military
-
రణరంగ రక్షణ కవచాలు
గచ్చిబౌలి : క్షిపణుల నుంచి డ్రోన్ల వరకు.. అత్యాధునిక పారాచ్యూట్ల నుంచి యుద్ధరంగంలో ఊహించని ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడే పరికరాల వరకు.. ‘విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్–2025’లో రక్షణ రంగానికి చెందిన అనేక అరుదైన ఆయుధాలు, పరికరాలు కొలువుదీరాయి. పేరెన్నికగన్న సంస్థలతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వస్తువులు కూడా ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. వాటిల్లో కొన్ని ఇవీ.. యాంటీ – జీ సూట్, ఓ బాక్స్ యుద్ధ విమానాలు నడిపే ఫైటర్స్ కోసం యాంటీ –జీ సూట్ను తయారుచేశారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. ఈ సూట్ వేసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీని ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఫైటర్ జెట్లో కాక్ పిట్కు ఆక్సిజన్ బాక్స్ (ఓ బాక్స్)ను కనెక్ట్ చేసి ఉంచుతారు. ఎత్తుకు వెళ్లిన తరువాత ఫైటర్కు దీని ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరు డీఆర్డీఎల్ తయారు చేసింది. దీని ఖరీదు రూ.3 కోట్లు. తేజస్ ఫైటర్ జెట్లో దీన్ని వాడతారు. అటానమస్ అండర్ వాటర్ వెహికల్..: స్వయంచాలిత జలాంతర్గత వాహనం (అటానమస్ అండర్ వాటర్ వెహికల్)ను కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. సముద్ర గర్భంలోని శత్రు సబ్ మెరైన్లతోపాటు బాంబు (మైన్స్)లను ఇది తనంత తానుగా గుర్తిస్తుంది. దీనిని మనుషులు నడపాల్సిన అవసరం లేదు. వైజాగ్కు చెందిన ఎన్ఎస్టీఎల్ దీనిని తయారు చేసింది.ఆకాశ్ వెపన్ సిస్టమ్ శత్రుదేశాల డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, క్షిపణులను గాల్లోనే తునాతునకలు చేయగల సర్ఫేస్ టు ఎయిర్ ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డీఆర్డీఎల్ రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల ఎత్తులో వెళ్లే యుద్ధ విమానాలను పేల్చి వేయగలదు. ఫిక్స్డ్ వింగ్ యూఏవీ: ఫిక్స్డ్ వింగ్ అన్మ్యాన్డ్ ఆటోమేటిక్ వెహికల్ ద్వారా శత్రు శిబిరాలపై బాంబులు వేయవచ్చు. స్వయంచాలితంగా వెళ్లే ఈ వాహనం.. బాంబు వేసిన వెంటనే కాలిపోతుంది. కేవలం రూ.లక్ష ఖర్చుతో తయారుచేసిన ఈ యూఏవీ బరువు 5 కిలోలు. బ్యాటరీల సçహాయంతో గంట సేపు ప్రయాణించగలదు. దీనిని ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న అనన్య, శివనాగలక్షి్మ, భాను ప్రకా‹Ù, తేజస్విని దీనిని రూపొందించారు. మల్టీ కంబాట్ పారాచ్యూట్ సిస్టమ్..: మల్టీ కంబాట్ పారాచ్యూట్ సిస్టమ్ (ఎంసీపీఎస్)ను యుద్ధ విమానాలు నడిపే ఫైటర్లు వాడతారు. దీని ఖరీదు దాదాపు రూ.40 లక్షలు. 30 వేల అడుగుల ఎత్తు నుంచి దీని ద్వారా కిందికి దూకవచ్చు. దాదాపు 40 కిలో మీటర్ల దూరం ఎగురుతూ వెళ్లవచ్చు. దీనిని బెంగళూరు డీఆర్డీఏ తయారు చేసింది. మల్టీపర్పస్ అగ్రికల్చర్ వెహికల్..ఎగ్జిబిషన్లో ఆకట్టుకున్న మరో వాహనం సోలార్ బేస్డ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ వెహికల్. దీని సాయంతో పంటలకు నీళ్లు, రసాయనాలు పిచికారీ చేయవచ్చు. వాహనంపైనే సోలార్ ప్యానల్స్ ఉండటంతో ఇతర ఇంధనాలు దీనికి అవసరం ఉండదు. కేవలం రూ.6,500 ఖర్చుతో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు తౌఫీక్, సంపత్, రచన, ఇషీ, చంటి, తరుణ్, కీర్తన దీనిని రూపొందించారు. -
దటీజ్ ‘C-17A గ్లోబ్ మాస్టర్’!
అక్రమ వలసదారులైన 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పిపంపేందుకు అమెరికా పెట్టిన ఖర్చు రూ.8.74 కోట్లు. ఒక్కొక్కరికి అయిన వ్యయం రూ.8.40,670. అంటే దాదాపు ఎనిమిదన్నర లక్షలు. ఇందుకోసం అమెరికా వినియోగించిన భారీ మిలిటరీ విమానం... C-17A గ్లోబ్ మాస్టర్ III. సైనికులు, వాహనాలు, సరకులను తరలించేందుకు వీలుగా ఈ విమానాన్ని డిజైన్ చేశారు. అమెరికా వాయుసేనకు ఈ విమానాలు పెద్ద బలం, బలగం.ఇవి 1995 నుంచి సేవలందిస్తున్నాయి. పౌర విమానయానంతో పోలిస్తే సైనిక విమానాల ప్రయాణ వ్యయం అధికంగా ఉంటుంది. C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి లేచిందంటే గంటకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చార్టర్ ఫ్లైట్ విషయంలో గంటకు అయ్యే వ్యయం రూ.7.5 లక్షలే. గగనతలానికి సంబంధించి ఒక్కో దేశానికి ఒక్కోలా భద్రతా ఏర్పాట్లు, వైమానిక విధానాలు ఉంటుంటాయి. అందుకే వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణించే గగనతల దారుల్లో కాకుండా మిలిటరీ విమానాలు వేరే మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.సాధారణ విమానాశ్రయాల్లో కాకుండా సైనిక స్థావరాల్లోనే మిలిటరీ విమానాలు ఇంధనం నింపుకుంటాయి. 104 మంది భారతీయులతో కాలిఫోర్నియాలో బయల్దేరిన C-17A గ్లోబ్ మాస్టర్... అటుతిరిగి, ఇటుతిరిగి మధ్యమధ్యలో ఆగుతూ సుమారు 43 గంటలు ప్రయాణించి చివరికి పంజాబ్ చేరింది. ఈ మిషన్ ఖర్చు మిలియన్ డాలర్లను మించిందని మరో అంచనా. అలా చూస్తే ఒక్కో భారతీయుడి తిరుగుటపాకు అమెరికాకు అయిన వ్యయం 10 వేల డాలర్లు. సాధారణ టికెట్ రేట్లను పరిశీలిస్తే... శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీకి వన్ వే కమర్షియల్ ఫ్లైట్ ఎకానమీ తరగతిలో రూ. 43,734, బిజినెస్ క్లాస్ అయితే రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదీ సంగతి!::జమ్ముల శ్రీకాంత్(Credit: Hindustan Times) -
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంవేళ ఖఢ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్
-
పటిష్ట స్థితిలో భారత్..
న్యూఢిల్లీ: సైనిక శక్తి, రాజకీయ సుస్థిరత, బలమైన ప్రజాస్వామ్యం తదితర అంశాల దన్నుతో అంతర్జాతీయంగా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని, మరింతగా ఎదిగే సత్తా దేశానికి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అనిశ్చితులను.. భారత్ అవకాశాలుగా మల్చుకోవచ్చని మహీంద్రా చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగంగా మారొచ్చని నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు ఇచి్చన సందేశంలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువగా ఉంటుందని మహీంద్రా తెలిపారు. తమ గ్రూప్ అధిగమించిన కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ .. అత్యంత విలువైన వాహనాల తయారీ దిగ్గజంగా ప్రపంచంలోనే 11వ స్థానానికి చేరడం, ఎలక్ట్రిక్ వాహనాలు అంచనాలకు మించి విజయవంతం కావడం గర్వించతగ్గ విషయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూప్లోని ఇతర కంపెనీల పనితీరును కూడా ప్రశంసించారు. ఆకాంక్షలను సాకారం చేసుకోగలమనే స్ఫూర్తితో భవిష్యత్తుపై ఆశావహంగా ఉండాలని సూచించారు. -
చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు
-
సిరియా సంక్షోభం..ఆర్మీకి ట్రంప్ కీలక సూచన
వాషింగ్టన్:సిరియా సంక్షోభంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారానికి అమెరికా సైన్యం దూరంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్లో తాజాగా ఓ పోస్టు చేశారు.సిరియా అధ్యక్షుడు అసద్ అమెరికా సాయానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. తాజాగా సిరియాలో సంకక్షోభం ముదిరి రెబెల్స్ అక్కడి కీలక హోమ్స్ నగరాన్ని ఆక్రమించారు. ఈ పరిణామంతో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అసద్కు ఇరాన్, రష్యా మద్దతుండడం గమనార్హం.అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా సిరియా అంతర్యుద్ధంపై స్పందించారు. తమ ప్రభుత్వం సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శనివారం(డిసెంబర్ 8)నోట్రె డ్యామ్ చర్చి ప్రారంభానికి ప్యారిస్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సిరియాలో కల్లోలం దేశం వీడిన అధ్యక్షుడు -
ఇరాన్కు అమెరికా హెచ్చరిక.. పశ్చిమాసియాలో సైనిక విస్తరణ
న్యూయార్క్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు హెచ్చరికగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ డెస్ట్రాయర్లు, దీర్ఘ-శ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లతో సహా అదనపు సైనిక పరికరాలు మోహరిస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇదొక హెచ్చరిక అని పేర్కొంది."ఇరాన్.. ఆదేశ అనుబంధ మిలిటెంట్ గ్రూపులను అమెరికన్ సిబ్బంది లేదా మిత్రదేశాల ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తే అమెరికా సైతం మా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అదనపు సైనిక, రక్షణ వనరులను విస్తరిస్తాం. గత నెల చివరిలో మోహరించిన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా అమెరికా సైన్యం నిర్వహిస్తుంది. అదనపు సైన్యం.. రాబోయే నెలల్లో రావడం మొదలవుతుంది’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్టోబరు 26న ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడింది. కీలకమైన సైనిక, ఆయిల్ స్థావరాల మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరాన్.. ఇజ్రాయెల్పై రెండుసార్లు మిసైల్స్తో దాడులకు దిగింది. ఏప్రిల్లో డమాస్కస్లోని తన కాన్సులేట్పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ దాడి చేసింది. తమ దేశం మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూప్ నేతల హత్యకు ప్రతిస్పందనగా అక్టోబర్లో మరోసారి ఇజ్రాయెల్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్.. ఇరాన్ ప్రతీకార దాడి చేస్తుందని అనుమానం -
భారత డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్లోని లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
యుద్ధం వస్తే.. ఏ దేశం ‘పవర్’ ఎంత?
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.మిడిల్ ఈస్ట్లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?టర్కీ..మిడిల్ఈస్ట్లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.ఇరాన్..పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ఈస్ట్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.ఈజిప్టు..పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.ఇజ్రాయెల్..ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.సౌదీఅరేబియా..బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.ఇరాక్..పవర్ ఇండెక్స్లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.సిరియా..పవర్ ఇండెక్స్లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.ఖతార్..ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్లో తొమ్మిదో స్థానంలో ఉంది.కువైట్..మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్లో కువైట్ పదవ ప్లేస్లో ఉంది.ఇండెక్స్లో ఈ దేశం స్కోరు 1.42611.అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్పై ఇజ్రాయెల్ దాడి చేసింది.ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. శనివారం ఇజ్రాయెల్ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bangladesh: షేక్ హసీనా తండ్రి విషయంలోనూ..
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి సైన్యం ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.బంగ్లాదేశ్లో ఈ విధమైన తిరుగుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 1975లో కూడా ఇదేవిధంగా జరిగింది. నాటి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా తండ్రి, ఆమె సోదరులు హతమయ్యారు. అయితే షేక్ హసీనా ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె బంగ్లాదేశ్కు దూరంగా ఇతర దేశాలలో సుమారు ఆరేళ్ల పాటు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె భారతదేశంలో కూడా చాలా కాలంపాటు ఉన్నారు.అది 1975వ సంవత్సరం.. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్మీ యూనిట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. కొంతమంది సాయుధులు షేక్ హసీనా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులను, సోదరులను దారుణంగా హత్యచేశారు. అయితే ఆ సమయంలో షేక్ హసీనా తన భర్త వాజిద్ మియాన్, చెల్లెలు పాటు యూరప్లో ఉన్నందున ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.ఈ ఘటన అనంతరం షేక్ హసీనా కొంతకాలం జర్మనీలో ఉండి భారత్కు వచ్చారు. నాడు భారతదేశంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనా 1981లో బంగ్లాదేశ్కు తిరిగి చేరుకున్నారు. ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. దీని తరువాత షేక్ హసీనా 1986 సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే 1996 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2001 వరకూ ప్రధాని పదవి చేపట్టారు. అలాగే 2009 నుంచి 2004 వరకూ కూడా షేక్ హసీనా ప్రధాని పదవిలో ఉన్నారు. -
చైనా కవ్వింపు చర్య.. భారత్ భూభాగంలో వంతెన నిర్మాణం
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024 ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది. -
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
పాక్ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
చైనా గత మూడేళ్లుగా పాకిస్తాన్కు రక్షణ సహకారాన్ని అందిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్కు రక్షణ సహాయాన్ని కల్పిస్తోంది. బంకర్ల నిర్మాణానికి, మానవరహిత యుద్ధ వైమానిక వాహనాల విస్తరణకు సాయం చేస్తోంది. ఇంతేకాకుండా ఎల్ఓసీలో రహస్య కమ్యూనికేషన్ టవర్ర్లను ఏర్పాటు చేయడం, భూగర్భ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేయడంలోనూ పాక్కు చైనా సహాయం చేస్తోంది.చైనాకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్లైన ‘జేవై’, జీహెచ్ఆర్ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎల్ఓసీలో ప్రయోగాలు చేస్తోంది. అలాగే పాక్ సైన్య, వైమానిక రక్షణ విభాగాలకు కీలకమైన ఇంటెలిజెన్స్ మద్దతును చైనా అందిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 155 మి.మీ. హోవిట్జర్ గన్ ఎస్హెచ్-15 ఉనికి నియంత్రణ రేఖ వెంబడిగల వివిధ ప్రదేశాలలో కనిపించింది.చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) సీనియర్ అధికారుల ఉనికి ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ, చైనా సైనికులు, ఇంజనీర్లు భూగర్భ బంకర్ల నిర్మాణంతో సహా నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారనడానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లిపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మిస్తున్నారని, ఇది కారకోరం హైవేకి అనుసంధానించే ఆల్-వెదర్ రోడ్డు నిర్మాణాన్ని సూచిస్తున్నదని కొందరు అధికారులు తెలిపారు.కారకోరం హైవే ద్వారా పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవుతో చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసమే ప్రతిష్టాత్మక 46 బిలియన్ల డాలర్ల సీపీఈసీ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తోంది. 2007లో చైనాకు చెందిన ఒక టెలికం కంపెనీ పాక్కు చెందిన ఒక టెలికం కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో చైనా మొబైల్ కంపెనీ పాకిస్తాన్లో తన సేవలను అందిస్తోంది.చైనా ఇటీవలి కాలంలో పాక్కు అందిస్తున్న సహకారంపై భారత సైన్యం ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నప్పటికీ, ఈ పరిణామాలపై నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలలో చైనా కార్యకలాపాలపై భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపధ్యంలో భారతదేశం అప్రమత్తంగా ఉందని, సరిహద్దు ఆవల నుండి ఏదైనా ముప్పు ఏర్పడితే, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్య అధికారులు తెలిపారు. -
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్షాప్లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్కు అవార్డు బహూకరించనున్నారు. -
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. సైన్యంలోని డాగ్ యూనిట్లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. -
మాల్దీవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు!
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం ‘భారత సైన్యం ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. కానీ దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది (విపక్షాలు) తప్పుడు విషయాలను వ్యాప్తిచేస్తున్నారు. కొత్త ట్విస్ట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ మిలిటరీ ఇక్కడి నుంచి వెళ్లడం లేదని.. వారు తమ యూనిఫామ్లను పౌర దుస్తులుగా మార్చుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవు. యూనిఫామ్లో అయినా లేదా సివిల్ దుస్తుల్లోనూ ఎవరిని ఉండనివ్వం’ అని స్పష్టం చేశారు. చదవండి: Melbourne: ‘డ్రాగన్’కు చెక్..! సింగపూర్ కీలక నిర్ణయం మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవులు విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఢిల్లీలో ఫిబ్రవరి 2న ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే మాల్దీవుల్లో బాధ్యతలు స్వీకరించడానికి భారత సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. -
Maldives Row: మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోండి!
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు. తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు. అయితే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్ మును మహవర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు మును మహవర్ తెలిపారు. ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. చదవండి: Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్కు ఫేవర్! -
భారత దౌత్యనీతికి సవాళ్లు
ఇరుదేశాల మిలిటరీ సంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనా తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు గతేడాది కొన్ని అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, రష్యాతో మన సంబంధాలు గాఢమైనవి. పైగా... తాజాగా భారత్, రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన భావన కలిగింది. రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు, సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్పై కచ్చితంగా ఉంటుంది. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడి ఉంది. కానీ, అగ్రదేశాల సరసన నిలవాలన్న భారత ఆకాంక్ష నెరవేరాలంటే దేశ సైనిక సామర్థ్యం ఇతరులపై ఆధారపడేలా ఉండరాదు. భారతదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో 2024 లోకి అడుగుపెట్టింది. కొత్త ఏడాది తొలి వారంలోనే ఆదిత్య–ఎల్1 విజయవంతంగా సూర్యుడి హాలో కక్ష్యలో ప్రవేశించడం, ఉత్తర అరేబియా సముద్రంలో పైరేట్లను తరిమికొట్టేందుకు భారత నేవీ నాటకీయమైన తీరులో ఆపరేషన్లు చేపట్టడం, అన్నీ శుభసూచనలే. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరమైన రీతిలో దాదాపు 7.3 శాతం వరకూ ఉండవచ్చునని జాతీయ గణాంక శాఖ ప్రకటించిన విషయమూ సంతోషకరమైన సమాచారమే. అన్నింటికీ మించి భారత్ విజయాలను గుర్తిస్తూ, చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక కథనమూ ప్రచురించింది. భారత్ చాలా వేగంగా సామాజిక, ఆర్థిక వృద్ధి సాధిస్తోందని ఇందులో అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మక శక్తిగా భారత్ ఎదుగుతోందని కొనియాడింది. రెండూ ముఖ్యమే! అయితే, ఈ విజయాలను ఆస్వాదించే క్రమంలో మనం గత ఏడాది ఆఖరులో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల గురించి మరచిపోరాదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా... ప్రాంతీయంగానూ ఇతర దేశాలతో మన సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ముఖ్యమైన సంఘటనలు అవి. వ్యూహాత్మక లక్ష్యాలను కాపాడుకోవడంలో, సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సత్తాను ప్రశ్నించే అవకాశమూ వీటికి ఉంది. భారత విదేశీ వ్యవహారాల విధానాన్ని స్థూలంగా పరిశీలిస్తే... అమెరికాకు దగ్గరవడం... అదే సమయంలో రష్యాకు నెమ్మదిగా దూరంగా జరగడం అని అనిపిస్తుంది. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ మౌనం వహించడం ఈ భావనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే... భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడిఉందీ అని. ఇరు దేశాలూ మన మిలిటరీకి అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీలు అందిస్తున్నాయి. ఈ పరిమితుల దృష్ట్యానే భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వ్యక్తం చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా పొరుగుదేశం చైనాను దృష్టిలో ఉంచుకున్నప్పుడు. అయితే 2023 చివరి నాటికి అంతర్జాతీయ వ్యవహారాల్లో పరిస్థితులు కొంచెం వేగంగా మారిపోయాయి. వాటి ప్రభావం ఈ ఏడాది మనపై కచ్చితంగా పడనుంది. నవంబరులో అమెరికా అధ్య క్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య శాన్ఫ్రాన్సిస్కోలో ‘ఏపీఈసీ’ సమావేశాల్లో కీలకమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన కొద్దిగా తొలగిన సూచనలు కనిపించాయి. ఇక డిసెంబరు చివరివారంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా వెళ్లి, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లావరోవ్తో సమావేశమయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం మాదిరిగానే రష్యాతో భారత్ తన సంబంధా లను దృఢతరం చేసుకునేందుకు నిబద్ధమై ఉందని జైశంకర్ రష్యా మంత్రి సెర్గీకి నొక్కి చెప్పినట్లు వార్తలొచ్చాయి. సంక్లిష్టం... బహుముఖం... రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు... చాలా సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్పై కచ్చితంగాఉంటుంది. ప్రపంచ స్థాయిలో మన ప్రస్థానాన్ని, దిశను మార్చేయగల శక్తి వీటి సొంతం. ఈ సంబంధాల్లోనూ అమెరికా– చైనా మధ్య ఉన్నవి మరింత కీలకం. బైడెన్, జిన్పింగ్ ఇటీవలి శిఖరాగ్ర సమావేశంసందర్భంగా కొన్ని అంశాలపై స్థూలంగా ఏకాభిప్రాయానికి రాగలి గారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇందుకు అడ్డు కాకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇరుదేశాల మిలిటరీల మధ్యసంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనారెండూ తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా యుద్ధాలకు సమీప భవిష్యత్తులో ఒక అర్థవంతమైన పరిష్కారం లభించగలదన్న ఆశ సమీప భవి ష్యత్తులో కనబడని నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశమిది. స్థానిక పరిస్థితులు, ఉన్న పరిమితు లను దృష్టిలో ఉంచుకుని ఇరువురు నేతలు తమ మధ్య అంతరాలను పక్కనబెట్టి ఈ రకమైన రాజీకి వచ్చి ఉండవచ్చు. చైనా–అమెరికా మధ్య మిలిటరీ స్థాయిలో యుద్ధం లేదా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నా దాని విపరిణామాలు తీవ్రంగా ఉండేవి. కాబట్టి తాత్కాలికంగానైనా ఈ ఉపశమనం దక్కడం ముఖ్యమైన విషయం అవుతుంది. తైవాన్ విషయంలో ఇరు దేశాలు మెత్తపడిందేమీ లేకున్నా భారత్ దృష్టిలో మాత్రం చైనా–అమెరికా మధ్య వైరం కొంతైనా తగ్గడం ఎంతో కీలకమైంది. సొంతంగా ఎదిగినప్పుడే... అమెరికా ఇండో–పసఫిక్ వ్యూహంలో భారత్ ప్రధాన భాగస్వామి అన్న అంచనా ఉంది. మరి చైనా– అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడటం భారత్కు ఏమైనా నష్టం చేకూరుస్తుందా? అవకాశమైతే ఉంది. పైగా ద్వైపాక్షిక స్థాయిలో ఇరు దేశాల మధ్య గత ఏడాది చివరిలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ పౌరుడు ఒకరిని చంపేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించింది. ఈ కోణంలో చూస్తే భారత్ మీద అమెరికాకు కొంత అసంతృప్తి ఉన్నట్లు స్పష్టమవుతుంది. 1970లలో హెన్రీ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండగా, అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా భారత్, యునైటెడ్ సోవియట్ రిపబ్లిక్ మధ్య బంధాలు గట్టిపడేలా చేసింది. సోవియట్ వారసురాలిగా కొనసాగిన రష్యాతో ఆ సంబంధాలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. భారత త్రివిధ దళాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారింది. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు 2023లో కొన్ని అపోహలైతే ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా కూడా భారత్, రష్యా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ఒకటి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తోంది. అలాగే అగ్రరాజ్యాల సరసన నిలవాలని కూడా ఆశిస్తోంది. అయితే మిలిటరీ విషయాల్లో విదేశాలపై ఆధారపడుతూంటే భారత్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కష్టం. అమెరికా, రష్యా, చైనా తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించినా ద్వైపాక్షిక స్థాయిలో దగ్గరి సంబంధాలు కలిగి ఉండటం మనకు అవసరం. మన రాజకీయ, దౌత్య చతురతకు ఇది నిజంగానే ఒక సవాలు! వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - కమడోర్ సి. ఉదయ భాస్కర్ -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
ఉక్రెయిన్లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
జమ్మూలో భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్ల కాల్పులు
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. -
అగ్నివీర్ అమృత్పాల్ అంత్యక్రియలపై వివాదం.. ఆర్మీ క్లారిటీ
ఢిల్లీ: అగ్నివీర్ సైనికుడు అమృత్పాల్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రేగుతోంది. అగ్నివీర్ సైనికుని అంత్యక్రియల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీ స్పందించింది. అగ్నిపథ్ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి భేదం లేదని స్పష్టం చేసింది. ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రాదాయం లేదని వెల్లడించింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా.. అగ్నిపథ్ సైనికుడు అమృత్పాల్ సింగ్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోడంపై ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్లో రాజకీయ పార్టీలు సైన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను అభ్యర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని అధికార పార్టీ ఆప్ కూడా ప్రశ్నించింది. దీంతో ఆదివారం రాత్రి ఆర్మీ ఓ ప్రకటన వెలువరించింది. అమృత్ పాల్ సింగ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అంత్యక్రియల అంశంపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించింది. సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆర్మీ విధానాల ప్రకారమే స్వస్థలానికి చేర్చామని తెలిపింది. 1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఆత్మహత్య వంటి మరణాలకు సైనిక లాంఛనాలు ఉండబోవని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఈ విధానాలను పాటిస్తున్నామని పేర్కొంది. 2001 నుంచి ప్రతి ఏడాది సరాసరి 100-140 సైనికులు ఆత్మహత్యలతో మరణిస్తున్నారని తెలిపిన ఆర్మీ.. ఈ కేసుల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని వెల్లడించింది. నియమాల ప్రకారం అంత్యక్రియల ఖర్చులతో పాటు అందాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఆర్మీలో ఎలాంటి వివక్ష ఉండబోదని, ప్రోటోకాల్ ప్రకారమే అంతా జరుగుతుందని ప్రకటనలో వెల్లడించింది. అన్ని వర్గాల మద్దతును ఆర్మీ గౌరవిస్తూ ప్రోటోకాల్స్ను పాటిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం... సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. ► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది. ► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి! ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్డోమ్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం... ► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది. ► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది. ► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది. ► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది. ► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!! ► అమెరికా తన 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయెల్కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! ► పదేళ్లలో ఇజ్రాయెల్కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! రక్షణపై భారీ వ్యయం చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది. ► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్ప్రీత్సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్లోని మల్లాన్పూర్కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
ఆఫ్రికాలోని నైగర్లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీవ్ర ఆగ్రహం నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. What's Happening in Niger? Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on? - Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6 — Brian Krassenstein (@krassenstein) August 1, 2023 అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ను అతని ప్యాలెస్లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్లో అమెరికా ఎయిర్ బేస్కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మా ఆర్మీకి శిక్షణ ఇవ్వండి
మిన్స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్లోని కీలక మిలటరీ బేస్నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
పాతిక వేలమంది చావడానికి రెడీ.. మాస్కోలో హైఅలర్ట్
మాస్కో: రష్యాలో తిరుగుబాటు జెండా ఎగిరింది. కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అరెస్ట్కు ఆదేశాలు జారీ చేశాయి. క్రెమ్లిన్ ఆయనపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ పరిణామంతో చిర్రెత్తిపోయిన ప్రిగోజిన్.. రష్యా సైన్యంపై ప్రతిదాడికి ఆదేశాలిచ్చాడు. అంతేకాదు రష్యాలో వినాశనం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మా సైన్యం పాతికవేల మంది. అంతా చావడానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా కోసం ఏమైనా చేస్తాం. మేమింకా ముందుకు వెళ్తాం. అడ్డొచ్చిన ప్రతీది నాశనం చేసి ముగిస్తాం అంటూ ప్రిగోజిన్ ఆడియో సందేశం పంపించాడు. అంతేకాదు.. ఇప్పటికే వార్నర్ గ్రూప్ రోస్తోవ్ రీజియన్లోకి ప్రవేశించిందంటూ ప్రకటించారాయన. మార్చ్గా పలు నగరాల వైపు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో.. మాస్కోతో పాటు పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహిత వర్గమైన ఈ వాగ్నర్ ప్రైవేటు సైన్యం గతంలో తమతో కలిసి ఉక్రెయిన్ పై పోరాడటంలో సహకరించింది. కానీ ఇప్పుడు వారితో వైరం రష్యా సైన్యానికి పెను ప్రమాదమే తెచ్చిపెట్టింది. రష్యా మిలిటరీ తన గ్రూపును లక్ష్యంగా చేసుకుని క్షిపణుల దాడకి దిగుతోందని.. ప్రతిఘటన కొనసాగుతుందని యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించాడు. పుతిన్ శత్రువైన మిఖాయిల్ ఖోదోర్ కోవ్స్కీ కూడా యెవనిన్ ప్రిగోజిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా ప్రజానీకానికి పిలుపునివ్వడం విశేషం యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయం తోపాటు ఎఫ్.ఎస్.బి డిపార్ట్మెంటును, ఒక పోలీస్ డిపార్ట్మెంటును కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు లోకల్ చానళ్లు ప్రసారం చేస్తున్నప్పటికీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. 📢Chronicles of the military coup in the Russian Federation.📢 By today's morning, Prigozhin announced that he had taken control of the city of the regional center - the city of Rostov.#Europe #Russia #RussiaUkraineWar #RussiaIsLosing #Russland pic.twitter.com/dI95o18GPG — Denis Jankauskas (@artsenvacatures) June 24, 2023 రోస్తోవ్లోకి వార్నర్ గ్రూప్ ప్రవేశించిందని ప్రిగోజిన్ ప్రకటించినప్పటికీ.. సైన్యం దానిని ధృవీకరించలేదు. కానీ తిరుగుబాటు సైన్యం రాక గురించిన సమాచారమందగానే రష్యా సైన్యం ప్రజలను అప్రమత్తం చేసిన ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు కదలవద్దని హెచ్చరించింది. మాస్కో నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను తీసుకుని రక్షణ వలయాన్ని పటిష్టం చేయనున్నామని తెలిపారు. లిపెట్స్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలను, స్థానిక భద్రతా దళాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు లిపెట్స్క్ గవర్నర్ ఇగర్ అర్థమొనోవ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. పుతిన్కు బాగా క్లోజ్.. ► యెవ్జెనీ ప్రిగోజిన్. 1961 రష్యాలో జన్మించారు. 1990 నుంచి పుతిన్తో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో ప్రిగోజిన్ రాజకీయ చర్చకు సైతం దారి తీశారు. ► పొలిటికో ప్రకారం.. ప్రిగోజిన్, పుతిన్ ఒకే ఊరివాళ్లు(అప్పుడు లెనిన్గ్రాడ్.. ఇప్పుడు సెయింట్ పీటర్బర్గ్). 18 ఏళ్ల వయసులోనే క్రిమినల్గా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత దొంగతనం కేసులోనూ జైలుపాలయ్యాడు. ఆపై 13 ఏళ్లకు దోపిడీ కేసులో 13 ఏళ్ల జైలు శిక్షపడి.. అందులో 9 ఏళ్లపాటు శిక్ష అనుభవించాడు. ► జైలు నుంచి బయటకు వచ్చాక హాడ్డాగ్స్ అమ్ముతూ జీవనం కొనసాగించాడు. అటుపై సెయింట్ పీటర్బర్గ్లో ఖరీదైన రెస్టారెంట్లను తెరిచాడు. ► పుతిన్ చెఫ్గా ప్రిగోజిన్కి ఓ పేరుంది. రెస్టారెంట్ బిజినెస్ కాటరింగ్ ఆర్డర్స్తో ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యాడు ప్రిగోజిన్. ఆ తర్వాత మీడియా రంగం, ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించాడతను. ► ఈ ఏడాది జనవరిలో 62 ఏళ్ల ప్రిగోజిన్.. రష్యా సైన్యానికి తోడుగా ప్రైవేట్ సైన్యం వాగ్నర్తో ఉక్రెయిన్ యుద్ధంలో భాగం పంచుకుంటూ వస్తున్నాడు. ఉక్రెయిన్లోనే కాదు.. ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, లిబియా, మాలిలోనూ వాగ్నర్ గ్రూప్ దురాగతాలు కొనసాగుతున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇదీ చదవండి: నూతన రంగాల్లోనూ కలిసి ముందుకు -
ప్రపంచంలోని టాప్ 10 మిలిటరీ ఫోర్సెస్
-
ఆధునిక ప్రపంచంలో 'ఏఐ' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!
Artificial Intelligence: ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా తయారు చేస్తున్నారు. మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లో చేస్తాయని 1965లోనే సైంటిస్ట్ & నోబెల్ గ్రహీత 'హెర్బర్ట్ సైమన్' అన్నాడు. నేడు అదే పరిస్థితి మొదలైందా అని తలపిస్తోంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మిలటరీ రంగం వరకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది ఈ రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుందా? లేదా చీకటి భవిష్యత్తులోకి తీసుకెళుతుందా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్య సంరక్షణ గతంలో వైద్య సంరక్షణలో మనుషుల పాత్ర ఎక్కువగా ఉండేది. ఏదైనా ఆపరేషన్ వంటివి చేయాలంటే ఎక్కువ మంది అవసరం పడేది. అయితే ఈ రోజుల్లో MRI స్కాన్స్, X-రేస్ వంటి వాటితో ఎక్కడ ప్రమాదముంది అని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇవన్నీ వైద్యరంగాన్ని మరింత సులభతరం చేశాయి. స్మార్ట్ఫోన్ ద్వారా డిమెన్షియా నిర్ధారణపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్ మనిషి రోజు వారీ కదలికలను కూడా చెప్పేస్తున్నాయి. అయితే ఒక రోగిని ఒక గది నుంచి మరో గదికి తరలించాలంటే ఖచ్చితంగా మనిషి అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ ప్రమేయం లేకుండా అనుకున్న విజయం సాధించే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాగిన్ చేయవచ్చు, రోగికి సంబంధించిన రోగాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ తరువాత దాన్ని ఒక వైద్యుడే పూర్తి చేయాలి. మనిషి ప్రమేయం లేకుండా AI మాత్రమే ఏమి సాధించలేదు. అదే సమయంలో మనిషి చేయాల్సిన పని మరింత వేగవంతం కావడానికి 'ఏఐ' చాలా ఉపయోగపడుతుంది. విద్య ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో బోధించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ప్రొఫెసర్ చెప్పే క్లాస్ ఆటోమేషన్ చెబితే భిన్నంగా ఉంటుంది. తరగతిలో సమయాన్ని బట్టి ఏది ఎలా చెప్పాలో ఒక గురువు మాత్రమే నిర్ణయిస్తాడు. కానీ ఆటోమేషన్ తనకు ఇచ్చిన క్లాస్ పూర్తి చేసి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఉపయోగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనిషి భావాన్ని, భావోద్వేగాన్ని గ్రహించదు. కావున విద్యార్థులతో పరస్పర సంబంధం కోల్పోతుంది. ఆ సంబంధం కేవలం గురువు మాత్రమే పొందగలడు. కాల్ సెంటర్లు కాల్ సెంటర్లలో మాత్రమే AI తప్పకుండా చాలా ఉపయోగకరమైనదనే చెప్పాలి. ఎందుకంటే కాల్ సెంటర్లు తరచుగా ఒత్తిడితో నిండిన వాతావరణం కలిగి ఉంటాయి. ఇది అక్కడ పనిచేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థానంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది వాయిస్-టోన్ గుర్తింపును ఉపయోగించి సిబ్బంది, నిర్వాహకులు తమ కస్టమర్లు, కార్మికుల భావోద్వేగ స్థితిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది. (ఇదీ చదవండి: చాలా గర్వంగా ఉంది.. కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్) వ్యవసాయం ప్రస్తుతం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో కూడా ఆటోమేషన్ రాజయమేలుతున్నాయి. క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అండ్ తెగుళ్లు, వ్యాధి నిరోధకతలో AI ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రోబోటిక్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఏ పనైనా చేయడానికి ఉపయోగపడే ఈ టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవు. ఏ ట్రక్కు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రక్కులో ఏమి నింపాలి అనే విషయాలు అది అర్థం చేసుకున్నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా ఇది మాత్రమే ఏమి చేయలేదు. ఆలా జరిగితే తప్పకుండా ప్రమాదాలు సంభవిస్తాయి. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) మిలటరీ ఇక చివరగా మిలటరీ విభాగం విషయానికి వస్తే, AIలో సైనిక పెట్టుబడులు ఇప్పటికే చాలా పెట్టినట్లు తెలుస్తోంది. ఇది యుద్ధ భవిష్యత్తును నడిపిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. కానీ సెమీ అటానమస్ డ్రోన్లు, ట్యాంకులు, జలాంతర్గాములను ప్రవేశపెట్టినప్పటికీ, సాంకేతికత ఊహించిన దాని కంటే తక్కువగా ఉపయోగపడుతుంది. యుద్ధం వంటి వాటిలో ఈ టెక్నాలజీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ధైర్యం, దయ, కరుణ వంటి లక్షణాలు కేవలం సైనికులకు మాత్రమే ఉంటాయి. AI టెక్నాలజీకి అలాటివి ఉండవు. అయితే దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్యను తగ్గిస్తుంది. భవిష్యత్తులో మనిషి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ముందుకు వెళతాడు అనేది సమ్మతించాల్సిన విషయమే. -
పాక్ ఆర్మీపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక సంఘం కస్టడీ నుంచి విడుదలైన తర్వాత శనివారం దేశాన్ని ఉద్దేశించిన ప్రసంగంలో పాక్ ఆర్మీపై ఫైర్ అయ్యారు. తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ను అణిచివేసేందుకు సైనిక స్థాపన మొగ్గు చూపుతున్న తీరుపై ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ సైన్య చర్యలు ఇప్పటికే దేశాన్ని విపత్తు అంచుకు తీసుకువచ్చాయని చెప్పారు. ఇక ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తనని కపటుడని అన్న వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావిస్తూ..అలా మాట్లాడినందుకు సిగ్గపడాలి. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తెచ్చకున్నాను. మిలటరీకి చెందిన విభాగం ఐఎస్పీఆర్ ఎప్పుడూ ఇలాంటి మాటలు చెప్పలేదన్నారు. అయినా ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేసే హక్కు మీకెవరికిచ్చారు. నేను చేసినంతగా సైన్యానికి ఎవరూ హాని చేయలేదని చెప్పడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడూ ఆర్మీ ఇమేజ్ బాగుందా? ఇప్పుడా అని నిలదీశారు. పాకిస్తాన్లో అత్యంత అపఖ్యాతీ పాలైన అవినీతిపరులను అధికారంలోకి తీసుకవచ్చినప్పుడే ఆర్మీ విమర్శలపాలైంది. ప్రజలు ప్రస్తుతం ఆర్మీ పట్ల అత్యంత అసహనంగా ఉన్నారంటూ పాక్ ఆర్మీపై ఇమ్రాన్ఖాన్ పెద్ద ఎత్తున నిప్పులు చెరిగారు. తాను ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నందున ప్రజలు తనను విశ్వసిస్తున్నారని అన్నారు. సుప్రీం కోర్టు సైతం తాను నిజాయితీపరుడనని స్పష్టం చేసిందన్నారు. తన అరెస్టు సమయంలో పాక్ ఆర్మీ పీటీఐ కార్యకర్తలందర్నీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టిందన్నారు. ప్రభుత్వ పార్టీలు ఎన్నికలను కోరుకోవడంలేదని విమర్శించారు. ఎందుకంటే తాము పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామని వారికి బాగా తెలసు అంటూ విమర్శలు గుప్పించారు. అందువల్లే తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడి సైనిక స్థావరాలపై దాడి వంటి ప్లాన్లు చేశారని ఆరోపణలు చేశారు. ఈ రోజున తమ పార్టీ దారుణంగా అణిచివేతకు గురైందని , ఇలాటి తీవ్ర పరిణమాల వల్ల దేశం ఎటువైపు పయనిస్తుందో సైన్యం కాస్త ఆలోచించాలని సూచించారు. అలాగే తమ పార్టీ హింకు పాల్పడిన చరిత్ర కూడా లేదని నొక్కి చెప్పారు ఇమ్రాన్ ఖాన్. (చదవండి: ఇమ్రాన్ అరెస్ట్.. పాకిస్తాన్కు ఊహించని షాక్) -
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్..వాటిని పునరుద్ధరించమని యూఎస్కి విజ్క్షప్తి!
అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్ మిలటరీ ఫైనాన్సింగ్ సేల్స్ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో జరిగిన సెమినార్లో అమెరికాకు చెందిన పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్, ఫారిన్ మిలటరీ సేల్స్ను పునరుద్ధరించడం పాక్కి చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎలిజబెత్ హూర్ట్స్ సమస్యత్మకంగా మారిన పాక్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్. పాక్ ఐఎంఎఫ్తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు. కానీ పాక్ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్తో అంగీకరించిన సంస్కరణలను పాక్ ముందుగా అమలు చేయాలని యూఎస్ కోరింది. ఈ మేరకు పాక్ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్ రష్యా చమురు కోసం పాక్ తన మొదటి ఆర్డర్ ఇచ్చిందని కానీ యూఎస్తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్ అఫ్ఘనిస్తాన్లో సుస్థిరత తీసుకురావడంలో పాక్ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్, అఫ్ఘాన్లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్ పిలుపునిచ్చారు. (చదవండి: సూడాన్ నుంచి మరో 754 మంది రాక) -
సంక్షుభిత దేశంలో సంఘర్షణ
‘మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి వాటి కాళ్ళ కింద పడి నలిగిపోతుంద’ని ఆఫ్రికన్ సామెత. ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్లో పరిస్థితి ఇప్పుడదే. పైచేయి కోసం సైన్యానికీ, పారా మిలటరీ దళాలకూ మధ్య... ఆ రెంటికీ సారథ్యం వహిస్తున్న ఇద్దరు సైనిక జనరల్స్ మధ్య... నాలుగు రోజులుగా చెలరేగుతున్న హింసాకాండలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది గాయపడ్డారు. వీధుల్లో పడివున్నవారి వద్దకు వైద్యులు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల అసలు లెక్క ఇంకెన్ని రెట్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇళ్ళు, ఆస్పత్రులు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్ర యాలు – ఏవీ యుద్ధట్యాంకుల కాల్పులకు మినహాయింపు కాదు. లక్షల మంది ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంట్ లేక కష్టపడుతుంటే, మరోవైపు ఇళ్ళపై పడి దోచేస్తున్న దుఃస్థితి. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు రంగంలోకి దిగి, ‘బేషరతుగా శత్రుత్వాన్ని విడనాడాల’ని కోరాల్సి వచ్చింది. ఐరాస ప్రధాన కార్యదర్శి సైతం హింసకు స్వస్తి పలకండంటూ ఇరువర్గాల సైనికనేతలతో మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సహజ వనరుల సంపన్న దేశమైతేనేం, 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి సూడాన్లో నిత్యం ఏదో ఒక కుంపటి. ప్రజాపాలన ఏర్పడేందుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి. అనేకానేక ఆకస్మిక తిరుగుబాట్లు, పౌర కలహాల చరిత్ర. 1989 నాటి విద్రోహంతో దేశాధ్య క్షుడైన నియంత బషీర్ దీర్ఘకాలిక ప్రభుత్వం 2019 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనతో పడిపోయింది. ఆ మూడు దశాబ్దాల హింసాత్మక, నిరంకుశ, అవినీతి పాలన స్థానంలో స్వేచ్ఛా యుత, ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశ ఫలించలేదు. రెండేళ్ళకే, మధ్యంతర పౌరప్రభుత్వం నడు స్తుండగానే ఎన్నికలు జరగాల్సినవేళ 2021లో జనరల్ బుర్హాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఆనాటి నుంచి సదరు సైనిక జనరలే అసలుసిసలు పాలకుడిగా, సైన్యమే సూడాన్ను నడిపిస్తోంది. అలా సైన్యాధికారమే సాగేందుకు మహమ్మద్ హమ్దన్ దగలో అలియాస్ హెమెడ్తీ నేతృత్వంలోని పారా మిలటరీ బలగమైన ‘సత్వర మద్దతు దళాల’ (ఆర్ఎస్ఎఫ్) కూడా సూడాన్ ఆర్మీతో కలసి పనిచేస్తూ వచ్చింది. అయితే... కొంతకాలంగా సూడాన్ సైన్యానికీ, ‘ఆర్ఎస్ఎఫ్’కూ మధ్య పొసగడం లేదు. రెండేళ్ళ క్రితం చేతిలో చేయి వేసుకు నిలబడి, మధ్యంతర పౌరప్రభుత్వాన్ని పడదోసి, పాలనా పగ్గాలు చేపట్టిన సైనిక జనరల్స్ బుర్హాన్కూ, ఆయన డిప్యూటీ దగలోకూ మధ్య ఇప్పుడు అపనమ్మకం పెరిగింది. వారి ఆధిపత్య పోరు ఫలితమే సూడాన్లో తాజా సంక్షోభం. నియంత బషీర్ పదవీచ్యుతి అనంతర రాజకీయ అధికార బదలీలో భాగంగా అసలైతే ఈ 2023 చివరికి ఎన్నికలు జరపాలి. పౌర పాలనకు బాటలు వేస్తామంటూ సైనిక నేత జనరల్ బుర్హాన్ సైతం బాస చేశారు. అయితే, అధికారమంటే ఎవరికి తీపి కాదు! అందుకే, ఇటు సేనా నాయకుడు, అటు ‘ఆర్ఎస్ఎఫ్’ సారథి... ఎవరూ అధికారాన్ని వదులుకోదలుచుకోలేదు. పైచేయికై పరస్పరం ఢీ కొన్నారు. ఆర్ఎస్ఎఫ్ పారామిలటరీలను కూడా సూడాన్ ఆర్మీలోకి చేర్చుకొని, రెండేళ్ళలో పౌర సర్కార్ ఏర్పాటుచేయడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం హింసకు కారణం. ఆర్మీలో ఆర్ఎస్ ఎఫ్ను చేర్చుకుంటే తన పట్టు పోతుందని దగాలో భయం. పౌర ప్రభుత్వాన్ని మరో పదేళ్ళు జాగు చేయాలని ఆయన భావన. ఇది కడుపులో పెట్టుకొని, సైన్యం అనుమతి లేకనే వివిధ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ తన వాళ్ళను మోహరించడం మొదలెట్టింది. ఇది ఏప్రిల్ 15 నుంచి హింసాత్మకమైంది. నిజానికి, ఇవన్నీ ఉన్నట్టుండి జరిగినవి కానే కావు. సూడాన్ దేశ ఆర్థిక సంపదపై, అందులోనూ ప్రత్యేకించి బంగారు గనులపై నియంత్రణ కోసం ఆర్ఎస్ఎఫ్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అలా ఇరువర్గాల మధ్య పెరిగిన కుతకుతలు ఇక్కడికి దారి తీశాయి. దీర్ఘకాలం దేశాధ్యక్షుడైన నియంత బషీరే కాదు... 2000ల నాటికి జంజవీద్ అనే తీవ్రవాద సంస్థ సారథిగా మొదలై ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ అధినేత అయిన దగాలో, ప్రస్తుత సైనిక నేత బుర్హాన్... అంతా ఒకే తాను గుడ్డలు. అందరూ మానవ హక్కులను కాలరాసినవారే. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినవారే. ఎవరు గద్దెపై ఉన్నా సూడాన్లో ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడం కల్ల. వేలకొద్దీ సైన్యం చేతుల్లో ఉన్న ఇద్దరు అహంభావుల వ్యక్తిగత అధికార దాహానికి ఇన్ని లక్షల మంది ఇక్కట్ల పాలవడమే దురదృష్టం. అంతర్యుద్ధాన్ని నివారించడానికే మధ్యంతర సర్కారును కాదని సైన్యం పగ్గాలు పట్టిందని 2021లో అన్న బుర్హాన్ ఇప్పుడచ్చంగా దేశాన్ని అటువైపే నెట్టేస్తున్నారు. సూడాన్లో సుస్థిరత, సురక్షణ, ప్రజాస్వామ్యం భారత్కూ కీలకమే. సంక్షుభిత సూడాన్లో దాదాపు 4 వేల మంది భారతీయులున్నారు. వారిలో 1200 మంది దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. తాజా ఘర్షణల్లో కేరళకు చెందిన ఒకరు మరణించగా, కర్ణాటకలోని హక్కీ–పిక్కీ తెగకు చెందినవారు పదుల సంఖ్యలో చిక్కుకుపోయారన్న మాట ఆందోళన రేపుతోంది. ఘర్షణలు మరింత పెరిగితే సూడాన్ సహా ఆ పరిసర ప్రాంతాలన్నీ అస్థిరతలోకి జారిపోతాయి. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, ఆకాశమార్గం పట్టిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశానికి ఇరుగు పొరుగుతోనూ సంబంధాలు దెబ్బతింటాయి. దేశం ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేయ డానికీ ఉపకరించదు. వెరసి, సూడాన్ చరిత్రలో ప్రతి రాజకీయ çపరివర్తనకూ సైన్యమే కేంద్ర మవుతూ వచ్చింది గనక ఈసారి ఏ మార్పు జరుగుతుందో వేచిచూడాలి. -
కాల్పుల ఘటన వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు అనుమానం
-
పంజాబ్లో కాల్పుల కలకలం.. నలుగురు సైనికులు మృతి..
చండీగఢ్: గుర్తు తెలియని ఆగంతకుల కాల్పులతో పంజాబ్లోని భటిండా సైనిక శిబిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిబిరంలోని శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్లోని ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భోజనశాల పక్కనే ఉన్న బ్యారక్లలో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడి చేశారా? మరొకరి పనా ? అనేది భారత సైన్యం ఇంకా స్పష్టంచేయలేదు. ఘటన విషయం తెల్సిన వెంటనే సత్వర స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. సాధారణ దుస్తులు, ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పుల ఘటన తర్వాత ఆ బ్యారక్ నుంచి బయటికొచ్చి అటవీ ప్రాంతం వైపు పారిపోయారనే ప్రత్యక్ష సాక్షి అయిన ఒక జవాను చెప్పారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. ఆగంతకుల కోసం వేట మొదలుపెట్టారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్కు చెందిన 19 ఖాళీతూటాలు లభించాయి. రెండ్రోజుల క్రితం ఇక్కడే ఇన్సాస్ రైఫిల్తోపాటు 28 రౌండ్ల తుపాకీ గుళ్ల చోరీ ఘటనకు, ఈ దాడికి సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తును చేస్తున్నట్లు ఆర్మీ నైరుతి కమాండ్ తెలిపింది. ఘటన తాలూకు సమగ్ర వివరాలను సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఉగ్రదాడి కాదు. ‘బయటివాళ్ల’ పని అస్సలు కాదు. ఆర్మీతో సమన్వయంతో ఈ ఘటనపై శోధిస్తున్నాం’’ అని పంజాబ్ అదనపు డీజీపీ పార్మర్ చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్చేయలేదని భటిండా పోలీస్ కంటోన్మెంట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గుర్మీత్ సింగ్ స్పష్టంచేశారు. ‘ ఇది అంతర్గత వ్యక్తుల దాడిలా తోస్తోంది. ఫోరెన్సిక్ బృందం సంబంధిత ఆధారాలను సేకరిస్తోంది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తాం’ అని భటిండా సీనియర్ ఎస్పీ గులీ్నత్ సింగ్ ఖురానా మీడియాతో చెప్పారు. చోరీకి గురైన రైఫిల్ దొరికినట్లు సమాచారం. మరణించిన జవాన్లలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు. ఘటనాస్థలిలోకి ఎవరూ రాకుండా ఆర్మీ నిషేధ ఆంక్షలు విధించింది. చదవండి: ఏడు నెలల గర్భిణి.. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగిన ప్రియురాలు.. నల్లమల అడవిలోకి తీసుకెళ్లి.. -
జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ..
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది. ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అమెరికాలోని గురుద్వార్లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు) -
రియల్ వార్ డ్రిల్కు ఆదేశించిన కిమ్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం తన సైన్యాన్ని రియల్ వార్ కోసం కసరత్తులను మరింత తీవ్రతరం చేయమని ఆదేశించారు. ఈ సైనికి డ్రిల్ను ఆయన తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారు. కిమ్ ఆయన కుమార్తె ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి అధికారులతో కలిసి ఫిరంగి యూనిట్ క్షిపణుల మాస్ ఫైరింగ్ను వీక్షించారు. అయితే దక్షిణ కొరియా ఆ ప్రదేశం నుంచి ఉత్తరకొరియా ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు గుర్తించామని, అక్కడ నుంచి మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేగాక అదికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) శుక్రవారం విడుదల చేసిన ఛాయచిత్రల ప్రకారం.. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ఒకేసారి పేల్చినట్లు చూపించాయి. ఇది స్ట్రైక్ మిషన్ల కోసం శిక్షణ పొందిందని కేసీఎన్ఏ తెలిపింది. ఉత్తర కొరియా పశ్చిమ జలాలే లక్ష్యంగా శక్తిమంతమైన దాడులు జరిగినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండు వ్యూహాత్మక మిషన్లను సిద్ధం చేశాడని.. ఒకటి యుద్ధాన్ని నిరోధించడానికి, రెండోది యుద్ధానికి సిద్ధం కావడం అని కిమ్ సైనికులు చెప్పారు. నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితుల్లో, విబిన్న రీతిలో ఎదర్కొనేలా కరత్తులను మరింత తీవ్రతరం చేయమని సైనికులను కిమ్ ఆదేశించాడు. దక్షిణ కొరియా, అమెరికా తోకలిసి సోమవారం అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రిల్ నిర్వహించింది. కాగా, రెండు కొరియాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు మరింత క్షీణిస్తుండగా..మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో దక్షిణ కొరియా ప్రతిస్పందనగా.. వాషింగ్టన్తో భద్రతా సహకారాన్ని పెంచుకుంటోంది. (చదవండి: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్పింగ్! ముచ్చటగా మూడోసారి) -
తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సరిహద్దుల్లోని ప్రతి బెటాలియన్లో తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తిని తెలుసుకుందామా మరి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూరీ్వకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్ పాలకులు. బకింగ్ హాం కెనాల్ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్లోకి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్ క్వార్టర్స్ కూడా ఉండేవి. పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది. మిలిటరీ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి పెద్ద ఊరు కనపర్తి తోపు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఆ ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. ఆ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెపె్టన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పులుగు వెంకటేశ్వరరెడ్డి, కుక్కల వెంకటేశ్వరరెడ్డి కెపె్టన్లుగా పనిచేశారు. వారు కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ఇకపోతే 33 సంవత్సరాల పాటు సేవలందించిన కుక్కల శివారెడ్డి, సూరిబోయిన వెంకటప్పలనాయుడు కూడా కెపె్టన్లుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. మిలిటరీలో తొలి అడుగుతుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు 1930 సంవత్సరానికి ముందు తుపాకుల చెన్నయ్య మొదటిసారిగా బ్రిటీష్ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు నలుగురు సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు. ప్రతి ఇంట్లో పోలీసులే... కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా పోలీస్ విభాగంలో ఉత్సాహంగా చేరాం నేను చిన్నతనంలో ఊరికి మిలిటరీ, పోలీస్ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న ఆశ ఎక్కువగా ఉండేది. మా ముత్తాతలు మిలిటరీలో పనిచేశారు. ఆ తర్వాత మా తాతలు నలుగురు పోలీసులే. మా నాన్న వీరరాఘవయ్య పోలీస్ విభాగంలో పనిచేశారు. మా పెదనాన్నలు సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు కూడా పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా పెదనాన్నల కుమారులు, మా అన్నదమ్ములు పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. నేను ఎక్సైజ్ సెలక్షన్స్కు వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ విభాగంలో ఏడాదిన్నర క్రితం ఎస్సైగా పదవీ విరమణ పొందాను. మా ఇంటి ఆడపిల్లల్ని అందరినీ పోలీస్ విభాగంలో పనిచేసిన వారికే ఇచ్చారు మా తల్లిదండ్రులు. అందరం సంతోషంగా ఉన్నాం. – తుపాకుల చెన్నకేశవరావు, రిటైర్డ్ ఎస్సై, ఎక్సైజ్ విభాగం ఏఎస్పీలుగా ముగ్గురు పదవీ విరమణ కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు ఎౖజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం విభాగాలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్ఫుల్గా ఉండటాన్ని వారు కూడా స్వాగతించారు. మా వంశం మొత్తం మిలిటరీ, పోలీసులుగానే మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని మా తాత చెప్పేవారు. మా తాత రాఘవయ్య బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. మా నాన్న కోటయ్య 1939లో బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్హతను బట్టి మిలిటరీలోకి, పోలీస్ విభాగంలోకి, ఎక్సైజ్ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి పంపించారు. నేను పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా విధుల్లో చేరి 2010లో పదవీ విరమణ పొందాను. – బొజ్జా కృష్ణమూర్తి, రిటైర్డ్ ఏఎస్సై, పోలీస్ విభాగం -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగొచ్చు
కీవ్: ఏడాది క్రితం మొదలైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్స్క్లోని బఖ్ముత్లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు. తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కొనసాగుతుందని రష్యా కూడా చెబుతుండటం గమనార్హం. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు చేసే ప్రిగోజిన్కు ‘పుతిన్ వంటమనిషి’గా పేరుంది. శనివారం ఒడెసాలో వ్యూహాత్మక రైల్వే వంతెనను రష్యాకు చెందిన సీ డ్రోన్ దాడితో పేల్చేస్తున్న వీడియో ఒకటి రష్యా మిలటరీ బ్లాగర్లు విడుదల చేశారు. దీనిని ఇరు దేశాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. -
గాలిబుడగల నిఘానేత్రాలు
గాలిబుడగలు సైతం గందరగోళం సృష్టించి, దేశాల మధ్య సంబంధాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తాయని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేశాయి. చైనా దేశపు నిఘా నేత్రంగా అనుమా నిస్తున్న భారీ బెలూన్ తన గగనతలంలో తిరగడం గమనించిన అమెరికా ఫిబ్రవరి 4న దాన్ని వివిధ యుద్ధ విమానాలతో చుట్టుముట్టి, క్షిపణి ప్రయోగంతో వ్యూహాత్మకంగా తన ప్రాదేశిక సముద్ర జలాలపై పేల్చివేసిన వైనం అంతర్జాతీయంగా ఒక సంచలనం. అంతకు మించి గత నవంబర్లో జీ–20 దేశాల బాలీ సదస్సు వేళ షీ జిన్పింగ్, బైడెన్ల భేటీతో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయని ఆశిస్తున్న చైనా – అమెరికా దౌత్య సంబంధాల్లో ఇది పెద్ద కుదుపు. డ్రాగన్ దొంగ ఎత్తులపై మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ ఓ మేలుకొలుపు. చైనా సహా కట్టెదుటి ముప్పును గమనించిన ఏ సార్వభౌమ దేశమైనా చేసే పనినే అమెరికా చేసింది కాబట్టి తప్పు పట్టలేం. నిజానికి, చైనా గాలిబుడగ అనుమానాస్పదంగా కొద్ది రోజులుగా పయనిస్తోంది. కెనడా మీదుగా మోంటానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. అమెరికా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ క్షేత్రాలు మూడింటిలో ఒకటి అక్కడే ఉంది. సైనిక, వ్యూహాత్మక స్థలాలను కనిపెట్టడానికి చైనా దీన్ని సాధనంగా వాడుతోందని భావించిన అమెరికా, అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశంతో అదను చూసి పేల్చేసింది. గతంలో అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనూ ఈ గాలిబుడగల మూడో కన్ను పలుచోట్ల అగ్రరాజ్యపు వినువీధుల్లో విహరించింది. తెంపరిగా పేరున్న ట్రంప్ వాటిపై చర్యకు అప్పుడు తెగించలేదు. ఇప్పుడు దేశీయంగా అనేక ఒత్తిళ్ళలో ఉన్న బైడెన్ మటుకు 3 స్కూల్ బస్సుల పరిమాణంలోని ఆ గాలిబుడగను పేల్చేశారు. మొదట అనిష్టంగా ఉన్నా, ఆఖరికి అది తమ బెలూనే అని చైనా విదేశాంగ శాఖ ఒప్పుకుంది. కాకపోతే, దాన్ని గూఢచరానికి వాడుతున్నామన్న వాదనను మాత్రం తోసిపుచ్చింది. అది వాతా వరణ పరిశోధనకు వాడే పౌర వైమానిక నౌక అనీ, దారితప్పి పొరపాటున అటు వచ్చిందనీ బుకాయించింది. విచారం వ్యక్తం చేసింది. నమ్మలేని ఆ మాటలు అటుంచితే, డ్రాగన్ ఇలా నిఘా బెలూన్లను వాడినట్టు తైవాన్, 2020, 2021ల్లో జపాన్ లాంటి దేశాల నుంచి గతంలోనూ ఆరోపణ లొచ్చాయి. భారత్పైనా ఇలాంటి ప్రయోగాలే సాగాయి. అవి చైనావేనన్న అధికారిక సాక్ష్యాధారాలు దొరక్కపోతేనేం... గత ఏడాది జనవరిలో అండమాన్, నికోబార్ దీవులపై గాలిబుడగలు తిరిగాయి. నిఘా ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి చౌకే కాదు, లక్షిత భూ ఉపరితలానికి దగ్గరగా వెళ్ళి మరింత స్పష్టమైన ఛాయాచిత్రాలు తీయగలవు. సాధారణంగా వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గం కన్నా రెట్టింపు ఎత్తు దాటి, 80 వేల నుంచి లక్షా 20 వేల అడుగుల ఎత్తున నిఘా సాధనాలతో ఈ నిఘా బెలూన్లు వెళుతుంటాయి. కీలక సమాచారాన్ని సేకరించడానికీ, ఇతర సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికీ వీటిని వినియోగిస్తుంటారు. ఈ బెలూన్లలో సౌరవిద్యుత్తో నడిచే కెమెరా, రాడార్ లాంటివి ఉంటాయి. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి ఎంత ఎత్తులో ప్రయాణించాలనేది ఎప్పటికప్పుడు మారుస్తూ బెలూన్లను లక్షిత ప్రాంతానికి చేరేలా మార్గదర్శనం చేస్తారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చౌకగా గూఢచర్యం నిర్వహించే విధానంగా అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ నిఘా గాలిబుడగల పద్ధతిని వాడాయి. ఇటీవల సైతం ఇలాంటి చైనా నిఘా బుడగలు అనేకం ప్రపంచపు పెద్దన్న వియత్తలంలో విహారం సాగించాయి. అయితే, తాజా బెలూన్ దీర్ఘకాలంగా అక్కడక్కడే తిరుగుతుండడంతో, పేల్చివేతకు గురైంది. తప్పు చేసినా సరే తననెందుకు తప్పుపడుతున్నారన్నట్టుంది చైనా వైఖరి. అమెరికా గగనతలంపైనే అయినా, తమ బెలూన్ను పేల్చినందుకు సదరు అగ్రరాజ్యం ఇంతకింత ఫలితం అనుభవిస్తుందని బెదిరిస్తోంది. ఈ ఘటనతో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈ 6న జరగాల్సిన తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. గత కొన్నేళ్ళలో ఒక ఉన్నత స్థాయి అమెరికా దౌత్యవేత్త చైనాకు వెళ్ళడం ఇదే తొలిసారి. తీరా అదీ రద్దయింది. పర్యటనపై ఇరుపక్షాలూ ప్రణాళిక ఏదీ వేసుకోలేదని బీజింగ్ బింకంగా చెబుతోంది కానీ, జరగాల్సిన దౌత్యనష్టం జరిగిపోయింది. స్నేహానికి చేయి చాస్తూనే, చాటున చేయదలుచుకున్నది చేసేయడంలో చైనా జగత్ కిలాడీ అని మళ్ళీ ఋజువైంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామంటూ తాజా ఘటన అనంతరమూ చైనా ప్రకటించింది. కానీ, డ్రాగన్ గత చరిత్ర, నేటికీ మారని నైజం తెలిసినవారెవరూ ఆ మాటలను విశ్వసించలేరు. భారత్ సహా తన అగ్రరాజ్య హోదాకు అడ్డనుకున్న ప్రతి దేశంతో సున్నం పెట్టు కోవడం, తైవాన్ లాంటివి తనవేనంటూ దాడులకు దిగడం చైనాకు నిత్యం అలవాటే. అమెరికా లాగా తానూ ప్రపంచ పోలీసు పాత్ర పోషించాలనే తహతహ చైనాలో చిరకాలంగా కనపడుతున్నదే. ఆ దుగ్ధ లేకపోతే ఇలాంటి నిఘా నేత్రాల పనేమిటి? ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో ఎంత బల మైన శక్తి రాజ్యమైనప్పటికీ, చైనా తన హద్దులు దాటి పరాయిగడ్డపై తన బెలూన్లను తిప్పాలనుకుంటే అది ఉపేక్షనీయం కాదు. ప్రపంచం అందుకు మౌనంగా అనుమతించాలనీ, అంగీకరించాలనీ బీజింగ్ కోరుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు. నిఘా సహా అనేక అంశాల్లో చైనా పాలకుల ఎలుక తోలు నైజం తెలిసిందే కాబట్టి, భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నక్కజిత్తులను సహించేది లేదని మాటల్లోనూ, చేతల్లోనూ చూపాలి. ఎందుకంటే, సమ యానికి ముకుతాడు వేయకుంటే డ్రాగన్ దూకుడు ఆగదని అమెరికా సహా అందరికీ తెలిసిందే. -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్కాంగ్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్ల్యాండ్లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్
ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొనసాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం. ► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరించుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్ వద్ద 4,614 ట్యాంకులున్నాయి. ► అర్జున్ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్ సైన్యం వద్ద ఉన్నాయి. ► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం. ► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరువున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్’ చేపట్టింది. ► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అమెరికాలోనే ఎక్కువగా.. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశాలు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యాధునిక లెపర్డ్–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు. ఉక్రెయిన్ వద్ద ఆనాటి ట్యాంకులు ఉక్రెయిన్ ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగం. ఉక్రెయిన్ వద్ద ఉన్న యుద్ధ ట్యాంకుల్లో యూఎస్ఎస్ఆర్ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు. ర్యాంకుల కథాకమామిషు.. ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్ ఫైర్ పవర్’ ర్యాంకులు ఇస్తోంది. -
ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి!
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో మరోమారు భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకుని రోడ్లను మూసివేశాయి. ‘కాబూల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ వెలుపల ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.’ అని తెలిపారు ఆర్మీ ప్రతినిధి అబ్దుల్ నాఫీ టకోర్. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. అంతకు ముందు గతేడాది డిసెంబర్ 12న ఓ గుర్తు తెలియని సాయుధుడు కాబూల్లోని ఓ హోటల్లో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ హోటల్లో చైనా పౌరులు ఉండటం కలకలం సృష్టించింది. తాలిబన్ భద్రతా దళాలు అక్కడికి చేరుకునే ముందు హోటల్ నుంచి భారీగా పొగలు వచ్చినట్లు పలు వీడియోల్లో కనిపించింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు: తైవాన్
తైపీ: చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్ను తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఏనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండింది ఈ చిన్న ద్వీప దేశం. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. తైవాన్పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుందని సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు. రెండు రోజుల కిందట.. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాష్టింగ్టన్, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని.. సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంది కూడా. తైవాన్లో ఒకప్పుడ ఏడాది మిలిటరీ సర్వీస్ నిబంధన ఉండేది. కానీ, తర్వాతి కాలంలో దానిని నాలుగు నెలల కాలపరిమితికి కుదించారు. అయితే, సరిహద్దులో సైనిక చర్యల ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం.. డ్రాగన్ కంట్రీ నుంచి ఏనాటికైనా యుద్ధం తప్పదనే భావనలోకి చేరుకుంది తైవాన్. తమను తాము స్వపరిపాలన.. ప్రజాస్వామ్యిక దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. కానీ, తైవాన్ తమ భూభాగానికే చెందుతుందని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్కు అండగా అమెరికా ప్రకటనలు ఇవ్వడం, అక్కడి ప్రతినిధులు తైవాన్ గడ్డపై పర్యటించడం చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ పరిస్థితులకు తోడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తైవాన్ సరిహద్దులో వరుసపెట్టి మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తుండడంతో.. తరచుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్పై రష్యా తరహాలో చైనా కూడా తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది తైవాన్. -
శ్రీలంకలో మళ్లీ భగ్గుమంటున్న నిరసనలు.. ఐ డోంట్ కేర్ అంటున్న రణిల్
కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి. ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు. ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి) -
భారత్ సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం..
-
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్లో మొదటి మహిళా ఆఫీసర్గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్ఫోర్స్లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
అన్నంత పనిచేస్తున్న పుతిన్... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ
ఉక్రెయిన్పై గెలుపు కోసం పుతిన్ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా. ఈ మేరకు రష్యా విద్యామంత్రి సెర్గీ క్రావ్త్సోవ్ మాట్లాడుతూ....సోవియట్ కాలం నాటి ప్రాథమిక సైనిక శిక్షణ పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. తాము ప్రాథమిక సైనిక శిక్షణ కార్యక్రమం పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్లు తెలిపారు. పిల్లలకు తుపాకిని ఎలా పట్టుకుని షూట్ చేయాలి, ఎలా లాక్ చేయాలి, గాయాలైతే ఎలా ప్రథమ చికిత్స అందించాలి, ఏదైనా రసాయన దాడి జరిగితే ఎలా తమను తాము కాపాడుకోవాలి వంటి వాటిల్లో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ సైనిక కోర్సు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్లు తెలిపారు. ఈ విధానంతో పౌరులు శత్రువుతో ఎలా తలపడాలో నేర్చుకోవడమే గాక యుద్ధానికి సన్నద్ధమయ్యేలా సిద్ధం చేయగలుగుతాం అంటున్నారు. ఐతే ఈ విధానం పట్ల తల్లిదండ్రల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాలలు అనేవి యుద్ధానికి కాదు ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించటం నేర్పడానికి అంటూ తిట్టిపోస్తున్నారు. (చదవండి: ఖేర్సన్: కీలక విలీన ప్రాంతం నుంచి రష్యా బలగాల ఉపసంహరణ) -
డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు
చైనీస్ మిలటరీ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇంతవరకు మిషన్గన్తో కూడిన రోబో శునకాలను చూశాం. ఐతే వాటినే రణరంగంలోకి దింపి శత్రువుపై ఆకస్మకి దాడులు చేయించే టెక్నాలజీకి నాంది పలకింది చైనా రక్షణ శాఖ. ఈ మేరకు డ్రోన్ సాయంతో మిషన్గన్తో కూడిన రోబో శునకాలను శత్రువు ఉండే ప్రాంతంలో వదిలేస్తారు. అది వెంటనే తన టార్గెట్ని ఏర్పాటు చేసుకుంటూ దాడులు చేయడం ప్రారంభించింది. ఇది శత్రువులకు సైతం అర్థంకాని విధంగా వ్యూహాత్మక ఆకస్మిక దాడులు చేస్తోంది. దీంతో శత్రువుని సులభంగా మట్టి కరిపించగలమని చైనీస్ మిలటరీ చెబుతోంది. అంతేకాదు ఆ రోబో కుక్క నాలుగు కాళ్లపై నుంచుని గన్ని ఓపెన్ చేసి తన టార్గెట్ని చూసుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన వీడీయోని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్కి సంబంధించిన విబో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Has anyone watched the War of the Worlds cable series! Chinese military contractor created a video showing off its terrifying new military technology, revealing a robot attack dog that can be dropped off by a drone. https://t.co/wW9kYR70N0 pic.twitter.com/grrWutK8ge — Shell (@EwingerMichelle) October 27, 2022 (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
ఘోర అగ్ని ప్రమాదం...భవనంపైకి దూసుకెళ్లిన మిలటరీ విమానం
రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో సంభవించింది. ఈ సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఒక మీడియం రేంజ్ సూపర్సోనిక్ జెట్ ఫైర్బాల్గా పేలినట్లు ఆ ప్రాంతీయ గవర్నర్ వెనియామిన్ కొండ్రాటీవ్ తెలిపారు. సుమారు ఐదు అంతస్తుల్లో దాదాపు 2 వేల చదరపు మీటర్లు మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు నివేదించినట్లు పేర్కొన్నారు. అందులోని విమాన సిబ్బంది విమానం అపార్టమెంట్ కాంప్లెక్స్ వైపుకి దూసుకొచ్చేలోపు బయటకొచ్చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం రష్యా అధ్యక్షుడి పుతిన్కి తెలియజేసినట్లు పేర్కొంది. అలాగే మిలటరీ విమానంలో గాయపడ్డవారికి తక్షణ సాయం అందించాలని క్రెమ్లిన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Watch the moment of military #plane #crash at a residential building in #Yeysk , #Russia. pic.twitter.com/TEunPX3KQl — Gaurav Kumar Singh (@GKSinghJourno) October 17, 2022 In the Krasnodar Territory of Russia, a military plane crashed on a residential building in Yeysk. According to preliminary data, the pilot managed to eject. Eyewitnesses report that after the plane crash, a residential building is on fire from the first to the ninth floor. pic.twitter.com/NytFaAB8Up — Ey Villan (@NeutralNews111) October 17, 2022 (చదవండి: ఉక్రెయిన్పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి) -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్కి శ్రీనగర్లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్
US Says "Concerned: రష్యా చైనా వంటి ఇతర దేశాలతో సైనిక కసరత్తులు నిర్వహించనున్నట్లు ప్రకటించిందని అమెరికా పేర్కొంది. రష్యా నిర్వహించనున్న వోస్టాక్ 20200 డ్రిల్స్లో చైనా, భారత్తో సహా అనేక ఇతరదేశాల నుంచి సుమారు 50 వేల సైనిక బలగాలు పాల్గొంటాయని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. అంతేకాదు ఈ విన్యాసాలను సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాలల్లోని వివిధ ప్రదేశాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనుందని స్పష్టం చేసింది. అలాగే ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు మొదటగా తూర్పు మిటలరీ డిస్ట్రిక్ట్స్లోని ఏడు శిక్షణ ప్రాంతాలో కసరత్తులు నిర్వహించిన తదనంతరం ఓఖోత్క్స్, జపాన్లలోని సముద్ర జలాల్లోనూ, తీరప్రాంతాల్లో రక్షణాత్మక్ష ప్రమాదకర విన్యాసాలకు అనుమతిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొందని వెల్లడించింది. ఈ కసరత్తుల్లో సుమారు 50 వేల మంది సైనికుల తోపాటు దాదాపు 140 విమానాలు, 60 యుద్ధ నౌకలు, గన్బోట్లు తోసహా సహాయక నౌకలు ఉంటాయని మాస్కో పేర్కొంది. ఈ సైనిక విన్యాసాల్లో చైనా, భారత్లో సహా లావోస్, మంగోలియా, నికరాగ్వా, సిరియా తోపాలు అనేక మాజీ సోవియట్ దేశాలు పాల్గొంటాయని రష్యా చెబుతోంది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగిన దేశంతో ఏయే దేశాలు జతగట్టి ఈ విన్యాసాల్లో పాల్గొంటాయోనని భయంగా ఉందని చెప్పారు. ఐతే ఈ విషయాన్ని ఆయా దేశాల స్వంత నిర్ణయానికి వదిలేస్తున్నామని తేల్చి చెప్పారు. ఐతే విన్యాసాలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపై న్యూఢిల్లీ నుంచి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. కానీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తూర్ప తీర ప్రాంతాల్లో సైనిక భద్రతను నిర్వహించడానికి, ఆయ ప్రాంతాల్లోని దురాక్రమణ చర్యను తిప్పికొట్టేందుకు ఈ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నట్ల చెబుతోంది. ఐతే గతేడాది రష్యాలో జరిగిన జెడ్ఏపీఏడీ 2021 సైనిక కసరత్తుల్లో చైనా పాకిస్తాన్ తోపాటు భారత్ కూడా పాల్గొంది. (చదవండి: ప్రపంచ పెద్దన్న అమెరికాకు షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?) -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్సర్వీస్మెన్కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్లో హవల్దార్గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్నాయక్, నాయక్గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే పళ్లను, చేపల ఉత్పత్తులతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇసుకను చైనా నిషేధించింది. ఆయా ఉత్పత్తుల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయని, పైగా ఆ ప్యాకేజిలపై చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చిందంటూ సాకులు చెబుతూ తైవాన్ దిగుమతులను నిషేధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు. ఇలా మార్చి 2021లో తైవాన్ ఎగుమతి చేసే పైనాపిల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. పైగా రాజకీయపరంగానే ఇలా కక్ష పూరిత చర్యకు చైనా పాల్పడిందని సమాచారం. అదీగాక 2016 నుంచి తైవాన్ అధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా తైవాన్ని చుట్టుముట్టి ప్రత్యక్ష మిలటరీ డ్రిల్ను నిర్వహిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్ పిపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది. (చదవండి: హైటెన్షన్.. తైవాన్లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక) -
అగ్గి రాజేసిన అగ్రరాజ్యం... యుద్ధానికి సై అంటున్న దేశాలు: వీడియో వైరల్
China Amid Tension With Taiwan: అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన చివరికి యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తొలుత పెలోసి పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం కాస్త ముదరి ఇప్పుడూ ఇరు దేశాల మద్య నిప్పు రాజేసి యుద్ధానికి సంసిద్ధమయ్యేలా చేసింది. చైనా కూడా ఈ పర్యటన పలు పరిణామాలకు దారితీస్తుందంటూ అమెరికాని మొదట నుంచి హెచ్చరించింది. కానీ అమెరికా కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ పర్యటించేందుకు సిద్ధం అయ్యింది. ఇది రెచ్చగొట్టే చర్య అని చైనా పదే పదే చెబుతున్న ఖతారు చేయలేదు. ఆఖరికి రష్యా కూడా చైనాకి మద్దతు ఇస్తూ ఇది కవ్వింపు చర్య అని అమెరికాని హెచ్చరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్ ఈ పర్యటన వ్యక్తిగతమైనది కాదని, ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. దీంతో అమెరికా అలర్ట్ అయ్యి పెలోసి పర్యటన నిమిత్తం తైవాన్ ద్వీప సమీపంలో నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రీక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు చైనా తైవాన్ పై యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్ సరిహద్దు సమీపంలో భారీగా సాయుధవాహానాలను, ఇతర సైనిక పరికరాలను మోహరించింది. మరోవైపు తైవాన్ కూడా యుద్ధానికి సై అంటూ తమ పోరాట పటిమను చూపించేలా తమ ఆయుధాలతో ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సాయుధ బలగాలకు సంబధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. In Fujian right now😯😯 pic.twitter.com/hHxfPTDQEo — Yin Sura 尹苏拉 (@yin_sura) August 2, 2022 ⚡ There was a video of a military exercise in China in the South China Sea on the eve of Nancy Pelosi’s visit to Taiwan. Reuters reports Taiwan’s defence ministry had “reinforced” its combat alertness level from Tuesday morning to Thursday noon pic.twitter.com/7Cru0hSL6u — Flash (@Flash43191300) August 2, 2022 (చదవండి: యూఎస్కి వార్నింగ్ ఇచ్చిన రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!) -
నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. 50 ఏళ్ల తర్వాత అమలు
బ్యాంకాక్: మయన్మార్ సైనిక పాలకులు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురికి ఉరిశిక్షలు అమలు చేశారు. ఆంగ్ సాన్ సుకీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఫియో జెయా థావ్(41), హక్కుల కార్యకర్తలైన క్యావ్ మిన్ యు(53), హలా మియో ఆంగ్, ఆంగ్ థురా జావ్ ఉరికంబం ఎక్కారు. వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ ప్రపంచదేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా శిక్షలను అమలు చేసినట్లు అధికార మిర్రర్ డైలీ వార్తా పత్రిక తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి చట్ట ప్రకారమే ఉరి శిక్షను అమలు చేసినట్లు వెల్లడించింది. శిక్షలను ఎప్పుడు అమలు చేసిందీ వెల్లడించలేదు. తన భర్తకు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలియదని ఫియో జెయా థావ్ భార్య తెలిపారు. ఈ విషయమై అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ పరిణామంపై సైనిక ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, చివరి సారిగా 1976లో సలాయ్ టిన్ మౌంగ్ వూ అనే విద్యార్థి నేతకు అప్పటి సైనిక ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. సైనికపాలకులు ప్రజలను భయపెట్టేందుకే ఇలాంటి శిక్షలను అమలు చేస్తున్నారని హక్కుల నేతలు అంటున్నారు. -
అందరూ పుతిన్ నాశనాన్ని కోరుకుంటున్నారు! యూకే చీఫ్
Britain's armed forces has dismissed as "wishful thinking: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను యూకే మిలటరీ చీప్ టోనీ రాడాకిన్ తోసిపుచ్చారు. అందరూ పుతిన్ ఆరోగ్యం పై దృష్టిసారించారని, పైగా ఆయన హత్య కావింపబడతాడు లేదా పరారవుతాడంటూ వస్తున్న పుకార్లన్ని చూస్తేంటే అందరూ ఆయన నాశనాన్నే ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మిలటరీ నిపుణుడిగా రష్యాలో పుతిన్ పాలనను దగ్గరగా చూశానని చెప్పారు. ఆయన ఎటువంటి వ్యతిరేకతనైనా అణిచివేయగలరని కూడా అన్నారు. అంతేకాదు రష్యాని సవాలు చేసే శక్తి కూడా ఎవరికీ లేదని చెప్పారు. అంతేగాదు రష్యా అణుశక్తిగా కొనసాగడమే కాకుండా సైబర్ సామర్థ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. పైగా అంతరిక్ష సామర్థ్యంతో పాటు నీటి అడుగున ప్రత్యేకమైన ప్రోగామింగ్ కేబుళ్లు ఉన్నాయని అందువల్ల ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. అదే సమయంలో సెప్టెంబర్ 6న కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వారసుడిని ఎన్నుకున్నందున రష్యాకి కచ్చితంగా ముప్పు ఉంటుందన్నారు. అంతేగాదు బోరిస్ వారసురాలు బాధ్యతలు చేపట్టంగానే ఉక్రెయిన్కి సైనిక సాయం అందించి రష్యాని నియంత్రిస్తామన్నారు. ఆ తర్వాత యూకే కచ్చితంగా అణుశక్తిగా అవతరించడం పై దృష్టిసారిస్తుందని యూకే మిలటరీ చీప్ అన్నారు. (చదవండి: హఠాత్తుగా ‘కదిలిన’ పురాతన భవనం: వీడియో వైరల్!) -
ఇండియన్ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు! ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్ భారత్ పథకం కింద మిలటరీ హార్డ్వేర్ విభాగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అక్విజేషన్ ప్రొసిజర్స్ (డీఏపీ) మ్యాన్యువల్గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్ డిఫెన్స్కు (పీఎస్యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్హెచ్ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్ హెలికాఫ్టర్ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్ ఎటాక్, యాంటీ సబ్ మెరైన్, యాంటీ షిప్, మిలటరీ ట్రాన్స్ పోర్ట్, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓయూ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ప్రైవేట్ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్తో సహా ఐఎంఆర్ హెచ్ ఇంజిన్ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్ఏఎల్ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. -
Agnipath Scheme: ఈ మార్పులు మేలు
అగ్నిపథ్ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కన్పించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు... కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రఫుల్ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు. సగం మందినైనా పర్మినెంట్ చేయాలి 25 శాతం మందినే పర్మినెంట్ చేయడం సబబు కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి అగ్నిపథ్పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కన్పించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. మరింత చర్చ తప్పనిసరి పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్ఎఫ్ మాజీ ఏడీజీ సంజీవ్ సూద్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సర్వీసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్గా చేపట్టడమో చేయాలని సూచించారు. సైనిక నియామకాలు... ఏ దేశాల్లో ఎలా? అమెరికా అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. చైనా డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. ఫ్రాన్స్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సర్వీసులో ఉంటే పెన్షన్ ఇస్తారు. రష్యా సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సర్వీసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇజ్రాయెల్ పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది. పాకిస్తాన్ నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్ యుద్ధం: ప్రైవేట్ సైనికులు కావలెను.. భారీగా జీతం, బోనస్ ప్రత్యేకం
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. అమెరికా, యూరప్కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు. ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు. వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. వాగ్నర్ VS అకాడమీ ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే. కంపెనీల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి.. చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో! ► అకాడమీ: బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి. ► వాగ్నర్ గ్రూప్ రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన యవ్జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి. ► జీఫోర్ఎస్ ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. ► యూనివర్సల్ ప్రొటెక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు. ► కేబీఆర్ అమెరికాలోని టెక్సాస్కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!
China Monitoring US Military: చైనా కంబోడియాలో సైనిక స్థావరాలను ఏర్పరచుకుంటోంది. ఎప్పటి నుంచో ఇండో ఫసిపిక్లో ప్రాంతంలో తన అధిపత్యధోరణిని చూపించుకునేందుకు చైనా ఎంతగానో తాపత్రయపడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొదటిది అయినా కంబోడియాలో సైనిక ఉపయోగం కోసం నౌకదళ సదుపాయన్ని నిర్మిస్తోంది. అదీగాక ఇప్పటి వరకు చైనాకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలోనే ఏకైక విదేశీ సైనిక స్థావరం ఉంది. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనా ఆకాంక్ష మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సైనిక సౌకర్యాల నెట్వర్క్ ఉండేలా ఈ నౌకదళ స్థావారాలను నిర్మిస్తోందని అమెరికా చెబుతోంది. బీజింగ్ వ్యూహంలోనే భాగామే ఈ కంబోడియాలో నిర్మిస్తున్న కొత్త నావికా స్థావరం అని కూడా పేర్కొంది. అదీగాక చైనా నాయకులకు ఇండో పసిఫిక్ ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు. ఇది తమ చారిత్రాత్మక ప్రాభావాన్ని చూపించుకునే అతి ముఖ్యమైన ప్రాంతంగా వారు భావిస్తారు. అంతేకాదు 2019లోనే ది వాల్ స్ట్రీట్ జర్నల్ చైనా కంబోడియాతో తన మిలటరీ స్థావారాన్ని ఏర్పర్పచుకునేలా ఒప్పందం చేసుకుందని ప్రచురించింది కూడా. దీంతో అమెరికా దాని మిత్రదేశాలు ఆయా దేశాలను ప్రశ్నించింది కూడా. ఐతే అప్పుడు ఆ ఇరు దేశాలు ఆ విషయాన్ని తోసిపుచ్చాయి. కానీ కాలక్రమైణ అదే నిజమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు చైనా ఇలాంటి స్థావరాల్లో సైనిక బలగాలను మోహరింపచేయడమ కాకుండా యూఎస్ మిలటరీ పై నిఘా పెట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ అమెరికా దుమ్మెత్తిపోస్తోంది. (చదవండి: దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్పైకి తోసేశాడు..!) -
ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. ఈ పర్యటన జరిగిన వారంలోపే.. భారత్కు క్షిపణులు, జెట్లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం. నివేదిక ప్రకారం.. భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది. కాగా మంగళవారం టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేదించే నిబంధలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్ స్వీయ-రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య అక్విజిషన్ క్రాస్-సర్వీసింగ్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి. చదవండి: Elon Musk: అప్పుడు డేటింగ్తో చిచ్చు రాజేశావ్! ఇప్పుడేమో ఇలా.. -
రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ వ్యయం ఏటేటా ఎగబాకుతోంది. ప్రపంచ సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సరికొత్త శిఖరాలకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా(38%), చైనా(14%), భారత్(3.6%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించింది. ప్రపంచ సైనిక వ్యయం మొత్తంలో మొదటి 5 దేశాలదే 62 శాతం ఉండటం గమనార్హం. బ్రిటన్(3.2%), రష్యా(3.1%).. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్ఐపీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనప్పటికీ ప్రపంచ దేశాల రక్షణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎస్ఐపీఆర్ఐ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డిగో లోపెస్ డా సిల్వా వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకోవడంతో రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ సంఖ్య 2.3 శాతంగా ఉంది. అమెరికా మిలటరీ ఖర్చులు 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 1.4 శాతం తగ్గింది. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను 24 శాతం పెంచింది. అదే సమయంలో ఆయుధాల కొనుగోళ్ల ఖర్చు 6.4 శాతం తగ్గించింది. రెండో స్థానంలో ఉన్న చైనా 2020తో పోల్చితే 4.7 శాతం వృద్ధితో 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించింది. గత ఏడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020తో పోల్చితే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి భారత రక్షణ వ్యయం 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించారని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. (క్లిక్: భారత్కు బంపరాఫర్.. అమెరికా, యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!) బ్రిటన్ గత సంవత్సరం రక్షణ కోసం 68.4 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం పెంచడంతో 65.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా మూడో సంవత్సరం మిలటరీ పద్దు పెరగడంతో రష్యా సైనిక వ్యయం 2021లో జీడీపీలో 4.1 శాతానికి చేరుకుంది. (క్లిక్: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు) -
సైన్యంలో విద్రోహులు!
న్యూఢ్లిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడైందని వెల్లడించాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారు సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని చెప్పాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపాయి. ‘‘వారికి పొరుగు దేశంతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు. పాక్, చైనా గూఢచారులు మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి సైనికాధికారులపై వల పన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు వారి గాలానికి చిక్కినట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వివరించాయి. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం) -
అద్భుతం ఆవిష్కరించిన ఎన్నారై సైంటిస్ట్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హెల్మెట్ లేకుండా బయటకి వెళితే చాలు ట్రాఫిక్ వాళ్లు వెంటనే జరిమాన విధిస్తున్నారు. ఎందుకుంటే హెల్మెట్లేని ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బతగలడం.. పర్యవసానంగా మరణం సంభవించడమో లేదా దీర్ఘకాలం పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు దారి తీయడంమో జరుగుతోంది. అయితే అవాంఛనీయ సంఘటనల్లో తలకు గట్టిగా దెబ్బ తగిలితే తిరిగి కోలుకునే మోడల్ని ఓ ఇండో అమెరికన్ సైంటింస్ట్ దూదిపాల సాంబారెడ్డి రూపొందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సాంబారెడ్డి స్థానికంగా ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన ఎ అండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసన్, టెక్సాస్లో పని చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా మెదడు సంబంధిత ఔషధాలను అభివృద్ధి చేయడంపై ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ) ఎపిలెప్సీలో చికిత్సకి సంబంధించి న్యూ జెనరేషన్ మోడల్ని అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎక్సిపెరిమెంటల్ న్యూరాలజీ జర్నల్లో ప్రచురితం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 6.90 కోట్ల మంది తలకు బలమైన గాయాలు అవుతున్నాయి. వీరిలో కొందరు అక్కడిక్కడే చనిపోతుండగా మిగిలిన వారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీఎస్టీడీ), డిప్రెషన్, పూర్ మోటార్ బ్యాలెన్స్ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీలో పని చేసే సైనికులు, అథ్లెట్లు కూడా ట్రామాటిక బ్రెయిన్ ఇంజూరీ కారణంగా ఇబ్బంది పడుతున్న వారి జాబితాలో అధికంగా ఉన్నారు. వీటిని పోస్ట్ ట్రామాటిక్ ఎపిలెప్సీగా పేర్కొంటారు. ఇలా బాధపడే వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇప్పటి వరకు ప్రభావవంతమైన చికిత్సా విధానం లేదు. కాగా ప్రస్తుతం సాంబారెడ్డి పరిశోధనల ఫలితంగా వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు సాంబరెడ్డి పరిశోధనలు పరిష్కారం చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ చేసేందుకు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. అంతేకాదు సైన్యంలో గాయపడిన వారికి డాక్టర్ సాంబారెడ్డి సూచించిన విధంగా చికిత్స అందిస్తూ ఫలితాలు అంచనా వేయడానికి అవకాశం కల్పించింది. బ్రెయిన్కి సంబంధించిన స్పస్టమైన సమచారం లేకుండా మనం బ్రెయిన్ ఇంజ్యూరీకి చికిత్స చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు మేము అభివృద్ధి చేసిన మోడల్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి సంబంధించి మొదటి మోడల్. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్డ్ మెథడ్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు డాక్టర్ సాంబారెడ్డి -
ఉక్రెయిన్ గడ్డపై పౌరుషం ఎంతలా అంటే..
world war two veteran was ready to defend: ఉక్రెయిన్ గడ్డ పోరు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ముఖ్యకారణం.. ప్రాణాలకు తెగించి దేశం కోసం సామాన్యుడు తుపాకీ పట్టడం.. యుద్ధ భూమిలో ప్రాణాలను ఎదురొడ్డి పోరాడడం. రష్యా బలగాలు.. విరుచుకుపడుతున్నా, పిట్టల్లా ప్రజలు రాలుతున్నా దేశభక్తితో ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్లోని మాజీ సైనికురాలు ఓల్హా ట్వెర్డోఖ్లిబో తాను సైన్యంలోకి చేరతానుంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చింది. ఓల్హా.. రెండో ప్రపచంలో యుధంలో పాల్గొన్న అనుభవజ్ఞురాలు కూడా. పైగా ఇప్పుడామె రెండోసారి యుద్ధాన్ని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న తన మాతృభూమిని రక్షించుకోవాడానికి తాను పోరాడుతానని చెబుతోంది. ఈ మేరకు ఆమె ఉక్రెయిన్ మిలటరీకి దరఖాస్తు చేసుకుంది. కానీ ఉక్రెయిన్ అధికారులు ఆమె వయసు రీత్యా ఆమె దరఖాస్తును తిరస్కరించారు. కానీ, ఆమె మాత్రం దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని అంటోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఆమెకు అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ వయసు రీత్యా తీసుకోలేదని వివరించింది. అయితే "ఆమె కచ్చితంగా త్వరలో కైవ్లో మరో యుద్ధ విజయాన్ని జరుపుకుంటుందని అనుకుంటున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఉక్రెయిన్ మహిళలు అత్యంత ధైర్యవంతులు అని ఒకరు, ఒక సైనికుడు ఎప్పటికీ సైనికుడే అని మరోకరు ట్వీట్ చేశారు. 98 y.o. Olha Tverdokhlibova, WWII veteran faced a war for the 2nd time in her life. She was ready to defend her Motherland again, but despite all the merits and experience was denied, though, because of age. We are sure, she will celebrate another victory soon in Kyiv!#Ukraine pic.twitter.com/jI39RyCCJK — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 18, 2022 (చదవండి: పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!) -
మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన
Zelenskyy receives a standing ovation from the US lawmakers: ఉక్రెయిన్ పై రష్యా గత 21 రోజులుగా నిరవధిక దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణే ద్యేయంగా రష్యా మరింత దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూఎస్ కాంగ్రెస్తో వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు. వ్లోదిమిర్ జెలెన్ స్కీ స్క్రీన్ పై కనబడగానే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల నిలబడి ప్రశంసించారు. జెలెన్స్కీ అమెరికా కాంగ్రెస్ని మరింత సైనిక సాయం చేయమని కోరారు. రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా రష్యాతో సాగిస్తున్న వ్యాపారాలను ఉపసంహరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆదాయం కంటే శాంతికి పెద్ద పీట వేస్తూ అమెరికా తప్పనిసరిగా దిగుమతులను నిరోధించేలా కట్టుదిట్టం చేయమని కోరారు. రష్యా ఉక్రెయిన్ ఆకాశాన్ని వేలాది మంది మరణాలకు వేదికగా చేసింది." రష్యా మా దేశంలోని విలువలకు, స్వేచ్ఛయుత జీవనానికి భంగం కలిగించేలా దాడి చేసింది. మా కలలను కల్లోల పరిచేలా క్రూరంగా దాడి చేసిందని జెలెన్స్కీ ఆవేదనగా పేర్కొన్నారు". మరోసారి జెలెన్ స్కీ నో ఫ్లై జోన్ అంశం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు రష్యా తమ దేశం పై క్రూరంగా చేస్తున్న దాడుల తాలుకా వీడియోని ప్లే చేశారు. యూఎస్ ఇస్తున మద్దతుకు కృతజ్ఞతలు తెలపడమే కాక తమ దేశం కోసం మరింత చేయమని కోరారు. అమెరికా మద్దతు తమ దేశానికి ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. (చదవండి: రష్యా టీవీ లైవ్షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!) -
రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్లోని పారామిలటరీ దళాలలో చేరాడు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించబడిందని తెలిపారు. అయితే సాయినికేష్ 2018లో ఖార్కివ్లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అతని కుటుంబం సాయినికేష్తో కమ్యూనికేషన్ కోల్పోయింది. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత వారు సాయినికేష్ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. (చదవండి: 'మిలిటరీ ఆపరేషన్' లక్ష్యం 'యుద్ధాన్ని ఆపడమే!: పుతిన్) -
మాట మార్చిన పుతిన్: యుద్ధాన్ని ఆపేందుకే మిలిటరీ ఆపరేషన్!
Goal Of Russias Military Operation: ఉక్రెయిన్ రష్యాల మధ్య సాగుతున్న నిరవధిక పోరు నేటికి 13వ రోజుకి చేరుకుంది. అయితే యూకేలో రష్యన్ రాయబార కార్యాలయం ఉక్రెయిన్లోని మిలటరీ ఆపరేషన్ లక్ష్యం యుద్ధాన్ని ఆపడమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ విక్టోరోవిచ్ లావ్రోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ..ఇది పచ్చి అబద్ధం అని ఖండించారు. అంతేకాదు అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్లోని రష్యన్ మాట్లాడే వర్గాలను రక్షించడమే లక్ష్యంగా 'మిలిటరీ ఆపరేషన్' అని పేర్కొన్నారు. పైగా రష్యాను బెదిరించడానికి ఉక్రెయిన్ను ఉపయోగించకుండా నిరోధించడం అని కూడా చెప్పారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్ వాదనను యుద్ధానికి నిరాధారమైన సాకుగా అభివర్ణించాయి. కానీ ఇప్పుడేమో రష్యా ఎంబసీ ఉక్రెయిన్ భూభాగంలో జరిగే యుద్ధాన్ని ఆపేందుకే ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అయితే అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్కు ఆయుధాలను అందించడమే కాక మాస్కో దురాక్రమణకు అడ్డుకట్టవేసేలా ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు రష్యా సాయుధ బలగాలు రాజధాని కైవ్ని సోంతం చేసుకుంటాం లొంగిపోండి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించడమే కాక ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల బాంబుల వర్షంతో విరుచుకుపడింది. ఈ యుద్ధ విధ్వసం కారణంగా సుమారు 331 మందికి పైగా పౌరులు మరణించినట్లు యూఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. FM #Lavrov: The goal of Russia’s special military operation is to stop any war that could take place on Ukrainian territory or that could start from there. pic.twitter.com/tLf7798DIh — Russian Embassy, UK (@RussianEmbassy) March 7, 2022 (చదవండి: ఓవైపు యుద్ధం.. మరోవైపు తరలింపు!! రష్యా-ఉక్రెయిన్ చెరోమాట) -
భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన మిలిటరీ ఆపరేషన్ రోజుకో మలుపు తిరగుతోంది. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్లో విధ్వంసం మాత్రం ఆగడం లేదు. అయితే రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. యుధ్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తోంది. తాజాగా రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎనిమిదో రోజు జరుగుతున్న యుద్ధంలో రష్యన్ మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్స్కీ హతమైనట్లు బెలారస్ మీడియా వెల్లడించింది. దీనిపై రష్యన్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో అల్లాడుతున్న రష్యాకు, తాజా పరిణామం భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాదేశంలోకి రావద్దు!... రష్యా కాన్వాయ్కి అడ్డుగా నిలుచున్న ఉక్రెయిన్ వ్యక్తి
Block A Russian Military Convoy: రష్యా ఉక్కెయిన్పై భూ, గగన, జల మార్గాల్లో క్షిపణి దాడులతో పశ్చిమ నగరాలను స్వాధీనం చేసుకుంటూ రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఉక్రెయిన్లోని ఒక వ్యక్తి రాజధాని కైవ్లోని ప్రవేశిస్తున్న రష్యా సైనిక కాన్వాయ్ను ఆపేందుకు యత్నించాడు. అంతేకాదు రష్యన్ మిలటరీ వాహనాలకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దు అంటూ చేతులు ఊపుతూ అడ్డంగా నిలుచున్నాడు. పైగా అవి మౌంటెడ్ మెషిన్ గన్లతో కూడిన రష్యన్ మిలిటరీ వాహనాలు కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం బెదరకుండా అత్యంత తెగువను కనబర్చి వాటి ఎదురు నిలబడి ఆపేందుకు శతవిధాల ప్రయత్నించాడు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..యునైటెడ్ నేషన్స్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా శుక్రవారం వీటో చేసిన సంగతి తెలిసిందే. అయితే రష్యా బలగాలు వైమానిక దాడులతో నగరాలను స్వాధీనం చేసుకుంటూ కైవ్లోకి ప్రవేశించడంతో తూర్పు యూరోపియన్ దేశంలోని అధికారులు రాజధాని నగరమైన కైవ్ను రక్షించాలని పౌరులను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ ఉక్రెయిన్ పౌరుడు ఆ రష్యన్ మిలటరీ కాన్వాయ్కి ఎదురు నిలుచుని ఆపేందుకు యత్నించాడు. ఈ ఘటన 1989లో చైనాలో తీసిన "ట్యాంక్ మ్యాన్ ఫోటోని పోలి ఉంది. చైనా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన మరుసటి రోజు టియానన్మెన్ స్క్వేర్ వద్ద ట్యాంక్లను సమీపించే మార్గంలో ఒక వ్యక్తి ఉక్రెయిన్ వ్యక్తి మాదిరే అడ్డంగా నిలుచుని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన 30 నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB — НВ (@tweetsNV) February 25, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం) -
అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!
Ukrainian soldier deciding to record a video: ఉక్రెయిన్పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో దాడుల చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఆకాశం నుంచి పడుతున్న క్షిపణులు వర్షంతో సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు మాస్కో ప్రారంభించిన దాడిలో సుమారు 137 మంది మరణించారని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపిన సంగతి విధితమే. మరో వైపు మాస్కో ఏ మాత్రం కనికరం లేకుండా యుద్థ ట్యాంకులు, నౌకదళ నౌకలు, వైమానిక దాడులతో మూడు వైపుల నుండి భయంకరంగా దాడి చేస్తోంది. అంతకంతకు యుద్ధం తీవ్రతరం కావడంతో ఉక్రెయిన్లోనూ, ప్రపంచ దేశల్లోనూ అందరిలోనూ ఒకటే తీవ్ర ఉత్కంఠ. అదే సమయంలో ఒక సైనికుడు యుద్ధం చేసేందుకు వెళ్లే కొద్ది నిమిషాల ముందు తన తల్లిదండ్రులకు కలిచివేసే ఒక హృదయవిధారక సందేశాత్మక వీడియోని పంపాడు. అతను యుద్ధ బీభత్సంతో ఏ క్షణంలో ఏమవుతుందో అనే భావంతో తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పేందుకు ఒక వీడియోని రికార్డు చేశాడు . ఈ మేరకు ఆ సైనికుడు వీడియోలో.." మేము తీవ్రమైన బాంబు దాడిలో ఉన్నాము, ఇది మా వంతు. అమ్మా, నాన్న, ఐలవ్ యూ " అంటూ 13 నిమిషాల నిడివిగల సందేశాత్మక వీడియోని పంపాడు. ప్రసతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కూడా మేము నీకు తెలియకపోవచ్చు మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. A video of a Ukrainian soldier after the shelling appeared on social networks Mom, Dad, I love you." #UkraineRussiaCrisis #Ukraine pic.twitter.com/Itz413EhHU — fazil Mir (@Fazilmir900) February 24, 2022 (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం ఏం పని మీకు ?) -
Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?
Military Strengths of Russia and Ukraine, Compared: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడడమే కష్టం. రెండు దేశాల మిలటరీ బలాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రష్యా బాహుబలి అయితే, దాని ముందు ఉక్రెయిన్ ఒక మరుగుజ్జు కిందే లెక్క. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నప్పటితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ మిలటరీ బాగా బలపడింది. సైన్యం బాగా శిక్షణ పొంది గట్టి పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. గత కొద్ది వారాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యాన్ని మూడు వైపుల నుంచి మోహరించారు. క్షిపణి వ్యవస్థలో ప్రపంచంలోనే రష్యా కింగ్. ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే క్షిపణులు రష్యా దగ్గర ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ మార్కెట్ను పరిశీలించే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) గణాంకాల ప్రకారం రక్షణ బడ్జెట్పై ఉక్రెయిన్ వ్యయంతో పోల్చి చూస్తే రష్యా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణ రంగంపై 6,170 కోట్ల డాలర్లు ఖర్చు పెడితే, ఉక్రెయిన్ 590 కోట్ల డాలర్లు వెచ్చించింది. ప్రపంచ దేశాల సైనిక బలాబలాలను విశ్లేషించే గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం మిలటరీ పవర్లో 140 దేశాల్లో రష్యాది రెండో స్థానమైతే, ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధ భయంతో ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ఈ మధ్య కాలంలో మిలటరీ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ సైనిక సిబ్బందిని 3,61,00కి పెంచారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') ఉక్రెయిన్కి పశ్చిమ దేశాల అండ ఇలా.. పశ్చిమాది దేశాలు రష్యాపై విమర్శలు గుప్పిస్తూ ఉక్రెయిన్కి అండగా ఉంటామని చెబుతున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆయుధాలతో పాటుగా సైనిక బలగాలను ఇతర దేశాల నుంచి ఆశిస్తోంది. అమెరికా 2014 నుంచి ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహకారం అందిస్తూ వస్తోంది. 250 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ఇప్పటివరకు చేసింది. గత డిసెంబర్ నుంచి జావెలిన్ యాంటీ ట్యాంకు క్షిపణులు, నిఘా నౌకలు, హమ్వీస్, స్నిపర్ రైఫిల్స్, డ్రోన్లు, రాడార్ వ్యవస్థ, నైట్ విజన్, రేడియో పరికరాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్ , ఆయుధాలు, మరబోట్లు వంటివి సరఫరా చేసింది. ప్రస్తుతం తమ దేశం నుంచి ఎలాంటి బలగాలు పంపించబోమని అమెరికా స్పష్టం చేసింది. గత మూడు నెలల్లో దాదాపుగా 90 టన్నుల ఆయుధాలను అమెరికా పంపింది. దీంతో ఉక్రెయిన్ దగ్గరున్న మిలటరీ ఆయుధాలు 1300 టన్నులకు చేరుకున్నాయి. బ్రిటన్ 2,000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ని పంపడంతో పాటు వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల్ని కూడా పంపించింది. టర్కీ బేరట్కార్ టీబీ2 డ్రోన్లను విక్రయించింది. ఎస్టోనియా జావెలిన్ యాంటీ ఆర్మర్ క్షిపణులు, లుథానియా స్ట్రింగర్ క్షిపణులు, చెక్ రిపబ్లిక్ 152ఎంఎం ఫిరంగులు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. జర్మనీ ఆయుధాలు సరఫరా చేయడానికి నిరాకరించినప్పటికీ, యుద్ధభూమిలో ఆస్పత్రులు, ఇతర శిక్షణ కోసం 60 లక్షల డాలర్ల ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది. చదవండి: (Russia- Ukraine war: తెల్లవారుతూనే నిప్పుల వాన) -
రష్యా ముందు పసికూన ఉక్రెయిన్ నిలుస్తుందా?.. బలబలాలు ఇవే..!
రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి సమస్య సద్ధమణిగిందని అనుకునేలోపే యుద్ధం వరకు వెళ్లింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయన్పై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించి యుద్ధానికి తెర లేపారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ గట్టి సంకేతాలే పంపారు. చర్చలతో ముగుస్తుందనుకున్న ఈ సమస్య కాస్త వార్ వరకు వెళ్లింది. సాధారణంగా యుద్ధమంటే ఇద్దరు సమ ఉజ్జీలుగా మధ్యనో లేదా కాస్త అటు ఇటు బలం ఉన్న వారి మధ్య జరుగుతుంది. కానీ ఈ దేశాల బలబలాను పరిశీలిస్తే.. రష్యా ఉక్రెయిన్ మధ్య అంతర్యం చాలానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాటిని ఓ లుక్కెద్దాం! -
రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా!
వాషింగ్టన్/ఐరాస: ఉక్రెయిన్పై రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఆ దేశంపై కఠిన ఆంక్షలకు అమెరికా తెర తీసింది. పాశ్చాత్య దేశాలతో రష్యా ప్రభుత్వ అభివృద్ధి సంస్థ (వీఈబీ), సైనిక బ్యాంకు లావాదేవీలపై పూర్తి నిషేధం విధించింది. రష్యా సావరిన్ రుణాలకు కూడా తమ ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో రష్యా ఇకపై ఎలాంటి వర్తక, వాణిజ్యాలూ జరపలేదన్నారు. తమ మార్కెట్లకు రష్యా ఇక పూర్తిగా దూరమైనట్టేనన్నారు. తమ పాశ్చాత్య మిత్రులతో సన్నిహితంగా చర్చించిన మీదటే ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అతి త్వరలో మరిన్ని వరుస ఆంక్షలుంటాయని హెచ్చరించారు. అవి రష్యా సంపన్నులు, వారి కుటుంబీకులను లక్ష్యం చేసుకుని ఉంటాయని వెల్లడించారు. రష్యా అవినీతిమయ విధానాలతో భారీగా లాభపడే ఈ కుబేరులు ఇప్పుడు నొప్పిని కూడా భరించాల్సి ఉంటుందన్నారు. అలాగే జర్మనీతో కలిసి రష్యా తలపెట్టిన నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ముందుకు సాగే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. రష్యా చర్యలన్నింటికీ అంతకు మించిన ప్రతి చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇచ్చే అధికారం రష్యాకు ఎవరిచ్చారంటూ బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్లోని ఒక పెద్ద భూభూగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తనంత తానుగా స్వతంత్రం ప్రకటించారు! తద్వారా అంతర్జాతీయ చట్టాలను, న్యాయాలను తుంగలో తొక్కారు. అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్తామని తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడికి ఆరంభమే’’ అంటూ బైడెన్ మండిపడ్డారు. ఇందుకు ప్రతి చర్యగా ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలతో కూడిన బాల్టిక్ ప్రాంతానికి మరిన్ని అమెరికా దళాలను, ఆయుధాలను పంపుతున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. అయితే రష్యాతో యుద్ధానికి దిగే ఉద్దేశమేదీ అమెరికాకు లేదని స్పష్టం చేశారు. కాకపోతే నాటో సభ్య దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడి తీరతామని రష్యాకు గట్టి సందేశమివ్వడమే తమ ఉద్దేశమన్నారు. రష్యా దూకుడు మానకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని ఇంగ్లండ్ కూడా మరోసారి హెచ్చరించింది. సంక్షోభం నుంచి బయట పడేందుకు ఉక్రెయిన్కు 50 కోట్ల డాలర్ల దాకా రుణ సాయం చేస్తామని పునరుద్ఘాటించింది. ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు కూడా బుధవారం రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యాపై ఆంక్షలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలిస్తూ సమస్యను అమెరికాయే ఎగదోస్తోందని ఆరోపించింది. సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించడం తక్షణావసరమని సూచించింది. మరోవైపు ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై గురువారం జరగాల్సిన అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ రద్దయింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ మేరకు ప్రకటించారు. కాకపోతే సంక్షోభ నివారణకు చర్చలకు తామిప్పటికే సిద్ధమేనని బైడెన్ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి విఘాతమంటూ పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి పెద్ద సంక్షోభమిది: గుటెరెస్ రష్యా దూకుడుతో ప్రపంచ శాంతి, భద్రత పెను సంక్షోభంలో పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఉక్రెయిన్లోకి సైన్యాన్ని పంపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దుయ్యబట్టారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు, ఐరాస నియమావళికి గొడ్డలి పెట్టేనన్నారు. పొరుగు దేశంలోకి జరిపిన సైనిక చొరబాటుకు శాంతి పరిరక్షణ అని పేరు పెట్టడం దారుణమన్నారు. తన దూకుడు చర్యల నుంచి తక్షణం వెనక్కు తగ్గాలని రష్యాను హెచ్చరించారు. లేదంటే ఇరు దేశాలూ అంతమంగా తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కు ఐరాస పూర్తి మద్దతుంటుందని చెప్పారు. తిరిగొస్తున్న మన విద్యార్థులు న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్లకు చెందిన విద్యార్థులు మంగళవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి టర్కీకి, అక్కడి నుంచి కతార్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. తామున్న చోట్ల ఉద్రిక్త పరిస్థితులేమీ లేకున్నా భారత ఎంబసీ సూచన మేరకు తిరిగొచ్చినట్టు చెప్పారు. అదే ఉద్రిక్తత కీవ్: రష్యా దూకుడు నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. వేర్పాటువాద ప్రాంతాల వద్ద సైన్యానికి, రెబెల్స్కు మధ్య కాల్పులు పెరుగుతున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశించారు. రష్యాతో సహా పలు దేశాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్లోని తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తున్నాయి. యుద్ధ భయాల దెబ్బకు పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు పడకేశాయి. దాంతో కొద్ది వారాల వ్యవధిలో వందల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు హరించుకుపోయి ఆర్థికంగా దేశం అల్లాడుతోంది. రష్యా పథకం ప్రకారం ఉక్రెయిన్ను ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బ తీస్తోందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచ గోధుమ సరఫరాల్లో 12 శాతం, మొక్కజొన్నలో 16 శాతం వాటా ఉక్రెయిన్దే. వాటి ఎగుమతులపై దెబ్బ పడేలా కన్పిస్తోంది. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దేశం వీడుతున్నారు. జనం తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఉన్నపళంగా ఖాళీ చేసుకుంటున్నారు. జనవరిలో 1,250 కోట్ల డాలర్లు విత్డ్రా అయ్యాయని అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు. రష్యాపై దేశాల ఆంక్షలు ► అమెరికా వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 సబ్సిడరీలపై నిషేధం. ఐదుగురు రష్యా కుబేరుల ఖాతాల స్తంభన. డోన్బాస్ రీజియన్తో అమెరికావాసులెవరూ వర్తక లావాదేవీలు చేయొద్దని ఆదేశాలు. ► జర్మనీ రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్కు అనుమతుల నిలిపివేత ► ఇంగ్లండ్ ఐదు రష్యా బ్యాంకులపై నిషేధం. ముగ్గురు ఆ దేశ సంపన్నుల ఖాతాల స్తంభన. ► యూరోపియన్ యూనియన్ రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమాలోని 351 మంది సభ్యుల ఆస్తుల స్తంభన, వీసాలపై నిషేధం. ► ఆస్ట్రేలియా రష్యా సెక్యూరిటీ కౌన్సిల్లోని 8 మందిపై, సైనిక సంబంధాలున్న రష్యా బ్యాంకులపై నిషేధం ► జపాన్ రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, వర్తకంపై నిషేధం ► కెనడా రష్యా బ్యాంకులపై, సావరిన్ రుణ లావాదేవీల్లో కెనడావాసులు పాల్గొనడంపై నిషేధం. -
ఆ ఊరే ఓ సైన్యం.. ఉగ్గిపాలతో పాటు ధైర్యాన్ని నూరి పోస్తూ..
ముగడ(బాడంగి)/విజయనగరం: ఆ గ్రామ తల్లులు తమ పిల్లలకు ఉగ్గిపాలతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. దానినే ఊపిరిగా మారుస్తున్నారు. వీరులుగా తీర్చిదిద్దుతున్నారు. క్రమశిక్షణ అలవాటు చేస్తూ భరతమాత సేవకు సిద్ధం చేస్తున్నారు. యుక్తవయసు రాగానే సరిహద్దులో సేవలందించేందుకు పంపిస్తున్నారు. అందుకే.. ఆ ఊరే ఓ సైన్యంగా మారింది. ధైర్యసాహసాలతో శుత్రుదేశ సైనికుల్లో వణుకుపుట్టించే మిలటరీ వీరులకు పుట్టినిల్లుగా మారిన ముగడ గ్రామంపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. చదవండి: బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు.. ముగడ.. ఈ గ్రామం పేరుచెబితే ఠక్కున గుర్తొచ్చేది సైనికులే. గ్రామంలో సుమారు 983 కుటుంబాలు నివసిస్తుండగా.. 200 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, బీఎస్ఎఫ్ దళాల్లో పనిచేస్తున్నారు. నాలుగువేల మంది జనాభా ఉన్న గ్రామంలో రెండువేల మందివరకు విద్యావంతులు ఉన్నారు. గ్రామ యువత క్రమశిక్షణకు మారుపేరు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి గ్రామానికి చెందిన యువకులు సైన్యంలో సేవలందిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సహం... తల్లులు ధైర్యాన్ని నింపుతూ పిల్లలను పెంచుతుంటే... తండ్రులు దేశ సేవలో తరలించేలా ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే శారీరక దారుఢ్యం పెంచుకునేలా తర్ఫీదునిస్తున్నారు. రక్షణ దళాల్లో చేరేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. చైతన్యం నింపుతున్నారు. వివిధ కేడర్లలో గ్రామ యువత.. గ్రామానికి చెందిన దాదాపు 63 మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. మరికొందరు కల్నల్, లెఫ్ట్నెంట్ కల్నల్, సేబేదార్ వంటి కేడర్లలో పనిచేస్తున్నారు. స్వర్గీయ చప్ప సూర్యనారాయణ (వైద్యాధికారి)గా పనిచేయగా, స్వర్గీయ కోటస్వామినాయుడు, తెంటు స్వామినాయుడు కల్నల్గా సేవలందించారు. ప్రస్తుతం యమాల శ్రీనివాసరావు రాజస్థాన్ కోటిలో సుబేదార్గా పనిచేస్తుండగా, చొక్కాపు విజయ్కుమార్ అస్సాంలో కెఫ్టెన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మత్సరాము మద్రాస్ ఇంజినీరింగ్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. వైమానికాదళంలో వివిధ క్యాడర్లలో పనిచేసి రిటైర్ అయినవారిలో మత్స మురళీధరరావు, మత్సరాము ఉన్నారు. మత్సరాము కొడుకు వైమానిక దళంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞానం పంచే గ్రంథాలయం... ముగడలో సైనికులు స్వయంగా ఓ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో దినపత్రికలతో పాటు గ్రామ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయమే ఉద్యోగాల సాధనకు బాసటగా నిలుస్తోంది. విజ్ఞానం పంచుతోంది. ఊరిలోనూ సేవలు... దేశానికే కాదు.. తమ గ్రామానికి సైనికులు సేవలందిస్తున్నారు. వివిధ పర్వదినాల్లో గ్రామానికి చేరకుని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. సొంత డబ్బులతో రోడ్లు బాగుచేస్తున్నారు. మొక్కులు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. అందుకే...గ్రామం ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుతారు. దేశభక్తిని ప్రదర్శిస్తారు. ఆయనే స్ఫూర్తి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మిలటరీలో చేరేందుకు యువకులు భయపడేవారు. అప్పట్లో గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు యామల స్వామినాయుడు మిలటరీలో చేరేలా యువతను ప్రోత్సహించారు. సొంత బావమరిది కోట స్వామినాయుడు మిలటరీలో చేరేలా శిక్షణ ఇచ్చారు. ఆయన కల్నల్ స్థాయికి ఎదిగి గ్రామ యువతకు మార్గదర్శకంగా నిలిచారు. సైన్యంలో చేరేలా యువతకు స్ఫూర్తిమంత్రం బోధించారు. అప్పటి నుంచి గ్రామ యువత దేశ సేవకు పునరంకితమవుతూనే ఉంది. గర్వంగా ఉంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. వివిధ క్యాడర్లలో పనిచేశాను. ప్రస్తుతం రాజస్తాన్లోని కోటలో సుబేదార్గా విధులు నిర్వర్తిస్తున్నా. నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా.. చదువులో ప్రోత్సహించారు. వారిచ్చిన నైతిక మద్దతుతోనే సైన్యంలో చేరాను. – యామల శ్రీనివాసరావు, ముగడ వైమానిక దళంలో పనిచేయడం నా అదృష్టం దేశరక్షణలో భాగంగా త్రివిధ దళాల్లో ఒకటైన వైమానికదళంలో ఫిట్టర్గా, వర్క్డ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన వెంటనే ఎయిర్ఫోర్స్కు సెలక్టయ్యాను. నా తండ్రి మత్ససూర్యనారాయణ మద్రాస్లో డాక్టర్ కోర్స్ చదివారు. ఆయన ప్రోత్సాహంతోనే వైమానిక దళంలో చేరాను. దేశానికి సేవచేసే భాగ్యం కలగడం నా అదృష్టం. – మత్స మురళీధరరావు, విశ్రాంత ఎయిఫోర్స్ అధికారి, ముగడ -
ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు
ఒట్టోవా: దేశంలో జరుగుతున్న టీకా వ్యతిరేక నిరసనలపై మిలటరీని ప్రయోగించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభిప్రాయపడ్డారు. నిరసనలపై మిలటరీ ప్రయోగం సహా అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని గతంలో పోలీసులు చెప్పారు. అయితే ట్రూడో మాత్రం ఇప్పట్లో ఆ అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్కు, కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది జరుపుతున్న నిరసనలతో కొన్ని వారాలుగా కెనెడా సతమతమవుతోంది. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ట్రంప్ లాంటి వారి మద్దతు కూడా లభించింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వాలు సాయం కోరితే అప్పుడు మాత్రమే మిలటరీ ఉపయోగంపై ఆలోచిస్తామని ట్రూడో తెలిపారు. చదవండి: భారత్తో సంబంధాలపై ఉక్రెయిన్ ప్రభావం లేదు -
ఉక్రెయిన్ కేంద్రంగా.. పెద్దన్నల పోట్లాట
ఉక్రెయిన్పై భారీ సైనిక చర్య దిశగా రష్యా ముమ్మర సన్నాహాలు. అదే జరిగితే కఠినమైన ఆంక్షలతో పాటు సైనికంగా కూడా తీవ్రస్థాయిలో ప్రతి చర్యలు తప్పవని అమెరికా బెదిరింపులు. ఉక్రెయిన్లో సైనిక స్థావరాల ఏర్పాటుతో రష్యాను కట్టడి చేసేందుకు నాటో ప్రయత్నాలు. ఆ కూటమిలో చేరి రష్యా దాడి గండం నుంచి గట్టెక్కాలని చూస్తున్న ఉక్రెయిన్. ఈ మాజీ సోవియట్ సభ్య దేశం కేంద్రంగా అమెరికా నేతృత్వంలోని యూరప్ దేశాలకు, రష్యాకు మధ్య నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నాయి? రష్యా, ఉక్రెయిన్ గొడవలు ఇప్పటివి కావు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన నాటినుంచీ వాటి మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అది కాస్తా పెరిగి 2014లో దక్షిణ ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా ఆక్రమించి తన భూభాగంలో కలుపుకునే దాకా వెళ్లింది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రావిన్సుల్లో పెచ్చరిల్లిన వేర్పాటువాద ఉద్యమాలను రష్యానే పెంచి పోషిస్తోందన్నది పాశ్చాత్య దేశాల ఆరోపణ. రష్యా వీటిని ఖండిస్తున్నా, వేర్పాటువాద దళాలకు రష్యా సైనికాధికారులే నేరుగా నాయకత్వం వహిస్తున్నారని ఉక్రెయిన్ అంటోంది. 2015లో జర్మనీ, ఫ్రాన్స్ జోక్యంతో శాం తి ఒప్పందం కుదిరినా మూణ్నాల్ల ముచ్చటే అ యింది. తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష, ఆ ప్రాంతాలకు విస్తృత స్వయంప్రతిపత్తి వంటి నిబంధనను ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ రష్యా ఏడాదిగా మళ్లీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తాజాగా 1.75 లక్షల సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దులకు 200 కిలోమీటర్ల దూరంలో మోహరించిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇదంతా ఆ దేశంపై మెరుపు దాడి కోసమేనని మండిపడుతోంది. రష్యా మాత్రం తమకలాంటి ఉద్దేశమే లేదని, అవన్నీ సొంత భూభాగంలో రొటీన్ సైనిక విన్యాసాలేనని చెప్పుకొస్తోంది. నెలన్నర కింద రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మధ్య గంటన్నర పాటు జరిగిన వీడియో కాల్ చర్చలు ఉక్రెయిన్ విషయమై వారిద్దరి పరస్పర హెచ్చరికలతో అర్ధంతరంగానే ముగిశాయి. సైనిక చర్యకు తెగబడితే తీవ్ర పరిణామాలు తప్పవని చర్చల అనంతరం రష్యాను బైడెన్ హెచ్చరిం చారు. నాటో కేంద్రంగా గొడవ ఎలాగోలా నాటో కూటమిలో చేరితే అమెరికాతో పాటు శక్తివంతమైన యూరప్ దేశాల దన్నుంటుంది గనుక రష్యా సైనిక బెదిరింపులకు చెక్ చెప్పొచ్చన్నది ఉక్రెయిన్ భావన. ఈ ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. సరిహద్దు గొడవలున్న దేశానికి సభ్యత్వం ఇవ్వడానికి నాటో రూల్స్ ఒప్పుకోవు. ఉక్రెయిన్పై రష్యా సైనిక దూకుడుకు ఇదీ ఓ కారణమేనని భావిస్తున్నారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని పుతిన్ పట్టుబడుతున్నారు. అమెరికా నుంచి ఈ మేరకు చట్టబద్ధమైన హామీ డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాను తక్షణం నిలిపేయాలని కూడా కోరుతున్నారు. బైడెన్ మాత్రం రష్యా దూకుడే అసలు సమస్య గనుక దానికి తక్షణం ఫుల్స్టాప్ పెట్టాలని అంటున్నారు. ఏం జరగవచ్చు? కఠినమైన ఆర్థిక ఆంక్షలు తప్పవన్న అమెరికా, యూరప్ దేశాల హెచ్చరికల నేపథ్యంలో రష్యా ఎంతో కొంత వెనక్కు తగ్గవచ్చన్నది కొందరు విశ్లేషకుల భావన. అయితే సైనిక మోహరింపు తదితరాల తర్వాత యూఎస్, యూరప్ దేశాల నుంచి రష్యాకు అనుకూలంగా హామీల వంటివైనా సాధించకుండా వెనక్కు తగ్గితే స్వదేశంలో పుతిన్కు సమస్యేనంటున్నారు. ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కన్పించడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్కు యూఎస్ భారీగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంచుతోంది. పలు యూరప్ దేశాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. వీటిని తక్షణం నిలిపేయాలన్న రష్యా డిమాండ్కు అవి ఒప్పకుంటే ఉద్రిక్తతలు ఎంతో కొంత తగ్గే ఆస్కారముంటుంది. అలాగాక రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు యుద్ధంగా మారితే యూరప్కు గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడవచ్చు. యూరప్కు దాదాపు 40 శాతం గ్యాస్ రష్యా నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా జర్మనీ చాలావరకు రష్యా గ్యాస్పైనే ఆధారపడింది. ఇప్పటికే యూరప్కు గ్యాస్ సరఫరాను రష్యా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా తగ్గిస్తూ వస్తోంది. గ్యాస్ అవసరాలు పీక్స్లో ఉండే శీతాకాలం వేళ సరఫరా తగ్గిపోవడంతో ఆ దేశాలు ఇప్పటికే అల్లాడుతున్నాయి. -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్చౌక్ క్లాక్ టవర్పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్లో ప్రదర్శించింది. ఉత్తర్ప్రదేశ్లో రిపబ్లిక్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
సైనిక వాహనాల ఎగ్జిబిషన్ అదుర్స్
-
Hyderabad: బిపిన్ రావత్ యాదిలో..
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా.. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్నార్ ద్వారా హాజరయ్యేవారు. ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో.. – కంటోన్మెంట్ చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి -
సైనికులపై హత్య కేసు
కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్ ఫోర్స్ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్ జిల్లాలోని తిజిత్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నాగాలాండ్ బంద్ ప్రశాంతం జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ప్రకటించింది. వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్ఎస్ఎఫ్ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. హార్న్బిల్ ఫెస్టివల్ ఒక్కరోజు నిలిపివేత సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్బిల్ ఫెస్టివల్ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్ కోన్యాక్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించారు. బలగాల కాల్పులపై మోన్లో స్థానికుల ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాగాలాండ్లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్లాల్ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్’లో పారాట్రూపర్గా పని చేస్తున్నాడని చెప్పారు. -
Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!
లక్నో: కాస్త ఏమరుపాటుగా ఉంటే దొంగలు తమచేతి వాటం చూపిస్తారు. సాధారణంగా నగానట్రో, రోడ్డుపై ఉన్న వాహనాలనో మూడోకంటికి తెలీకుండా పనికానిచ్చేస్తారు. ఐతే ఓ దొంగల ముఠా ఏ కంగా విమానం టైర్ను ఎత్తుకెళ్లింది! లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్బేస్ నుండి జోధ్పూర్ వైమానిక స్థావరానికి సైనిక వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కులో మిరాజ్ ఫైటర్ జెట్ విమానం టైర్ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. నవంబర్ 27 అర్ధరాత్రి లక్నోలోని షాహీద్ పాత్లో జోధ్పూర్ ఎయిర్బేస్కు వెళ్తున్న సమయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే.. షాహీద్ పాత్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ పోలీసులకు విషయం తెలియజేసే సమయానికి దొంగలు పరారయ్యారు. అతను పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా షాహీద్ మార్గంలో జామ్ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి 1 గంటల మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ తెలిపారు. బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుండి సైనిక వస్తువుల సరుకును తీసుకువెళుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానానికి చెందిన ఐదు టైర్లు లక్నో ఎయిర్బేస్ నుండి అజ్మీర్కు ట్రక్కులో రవాణా అవుతున్నాయి. అందులో ఒక టైరును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నవంబర్ 27న చోటుచేసుకోగా.. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
పాక్ ప్రధానికి పదవీ గండం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు పదవీ గండం తప్పేలా లేదు. ఇటీవలి కాలంలో ఆర్మీ, ఇమ్రాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ప్రజల్లో ఇమ్రాన్ పలుకుబడి కూడా తగ్గిపోయింది. అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు మద్దతు వెనక్కి తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. తన అవసరం పాకిస్తాన్కు ఎంతో ఉందనీ, త్వరలోనే తిరిగి అక్కడికి వెళతానని ఇటీవల ఆయన అన్నట్లు ‘సీఎన్ఎన్–న్యూస్18’ తెలిపింది. అవినీతి కేసుల్లో 2019లో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు పదేళ్ల జైలుశిక్ష వేసింది. అనంతరం అనారోగ్య కారణాలతో ఆయన లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. త్వరలోనే ఆయన స్వదేశానికి చేరుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కధిమి ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్ మిలటరీ దీన్ని హత్యాప్రయత్నమని పేర్కొంది. బాగ్దాద్లోని పటిష్టమైన గ్రీన్జోన్లో ఉన్న కధిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 'నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని' కధిమి తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. చదవండి: (పునీత్ రాజ్కుమార్కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) -
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్తో అప్గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్లో ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్లో ఎన్కౌంటర్లో జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మోత మోగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ఒకటి. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడపా జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్ .. -
అమెరికాకు డెడ్లైన్ విధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్లైన్ విధించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకూ వార్నింగ్ అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! Afghanistan: ఆమె భయపడినంతా అయింది! అఫ్గనిస్తాన్లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్తో నిశ్చితార్థం రద్దు: నటి -
యుద్ధభూమిలో బతుకు పోరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉదయం ఆరుగంటలు.. అఫ్గానిస్తాన్లోని భాగ్రామ్ యూఎస్ ఆర్మీ బేస్. నేల మీద అడుగుమేర పేరుకుపోయిన మంచును భారతీయులు తొలగిస్తున్నారు. ఈలోపు తాలిబన్లు రాకెట్ లాంఛర్లు వేస్తున్నారని ఆర్మీ సైరన్ మోగింది. క్షణాల్లో అంతా బంకర్లలోకి దూరారు. కొన్ని గంటల తరువాత ‘ఆల్ క్లియర్’ అని మెసేజ్ మైకుల్లో విన్నాకే అంతా బయటికొచ్చి తిరిగి పనుల్లో మునిగిపోయారు. ఇదీ.. అఫ్గానిస్తాన్లోని ఆర్మీ బేస్ల్లో భారతీయుల దైనందిన జీవితం. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల రక్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్కు దగ్గరగా ఉండి.. అత్యంత ప్రమాదకరమైన దేశమైన అఫ్గానిస్తాన్లో ఉద్యోగం అంటే సాహసమనే చెప్పాలి. కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ప్రాణాలకు తెగించి అక్కడ వందలాది మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలని ప్రతీదినం ఆకాశం నుంచి పడే రాకెట్ లాంఛర్లు, గ్రనేడ్లు, తుపాకీ తూటాల జడివానలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డాలర్ల కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్లో పనిచేస్తున్న భారతీయుల జీవితం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా ఉంటుంది. అందుకే.. అక్కడ ఆర్మీ బేస్ల్లో భారతీయుల జీవితం ఎలా ఉంటుందో తెలిపేందుకు ప్రయత్నమే ఇది. నిత్య సంఘర్షణే.. అఫ్గానిస్తాన్లో జీవితం అంటే నిత్య సంఘర్షణే. ప్రకృతిపై పోరులో గెలిచే జీవే ఈ భూమిపై మనుగడ సాగించగలదు అన్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఘటనలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. 2001, సెప్టెంబర్ 11 దాడి తరువాత అమెరికా అఫ్గానిస్తాన్లో తాలిబన్ల ఏరివేత మొదలుపెట్టింది. అప్పటికే దేశం తాలిబన్ల అధీనంలో ఉంది. అందుకే.. వారిని ఎదురించేందుకు సురక్షితమైన ఆర్మీ బేస్లు నిర్మించింది. అక్కడ పనిచేసేందుకు నమ్మకస్తులు కావాలి. ప్రపంచంలో అత్యంత నమ్మకస్తులు, మంచి పనివాళ్లు భారతీయులే అన్నది అమెరికన్ల విశ్వాసం. అందుకే, ఇక్కడ కొన్ని కంపెనీల ద్వారా ఆర్మీ బేస్ల్లో రిక్రూట్మెంట్ చేసుకుంది. వెయ్యి డాలర్ల (భారత కరెన్సీలో రూ.75 వేలు) కనీస వేతనంతో చేసే ఈ చిన్న కొలువులకు మాత్రం గుండెధైర్యం ఎంతో కావాలి. అందుకే.. కొందరు 1,500 డాలర్లు ఇస్తామన్నా వెళ్లరు. కానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ, గోవా, కేరళ నుంచి వందలామంది వెళ్లి ఈ క్యాంపుల్లో చేస్తున్నారు. శత్రుదుర్భేధ్యం.. కాందహార్కు సమీపంలో భాగ్రామ్ అనే నగరంలో అమెరికాకు ఆర్మీబేస్ ఉంది. దీనిపై ప్రతిరోజూ తాలిబన్లు రాకెట్ లాంచర్లతో దాడులు, ఇతర బాంబు దాడులు చేస్తూనే ఉంటారు. అందుకే దీన్ని అనేక అంచెల్లో శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ఎటుచూసినా 4 కి.మీ. వైశాల్యం ఉండే ఈ బేస్ చుట్లూ 20 అడుగులకుపైగా ఎత్తైన గోడ ఉండి, దానిపై ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్పై పక్షి వాలినా అప్రమత్తం చేసే సాంకేతికత. ఇక ప్రతీ 200 మీటర్లకు ఒక వాచ్టవర్. ఆర్మీబేస్ చుట్టూ 24 గంటలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పెట్రోలింగ్. గాలిలో హెలికాప్టర్లు, వాటిపైన ఫైటర్ జెట్లు, వాటిపై కంటికి కనిపించకుండా సంచరించే డ్రోన్లు. ఇక లోపలి వారి సెక్యూరిటీ కోసం సీ–ర్యామ్ అని పిలిచే యాంటీ మిస్సైల్ సిస్టమ్ ఉంటుంది. ఈ బేస్ లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ లాంచర్లు, మోర్టార్లు, గ్రనేడ్లను గాలిలోనే పేల్చేస్తుంది. ఇంతటి పకడ్బందీ రక్షణ వ్యవస్థలో లోపల ఉండే అమెరికా సైనికుల రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు భారతీయులు పనిచేస్తున్నారు. డ్రైవర్, కుకింగ్, హౌస్కీపింగ్, సూపర్వైజర్, మిషన్స్ మెయింటెనెన్స్ చూసేది భారతీయులే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులు ఇంటర్వూ్యకు కూడా అనర్హులు కావడం గమనార్హం. ఉద్యోగులు ఆర్మీ బేస్ క్యాంపులోకి ప్రవేశించే ముందు రక్తం, మూత్రం శాంపిళ్లు తీసుకుని డ్రగ్ టెస్టు నిర్వహిస్తారు. వాటిలో క్లియరెన్స్ వస్తేనే లోపలికి అనుమతిస్తారు. సైరన్ ఆధారంగా సంచారం.. ఆర్మీబేస్లో నిర్మించిన గోడలన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్. ప్రతీ ఆఫీసు లేదా క్వార్టర్ కింద సొరంగాలు, బంకర్లు నిర్మించి ఉంటాయి. తాలిబన్లు రాకెట్ లాంచర్లు, మిస్సైళ్లు ప్రయోగించగానే.. సైరన్ మోగుతుంది. అంతే, అంతా అప్రమత్తమై బంకర్లలోకి వెళ్తారు. ఆల్క్లియర్ అంటూ మైకుల్లో సందేశం ఇచ్చేవరకు ఎవరూ బయటికిరారు. బయటికి వచ్చాక అందరూ క్షేమమే అని వారి ఇన్చార్జీలకు రిపోర్ట్ చేయాలి. తరువాతే పనిలోకి వెళ్లాలి. సైనికులతో సహా అంతా విధిగా ఐడీ కార్డులు ధరించాలి. ఇక లోపల నీరు, వైద్యం, జనరల్ స్టోర్స్ ఉంటాయి. రాకెట్ లాంచర్లు ఒక్కోసారి లోపలికి పడుతుంటాయి. గాయపడ్డవారికి అక్కడే ఉన్న ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఇంటర్నెట్ కూడా ఇస్తారు కానీ, దానిపై పర్యవేక్షణ ఉంటుంది. వీరంతా కుటుంబాలతో వీడియోకాల్స్ మాట్లాడేందుకు ఎక్కువగా నెట్పై ఆధారపడతారు. ఆల్కహాల్కు అనుమతి లేదు. తాగి ఉన్నప్పుడు బాంబులు పడితే తప్పించుకోలేరన్న నిబంధనలే కారణం. ఇసుక తుపాన్లు.. ఇక్కడ అపుడప్పుడు వచ్చే ఇసుక తుపాన్లు కూడా ప్రమాదకరమే. ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనిపించడు. ఫలితంగా యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ పనిచేయదు. ఇదే అదనుగా తాలిబన్లు రాకెట్ లాంచర్లు, మిస్సైల్స్తో విరుచుకుపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి లాంచర్లు ఆర్మీ బేస్లోని లక్ష్యాలను తాకుతాయి. కానీ, ఎవరూ గాయపడకుండా ముందు జాగ్రత్తగా బంకర్లలోకి వెళ్లిపోతారు. ఇక, ఇక్కడ చలికాలం, వేసవి రెండే కాలాలు. మైనస్ డిగ్రీల్లో ఎముకలు కొరికే చలి. 50 డిగ్రీలు దాటే ఎండ. అందుకే, ఆర్మీ బేస్లో టాయ్లెట్లతో సహా అంతటా ఏసీ వ్యవస్థ ఉంటుంది. ముందే వచ్చి ప్రాణాలు కాపాడుకున్నా భాగ్రామ్, కాందహార్ ఆర్మీ బేస్ల్లో తెలుగువారు, గోవా, కేరళ రాష్ట్రాలవారున్నారు.అక్కడ యుద్ధం నడుస్తున్నా.. ఆర్మీబేస్ సురక్షితంగా ఉంటుంది. అమెరికన్లకు భారతీయులు అంటే ఎంతో గౌరవం, అభిమానం. అందుకే.. ఈ క్యాంపుల్లో నియామకాల్లో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ప్రతీ 4 నెలలకు ఒకసారి సొంతూరు వచ్చేందుకు విమాన టికెట్లు ఇస్తారు. మేమంతా దుబాయ్ మీదుగా భారత్కు వస్తాం. అక్కడ పనిచేసే వారంతా 2006 నుంచి 2015 వరకు ఇరాక్లోని అమెరికా ఆర్మీ బేస్లో పనిచేసిన అనుభవం ఉన్నవారే కావడం విశేషం. ఆ అనుభవంతోనే మాకు మేం 2016లో అఫ్గానిస్తాన్ వెళ్లాం. కాంట్రాక్టు ముగియడంతో నేను మేలో వచ్చేశా. అప్పటికే అమెరికన్లు స్వదేశానికి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు భారత్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయులంతా సురక్షితంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. – రాములు, ముంజంపల్లి, కరీంనగర్ -
అమెరికా చేసిన పొరపాట్లే.. అఫ్గానిస్తాన్కు శాపమా?
కాబూల్: అగ్రరాజ్యంపై 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో దానికి కారకులైన అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడం లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా ప్రభుత్వం. అలా సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో అఫ్గానిస్తాన్లో 2001లో సైనిక చర్యకు దిగింది. ఇక అనుకున్న పని పూర్తి చేసిన అగ్ర రాజ్యం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్ధాన్ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తక్షణమే తాలిబన్లు శరవేగంగా అఫ్గన్ ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా గతంలో చేసిన చారిత్రక తప్పిదాలను తెలుసుకుందాం. ఆఫ్గన్ ప్రజలు పూర్తిగా పశుపోషణపై ఆధారపడి జీవించేవారు. అంతే కాదు మెజారిటీ జనాభా పాత కాలపు కట్టుబాట్ల మధ్య జీవనం గడిపే వారు. వారిలో లింగ సమానత్వం.. చట్టాల పట్ల గౌరవం.. మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల మార్పు తీసుకు రాలేకపోయారు. నెపోలియన్ విదేశీ మంత్రి చార్లెస్ మారైస్ డీ తల్లేర్యాండ్ పెరిగోడ్ మాటల్లో చెప్పాలంటే అఫ్గాన్లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం.. ఒక పెద్ద తప్పిదం...అని అన్నారు. అఫ్గానిస్తాన్లో తాలిబన్లను కట్టడి కోసం పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. కాకపోతే అగ్రరాజ్యం చెప్పినట్లు పాక్ వ్యవహరించలేదు. అమెరికా డిమాండ్లపై పాకిస్థాన్ సైనిక జనరల్స్ తమ ద్వేషపూరిత ప్రణాళిక అమలు చేశారు. ఈ విషయాన్ని గ్రహించి కూడా యూఎస్ నోరు మెదపలేదు. . తమకు ఉగ్రవాదుల అండ అవసరమని అమెరికాను పాక్ నమ్మించగలిగింది. అఫ్గన్పై పట్టు కోసం పాకిస్థాన్ సాకులకు అమెరికా తలొగ్గాల్సి వచ్చింది. అమెరికా మిత్రదేశంగా ఉన్న పాక్... తన శక్తియుక్తులన్నీ అగ్ర రాజ్యం కోరిన విధంగా కాకుండా భారత్కు వ్యతిరేకంగా పోరాడటానికే ఉపయోగించింది. దీని ప్రభావం అఫ్గన్లో అమెరికా సేనలకు ప్రతికూల పరిణామాలకు దారి తీసిందనే చెప్పాలి. అఫ్గన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అమెరికా పాక్పైనే ఆధారపడింది. తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా అమెరికా పని చేసిందే తప్ప.. దానికి పాక్లో మూలాలు ఉన్నాయన్న సంగతి తెలియకుండా ఉoటుందా. అయినా ఆ విషయాన్ని విస్మరించింది. తమ సైన్యంపై దాడుల్లో పాక్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని రుజువులు లభించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్ను హతమార్చిన అమెరికా ...పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అఫ్గన్లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం ఉన్న వారిని కాకుండా హమీద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీ వంటి నేతలను నాయకులుగా నిలబెట్టి మరో పెద్ద పొరపాటు చేసింది. అసలు వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనే విషయాన్ని కూడా గమనించలేదు. నిత్యం ఉగ్రవాదం అక్కడే దేశంలో పాలన ఎలా సాగించాలంటే నాయకుడి పాత్ర చాలా ముఖ్యం. ఇందులోను అమెరికా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇలా అమెరికా ఇన్నేళ్లుగా చేసిన ప్రణాళికలు, ప్లాన్లు అఫ్గానిస్తాన్కు పెద్దగా ఉపయోగపడక, అప్పట్లో చేసిన తప్పిదాలు నేటి పరిస్థితులకి ఓ రకంగా కారణమని తెలుస్తోంది. చదవండి: Afghanistan: తాలిబన్లపై ప్రారంభమైన తిరుగుబాటు హృదయ విదారకం: విమాన టైర్లలో మానవ శరీర భాగాలు, అవయవాలు -
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
మళ్ళీ అదే అనిశ్చితి!
అనుకున్నదే అయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తరువాత అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్ నుంచి మే 1న వైదొలగడం మొదలవగానే, తాలిబన్ల విస్తరణ, ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఒక్కొక్క జిల్లాను హస్తగతం చేసుకుంటూ తాలిబన్లు శుక్రవారం తమ జన్మస్థానమైన కాందహార్లోకి ప్రవేశించాయి. భారత్ సైతం కాందహార్లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని హడావిడిగా వెనక్కి రప్పిస్తోంది. ఒకప్పుడు తాలిబన్ల కేంద్రస్థానమైన కాందహార్ అఫ్ఘాన్లో రెండో అతిపెద్ద నగరం. అఫ్ఘాన్ సేనలతో తాలిబన్ల తీవ్రఘర్షణ, అందులో రోజుకు 200 నుంచి 600 మంది దాకా బాధితులు, దేశంలో 85 శాతం తమ చేతుల్లో ఉందన్న తాలిబన్ల వాదన చూస్తుంటే– అఫ్ఘాన్లో ఏం జరగచ్చో అర్థమవుతూనే ఉంది. ఆ ఊహే నిజమైతే 1996లో లానే తాలిబన్ల పడగ నీడలోనే అఫ్ఘాన్ జనజీవితం ఇక లాంఛనమే కావచ్చు. ఈ పరిణామాల ప్రభావం భారత ఉప ఖండంపై ఎలా ఉంటుందన్న దాని మీద చర్చ ఊపందుకున్నది అందుకే! అఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూనే తాలిబన్లు సాయుధ సంఘర్షణకు దిగడం విచిత్రం. భారత్ మాత్రం ప్రస్తుత అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్నే ఇప్పటికీ గట్టిగా సమర్థిస్తోంది. మరోపక్క బైడెన్ అమెరికన్ సర్కారు మాటల ప్రకారం మరో నెలన్నరలో ఆగస్టు 31 కల్లా అఫ్ఘాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తి కానుంది. దాంతో సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అప్పటి జార్జ్ బుష్ అమెరికన్ ప్రభుత్వం అఫ్ఘాన్లోని తాలిబన్ ఏలుబడి పైన, ఉగ్రవాద అల్ కాయిదా సంస్థపైన మొదలు పెట్టిన సైనిక దాడి ప్రతీకార యజ్ఞానికి అర్ధంతరంగా తెర పడనుంది. చరిత్రలోకెళితే, ఇస్లామిక్ తీవ్రవాదుల బృందం అల్ కాయిదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో 4 విమానాలను హైజాక్ చేసి, ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ భవనాలపైన, అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్పైన దాడులు జరిపింది. 3 వేల మంది అమాయకుల దుర్మరణానికి కారణమైంది. ‘9/11 తీవ్రవాద దాడులు’గా ప్రసిద్ధమైన ఆ ఘటన, తాలిబన్ల అండ ఉన్న ఆ దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను అమెరికా అంతం చేయడం, ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికన్ సేనలు అఫ్ఘాన్లో ప్రవేశించడం – ఓ సుదీర్ఘ చరిత్ర. ఉగ్రవాదులు అఫ్ఘాన్ను స్థావరంగా చేసుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యాన్ని సాధించా మంటూ సేనల్ని ఉపసంహరిస్తూ, అమెరికా – ‘నాటో’ సమష్టి ప్రకటన చేశాయి. క్షేత్రస్థాయిలో అది నేతి బీరకాయలో నెయ్యే కావచ్చు! నిజానికి, 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎన్నికల వాగ్దానమూ, తాజా బైడెన్ ప్రభుత్వం చేపడుతున్నదీ ఒకటే – అమెరికా సేనల ఉపసంహరణ! కాకపోతే, ఇరవయ్యేళ్ళు ఆతిథ్యమిచ్చిన అఫ్ఘాన్ ప్రభుత్వానికి మాట మాత్రంగానైనా చెప్పకుండా కీలకమైన బాగ్రమ్ సైనిక వైమానిక క్షేత్రం నుంచి అమెరికా సేనలు రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం విచిత్రం. అఫ్ఘాన్లో కొంత అభివృద్ధికీ, అక్షరాస్యతకూ దోహదపడ్డ అమెరికా ఆఖరికొచ్చేసరికి అక్కడ శాంతిస్థాపన కోసం చూడలేదు. మోయలేని బరువుగా మారిన సైనిక జోక్యాన్ని ఆపేసి, తన దోవ తాను చూసుకుంది. తాజా దండయాత్రలో కీలక బగ్రామ్ వైమానిక క్షేత్రం కూడా తాలిబన్ల చేతికి వచ్చిందంటే, తరువాతి లక్ష్యం అక్కడికి దగ్గరలో ఉన్న కాబూలే. అమెరికా సేనలు దేశం నుంచి తప్పుకోవాలన్నది తొలి నుంచీ తాలిబన్ల డిమాండ్. అది తీరుతున్నా తాలిబన్లు ఘర్షణకు దిగుతున్నారంటే, అది దేనికోసమో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అఫ్ఘాన్ దేశ నిర్మాణం కోసమేమీ అమెరికా అక్కడకు వెళ్ళలేదనీ, ఆ దేశాన్ని ఎలా నడపాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే నిర్ణయం అఫ్ఘాన్ ప్రజలదేననీ బైడెన్కు హఠాత్ జ్ఞానోదయం ప్రదర్శించారు. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ఇప్పటికే చైనా తప్పుబట్టింది. ఆ దేశం నుంచి తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చే పనిలో పడింది. భారత దౌత్య సిబ్బంది పరిస్థితీ అదే. గతంలో 9/11 ఘటనకు రెండేళ్ళ ముందే 1999 డిసెంబర్లో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం ద్వారా తాలిబన్ల దెబ్బ భారత్ రుచిచూసింది. ఇండి యన్ ఎయిర్లైన్స్ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేయడం, అందులోని అమాయక ప్రయా ణికుల కోసం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం నలుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడం ఓ తరానికి కళ్ళ ముందు కదలాడే దృశ్యం. పాకిస్తాన్, చైనాలతో పాటు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ ద్వారా మనమూ అఫ్ఘాన్తో సరిహద్దులు పంచుకుంటున్నాం. అందుకే, ఇప్పుడక్కడ పాక్, చైనాలకు అనుకూలమైన తాలిబాన్ల ప్రాబల్యం భౌగోళికంగా, రాజకీయంగా మనకు పెద్ద చిక్కే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో అంటకాగిన తాలిబన్ మూకలు ఇప్పటికిప్పుడు పవిత్ర మైపోయాయని అనుకోలేం. అమెరికాతో తాలిబన్లు మాట ఇచ్చినట్టు ‘జిహాద్’ను కేవలం తమ దేశానికీ పరిమితం చేస్తాయనీ నమ్మలేం. భారత్తో సహా పొరుగు దేశాల్లో జిహాద్ను సంకీర్తించే వారు అఫ్ఘాన్ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొనే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. వెరసి, సాయుధ తాలిబన్లు గద్దెనెక్కితే శాంతి సౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్న మానవతావాదులకూ, మహిళ లకే కాదు... అఫ్ఘాన్ పునర్నిర్మాణం, సహాయ కార్యక్రమాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించిన మన దేశానికీ దెబ్బే. మూడు దశాబ్దాలుగా రకరకాల కారణాలతో అఫ్ఘాన్ రక్తసిక్తం కావడం, రెండు దశాబ్దాల సైనిక జోక్యం తరువాతా ఆ దేశం అనిశ్చితిలోనే మిగలడమే ఓ విషాదం. -
ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత జవాన్లతో గడిపారు. ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. దేశాన్ని కాపాడే జవాన్లంటే ఈ ఖిలాడీ హీరోకు ప్రత్యేకమైన అభిమానం అని ఎన్నో సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జవాన్లతో ఓ రోజు గడిపిన కేసరి అక్షయ్ గురువారం నాడు ఉత్తర కాశ్మీర్లోని గురేజ్లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) కు కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. కార్గో ప్యాంటు, లేత గోధుమరంగు టీ షర్టుతో తాను ఓ జవానులా మారి వారిలో ఒకరిలా కలిసిపోయారు. అక్కడి జవాన్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ సంప్రదాయంగా జరిగే కార్యక్రమాలకు డీజీ బీఎస్ఎఫ్ ఎస్హెచ్. రాకేశ్ అస్థానాతో కలిసి హాజరయ్యారు. అనంతరం అక్షయ్ నటించిన గుడ్ న్యూవ్జ్ చిత్రం నుంచి సౌదా ఖారా ఖారా పాటకు కాసేపు స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. ఈ సందర్భంగా మన కేసరి జవాన్లతో గడిపిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి క్యాప్షన్గా.. "ఈ రోజు సరిహద్దులను కాపలాగా ఉన్న ధైర్యవంతులతో ఒక రోజు గడపడం మరచిపోలేను. ఇక్కడకు రావడం నాకు ఎప్పుడూ మాటలతో వర్ణించలేని అనుభుతిని కలిగిస్తుంది. ఈ రోజు నిజమైన హీరోలను కలవడం నాకేంతో సంతోషంగా ఉందంటూ’ అందులో తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్! -
Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి
యాంగాన్: మయన్మార్లో సైన్యం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూచీతో పాటు పలువురు నేతలను నిర్బంధంలోకి తీసుకొని సైనిక పాలన ప్రకటించింది. సూచీపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించింది. నాటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మయన్మార్లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే మయన్మార్ సైన్యం రెచ్చిపోయింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. రక్తపాతం సృష్టించింది. మయన్మార్ చరిత్రలోనే ఇది చీకటి రోజని ప్రజాస్వామ్య అనుకూలవాదులు, మానవతావాదులు పేర్కొన్నారు. మయన్మార్లోని ప్రముఖులు, నటులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, కీడాకారులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు. తాజాగా మయన్మార్ మిస్ యూనివర్స్ పోటీదారు తుజార్ వింట్ ఎల్విన్ ఆదివారం పోటీలో మాట్లాడుతూ.. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు. "మయన్మార్లో జరిగే హింస గురించి మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి దీనిపై స్పందిస్తున్నాను. మా ప్రజలు ప్రతిరోజూ మిలిటరీ దళాల కాల్పుల్లో చనిపోతున్నారు" అంటూ ఆమె బావోద్వేగానికి గురయ్యారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ & క్యాసినోలో జరిగిన ఫైనల్స్లో ఆమె కనిపించారు. కాగా తుజార్ వింట్ ఎల్విన్ మిస్ యూనివర్స్ పోటీ చివరి రౌండ్లో పాల్గొనలేదు. కానీ ఆమె ధరించిన ఆ దేశ జాతీయ దుస్తులకు గాను "బెస్ట్ నేషనల్ అవార్డ్"ను గెలుచుకుంది. ఆమె ఆ దుస్తులతో కవాతు చేస్తూ "మయన్మార్ కోసం ప్రార్థించండి" అనే ఒక ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు 790 మంది భద్రతా దళాల కాల్లుల్లో మరణించగా.. 5,000 మందిని అరెస్టు చేసినట్లు, 4,000 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల కార్యకర్త బృందం తెలిపింది. (చదవండి: Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి) -
'నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను'
థాయిలాండ్లో మార్చి 27న ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో మయన్మార్ మోడల్ హ్యాన్ లే గెలవలేకపోయింది! అయితే ఆమెను ఒక ‘పరమోద్వేగిని’గా లోకం తన హృదయానికి హత్తుకుంది. ఆ అందాల పోటీ వేదికపై హ్యాన్ లే.. ‘తక్షణం మీ సహాయం కావాలి’ అంటూ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను కదిలించింది. చెమరించిన కళ్లతో జడ్జిలు, పోటీలో పాల్గొన్న మిగతా అమ్మాయిలు హ్యాన్ లే లోని ఆత్మసౌందర్యాన్ని దర్శించారు. మయన్మార్లో ఇప్పుడేం జరుగుతోందో తెలిసిందే! ప్రపంచం ఇప్పుడేం చేయాలో హ్యాన్ లే తన ప్రసంగంలో తెలియజెప్పింది. మయన్మార్లో సైనిక పాలకులు పాల్పడుతున్న అరాచకాలకు అడ్డకట్ట వేయాలని హ్యాన్ లే అభ్యర్థించింది. థాయిలాండ్లో 2013లో ప్రారంభమై, గత ఏడేళ్లుగా ‘మిస్ గ్రాండ్ థాయిలాండ్’, ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ థాయిలాండ్’ అందాల పోటీలు జరుగుతున్నాయి. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను ఈ ఏడాది అమెరికా అందాల రాణి అబెనా అపయా గెలుచుకున్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సమంతా (ఫిలిప్పీన్స్) ఫస్ట్ రన్నర్–అప్గా, ఇవానా (గటెమలా) సెకండ్ రన్నర్–అప్గా విజయం సాధించారు. మయన్మార్ నుంచి పోటీలో పాల్గొన్న హ్యాన్ లే ఈ మూడు స్థానాలలో లేనప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం పొందగలిగింది. ఆ స్థానానికి అందమైన కిరీటం లేకపోవచ్చు. కానీ అందమైన ఆమె మనసే అందాల కిరీటంలా ఆ రోజు వేదికంతటా ధగధగలాడింది. తన జన్మభూమిని కాపాడమంటూ స్టేజ్ మీద నుంచి ఆమె చేసిన విజ్ఞప్తి ఆమె భావోద్వేగాలను స్ఫూర్తి శతఘ్నుల్లా మార్చి ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. ‘అందాల వేదికపై బంధ విముక్తి ప్రసంగం’ అంటూ.. అంతా ఆమె ప్రయత్నాన్ని నేటికీ కొనియాడుతూనే ఉన్నారు. తన దేశం, తన ప్రజలు తిరుగుబాటు మిలటరీ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయి విలవిలాడుతున్న దృశ్యాన్ని ఇరవై రెండేళ్ల హ్యాన్ లే అంత హృద్యంగా ఆవిష్కరించింది మరి! హ్యాన్ లే, స్టేజ్పై కంటతడి Han Lay, a Myanmar national participating in a beauty pageant in Thailand, pleaded for 'urgent international help' for her country pic.twitter.com/cqGkDNNM6R — Reuters (@Reuters) April 3, 2021 ఆ రోజు థాయిలాండ్లో ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ పోటీలు జరుగుతున్న సమయానికి మయన్మార్లో మారణహోమం జరుగుతూ ఉంది. సైనిక పాలకుల చేతుల్లో ఆ ఒక్కరోజే 141 ప్రదర్శనకారులు చనిపోయారు. ఇక్కడ పోటీలో ఉన్న హ్యాన్ లే కు ఆ వార్త చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి1న ప్రజా ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోసి, మయన్మార్ను అక్రమంగా అదుపులోకి తీసుకున్న సైనిక నేతలు అప్పటికే 550 మంది పౌరులను కాల్చి చంపారు. ఆ వార్తల్ని కూడా హ్యాన్ లే వింటూ ఉంది. మయన్మార్ పౌరులొక్కరే రోడ్ల మీదకు వచ్చి సైనిక నియంతలతో పోరాడుతున్నారు. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఒక్క దేశమూ సహాయానికి రావడం లేదు. హ్యాన్ లే తట్టుకోలేకపోయింది. ఆ అంతర్జాతీయ అందాల పోటీ వేదిక మీద నుంచే అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ‘‘ఇక ఆగే సమయం లేదు. వెంటనే సహాయానికి రండి’’ అని దుఃఖంతో పూడుకుపోతున్న స్వరంతో విజ్ఞప్తి చేసింది. హ్యాన్ లే ప్రసంగం మధ్యలో స్క్రీన్పై మయన్మార్ హింసాఘటనల దృశ్యాలు ‘‘ఒకటైతే చెప్పగలను. మయన్మార్ పౌరులు ఎప్పటికీ ఆశ వదులుకోరు’’. ‘‘వాళ్లు వీధుల్లోకి వచ్చిన పోరాడుతున్నారు. నేను ఈ వేదికపై నుంచి నా నిరసన గళాన్ని వినిపిస్తున్నాను’’. ‘‘నా భావోద్రేకాలను నియంత్రించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒకటీ రెండు నిముషాల్లోనే యావత్ప్రపంచానికీ నేను చెప్పదలచింది చెప్పుకోవాలి.’’ ‘‘రావడమే ఇక్కడికి నేను అపరాధ భావనతో వచ్చాను. ఇక్కడి వచ్చాక కూడా ఇక్కడ ఎలా ఉండాలో అలా నేను లేను. అందాల రాణులు చిరునవ్వుతో ఉండాలి. అందర్నీ నవ్వుతూ పలకరించాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. నేను అలా ఉండలేకపోయాను.’’ .. హ్యాన్ లే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నప్పుడు వేదిక మౌనముద్ర దాల్చింది. సహానుభూతిగా ఆమె వైపు చూసింది. ఈ అందాల పోటీల వ్యవస్థాపకులు 47 ఏళ్ల నవత్ ఇత్సారాగ్రిసిల్ వెంటనే వేదిక పైకి వచ్చారు. ‘‘హ్యాన్ లే ను మనం మయన్మార్ పంపలేం. నేననుకోవడం.. ఈ ప్రసంగం తర్వాత అక్కడి ‘జుంటా’ పాలకులు ఆమె తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మయన్మార్లో దిగగానే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. తనను మనం కాపాడుకోవాలి. ఏ దేశమైనా హ్యాన్ లేకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావాలి’’ అని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచానికి రెండు పిలుపులు. ఒకటి: మయన్మార్ను కాపాడటం కోసం. రెండు: హ్యాన లే కు ఆశ్రయం ఇవ్వడం కోసం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను ‘‘నా లోపలిదంతా నేను మాట్లాడేయాలి. నిన్న రాత్రి నేను నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను. అది ఆగని దుఃఖధార. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మయన్మార్లో చనిపోతున్నవారంతా మన ఈడు వారు. యువకులు. పెద్దవాళ్లు చేస్తున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న యువతీ యువకులను తూటాలు నేల కూల్చేస్తున్నాయి. ఈ నరమేధాన్ని ఆపేందుకు ప్రపంచం ముందుకు రావాలి’’ – మిస్ హ్యాన్ లే, మయన్మార్ (థాయిలాండ్ అందాల పోటీ వేదికపై) -
ఆర్మీ డేన 100కు పైగా మందిని కాల్చి చంపిన సైన్యం
మయన్మార్ : దేశంలో సైనిక ప్రభుత్వ హింసాకాండలు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నవారిని దారుణంగా బలితీసుకుంటోంది. శనివారం 100 మందికిపైగా నిరసనకారుల్ని సైనిక బలగాలు కాల్చి చంపాయి. నిన్న, ఫిబ్రవరి 1 సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు యాంగాన్, మాండలే, మరికొన్ని పట్టణాల్లోని వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు వారి తలలు, వీపులపై కాల్పులు జరిపాయి. చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే పట్టణంలో 13 మంది మరణించగా.. దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా చనిపోయారు. నేషనల్ ఆర్మీ డేన ఈ దారుణం జరగటం గమనార్హం. కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్ ప్రధాని ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి వరకు 400 మందికిపైగా నిరసనకారుల్ని కాల్చి చంపేసింది. చదవండి, చదివించండి : టాటా ఏస్ క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు.. -
Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400
భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో ఖాళీగా ఉన్న 502 సూపర్వైజర్(బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్–2021 విడుదలైంది. మిలిటరీ సర్వీస్లో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం... పోస్టుల సంఖ్య: 502 ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్మెన్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ► డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్షిప్లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్పై ఏడాది కాలం అనుభవం అవసరం. ► సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్తోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా,స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ► రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు. వేతనం ► సూపర్వైజర్, డ్రాఫ్ట్స్మెన్గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది. పరీక్ష విధానం ► పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానం ఉం టుంది. 125 మార్కులకు 100 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సిలబస్లో నాలుగు విభాగాలు ఉంటాయి. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్– 25 ప్రశ్నలు –25 మార్కులు; ► జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్– 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్–25 ప్రశ్నలు –25 మార్కులు; ► స్పెషలైజ్డ్ టాపిక్ – 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2021 ► రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు) ► రాత పరీక్ష తేది: 16.05.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం ► వెబ్సైట్: దరఖాస్తు కోసం https://www.mesgovonline.com/mesdmsk/లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్ను ఎంపిక చేసుకోవాలి. ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్ -
భారత్ సైన్యం ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైంది
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగి ఉండగా, భారత్ ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో సూచికలో అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొంది. అమెరికా మిలటరీ బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ, 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ పట్టికలో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచినట్లు మిలటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ ఆదివారం ఈ వివరాలను విడుదల చేసింది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్ యాక్టివ్ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెన్త్ ఇండెక్స్’ను రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్ డాలర్లు, భారత్ 71 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి. -
మయన్మార్: 9 మందిని కాల్చి చంపిన సైన్యం
మయన్మార్ : ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఆగడాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ ప్రజా ప్రభుత్వానికి మద్ధతుగా వెల్లు వెత్తుతున్న నిరసనలను అణగదొక్కటానికి సైనిక బలగాలు దారుణానికి పాల్పడుతున్నాయి. శుక్రవారం ఆంగ్బాన్ సెంట్రల్ టౌన్ వద్ద సైనిక బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో 9 మంది మృత్యువాతపడ్డారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. ఓ వ్యక్తి కలావ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దేశంలో నెలకొన్న హింసకు స్వప్తి పలకాలని ఇండోనేషియా పిలుపునిచ్చిన రోజే ఈ దారుణం చోటుచేసుకోవటం గమనార్హం. కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్ ప్రధాని ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి వరకు 150 మందికిపైగా నిరసనకారుల్ని చంపేసింది. చదవండి : సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా -
సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా
మాండలే: మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారపగ్గాలు చేపట్టిన సైనిక పాలకులు, ఆ దేశ నేత అంగ్సాన్ సూకీపై మరింత ఒత్తిడి పెంచారు. అంగ్సాన్ సూకీకి 5 లక్షల డాలర్లకు పైగా అందజేసినట్లు సైనిక జుంటా అనుకూల నిర్మాణ సంస్థ యజమాని మౌంగ్ వైక్ ఆరోపించారు. గతంలో డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులున్న వైక్ గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టీవీలో ఈ మేరకు ప్రకటించారు. సూకీ తల్లి పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్టుకు 2018 నుంచి వివిధ సందర్భాల్లో మొత్తం 5.50 లక్షల డాలర్లను అందజేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు తన వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు చెప్పుకున్నారు. నిర్బంధంలో ఉన్న సూకీపై సైనిక పాలకులు ఇప్పటికే పలు ఆరోపణలు మోపిన విషయం తెలిసిందే. వాకీటాకీలను అక్రమంగా కలిగి ఉండటం, ఒక రాజకీయ నేత నుంచి 6 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని తీసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. సూకీతోపాటు నిర్బంధం అనుభ విస్తున్న దేశాధ్యక్షుడు విన్ మింట్పై కూడా దేశంలో అశాంతికి కారకుడయ్యారంటూ ఆరోపణలు మోపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అధికారాన్ని హస్త గతం చేసుకున్న సైనిక పాలకులు ప్రజాస్వామ్యం కోసం ప్రజలు తెలుపుతున్న నిరసనలను ఒక వైపు ఉక్కుపాదంతో అణచివేస్తూనే.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పాలకులను నిర్బంధించి, పలు ఆరోపణలు మోపి విచారణకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా, ఐక్యరాజ్యసమితిలో ప్రజాస్వామ్యా నికి అనుకూలంగా మాట్లాడిన ఆ దేశ రాయబారి క్యామోటున్పై సైనిక జుంటా దేశ ద్రోహ నేరం మోపింది. అజ్ఞాతంలో ఉన్న ప్రజానేత మహ్న్ విన్ ఖయింగ్ థాన్పైనా దేశద్రోహం మోపింది. గురువారం యాంగూన్ శివారు ధామైన్లో ఆందోళనలు చేపట్టిన ప్రజలు పోలీసులకు రాకను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి, వాటికి నిప్పంటించారు. -
మయన్మార్ మిలటరీ ఫేస్బుక్ పేజీ తొలగింపు
యాంగాన్: మయన్మార్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్బుక్ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్ సైన్యం తాత్మదా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీమ్ పేరిట ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు. కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్ ఖీనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు. -
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం...
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం. ‘ఎవడాడు ఆ మాటన్నది?!’ పన్నులు కట్టకుంటే ముక్కులు పిండుతాం.‘ఎవడాడు ఆ మాటన్నది?!’శాసనాన్ని ధిక్కరిస్తే జైలే. ‘ఎవడాడు ఆ మాటన్నది?! ఆ మాటన్నది ఎవరైనా.. ‘ఎవడాడు’ అన్నది మాత్రం మహిళే! మహిళా సైన్యం అంటాం కానీ.. మహిళే ఒక సైన్యం! ప్రతి శాసనోల్లంఘనలో ముందుంది మహిళే. ముందుకు నడిపించిందీ మహిళే. రేపు సోమవారానికి వారం మయన్మార్లో ప్రభుత్వం పడిపోయి. పార్లమెంటులో మెజారిటీ తగ్గి పడిపోవడం కాదు. సైన్యం ట్యాంకులతో వెళ్లి ప్రభుత్వాన్ని కూల్చేసింది. దేశాన్ని ప్రెసిడెంట్ చేతుల్లోంచి లాగేసుకుంది. పాలకపక్ష కీలక నేత ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచింది. కరోనా సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాకీ టాకీని ఫారిన్ నుంచి దిగుమతి చేసుకోవడం.. ఇవీ ఆమెపై సైన్యం మోపిన నేరారోపణలు! దీన్ని బట్టే తెలుస్తోంది. పాలనను హస్తగతం చేసుకోడానికి సైన్యం పన్నిన కుట్ర ఇదంతా అని! దేశంలో ఎవరైనా తిరగబడితే సైన్యం దిగుతుంది. సైన్యమే తిరగబడితే ఎదురు తిరిగేవాళ్లెవరు? సైన్యం పేల్చిన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మయన్మార్ వీధులపై నెమ్మదిగా దొర్లుకుంటూ వెళుతున్న చెయిన్ చక్రాల కరకరలు విన్నవారికి తెలుస్తుంది. అయితే ఆ కరకరల మధ్య.. బుధవారం నాటికి ఒక కొత్త ధ్వని వినిపించడం మొదలైంది. ఆ ధ్వని.. సైన్యాన్ని ధిక్కరించి ఇళ్లలోంచి బయటికి వచ్చిన మహిళల ‘డిజ్ఒబీడియన్స్’! అవిధేయ గర్జన. ‘వియ్ డోంట్ వాట్ దిస్ మిలిటరీకూ’.. అన్నది ఆ మహిళల నినాదం. సైనిక కుట్రకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ప్రదర్శన జరుపుతున్న మయన్మార్ మహిళా టీచర్లు సైన్యం శాసించింది. ఆ శాసనాన్ని మయన్మార్ మహిళావని ఉల్లంఘించింది. మొదట సోమవారమే కాలేజీ అమ్మాయిలు మగపిల్లల వైపు చూశారు. ‘వేచి చూద్దాం’ అన్నట్లు చూశారు మగపిల్లలు. యూనివర్శిటీలలో మహిళా ప్రొఫెసర్ లు.. ‘ఏంటిది! ఊరుకోవడమేనా?’ అన్నట్లు మేల్ కొలీగ్స్తో మంతనాలు జరిపారు. ‘ప్లాన్ చేద్దాం’ అన్నారు వాళ్లు. మెల్లిగా ప్రభుత్వ శాఖల సిబ్బంది పని పక్కన పడేయడం మొదలైంది. బుధవారం నాటికి లెక్చరర్లు బయటికి వచ్చారు. మహిళా లెక్చరర్లు! వెంట సహోద్యోగులు. యాంగన్ యూనివర్శిటీ ప్రాంగణం బయటికి వచ్చి ఎర్ర రిబ్బన్లతో సైన్యానికి తమ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి టీచర్లు, హెల్త్ వర్కర్లు కూడా పోరుకు సిద్ధమై వీధుల్లోకి వచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పాలనను ఉల్లంఘించి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. సైన్యాన్ని ధిక్కరించి మయన్మార్ మహిళలు బర్మాను రక్షించుకోవాలనుకున్నారు. తమ మహిళా నేత ఆంగ్ సాగ్ సూకీ వారిలో నింపిన స్ఫూర్తే ఇప్పుడు వారిని సైనిక కుట్రకు వ్యతిరేకం గా కదం తొక్కిస్తోంది. మయన్మార్ను సైన్యం నుంచి విడిపించుకునేందుకు నడుం బిగిస్తోంది. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేకంగా కూలదోస్తే చూస్తూ ఊరుకోం’’అని న్వే తాజిన్ అనే మహిళా లెక్చరర్ పిడికిలి బిగించారు. ∙∙ మహిళల ముందడుగుతో మొదలైన శాసనోల్లంఘనలు చరిత్రలో ఇంకా అనేకం ఉన్నాయి! 1930 – 1934 మధ్య గాంధీజీ నాయకత్వం వహించిన మూడు ప్రధాన శాసనోల్లంఘనలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల చేయూత, చొరవ, చేవ అండగా ఉన్నాయి. గాంధీజీ తొలి శాసనోల్లంఘన చంపారన్ (బిహార్)లో, రెండో శాసనోల్లంఘన అహ్మదాబాద్లో, మూడో శాసనోల్లంఘన దండి (సూరత్ సమీపాన) జరిగాయి. దండి ఉల్లంఘనలో దేవి ప్రసాద్ రాయ్ చౌదరి, మితూబెన్ ఆయన వెనుక ఉన్నారు. చంపారన్ శాసనోల్లంఘనలో నీలిమందు పండించే పేద రైతుల కుటుంబాల్లోని మహిళలు కొంగు బిగించి దోపిడీ శాసనాలపైకి కొడవలి లేపారు. అహ్మదాబాద్ జౌళి కార్మికుల ఉపవాస దీక్షలో, గుజరాత్లోనే ఖేడా జిల్లాలో పేద రైతుల పన్నుల నిరాకరణ ఉద్యమంలో మహిళలు సహ చోదకశక్తులయ్యారు. గాంధీజీనే కాదు.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జేమ్స్ బెవెల్, రోసా పార్క్స్ వంటి అవిధేయ యోధులు అమెరికాలో నడిపిన 1950–1960 ల నాటి శాసనోల్లంఘన ఉద్యమాలన్నిటి ఆరంభంలో జ్వాలకు తొలి నిప్పుకణంలా మహిళా శక్తి ఉంది. రోసా పార్క్ అయితే స్వయంగా ఒక పెద్ద పౌరహక్కుల ఉద్యమాన్నే నడిపించారు. యాక్టివిస్టు ఆమె. ‘ది ఫస్ట్ లేడీ ఆఫ్ సివిల్ రైట్స్’ అని ఆమెకు పేరు. ∙∙ అన్యాయాన్ని బాహాటం ధిక్కరించే గుణం పురుషుల కన్నా స్త్రీలకే అధికం అని జీవ శాస్త్రవేత్తలు అంటారు. అందుకు కారణం కూడా కనిపెట్టారు. పురుషుడు బుద్ధితోనూ, స్త్రీ హృదయంతోనూ స్పందిస్తారట. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని, మోసపూరిత శాసనాన్ని ప్రశ్నించడానికి బుద్ధి ఆలోచిస్తూ ఉండగనే, హృదయం భగ్గుమని ఉద్యమిస్తుందట. ఈ సంగతి తాజాగా ఢిల్లీలోని రైతు ఉద్యమంలోనూ రుజువవుతోంది. అయితే అక్కడింకా శాసనోల్లంఘన వరకు పరిస్థితి రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తొలి ధిక్కారం, తొలి ఉల్లంఘన సహజంగానే మహిళలదే అయివుండే అవకాశం ఉంది. -
బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు..
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ అవసరాల దృష్ట్యా భారీ రక్షణ బడ్జెట్పై ఊహాగానాలు కొనసాగాయి. కానీ గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరుగుదలతో రూ.4.78 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. అయితే మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడంతో పాటు, భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దులను రక్షిస్తున్న సాయుధ బలగాలకు కూడా ఎక్కువ కేటాయింపులే లభించాయి. మరోవైపు తూర్పు లడాఖ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మిలటరీ అవసరాల కొనుగోలు కోసం గత బడ్జెట్ మూలధన వ్యయం కింద రూ.20,776 కోట్లు అదనంగానే సాయుధ బలగాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తే మాత్రం 2020–21 బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,13,734 కోట్లు కేటాయించగా సవరించిన మూలధన వ్యయం రూ.1,34,510 కోట్లుగా నమోదయ్యింది. చైనాతో గొడవ నేపథ్యంలో భారత సైన్యం గత కొన్ని నెలల్లో పలు దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు కొనుగోలు చేసింది. రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు. గత ఏడాది మూలధన వ్యయం రూ.1,13,734 కోట్లతో పోల్చుకుంటే ఇది 18.75 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రూ.1.15 లక్షల కోట్లు పెన్షన్లకు కేటాయించారు. గత ఏడాది (రూ.1.33 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2020–21లో సుమారు రూ.18 వేల కోట్ల పెన్షన్ బకాయిలు చెల్లించడమే ఇందుకు కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. పెన్షన్ను మినహాయిస్తే జీతాల చెల్లింపులు, ఆస్తుల నిర్వహణ వంటి రెవెన్యూ ఖర్చు రూ.2.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆర్మీకి మూలధన వ్యయం కింద రూ.36,481 కోట్లు, నౌకా దళానికి రూ.33,253 కోట్లు, వైమానిక దళానికి రూ.53,214 కోట్లు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసిన దానికంటే రూ.1,841 కోట్లు తక్కువ) కేటాయించారు. గత ఏడాది ఆర్మీకి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు కేటాయించారు. వైమానిక దళ గత ఏడాది మూలధన వ్యయం రూ.43,281.91 కోట్లు కాగా సవరించిన అంచనా రూ.55,055 కోట్లుగా నమోదయ్యింది. సాయుధ బలగాలకు అదనంగా నిధులు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేటాయింపు పెంచారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆర్థికమంత్రి రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపు రూ.92,848.91 కోట్లతో పోల్చుకుంటే ఇది 7.1 శాతం ఎక్కువ. రాజ్నాథ్ కృతజ్ఞతలు రక్షణ బడ్జెట్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కృతజ్ఞతలు తెలి పారు. మూలధన వ్యయంలో దాదాపు 19% పెరుగుదల గత 15 ఏళ్లలో అత్యధికమని పేర్కొన్నారు. కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు తెరిచే ప్రతిపాదనపై రాజ్నాథ్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. సంతృప్తికర బడ్జెట్ కరోనా విపత్తు నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రక్షణ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి. మూలధన వ్యయం రూ.22 వేల కోట్లు పెరగడం ఆహ్వానించతగ్గ పరిణామం. సైన్యం ఆధునీకరణ కసరత్తును కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుంది. – డాక్టర్ లక్ష్మణ్ బెహెరా, ప్రముఖ రక్షణ నిపుణుడు -
ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్దం రావొచ్చు!
లండన్: కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చితి, ఆందోళనను కలుగజేసిందని, ఇవి మరొక ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి హెచ్చరించారు. సైన్యంలో గాయపడిన, మరణించిన వారి స్మారకార్ధం ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన కారణంగా అవి ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు అని బ్రిటన్ సాయుధ దళాధిపతి చీఫ్ నిక్ కార్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరొక ప్రపంచ యుద్దం వచ్చే ముప్పు ఉందా అని అడగగా అలా జరగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. అది వరకు జరిగిన యుద్దం వలన ఏర్పడిన భయానక పరిస్థితుల గురించి మర్చిపోకూడదని కార్టర్ తెలిపారు. చరిత్రలో జరిగిన రెండు భయంకరమైనమ పెద్ద యుద్దాలను చూస్తే చాలా నష్టం జరిగింది. ఇలాంటి యుద్దాలను మళ్లీ మేము చూడలేము అని పేర్కొన్నారు. చదవండి: వైట్హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్తో భార్య మెలానియా -
అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు తాజా నివేదికల సమాచారం. అంతేకాదు ఆర్మీ క్యాంటిన్లలో ఇకమీదట విదేశీ మద్యం అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలో ఆర్డర్ నిర్దిష్టంగా పేర్కొనలేదనీ అయితే, విదేశీ మద్యం కూడా జాబితాలో ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు తిరస్కరించారు. దీనికి సంబంధించి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు. కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. 2 బిలియన్ డాలర్లకు పైగా వార్షిక అమ్మకాలతో, భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్స్ లో ఒకటిగా క్యాంటీన్ స్టోర్స్ ఉన్నాయి. -
‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్ కమాండ్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తూర్పు లద్దాఖ్లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్లోని ‘కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ బలగాలు ఒక కమాండర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’. -
సోదరికి సగం అధికారాలు?
సియోల్: ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జాంగ్ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా కీలక చర్యలు తీసుకున్నారు. ఎన్నో అధికారాలను జాంగ్కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారని దక్షిణ కొరియా నిఘా విభాగం వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్ పర్యవేక్షిస్తారు. కిమ్ నిర్ణయంతో దేశంలోని రెండో శక్తిమంతమైన మహిళగా జాంగ్ ఎదిగారు. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జాంగ్కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్ తర్వాత దేశాన్ని నడిపించే రెండో కమాండర్గా ఆమె వ్యవహరిస్తున్నారని దక్షిణ కొరియా ఎంపీ హా తాయ్ క్యెంగ్ వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాలలో వైఫల్యాలు ఎదురైతే తన చేతికి మరక అంటకుండా అనారోగ్య కారణాలతో పని భారాన్ని తగ్గించుకోవడానికి కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కిమ్ మరణించారన్న వదం తులు ప్రచారమైనప్పుడు కూడా జాంగ్కే దేశ పగ్గాలు అప్పగిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోదరిపై కిమ్కు ఎనలేని విశ్వాసం తన నీడను కూడా నమ్మని కిమ్కు సోదరి జాంగ్ పట్ల ఎనలేని విశ్వాసం ఉంది. కిమ్ సలహాదారుల్లో ఒకరైన ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిమ్ పక్కనే కనిపిస్తున్నారు. తొలిసారిగా ఆమె పేరుతో అధికారిక ప్రకటన ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ ఆమె ప్రకటన ఇచ్చారు. అమెరికాతో దౌత్య వ్యవహారాలకు సంబంధించి జూలైలో తన వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఆమె కొన్ని కామెంట్లు చేశారు. 1988లో జన్మించిన జాంగ్ స్విట్జర్లాండ్లో విద్యాభ్యాసం చేశారు. 2011లో తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరణానంతరం సోదరుడు కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరారు. నెమ్మది నెమ్మదిగా పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీలో ఎదుగుతూ కిమ్ విశ్వాసాన్ని పొందారు. -
చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్..
టోక్యో: కరోనా వైరస్ను ముందే పసిగట్టినా ఎవరికి తెలియకుండా చైనా అందరిని మోసం చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ జపాన్ మాత్రం చైనాతో అంశాల వారిగా మద్దతుకు ప్రయత్నిస్తోంది. అయితే 2018డిసెంబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఏడు సంవత్సరాల తరువాత కలిసిన మొదటి ప్రధానిగా జపాన్ ప్రధాని షింజో అబే నిలిచిన విషయం తెలిసిందే. చైనాతో మైత్రి కొనసాగించడానికి జపాన్ డైలమాలో పడిందని, చైనాతో పోటీని కొనసాగిస్తునే ఆ దేశానికి సహకారం అందిస్తున్నామని జపాన్ సెక్యూరిటీ డైరెక్టర్ నార్శిగ్ మిచిస్త తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, జపాన్ దేశాలు ఆర్థిక, రాజకీయ అంశాలలో సహకారం అందించుకోవాలని ఇది వరకే నిర్ణయించుకున్నాయి. కానీ ఇటీవల దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో జపాన్ పలు ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో దేశంలోనే విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు జపాన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. డిఫెన్స్ రంగంలో జపాన్కు చైనా సహకారం అందిస్తుంది, అందువల్ల చైనా విషయంలో జపాన్ సానుకూల వైఖరి అవలంభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే పర్యాటక రంగంలో చైనా, జపాన్ దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గత ఏడాది లక్షమంది వరకు చైనా విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. -
వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లాల్సిందే..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్–చైనా మిలిటరీ కమాండర్లు మంగళవారం సమావేశమయ్యారు. 10 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్ జనరల్ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దులో మే 5వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని భారత కమాండర్లు పేర్కొన్నారు. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చల్లో భారత్ బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. -
ఇది భారతీయ మహిళల శక్తి
అది 2017, డిసెంబర్ 30వ తేదీ. భారత్– చైనా సరిహద్దు... అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మిలటరీ పోస్ట్లో అగ్నిప్రమాదం. సెవెన్ బీహార్ రిజిమెంట్కు చెందిన మేజర్ ప్రసాద్ మహదీక్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన పది రోజులకు ఆయన భార్య గౌరి ఒక నిర్ణయం తీసుకుంది. ‘ఒక వీరుడికి నివాళిగా తాను చేయగలిగినది చేయాలనుకుంది. ఆయనకు ఇష్టమైన రక్షణరంగంలో చేరాలి. ఆయన యూనిఫామ్ను ధరించాలి. ఆయన సాధించిన నక్షత్రాలను కూడా. మా ఇద్దరి జీవితం ఒక్కటే, యూనిఫామ్ కూడా ఒక్కటే’ అని తీర్మానించుకుంది. ఆమె లాయర్. కంపెనీ సెక్రటరీ కోర్సు చేసి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. భర్త మరణంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష మీద దృష్టి పెట్టింది గౌరి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చి నెలలో లెఫ్టినెంట్ హోదాలో రక్షణరంగంలో చేరింది. మేజర్ ప్రసాద్ గణేశ్ 2012లో ఆర్మీలో చేరారు. గౌరి– ప్రసాద్ల పెళ్లి 2015లో జరిగింది. రెండేళ్ల వివాహ బంధాన్ని నూరేళ్ల అనుబంధంగా పదిలంగా దాచుకుంటోంది గౌరీ మహదీక్. ధైర్యానికి వందనం గౌరీ మహదీక్ అంకితభావాన్ని, ధైర్యసాహసాలను గురువారం నాడు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గౌరి జీవితంలో సంఘటనలను ఉదహరిస్తూ భర్తకు నివాళిగా ఆమె సాధించిన లక్ష్యాన్ని గుర్తు చేశారు. ‘ఇంతటి ధైర్యం, తెగువ, అంకితభావం భారతీయ మహిళలోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు అచ్చమైన ప్రతీక గౌరీ మహదీక్’ అన్నారు స్మృతీ ఇరానీ. ఈ సందర్భంగా గౌరీ మహదీక్ తాజా చిత్రాన్ని స్మృతి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘ఆన్లైన్లో ఇప్పుడు మరోసారి గౌరీ మహదీక్ గురించిన వార్తలన్నింటినీ చదివాను. చాలా గర్వంగా అనిపించింది’ అని కూడా అన్నారు స్మృతి. భారత్– చైనాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక వీరులను క్షణక్షణం తలుచుకోవాల్సిన సమయం ఇది. మంత్రి సైనికులను, అమర వీరులను ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు. -
చర్చలు.. ఆగని మోహరింపులు
న్యూఢిల్లీ: ఒకవైపు బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్తో చర్చలు కొనసాగిస్తూనే భారీగా చైనా సైన్యాన్ని మోహరిస్తోంది. గతంలో రెండు దేశాల సైన్యం పెట్రోలింగ్ చేపట్టి, తాజాగా చైనా శాశ్వత శిబిరాలు ఏర్పాటుచేసిన పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వివాదాస్పదంగా ఉన్న ఈ భూభాగం మీదుగా మరింత తూర్పువైపు భారత భూభాగంలోకి రావడమే డ్రాగన్ లక్ష్యం. దీనిని పసిగట్టిన భారత్ భారీ మోహరింపులతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. తూర్పు లద్దాఖ్లోని మరో మూడు వివాదాస్పద ప్రాంతాల్లోనూ సైనిక సమీకరణలు జరుగుతున్నాయి. గడిచిన 72 గంటల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాలు సైన్యాలను పెద్ద ఎత్తున తరలించాయి.చైనా పాంగాంగ్ త్సో, హాట్ స్ప్రింగ్స్ ఏరియాలో మోహరింపులు చేపట్టింది. గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14(జూన్ 15న తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతం), పెట్రోల్ పాయింట్లు 15, 17ఏల వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పాంగాంగ్ త్సోతో పోలిస్తే గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతానికి చైనా ఆయుధ సంపత్తి, బలగాలకు దీటుగా భారత్ స్పందిస్తోంది. క్షిపణి రక్షణ వ్యవస్థ, ఆధునిక యుద్ధ విమానాలతో గస్తీని ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల సైనిక సమీకరణలతో చర్చలు కూడా మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. అప్పటి దాకా అంటే మరో మూడు నెలల వరకు శీతాకాలం వచ్చే దాకా ఇదే తీరు కొనసాగవచ్చు. కఠినమైన చలికాలంలో గల్వాన్ నది గడ్డకట్టే పరిస్థితుల్లో సరిహద్దుల్లో సైనికుల పోస్టులు, గస్తీ కొనసాగేందుకు ఎలాంటి అవకాశాలు ఉండవు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న భారీ సమీకరణలను చూస్తే.. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం తగ్గిందని, వెనక్కి తగ్గరాదన్న కృతనిశ్చయాన్ని పెంచిందని అర్థమవుతోంది. దీనికితోడు, చైనా మోబైల్ యాప్లపై భారత్ నిషేధం విధించింది. భారత్, చైనా సుదీర్ఘ చర్చలు తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఖరారే లక్ష్యంగా భారత్, చైనా లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. భారత భూభాగంలోని చుషుల్ సెక్టార్లో మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. యధాతథ స్థితిని కొనసాగించాలని భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుపక్షాలు తమదైన రీతిలో పోటీకి సిద్ధమవుతున్నాయి. చైనా సరిహద్దు దళాలకు శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మార్షల్ ఆర్ట్స్ శిక్షకులను రంగంలోకి దించగా.. దీనికి దీటుగా భారత్ తన ‘ఘాతక్’ కమాండోలను సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ చైనా కయ్యానికి కాలుదువ్వితే వేగంగా స్పందించేందుకు భారత వాయుసేనను అప్రమత్తం చేసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో 8 నిమిషాల్లోనే ప్రతిదాడులు చేసేలా వాయుసేన సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. సముద్రమార్గంలోనూ చైనా కదలికలపై నిఘా ఉంచేందుకు నావికాదళం అప్రమత్తమైంది. అమెరికా, జపాన్ వంటి మిత్రదేశాల సహకారం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. (చైనాతో తాడోపేడో.. గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకోండి) హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్లు రెండు రోజుల క్రితమే నావికా విన్యాసాలను పూర్తి చేయగా ఇందులో పాల్గొన్న ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులిష్, జపాన్ నౌకలు జేఎస్ కషిమా, జేఎస్ షిమయూకిలు చైనాపై ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. సరిహద్దుల వెంబడి ఉన్న మూడు వాయుసేన స్థావరాలతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్కర్దు కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేం దుకు, యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూండగా ఆకాశ్ క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించడం ద్వారా భారత్ సై అంటోంది. ఆకాశ్ క్షిపణులు శత్రువుల యుద్ధవిమానాలతోపాటు డ్రోన్లు సంధించే క్షిపణులను ధ్వంసం చేయగలవు. సరిహద్దుల్లోని మూడు వాయుసేన స్థావరాల్లో చైనా జే–11, జే–8 యుద్ధ విమానాలు, బాంబర్ విమానాలు, ఏవాక్స్ను మోహరించినట్లు సమాచారం. అయితే పర్వతసానువుల్లో యుద్ధానికి సంబంధించి భారత్కు ఉన్నంత అనుభవం చైనాకు లేదు. లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో యుద్ధమంటూ వస్తే సుఖోయ్, మిరాజ్, జాగ్వార్ వంటి భారత యుద్ధవిమానాలు చైనీయులపై ఆధిపత్యం చెలాయిస్తాయని అంచనా. రాటుదేలిన ఘాతక్ కమాండోలు సరిహద్దుల్లో చైనీయులను ఎదుర్కొనేందుకు భారత మిలిటరీ వర్గాలు రంగంలోకి దింపనున్న ఘాతక్ కమాండోలు కఠోరమైన శిక్షణతో రాటుదేలారు. కర్ణాటకలోని బెళగావిలో 43 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఒక్కో కమాండో తన భుజాలపై 35 కేజీల బరువులు మోస్తూ రోజుకు 40 కి.మీ.ల దూరం ఏకబిగిన పరుగెత్తాల్సి ఉంటుంది. యుద్ధం లేదా ఘర్షణలాంటి పరిస్థితులు వస్తే పెద్ద ఎత్తున ఆయుధాలతో శత్రుమూకల్లోకి చొరబడి మెరుపుదాడులు చేయడం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. పదాతిదళంలో భాగమైన ఘాతక్ కమాండోలు ఒట్టి చేతులతో శత్రువును మట్టికరిపించేలా శిక్షణ పొందారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడం, కొండలను, గుట్టలను అతి సునాయాసంగా దాటగలగడం, శత్రు స్థావరాల్లో విధ్వంసం సృష్టించడం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. బెళగావి శిక్షణ కేంద్రంలో కమాండోలకు ఇచ్చే శిక్షణ ప్రపంచంలోనే అత్యంత కఠినమైందిగా గుర్తింపు పొందింది. పాకిస్థాన్పై భారత్ చేసిన సర్జికల్ దాడుల్లో పాల్గొన్నది ఘాతక్ ప్లటూన్ కమాండోలే. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!) భారత్, చైనా నేడు చర్చలు తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్, చైనాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం మరో దఫా భేటీ జరగనుంది. వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరలో భారత్ వైపునున్న చిషుల్ సెక్టార్లో ఉదయం 10.30 గంటలకు వీరు చర్చలు ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సున్నితమైన ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణకు సంబంధించిన విధి విధానాలను వీరు ఖరారు చేస్తారని వెల్లడించాయి. జూన్ 6, 22వ తేదీల్లో చైనా భూభాగంలోని మోల్డోలో జరిగిన సంభాషణల్లో రెండు దేశాలు పరస్పరం ఏకాభిప్రాయం ఆధారంగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అంగీకారానికి వచ్చాయి. దీనిని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై సైనికాధికారులు ఖరారు చేయనున్నారు. భారత బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్, చైనా తరఫున టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహిస్తారు. 15న రెండు దేశాల సైనికుల ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందడం తెల్సిందే. -
కొప్పుముడి ఖడ్గధారి
అమెరికన్ మిలటరీలో రాణీ రుద్రమ! ఫస్ట్ ‘అబ్జర్వెంట్’ సిక్కు గ్రాడ్యుయేట్. సైన్యానికి తన రూల్స్ ఉన్నాయి. ఆమెకు తమ ఆచారాలు ఉన్నాయి. ఆమె కోసం సైన్యం తనని మార్చుకుంది. ఖఢ్గం అమెరికాది. కొప్పు ఆమెది. వ్యక్తిగా తనని నిలుపుకుంటూనే..సైనిక శక్తిగా నిలబడింది అన్మోల్!! సైన్యం సైన్యంలా ఉండాలన్నది అమెరికన్ పాలసీ. సైన్యంలో స్త్రీలు ఉండొచ్చు. పురుషులు ఉండొచ్చు. ట్రాన్స్జెండర్లు ఉండొచ్చు. వివిధ మతాల వారు ఉండొచ్చు. ప్రధానంగా మాత్రం వారంతా సైనికులు. ఆచారాలు ఉంటే పక్కన పెట్టేయాలి. తలజుట్టు కత్తిరించుకోనంటే ఆర్మీలో చేరాలన్న ఆశల్ని కత్తిరించుకోవలసిందే. గడ్డం ఉండాల్సిందే అనుకుంటే ఆర్మీ కెరీర్కీ దూరంగా ఉండాల్సిందే. అయితే శనివారం న్యూయార్క్, వెస్ట్ పాయింట్లోని యు.ఎస్.మిలటరీ అకాడెమీలో జరిగిన ‘గ్రాడ్యుయేషన్ సెర్మనీ’లో హ్యాట్ను పైకి ఎగరేసిన పట్టుకున్న ఒక యువతి.. మిలటరీ డ్రెస్, చేతిలో ఖడ్గంతో పాటు కొప్పుముడితో సాక్షాత్కరించింది! అమెరికన్ ఆర్మీలో ఆచార పరాయణత్వాన్ని ప్రతిఫలింపజేసిన ఆ సిక్కు మహిళ.. అన్మోల్ నారంగ్ (23). అయితే తనేమీ నిబంధనలకు మినహాయింపు పొంది ఆకాడెమీలో చేరలేదు. మోకాళ్ల వరకు ఉండే తన జుట్టును నిబంధనలకు లోబడే మూడున్నర అంగుళాల చుట్టుకొలతను మించని కొప్పుగా ముడి వేసుకుని ‘క్యాడెట్’ శిక్షణ పూర్తి చేసింది. పట్టాతో పాటు, యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘ఫస్ట్ అబ్జర్వెంట్ ఫిమేల్ సిఖ్ గ్రాడ్యుయేట్’ గా గుర్తింపు పొందింది. 2017లో యు.ఎస్. మిలటరీ తన నిబంధనలను సడలించాక అబ్జర్వెంట్గా (ఆచారాలను వదలని సైనికురాలిగా) అకాడమీ నుంచి డిగ్రీతో బయటికి వచ్చిన తొలి సిక్కు మహిళ అన్మోల్ నారంగ్. ఇప్పటికే ఆమె అమెరికా సైన్యంలో ‘సెకండ్ లెఫ్ట్నెంట్’ హోదాలో ఉంది. ఇప్పుడిక కొత్తగా వచ్చిన డిగ్రీతో ‘బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సు’ కూడా పూర్తి చేస్తే 2021 జనవరిలో జపాన్లోని ఓకినావాలో ఉన్న అమెరికన్ బేస్లో హై ర్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించవచ్చు. అన్మోల్ అమెరికాలోనే పుట్టింది. జార్జియాలోని రాస్వెల్లో స్థిరపడిన రెండో తరం భారతీయ సంతతి కుటుంబంలోని అమ్మాయి అన్మోల్. తాతగారు (అమ్మవాళ్ల నాన్న) భారత సైన్యంలో చేశారు. అయితే సైన్యంలో చేరాలన్న అన్మోల్ ఆశలు ఆయన్నుంచి చిగురించలేదు. హైస్కూల్లో ఉండగా తల్లిదండ్రులతో కలిసి హానలూలు లోని ‘పెరల్ హార్బర్ నేషనల్ మెమోరియల్’ చూడ్డానికి Ðð ళ్లింది అన్మోల్. 1941 డిసెంబర్ 7 ఉదయం హానలూలు లోని పెరల్ హార్బర్లో ఉన్న అమెరికన్ నావికా స్థావర ంపై జపాన్ నౌకాదళం వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో రెండు వేలమందికి పైగా అమెరికన్లు చనిపోయారు. మరో రెండు వేల మంది గాయపడ్డారు. అప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా పెరల్ హార్బర్పై జపాన్ దాడితో రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగవలసి వచ్చింది. మెమోరియల్లో ఆనాటి యుద్ధ జ్ఞాపకాలను చూస్తున్న అన్మోల్ ఆ క్షణమే అనుకుంది అమెరికన్ ఆర్మీలో చేరాలని. చేరడమే కాదు, తన ‘శత్రుదేశం’ జపాన్ని హద్దులో ఉంచడానికి అమెరికా సైనికాధికారిగా కూడా వెళ్లబోతోంది. వెస్ట్ పాయింట్లో చేరడానికి ముందు జార్జియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చేసింది అన్మోల్. న్యూక్లియర్ ఇంజినీరింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆమె సబ్జెక్టులు. ‘‘వెస్ట్ పాయింట్లో డిగ్రీ చెయ్యాలన్న నా కల ¯ð రవేరింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిలటరీలోని నిబంధనల సడలింపునకు అమెరికాలోని ‘సిక్కు కోఎలిషన్’ సంస్థ చేసిన పదేళ్ల పోరాటం నా కలను నెరవేర్చాయి’’ అంటోంది అన్మోల్ నారంగ్. పాసింగ్ అవుట్ పరేడ్లో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లకు వారి తల్లిదండ్రులకు బదులుగా సైనికాధికారులు, వారి సతీమణులు ‘మిలటరీ స్టార్’లు తొడిగారు. ఆఫీసర్లే అమ్మానాన్నలు! యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘గ్రాడ్యుయేట్ సెర్మనీ’ జరిగిన రోజే మన డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అక్కడి అకాడమీలో అన్మోల్ నార ంగ్ తన మత సంప్రదాయాన్ని నిలబెట్టుకున్న తొలి సిక్కు మహిళా గ్రాడ్యుయేట్గా గుర్తింపు పొందితే.. ఇక్కడి అకాడమీ.. పాసింగ్ అవుట్ పరేడ్కు గ్రాడ్యుయేట్ల తల్లిదండ్రులను ఆహ్వానించే సంప్రదాయాన్ని కరోరా కారణంగా నిలుపుకోలేకపోయింది. తల్లిదండ్రులకు బదులుగా భారత సైనిక అధికారులు, వారి సతీమణులు పట్టభద్రులైన యంగ్ ఆఫీసర్ల భుజాలకు స్టార్లను తొడిగారు. అమెరికన్ మిలటరీ అకాడమీ నుంచి 1100 మంది, ఇండియన్ మిలటరీ అకాడమీ నుంచి 423 మంది శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వచ్చారు. -
టాప్–3లో భారత్
లండన్: ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ► 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ. ► మొత్తమ్మీద టాప్–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది. ► సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి. ► ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది. -
అమెరికా, చైనాల తర్వాతే భారత్..
స్టాక్హోం: రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు తదితర మిలిటరీ కార్యకలాపాలకై ప్రపంచదేశాలు 2019 ఏడాదికి గానూ 1917 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ది స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ సంస్థ(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. సైన్యం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా ఆసియా దేశాలు చైనా, భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది. గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా... భారత్ 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. (హ్యుమన్ ట్రయల్స్.. నేను బతికే ఉన్నా) ఇక అగ్రరాజ్యం అమెరికా 732 బిలియన్ డాలర్లు సైనిక వ్యవస్థ కోసం ఖర్చు చేసిందని ఎస్ఐపీఆర్ఐ తెలిపింది. ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా నిలిచాయని... ప్రపంచ దేశాలు సైన్యం మీద ఖర్చు చేసిన మొత్తంలో సింహ భాగం ఈ దేశాలదేనని పేర్కొంది. ఈ ఐదు దేశాలు కలిపి మొత్తంగా 62 శాతం నిధులు రక్షణ వ్యవస్థ కోసం వెచ్చించాయని తెలిపింది. ఇక జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 43.9బిలియన్ డాలర్లు ఖర్చు చేసి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నాయని వెల్లడించింది. అయితే 2020లో కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఈ ఏడాది సైన్యం మీద ఖర్చు చేసే మొత్తం తక్కువగానే ఉండవచ్చని ఎస్ఐపీఆర్ఐ అంచనా వేసింది.(కిమ్ బతికే ఉన్నాడు!) -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్గానూ కొనసాగుతారు. -
విమానం అదృశ్యం: 21 మంది ప్రయాణికులు సహా..
శాంటియాగో: చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది. అంటార్కిటికా ప్రాంతం గుండా వెళ్తున్న ఈ విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవటంతో అదృశ్యం అయినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆయన ఆదేశించారు. కాగా సీ-130 విమానం సోమావారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3,000 కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్ నగరం దగ్గర విమనానం సిగ్నల్ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు. -
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
ఫాం కోల్పోయిన మిలటరీ డెయిరీ
హైదరాబాద్: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. వందలాది ఆవుల ‘మంద’హాసం. ఉద్యోగుల ఆలనా‘పాల’నా... 125 ఏళ్లపాటు నిరుపమాన సేవలు... సైనికులకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా... బలగాలకు అంతులేని బలం.. ఇదీ మిలటరీ డెయిరీ ఫార్మ్ సర్వీసెస్ ఘనమైన గతచరిత్ర. మరిప్పుడో! అది ‘ఫాం’కోల్పోయింది.. చివరికి మూసివేత ‘పాలు’అయింది.. కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా నేడోరేపో తరలించనున్నారు. ఇప్పుడది పశువులులేని కొట్టంలా మారింది. ఒడిసిన ముచ్చట అయింది. వెటర్నరీతో మొదలై... ఈస్టిండియా కంపెనీ తమ సైనిక బలగాలలోని గుర్రాలు, ఒంటెలుసహా ఇతర జంతువుల సంరక్షణ కోసం 1794లో రిమౌంట్, వెటర్నరీ ఫార్మ్స్ సర్వీసెస్ ప్రారంభించింది. సైనికులకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ ఫార్మ్స్ సర్వీసెస్ పేరిట దేశవ్యాప్తంగా 39 మిలటరీ డెయిరీఫామ్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అలహాబాద్లో తొలి డెయిరీని నెలకొల్పింది. అదే ఏడాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్ (అప్పట్లో కంటోన్మెంట్లో అంతర్భాగం)లో 450 ఎకరాల విస్తీర్ణంలో మిలటరీ డెయిరీ ఫామ్ ఏర్పాటైంది. ఈ ఫామ్కు ఓ దాత మరో 550 ఎకరాలు విరాళంగా ఇవ్వడంతో మొత్తం 1,000 ఎకరాలకు విస్తరించింది. నాటి నుంచి సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలోని సైనిక శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ట్రూపులకు పాలు, పాల ఉత్పత్తులను అందిస్తూ వచ్చింది. అయితే, బహిరంగ మార్కెట్లో సరసమైన ధరలకే నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు లభిస్తున్న నేపథ్యంలో డెయిరీఫామ్లు కొనసాగించాల్సిన అవసరం లేదని మిలటరీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 2017 ‘మిలటరీ ఫామ్స్ సర్వీసెస్’మూసివేత ప్రక్రియను షురూ చేశారు. చివరగా, తాజాగా సికింద్రాబాద్ డెయిరీఫామ్ను మూసివేశారు. ఫామ్లోని 498 జెర్సీ ఆవులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు అక్కడ కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. సిబ్బందిని సైతం కొద్దిరోజుల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. దీంతో డెయిరీ ఫామ్ పూర్తిస్థాయిలో కనుమరుగు కానుంది. బస్తీ ఖాళీకి ఆదేశాలు... డెయిరీఫామ్లో పనిచేసే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కోసం 120 క్వార్టర్లను అధికారులు నిర్మించారు. కాలక్రమేణా ఉద్యోగుల వారసులు సైతం అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడో బస్తీ వెలిసింది. అయితే, ఈ బస్తీలోని ఇళ్లను వచ్చే నెల పదోతేదీ నాటికి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినట్లు స్థానికులు చెప్పారు. కాగా, ఫామ్ ఆవరణలోనూ 170 ఎకరాల్లో జట్రోఫా మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తి కొనసాగుతోంది. కార్గిల్ వార్లోనూ కీలక పాత్ర ‘వెటర్నరీ, ఫార్మ్స్ సర్వీస్’విభాగం కార్గిల్ యుద్ధంలోనూ సైనికులకు కీలక సేవలు అందించాయి. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పి ఉండే కార్గిల్ సెక్టార్లో సైనికుల పహారాను కూడా నిలిపివేస్తారు. దీన్ని అదనుగా తీసుకుని పాక్ సైన్యం కార్గిల్ను ఆక్రమించింది. అయితే ఈ విషయం స్థానిక పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్న భారత ఆర్మీ పాక్ సైనికులను తిప్పి పంపింది. అయితే, మిలటరీ డెయిరీ ఫామ్ల మూసివేతలో భాగంగా కార్గిల్ మిలటరీ ఫామ్ను సైతం మూసివేశారు. పాడి పరిశ్రమకు మార్గదర్శి పల్లెల్లో కుటుంబ పరిశ్రమగా కొనసాగుతున్న పాలపరిశ్రమను మిలటరీ డెయిరీ ఫామ్స్ వ్యవస్థీకృతం చేశాయి. ఈ డెయిరీ ఫామ్స్ పలు కీలక విజయాలను సొంతం చేసుకున్నాయి. వాటిలో కొన్ని.. - జంతువుల్లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ తొలుత మిలటరీ డెయిరీ ఫామ్లలోనే మొదలైంది - దేశంలో డెయిరీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచింది - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో కలిసి సంకర జాతి పశువుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దదైన ‘ప్రాజెక్ట్ ఫ్రీస్వాల్’ను విజయవంతంగా కొనసాగించింది. -
పేలుళ్ల తరువాత.. తన అయిదు కుక్కల్ని
ఒకవైపు వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చివురుటాకులా వణుకుతోంది. మరోవైపు దేశ భద్రత కోసం తన వంతు సాయంగా ఒక మహిళా లెక్చరర్ ముందుకు వచ్చారు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న అయిదు మేలు జాతి కుక్కలను సైన్యానికి కానుకగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆమెపై సర్వత్రా అభినందనల వెల్లువ కురుస్తోంది. పేలుడు పదార్ధాలను, మందులను గుర్తించడంలో సైన్యం చూపిస్తున్న తెగువ, చురుకైన పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంతర్జాతీయ ఓపెన్ యూనివర్శిటీలోని లెక్చరర్ డాక్టర్ షిరు విజేమన్నే వెల్లడించారు. సైన్యానికి సాయం అందించే ఉద్దేశంతో ఒకే కుటుంబానికి అయిదు జర్మన్ షెపర్డ్ కుక్కులను సైన్యానికి అందించినట్టు చెప్పారు. నారాహెన్పిటలోని తన నివాసంలో బ్రిగేడియర్ ఎ.ఎ.అమరసకేరాకు అప్పగించారు డాక్టర్ షిరు విజేమన్నే. వీటికి పేలుడు పదార్థాల నిర్మూలన (ఈఓడి), శ్రీలంక ఇంజనీర్స్ (ఎస్ఇఎల్) స్క్వాడ్రన్లో కొన్ని వారాల పాటు ప్రత్యేక శిక్షణన ఇవ్వనున్నామని సైన్యం తెలిపింది. -
భారత వర్షం
మిలిటరీ సాంకేతిక నామంతో బి.ఎఫ్ 332 అని చోటు ఉంది. రోజస్తమానం అప్దైనా సరే డవున్దైనా సరే ఒక్క ట్రెయినైనా అక్కడ ఆగదు. ఒకటి ఆగుతుంది. అయితే అదొక స్పెషల్ ట్రెయిన్. అకస్మాత్తుగా ఒకరోజు తెల్లవారుజామున వచ్చి ఆగుతుంది. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది, ఆ సంగతి ముందుగా బిహారీ వంటవాడు భగవతిలాల్తో పాటు మాకు ఒక అయిదు మందికి మటుకు తెలుసును.స్టేషన్ లేదు, ట్రెయిన్ ఆగదు, అయినా రైల్వేసిబ్బంది ప్రతివాడి నోటిలోనూ ఒక కొత్త పేరు అల్లల్లాడుతుంది. దాన్ని మేము ‘అండా హాల్ట్’ అంటుంటాం. ‘అండా’ అంటే గుడ్డు. అండా హాల్ట్ దగ్గరగా ఉన్న కొండల కింద ‘మహాతా’ కులాల గ్రామం ఉంది. అక్కడికి దూరంగా ఉన్న భోర్కుండాలోని శనివారం సంతలో వాళ్లు కోళ్లనూ, కోడిగుడ్లను అమ్ముతూ ఉంటారు. చంకలో కోడిపుంజులు పెట్టుకొని కోడిపందాల ఆట ఆడుతుంటారు. మహాతా గ్రామస్థుల కోడిగుడ్లపై మాకేమీ ప్రత్యేకమైన మోజు లేదు. మా కాంట్రాక్టరుతో రైల్వేవాళ్లకు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఒక ట్రాలీకి ఎర్రజెండా తగిలించి రైలు పట్టాలపై నుంచి గుంపులు గుంపులుగా కోడిగుడ్లు తీసుకువచ్చి అప్పచెపుతూ ఉంటారు. బిహారీ వంటవాడు భగవతీలాల్, వాటిని రాత్రి ఉడకబెట్టి ఉంచుతాడు. అందుమూలాన కూడా కాదు దానికి ‘అండా హాల్ట్’ అని పేరు రావడం. ఈ గుడ్లు పూర్తిగా ఉడకడం అయాక వాటి గుల్లలు బైట పారెయ్యడం వల్ల అవి పోగుపడ్డ చోట కాలక్రమాన ఒక గుల్లలకొండ లేచింది. ఇదీ అసలు కారణం. మిలిటరీ భాషలో ఉన్న బి.ఎఫ్ 332లో ఉన్న మొదటి రెండు అక్షరాలూ మాకు ఏదో సాంకేతికమైనవి కాదు. బ్రేక్ఫాస్టు, పదానికి ఎబ్రీవియేషను అని మేము అనుకుంటాం. రామ్గఢ్ ఆ రోజుల్లో యుద్ధకాలపు ఖైదీల మకాం. ఇటలీ దేశపు ఖైదీలను అక్కడ బాయొనెట్సుతోనూ, వైర్ఫెన్స్తోనూ చుట్టబెట్టి ఉంచారు. దాని మధ్య ఒక ట్రెయిన్ సామాను ఎగుమతి చేసుకొని బయలుదేరుతుంది. ఎందుకో ఎక్కడికో మాకెవరికీ తెలియదు. కంట్రాక్టరు వ్రాసిన ఉత్తరం చదివి క్రితం రోజున వచ్చిన కోడిగుడ్లు పరీక్షించి, వంట మనిషి భగవతిలాల్ అన్నాడు ‘‘330 బ్రేక్ఫాస్టులు’’. భగవతిలాల్ లెక్కపెట్టి 660 గుడ్డులూ, ఒక పాతిక రద్దుపోయేందుకు ఇవతలకు తీస్తాడు. చెడ్డవి బయటకు పారేస్తాడు. అటుపైన వాటిని నీటిలో ఉడకపెట్టి, అవి బాగా గట్టిపడ్డాక, కూలీలు, అతనూ కలిసి గుల్లలు విడదీస్తారు. వైర్ ఫెన్సింగ్కి బైట పారవేయబడిన ఆ గుల్లలు రోజూ ఒక స్థూపంలా తయారవుతాయి.తెల్లవారుజామున ట్రెయిన్ వచ్చి ఆగుతుంది. కంపార్ట్మెంట్లో నుంచి దిగి ట్రెయిన్ రెండుపక్కలా మిలిటరీగార్డులు వచ్చి నిలబడుతారు. రైఫిల్స్ తీసుకుని, వాళ్లు యుద్ధఖైదీలను కాపలా కాస్తారు. చారల బట్టలు కట్టుకున్న విదేశీ ఖైదీలు పింగాణి కప్పు, ఎనామెలు ప్లేటు పుచ్చుకొని గదుల్లో నుంచి బయటికి వస్తారు. ఒక్కొక్క ఖైదీకి వరుసగా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారు కూలీలు. ఒకడు మగ్గులో కాఫీ పోస్తాడు. ఒకడు బ్రెడ్డూ, మరొకడు కోడిగుడ్డూ పళ్లెంలో వేస్తారు. అంతే, అంతటితో వాళ్లు వెళ్లి ట్రెయిన్ ఎక్కుతారు.ట్రెయిన్ వెళ్లిపోయాక భగవతీలాల్ ఆజమాయిషీలో అన్ని సరుకులూ గుడారంలో పెట్టి కూరలు కొనేందు కోసం కొన్ని రోజులు మేము మహాతా వాళ్ల గ్రామం వైపు వెళతాము. వైర్ ఫెన్సింగ్ మధ్య ప్రాంతాన్ని ఎత్తు చేసి ప్లాట్ఫారంగా తయారుచేశారు. ఖైదీల కాంపు మూసేసారు. మధ్యమధ్య ఒక మిలిటరీ స్పెషల్ ట్రెయిన్ వచ్చి ఆగుతుంది. సైనికులందరికీ గిన్నెలలో కాఫీ, ప్లేటులలో రొట్టి, కోడిగుడ్లూ యథావిధిగా పంచిపెట్టబడతాయి. దాని తర్వాత ఎవరి పెట్టెలో వాళ్లు ఎక్కుతారు. గార్డు ఈల ఊదుతాడు. నేను వెళ్లి సప్లైలు అందించే చోట మేజర్కి ఓకే చెప్పివస్తాను. ట్రెయిన్ వెళుతుంది. ఎక్కడికో, ఏ వైపుకో ఎవరికీ తెలియదు. ఒకరోజు అమెరికన్ సైనికుల ట్రెయిన్ వచ్చి నిలబడింది. సర్వర్లు రోటీ, కాఫీ అందించారు. సరిగ్గా అదే సమయంలో వైర్ ఫెన్సింగు అవతల సరిహద్దుపైన నా దృష్టి పడింది. ముళ్లకంచెకి కొంచెం దూరంలో ఒక చిగురు నిక్కరు కట్టుకున్న ‘మహాతా’ కుర్రవాడు కళ్లు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. నిశ్శబ్దంగా ట్రెయిన్ కేసి చూశాడు. ఈ తెల్ల అమెరికను సైనికులని చూశాడు. ఒక సోల్జరు వాణ్ణి చూసి ‘ఏయ్ ఏయ్’ అని అరుస్తూ పిలిచాడు. ఆ కుర్రవాడు వెంటనే వాళ్ల ఊరువైపు పరుగెత్తుకుంటూ పారిపోయాడు. వాణ్ణి చూసి కొందరు అమెరికన్ సైనికులు నవ్వుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ట్రెయిన్ రావడం చూసి ఆ ఇనుపబెల్టు పెట్టుకున్న కుర్రవాడు ఫెన్సింగ్ బైటికి వచ్చి నిలబడ్డాడు. వాడి కంటె పెద్దవాడు మరొక కుర్రవాడు కూడా ఉన్నాడు. వాడి మెడలో ఎర్రటి తాడు వేలాడదీసిన తగరపు రక్షరేకు ఉంది. భూర్కు సంతకు ఒకరోజు వెళ్లాను. అక్కడ కుప్పలు కుప్పలుగా అవి అమ్మకానికి ఉన్నాయి. ఆ బాలకులిద్దరూ మౌనంగా అమెరికన్ సైనికుల వైపు తేరిపార చూస్తున్నారు. నేను చేతిలో ఫారం పుచ్చుకొని అటూ ఇటూ తచ్చాడుతున్నాను. ఒక సైనికుడు తన కంపార్ట్మెంట్ తలుపుకి ముందుగా నిలబడి కాఫీ తాగుతూ కుర్రవాళ్లిద్దర్ని చూసి ‘ఫూల్’ అన్నాడు. మామూలుగా వాడిది వ్యవసాయపు పని. బాణం పుచ్చుకొని పిట్టలను కొట్టడం, పాటలు పాడడం, వినడం. విల్లునారిలాగ అప్పుడప్పుడు వంగుతూ సాగుతూ పొగరుబోతులా ఎదిరిస్తున్నట్లు నిలబడడం. చిరిగిన లాగు కట్టుకున్న వాడి శరీరం సన్నగా, నల్లగా ఉంటుంది. అమెరికన్ సిపాయి అన్న ‘ఎ ఫూల్’ అన్నమాట నా గుండెకు ముల్లులా గుచ్చుకుంది.ట్రెయిన్ వెళ్లిపోయింది. మళ్లీ అంతా నిర్మానుష్యం. మళ్లీ కొన్నాళ్లకు ట్రెయిన్ వచ్చింది. ఈసారి యుద్ధఖైదీల బండి. ఇటాలియన్ ఖైదీలు రామ్గఢ్ నుంచి మళ్లీ ఎక్కడికో పంపబడ్డారు. వాళ్ల చారల బట్టలలో దైన్యం ఉంది. ఒకడు పంచా, లాల్చి కట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడని, బెంగాలీని కాబట్టి నాకింకా భయం వేసింది. ట్రెయిన్ వెళ్లిపోయాక– ముళ్లకంచె అవతల ఇద్దరు కుర్రవాళ్లు, బిగువు బట్టలు ధరించిన 15 సంవత్సరాల పిల్లా, ఇద్దరు పెద్ద మగవాళ్లూ పొలం పని విడిచి అక్కడకు వచ్చి నిలబడ్డారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని, నవ్వుకుని, ఏదో జలపాతం చప్పుడయినట్లు కిలకిలలాడుతూ వాళ్ల ఊరు వైపు వెళ్లిపోయారు.ఒకరోజు వెళ్లి మహాతా వాళ్ల పెద్దను అడిగాను–వాళ్ల తాలూకు ఎవరినైనా పంపి మా క్యాంపులో కూరలు, చేపలు, రొయ్యలు... మొదలైనవి అమ్మించమని. ఆ పెద్ద నవ్వి అన్నాడు ‘‘పొలం పని విడిచి రాలేము’’ అదే క్షణంలో ట్రెయిన్ వచ్చేసింది. వెంటనే దిగారు అమెరికన్ సైనికులు–వరుసగా నిలబడ్డారు తమ కప్పులు, ప్లేట్లతో. ఆ కాలంలో కొంచెం చలి మొదలైంది. ఒక సైనికుడు యాంకీ గొంతుతో తన ముగ్ధతను వెల్లడి చేశాడు. మరొక సైనికుడు తన కంపార్ట్మెంట్ ఎదురుగా నిలబడి ముళ్ల కంచెకు అవతల ఉన్న శూన్యప్రదేశాన్ని తదేక దృష్టితో పరిశీలించాడు. అకస్మాత్తుగా అతను లాగు జేబులో చెయ్యి పెట్టాడు. పర్సులో నుంచి ఒక మెరిసే అర్ధరూపాయి బైటకు తీసి ఆ మహతా వాళ్ల వైపు విసిరాడు. వాళ్లు నిర్ఘాంతపోయి సైనికుల దిక్కుగా చూశారు. మెరిసే అర్ధరూపాయి దిక్కుగా చూశారు. తరువాత నిశ్శబ్దంగా ఉండిపోయారు.ట్రయిన్ వెళ్లిపోయాక వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోవడం చూసి నేను అన్నాను, ‘‘దొరగారు బహుమానం ఇచ్చారు. ఎందుకు తీసుకోరూ?’’ నేను అర్ధరూపాయి తీసి వాళ్ల పెద్ద చేతిలో పెట్టాను. అతను వెర్రి మొహం పెట్టి నాకేసి చూస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత అందరూ మాట్లాడకుండా వెళ్లిపోయారు.మహతా గ్రామవాసులు నా దగ్గరకు రావడం మానేశారు. అప్పుడప్పుడు నేనే వెళ్లి అక్కడ కూరలు, చేపలు కొనుక్కొని వస్తుంటాను. వాళ్లు అమ్మేందుకు రావడం లేదు మా దగ్గరకు. మూడు క్రోసుల దూరంలో ఉన్న భూర్కుండాలోని సంతకు వెళుతున్నారు. కొన్నాళ్లు ఏ ట్రెయిన్ రాక గురించి కబురు రాలేదు. నిశ్శబ్దం నిశ్శబ్దం. అనుకోకుండా ఒకరోజున ఆ లోహపుబెల్టు పెట్టుకున్న కుర్రవాడు వచ్చి అడిగాడు:‘‘టెరియిను రాదాండి, బాబుగోరూ?’’నవ్వుతూ అన్నాను: ‘‘వస్తుంది. వస్తుంది’’తెల్లవారుజామున ఒక పాసెంజర్ తుస్సుమంటూ వెళుతుంది. సాయంత్రం డౌన్ ట్రెయిన్ ఆగదు. అయినా ఏదో సమయాన ట్రెయిన్ కిటికీలోంచి అస్పష్టంగా కనిపించే ముఖాల్ని చూడగలనేమోనని క్యాంప్లోంచి బైటకు వచ్చాను. కొత్తముఖాలు చూడక నా బెంగ ఎక్కువైపోతుంది. ఆ అమెరికన్ సైనికుల స్పెషల్ ట్రెయిన్ వస్తుందన్న వార్త విని ఎంత గాభరా పడతానో మళ్లీ అంత తృప్తి కూడా కలుగుతుంది.కొన్నాళ్ల తరువాత మిలిటరీ స్పెషల్ వచ్చింది. హఠాత్తుగా చూసేసరికి ముళ్లకంచెకు అవతల వైపు మహతా గ్రామ ప్రజలు గుంపుగా వచ్చి పడ్డారు. వాళ్లందరినీ చూసేసరికి నాకేదో భయం అనిపించింది. అమెరికన్ సైనికులు కాఫీ తాగుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉండిఉండి ఒకడు తన జేబులోంచి మనీపర్సు తీసి, అందులో నుంచి రెండురూపాయల కాగితంలాగి భగవతిలాల్ని అడిగాడు ‘‘దీనికి చిల్లర ఉందా?’’అణాలు,బేడాలు, పావలాలు కలిపి భగవతిలాల్ చిల్లర ఇచ్చాడు. చిల్లరను ఆ అమెరికన్ సైనికుడు మహాతా గ్రామస్థుల గుంపులోకి విసిరేశాడు. నా సఫ్లై ఫారంని ఓకే చేసి, గార్డు ఈల ఊదాడు. ట్రెయిన్ కదలడం మొదలు పెట్టిందనేసరికి, నేను మహతా జనం వైపు చూశాను. వాళ్లు అలా చూస్తూనే నిలబడిపోయారు. బెల్టు కట్టుకున్న వాడూ, వాడి స్నేహితుడు మెళ్లో తావీజు కట్టుకున్నవాడూ ఆ చిల్లర డబ్బులను పోగు చేయడానికి ప్రయత్నించారు. మహతా పెద్ద వాళ్లని తిడుతూ ‘ఖబడ్దార్’ అన్నాడు. కాని ఆ కుర్రవాళ్లు అతని మాటలు వినలేదు. వాళ్లు దొరికినంత మట్టుకు అణాలు బేడలు పోగు చేసి తీసుకున్నారు. మహతా పెద్ద కోపంతో గిజగిజలాడుతూ తను ఒక్కడూ స్వగ్రామం వైపు బయలుదేరాడు. ఆడవాళ్లూ, మగవాళ్లూ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక మళ్లీ ‘అండా హాల్ట్’ నిర్మానుష్యం అయిపోయింది. దూరాన కొండలూ, ‘మహతా’ పళ్లతోట, కూరల తోట దాటాక ఒక చిన్న జలధార, దాని తర్వాత మహతా వాళ్ల ఆకుపచ్చని పొలాలు. కళ్లు చల్లబడి హాయి అనిపిస్తుంది.మధ్యమధ్యన అమెరికను సోల్జర్ల ట్రెయిన్ రావడం, ఆగడం, వాళ్లు గుడ్లు, రొట్టె, కాఫీ సేవించి వెళ్లిపోవడం, మహతా గ్రామజనం గుంపులుగా రావడం, ముళ్ల కంచెకు అవతల నిలబడి తేరిపారచూడడం..‘‘దొరగారూ, బహుమతి! దొరగారూ! బహుమతి!’’ఒక్కసారి అనేకమంది పల్లెజనం అరిచారు. ఒకరోజున కూరగాయలు కొనేందుకు నేను వెళ్లినప్పుడు ఆ పిల్ల అడిగింది: ‘‘టెరియిను ఎప్పుడొస్తుంది?’’ఒక్కొక్క రోజున వీళ్లందరూ చాలాసేపు ఎదురుచూసి, చూసి వెళ్లిపోయేవారు. భుజానికి 3 చారలు గల చొక్కా తొడుక్కున్న అమెరికన్ ఒకడు వాళ్లను చూడగానే జేబులోంచి గుప్పిళ్లతోటి అణాలూ, బేడాలుతీసివాళ్ల వైపు విసిరేవాడు. వాళ్లు ఆ డబ్బుల మీద పడిపోయేవారు పోగు చేసుకుందుకు.ట్రెయిన్ వెళ్లాక వాళ్లని సావధానంగా పరీక్షించి చూశాను. మహతా గ్రామంలోని సగం మంది వచ్చి పడ్డారనిపించింది. అందరికీ ఏదో కొంత డబ్బు దొరికే సరికి వాళ్ల ముఖంలో ఆనందరేఖలు వెలిగేవి.వంటవాడు భగతిలాల్, ముగ్గురు సర్వర్లూ, నేనూ మేము ఐదుగురం ఎలాగోలాగా క్యాంపులో రోజు వెళ్లబుచ్చేవాళ్లం. మధ్య మధ్య ఒక్కొక్క రోజున సైనికుల ట్రెయిన్ వచ్చేది, ఆగేది, వెళ్లేది. మహతా›గ్రామ గుంపు ‘‘సాబ్, బక్షీస్! బక్షీస్’’ అని చేతులు జాపి అరిచేది.ఒకరోజున మహతా వాళ్ల పెద్దను చూడడం తటస్థించింది. ఒకరోజు పొలం పని ఆపు చేసి, చేతుల్లోని దుమ్ము దులుపుకుంటూ కంగారుగా వచ్చి వాళ్లందరిని కోపపడి దూషించాడు. అతని మాట ఎవరూపట్టించుకోక పోవడం వల్ల నిస్సహాయుడై వాళ్ల పనిని అడ్డగిస్తున్నట్లు కంటి చూపును ప్రకటిస్తూ వాళ్లని చూస్తున్నాడు. కానీ వెనుకకు తిరిగి అతని మాట ఎవరూ వినడం లేదు. సైనికులు నవ్వుకుంటూ పాంటు జేబులోంచి గుప్పిట్లతో చిల్లర తీసి వాళ్ల వైపు విసురుతున్నారు. డబ్బులేరుకోవడంలో ఒకరినొకరు తోసుకుంటూ పోవడంలో వాళ్లలో వాళ్లకు దెబ్బలాటలు బయలుదేరాయి. అది చూసి సైనికులు నవ్వుతున్నారు.తాళ్లజోడు కట్టుకున్న వృద్ధుడు రావడం మానేశాడు. అతను జనంపై కోపగించడం, అతనింక రాకపోవడం– ఇదంతా నాకు ఒక విధంగా గర్వకారణమైంది. ఒక్కొక్కప్పుడు ఈ పల్లెటూరి జనం వ్యవహారం చూస్తే, నాకూ, భగవతిలాల్కు చాలా చిరాకు కలిగేది. వాళ్ల నల్లదన దరిద్రవేషం చూసి సైనికులు వాళ్లను ముష్టివాళ్లలా పరిగణిస్తున్నారు. ఆ సంగతి మాకు చాలా ఏవగింపు కలిగించింది.ఒకరోజున ముళ్లకంచె అవతల వైపు నుంచి ఆ జనం ‘బక్షీస్, బక్షీస్’ అని అరవడం విని– ఓ ప్రక్కన గార్డు జానకినాథతో మాట్లాడుతుండగా– మా పక్కన ఉన్న ఒక ఆఫీసరు వాళ్ల కేకల వల్ల విసుగుపుట్టిన వాడై వాళ్లని ఉద్దేశించి అన్నాడు: ‘‘బ్లడీ బెగ్గర్స్!’’. నేనూ, భగవతిలాల్ ఒకరి ముఖంలోకి మరొకరం చూసుకున్నాం. అవమానంతో మా ముఖాలు నల్లబడ్డాయి. భరించలేని కోపం.నా కోపం అంతా మహతా పల్లెజనంపై పడింది. ట్రెయిన్ వెళ్లగానే, భగవతిలాల్ని కూడా తీసుకువెళ్లి వాళ్లకి బుద్ధి చెపుదామని వెళ్లేసరికి, వాళ్లందరూ డబ్బులు పోగు చేసుకొని బట్టల్లో మూటకట్టుకుని నవ్వుకుంటూ పారిపోయారు. అయినా వాళ్ల గురించి నాకు కలిగిన అవమానాన్ని నా అహంకారంలో దాచి ఉంచుకున్నాను. భూర్కుండా కాంట్రాక్టర్ల నుంచి క్యాంపు మూసేయమని తీసుకు వచ్చాను, వాళ్లను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు. ‘అండాహాల్ట్’ ఫెన్సింగు అవతల డ్రమ్ముల మీద ఒక్కతాపు గట్టిగా తన్ని భగవతిలాల్ అన్నాడు: ‘‘ఆట అయిపోయింది’’ఏదో గందరగోళం, గొడవ వినబడగా వెనక్కి తిరిగి చూసేసరికి మహతా గ్రామవాసులు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకో ఏమో భగవతిలాల్ నవ్వడం మొదలు పెట్టాడు. వాళ్లందరూ ముళ్ల కంచెకి అవతల గుంపుగా నిలబడ్డారు. అదే సమయంలో ట్రెయిన్ వస్తున్న శబ్దం కూడా అయింది. వెనక్కి తిరిగి చూస్తే ట్రెయిన్ వంపు తిరిగి ‘అండాహాల్ట్’ వైపే వస్తోంది. కిటికీలలో ఖాకీ దుస్తులు కనిపిస్తున్నాయి. మేము గాభరా పడిపోయాం. అయితే భూర్కుండా వాళ్ల ఆఫీసు నుంచి పొరపాటు వార్త అందిందా? లేదే, నేనే వెళ్లి ఆ కబురు తీసుకువచ్చాను కదా!ట్రెయిను కొంచెం దగ్గరగా వచ్చేసరికి, ట్రెయిన్లో సైనికులందరూ గొంతు కలిపి నిండు గొంతుతో పాటలు పాడుతున్నట్లు స్పష్టమయింది. విభ్రాంతుడనై నేను ఒకసారి ట్రెయిన్ వైపు చూశాను. అలాగే ఒకసారి ముళ్లకంప వైపున ఆ గుంపు వైపు చూశాను. అదే సమయంలో నా కంటికి ఆ మహతా గ్రామపు పెద్ద కనిపించాడు. మిగతా గుంపుతో కూడా ఆ వృద్ధుడు కూడా ‘బక్షీస్, బక్షీస్’’ అని అరుస్తున్నాడు. వాళ్లందరూ ముష్టి వాళ్లలా అరుస్తున్నారు. అయితే మిగతా రోజుల్లా ఆ అమెరికన్ సైనికులు ఈసారి ‘అండాహాల్ట్’లో ఆగలేదు. పాసెంజర్ ట్రెయిన్లాగే ఈ స్పెషల్ ట్రెయిన్ కూడా ‘అండాహాల్డ్’ను నిర్లక్ష్యం చేసి తుస్సుమంటూ వెళ్లిపోయింది.ట్రెయిన్ ఇంకెప్పుడూ ఇక్కడ ఆగదని మాకు తెలిసింది. ట్రెయిన్ వెళ్లిపోయింది. కాని మహతా గ్రామస్థులందరు మటుకు ముష్టివాళ్లలా తయారై కూర్చున్నారు. పొలాల్లో వ్యవసాయం చేసుకునే మనుషులందరూ ముష్టి వాళ్లైపోయారు. బెంగాలీ మూలం : రమాపద్ చౌధురీ తెలుగు: రాధాకృష్ణమూర్తి చల్లా -
సూడాన్లో సైనిక తిరుగుబాటు
ఖార్టూమ్: ఆఫ్రికా దేశం సూడాన్లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గృహ నిర్బంధంలో ఉంచినట్లు గురువారం సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్రికాలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన పాలకుల్లో ఒకరైన బషీర్.. ఇస్లామిక్ తీవ్రవాదుల అండతో నియంతృత్వ విధానాలను అవలంభించారు. అల్ఖాయిదా చీఫ్ బిన్లాడెన్ వంటి వారు 1996 వరకు సూడాన్లోనే ఆశ్రయం పొందారు. బషీర్ విధానాల కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం దేశం నుంచి ఉత్తర సూడాన్ విడిపోయింది. -
కంటోన్మెంట్ బోర్డు త్వరలో రద్దు!
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కంటోన్మెంట్ బోర్డులు రద్దు కానున్నాయి. దేశవ్యాప్తంగా మిలటరీ స్టేషన్లలో అంతర్భాగంగా కొనసాగుతున్న జననివాస ప్రాంతాలను తప్పించనున్నారు. అనంతరం ఆయా కంటోన్మెంట్లు ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా కొనసాగనున్నాయి. సంబంధిత ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు గతేడాది ఆగస్టులోనే నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పష్టం చేశారు. కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మార్చనున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ల పరిధిలో 1,86,730.39 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం కోసం 2018 ఆగస్టు 31న ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించనుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో కలిసే అవకాశం కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కొనసాగుతున్న జన నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యే అవకాశముంది. 9,926 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆరు వేల ఎకరాలు పూర్తిగా మిలటరీ అధీనంలో ఉన్నాయి. 5 వందల ఎకరాలు విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖల అధీనంలో ఉన్నాయి. డిఫెన్స్ ఎస్టేట్స్ యాజమాన్య పరిధిలోని మరో 450 ఎకరాలు గ్రాంటుల రూపంలో (ఓల్డ్ గ్రాంట్ బంగళాలు) ఉన్నాయి. మిగిలిన 3,500 ఎకరాల్లో 700 ఎకరాలు (బైసన్ పోలో, జింఖానా సహా) కంటోన్మెంట్ బోర్డు యాజమాన్య పరిధిలో ఉన్నాయి. మిగిలిన 2,800 ఎకరాల్లోనే సాధారణ పౌరులకు సంబంధించిన 350 కాలనీలు, బస్తీలు ఉన్నాయి. సెక్రటేరియట్కు మార్గం సుగమం! కంటోన్మెంట్ బోర్డులను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే బైసన్ పోలో, జింఖానా సహా ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి అవసర మయ్యే భూబదలాయింపు ప్రక్రియ ప్రభుత్వానికి మరింత సర ళతరం కానుంది. ప్రస్తుతం భూబదలాయింపునకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే 156 ఎకరాల్లో సుమారు 120 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధిం చినవే. ఈ స్థలాలను అప్పగించడం వల్ల కోల్పోయే ఆదాయానికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు సర్వీసు చార్జీలు చెల్లించాలని ప్రతిపాదించింది. కంటోన్మెం ట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీలో కలిస్తే కేవలం 30 ఎకరాల మిలటరీ స్థలం మాత్రమే బదలాయింపు పరిధిలోకి వస్తుం ది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వీసు చార్జీలు చెల్లించకుండానే బైసన్పోలో, జింఖా నా మైదానాలు సహా, ప్యాట్నీ– హకీంపేట, ప్యారడైజ్– సుచిత్ర మార్గాల్లోని స్కైవేలకు భూములను సేకరించే వెసులుబాటు కలుగుతుంది. -
‘మా స్థాయికి తగ్గట్టు లేదు.. క్షమించండి’
వాషింగ్టన్ : అగ్రరాజ్య అణ్వాయుధాగారాన్ని పర్యవేక్షించే అమెరికా స్ట్రాటజిక్ కమాండ్(యూఎస్సీ).. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఏడాదిలో పెద్ద బాల్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అంతకంతకూ దాని పరిధి పెరుగతూనే ఉంటుంది’ అని యూఎస్సీ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు యూఎస్సీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘అసలు ఎలాంటి మనుషులు మీరు. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ట్రంప్ కొత్త ఆలోచన ఇదేనా. బాంబులు పేలుస్తామంటూ అమెరికన్లందరినీ బెంబేలెత్తించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారు’ అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన యూఎస్సీ... ‘నూతన సంవత్సరం సందర్భంగా చేసిన పాత ట్వీట్కు చింతిస్తున్నాం. అది మా విలువలు, స్థాయికి తగ్గట్టుగా లేదు. క్షమించండి. అమెరికా, దాని మిత్ర దేశాల భద్రతను పర్యవేక్షించడమే మా పని’ అంటూ మరో ట్వీట్ చేసింది. Our previous NYE tweet was in poor taste & does not reflect our values. We apologize. We are dedicated to the security of America & allies. — US Strategic Command (@US_Stratcom) December 31, 2018 Your tweet goes beyond needing an apology. What kind of people are you letting represent you? Is this the new dystopian Trump view? You alarmed many Americans with your tweet about bombing. Including a video of a bombing is beyond just an apology, this is reprehensible. pic.twitter.com/E52KBJ3Clh — B. Janine Morison (@bjaninemorison) January 1, 2019 -
సిరియాపై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సిరియానుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు అనూహ్యంగా ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సిరియాలోని అమెరికా సైనిక దళాలను పూర్తిగా విరమించుకుంటున్నామని వెల్లడించారు. ఐసిస్ను పూర్తిగా ఓడించామని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ట్రంప్ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. సిరియాలో ఐసిస్ ఓడించాం. తన హయాంలో ఇన్నాళ్లు అక్కడ ఉండటానికి ఇదే ఏకైక కారణమని ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు మిలిటర్ దళాలను సిరియానుంచి అతి త్వరగా వెనక్కి మళ్లేందుకు కృషి చేస్తున్నాయని అధికారికవర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశాన్ని పెంటగాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఇటీవల (డిసెంబరు 6) అక్కడ(సిరియా) ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ ప్రకటించడం గమనార్హం. We have defeated ISIS in Syria, my only reason for being there during the Trump Presidency. — Donald J. Trump (@realDonaldTrump) December 19, 2018 -
యుద్ధరంగంలో రోబోలు
ఇంగ్లండ్: ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. నైపుణ్యంతో సంబంధం ఉన్న పనులను కూడా రోబోలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మనల్ని మరింత ఆశ్చర్యానికి, భయానికి లోనుచేసే ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే... త్వరలో రోబోలు యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయట. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నా.. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్రిటిష్ సైన్యంలో రోబోలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆటోమెటిక్ ఆయుధాలను పరీక్షించే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఎక్కడో దూరంగా ఉండి కంట్రోల్ చేసే సాయుధ వాహనాలు, రోబో గన్లను విజయవంతంగా పరీక్షించారు. అయితే తాము మనుషులను చంపే రోబోలను తయారు చేయడం లేదని బ్రిటన్ చెబుతోంది. కానీ ఇలాంటి ఆయుధాల వినియోగంపై కొన్ని నైతికపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మేం మానవ నియంత్రణ లేకుండా యుద్ధ రంగానికి వెళ్లి, పోరాటం చేసే ఆటోమెటిక్ వాహనాలను ఎప్పుడూ ఉపయోగించబోమ’ని బ్రిటిష్ సైన్యానికి చెందిన బ్రిగేడియర్ కెవిన్ కాప్సీ తెలిపారు. అయితే యుద్ధంలో వాటంతటవే పనిచేసే ఆయుధాలను ఉపయోగించడంపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేవు. ఈ విషయమై నోబెల్ గ్రహీతలు, హక్కుల సంస్థలు మాత్రం ఇలాంటి ఆయుధాలను నిషేధించాలని కోరుతున్నారు. -
సైన్యంలో పని చేయాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైనా చేరాలంటే సైన్యంలో ఐదేళ్లు పనిచేయాలనే నిబంధన విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫాస్సు చేసిన నేపథ్యంలో నిర్బంధ సైనిక శిక్షణ, సేవపై దేశంలో చర్చ ఆరంభమైంది. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో మొత్తం59, 531 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్రివిధ బలగాల్లో సిపాయి వంటి పునాది స్థాయి ఉద్యోగాల్లో సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారు. ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అవసరమైన ఆఫీసర్ ఉద్యోగాల్లోనే సైనికోద్యోగుల కొరత ఎక్కువ ఉందని ఇండియా డిఫెన్స్ రివ్యూ అనే పత్రికలో రాసిన వ్యాసంలో బ్రిగేడియన్ అమత్ కపూర్ వెల్లడించారు. అధికారుల ఉద్యోగాలతోపాటు ఆఫీసర్ కింది ర్యాంకు ఉద్యోగాలు(పీబీఓఆర్) కూడా పూర్తిగా భర్తీకావడం లేదు. ఆధునిక నైపుణ్యం సంపాదించిన ఉన్నత విద్యావంతులకు మార్కెట్లో మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉండడంతో సైనిక దళాల్లో అధికారుల ఉద్యోగాల్లో చేరడానికి వారు ముందుకు రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులను సైన్యంలోకి ఆకర్షించడానికి దినపత్రికల్లో ‘మీలో ఈ సత్తా ఉందా?’ అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయినా సాంకేతిక విద్య అభ్యసించిన యువతీయువకులు తగినంత మంది సైనికదళాల్లో చేరడం లేదు. ఈ సమస్యను పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం దీని పరిష్కారానికి ఎవరూ ఊహించని రీతిలో పై సిఫార్సు చేసింది. ఫ్రెంచి విప్లవం నాటి నుంచే నిర్బంధ సైనిక సేవ! దాదాపు ఈడొచ్చిన యువకులందరికీ నిర్బంధ సైనిక శిక్షణ–సేవ అనే విధానం 1790ల్లో ఫ్రెంచి విప్లవం కాలంలోనే మొదటిసారి అమల్లోకి వచ్చింది. తర్వాత అనేక ఐరోపా దేశాలు ఈ విధానం అనుసరించాయి. అర్హతలున్న యువకులందరూ ఒకటి నుంచి మూడేళ్లు సైన్యంలో శిక్షణ తీసుకుని పనిచేశాక వారిని రిజర్వ్ దళానికి పంపించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎక్కువగా జరిగిన 19, 20వ శతాబ్దాల్లో సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేసిన దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడూ కాకున్నా యుద్ధాల సమయంలో నిర్బంధ సైనిక సేవ ఉండేది. 21వ శతాబ్దంలో అత్యధిక దేశాలు నిర్బంధ సైనిక శిక్షణ–సేవ పద్ధతికి స్వస్తి పలికాయి. అమెరికాలో కూడా ఈ విధానం ఎన్నో ఏళ్లు అమల్లో ఉంది. అమెరికాలో 1973లో నిర్బంధ సైనిక సేవను రద్దుచేశారు. స్వచ్ఛంద సైనిక శిక్షణ అమల్లోకి వచ్చింది. 32 దేశాల్లో అమలు! ప్రపంచంలోని అనేక దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానం 21 దశాబ్దంలో చాలా వరకు రద్దయింది. ఇంకా 32 దేశాల్లో 18 ఏళ్లు నిండిన యువకులు సైనిక దళాల్లో చేరడానికి పేర్లు నమోదు చేయించుకుని, శిక్షణ పొందే పద్ధతి అమల్లో ఉంది. అయితే, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఈ విధానం అనుసరిస్తున్నారు. కొన్ని దేశాల్లో యువతీయువకులందరూ తప్పని సరిగా సైన్యంలో చేరాలనే నిబంధన ఉంది. మరి కొన్ని దేశాల్లో మహిళలను దీని నుంచి మినహాయించారు. కొన్ని దేశాల్లో యుద్ధ సమయాల్లో మాత్రమే యువకులందరూ సైన్యంలో చేరాలనే నియమం పాటిస్తున్నారు. అమెరికా, కొలంబియా, కువాయిట్, సింగపూర్లో నిర్బంధ, స్వచ్ఛంద విధానాలు రెండూ అమల్లో ఉన్నాయి. కాని, ఎక్కడా ముందు సైన్యంలో ఇన్నేళ్లు పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చనే నిబంధన అమల్లో లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
రియాద్ : సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రియాద్, మక్కా, అల్-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్సెస్ల సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని.. అందుకు గురువారం(మార్చి 1వ తేదీ) ఆఖరు రోజని ప్రకటించింది. ఆర్మీలో చేరాలనుకునే మహిళలు దరఖాస్తులో 12 అంశాలను తప్పకుండా పూరించాలని తెలిపింది. సౌదీ జాతీయురాలై ఉండటం.. 25-35 ఏళ్ల మధ్య వయస్సు.. హైస్కూలు విద్యార్హత కలిగి ఉండాలి. వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరని పేర్కొంది. ఇక శారీరక ధారుఢ్యం విషయంలో అభ్యర్థి వయసు 155 సెంటీమీటర్లకు తగ్గకూడదని తెలిపింది. వీటితోపాటు ఇతరత్రా నిబంధనలను విధించింది. అయితే గార్డియన్ అనుమతితోనే ఆమె సైన్యంలో చేరాలన్న నిబంధనపై మాత్రం మహిళా హక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇక ఈ నియామకం యుద్ధంలో పోరాటడం కోసం కాదని.. తాము సైన్యంలో రాణించగలమన్న భావన మహిళలలో పెంపొందించేందుకేననని అధికారులు చెబుతున్నారు. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్బాల్ మ్యాచ్లు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. -
పాఠశాలల విద్యార్థులకు ‘మిలటరీ’ టూర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని మిలటరీ శిక్షణ కేంద్రాల్లో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మిలటరీ శిక్షణ, ప్రాధాన్యం, సైన్యం ఎదుర్కొనే సమస్యలు, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మిలటరీ టూర్ నిర్వహించగా, మరో 200 పాఠశాలల విద్యార్థులకు టూర్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. -
చంపాలా? వద్దా?
కథాసారం అతడు మౌనంగా లోపలికి వచ్చాడు.బుల్లెట్లున్న తోలుపట్టీని, దానికి వేలాడుతున్న తుపాకి సహా తీసి గోడకు వున్న కొక్కానికి తగిలించాడు. తన మిలిటరీ టోపీని కూడా అక్కడే పెట్టాడు. తర్వాత టై ముడి విప్పుతూ, ‘ఈ వేడిమి భయంకరంగా వుంది. నాకు గడ్డం చెయ్’ అని కుర్చీలో కూర్చున్నాడు. క్యాప్టెన్ టోరెస్! అతడిని చూడగానే క్షురకుడికి వణుకు మొదలైంది. భయంతో కూడిన భావోద్వేగాన్ని బయట పడనీయకుండా, తన దగ్గరున్న కత్తుల్లో అన్నిటికన్నా వాడిగా వున్నదాన్ని తోలుపట్టీ మీద పైకీ కిందకూ తిప్పుతూ పదునును మరింత పెంచడానికి ప్రయత్నించాడు. తర్వాత చేతి వేలితో సుతారంగా ఆ పదునును అంచనా వేశాడు. టోరెస్ గడ్డం నాలుగు రోజులదై వుంటుంది! అతడు నాలుగు రోజులుగా దళాలను వెతికే పనిలో ఉన్నాడు. అందువల్ల ముఖం ఎండ వేడిమికి కమిలి ఎర్రబడింది. క్షురకుడు జాగ్రత్తగా సబ్బు నురగ తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని సబ్బుముక్కల్ని ప్లాస్టిక్ కప్పులో పడేసి, కొన్ని వేణ్నీళ్లను అందులో పోసి, బ్రష్తో తిప్పటం మొదలెట్టాడు. ‘మా పటాలంలోని మిగిలినవాళ్లక్కూడా ఇంతే గడ్డం పెరిగి వుండాలి’ అన్నాడు టోరెస్. ‘ముఖ్యమైనవాళ్లు మాకు దొరికారు. కొందర్ని చంపేశాం. మరికొందరు ఇంకా బతికేవున్నారు. కానీ త్వరలోనే వాళ్లంతా చనిపోతారు’ అని కూడా అన్నాడు. ‘ఎందర్ని పట్టుకున్నారు మీరు?’ అడిగాడు క్షురకుడు. ‘పద్నాలుగు మందిని. వాళ్ల ఆచూకీ కనుక్కోవటం కోసం మేము అడవిలో చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలినవాళ్లను కూడా పట్టుకుంటాం. ఒక్కడు... ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు’. క్షురకుడు ఆందోళన చెందాడు. అతడు కూడా రహస్య దళానికి చెందినవాడే! డ్రాయరు సొరుగులోంచి గుడ్డను తీసి టోరెస్ మెడ వెనకాల ముడి వేశాడు. ‘మా చర్య ఈ నగర ప్రజలకు మంచి గుణపాఠాన్ని నేర్పివుండాలి’ అన్నాడు టోరెస్. అతడు బాగా అలసిపోయినట్టుగా కళ్లు మూసుకుని, సబ్బు నురగ తాలూకు చల్లదనాన్నీ, హాయినీ అనుభవించడానికి వేచి వున్నాడు. టోరెస్కు అంత సమీపంగా ఎప్పుడూ వెళ్లలేదు క్షురకుడు. నగర ప్రజలందరినీ స్కూలు ప్రాంగణంలో గుమిగూడాలని టోరెస్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం సేపు అతడికి ఎదురుగా నిలిచాడు. అక్కడ నలుగురు విప్లవకారులను చెట్లకు వేలాడదీసి తుపాకులతో కాల్చేస్తుంటే ప్రజలందరూ చూడాలని టోరెస్ కోరిక. గాయాలతో చెదిరిపోయిన ఆ శవాలను చూసి, ఆ చర్యకు ముఖ్యకారకుడైన మిలిటరీ అధికారి ముఖాన్ని అప్పుడు అంత పరీక్షగా చూడలేదు. కానీ ఆ ముఖాన్నే ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. టోరెస్ అందవికారంగా ఏం లేడు. ఆ గడ్డం వల్ల వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు మంచి ఊహాశాలీనత ఉన్నవాడయ్యుండాలి. లేకపోతే విప్లవకారుల్ని నగ్నంగా చెట్లకు వేలాడదీసి, వాళ్ల శరీరాలను టార్గెట్లు చేస్తూ షూట్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? సబ్బు నురగను అనుభవిస్తూ, కళ్లు మూసుకునే అన్నాడు టోరెస్: ‘నేను ఎంతగా అలసిపోయి వున్నానంటే ఇప్పుడు నేరుగా నిద్రలోకి జారుకోగలను. కానీ ఈ సాయంత్రం నేను చేయాల్సిన పని ఎంతో వుంది’. సబ్బు నురగ పులమటం ఆపి, ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, ‘మళ్లీ కాల్పులు కొనసాగిస్తారా?’ అడిగాడు క్షురకుడు. ‘అట్లాంటిదే. కానీ అంత తీవ్రమైన చర్య కాదు’. క్షురకుడి చేతులు మళ్లీ వణికాయి. అయినా ఇతర కస్టమర్లకు చేసినట్టుగానే ఇతడికి కూడా ఒక్క చుక్క రక్తం రాకుండా జాగ్రత్తగా గడ్డం తీయాలి. వెంట్రుకల మీద కత్తిని పక్కకు పోనీయకూడదు. అరచేతి వెనుక భాగాన్ని ముఖానికి ఆనించి కదిపితే ఒక్క వెంట్రుక కూడా లేనట్టు తెలియాలి. కత్తి బ్లేడును తెరిచి సైడ్ లాక్ నుండి గీయటం మొదలెట్టాడు. కత్తి మెత్తగా జారుతోంది. టోరెస్ వెంట్రుకలు మందంగా, బిరుసుగా ఉన్నాయి. గీస్తుంటే చిన్నగా చర్మం తేలుతోంది. ‘ఈరోజు ఆరు గంటలకు బడి దగ్గరకు రా’ అన్నాడు టోరెస్. ‘ఆరోజు లాగానే జరగబోతోందా?’ ‘ఇంకా బాగా కూడా వుండొచ్చు’ ‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’ ‘ఇంకా నాకే తెలియదు. కానీ మంచి వినోదం వుండబోతోంది’ ‘అందర్నీ శిక్షించాలని ప్లాను వేసుకున్నారా?’ ధైర్యం చేసి అడిగాడు. ‘అందర్నీ’ అద్దంలో కనబడే వీధిని చూశాడు క్షురకుడు. ముందరిలాగే కిరాణా దుకాణం, అందులో ఇద్దరో ముగ్గురో కస్టమర్లు ఉన్నారు. గడియారం రెండూ ఇరవై సూచిస్తోంది. మెడమీద కత్తిని మెల్లగా కదుపుతున్నాడు. అక్కడ గీసేటప్పుడు చాలా చాకచక్యంగా ఉండాలి. వెంట్రుకలు మందంగా లేకపోయినా చిన్నచిన్న రింగులుగా మెలి తిరిగినయ్. ఆ చర్మరంధ్రాల్లో ఏదైనా ఒకటి తెరుచుకుని రక్తాన్ని స్రవింపజేయగలదు. విప్లవకారుల్లో ఎంతమంది చంపించాడతడు! ఎంతమందిని చిత్రవధల పాలు చేశాడు! తన చేతుల్లో వున్న టోరెస్ ముఖానికి శుభ్రంగా గడ్డం గీసి, భద్రంగా ప్రాణాలతో వదిలేయటం భరించరాని విషయమనిపించింది. నిజానికి అతణ్ని చంపటం ఇప్పుడు ఎంత సులభం! గొంతును సర్రుమని కోసి. ప్రతిఘటించటానికి కూడా సమయం ఇవ్వకుండా. కళ్లు మూసుకుని వున్నాడు కనుక మెరిసే కత్తిని గుర్తించలేడు. మెడలోకి కత్తిని దించితే అందులోంచి రక్తం చిమ్మి గుడ్డనూ, కుర్చీనీ, నేలనూ మొత్తంగా తడిపేయగలదు. వెచ్చని రక్తం నేల మీదుగా పారి వీధిలోకి కూడా ప్రవహిస్తుంది. లోతుగా పెట్టే గాటు పెద్ద నొప్పిని కూడా కలిగించదు. మరి శవాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? క్యాప్టెన్ టోరెస్ను చంపిన హంతకుడు... గడ్డం గీస్తున్నప్పుడు గొంతు కోశాడు పిరికిపంద, అనుకుంటారు జనం. మనందరి వైపు నుండి ప్రతీకారం తీర్చుకున్నాడు, అని కూడా అనుకోవచ్చు! పట్టువస్త్రంలాగా, మెత్తని రబ్బరు ముక్కలాగా అతని చర్మం సులభంగా తెగిపోతుంది. మనిషి చర్మం కన్నా ఎక్కువ మెత్తనైనది మరేదీ లేదేమో! బయటికి చిమ్ముకుని రావడానికి లోపల రక్తం వుండనే వుంటుంది. కానీ నేను హంతకుణ్ని కాదలుచుకోలేదు. నువ్వు గడ్డం గీయించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు. నేను నా పనిని గౌరవప్రదంగా చేస్తాను. నా చేతులకు రక్తం అంటుకోవడం నాకిష్టం లేదు. కేవలం సబ్బు నురగ చాలు! నున్నగా శుభ్రంగా గడ్డం గీకేశాడు క్షురకుడు. టోరెస్ అద్దంలో చూసుకున్నాడు. అరచేతుల్తో చెంపల్ని ముట్టుకుని, ‘థాంక్స్’ అన్నాడు. కుర్చీలోంచి లేచి, బెల్టు, పిస్తోలు, టోపీ చేతిలోకి తీసుకున్నాడు. ప్యాంటు జేబులోంచి నాణాల్ని బయటికి తీసి ఇచ్చాడు. బయటికి వెళ్లబోతూ, ద్వారం దగ్గర ఆగి– ‘నువ్వు నన్ను చంపుతావని అన్నారు కొందరు. ఆ విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. చంపటం అంత సులువైన పనికాదు. నేను చెబుతున్న ఈ వాక్యంలో ఎంతో వాస్తవం ఉంది’ అన్నాడు టోరెస్. క్షురకుడు అక్కడే ఉండిపోయాడు. -
‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’
యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందా? ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు ప్రపంచాన్ని కుదేలు చేస్తాయా? పాకిస్తాన్కు సహకరిస్తున్న చైనా.. ఏవరితో యుద్ధం చేయాలనుకుంటోంది? భారత్పై సమరానికి చైనా రెడీ అవుతోందా? అసలేం జరుగుతోంది? బీజింగ్ : ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆర్మీకి తేల్చి చెప్పారు. సెంటల్ర్ మిలటరీ కమిషన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న జిన్పింగ్.. సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో సైనికాధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎంసీ సమావేశం జరిగినట్లుగా చైనా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలోనే జిన్పింగ్ ప్రసంగిస్తూ.. సాయుధ బలగాలు.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను కొత్త శకంలోకి నడిపించేందుకు కొత్తమిషన్ను ప్రారంభించాలని జిన్పింగ్ సైన్యానికి స్పష్టం చేశారు. సీఎంసీ ఛైర్మన్ చైనా సైన్యానికి సర్వాధికారి. చైనా సైన్యం సీఎంసీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తుంది. జిన్పింగ్ రెండోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. వరుసగా రెండోసారి సీఎంసీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. రెండు సమవేశాల్లోనూ ఆయన సమరానికి సైన్యం సిద్ధంగా ఉండాలని పేర్కొనడం విశేషం. సీఎంసీ సమావేశంలో అధ్యక్షుడు, సీఎంసీ ఛైర్మన్ జిన్పింగ్తో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. -
చేయిచేయి కలుపుదాం..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- ఫ్రాన్స్ మధ్య సైనిక బంధాన్ని మరింత ధృఢతరం చేసుకునే దిశగా కదులుతున్నాయి. అందులో భాగంగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేకాక నేవీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవడంతో పాటూ.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకునే దిశగా ఇరు దేశాలు ముందుకు కదులుతున్నాయి. డిసెంబర్ నెల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మ్యాక్రాన్ భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో.. ఆదేశ రక్షణ శాఖమంత్రి ఫ్లోరెన్స్ పార్లే, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ టెక్నాలజీని భారత్లో అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందాలు చేసుకుంది. తాజాగా మరో 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్ ప్రతిపాదనలు పంపంది. ఇదిలా ఉండగా మేకిన్ ఇండియాలో భాగంగా ఫ్రాన్స్కు చెందిన నేవెల్ గ్రూప్-డీసీఎన్ఎస్ భారత్లో ఆరు అడ్వాన్స్డ్ సబ్ మెరైన్స్ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ మొత్తం రూ. 70 వేల కోట్లు. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన ఆయుధ తయారీ సంస్థ ఒకటి ముంబైలో 23 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరు స్కార్పియన్ సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగస్వామిగా మారింది. వచ్చే ఏడాది ఫ్రాన్స్-భారత్ దేశాలు ’వరుణ‘ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. -
మిలటరీ కేంద్రాలకు ఐటీ హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 2 వేల మిలటరీ కేంద్రాలను స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్లో భాగంగా ఆధునీకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 58 మిలటరీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు. సరిహద్దుల్లో కీలకంగా ఉండే మిలటరీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంటర్నెట్ నెట్వర్క్ను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులు కల్పన, రహదారులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. -
సహనానికీ హద్దు ఉంటుంది
-
సహనానికీ హద్దు ఉంటుంది
►డోక్లాంపై చైనా ►భారత్...తన బలగాలను ఉపసంహరించాల్సిందే బీజింగ్: డోక్లాం వివాదం విషయంలో భారత్పట్ల తాము ఎంతో సౌహార్ద్ర భావనతో మెలిగామని, అయితే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని డ్రాగన్ తాజాగా వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడమనేది ఎంత సున్నితంగా మెరుగుపరుచుకుంటామనేదానిపై ఆధారపడి ఉంటుందంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్ శుక్రవారం పైవిధంగా స్పందించింది. డోక్లాం వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గత నెలలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఇరుదేశాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను విధిగా వెనక్కి తీసుకుంటేనే చర్చలు జరుపుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రెన్ గ్యుయో కియాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడంకోసం భారత్ తగురీతిలో వ్యవహరించాలని సూచించారు. ‘వివాదం తలెత్తిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగేలా చూడడంకోసం మా బలగాలు ఎంతో సంయమనం పాటించాయి. అయితే మా సౌహార్ద్రతకు, సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుంది’అని హెచ్చరించారు. జాప్యం చేస్తే సమస్య సమసిపోతుందనే ఎత్తుగడను భారత్ విడనాడాలన్నారు. తమ సైనిక బలగాల సత్తాను తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి డోక్లాం వివాదం విషయంలో ఒకవైపు చైనాతో దౌత్యపరంగా, మరోవైపు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భూటాన్తో సమన్వయంతో ముందుకుసాగుతున్నామని భారత్ శుక్రవారం పేర్కొంది. డోక్లాంలో భారత్...తన బలగాలను 400 నుంచి 40కి తగ్గించాలంటూ చైనా డిమాండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా సూటిగా జవాబిచ్చేందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే నిరాకరించారు. ఇది కార్యాచరణకు సంబంధించిన విషయమన్నారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు. -
చుట్టుముడుతున్న చైనా!
జిబూటీలో తొలి సైనిక స్థావరం (సాక్షి నాలెడ్జ్ సెంటర్) హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యం సంపాదించడానికి ఆఫ్రికా ‘కొమ్ము’ దేశమైన జిబూటీలో చైనా సైనిక స్థావరం ఏర్పాటుచేసుకోవడం ఆసియాలో ఆందోళనకలిగించే పరిణామంగా మారింది. ప్రపంచ ఆర్థికశక్తిగా ఆవిర్భవించి, తనతో పోటీపడుతున్న ఇండియాను అన్ని విధాలా దెబ్బదీయడానికే చైనా తన తొలి విదేశీ సైనిక స్థావరం నిర్మిస్తోందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అంతేకాకుండా భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో చైనాకున్న సైనిక ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో చైనా సైనిక ఉనికి కనిపిస్తోంది. రోజూ కోట్లాది డాలర్ల విలువైన ముడి చమురును వందలాది నౌకలు తీసుకెళ్లే ఆడెన్ సింధుశాఖకు సమీపంలోని బుల్లి దేశం జిబూటీ. తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ ముస్లిం దేశంలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జపాన్కు సైనిక స్థావరాలున్నాయి. మారిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వల్ల చైనా స్థావరం ఏర్పాటు పలు దేశాలకు గుబులు పుట్టిస్తోంది. ఎడారి ప్రాంతమైన తన భూభాగాన్ని అద్దె–లీజు పద్ధతిపై స్థావరాల ఏర్పాటుకు ఇచ్చి జిబూటీ లబ్ధిపొందుతోంది. మంగళవారం దక్షిణ చైనా రేవుపట్నం జాంజియాంగ్ నుంచి రెండు భారీ నౌకలు జిబూటీకి చైనా దళాలతో బయల్దేరాయని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే ఎన్ని ఓడల్లో తమ దళాలు కొత్త స్థావరానికి వెళుతున్నదీ చైనా వార్తా సంస్థలు వెల్లడించలేదు. ‘జాతీయ భద్రతకే’ సైనిక పాటవం పెంచుకుంటున్నామన్న చైనా! కీలక ప్రాంతంలో చైనా తన తొలి అంతర్జాతీయ సైనిక స్థావరం నెలకొల్పుతోందని అందరూ చెబుతుండగా, ఓడ దొంగలు, ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించడానికి ఈ ప్రాంతంలో తిరిగే తమ యుద్ధనౌకల కోసమే ఈ ‘మద్దతు స్థావరం’ నిర్మిస్తున్నామని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం బుధవారం తెలిపింది. అంతేగాక, చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకోవడంలో మౌలిక లక్ష్యం జాతీయ భద్రతేగాని ప్రపంచాధిపత్యం కాదని కూడా ఈ పత్రిక వాదిస్తోంది. కాని, గత రెండు నెలల్లో హిందూ మహాసముద్రంలో జలాంతర్గాములు, విధ్యంసక నౌకలు, కీలక సైనిక సమాచారం సేకరించే నావలు సహా చైనాకు చెందిన పది పదిహేను యుద్ధనౌకలు తిరగడాన్ని భారత నేవీ గుర్తించింది. 1992 నుంచి ఏటా అమెరికా, జపాన్తో కలసి మలబార్ సైనిక విన్యాసాల నిర్వహణ ద్వారా ఈ ప్రాంత జలాల్లో మూడు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారానికి ప్రతిస్పందనగానే చైనా జిబూటీలో సైనిక స్థావరం నిర్మిస్తోందని భావిస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని నౌకా మార్గాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవి. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇంథన అవసరాలు తీర్చుకోవడానికి పశ్చిమాసియా నుంచి దిగుమతిచేసుకునే ముడి చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. జిబూటీకి సమీపంలోని సింధుశాఖల ద్వారానే ఈ క్రూడాయిల్ ట్యాంకర్లు భారత్కు వెళతాయి. ఈ నేపథ్యంలో అక్కడ చైనా స్థావరం నిర్మాణం ఇండియా ప్రయోజనాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్ మీదుగా ఓబీఓఆర్ పేరిట రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. పాక్–చైనా ప్రత్యేక ఆర్థిక కారిడార్ ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్లో అనేక పోర్టులు, మౌలిక సదుపాయాలు చైనా నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే జిబూటీ సైనికస్థావరం భారత్కు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని భావించడం సబబే. -
సైనిక చర్య తప్పదు: చైనా
బీజింగ్: సిక్కిం రాష్ట్ర సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులపై వెనక్కు తగ్గకపోతే.. భారత్ సైనిక చర్యను ఎదుర్కొవాల్సివుంటుందని చైనా అధికారిక పత్రిక హెచ్చరించింది. భారత్-చైనాల మధ్య చెలరేగిన సమస్య చిలికి చిలికి గాలివానగా మారి యుద్ధానికి దారితీస్తుందని పేర్కొంది. గత చరిత్ర నేర్పిన పాఠాలను పునరుద్ఘాటిస్తూ సాధ్యమైనంతవరకూ శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. భారత్ మాట వినకపోతే.. సైనిక చర్య తప్పదని పేర్కొంది. అమెరికా దగ్గర గప్పాలు కొట్టేందుకే భారత్, చైనాను రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించింది. చైనా కంటే భారత్ ఏమంత గొప్ప శక్తిమంతమైన దేశం కాదని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో రీసెర్చ్ స్కాలర్గా పని చేస్తున్న హు జియాంగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ విషయం తెలుసని అందుకే ఆయన ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించారని పేర్కొన్నారు. భారత్, చైనాను తన విరోధిగా భావిస్తున్నా.. చైనా మాత్రం అదేం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతోందని అన్నారు. భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని హు అన్నట్లు గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఏం మాట్లాడకుండా ఉండటం ఇండియాకే మంచిదని హు సలహా ఇచ్చినట్లు వివరించింది. -
ఎఫ్ఐఆర్లతో మా పనితీరుపై ప్రభావం: సైన్యం
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్మీ ఆపరేషన్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వల్ల తమ పనితీరు ప్రభావితమవుతుందని సైన్యం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2000–2012 మధ్య వివిధ ఎన్కౌంటర్లలో 1538 మంది మృతి చెందడంపై న్యాయవిచారణతో పాటు నష్టపరిహారాన్ని ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) జస్టిస్ ఎంబీ లోకూర్, యుయు లలిత్ల ధర్మాసనం విచారించింది. ఈ ఘటనలపై న్యాయవిచారణకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోసం కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం చెరో అయిదు పేర్లను సూచించాలని ఆదేశించింది. -
మిలటరీ శక్తివంతమైతేనే ఆర్థికాభివృద్ధి
సమవుజ్జీలైన అంతర్జాతీయ భాగస్వామ్యాలతోనే ప్రగతి ప్రధాని శాస్త్రీయ సలహాదారు ఆర్.చిదంబరం తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎవరికీ తీసిపోదని ప్రధాని శాస్త్రీయ సలహాదారు, భారత అణుశక్తి సంస్థ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం అన్నారు. దేశ అభివృద్ధి, భద్రత ఒకే నాణేనికి రెండు ముఖా ల్లాంటివని, మిలటరీ రంగంలో శక్తిమంతంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధులపై దృష్టి పెట్టవచ్చ ని స్పష్టం చేశారు. సమవుజ్జీలైన అంతర్జాతీ య భాగస్వామ్యాల ద్వారానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించవచ్చన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్లో గురువారం ‘శాస్త్ర రంగంలో అంత ర్జాతీయ భాగస్వామ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లలో భారత్ అనేక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంద ని, వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే పొందుతున్నామన్నారు. ఎల్హెచ్సీ నుంచి... భారత్ ఇప్పటికే అనేక భారీస్థాయి శాస్త్ర ప్రయోగాల్లో పాలుపంచుకుంటోందని, హిగ్స్ బోసాన్ కణాన్ని గుర్తించేందుకు జరుగుతున్న ఎల్హెచ్సీ ప్రయోగాల్లోనూ అతికీలకమైన పరికరాలను మనం అతితక్కువ ఖర్చుతో సరఫరా చేశామన్నారు. అలాగే ఈ ప్రయోగా ల్లో వాడుతున్న సీఎంఎస్ డిటెక్టర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వ ర్యంలో నిర్మాణమైతే.. అలీస్ డిటెక్టర్ను కోల్ కతా గ్రూపు నిర్మించిందన్నారు. 2004 నాటి సునామీ తరువాత హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరికల కేంద్రం ఇప్పుడు హిందూమహా సముద్ర తీరంలోని అనేక దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోందని, ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించిందని తెలిపారు. అణుశక్తి ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వీలవుతుం దని.. అయితే ఇందుకోసం రేడియో ధార్మిక వ్యర్థాల సమర్థ పునర్ వినియోగం జరగాలని ఆయన చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో అగ్రస్థానానికి.. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో మనం మెరుగైన ఫలితాలు సాధించగలమనేందుకు యూరోపియన్ సంస్థలతో జరిగిన ఒప్పందాలు తార్కాణమని చిదంబరం తెలిపారు. జన్యుమార్పిడికి పనికొచ్చే జెర్మ్ ప్లాస్మాను మార్పిడి చేసుకోవడం ద్వారా 30 శాతం అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాన్ని సృష్టించగలిగామన్నారు. ఇలాంటివి మరిన్ని భాగస్వా మ్యాలు కుదరడం మనకు అవసరమని అన్నారు. మన శక్తి సామరŠాథ్యలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తృతం చేయడం ద్వారా శాస్త్ర, పరిశోధన రంగాల్లో మనం అగ్రస్థానానికి చేరుకోవచ్చునని ఆకాంక్షించారు. -
కూలిన మిలిటరీ హెలికాప్టర్
బాగ్దాద్: ఇరాక్లో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో బుధవారం ఇద్దరు మృతి చెందారు. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాగ్దాద్కు ఉత్తర దిశగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైజీ పట్టణం సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మొసూల్ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇరాకీ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. -
మాజీ సైనికులకు ‘డబుల్ పెన్షన్’
సీఎం కేసీఆర్ నిర్ణయం • వారి నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు • అమర సైనికుల కుటుంబాలకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు సాక్షి, హైదరాబాద్: మిలటరీలో పని చేసి రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ విధానం అమలు చేయాలని సీఎం కె.చంద్ర శేఖర్రావు నిర్ణయించారు. మిలటరీ, ఉద్యోగు లు, అమర సైనికుల కుటుంబ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, పోలీసు ఉన్నతాధికారులు నవీన్చంద్, ఎంకే సింగ్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షు డు కారం రవీందర్రెడ్డి, ప్రధాన కార్య దర్శి ఎం.రాజేందర్ పాల్గొన్నారు. ‘మిలటరీలో పనిచేసి రిటైరై, మరో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారికి కేవలం ఒకే పెన్షన్ పొందే అవకాశం ఇప్పటివరకు ఉంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనిక ఉద్యోగు లు పనిచేస్తే, మిలటరీ ఇచ్చే పెన్షన్తో సంబం ధం లేకుండా రాష్ట్ర సర్వీసు నిబంధనలను అనుసరించి పెన్షన్ ఇవ్వాలి’ అని సీఎం అన్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల పట్ల యావత్ సమాజం సానుభూతితో ఉండాలని, ఆ కుటుంబ పోషణ బాధ్యత దేశం స్వీకరించాలని అన్నారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర పరిధిలోని అంశాల విష యంలో ప్రభుత్వం ఉదారంగా వ్యహరిస్తుందని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉండి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సైనికుల నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు సైనికులు నిర్మించుకున్న నివాసాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సదరు నివాస గృహం సైనికుడి పేరు మీద ఉన్నా, సైని కుడి భార్య పేరు మీదున్నా, ఎన్ని అంత స్తులున్నా సరే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఇందుకు సంబం ధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అధికారులు ఆ ప్రకారం నడు చుకోవాలని ఆదేశించారు. అమర సైనికుల భార్య (యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు – వార్ విడో)లకు ప్రభుత్వం తరఫున ఇచ్చే పెన్షన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు సీఎం వెల్లడిం చారు. సైనికులు, మాజీ సైనికులు, అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. -
రక్షణ బంధం బలోపేతం
వాషింగ్టన్: భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా.. ఇరు దేశాలు మంగళవారం కీలకమైన రక్షణ వ్యూహరచన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా ఇరు దేశాలు.. ఒకరి మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్లను మరొకరు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇరు దేశాల మిలటరీ సంయుక్తంగా సమర్థవంతమైన ఆపరేషన్లు చేపట్టవచ్చు. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ మధ్య ‘లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (ఎల్ఈఎమ్ఓఏ)పై ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మిలటరీ మధ్య రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన మిత్ర, సన్నిహిత దేశాలతో రక్షణ రంగంలో ఉన్న సాంకేతికత, వ్యాపార సహకార సంబంధాలను ఇకపై భారత్తోనూ కొనసాగించనుందని.. ఒప్పందం తర్వాత సంయుక్త ప్రకటనలో అమెరికా వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్లో అమెరికా ఎయిర్బేస్లను నిర్మించుకోదని.. కేవలం ఇక్కడి సేవలను అమెరికా మిలటరీ వినియోగించుకుంటుందని పరీకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో ఈ ఒప్పందం కీలకమన్నారు. మరో రెండు ఒప్పందాలకు (సీఐఎస్ఎమ్ఓఏ, బీఈఏసీఏ) అమెరికా పట్టుపడుతున్నా సంతకాలు చేసేందుకు భారత్ తొందర పడటం లేదని పరీకర్ తెలిపారు.