new rules
-
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 70 నిమిషాల ఫాస్ట్ట్యాగ్ రూల్స్.. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త రూల్స్ ఎక్కడ వర్తిస్తాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ''కొత్త ఫాస్ట్ట్యాగ్ రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయి''.FASTag అంటే ఏమిటి?దేశంలోని అన్ని రహదారులపై టోల్ కలెక్షన్ పాయింట్ల ద్వారా వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో 2019 డిసెంబర్లో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాగ్ - ఫాస్ట్ట్యాగ్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా టోల్ ప్లాజాల ద్వారా రోడ్డు ప్రయాణ వేగాన్ని వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫాస్ట్ట్యాగ్ వచ్చిన తరువాత వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. -
ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్
-
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేశాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు ఈ రోజు (ఫిబ్రవరి 17) నుంచి అమలులోకి వస్తాయి.తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులలో ఆలస్యం లేదా బ్లాక్లిస్ట్ ఫాస్ట్ట్యాగ్లు కలిగిన వాహనదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు చెల్లించకుండా.. ఉండాలంటే, ఫాస్ట్ట్యాగ్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అవి బ్లాక్లిస్ట్లో ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత సంవత్సరం నవంబర్లో రూ.6,070 కోట్ల ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. డిసెంబర్ నాటికి లావాదేవీలు రూ.6,642 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ఈ ఏడాది మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) ఫాస్ట్ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. FASTag బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి ముఖ్యమైన మార్పులతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.కొత్త మార్పులు టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మాత్రమే కాకుండా.. మోసపూరిత కార్యకలాపాలను తగ్గించడానికి రూపొందించారు. కొత్త నియమాలను పాటించడం వల్ల వాహన వినియోగదారుడు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. టోల్ల ద్వారా సజావుగా ముందుకు సాగిపోవచ్చు.ఫాస్ట్ట్యాగ్ నిబంధనలలో మార్పులు60 నిమిషాల విండో: టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు ఫాస్ట్ట్యాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో ఉంటే.. అది తెలుసుకున్న తరువాత 10 నిమిషాల పాటు బ్లాక్లిస్ట్లోనే కొనసాగితే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి.డబుల్ ఫెనాల్టీ: టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో ఉండి.. లావాదేవీ రిజెక్ట్ అయితే.. మీరు చెల్లించాల్సిన టోల్ ఛార్జ్ కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.గ్రేస్ పీరియడ్: డబుల్ పెనాల్టీని నివారించడానికి వినియోగదారులు ట్యాగ్ చదివిన 10 నిమిషాలలోపు వారి FASTagని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఉదాహరణలకు మీరు టోల్ చేరుకోవడానికి ముందే మీ ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్ అయితే.. దానిని తెలుసుకున్న తరువాత కూడా టోల్ గుండా వెళ్తే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. అప్పుడు డబుల్ టోల్ ఛార్జ్ చెల్లించాలి. అలా కాకుండా.. మీ ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో చేరడానికి 60 నిమిషాల ముందు లేదా స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు (మొత్తం 70 నిమిషాల్లో) మీరు దానిని రీఛార్జ్ చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి. ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.టోల్ ప్లాజాలో ఎక్కువ టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకోవాలంటే.. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు మీ ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ తగినంత ఉండేలా చూసుకోవాలి. బ్లాక్లిస్టింగ్ వంటివి నివారించుకోవడానికి కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్లువాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్లు, లైఫ్ టైం టోల్ పాస్లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు: ఇక కొనుగోలు కష్టమే!వార్షిక, లైఫ్ టైం పాస్లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాయ్ కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు ఫైన్
మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్, మెసేజ్లతో విసుగెత్తిపోతున్నారు. దీనికి చరమగీతం పాడటానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) నియమాల ప్రకారం.. టెల్కోలు స్పామ్ కాల్లపై ఫిర్యాదులను స్వీకరించాలి. ఫిర్యాదులను స్వీకరించిన తరువాత టెలిమార్కెటర్లపై వేగంగా (ఐదు రోజుల్లోపు) చర్య తీసుకోవాలి. ఈ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే టెలికాం ఆపరేటర్లు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.నియమాలను అమలు చేయడంలో విఫలమైతే.. మొదటిసారి రూ. 2 లక్షల జరిమానా, రెండోసారి మళ్ళీ పునరావృతమైతే.. రూ. 5 లక్షలు, ఆపై ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. కొత్త నియమాలు 30 నుంచి 60 రోజుల్లో రెండు దశల్లో అమలు చేయాలని ఆదేశించింది.మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్లను నిజమని నమ్మితే.. ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కాల్స్, మెసేజ్ల పట్ల మొబైల్ యూజర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.స్పామ్ కాల్స్కు చెక్ పెట్టడానికి యాప్భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. దీనిని ఉపయోగించి స్పామ్ కాల్స్, మెసేజస్ నుంచి యూజర్లు బయటపడవచ్చు.'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి➤గూగుల్ ప్లే స్టోర్లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.➤డౌన్లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి.➤సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది.➤యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి.ఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
‘ఉపాధి’ అక్రమాలకు కేంద్రం కళ్లెం
సాక్షి, అమరావతి : ఉపాధి హామీ పథకంలో కూలీల దొంగ మస్తర్ల నమోదుకు కేంద్రం కళ్లెం వేసింది. ఇందుకోసం అక్రమాలకు తావులేని విధంగా కొత్తగా కఠిన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టింది. కూలీలు పనిచేసే సమయంలో ‘ఉపాధి’ సిబ్బంది తీసే ఫొటోలో ఉండే వ్యక్తుల సంఖ్య.. అక్కడ పనికి హాజరైనట్లు సిబ్బంది నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ మస్తరులో పేర్కొనే కూలీలు పనికి హాజరైనట్లు పరిగణించి వారికి వేతనాలు చెల్లిస్తారు. అలా కాకుండా.. ఫొటోలో ఉండే కూలీల సంఖ్య, మస్తరు షీట్లో పేర్కొనే సంఖ్యకు ఏమాత్రం తేడా ఉన్నా అ మస్తరు షీటును నిర్ద్వందంగా తిరస్కరిస్తారు.యాప్లో కొత్త నిబంధనలు..దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజువారీ వేతనాల మొత్తాన్ని కేంద్రమే నేరుగా కూలీలకు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏటా ఆరు నుంచి ఏడు కోట్ల కుటుంబాలు సుమారు రూ.75,000 కోట్ల మేర ప్రయోజనం పొందుతున్నాయి. అలాగే, మన రాష్ట్రంలో 46–47 లక్షల కుటుంబాలు ఏటా రూ.ఆరు వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నాయి. కూలీల హాజరు, వేతనాల బిల్లుల నమోదు తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. ఈ వెబ్ పోర్టల్ పూర్తిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధీనంలో పనిచేస్తుంది. ఇక పథకం అమలులో రాష్ట్రాల్లో రోజువారీ పనికి హాజరవుతున్న కూలీల వివరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ఆన్లైన్ వెబ్పోర్టల్కు అనుబంధంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చాలా ఏళ్లుగా వినియోగిస్తోంది. ఇప్పుడీ యాప్ నిర్వహణలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అందులో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది.కొత్త నిబంధనలు ఇలా..మన ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, జమ్ముకశ్మీర్, త్రిపుర, మేఘాలయ.. మొత్తం పది రాష్ట్రాల్లో జనవరి 27 నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల నమోదులో కేంద్రం కొత్త నిబంధనల అమలును తప్పనిసరి చేసింది. ఈ నూతన ప్రక్రియలో గతంలో ఎప్పుడో తీసిన ఫొటోలను ఆన్లైన్లో నమోదుకు వీల్లేకుండా అదనపు జాగ్రత్తలు చేపట్టింది. అంతేకాక.. పని ప్రదేశంలో కూలీల హాజరును యాప్లోని మస్తరు పేజీలో నమోదు చేసిన తర్వాత ఫొటో తీసేటప్పుడు అక్కడున్న కూలీల్లో కనీసం ఒక్కరైనా కళ్లు ఆర్పినట్లు చేస్తేనే ఆ ఫొటోను ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదయ్యేలా యాప్ను ఆధునీకరించారు. అలాగే, ఫొటోలో ఉండే కూలీల సంఖ్య.. మస్తరులో కూలీల సంఖ్య ఒక్కటిగా ఉండాలి. ఇప్పటివరకూ సంఖ్యపై పెద్దగా పట్టింపులేదు..ఉపాధి పని ఎక్కడ జరిగినా.. ఆ పనికి ఏరోజు ఎంతమంది కూలీలు హాజరయ్యారన్నది క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డు అసిస్టెంట్లు లేదా మేట్లు ఆన్లైన్లో మస్తరు నమోదు చేయాలి. అలాగే, పని ప్రదేశంలో కూలీలు పనిచేస్తున్న ఫొటోను కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఈ మస్తర్ల ఆధారంగానే వారానికి ఒకసారి కూలీలందరికీ వేతనాల చెల్లింపులకు సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ వోచర్లను (ఎఫ్టీఓ) ఆన్లైన్లో తయారుచేస్తారు. ఈ ఎఫ్టీఓల ప్రకారం నేరుగా కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమవుతుంటాయి. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న విధానమే. అయితే, ఇందులో ఫొటోలో కూలీల సంఖ్య ఎంతమంది ఉన్నారు.. అదెప్పటిది అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కనీసం ఒక్క మనిషి కూడా ఫొటోలో లేకపోయినా మస్తర్లలో పేర్కొనే కూలీల సంఖ్య ఆధారంగా బిల్లులు చెల్లించేసేవారు. -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్ కోడ్ వచ్చేస్తుందా?
మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లోనే ప్రభుత్వం ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.రాష్ట్రాలతో చర్చలుఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్పై కోడ్ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.ఏమిటీ లేబర్ కోడ్లు?భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.4 రోజులు పని.. 3 రోజులు సెలవుకొత్త లేబర్ కోడ్లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు. -
సచివాలయం విజిటర్స్కు కొత్త నిబంధనలు.. వాళ్ళకే ఛాన్స్!|
-
ఈపీఎఫ్వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లతో ఈపీఎఫ్వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్వో 3.0 సిస్టమ్లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్లలో వారాంతపు ట్రేడింగ్లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్ కష్టమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్–ఇన్ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్ గదిని బుక్చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త చెక్–ఇన్ నిబంధనలపై ఫీడ్బ్యాక్ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది. -
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ప్రయాణీకుని అవసరాలకు తగినట్లుగా భారతీయ రైల్వే సౌకర్యాలు కల్పిస్తోంది. రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్.. ఇలా రకారకాల బెర్తులు ఉంటాయి. అయితే మిడిల్, అప్పర్ బెర్తులకు పెద్ద వయసువారు ఎక్కలేరు.ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా లోయర్ బెర్త్ల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే కుటుంబంలోని సీనియర్ సిటిజన్ల కోసం టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారికి కచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే రైల్యేవారి కొత్త రూల్స్ పాటించాలి.సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే పలు నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్లను రిజర్వ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లు సులభంగా కేటాయిస్తున్నట్లు ఐఆర్సీటీసీ (IRCTC) పేర్కొంది. కాళ్ల సమస్యలు ఉన్న తన అంకుల్ కోసం రైలు టికెట్ బుక్ చేసి, లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ రైల్వే మాత్రం ఆయనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు.సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేసుకోవాలి? అంటూ కోరాడు. ప్రయాణికుడి ట్వీట్పై రైల్వే స్పందిస్తూ, సాధారణ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే, సీట్లు అందుబాటులో ఉంటేనే లోయర్ సీట్ల కేటాయింపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిజర్వేషన్ సెలక్షన్ బుక్ కింద బుక్ చేస్తేనే లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది.ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యంజనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లోయర్ బెర్తులు కేటాయిస్తామని రైల్వే తెలిపింది. ఈ సీట్ల కేటాయింపు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే పద్ధతిలో ఉంటుంది. జనరల్ కోటా బెర్త్ కేటాయింపులో మానవ ప్రమేయం ఉండదు. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈ (TTE)ని సంప్రదించవచ్చు. -
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్పీరియన్స్ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది. -
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు షురూ
మెరుగైన వినియోగదారు అనుభవంతో లావాదేవీలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టమ్కు కొన్ని భారీ అప్గ్రేడ్లను ప్రవేశపెట్టింది. ఈ మార్పులలో లావాదేవీ పరిమితులను పెంచడం, యూపీఐ సర్కిల్ వంటివి ఉన్నాయి.యూపీఐ123పే పరిమితి పెంపుఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యూపీఐ123పే (UPI123Pay) లావాదేవీ పరిమితులను అధికార యంత్రాంగం పెంచింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు రూ. 10,000 వరకు నగదు పంపవచ్చు. మునుపటి పరిమితి రూ. 5,000గా ఉండేది. ఈ కొత్త మార్పు ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.అయితే ఈ పెరిగిన పరిమితి యూపీఐ123పేకి మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్ఫోన్లలో ప్రసిద్ధ ఫోన్పే (PhonePe), పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay) వంటి యూపీఐ యాప్లలో రూ. 1 లక్ష వరకు రోజువారీ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఎమర్జెన్సీ చెల్లింపుల రోజువారీ పరిమితి రూ. 5 లక్షలకు పెరిగింది.యూపీఐ సర్కిల్పెరిగిన లావాదేవీ పరిమితులతో పాటు యూపీఐ సర్కిల్కు కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భాగస్వామ్య చెల్లింపు సర్కిల్కు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను జోడించడానికి అనుమతించే యూపీఐ సర్కిల్ను ఇప్పుడు ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ఫారమ్లకు జోడించవచ్చు. ఇప్పటి వరకు, ఈ ఫీచర్ భీమ్ (BHIM) యాప్ వినియోగదారులకు మాత్రమే ఉండేది. ఈ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారు ఆమోదంతో చెల్లింపులు చేయగలుగుతారు.గడిచిన ఏడాదిలో (2024) యూపీఐ భారీ వృద్ధిని సాధించింది. ఆర్థిక శాఖ ప్రకారం.. 2024 జనవరి నుండి నవంబర్ వరకు 15,537 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం లావాదేవీ విలువ రూ. 223 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్తగా వచ్చిన ఈ మార్పులు ఇప్పుడు మరింత మంది వినియోగదారులను రోజువారీ లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తాయి. -
జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.అమెజాన్ ప్రైమ్జనవరి 1 నుంచే డివైజ్ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్లను సెట్ చేసుకోవచ్చు.ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్పీరియా జెడ్, ఎక్స్పీరియా టీ, ఎల్జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.కార్ల ధరల పెంపు2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.థాయిలాండ్ ఈ-వీసా1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులుచదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.LPG సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.RBI ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు & హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.యూపీఐ 123 పేరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
కొత్త హ్యాండ్బ్యాగేజ్ రూల్స్: విమానాల్లో..
విమానంలో ప్రయాణించే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి 'బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ' (BCAS), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కొత్త హ్యాండ్బ్యాగేజ్ రూల్స్ పెట్టాయి.బీసీఏఎస్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు ఇప్పుడు కేవలం ఒక హ్యాండ్బ్యాగ్ (Handbag) మాత్రమే తీసుకెళ్లడానికి అర్హులు. ఈ విధానం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ అమలు కానుంది. ఎయిర్పోర్టులలో పెరిగిపోతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల వెంట ఇకపై ఒక హ్యాండ్బ్యాగ్ మాత్రమే ఉండాలి. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ తరగతుల్లో ప్రయాణించే వారు గరిష్టంగా 7 కేజీల బరువున్న హ్యాండ్బ్యాగ్.. ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్లో ప్రయాణించే వారి హ్యాండ్బ్యాగ్ బరువు 10 కేజీల వరకు ఉండొచ్చు. అంతే కంటే ఎక్కువ లగేజ్ ఉంటే.. చెక్ ఇన్ కావాల్సిందే.హ్యాండ్బ్యాగ్ కొలతలుబ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కేవలం హ్యాండ్బ్యాగ్ బరువును మాత్రమే కాకుండా.. కొలతలను కూడా నిర్ణయించింది. కాబట్టి బ్యాగ్ పొడవు 40 సెంమీ, వెడల్పు 20 సెంమీ, ఎత్తు 55 సెంమీ మించకూడదు.కొత్త హ్యాండ్బ్యాగేజ్ రూల్స్ 2024 మే2 నుంచి అమలులోకి వస్తాయి. కాబట్టి అంతకంటే ముందే టికెట్ బుక్ చేసుకున్న వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.కొత్త నిబంధనలకు అనుగుణంగా, ఇండిగో & ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు కూడా తమ బ్యాగేజీ విధానాన్ని సవరించాయి. ఇండిగో ఎయిర్లైన్స్లోని ప్రయాణికులు ఒక క్యాబిన్ బ్యాగ్ని తీసుకురావచ్చు. దాని పొడవు 115 సెం.మీ మించకూడదు.. అది 7 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. అదనంగా.. ప్రయాణీకులు పర్స్, కాంపాక్ట్ ల్యాప్టాప్ బ్యాగ్ లేదా అలాంటి ఏదో ఒక వ్యక్తిగత వస్తువును 3 కిలోల బరువు వరకు తీసుకురావచ్చు. ఇండిగో ప్రయాణికులు కూడా ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక వ్యక్తిగత వస్తువును తీసుకెళ్లడానికి అర్హులు. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్మెంట్ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్మెంట్ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్లాగ్ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?
భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే.. ఓటీటీ ప్లాట్ఫామ్లలో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఒకటి. ఇప్పటి వరకు ఒక అకౌంట్ తీసుకుని చాలామంది దీనికి సంబంధించిన సేవలను వినియోగించుకునే వారు. కానీ 2025 జనవరి నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.జనవరి నుంచే డివైజ్ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్లను సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లు & ధరలుఅమెజాన్ ఇండియా వివిధ అవసరాలు, బడ్జెట్లకు అనుగుణంగా ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో నెలవారీ ప్లాన్ ధర రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, ఏడాది ప్లాన్ రూ. 1499 వద్ద ఉన్నాయి. ఎంచుకునే ప్లాన్ను బట్టి యూజర్లు ప్రయోజనాలను పొందవచ్చు. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లపై బ్యాడ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇది చేదు వార్త. క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు, మర్చెంట్ లావాదేవీలు చేస్తే వాటిపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని ఎస్బీఐ నిలిపివేసింది. ఇది డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ కొత్త నియమం అన్ని ఎస్బీఐ కార్డ్లకు కాదు. రివార్డ్ పాయింట్లు వర్తించని కార్డుల జాబితాను ఎస్బీఐ విడుదల చేసింది.జాబితాలోని కొన్ని కార్డ్లు⇒ ఎస్బీఐ ఆరమ్ కార్డ్⇒ ఎస్బీఐ ఎలైట్ కార్డ్⇒ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్⇒ ఎస్బీఐ కార్డ్ పల్స్⇒ సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్⇒ సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్లాటినం⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రో⇒ ఎస్బీఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్⇒ గోల్డ్ ఎస్బీఐ కార్డ్⇒ గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్⇒ గోల్డ్ డిఫెన్స్ ఎస్బీఐ కార్డ్యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుమురివార్డ్ పాయింట్ల తొలగింపుతో పాటు ఎస్బీఐ యుటిలిటీ చెల్లింపులపై నిబంధనలను కూడా మార్చింది. ఒక బిల్లింగ్ సైకిల్లో మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి మొత్తం యుటిలిటీ చెల్లింపు రూ. 50,000 దాటితే, 1 శాతం రుసుము వర్తిస్తుంది. ఈ నిబంధన కూడా డిసెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది.దేశంలో డెబిట్కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అగ్రస్థానంలో ఉండగా, క్రెడిట్కార్డుల్లో ప్రైవేట్రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రగామిగా ఉంది. హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో కొత్త క్రెడిట్కార్డుల జారీ 45 శాతం తగ్గిందని పరిశోధనా నివేదికలు పేర్కొంటున్నాయి. -
రేపటి నుంచి ఇవన్నీ మారుతాయి: తప్పక తెలుసుకోండి
నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎల్పీజీ ధరలుప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.TRAI గడువుడిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.SBI క్రెడిట్ కార్డ్డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫారమ్లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.ఆధార్ కార్డ్ ఉచిత అప్డేట్ఆధార్ వివరాలకు ఉచిత అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుజూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు. -
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?
ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిటర్లు నిర్దేశిత భాగాలతో ఎక్కువ మంది బహుళ నామినీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకింగ్ నిబంధనలను సవరించే చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిశీలిస్తారని భావిస్తున్నారు.ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్వహించే అనేక మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిపాజిటర్లు ఫిక్స్డ్ డిపాజిట్లను తెరిచేటప్పుడు నామినీలను పేర్కొనలేదు. దీంతో వారి మరణం తరువాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకోవడంలో వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున ఎదురయ్యాయి.ప్రతిపాదిత కొత్త నిబంధనలుఎకనమిక్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుత సింగిల్ నామినీ సిస్టమ్ అమలులో ఉండగా ప్రతిపాదిత సవరణలతో గరిష్టంగా నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది.నామినీల ఏర్పాటు రెండు విధాలుగా ఉండవచ్చు. నామినీలకు భాగాలను పేర్కొంటూ ఒకేసారి అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా వివిధ సందర్భాల్లో నామినీలను జోడించుకునే అవకాశమైనా కల్పించవచ్చు.ఒకేసారి నామినీలను ఏర్పాటుచేసిన సందర్భంలో డిపాజిటర్ మరణించిన తర్వాత ముందుగానే పేర్కొన్న భాగాల ప్రకారం నామినీలందరూ డిపాజిట్ సొమ్మును పొందే వీలుంటుంది. దీని వల్ల క్లయిమ్ సెటిల్మెంట్ సులభతరం కావడం మాత్రమే కాకుండా డిపాజిటర్ సొమ్ము సరైన వారసులకు దక్కే ఆస్కారం ఉంటుంది. -
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
మారిన రూల్స్: ఈ రోజు నుంచే అమల్లోకి..
ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలుప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్డేట్స్యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజుఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.ఆర్బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్వర్క్డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్లో బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు. -
ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్కార్డ్ రూల్స్ మార్పు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్కార్డ్ కొత్త నిబంధనలలో మార్పులను ప్రకటించాయి.మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో మార్పులుఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డ్తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై ఛార్జీలు వర్తించవచ్చు.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్లో మార్పులుఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్లపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. కొన్ని కార్డ్లలో ఈ సదుపాయం పూర్తిగా తొలగించగా కొన్ని కార్డ్లలో ఇది పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. దానిలో పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి. కార్డ్ రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
జీఎస్టీ రిటర్న్లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్
వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్లు, టీసీఎస్ వసూలుకు సంబంధించిన రిటర్న్లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.“ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి" అని జీఎస్టీఎన్ సూచించింది.సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్ల 'బ్యాక్లాగ్'ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
సెబీ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే..
న్యూఢిల్లీ: వచ్చే నెల (నవంబర్) 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఒక పాన్ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది.సంబంధిత అధికారులు, ట్రస్టీలు లేదా సంబంధిత వ్యక్తులు ఆయా లావాదేవీల వివరాలను రెండు పనిదినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్ లేదా అనేక లావాదేవీల ద్వారా రూ. 15 లక్షల విలువ ట్రాన్సాక్షన్ జరిగితే.. మినహాయింపులో ఉన్నవికాకుండా అన్ని పథకాలకూ తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక సర్క్యులర్లో పేర్కొంది.వచ్చే నెల నుంచి ఏఎంసీలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. అక్టోబర్ 31కల్లా కలిగి ఉన్న హోల్డింగ్స్ను నవంబర్ 15కల్లా వెల్లడించవలసి ఉంటుంది. ఆపై ప్రతీ త్రైమాసికం తదుపరి 10 రోజుల్లోగా వీటి వివరాలు దాఖలు పరచాలని సెబీ తెలియజేసింది. -
రూపే క్రెడిట్ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు
రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కార్డ్ హోల్డర్లకు విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్లలో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి.“ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్లో రూపే ప్రత్యేక లాంజ్ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, పానీయాలు, వినోదాలను అందిస్తుంది" అని ఎన్పీసీఐ పేర్కొంది.నూతన మార్గదర్శకాల ప్రకారం, రూపే క్రెడిట్కార్డు యూజర్లకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేసే వ్యయం ఆధారంగా నిర్ణయించారు. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: మామూలు బ్యాంక్ బ్యాలెన్స్పైనా ఎక్కువ వడ్డీ!ఇటీవల పలు విమానాశ్రయ లాంజ్లు రూపే కార్డులను స్వీకరించడం ప్రారంభించాయి. యూపీఐలో క్రెడిట్ కార్డ్లను ప్రారంభించిన తర్వాత రూపే కార్డ్ల జారీ పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3లో రూపే తన మొదటి ప్రత్యేక లాంజ్ను ఏర్పాటు చేసింది. -
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. వివిధ కార్డ్ కేటగిరీల్లో రివార్డ్ పాయింట్లు, లావాదేవీల రుసుములు, ప్రయోజనాల్లో ఈ మార్పులు ఉన్నాయి. కొత్త నవంబర్ 15 నుండి అమలులోకి వస్తాయి.బీమా, యుటిలిటీ బిల్లులు, ఇంధన సర్ఛార్జ్లు, కిరాణా కొనుగోళ్లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్లను ఉపయోగించడం కోసం ఖర్చు పరిమితిని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రెట్టింపు చేసింది. కొత్త మార్పుల గురించి తెలియజేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు మెసేజ్లు పంపింది.మారిన రూల్స్ ఇవే..క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి బ్యాంక్ అనేక నిబంధనలను మార్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించే లావాదేవీల రుసుమును కూడా పెంచింది. కొత్త నిబంధనలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్లన్నింటికీ వర్తిస్తాయి.కొత్త నిబంధనల ప్రకారం, క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్ల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించినట్లయితే, 1 శాతం లావాదేవీ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును నివారించాలనుకుంటే నేరుగా పాఠశాల/కళాశాల వెబ్సైట్లో లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.బ్యాంక్ లావాదేవీల రుసుములను పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా తొలగించింది. క్రెడిట్ కార్డ్ల ద్వారా చేసిన యుటిలిటీ, బీమా చెల్లింపులపై లభించే రివార్డ్లను బ్యాంక్ తగ్గించింది. ప్రీమియం కార్డుదారులకు, రివార్డ్ పాయింట్ల పరిమితి నెలకు రూ. 80,000 కాగా, ఇతర కార్డుదారులకు ఈ పరిమితి రూ.40,000. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. త్వరలో కొత్త మార్పులు
ఎస్బీఐ కార్డ్ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు.యుటిలిటీ బిల్లు చెల్లింపుపై ఛార్జీఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.ఫైనాన్స్ ఛార్జీలోనూ మార్పుశౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి. -
రుణ మార్గదర్శకాలు కఠినతరం
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్ తాజా నిర్ణయం తీసుకుంది. రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్ తెలిపింది. బుల్లెట్ రీపేమెంట్ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది. -
రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
2024 సెప్టెంబర్ నెల ఈ రోజుతో (సోమవారం) ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల (అక్టోబర్) నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..👉ఆధార్ నెంబర్కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు.. పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు.👉సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.👉కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్యూఎఫ్లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..👉ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి. -
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డ్లకు లాయల్టీ ప్రోగ్రామ్ సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ అప్డేట్తో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్ ఈమెయిల్ పంపింది.అక్టోబర్ 1 నుండి స్మార్ట్బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది. అలాగే తనిష్క్ వోచర్లపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను కూడా ఒక క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా , ఇన్ఫినియా మెటల్ కార్డ్లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి: వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే అందిస్తారు. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఈ కార్డు జాయినింగ్/రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు రూ. 12,500. దీనికి పన్నులు అదనం. ఫీజు రియలైజేషన్, కార్డ్ యాక్టివేషన్ తర్వాత వెల్కమ్, రెన్యూవల్ బెనిఫిట కింద 12,500 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి వచ్చే ఏడాది రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు ఉండదు. -
ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యూపీ సర్కార్ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో చెఫ్లు, వెయిటర్లు మాస్క్లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్ స్టాల్ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పష్టం చేశారు. ఫ్రూట్జ్యూస్లో మూత్రంకొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people. Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024 రాష్ట్రంలో కొత్త నిబంధనలుఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.సమావేశం అనంతరం ఆధిత్యనాథ్ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. చదవండి : రేసుగుర్రం నటుడు రవి కిషన్పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు -
సెబీ కొత్త రూల్స్.. డెట్ సెక్యూరిటీల నిబంధనలు మార్పు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.తద్వారా పబ్లిక్కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది. -
పీపీఎఫ్ కొత్త రూల్స్.. రెండో అకౌంట్పై వడ్డీ వస్తుందా?
పోస్టాఫీసుల ద్వారా తెరిచిన పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గత నెలలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.పీపీఎఫ్ ఏంటంటే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక ప్రముఖ ఆర్థిక సాధనం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పొదుపు పథకం.1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దీంట్లో పెట్టిన అసలు, వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం అన్నిటికీ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.మారిన నిబంధనలు ఇవే..మైనర్లకు పీపీఎఫ్ ఖాతా: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మైనర్ పేరు మీద తెరిచి ఉంటే మైనర్కు 18 ఏళ్లు వయస్సు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధిని మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కిస్తారు.ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు: ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెన్సీ బ్యాంక్లో ఖాతాదారు తెరిచిన ప్రాథమిక అకౌంట్పై స్కీమ్ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. అదే ఒకటి ఎక్కువ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాటిని ప్రాథమిక ఖాతాతో ఏకీకృతం చేస్తారు. ఇలా చేశాక మొత్తం వార్షిక పరిమితి మొత్తం డిపాజిట్కు మాత్రం పథకం రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. దీనికి మించి ఇతర ఖాతాల్లో మిగులు నిధులు ఉంటే ఎలాంటి వడ్డీ లభించదు. -
సుకన్య సమృద్ధి యోజన.. కొత్త రూల్స్
నిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు బాలికల పేరున ఈ ఖాతాలను తెరుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు లేదా బంధువులు ఖాతాలు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలను పథకం ప్రాథమిక మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బదిలీ చేయడమో లేదా మూసివేయడమో తప్పనిసరి. తల్లిదండ్రులు లేని బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు సంరక్షకులుగా ఉంటే ఇందుకోసం ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.ఖాతా మూసివేత, బదిలీకి అవసరమైన పత్రాలు» అన్ని వివరాలున్న ప్రాథమిక ఖాతా పాస్బుక్» బాలిక జనన ధ్రువీకరణ పత్రం» బాలికతో సంబంధాన్ని రుజువు చేసే బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర ధ్రువ పత్రాలు» తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.» పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్పత్రాలన్నీ తీసుకుని ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తి ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన బదిలీ ఫారమ్ను పూరించాలి. ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్పై సంతకం చేయాలి.ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు. అవసరమైతే వారు అదనపు సమాచారం కోసం కూడా అడగవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్డేట్ అవుతాయి. -
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు
సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి.రూపే క్రెడిట్ కార్డ్రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలుసెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ.. స్టేట్మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది. -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్డేట్ఆధార్ కార్డ్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్ఫారమ్లలో రూపే క్రెడిట్ కార్డ్లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్ఫారమ్కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
రేపటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవి మార్చుకోవాల్సిందే!
వాహనాల ఫాస్టాగ్కు సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.నూతన నిబంధనలు ఇవే..ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్ ప్రొవైడర్లు అప్లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్ను మొబైల్ నంబర్కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ స్టోర్లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
కాఫీ బ్యాడ్జింగ్ ఎఫెక్ట్.. కొత్త రూల్స్ పెట్టిన కంపెనీ
కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత.. ఇతర కంపెనీల మాదిరిగానే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఉద్యోగులను ఆఫీసుకు రప్పించాలనే ఉద్దేశ్యంతో రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఆఫీసుకు రావడానికి ఉద్యోగులు సుముఖత చూపలేదు.అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను.. సుమారు 30000 మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తూ అంతర్గత పిటిషన్ పై సంతకం చేశారు. దీన్ని అమెజాన్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫీసుకు రావాల్సిందే అంటూ పట్టుబట్టింది. ఆఫీసుకు రాణి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు.అనుకున్న విధంగానే అమెజాన్ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించింది. అయితే ఉద్యోగులు ఆఫీసులో సమయాన్ని వృధా చేయడానికి ఆఫీసుకు వచ్చి, కొంతసేపు సమయాన్ని గడిపి, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అని పిలిచేవారు. ఈ విషయాన్ని కంపెనీ కొంత ఆలస్యంగా గుర్తించింది.ఉద్యోగులు ఉండాల్సిన సమయం ఆఫీసులో వుండకపోవడమే కాకుండా, సమయాన్ని వృధా చేస్తున్నారని కంపెనీ గుర్తించిన వెంటనే నిబంధనల్లో మార్పులు చేసింది. తరచుగా కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ టీమ్ ఉద్యోగులు ఆఫీసులో కనీసం రెండు గంటలు, ఇతర ప్రాజెక్టులలోని ఉద్యోగులు ఆరు గంటలు ఉండాలని వెల్లడించింది. -
కొత్త సిమ్ కార్డ్ రూల్స్!.. ఇలా చేస్తే రూ.2 లక్షలు జరిమానా..
ఒకే పేరుతో అనేక సిమ్ కార్డులను తీసుకోవడం వల్ల ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెలికామ్ చట్టంలో పేర్కొన్నదానికంటే కూడా ఎక్కువ సిమ్ కార్డులను తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవచ్చు. ఒక పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయని ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవాలి అనే అంశం, వారు ఎక్కడ సిమ్ కార్డు తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు. అయితే జమ్మూ & కాశ్మీర్, అస్సాం, ఈశాన్య లైసెన్స్డ్ సర్వీస్ ఏరియాలలో అయితే ఒక వ్యక్తి ఆరు సిమ్ కార్డులను మాత్రమే తీసుకోవాలి. కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను అమలులోకి తెచ్చింది.కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను ఉల్లంఘించి.. నిర్ణయించిన సంఖ్యకంటే ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ తరువాత మళ్ళీ ఈ రూల్ అతిక్రమిస్తే మొదటిసారి నేరానికి రూ. 50000 వరకు జరిమానా విధిస్తారు. ఆ తరువాత మళ్ళీ రిపీట్ అయితే.. రూ. 2 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంది.కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం.. మోసం, చీటింగ్ చేయడానికి సిమ్ కార్డ్లను ఉపయోగిస్తే, అటువంటి వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 50000 జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం 'సంచార్ సాథీ' అనే ప్రత్యేక పోర్టల్ని ప్రవేశపెట్టింది. ఇందులో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్లు రిజిస్టర్ అయ్యాయో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. -
ప్రకటన కోసం వేచి చూడకండి.. 2027 నాటికి బిఎస్7: నితిన్ గడ్కరీ
రోజురోజుకు ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే బిఎస్4 పోయి బిఎస్6 ప్రమాణాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ పరిశ్రమ బిఎస్7 ఉద్గార నిబంధనలకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండకూడదని అన్నారు.బీఎస్7 వాహనాల తయారీకి సంబంధించి సన్నాహాలు తప్పకుండా వేగవంతం చేయాలని గడ్కరీ అన్నారు. యూరోపియన్ మార్కెట్లో యూరో 7 ప్రమాణాలు 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కాబట్టి భారతదేశంలో తయారయ్యే కార్లు కూడా వాటికి ధీటుగా ఉండాలని, దీనికోసం తప్పకుండా బిఎస్7 రూల్స్ పాటించాలని అన్నారు. 2027 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.వాహన తయారీ సంస్థలు తమ వాహనాలలోని ఇంజిన్లను రీట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఇవి యూరో7 ప్రమాణాలను దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ హవా దూసుకెళ్తుంది. బిఎస్7 రూల్స్ అన్నీ కూడా బిఎస్6 కంటే మరింత కఠినంగా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు.బిఎస్7 ప్రమాణాలతో వాహనాలు తయారైన తరువాత వెహికల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంజిన్లను రీచున్ చేసినప్పుడు సంస్థలు కూడా కొంతమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే.. డీజిల్ వాహనాల ధరలు పెరిగే సూచలను ఉన్నాయి. మార్కెట్లో డీజిల్ వాహనాల డిమాండ్ తగ్గిదే.. భవిష్యత్తులో ఈ వాహనాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. -
H-1B visa: సిద్ధమవుతున్న కొత్త రూల్స్.. మనవాళ్లపైనే ప్రభావం!
హెచ్ -1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలను వెల్లడించడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) సన్నద్ధమవుతోంది. ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి.భారతీయ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి పంపడానికి హెచ్ -1బీ వీసాలు ప్రాథమిక మార్గంగా పనిచేస్తాయి. చరిత్రాత్మకంగా హెచ్ -1బీ వీసాలు తీసుకునేవారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటున్నారు.మార్పులేంటి?హెచ్-1బీ వీసాల పొడిగింపునకు 4,000 డాలర్లు, ఎల్-1 వీసాల పొడిగింపునకు 4,500 డాలర్ల రుసుము, 9/11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజులను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు ప్రస్తుతం ప్రారంభ వీసా పిటిషన్లు, కంపెనీల మార్పులకు మాత్రమే వర్తిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 23న యూఎస్సీఐఎస్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత నిబంధన ప్రస్తుతం 60 రోజుల పరిశీలన దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా రాబోయే ఎన్నికల తర్వాత బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనను ఖరారు చేయవచ్చని ఫోర్బ్స్ నివేదికలు సూచిస్తున్నాయి.భారతీయులపైనే అధిక ప్రభావంఈ మార్పులు అనేక మంది భారతీయ హెచ్ -1బీ వీసా హోల్డర్లతోపాటు కొత్తగా దరఖాస్తు చేసేవారిని దెబ్బతీస్తాయి. ఇది అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి ప్రయత్నిస్తున్న భారత్కు చెందిన వేలాది మందిపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేక వృత్తులను పునర్నిర్వచించడం ద్వారా హెచ్-1బీ-అర్హత కలిగిన ఉద్యోగాలపై పరిమితులను ప్రవేశపెట్టడం, ఉద్యోగ పాత్రలు నేరుగా సంబంధిత నిర్దిష్ట ప్రత్యేకతల నేపథ్యంలో ఉద్యోగానికి దగ్గరగా ముడిపడి ఉన్న నిర్దిష్ట డిగ్రీలు అవసరమని నిర్దేశించడం పరిశీలనలో ఉన్న చర్చనీయాంశం.హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపుల కోసం కంపెనీలపై గణనీయమైన ఫీజులు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) యోచిస్తోంది. ముఖ్యంగా ఈ వీసాలపై 50 శాతానికి పైగా శ్రామిక శక్తి ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. వీసా పొడిగింపులపై ఆధారపడే కంపెనీలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను ఎదుర్కోవచ్చు. ఇది విదేశీ ఉద్యోగులకు సంబంధించి వారి నియామక వ్యూహాలను పునఃసమీక్షించడానికి ప్రేరేపిస్తుంది. -
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే వెసులు బాటు కల్పించింది. కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.ఫీజు వివరాలు ఇలా..లెర్నర్ లైసెన్స్: రూ 200లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000శాశ్వత లైసెన్స్: రూ. 200 Most People don't know this fact. Delhi is the only state with 100% Automated Testing Tracks. No one can ask for bribes, there's zero human intervention and will ensure no one cheats.This can be easily done by every state, but they won't get regular commission if they do...!! pic.twitter.com/43lCx9SQg2— Dr Ranjan (@AAPforNewIndia) May 20, 2024ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్లో అర్హులు కావాలి. ఈ టెస్ట్ను ట్రాక్ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్ టెస్టింగ్ ట్రాక్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొనవచ్చు. మారుతీ సుజుకి సంస్థ ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్న్ లాడో సరాయ్లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్లలో 100 శాతం ఆటోమేటిక్ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది. -
డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ తదితర యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) కఠిన నిబంధనలు విధించింది. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఎగ్జామ్ ప్రారంభమైన మొదటి గంట, అదే విధంగా ఎగ్జామ్ ముగియడానికి చివరి అర్ధగంట కనీసం వాష్ రూమ్కు కూడా అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు సరికొత్త టెక్నాలజీ, గాడ్జెట్స్ ఉపయోగించి మాల్ ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకునేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. నిబంధనలు ఏంటంటే..: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నియమ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి. నీట్ పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవాటి దుస్తులు, షూస్ లాంటివాటిని అనుమతించరు. కేవలం స్లిప్పర్స్, శాండిల్స్ లాంటివి మాత్రమే ధరించాలి. పేపర్లు, ప్లాస్టిక్ వాచీలు, పెన్ డ్రైవ్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్, బ్లూటూత్, మొబైల్, స్మార్ట్ వాచ్ లాంటి వాటికి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లాంటి వస్తువులను కూడా అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులకు హాలులోనే బాల్ పాయింట్ పెన్నును అందిస్తారు. రాష్ట్రం నుంచి 80 వేల మంది విద్యార్థులు... తెలంగాణ నుంచి 80 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 70 వేల మంది ఈ పరీక్ష రాయగా, ఈసారి మరో 10 వేల మంది అదనంగా నీట్ పరీక్ష రాస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షకు దేశం నలుమూలల నుంచి 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 499 పట్టణాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందే చేరుకోవాలి: పెన్ను, పేపర్ ద్వారానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు జరగబోయే ఈ పరీక్షకు విద్యార్థులు అన్ని నియమాలు పాటిస్తూ, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని పట్టణాలలో ఒకే పేరు మీద డిగ్రీ, పీజీ లాంటి కాలేజీలు చాలా ఉంటాయి. దీంతో ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1.15 కల్లా పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాలి. 1.30 గంటల తర్వాత విద్యార్థులను హాల్లోకి అనుమతించరు. 1.45కి బుక్ లెట్ పేపర్లు ఇస్తారు. 1.50 నుంచి 2 గంటల వరకు విద్యార్థులు తమ వివరాలను బుక్ లెట్లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడంతో పరీక్ష మొదలవుతుంది. నీట్ ఫలితాలు జూన్ 14న వెలువడనున్నాయి. అదే నెలలో రెండో వారం తర్వాత నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మే నెలలో మారుతున్న రూల్స్
ఏప్రిల్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మాదిరిగానే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.యస్ బ్యాంక్ రూల్స్యస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్ / ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు, మరిన్నింటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుండి అమలులోకి వస్తాయి.డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 ఉండనున్నాయి. చెక్ బుక్ విషయానికి వస్తే 25 లీఫ్స్ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆపైన ఒక్క చెక్ లీఫ్కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రీవ్యాలిడేషన్ను చార్జీలను రూ.100లుగా బ్యాంక్ సవరించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న "హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్డీ" గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. 5 - 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.బ్యాంక్లకు సెలవులువచ్చే మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. -
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
ఎయిర్పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఈ విధానాలు.. కూరలో నీరు ఎక్కువైతే కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా కూర చిక్కబడదు. అలాంటప్పుడు వేయించిన వేరుశనగపప్పులు పొడి కలిపితే చిక్కదనంతోపాటు రుచి కూడా ఇనుమడిస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది. బంగాళాదుంపలు వాడిపోయినట్లయితే.. ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని పోసి ఓ అరగంట ఉంచితే తాజాగా మారుతాయి. అల్లంవెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్లో పెడితే రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లిపొట్టు త్వరగా వదలాలంటే.. రేకలను ఒక పాత్రలో వేసి కొద్దిగా నూనె వేసి అన్నింటికీ పట్టేటట్లు వేళ్లతో రుద్ది ఇరవై నిమిషాల సేపు ఎండలో పెట్టాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్లో పెట్టేముందు తొడిమలు ఒలిచి న్యూస్ పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టాలి. మార్కెట్లో కొన్న పనీర్ని వండే ముందు పది నిమిషాల సేపు గోరువెచ్చటి నీటిలో నానబెడితే, పనీర్ ముక్కలు మృదువుగా మారుతాయి. ఇవి చదవండి: చెట్టినాడు ఘుమఘుమలు! -
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్ట్యాగ్ ఈ-కేవైసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్ట్యాగ్లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ లేదా బ్లాక్లిస్ట్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్లో సావరిన్ గోల్డ్ బాండ్ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది. నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు ధన్ లక్ష్మి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. -
ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు. షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ 5 లేదా 15 సంవత్సరాలు నిండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతని/ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. -
Aadhaar rules: మారిన ఆధార్ రూల్స్.. ఇకపై మరింత సులువుగా..
ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది. యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్ను ఇప్పుడు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్/అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్లను జారీ చేసింది. సమాచారం అప్డేట్ యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషన్, సమాచారం, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్, వివరాల అప్డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్ను అందిస్తే ఆ నంబర్కు ఆధార్ సంబంధిత మెసేజ్లు వెళ్లవు. సవరించిన ఫారాలు దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్లను సవరించింది. ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ ఫారం 2: ఎన్నారైల కోసం ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం ఫారం 7: భారత్లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం ఫారం 8: భారత్లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు కోసం -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
అలా చేస్తే 'డ్రైవింగ్ లైసెన్స్' క్యాన్సిల్.. ఇలాంటి రూల్ మంచిదేనా?
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయడానికి 'ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్' ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మూడు కంటే ఎక్కువ చలాన్స్ పొందిన డ్రైవర్ లేదా రైడర్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఆ తరువాత కూడా ఇదే మళ్ళీ పునరావృతమైతే.. వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా.. ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, వరుసగా మూడు కంటే ఎక్కువ చలాన్లు పొందిన వ్యక్తి లైసెన్స్ను రద్దు చేయవచ్చని నిర్ణయించారు. రెడ్ లైట్ జంపింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి నేరాలకు సంబంధించి పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా.. కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జరిగిన 1000 రోడ్డు ప్రమాదాల్లో సుమారు 400 మంది మరణించినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ వరకు ట్రాఫిన్ నిబంధలనను ఉల్లంఘించిన వాహనదారులు 14 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇందులో 69906 ఓవర్ స్పీడ్, 66867 రెడ్ లైట్ జంపింగ్, 10516 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడినందు చలాన్ జారీ చేశారు. -
నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు ఫైన్
సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించిన డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నట్లు గత ఆగష్టు నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీని ప్రకారమే ఈ రోజు (23 డిసెంబర్ 1) నుంచి ఆ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం, పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్దారు ఒప్పందంపై సంతకం చేయాలి. నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలను అందించాలి. సిమ్ కార్డు అందించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూఆర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి మరో విషయం ఏమిటంటే ఒక సిమ్ డిస్కనెక్ట్ అయిన 3 నెలలు లేదా 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్కు ఆ మొబైల్ నెంబర్ కేటాయించాలి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఐడీ మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులకంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ ఖాతాలకు ఈ నియమం వర్తించదు, కానీ ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చనే విషయం వెల్లడి కాలేదు. -
స్టూడెంట్ వీసాకు అమెరికా కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు
ఢిల్లీ: భారతీయ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్ల క్రింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్పోర్ట్ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్పోర్ట్ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. వారి అపాయింట్మెంట్లు రద్దు అవుతాయి. వీసా రుసుమును కూడా రద్దు చేస్తారు. ఎఫ్, ఎమ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. Attention Students! To prevent fraud and abuse of the appointment system, we are announcing the following policy change which will be implemented beginning November 27, 2023. All F, M, and J student visa applicants must use their own passport information when creating a profile… pic.twitter.com/2JqoEg3DJ1 — U.S. Embassy India (@USAndIndia) November 24, 2023 తప్పుడు పాస్పోర్ట్ నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్పోర్ట్ తీసుకున్నవారు, కొత్తగా పాస్పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్పోర్ట్కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్మెంట్ను అంగీకరిస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు -
కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!!
టెస్లా తన మొదటి సైబర్ట్రక్ను ఈ నెలలో విడుదల చేయడానికి సర్వత్రా సిద్ధమైపోయింది. ఎలాన్ మస్క్ ఈ కొత్త కారుని విడుదల చేయడానికి ముందే కొనుగోలుదారులకు కొన్ని షరతులు పెట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా సైబర్ట్రక్ (Tesla Cybertrack) త్వరలో విడుదలకానుంది. కంపెనీ నియమాల ప్రకారం ఈ కారు కొన్ని కస్టమర్ కొన్న మొదటి సంవత్సరం లోపల విక్రయించినట్లతే.. 50000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలి ఉంటుందని వెల్లడించారు. ఈ రూల్ కేవలం సైబర్ట్రక్ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే.. భవిష్యత్తులో వారికి టెస్లా కంపెనీ తమ వాహనాలను విక్రయించాడని కూడా స్పష్టం చేసింది. కాబట్టి సైబర్ట్రక్ కొనుగోలు చేసిన కస్టమర్ ఒక సంవత్సరం వరకు విక్రయించడానికి అవకాశం లేదని స్పష్టమైంది. ఇదీ చదవండి: టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు! 2019లో మొదటి సారి కనిపించిన సైబర్ట్రక్ దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. నాలుగు సంవత్సరంలో కంపెనీ విడుదల చేసిన మొదటి వాహనం కూడా ఇదే అని పలువురు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర 39900 డాలర్లు ఉండవచ్చు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్ వంటి ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్లైన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లకు నామినీల చేర్పు ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) కొత్త టీసీఎస్ నియమాలు క్రెడిట్ కార్డ్లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 2,000 నోట్ల మార్పిడి రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్కు బదిలీ చేయడానికి ముందు 'విల్ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్ను నిర్వహించాల్సి ఉంటుంది. -
సిమ్ కార్డ్స్ నిబంధనలు మరింత కఠినం - ఉల్లంఘిస్తే..
SIM Cards Rules: భారత ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో చాలా కఠినమైన నిబంధలనలను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుకాణాలకు కఠినమైన నియమాలు.. సిమ్ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా మాత్రమే సిమ్ కార్డులను విక్రయించాయి. దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే వారికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీల బాధ్యత.. ఎయిర్టెల్, జియో వంటి పెద్ద టెలికామ్ కంపెనీలు తప్పకుండా తమ సిమ్ కార్డ్లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలి. అంతే కాకుండా దుకాణాలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలి. పోలీసు తనిఖీలు.. పటిష్టమైన భద్రతలను అమలుపరచడానికి పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అస్సాం, కాశ్మీర్ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్ కార్డ్లను విక్రయించే దుకాణాలపై పోలీసు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కావున విక్రయదారులు ఖచ్చితంగా నియమాలను అనుసరించాలి. ధృవీకరణ.. వినియోగదారులు కొత్త సిమ్ కార్డుని కొనుగోలు చేయాలన్నా.. లేదా పాతది పోయినప్పుడు & పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధృవీకరణ అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సరైన వ్యక్తులకు మాత్రమే సిమ్ కార్డ్ యాక్సెస్ ఉందని నిర్థారిస్తుంది. కొత్త రూల్స్ సిమ్ కార్డులను సురక్షితం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడంలో సహాయపడతాయి. -
ఆ రెండు బ్యాంకులకు కొత్త ఆంక్షలు - కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిందే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత కొంత కాలంలో విధులను సరిగ్గా నిర్వర్తించని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడం లేదా జరిమానాలు విధించడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో భాగంగానే మరో రెండు బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 29న 'అజంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ & పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్'లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. బ్యాంకుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బ్యాంకులు వాటి పనులను అవి స్వేచ్ఛగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని తలపెట్టినప్పుడు తప్పకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బ్యాంకులు తమ వెబ్సైట్లు లేదా ప్రాంగణాల్లో ప్రజల పరిశీలన కోసం RBI ఆదేశాల కాపీని ప్రదర్శించాల్సి ఉంది. ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'? ఈ బ్యాంకులలో అకౌంట్ ఉన్నవారు ఎలాంటి రెన్యూవల్ చేసుకోకూడదు, కొత్త లోన్స్ కూడా మంజూరు చేసే అవకాశం లేదు. అంతే కాకుండా కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ప్రాపర్టీలను విక్రయించడం లేదా ట్రాన్స్ఫర్ వంటివి చేయాలంటే ఆర్బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బ్యాంకుల డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కింద రూ. 5 లక్షల వరకు బీమా క్లెయిమ్ స్వీకరించే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులు పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు ఇలాగే ఉంటాయి, ఆ తరువాత పరిస్థిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
గుర్తుంచుకోండి, సెప్టెంబర్ నెలలో ఈ పనులు పూర్తి చేయండి..లేకపోతే మీకే నష్టం!
ప్రతి నెల మొదటి రోజు ప్రారంభంతో ఆర్ధికపరమైన మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో సైతం ఈ మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రూ.2,000 నోట్ల డిపాజిట్లు.. ఎక్ఛేంజ్, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ నెంబర్ను జత చేయడం, ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు. వీటితో పాటు.. రూ.2,000 ఎక్ఛేంజ్కు చివరి రోజు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 నోట్ల ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, జులై 20న ప్రారంభమైన లోక్సభ సమావేశాల్లో నోట్ల మార్పిడి గడువు పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో నోట్ల ఉపసంహరణకు ఆర్బీఐ 4నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే రూ.2,000 నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆధార్ నంబర్ తప్పని సరి కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన చందాదారులకు నో యువర్ కస్టమర్ (కేవైసి)ని అప్డేట్ చేయడానికి ఆధార్ నంబర్ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల గడువు ఇచ్చింది. పొదుపు దారులు ఆధార్ను నెంబర్ను జత చేయకపోతే అక్టోబర్ 1నుండి పెట్టుబడులను కొనసాగించడం అసాధ్యం ట్రేడింగ్ చేయాలంటే తప్పని సరిగా సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి నెలలో స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ట్రేడింగ్ నిర్వహిస్తున్న ( existing holders) వారు తప్పని సరిగా వారి డిమ్యాట్ అకౌంట్కు ఒక లబ్దిదారుని వివరాల్ని జత చేయాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జూన్ నెలలో ఆధార్లో ఏదైనా మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోనే గడువును పొడిగించింది. ఆ గడువు సెప్టెంబర్ 14 మాత్రమే ఉందని ఆధార్ ట్వీట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు - షరతులు సెప్టెంబరు 1 నుండి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వార్షిక రుసుము రూ. 10,000 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 12,500 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10,000 విలువైన వోచర్ బెన్ఫిట్స్ను నిలిపివేస్తుంది. రూ. 1,00,000 నెలవారీ ఖర్చులపై 25,000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల నెలవారీ ప్రయోజనాల్ని సైతం నిలిపివేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల కోసం (SBI WeCare FD) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం గడువును పొడిగించింది. ఎస్బీఐ వీకేర్ పథకంలో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో పెట్టుబడి దారులైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక ఈ పథకంలో చేరే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ ఐడీబీఐ బ్యాంక్ తన ప్రత్యేక పిక్స్డ్ డిపాజిట్ పథకం అమృత్ మహోత్సవ్ లో చేరే గడువు పొడిగించిన విషయం తెలిసిందే. రెండు టెన్యూర్ల కాలానికి 7.10శాతం నుండి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. గడువు తేదీ సైతం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు పొందుతారు. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
ఉద్యోగులకు గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు!
Child Care Leave Rules For AIS: ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అర్హత కలిగిన సభ్యులు వారి మొత్తం సర్వీస్లో సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఇటీవల సవరించింది. ఈ కొత్త సవరణ ప్రకారం ఇప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరావుల పాటు సెలవులు తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1995 ప్రకారం సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నప్పటికీ వేతనాలు అందుతాయి. అంటే సెలవుల్లో ఉన్నప్పటికీ జీతం లభిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవు తీసుకోవచ్చు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు లోపు విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి వాటి కోసం సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భారత్లో పెరగనున్న నియామకాల జోరు - ఇదిగో సాక్ష్యం! చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఉద్యోగి సెలవులు తీసుకుంటే మొదటి సంవత్సరం (మొదటి 365 రోజులలో) 100 శాతం జీతం లభిస్తుంది, ఆ తరువాత ఏడాదిలో 80 శాతం వేతనం లభిస్తుంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 స్పెల్ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ లభించదు. కానీ సర్వీస్లో ఉన్న ఒంటరి మహిళకు సంవత్సరంలో 6 స్పెల్ల వరకు లీవ్ లభిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే సెలవులు ఇతర లీవ్స్లో కలిపే అవకాశం లేదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది. -
ఖాతాదారులకు అలర్ట్: పోస్టాఫీసుల్లో కొత్త మార్పులు
Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు. నగదు విత్డ్రా సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్బుక్తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు, చెల్లింపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. -
వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా!
ఆధునిక కాలంలో సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది, దీనితో పాటు బల్క్ కనెక్షన్లను కూడా నిలిపివేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రూ. 10 లక్షల జరిమానా.. ఇప్పుడు డీలర్లందరికి పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్ర టెలికాం మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్ను ప్రారంభించినప్పటి నుంచి సుమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవ్ వెల్లడించారు. మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67,000 మంది డీలర్లను ప్రభుత్వం బ్లాక్లిస్ట్ చేసిందని.. 2023 మే నుంచి 300 మంది సిమ్ కార్డ్ డీలర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. మేము మోసపూరిత కాల్లను ఆపడంలో సహాయపడే సరైన బిజినెస్ కనెక్షన్ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అసాధారణ విజయాలు.. రోజుకు రూ. 72 లక్షలు జీతం.. అంతేకాదు.. నివేదికల ప్రకారం.. 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వారికి పోలీస్ వెరిఫికేషన్ కోసం తగిన సమయం ఇస్తామని వైష్ణవ్ చెప్పారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మోసపూరిత కాల్స్ పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.