా. రెడ్డీస్ గ్రాసిం, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. ఈ సాయంత్రం విడుదల కానున్న నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటాకానుందని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సులా వైన్యార్డ్స్ , అబాన్స్ హోల్డింగ్స్ IPO ఈరోజు షురూ కానుంది. -
ఐటీ ఢమాల్: కుప్పకూలిన హెచ్సీఎల్టెక్ షేరు
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో లాభపడిన సూచీలు చివరలో కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స్ 389 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 62,182 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 18,497 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రా డేలో ఏకంగా 700 పాయింట్లకు పైగా పడి 61,889 కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 18,500 మార్క్ను బ్రేక్ చేసింది. ఎఫ్ఎంసిజి, ఫార్మా లాభపడగా, ఐటీ ఇండెక్స్ 3.16 శాతం పతనమైంది. అలాగే పీఎస్యూ బ్యాంక్ రియాల్టీ సూచీలు వరుసగా 1.7 శాతం1.5 శాతం నష్టపోయాయి. నెస్లే, టైటన్, సన్ ఫార్మ, డా.రెడ్డీస్, ఐషర్ మోటార్స్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు టెక్ దిగ్గజం హెచ్సీఎల్టెక్ ఏకంగా 6 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విపప్రో, హిందాల్కో టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు ఎగిసి 82.28 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ వడ్డింపు,18600 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు నష్ట పోయాయి. ఆ తరువాత ఆర్బీఐ వడ్డీ వడ్డనతో దలాల్ స్ట్రీట్లో ప్రాఫిట్ బుకింగ్ జోరుగా కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 216పాయింట్ల పతనంతో 62,411 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి18 560 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 62500 మార్క్ను కోల్పోయింది. నిఫ్టీ 18,600 మార్క్ దిగువకు చేరింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్రంట్లైన్ సూచీలతో సమానంగా పడిపోయాయి. ఏసియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఎల్ అండ్టీ, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్గా, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటామోటార్స్ టాప్ లూజర్స్గా స్థిర పడ్డాయి. ఎఫ్ఎంసీజీ రికార్డ్ ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకుపోయాయి. దీంతో ఇండెక్స్ ఆల్ టైం గరిష్టానికి చేరింది. ఇమామీ, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ 1 శాతం నుంచి 3 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 18పైసలు లాభంతో 82.47వద్ద ఉంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును వడ్డించింది. అలాగే గ్లోబల్ సంక్షోభం, ద్రవ్యోల్బణం అప్రమత్తత కారణంగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. -
ఆటో, ఐటీ షాక్: బుల్ రన్కు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజుల లాభాల పరుగుకు బ్రేక్ చెప్పాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు సెన్సెక్స్, నిఫ్టీ వరుస రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసింది. డే హై నుంచి 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ 63 వేల దిగువకు చేరింది. అలాగే నిఫ్టీ కూడా 18700 దిగువకు చేరింది. ఆటో, ఐటీ షేర్లు భారీగా నష్ట పోయాయి. చివరికి సెన్సెక్స్ 416 పాయింట్లు కుప్పకూలి 62868 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు నష్టంతో 18696 వద్ద ముగిసింది. అపోలో హాస్పిట్సల్, టెక్ మహీంద్ర, గ్రాసిం, బ్రిటానియా డా. రెడ్డీస్ టాప్ విన్నర్స్గా నిలవగా, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా కన్జూమర్స్స్ హెచ్యూఎల్, హీరో మోటో నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయ 12 పైసల నష్టంతో 81.31 వద్ద ఉంది. -
రిలయన్స్, ఇన్ఫోసిస్ షాక్: వరుసగా మూడో సెషన్లో నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సంకేతాలతో సోమవారం వరుసగా మూడో సెషన్లో నష్టపోయిన సెన్సెక్స్ ఆరంభంలో సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయింది. ఐటీ,పవర్, రియాల్టీ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగి, చివరకు సెన్సెక్స్ 519 పాయింట్లు కుప్పకూలి , 61114 వద్ద నిఫ్టీ 148 పాయింట్ల పనతంతో నిఫ్టీ వద్ద 18159 వద్ద ముగిసింది. బీపీసీఎల్ , భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్యూఎల్ టాప్ విన్నర్స్గా నిలవగా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హీరో మోటాకార్ప్, అదానీపోర్ట్స్ , ఎల్ అండ్ టీ, టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 17పైసలు నష్టోయి 81.83 వద్ద ఉంది. -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్క్యాప్ ఫండ్స్ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్క్యాప్ ఫండ్స్కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్క్యాప్ ఫండ్స్లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్క్యాప్ ఫండ్స్లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్క్యాప్, లార్జ్క్యాప్తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్క్యాప్లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎయిర్లైన్స్కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ అక్టోబర్లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
భారీ నష్టాలు, మూడు రోజుల లాభాలకు రుపీ చెక్
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్న సూచీలు , తరువాత మరింత బేజారయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 60,500 దిగువకి, నిఫ్టీ 18000 దిగువనకు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 420 పాయింట్లు నష్టపోయి 69613 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 18028 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60,600 ఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన ముగియం విశేషం. అమెరికా ఇన్ఫ్లేషన్ డేటాపై దృష్టి, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు వారం F&O గడువు ముగింపు కావడంతో దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ హెచ్యుఎల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా లాభపడ్డాయి. ముఖ్యంగా నైకా షేర్లు ఏకంగా 10 శాతం జంప్ చేశాయి. అటు డాలరుమారకంలో రూపాయి వరుస లాభాలకు చెక్పెట్టింది. 40పైసలు కోల్పోయి 81.76 స్థాయికి చేరింది. -
ప్రాఫిట్ బుకింగ్: ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. అయినా సెన్సెక్స్ 61 వేలకు ఎగువన, నిఫ్టీ 18150స్థాయిని నిలబెట్టుకున్నాయి. ఫార్మా, మెటల్ సూచీల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అలాగే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, రేపు వెలువడనున్న యూఎస్ ద్రవ్యోల్బణం డేటాపై పెట్టుబడి దారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 152 పాయింట్లను కోల్పోయి 61033 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 18157 వద్ద ముగిసాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐటీసీ, హీరోమోటో, డా. రెడ్డీస్ లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, పవర్గగ్రిడ్, దివీస్ ల్యాబ్స్, టెక్ ఎం, గ్రాసిం భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45పైసలు ఎగిసి 81.44 వద్ద ముగిసింది. సోమవారం 81.92 వద్ద 82 మార్క్ను అధిగమించిన సంగతి తెలిసిందే. -
టైర్ల దిగ్గజం సియట్ ఆసక్తికర ఫలితాలు, లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 81 శాతం క్షీణించి కేవలం రూ.7.83 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,452 కోట్ల నుంచి రూ. 2,894 కోట్లకు ఎగసింది. ఇన్పుట్ ఖర్చులు తమ లాభాలను ప్రభావితం చేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,402 కోట్ల నుంచి రూ. 2,864 కోట్లకు పెరిగాయి. రానున్న రెండేళ్లలో అంబర్నాథ్ ప్లాంటులో రేడియల్ టైర్ల తయారీ సామర్థ్యాన్ని రోజుకి 55 టన్నులకు పెంచేందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అదనంగా రూ. 396 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్టుబడులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. -
ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా: ఉద్యోగాల కోతపై మస్క్
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విటర్ ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించారు. లేదు..లేదు అంటూనే ట్విటర్లో దాదాపు 50 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్న మస్క్ తాజా తొలగింపులపై ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఈ వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ తమకు ఇంతకుమించి వేరే మార్గంలేదని ప్రస్తుతం సంస్థ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడించారు. (ElonMusk ట్విటర్ డీల్: అమెరికా అధ్యక్షుడి మండిపాటు) నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, అంతకు మించి మరో మార్గం లేదని మస్క్ ట్వీట్ చేశారు. అయినా ఉద్యోగం కోల్పోయిన వారికి మూడు నెలల వేతనం చెల్లిస్తున్నామనీ. నిజానికి చట్టపరంగా చెల్లించాల్సిన దానికంటే 50 శాతం ఎక్కువేనని పేర్కొన్నారు. అలాగే కంటెంట్ నియంత్రణకు తాము కట్టబుడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వారంలో ద్వేషపూరిత ప్రసంగాలు ఈ వారంలో చాలా తగ్గాయంటూ ట్వీట్ చేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ బ్లాక్బస్టర్ టేకోవర్ తర్వాత కేవలం వారం లోజుల్లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. టాప్ ఎగ్జిక్యూటివ్లతోపాటు, 7500 మంది సిబ్బందిలో సగం మందిని శుక్రవారం తొలగించింది. దీనికి ముందు, ట్విటర్ ఆఫీసులకు ఆయా ఉద్యోగుల యాక్సెస్ను బ్యాన్ చేసింది. దీంతో ట్విటర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ప్రపంచ వ్యాప్తంగా సోషల్మీడియాలో ఈ సమాచారాన్ని పంచుకోవడం వైరల్గా మారింది. ముఖ్యంగా అమెరికా, కెనడా ట్విటర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మిచెల్ ఆస్టిన్ తనను తొలగించడంపై విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day. Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required. — Elon Musk (@elonmusk) November 4, 2022 ట్విటర్ డీల్ తరువాత కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్న మస్క్ ఆమేరకు ట్విటర్ టీంలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్టమైన టార్గెట్లను విధించి, దానికిడెడ్లైన్ కూడా విధించిన సంగతి తెలిసిందే. పొదుపు చర్యల్లో భాగంగా కంపెనీ సీఈవో,టాప్ ఎగ్జిక్యూటివ్లతోపాటు సాధారణ ఉద్యోగులను ఇంటికి పంపించారు. కొత్త కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ను ప్రతిపాదన, వెరిఫైడ్ ఖాతాల వినియోగదారుల నుండి నెలకు 8 డాలర్లు వసూలు, పొదుపు చర్యలు, ఉద్యోగులకు ఎక్కువ పనిగంటలు లాంటి చర్యలతో, అటు పొదుపు, ఇటు ఆదాయ ఆర్జనకు కొత్త మార్గాలను మస్క్ అన్వేషిస్తున్నారని భావిస్తున్నారు. Again, to be crystal clear, Twitter’s strong commitment to content moderation remains absolutely unchanged. In fact, we have actually seen hateful speech at times this week decline *below* our prior norms, contrary to what you may read in the press. — Elon Musk (@elonmusk) November 4, 2022 Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day. Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required. — Elon Musk (@elonmusk) November 4, 2022 -
వొడాఫోన్కు తప్పని నష్టాలు..ఏడు వేల కోట్లకుపైగా నష్టాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. రూ. 7,596 కోట్లకు చేరాయి. గత క్యూ2లో ఇవి రూ. 7,132 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం సుమారు 13 శాతం పెరిగి రూ. 9,406 కోట్ల నుంచి రూ. 10,614 కోట్లకు చేరింది. యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 19.5 శాతం పెరిగి రూ. 131కి చేరింది. సమీక్షాకాలంలో వొడాఫోన్ ఐడియా మొత్తం సబ్స్క్రయిబర్స్ సంఖ్య 24 కోట్ల నుంచి 23.44 కోట్లకు తగ్గినప్పటికీ 4జీ యూజర్ల సంఖ్య 15 లక్షలు పెరిగి 12 కోట్లకు చేరింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం (లీజులకు చెల్లించాల్సినది కాకుండా) రూ. 2,20,320 కోట్లకు చేరింది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించిన మొత్తం రూ. 1,36,650 కోట్లు (ఇటీవల కొన్న స్పెక్ట్రం కోసం కట్టాల్సిన రూ. 17,260 కోట్లు సహా), సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 68,590 కోట్లు ఉన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ. 15,080 కోట్లు కట్టాలి. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు 0.6 శాతం పెరిగి రూ. 8.6 వద్ద ముగిసింది. -
అదానీ ట్రాన్స్మిషన్: 32 శాతం లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ దిగ్గజం అదానీ ట్రాన్స్మిషన్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 289 కోట్లు ఆర్జించింది. అయితే రూ. 138 కోట్ల ఫారెక్స్ నష్టాలు(విదేశీ రుణాలపై ఎంటూఎం సర్దుబాటు) ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో ఇవి రూ. 6 కోట్ల లాభంగా నమోదైనందున ఫలితాలు పోల్చిచూడతగదని వివరించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,675 కోట్ల నుంచి రూ. 3,377 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 223.3 కోట్ల యూనిట్ల విద్యుత్ను విక్రయించింది. గత క్యూ2లో 197.5 కోట్ల యూనిట్ల విద్యుత్ను మాత్రమే విక్రయించింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించింది. నేటి(2) నుంచి ట్రాన్స్మిషన్ బిజినెస్కు సీఈవోగా విమల్ దయాల్, పంపిణీ విభాగ సీఈవోగా కందర్ప్ పటేల్ను బోర్డు ఎంపిక చేసింది. అనిల్ సర్దానా కంపెనీ ఎండీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. -
మాక్రోటెక్ డెవలపర్స్కు రూ.933 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా బ్రాండ్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.933 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. తన బ్రిటిష్ అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణానికి సంబంధించి రూ.1,177 కోట్లు కేటాయింపులు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు దారితీసినట్టు సంస్థ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.223 కోట్లుగా ఉండడం గమనించాలి. రుణానికి కేటాయింపులు, ఫారెక్స్ ప్రభావాలను పక్కన పెట్టి చూస్తే నికర లాభం 28 శాతం పెరిగి రూ.367 కోట్లుగా ఉంటుందని మాక్రోటెక్ డెవలపర్స్ వివరించింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,137 కోట్ల నుంచి రూ.1,761 కోట్లకు పరిమితమైంది. బ్రిటన్లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గాను లోధా డెవలపర్స్ యూకేకు గ్రూపు రుణాలు ఇవ్వాల్సి వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుతమున్న భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తదితర పరిస్థితులు తమ రుణాలపై ప్రభావం చూపించినట్టు వివరించింది. ఎన్సీడీల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
Bharat Jodo Yatra: చిన్న వ్యాపారాలపై బీజేపీ దెబ్బ: రాహుల్
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి భారత్ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది. -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్లో చమురు పీఎస్యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే.