plastic
-
‘ఘోస్ట్ ఫిషింగ్’పై యుద్ధం!
సాక్షి, విశాఖపట్నం: ఘోస్ట్ ఫిషింగ్... ఇది మత్స్య సంపదను హరిస్తోంది. సముద్ర వాతావరణానికి విఘాతం కలిగిస్తోంది. పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తోంది. ఇంతలా హాని చేస్తున్న ఈ ఘోస్ట్ ఫిషింగ్ అంటే ఏమిటి..? దీనికి కారణమెవరు అని ఆలోచిస్తే.. గంగమ్మ ఒడిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారులవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. అందుకే.. వారిలో చైతన్యం తీసుకొచ్చి మత్స్య సంపదకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకునేందుకు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) నడుం బిగించింది. ఘోస్ట్ ఫిషింగ్ అంటే..?వేటకు వెళ్లిన మత్స్యకారులు పాడైపోయిన వలలను ఒడ్డుకు తీసుకురాకుండా సముద్రంలోనే పడేస్తుంటారు. వలలను ప్లాస్టిక్, నైలాన్తో తయారు చేయడం వల్ల వందల సంవత్సరాల వరకు మట్టిలో కలిసిపోవు. ఆ వలల్లో చేపలు, తాబేళ్లు, సముద్ర జీవులు చిక్కుకుంటాయి. అవి బయటికి రాలేక చివరికి మృత్యువాత పడుతున్నాయి. దీన్నే ఘోస్ట్ ఫిషింగ్ అని అంటారు.ఎఫ్ఎస్ఐ ఏం చేసింది.?విశాఖ కేంద్రంగా ఎఫ్ఎస్ఐ సముద్రంలో మత్స్య సంపదపై నిరంతరం పరిశోధనలు చేస్తుంది. తమ సర్వే వెసల్స్ మత్స్యషికారిపై పరిశోధనలకు వెళ్లినప్పుడు వలల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు... ముఖ్యంగా ఫిషింగ్ నెట్స్ పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. ఈ విషమ పరిస్థితిపై పరిశోధనలు ప్రారంభించింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో వ్యర్థాల గుర్తింపు, వెలికితీత, మత్స్యరాశులపై వాటి ప్రభావం తదితర అంశాలపై 2021 ఏప్రిల్ నుంచి సర్వే ప్రారంభించింది. 2024 చివరి వరకు కొనసాగిన ఈ సర్వేలో ఏకంగా 5,562 కేజీల వ్యర్థాలు దొరికాయి. ఇది చాలా ప్రమాదకరమని గ్రహించి.. అవి దొరికిన ప్రాంతాల్ని హాట్స్పాట్లుగా గుర్తించింది. అప్పటి నుంచి గ్లో లిట్టర్ పార్టనర్షిప్(జీఎల్పీ) కార్యక్రమానికి ఎఫ్ఎస్ఐ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సర్వే నౌకలు మెరైన్ ప్లాస్టిక్ లిట్టర్/అబాండన్డ్ లాస్ట్ లేదా డిస్కార్టెడ్ ఫిషింగ్ గేర్లు (ఏఎల్డీఎఫ్జీ) పేరుతో అధ్యయనం నిర్వహించాయి. మరో మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.మత్స్యకారులకు అవగాహన సర్వేలో వెల్లడైన అంశాలను మత్స్యకారులు, బోటు ఆపరేటర్లకు తెలియజేసి వ్యర్థాలను సముద్ర జలాల్లో పడేయవద్దంటూ ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి, శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ కలిసి హాట్స్పాట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేసినప్పుడు దొరికిన వలల వ్యర్థాలు చేస్తున్న కీడుకు సంబంధించిన వీడియోలను మత్స్యకారులకు చూపిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. రీసైక్లింగ్ యూనిట్లకు ప్రణాళికలు ఎఫ్ఎస్ఐ చేపట్టిన జీఎల్పీ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. సముద్ర అధ్యయనం, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ప్రశంసలు లభించడమేకాకుండా.. ఈ ప్రాజెక్టుని సీరియస్గా అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వలలో పడిన ప్లాస్టిక్ వ్యర్థాల్ని మత్స్యకారులు బయటకు తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించడమే కాకుండా.. ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల వద్ద రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.ఘోస్ట్ ఫిషింగ్ తగ్గితేనే మత్స్య సంపదకు మనుగడచేపల వేట సమయంలో తెగిన వలలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర సామగ్రిని సముద్రంలో మత్స్యకారులు పడేస్తున్నారు. వాటిల్లో చిక్కుకుని చిరు చేపలు, పీతలు, రొయ్యలు, తాబేళ్లు వంటివి చనిపోతున్నాయి. మా అంచనా ప్రకారం సముద్ర జలాల్లో వ్యర్థాల కారణంగా 3 నుంచి 5 శాతం మేర మత్స్య దిగుబడులు తగ్గే ప్రమాదముంది. ఉపరితలంపై తేలియాడే పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయిన వలల ముక్కలు తదితర అధిక సాంద్రత కలిగిన వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అందుకే జీఎల్పీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. మేం చేపట్టిన అవగాహన సదస్సులతో మత్స్యకారుల్లో క్రమంగా చైతన్యం వస్తోంది. వారు తీసుకొస్తున్న వ్యర్థాలతో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి మత్స్యకార మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – భామిరెడ్డి, ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ డైరెక్టర్ -
ప్లాస్టిక్ కవర్పై ఇడ్లీ చాలా డెడ్లీ
రంగు కలిపిన బొంబై మిఠాయి తింటే ఉదరకోశ రోగాలు, క్యాన్సర్ రావచ్చునని గతంలో సర్కారు హెచ్చరించింది. అదే రంగు కలిపిన చికెన్ పకోడా, గోబీ ఆరగిస్తే కూడా జబ్బులు తప్పవని హెచ్చరించి రంగులను నిషేధించింది. ఇప్పుడు ఇడ్లీలకు అలర్ట్ జారీ అయ్యింది. ప్లాస్టిక్ కవర్లు వేసి వండిన ఇడ్లీలను తినరాదని, క్యాన్సర్ ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాల్సిందే.బనశంకరి : ప్రతి ఇంటా, హోటల్లో ఇడ్లీలు చేస్తారు, కడుపారా ఆరగించి ఆకలి తీర్చుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇడ్లీ తగిన ఆహారం. కానీ వండే సమయంలో తప్పుడు విధానాల వల్ల క్యాన్సర్కు గురి కావచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ఇదే విషయం చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు.. ప్రమాదం ఇడ్లీలను వండడానికి కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ పేపర్లు ఉపయోగిస్తారు, ప్లాస్టిక్లో క్యాన్సర్ కారకాలు చేరడం వల్ల ఆ ఇడ్లీలను తినడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ నివేదికలు ప్రభుత్వం చేతికి రెండురోజుల్లో అందుతాయని మంత్రి దినేశ్ చెప్పారు. ఇటీవలి కాలంలో ఇడ్లీల తయారీలో, వడ్డించడంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికమైంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్స్లో, క్యాంటీన్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ కవర్లను వాడరాదని నిషేధం విధించామన్నారు. మరో రెండురోజుల్లో అధికారిక ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు, పెద్ద పెద్ద హోటల్స్లో ఇడ్లీ తయారీలో, పార్శిల్ కట్టడంలో ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. దీనిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. అందులోనే ఇడ్లీ తయారీదారులకు సలహాలు, సూచనలు ఉంటాయన్నారు. నమూనాల పరీక్షల్లో వెల్లడిరాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది బెంగళూరుతో పాటు పలు జిల్లాల నుంచి ఇడ్లీల్లో ప్లాస్టిక్ కవర్లు వాడే చోట్ల నుంచి 500 శాంపిల్స్ను పరిశీలించారు. ఇందులో 35 నివేదికలు సాధారణం కాగా పలు నివేదికల్లో క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయి. ఇడ్లీలు సులభంగా ఊడి రావడానికి ప్లాస్టిక్ పేపర్ పరిచి దానిపై ఇడ్లీ పిండి వేసి వేడి చేస్తారు. నిజానికి అక్కడ తెల్ల నూలు బట్టను వాడాలి. ప్లాస్టిక్ కవర్ అధిక వేడిమి వల్ల ప్రమాదకర రసాయాలను విడుదల చేస్తుంది. అవి కాస్తా ఇడ్లీల్లోకి, ఆపై శరీరంలోకి చేరుతాయి. దీంతో క్యాన్సర్, గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలు తలెత్తుతాయి. -
ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ కోసం.. తొలి జాయింట్ వెంచర్
ముంబై: రీ సస్టెయినబిలిటీ కంపెనీ (ReSL)లో భాగమైన రీ సస్టెయినబిలిటీ అండ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Re Sustainability and Recycling Private Limited (ReSRL)) మరియు స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో పేరొందిన ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (AIL) అనుబంధ సంస్థ ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ (Aarti Circularity Limited (ACL)) కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపాయి. ప్లాస్టిక్ వనరుల రికవరీ మరియు పర్యావరణహిత వనరుల నిర్వహణ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా భారతదేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీలను (PMRF) అభివృద్ధి చేసే క్రమంలో భారత్లో ఈ తరహాలో ఇదే తొలి జాయింట్ వెంచర్గా నిలవనుంది.ప్లాస్టిక్స్ సహా వివిధ వ్యర్ధాలను వేరు చేసి, వనరులను వెలికి తీసి, రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి సరుకుగా, ఇంధనాలుగా లేదా రీసైకిల్డ్ పాలిమర్ ఫీడ్స్టాక్గా ఉపయోగపడే అడ్వాన్స్డ్ సర్క్యులర్ మెటీరియల్స్ (ఏసీఎం) ఉత్పత్తి చేయడంపై పీఎంఆర్ఎఫ్లు ప్రధానంగా దృష్టి పెడతాయి. 2030 నాటికి రోజుకు కనీసం సుమారు 500 టన్నుల వనరుల రికవరీ సామర్థ్యాన్ని సాధించాలని భాగస్వామ్యం నిర్దేశించుకుంది. అలాగే మెటీరియల్, పవర్ సర్క్యులారిటీని గరిష్ట స్థాయిలో మెరుగుపర్చే దిశగా, ReSL కార్యకలాపాల ద్వారా కూడా ఉత్పత్తయ్యే వాటితో సహా వివిధ ఫీడ్స్టాక్స్ను పరిశీలించాలని కూడా నిర్దేశించుకుంది.ఈ భాగస్వామ్యం కింద తొలి ప్లాస్టిక్స్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ప్లాంటు తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. ప్రాంతీయంగా అధునాతన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది. పర్యావరణహితమైన విధంగా వ్యర్ధాల నిర్వహణను చేపట్టే దిశగా సాగుతున్న భారత ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవగలదు. సుస్థిరత మరియు సాంకేతిక ఆవిష్కరణల విషయంలో ఇరు సంస్థలకు గల నిబద్ధతకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశపు రీసైక్లింగ్ మరియు వ్యర్ధాల నిర్వహణ రంగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా, అధునాతన పీఎంఆర్ఎఫ్లను రూపొందించి, నిర్వహించేందుకు తగిన అగ్రగామి సాంకేతిక భాగస్వాములను జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచుకుంటుంది.“పర్యావరణహితంగా వనరులను నిర్వహించే దిశగా సాగుతున్న మా ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. వ్యర్ధాల నిర్వహణ మరియు వనరుల రికవరీకి సంబంధించి మాకున్న అపార అనుభవం మరియు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క సుసంపన్నమైన వారసత్వం మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఆ సంస్థకున్న 40 ఏళ్ల అనుభవం ఈ భాగస్వామ్య ఒప్పందానికి దన్నుగా నిలవనున్నాయి. క్రిటికల్ వ్యర్ధాల సవాళ్లను పరిష్కరించే అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాకు తోడ్పడనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలు మరియు పర్యావరణహిత విధానాలను ఉపయోగించడం ద్వారా వనరులను సమర్ధంగా నిర్వహించుకోవడం మరియు సర్క్యులారిటీ తోడ్పాటుతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను సృష్టించాలనేది మా లక్ష్యం. భారత్లోను, ఇతర ప్రాంతాల్లోనూ సుస్థిర అభివృద్ధికి సంబంధించి మేము సమష్టిగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాం” అని రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో Mr. మసూద్ మాలిక్ తెలిపారు.“ACL, ReSRL మధ్య భాగస్వామ్యమనేది, రెండు దిగ్గజ సంస్థల శక్తి, సామర్థ్యాల మేలు కలయిక ద్వారా, సుస్థిరతకు నవకల్పనలను మేళవించి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడగలదు. ఈ జేవీ ద్వారా భారతదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనేది మా లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం, సహజ వనరుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమనే ఏసీఎల్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది” అని ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మిరిక్ గోగ్రి (Mirik Gogri) తెలిపారు. -
టీ బ్యాగ్లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
మోడ్రన్ లైఫ్ ఎకో స్టయిల్: వాడి పారేసిన వాటితోనే అద్భుతాలు..!
ఇది ఈశాన్య రాష్ట్రాల మహిళల విజయం. వారు ప్లాస్టిక్, ఇతర ఫైబర్లకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ లాంగ్పై పోటరీని క్యాండిల్ తయారీకి మలుచుకున్నారు. పంటను నిల్వచేయడానికి కరెంటుతో పని లేని ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నారు. తమ దగ్గర దొరికే వస్తువులను అది కూడా పర్యావరణహితమైన వస్తువులు, వాడి పారేసిన తర్వాత త్వరగా మట్టిలో కలిసిపోయే వస్తువులతో మోడరన్ లైఫ్స్టయిల్ని ఎకో ఫ్రెండ్లీగా మారుస్తున్నారు. నాటి కుండల్లో నేటి క్యాండిల్..మణిపూర్ రీజియన్లో విస్తరించిన హస్తకళలలో లాంగ్పై ఒకటి. నల్లటి మట్టితో కుండల తయారీ అన్నమాట. రిన్ఛోన్ అనే మహిళ లాంగ్పై కళను మోడరన్ లైఫ్స్టయిల్కి అనుగుణంగా మలుచుకుంది. పరిమళాలను వెదజల్లే సోయా వ్యాక్స్ క్యాండిల్ జార్లు తయారు చేసింది. పారాఫిన్ వ్యాక్స్కు బదులుగా సోయా వ్యాక్స్ను ఉపయోగిస్తోందామె. సువాసన కోసం పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాని వస్తువులనే వాడుతోంది. ఆ ఉత్పత్తులన్నీ పర్యావరణహితమైనవే కావడంతో వీటికి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ప్రయోగాలను చేస్తోన్న రిన్ఛోన్ వెంచర్ ‘అక్టోబర్ పంప్కిన్’ను రాజస్థాన్లోని బిట్స్ పిలానీ విద్యాసంస్థ ‘ఉమెన్ప్రెన్యూర్ ఫర్ భారత్ 2.0 పప్రోగ్రామ్’ కింద 15 లక్షల ప్రోత్సాహకానికి ఎంపిక చేసింది. తాంగ్ఖుల్ ఆదివాసీ తెగకు చెందిన రిన్ఛోన్ తన కుటుంబంలో మాత్రమే కాదు, ఆ తెగలోని తొలితరం ఎంటర్ప్రెన్యూర్.మేఘాలయకు చెందిన వెస్ట్ ఖాసీ హిల్స్లో నివసించే బినోలిన్ సైయిమ్లే జీరో ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్ తయారీలో విజయవంతమైంది. కాల్చిన ఇటుకలు, నదిలో దొరికే ఇసుక, వెదురు, సీజీఐ షీట్స్, ఇనుపమేకులు, సిమెంట్, గులకరాళ్లు ఉపయోగించి రైతులకు ఉపయోగపడే స్టోరేజ్ కంటెయినర్స్ తయారు చేసింది. ఇక్కడ రైతుల ప్రధానపంట కూరగాయల సాగు. పంటను కోసి మార్కెట్కు తరలించే లోపు పాడయ్యేవి. ఈ స్టోరేజ్ కంటెయినర్ల వల్ల రైతులు పండించిన పంట మార్కెట్కు చేరేలోపు పాడయ్యే దుస్థితి దూరమైంది. అర్థవంతమైన వ్యర్థంమరో మహిళ నాగాలాండ్కు చెందిన నెంగ్నెథెమ్ హెంగ్నా. ఆమె అరటి నారతో ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేసి పాలిమర్ ఫైబర్కు ప్రత్యామ్నాయాన్ని చూపించింది. టేబుల్ మ్యాట్, కోస్టర్, పండ్లు, కూరగాయలు నిల్వ చేసే బుట్టలు, క్యారీ బ్యాగ్ల వరకు పదమూడేళ్లుగా ఆమె తయారు చేస్తున్న అరటినార వస్తువులు దేశమంతటా విస్తరించాయి. ఇక అస్సామీయులు పడవ తయారీలో ప్రయోగం చేశారు. నాటుపడవలను చెక్కతో తయారు చేస్తారు. మన్నిక దృష్ట్యా వాటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్ బోట్స్ వాడుకలోకి వచ్చాయి. వీటికి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని వెదురుతో కనుక్కున్నారు. ఈ ఇన్నోవేటివ్ బోట్స్ తయారీలో 85 శాతం వెదురు, పది శాతం పాలిమర్, ఐదు శాతం ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. ఈ పడవలు పదిహేనేళ్లపాటు మన్నుతాయి. పాడైన తర్వాత ఈ విడిభాగాలు భూమిలో కలిసిపోతాయి. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?
ఇంతవరకూ ప్లాస్టిక్ బౌల్స్లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్ను ‘ఒబిసోజెన్స్’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు... షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్లాంటి ప్లాస్టిక్ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ అని వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్ సెల్స్ సంఖ్యను పెంచుతాయని తేలింది. దాంతో దేహం బరువు అమాంతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది. ఇప్పుడు అవే ప్లాస్టిక్ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..! ) -
ప్లాస్టిక్కు చెక్.. వచ్చేసింది గ్రీన్వర్క్స్ బయో పాలిమర్
హబ్సిగూడ(హైదరాబాద్)లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో.. 'గ్రీన్వర్క్స్ బయో', సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) సహకారంతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులైన.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు (SUP) ప్రత్యామ్నాయాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మొదలైనవారు పాల్గొన్నారు.ప్లాస్టిక్ కాలుష్యాన్ని స్థిరమైన పరిష్కారాలతో ఎదుర్కోవడమే లక్ష్యంగా గ్రీన్వర్క్స్ బయో పాలిమర్లను ప్రవేశపెట్టింది. ఇవి కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్. కాబట్టి భూమిలో తొందరగా కలిసిపోతాయి. సీఎస్ఐఆర్-ఐఐసీటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తులు స్టార్చ్.. వ్యవసాయ వ్యర్థాల వంటి పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేశారు. ఇవి నేషనల్ కంపోజిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఈ కార్యక్రమంలో మంత్రి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ.. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో వినూత్నమైన సైన్స్ ఆధారిత పరిష్కారాల ప్రాముఖ్యతను వెల్లడించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీతో గ్రీన్వర్క్స్ బయో సహకారం సాంకేతికతతో స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుంది. సాంప్రదాయ ప్లాస్టిక్లకు వినూత్నమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను పరిచయం చేయడమే కాకుండా.. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు.ముఖ్య అతిథి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హరిత ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్ర నిబద్ధతను ఎత్తిచూపారు. తెలంగాణ స్వచ్ఛమైన.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలను నిర్వహించడం, దానికి మేము మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. -
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్ప్రదేశ్లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
పరదా చాటున అలర్జీ మాటేస్తది!
తలుపులకూ, కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెయిన్స్) అందాన్నీ, ప్రైవసీని ఇస్తాయి. కొన్ని స్టార్ హోటల్స్లో మంచి రాజసపు లుక్ కోసం వెరైటీగా కర్టెన్లు అమరుస్తారు. ఇటీవల ఇండ్లలోనూ ఈ తరహాలోనే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చుకోవడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి పై సజ్జబల్లల మీద / అటక మీద పాత సామాన్ల వంటివి సర్దిపెట్టినప్పుడు అవి బయటకు కనపడకుండా పరదాలు అడ్డుగా అమర్చి ఉంచడమూ మామూలే. అయితే వాటిని నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల వాటి వెనక అలర్జీకి కారణమయ్యే డస్ట్మైట్స్ చేరి అలర్జీ కలిగించవచ్చు. అది ఎన్ని రకాలుగా కలుగుతోందో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.సాధారణంగా కర్టెన్లతో వచ్చే అలర్జీలు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల... అత్యంత చురుకుగా పనిచేసే ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల అలర్జీలు వస్తాయి. అది ఈ కింది విధాలుగా జరుగుతుంది. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో చేరే అలర్జెన్లూ, డస్ట్మైట్స్ : కరై్టన్లు ఇళ్లలోకి దుమ్మూ, ధూళి రాకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలో దుమ్ము ధూళిలో ఉండే డస్ట్మైట్స్... తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల్లోకీ చేరతాయి. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ఒక రకమైన ప్రోటీన్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి... అది వారిలో అలర్జీ కలిగిస్తుంది. కొన్నిసార్లు అలర్జీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. కేవలం డస్ట్మైట్స్ మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో దాగి ఉంటాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, భయం కలిగించేలా కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. కొందరిలో ఈ డస్ట్మైట్స్, అలర్జెన్లు తీవ్రమైన ఆస్తమాను కలిగించి, ఊపిరాడకుండా చేస్తూ తీవ్రంగా బాధిస్తాయి. మౌల్డ్స్ లాంటి ఫంగస్ చేరడం : కర్టెన్లలో మౌల్డ్స్ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి ఒకరకంగా బూజు లాంటివి. గాలిలో తేమ ఉండేచోట్ల, వెలుతురు తక్కువగా ప్రసరించే చోట్లలో ఈ మౌల్డ్స్, ఇతర ఫంగస్లు పెరుగుతాయి. అన్ని చోట్లలాగే కర్టెన్లలో చేరినప్పుడు అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. సూక్ష్మజీవుల ఆవాసంగా : అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కర్టెన్లలో చేరి అవి కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ∙దుమ్ము కణాలు : అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో : మొదట్లో ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్లాస్టిక్తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్ప్రూఫ్ మెటీరియల్తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ప్లాస్టిక్కర్టెన్లు ఫ్యాబ్రిక్లతో చేసిన పరదాల్లో అటు ఇటు ఒంగకుండా (ఫ్లెక్సిబుల్గా లేకుండా) ఉంటాయి. అందుకే అవి బట్టలాగే ఎటు పడితే అటు కాస్తంత వంగేందుకు వీలుగా వాటిల్లో ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇదే పదార్థాన్ని వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.ప్లాస్టిక్కరై్టన్లతో ఎంతో హాని... ఈ ప్లాస్టిక్వంటి కర్టెన్లలోని హానికర / విష పదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన కూడా ప్రతికూలంగా పనిచేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థనూ దెబ్బతీస్తాయి. ఇక గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్వంటి పదార్థాలతో తయారైన కర్టెన్ల కారణంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలో ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) వచ్చే అవకాశాలు ఎక్కువని ‘మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మోతాదుల్లో స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స అందిస్తారు. ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే కర్టెన్స్ను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్లు అవుతుంది.అలర్జీల నివారణకు...∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు వస్త్రంతోతయారైన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెన్స్) వాడటమే మంచిది షవర్ కర్టెన్లు కోసం ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిది ∙అయితే... బాత్రూమ్ల్లో వాడటం వల్ల అవి తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే హానికరం కాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మంచిది ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్మెటీరియల్తో చేసినవైనా బాగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్తో తయారైన కర్టెన్స్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్మెటీరియల్తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం చాలా అవసరం. ఇలా ΄్లాస్టిక్తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపో అలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. -
ప్లాస్టిక్ బౌల్స్లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
26 ఏళ్లుగా ముక్కులోనే ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ముక్క!..కట్చేస్తే ..!
చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్కి. లెగో బ్రాండ్కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా. View this post on Instagram A post shared by 🇵🇭 Ben Havoc (@bigoompalumpia) (చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
రీ సస్టేనబిలిటీ రీసైకిల్డ్ పాలిమర్స్
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న రీ సస్టేనబిలిటీ అధిక నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిమర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మ్యారికో వ్యవస్థాపక కుటుంబమైన హర్ష మారివాలా ఫ్యామిలీ యాజమాన్య మూలధనాన్ని నిర్వహిస్తున్న షార్ప్ వెంచర్స్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.ఈ సంయుక్త భాగస్వామ్యంలో రీ సస్టేనబిలిటీకి 85 శాతం, షార్ప్ వెంచర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు హైదరాబాద్తోపాటు చత్తీస్గఢ్లోని రాయ్పూర్ వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని రీ సస్టేనబిలిటీ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు. మ్యారికో ఫౌండర్, చైర్మన్ హర్ష మారివాలాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది రెండు ప్లాంట్లు కార్యరూపంలోకి వస్తాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటా 32,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాం’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దాదాపు అన్ని దేశాలకు సవాలుగా మారుతోంది. ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలతో పాటు ఇతర చాలా రంగాల్లో అనివార్యంగా ఇంకా ప్లాస్టిక్ను వాడుతున్నారు. ఆయా రంగాల్లో దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవి పూర్తయి ప్రాచుర్యం పొంది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటివరకు విడుదలయ్యే ప్లాస్టిక్తో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. దాని నిర్వహణ కోసం కంపెనీలు కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. అందులో భాగంగానే రీ సస్టేనబిలిటీ, షార్ప్ వెంచర్స్ కంపెనీలు సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్లాస్టిక్ను రిసైకిల్ చేసి పాలిమర్స్ను తయారు చేసేందుకు సిద్ధం అయ్యాయి.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టతఇప్పటికే ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ప్రతి ఏడాది 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2040కల్లా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో వెలువడే ఉద్గారాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పాదనలో భారత్ నంబర్ వన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. -
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్కు సంబంధించిన సోల్ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్బాల్ స్నీకర్ ఫ్యాషన్ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్లు, దువ్వెనలు, పెన్స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్ఫామ్లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్లాస్టిక్ఫ్రీ జోన్’గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్లో ప్లాస్టిక్ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
కిచెన్లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్కి చెక్!
మైక్రోప్లాస్టిక్లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్కు చెక్పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్ల కణాల డోస్ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్... ‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్. బేబీ–వియరింగ్, బ్రేస్ట్ఫీడింగ్లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది. ‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న. పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది. ‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
సూపర్ మార్కెట్ల తిండి...
ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్ఫుడ్ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది... ► ఫాస్ట్ఫుడ్స్తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్జెర్ కంపెనీ తయారు చేసిన రాస్బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది. ► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది. ► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ► ఆహారంలో ప్లాస్టిక్ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్గఢ్లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
మైక్రోప్లాస్టిక్పై ప్రత్యక్ష పరిశోధన
ఏయూ క్యాంపస్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. విస్తృత పరిశోధనకు శిక్షణ ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్ గుర్తింపు నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు, మైక్రోప్లాస్టిక్ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోంది. మూడు అంశాలపై శిక్షణ సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్ ట్రాన్స్ఫామ్ ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్టీఐఆర్) సహాయంతో మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్టీఐఆర్లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్ను గుర్తించారు. మంచి ఆలోచన ఎంఎల్ఆర్ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం. – డాక్టర్ వి.హేమ శైలజ, ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం విలువైన సమాచారం మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – డాక్టర్ జి.శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, జీవీపీ కళాశాల కమిషన్ సహకారం మరువలేం యూరోపియన్ కమిషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్కి ప్లాస్టిక్ కారణమా?
ప్లాస్టిక్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయని విన్నాం. కానీ దీని వల్లే పుట్టే పిల్లలకు ఇంత ప్రమాదం అని ఊహించి కూడా ఉండం. మన కంటి పాపల్లాంటి చిన్నారుల జీవితాలను ప్లాస్టిక్ పెనుభూతం చిదిమేసి మన జీవితాలను కల్లోలంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో తెలియకుండానే ఒక భాగమైంది. మన నిర్లక్ష్యమో మరే ఏదైనా కారణమో గానీ జరగకూడని నష్టమే వాటిల్లుతోందని తాజా పరిశోధనల్లోషాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)కి ప్లాస్టిక్ కారకాలే కారణమని యూఎస్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో ఆటిజం, పిల్లల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది కూడా. సమాజంలో ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కారణంగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలిసిందే. తాజా అధ్యయనంలో "బిస్ ఫినాల్ ఏ(బీపీఏ)" అనే ప్లాస్టిక కారణంగానే పిల్లలు ఇలాంటి రుగ్మతలు బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినియోగిస్తారు. యూఎస్లోని రోవాన్ విశ్వవిద్యాలయం శాస్రవేత్తలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సముహంపై గ్లుకురోనిడేషన్ అనే ప్రకియను నిర్వహించారు. అంటే..మూత్రం ద్వారా శరీరంలో చెడు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఈ ప్రకియలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)తో బాధపడుతున్న పిల్లలు శరీరం నుంచి ప్లాస్టిక్కి సంబంధించిన మరో రూపాంతరం అయినా డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్ను బయటకు పంపించే సామర్థ్యం లేనట్లు గుర్తించారు. ఈ "బిస్ ఫినాల్ ఏ" "ప్లాస్టిక్, డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్(డీఈహెచ్పీ)" ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రుగ్మతతో ఉన్న పిల్లల శరీరాని వాటిని బయటకు పంపించే సామర్థ్యం ఉండదని తేలింది. వారి కణాజాలల్లో ఈ రెండు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండిపోతాయని పేర్కొన్నారు. ఆటిజం పిల్లలు ఈ ప్లాస్టిక్కి సంబంధించిన టాక్సిన్లను కేవలం 11 శాతం, ఏడీహెచ్డీ బాధపడుతున్న చిన్నార్లుల్లో 17 శాతం శరీరం నుంచి బయటకు పంపించగల సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఆ ప్లాస్టిక్ సంబంధించిన మిగతా టాక్సిన్లన్నీ వారి శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండిపోవడాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది న్యూరాన్ అభివృద్ధిని పూర్తిగా నష్టపరుస్తోందని అన్నారు. ఈ రెండు డిజార్డ్ర్లు, జన్యుపరమైన పర్యావరణ ప్రభావాల కలయికతోనే వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడించారు. అలా అని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఉన్న ప్రతి బిడ్డ బీపీఏ ప్లాస్టిక్ని తొలగించడంలో సమస్యలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం అని చెప్పారు. దీంతో కొన్ని ఇతర అంశాలు కూడా ముడిపెట్టి ఉంటాయన్నారు. వాస్తవంగా ఇది గర్భాశయంలోంచే చిన్నారుల్లో ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య వస్తుందా లేక జన్మించాక అనేది తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మాత్రం న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్కి ప్లాస్టిక్కి సంబంధించిన పర్యావరణ కాలుష్య కారకాలతో పూర్తిగా సంబంధం ఉందని రుజువైంది. ఆ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్కి ఎంతమేర ప్లాస్టిక్ కారణమనేది అంచనా వేయడం అంత అజీ కాదన్నారు. (చదవండి: షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..) -
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం, ప్లాస్టిక్ను రీసైక్లింగ్పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్విల్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఎవరు? రూ.1400 కోట్ల ఆఫర్ వద్దని, భారత్కు ఏమి చేశారు?
మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మనకు ఎంతో హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవరాశుల మరణానికి కారణంగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీసైకిల్ చేసేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ముందడుగు వేసిన తమిళనాడులోని మదురైలోగల టీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచమంతటా రోడ్లు వేయాలనే ఆలోచనను అందించారు. ఫలితంగా ఆయన ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందారు. అతని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను రూపొందించిన ఈ ప్రొఫెసర్ పేరు రాజగోపాలన్ వాసుదేవన్. మధురైలోని టీసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2002 సంవత్సరంలో త్యాగరాజర్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు పదేళ్ల కృషి అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. జయలలిత తన కృషిని మెచ్చుకున్నారని, సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వాసుదేవన్ తెలియజేశారు. వాసుదేవన్ తన ఆలోచనను ప్రపంచంతో పంచుకోవడంతో, దీనిని అతని నుంచి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే ఇందుకు వాసుదేవన్ నిరాకరించారు. తన సాంకేతికతను ఆయన ఉచితంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఫలితంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మితమయ్యాయి. వాసుదేవన్ తయారు చేసిన ఈప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా సుమారు రూ. 1400 కోట్లు ఆఫర్ చేసిందని అంటారు. అయితే అతను ఈ ఆఫర్ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది. వాసుదేవన్ అందించిన సాంకేతికతను నేడు పంచాయతీలు, మునిసిపాలిటీలు సైతం ఉపయోగిస్తున్నాయి. అలాగే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా పెద్ద ఎత్తున వ్యర్థ ప్లాస్టిక్ను ఉపయోగించాలనే మిషన్ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 26 వేల మందిని అనుసంధానం చేసి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించి, రోడ్డు నిర్మాణంలో వినియోగించేందుకు అనువుగా వ్యర్థ ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. వివిధ దేశాలకూ వాసుదేవన్ సాంకేతికత భారతదేశంలో ఇప్పటికే దాదాపు 100,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు తయారయ్యాయి. పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే కాదు వాసుదేవన్ అందించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకస్సర్ తదితర ప్రదేశాలతో ప్లాస్టిక్-తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు నిర్మితమవుతున్నాయి. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్ సెల్.. ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీని పరీక్షించేందుకు యునైటెడ్ కింగ్డమ్ 1.6 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజగోపాలన్ వాసుదేవన్ ప్రతిభను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఇది కూడా చదవండి: ఈ నగరంలో నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
హైదరాబాద్లో అతిపెద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం
దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్పో హైప్లెక్స్-2023 హైదరాబాద్లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్గా వ్యవహరించేవారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు. -
ఈ హోటల్లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్
ఈ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలండోయ్. ప్లాస్టిక్పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్లోని జునాఘడ్కు కలెక్టర్గా పనిచేస్తోన్న రచిత్ రాజ్ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్తో ప్లాస్టిక్ కేఫ్ను గతేడాది జూన్ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్ను ఓం శాంతి అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్నకు చెందిన రేఖా బెన్ నడిపిస్తోంది. ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్ హాలిడేస్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్ లోనేగాక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లలో సైతం కేఫ్ ఆర్డర్లు అందిస్తోంది. ప్లాస్టిక్ మనీతో... ప్లాస్టిక్ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడం లేదు. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్ రాజ్ టీమ్ ప్లాస్టిక్ మనీ కేఫ్ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్మనీతో ఈ కేఫ్ను నడిపిస్తున్నారు. ఆదాయం... ఆరోగ్యం.... డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్ను రీసైక్లింగ్కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ కేఫ్లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్ను ప్రశంసిస్తున్నవారు. -
ఈ తల్లులు ప్రకృతే మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది. రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు. అరిటాకులు.. స్టీల్ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్స్ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ స్థానంలో స్టీల్ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్పేపర్ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు. స్టీల్ ప్లేటులు, గ్లాసులతో పెళ్లిలో డెకరేషన్ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్ నుంచి ... ప్లాస్టిక్ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్ నింపిన డ్రమ్స్లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్ సెంటర్కు పంపించారు. డ్రమ్లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు. (చదవండి: గూగుల్ మ్యాప్లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
సోషల్ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్ బాటిల్ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్బిన్ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్ను ఆ డస్ట్బిన్ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. అంత్యంత వేగంగా వైరల్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ — Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023 -
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు. -
పంట పొలాల్లో తిష్టవేసుకొని కూర్చున్న ప్లాస్టిక్ భూతం
పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం తిష్టవేసుక్కూచుంది. వ్యవసాయంలో చాలా పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం గత 70 ఏళ్లుగా అనేక రెట్లు పెరిగింది. మల్చింగ్ షీట్లు, ఫామ్పాండ్ లైనింగ్, ప్లాస్టిక్ డ్రిప్ లేటరల్స్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌస్ల పైకప్పులు, సైలేజీ గడ్డి బేల్స్ కోసం ఫిల్మ్ల తదితర పనుల కోసం వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వీటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ ముఖ్యమైనది. ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి షీట్ ఇది. కలుపును నివారించడం ద్వారా కలుపు తీత శ్రమతో పాటు ఖర్చును లేదా రసాయనిక కలుపు మందుల ముప్పును/ వాటి కొనుగోలు ఖర్చును తగ్గించడం.. మట్టిలో నుంచి నీటి తేమ ఆరిపోకుండా చూడటం ద్వారా నీటిని ఆదా చేయటం ద్వారా దిగుబడి పెరుగుదలకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఉపయోగపడుతున్నాయి. కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ సేద్యం 2019వ సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట దగ్గరి నుంచి ఆయా ఆహారోత్పత్తులను వినియోగదారులకు చేర్చే వరకు ఉన్న దశలన్నిటిలో కలిపి సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ను వినియోగించినట్లు ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పంటలు/ఉద్యాన తోటల సాగులో, పశువుల పెంపకంలో ఏడాదికి కోటి టన్నుల ప్లాస్టిక్ వాడుతుండగా.. ఇందులో మల్చింగ్ ఫిల్మ్ వాటా 34 లక్షల టన్నులు. చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరో 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి వాడుతున్నారు. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50% పెరగనుందని వ్యాపారుల అంచనా. ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్లో సింహభాగం అంటే 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ (ప్రపంచ వినియోగంలో సగం)ను ఆసియా దేశాల్లో రైతులే వాడుతున్నారని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. ప్లాస్టిక్ అవశేషాలతో ముప్పేమిటి? పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాల వల్ల ఆయా భూములు కాలుష్యం బారిన పడినందున సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. ఇలా భూమిలో కలిసిన ప్లాస్టిక్ (ముఖ్యంగా మల్చింగ్ ఫిల్మ్ అవశేషాల) ద్వారా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మప్లాస్టిక్ కణాలు) ఆహారోత్పత్తులు, నీటి ద్వారా తిరిగి మనుషులకు చేరి వారికి అనారోగ్యం కలిగించడం కూడా జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున పోగుపడే వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు కూడా అనారోగ్యం పాలువుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ కణాలలో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషతుల్య పదార్థాలు మనుషుల హార్మోన్ వ్యవస్థను అస్థవ్యస్థం చేసి ఆనారోగ్యాల బారిన పడేస్తాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు, సూక్ష్మప్లాస్టిక్ కణాలు వాగులు, కాలువల ద్వారా సముద్రంలోకి చేరి జలచరాలకు దీర్ఘకాలం హాని చేస్తున్నాయి. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించి, పునర్వినియోగించే పటిష్ట వ్యవస్థ కొరవడింది. సేకరించి పొలాల్లోనే తగటబెడుతున్నారు. ఒక వేళ చెత్త కుప్పల్లో వేసినా.. అక్కడ వాటికి నిప్పు పెడుతున్నారు. తగలబడిన ప్లాస్టిక్ నుంచి పాలీక్లోరినేటెడ్ డిబెన్జో–పి–డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విషతుల్య వాయువులు వెలువడుతూ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఒక వైపు ఆహారోత్పత్తి పెరుగుదలకు దోహదపడుతున్న ఈ ప్లాస్టిక్.. మరోవైపు ఆహారభద్రతపై, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా, సాంఘిక, ఆర్థిక పరంగా నష్టాలకు కారణభూతమవుతోంది. అందువల్ల, వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని గాడిన పెట్టి, ప్రత్యామ్నాయాలపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఎఫ్.ఎ.ఓ. శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు అనేక సూచనలు చేసింది. కిలో షీట్తో 700 చ.అ.ల భూమి కలుషితం పంట పూర్తయిన తర్వాత చీలికలు పేలికలయ్యే మల్చింగ్ ప్లాస్టిక్ షీట్ ముక్కలను ఏరివేయటం పెద్ద సమస్యగా మారింది. వీలైనంత వరకు ఏరి తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు. మిగతా ప్లాస్టిక్ ముక్కలు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి. వీటితో పాటు డ్రిప్ లేటరల్స్ ముక్కలు తదితర ప్లాస్టిక్ వస్తువులను సక్రమంగా ఏరి తిరిగి ఉపయోగించే పరిస్థితి లేనందున భూమి ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడుతోంది. ఆసియా దేశాల్లో 10 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగి వాడగలుగుతున్నామని అంచనా. మట్టిలో కలిసే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతింటున్నది. ఒక కిలో పల్చటి ప్లాస్టిక్ షీట్ 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కలుషితం చేస్తోందని అంచనా. చమురు, సహజవాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధిచేసి 99% ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి ఒక వైపు ఉపయోగపడుతూనే నిర్వహణ లోపం వల్ల మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలున్నప్పటికీ..! రసాయనిక కలుపు మందులు వాడకుండా, కలుపు మొలవకుండా చూసేందుకు వ్యవసాయంలో వాడుతున్న ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్కు ప్రత్యామ్నాయాలు అనేకం. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు వేయటం(సజీవ ఆచ్ఛాదన) లేదా ఎండుగడ్డి వంటి పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడటం వంటి మార్గాలున్నాయి. త్వరగా చివికి భూమిలో కలిసిపోయే పర్యావరణహితమైన (బయోడీగ్రేడబుల్) మల్చింగ్ ఫిల్మ్లను సంపన్న దేశాల్లో వాడుతున్నారు. అదేవిధంగా, మన కాయిర్ బోర్డు రూపొందిస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసే ‘భూవస్త్రాలు’ కూడా పంటల మధ్య ఆచ్ఛాదనకు ఉపయోగపడతాయి. కొద్ది నెలల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే, వీటితో వచ్చిన చిక్కేమిటంటే.. ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్ కన్నా వీటి ధర 2–3 రెట్లు ఎక్కువగా ఉండటమే. ఈ ప్రతిబంధకాలను అధిగమించేందుకు ముఖ్యంగా ఆసియా దేశాలు పరిశోధనలకు ఊతమివ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఫలించి, ధర అందుబాటులోకి వస్తే బయోడీగ్రేడబుల్ మల్చింగ్ ఫిల్మ్లు మన దేశంలోనూ రైతులకు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
స్టీల్బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్ను నియంత్రించగలిగాను. భవిష్యత్లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు
మహా సముద్రాలు మన గ్రహానికి ఊపిరితిత్తులు. మానవ తప్పిదాల కారణంగా ఆ మహా సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూ ఉపరితలంపై దాదాపు 70 శాతం నీటితో విలువైన వనరులుగా ఉంటూ.. భూమికి ఆక్సిజన్ సరఫరా చేయడంతోపాటు అనేక జాతుల మొక్కలకు, జంతువులకు నిలయంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. అంతటి మహా సముద్రాలను ప్లాస్టిక్ పొరలు చుట్టేస్తున్నాయి. సాగర గర్భంలోని జాతులను నాశనం చేస్తున్నాయి. సముద్ర కాలుష్యంపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఏటా సుమారు 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోంది. దీని బరువు లక్ష నీలి తిమింగలాలకు సమానం. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోని చేపల కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్తో నిండిపోయింది. ఇందులో 1.8 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. దీని విస్తీర్ణం అమెరికాలోని టెక్సాస్ భూ భాగానికి రెండింతలు. - సాక్షి, అమరావతి సముద్ర కాలుష్యం ఇలా.. ♦ సముద్ర కాలుష్యం అనేది కేవలం ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాల వల్లే కాకుండా.. ఓడలు నుంచి వెలువడే శబ్ద కాలుష్యం కూడా పెను ప్రమాదంగా ఉంది. తిమింగలాలు, డాల్ఫిన్లు వంటి అనేక సముద్ర క్షీరదాలు నీటిలో తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి శబ్దాలు చేయడం ద్వారా సంభాషించుకుంటాయి. దీనిని ఎకోలోకేషన్గా పిలుస్తారు. అయితే ఓడలు, సోనార్లు, ఇతర పరికరాల నుంచి వచ్చే కృత్రిమ శబ్దాలు సముద్ర జీవుల కమ్యూనికేషన్ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా వలసలు చెదిరిపోవడంతో పాటు వాటి పునరుత్పత్తి, ఆహార వేట ప్రక్రియలను ప్రభావితం చేస్తోంది. ఒక్కోసారి ఓడలను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడుతున్నాయి. ♦ చర్మ సౌందర్యానికి వినియోగించే సన్ స్క్రీన్ల తయారీలో పగడాలు, ఇతర సముద్ర జీవులను వాడటం వాటికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆ జీవుల్లోని ఆక్సిబెంజోన్, ఆక్టినోక్సేట్ వంటి రసాయనాలు చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ♦ సముద్రంలో ముడి చమురు ట్యాంకర్లు రవాణా చేస్తున్నప్పుడు చమురు లీకవడంతో ఆ నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గుతున్నాయి. ఆ చమురు సముద్ర జీవుల రెక్కలకు బలంగా అంటుకోవడంతో ఈదే శక్తిని కోల్పోతున్నాయి. ఆ నీటిలోని చేపలు తినడంతో మానవ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ♦ వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగించే కృత్రిమ రసాయనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కలుíÙత నీరు.. చిన్నచిన్న ప్రవాహాలు, నదుల ద్వారా సముద్రాల్లోకి కలుస్తాయి. లోతైన సముద్రపు మైనింగ్ కారణంగా నీటి అడుగున జీవం ఉనికి కోల్పోతోంది. ♦ కృత్రిమ కాంతి కాలుష్యం కూడా సముద్ర జీవుల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక పిల్ల తాబేలు దాని గుడ్డు నుంచి బయటకు వచి్చనప్పుడు, అది సముద్రాన్ని కనుగొనడానికి చంద్రకాంతిని అనుసరిస్తుంది. సముద్రతీర రెస్టారెంట్లు, బీచ్ సైడ్ క్యాబనాస్ (గుడారాలు), క్యాంప్ ఫైర్ల వెలుతురు వాటిని అడ్డుకుంటుంది. మహా సముద్రాల్లో 500 డెడ్ జోన్లు వివిధ రకాల సముద్ర కాలుష్యం కారణంగా ఏటా 100 మిలియన్ సముద్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. ఇది వెయ్యికి పైగా సముద్ర జాతుల ఉనికిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మహా సముద్రాల కాలుష్యం 500 డెడ్ జోన్లను సృష్టించింది. ఇక్కడి ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ ఉండటంతోపాటు జీవం ఉనికే ఉండని పరిస్థితి ఏర్పడింది. సముద్రాల్లో మితిమీరిన చేపల వేట కూడా ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మితిమీరిన చేపలు వేట, కాలుష్యం కారకాల నుంచి సముద్రాలను రక్షించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు తీర్మానించాయి. 2030 నాటికి ప్రపంచంలోని 30 శాతం భూమి, సముద్రాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ఒప్పందం చేసుకున్నాయి. ఇక స్విస్ ఆధారిత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ జాబితా ప్రకారం నీటి అడుగున మొక్కలు, జంతువులు 10 శాతం అంతరించిపోయే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. చేపల ద్వారా మానవ దేహంలోకి ప్లాస్టిక్ సముద్రాల్లో ప్లాస్టిక్ సీసాలు, బ్యాగ్లు, సిగరెట్ పీకలు, స్ట్రాలు, టైర్లు, వేట వలలు వంటివి చేపలు, ఇతర జీవుల మరణాలకు కారణమవుతున్నాయి. తాబేళ్లు, సముద్ర పక్షులు కొన్నిసార్లు వాటిని ఆహారంగా భావించి తినడంతో వాటి జీర్ణ వ్యవస్థ కోసుకుపోయి.. చివరికి ఆకలితో మరణిస్తున్నాయి. సాగరాల్లోని మైక్రో ప్లాస్టిక్లను చేపలు తింటుంటే.. ఆ చేపలను తిన్న మనుషుల శరీరాల్లోకి ప్లాస్టిక్ చేరుతోంది. ఉత్తర పసిఫిక్ తీరంలోని చేపలు ఏడాదికి 24 వేల టన్నుల ప్లాస్టిక్ ముక్కలు తింటున్నట్టు.. అవి మానవుల ఆహారంలో కలుస్తున్నట్టు కనుగొన్నారు. కాలిఫోరి్నయాలోని మార్కెట్లో విక్రయించే నాలుగింట ఒక వంతు చేపల పొట్టల్లో ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్ను గుర్తించారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏడాదికి సగటున 74 వేల మైక్రో ప్లాస్టిక్లు తింటున్నట్టు తేల్చారు. భారతదేశంలో సముద్రంలో చేరే చెత్తలో 60 శాతం ప్లాస్టిక్ ఉంటోంది. స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్ ప్రకారం ఇక్కడి సముద్ర తీరంలోని ప్రతి కిలో మీటరుకు సగటున 0.98 మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించారు. -
సమయం లేదు మిత్రమా!
ప్రపంచంలోని 175 దేశాలు... దాదాపు 1000 మంది ప్రతినిధులు... అయిదు రోజుల చర్చోప చర్చలు... ఎట్టకేలకు ప్రపంచ సమస్యకు పరిష్కారం దిశగా చిన్న ముందడుగు. మే 29 నుంచి జూన్ 2 వరకు ప్యారిస్లో ప్లాస్టిక్పై ఐరాస అంతర్ ప్రభుత్వ చర్చల సంఘం2 (ఐఎన్సీ–2) సమావేశంలో జరిగింది ఇదే. ప్లాస్టిక్ కాలుష్యభూతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవ్యాప్త ఒప్పందానికి చిన్నగా అడుగులు పడ్డాయి. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలండి’ అన్నది ఈసారి ప్రధానాంశమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిగా ముందు జరిగిన ఈ సమావేశం ఆ మేరకు ఆనందించదగ్గది, అయితే, నవంబర్లో నైరోబీలో జరిగే ‘ఐఎన్సీ–3’ నాటికి కేవలం ఆలోచనలు ఏకరవు పెట్టే చిత్తు ప్రతి తయారీనే ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకోవడం ఆశ్చర్యకరం. పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పసి ఫిక్ మహాసముద్రంలో కదులుతున్న కృత్రిమ ద్వీపంలా తయారైన వేళ ఇది అతి జాప్యమే. నిజానికి, వచ్చే 2024 చివర లోపల ప్లాస్టిక్ భూతంపై ఈ చర్చోపచర్చలు ముగించాల్సి ఉంది. అందులో భాగంగా తలపెట్టిన అయిదు సమావేశాల్లో తాజా ప్యారిస్ సమావేశం రెండోది. ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో జరిగిన తొలి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు విశ్వవ్యాప్త కార్యాచరణ కోరితే, మరికొన్ని దేశాలు జాతీయ పరిష్కారాలు కావాలన్నాయి. ఇంకొన్ని దేశాలు రెండూ కావాల్సిందే అన్నాయి. తీరా ఆరునెలల తర్వాత తాజా సమావేశంలోనూ తొలి రెండు రోజులూ ఉద్రిక్తత నడుమ వృథా అయ్యాయి. సహజంగానే ప్లాస్టిక్తో తమ ఆర్థిక అంశాలు ముడిపడ్డ చమురు, సహజవాయు, పాలిమర్ ఉత్పాదక దేశాలు ఏకాభిప్రాయం కుదరనివ్వక తమకు అనుకూల వాదనను ఎంచుకుంటూ, చర్చలను జాప్యం చేశాయి. ఎట్టకేలకు మూడో రోజున చర్చల రథం కొంత ముందుకు కదిలింది. ఆర్థిక ప్రయోజనాలు అర్థం చేసుకోదగినవే కానీ, వాటి కోసం ప్రపంచమే ప్రమాదంలో ఉన్నా పట్టదంటే ముమ్మాటికీ తప్పే. మానవాళికి ప్లాస్టిక్ పెనుభూతమే. ప్రపంచంలో ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. అందులో సగానికి పైగా ఉత్పత్తులు పరిమిత కాలం ఆయువున్నవే. ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్లో మూడింట రెండు వంతులను వ్యర్థాలుగా పారేస్తున్నారు. పది శాతం ప్లాస్టిక్కే రీసైక్లింగ్కు నోచు కుంటోంది. అతి కొద్దిభాగం ప్లాస్టిక్ వ్యర్థాలనే దహనం చేస్తున్నారు. అత్యధిక భాగం భూమిలో, జల వనరుల్లో, సముద్రాల్లో చేరిపోతున్నాయి. ఇది సమస్త జీవరాశికీ ముప్పు. ఇలా పేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం వచ్చే 2060కి మూడు రెట్లవుతుంది. అందులో అయిదోవంతే రీసైకిల్ చేయడా నికి వీలుంటుంది. ఇక, 2019లో ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 3 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల పాపమే. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఈ ప్రమాదాలపై తాజాగా అప్రమత్తం చేసింది. కొత్తగా మైక్రో ప్లాస్టిక్స్ మరో పెను ఆందోళన. చేపలు, బ్లూ వేల్ లాంటి సముద్రచరాలు రోజూ కోటి ముక్కల మైక్రో ప్లాస్టిక్ను పొట్టలో వేసుకుంటున్నాయి. వాటిని భుజిస్తున్న మన రక్తంలో, చనుబాలలో, చివరకు గర్భస్థ మావిలో సైతం చేరి, ఆరోగ్య సమస్యగా మారాయి. కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలంటున్న దేశాలకూ, వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే సరి అంటున్న దేశాలకూ మధ్య భేదాభిప్రాయాలు మరోసారి ప్యారిస్ సాక్షిగా బయటపడ్డాయి. మన దేశంతో సహా సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలూ నియంత్రణ చర్యలపై మెజారిటీ ఓటింగ్ కాక, ఏకాభిప్రాయం కావాలని పట్టుబట్టడం చిత్రం. లెక్కల్లో మన దేశ తలసరి ప్లాస్టిక్ వినియోగం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ మన మొత్తం జనాభా, అన్ని కోట్లమంది అవసరాలకై ప్లాస్టిక్ ఉత్పత్తి, తత్ఫలి తంగా వ్యర్థాలు మాత్రం ఎక్కువే. పైపెచ్చు, ఎప్పటికప్పుడు అది అధికమవుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రిస్తూ, కాలుష్యాన్ని మొగ్గలోనే తుంచేసే అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒడంబడిక ప్రపంచానికి ఇప్పుడు అవసరమంటున్నది అందుకే. ప్యారిస్ పరిణామాలు, అధిగమించా ల్సిన అడ్డంకుల్ని చూస్తుంటే ఆ ఒడంబడిక అంత త్వరగా వచ్చేలా లేదు. ఇవాళ్టికీ సామాన్య ప్రజలు తమ జీవితంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఆ వైఖరిని మార్చడం విశ్వ ఒడంబడికను మించిన సవాలు. అలాగే వచ్చే ఏడాది చివరకి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండే చట్టబద్ధమైన విశ్వవ్యాప్త ఒడంబడిక తెద్దామని యోచన బాగున్నా, అందుకు కట్టుబడి ఉండడం కీలకం. ఒప్పందంలోనూ శషభిషలు లేకుండా ప్లాస్టిక్పై కఠిన కార్యాచరణ మరీ కీలకం. అలాకాక, మునుపటి పర్యావరణ ఒప్పందాల్లా ఈ కొత్త ఒడంబడికనూ కాలయాపన వ్యవహారంగా, ధనిక దేశాలకు అనుకూలంగా మారిస్తే ఫలితం శూన్యం. వర్ధమాన దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. ప్యారిస్ సమావేశం ప్రారంభ చర్చల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నట్టు, ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు ఓ టైమ్ బాంబ్. తక్షణ చర్యలకు దిగకపోతే, పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ, యావత్ ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం. దీన్ని కేవలం వ్యర్థాల నిర్వహణ అంశంగానే చూస్తే ఇబ్బందే. కేవలం రీసైక్లింగ్కో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధానికో పరిమితం కాకుండా పాలు, నీళ్ళ నుంచి తిండి దాకా అన్నీ ప్యాకెట్లూ ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని మార్పించడంపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై త్వరపడాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పైనే బాధ్యత మోపే ఆలోచన చేయాలి. ముప్పు ముంచుకొచ్చిన వేళ ఆలసిస్తే ఆనక ఏ ఒడంబడి కైనా నిరుపయోగమే. మెక్రాన్ మాటల్లోనే చెప్పాలంటే... ఆట్టే సమయం లేదు మిత్రమా! -
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ప్లాస్టిక్ ముప్పు ఇంతింత కాదయా!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ యేడు ప్లాస్టిక్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2023... ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలు చేపట్టే చర్యలు ముఖ్యమైనవని గుర్తు చేస్తున్నది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు తీసుకునే చర్యలు ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటాయని నొక్కి చెబుతున్నది. ప్రజా చైతన్యంతో ఒక ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’కు నాంది పలికే సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ కాలుష్యంతో ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి భూమిని, మానవ సమాజాన్ని, సహజ ప్రకృతి వ్యవస్థలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ఇప్పటికే బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. జీవవైవిధ్యంతో పాటు మానవ ఆరోగ్యం మీద కూడా ప్లాస్టిక్ దుష్ప్రభావం చూపుతుంది. ౖఆహారంలో, నీటిలో మెక్రో ప్లాస్టిక్ చేరి నేరుగా మనుష్యుల ఆరోగ్యంపై త్వరగా ప్రభావం చూపే దశకు చేరుకున్నాం. ప్లాస్టిక్ వస్తువు లను కాల్చడంవల్ల విష వాయువులు వెలువడి ఆహారం, నీరు కలు షితం అవుతున్నాయి. అయినా ప్లాస్టిక్ ఉత్పత్తి పెరుగుతున్నది. సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. ఈ ఉత్పత్తిని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టకుంటే 2040లోపే ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్లాస్టిక్ కాలుష్య సమస్య భౌగోళికంగా ఏదో ఒక దేశానికి పరిమిత మైనది కాదు. నదులు, మహాసముద్రాల ద్వారా, గాలి ద్వారా, వివిధ సరఫరా గొలుసు వ్యవస్థల ద్వారా, ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఈ కాలుష్యం ఎల్లలు దాటుతున్నది. ముఖ్యంగా మైక్రో, నానోప్లాస్టి క్ల విషయంలో ఇది కచ్చితం! మొత్తం సముద్ర వ్యర్థాలలో ప్లాస్టిక్ 85 శాతం ఉందని అంచనా. ఈ వ్యర్థాలు సముద్ర జలచరాలకు ప్రాణ సంకటంగా మారాయి. జీవాల మనుగడ, సుస్థిర పునరుత్పత్తి సమస్యగా మారింది. సముద్రంలో చేరడం కాకుండా, 46 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద గుట్టలుగా మిగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల్లో 17 శాతం కాల్చేస్తున్నారు. కేవలం 15 శాతం పునర్వినియోగం అవుతోంది. ఈ రెండు ప్రక్రియల ద్వారానూ గాలి కాలుష్యం అవుతున్నది. ప్లాస్టిక్ ఉపయోగం క్రమంగా తగ్గించుకోవడమే సుస్థిర మార్గం. దీర్ఘకాలిక పరిష్కారం అంటే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ పదార్థాలను వాడటం. మైక్రో ప్లాస్టిక్ ఇంకా తీవ్ర సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏండ్లు పడుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా గమనించిన విషయం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యర్థాలు ఎండకు, వానకు, గాలికి, సముద్రంలో ఉప్పు నీటికి పగిలిపోతూ, చిన్న సూక్ష్మ పరి మాణంలోకి మారి, కంటికి కనపడని కణాలుగా, ఫైబర్గా మారు తున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్... కణాలుగా, ఫైబర్ (నూలు)గా తాగే నీటిలో, జలచరాల శరీరాలలో చేరి, తరువాత క్రమంగా మనుష్యు లలో చేరుతున్నది. ప్లాస్టిక్ ఉత్పత్తిలో మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా ఉన్నది. పెళ్లిళ్లలో ఒకరి మీద ఒకరు పోసుకునే చమ్కీలు, పుట్టిన రోజు కేకు కట్ చేసేటప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ గోలీలు మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తులే. ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్తో పాటు, అసలు అవసరం లేని (జీరో యూజ్) ప్లాస్టిక్ కూడా ఉత్పత్తి అవు తున్నది. అరటి పండు తొక్క తీసేసి ప్లాస్టిక్ కవర్ ప్యాక్ చేయడం, కొబ్బరి బోండాం ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మడం, పళ్లను ‘ఫోమ్’తో చేసిన తొడుగుల మీద పెట్టడం వంటివి అనవసర ప్లాస్టిక్ వినియోగంలోకి వస్తాయి. ప్యాకేజింగ్ పరిశ్రమ పూర్తిగా ప్లాస్టిక్ మీద ఆధారపడి, అనవసర వినియోగాన్ని ప్రజల మీద రుద్దుతున్నది. ఇటువంటి అనవ సర ప్లాస్టిక్ వినియోగం మీద ప్రభుత్వ నియంత్రణ అవసరం. మన జీవన శైలి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్నది. ప్లాస్టిక్ బాధ పోవాలంటే ఉత్పత్తి తగ్గడంతో పాటు దాని వినియోగం తగ్గాలి. అన్నింటికీ ప్లాస్టిక్ వాడే బదులు అవసరమైన వాటికే వాడితే వ్యర్థాలు తగ్గుతాయి. ప్రతి మనిషీ తన ప్లాస్టిక్ వినియోగం మీద దృష్టి పెట్టి, ప్రణాళిక ప్రకారం చేస్తే, వినియోగం తగ్గించవచ్చు. ప్రతి ఇంటిలో స్వల్ప మార్పులతో, భారీ త్యాగాలు చేయకుండా ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చు. అపార్ట్మెంట్ సంస్కృతి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతున్నది. ప్రతి బహుళ అంతస్థుల నివాస సముదాయాలలో, గేటెడ్ కమ్యునిటీలలో ప్లాస్టిక్ ఆడిట్ చేసుకుని, పునర్వినియోగ పద్ధతులు అవలంబిస్తే ప్లాస్టిక్ డిమాండ్ తగ్గుతుంది. ప్రభుత్వం కూడా ప్రజా రవాణా వ్యవస్థను విస్తృత పరిస్తే ప్రైవేటు కార్ల వినియోగం తగ్గుతుంది. కార్లు తగ్గాయంటే, ఆ మేరకు విని యోగం ఉండదు. మనం ప్లాస్టిక్ వాడకున్నా ప్లాస్టిక్ భూతం స్పష్టమైన ప్రభావం చూపుతుంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగు తున్నట్లు, ప్లాస్టిక్ ఎవరో ఎక్కడో వాడినా దాని దుష్ప్రభావం వారితో పాటు మనం కూడా ఎదుర్కోవచ్చు. ఎవరి బాధ్యత ఎంత? 2022 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ అసెంబ్లీ’ ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒడంబడిక అభివృద్ధి చేయ డానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్’ కమిటీ (ఐఎన్సీ) ద్వారా, ఈ ఒప్పందం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్ జీవిత చక్రంపై దృష్టి సారించి, సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చని ఆశిస్తు న్నారు. వనరుల సామర్థ్యం పెంచడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సమ స్యను పరిమాణ పరంగా తగ్గిస్తూ చక్రాకార ఆర్థిక వ్యవస్థ వంటి పరిష్కరాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘ఐఎన్సీ–1’ మొదటి సమావేశాల్లో చర్చలు జరిగాయి. ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ను నిషేధించడం, ఉత్పత్తి మీద ఆంక్షలు విధించడం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన విధానాల కూర్పు పైన దృష్టి సారించారు. వివిధ వ్యక్తులు, వర్గాలకు సంబంధించి ఎవరికి ఎంత బాధ్యత ఉంటుంది అనే ప్రశ్నలపై కూడా దృష్టి పెట్టారు. ఉత్పత్తిదారుల మీద కూడా బాధ్యత ఉంది. అదనంగా వ్యర్థాల నిర్వహణలో సాధించాల్సిన మార్పులో సామాజిక న్యాయ కోణం కూడా చర్చించారు. వ్యర్థాల నిర్వహణ మీద ఆధారపడిన జీవనోపాధులకు నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన చర్యలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంత సున్నితత్వం అవసరం అని భావిస్తున్నారు. పారదర్శక పర్యవేక్షణ యంత్రాంగాల అవసరం, పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటివి ఈ ఒప్పందంలోని కీలక అంశాలు కానున్నాయి. ప్రపంచ ప్లాస్టిక్ ఒప్పందం, కాలుష్యం తగ్గించే చర్యల అమలుకు తీసుకునే నిర్ణ యాలు, చేపట్టే ప్రక్రియలలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ప్రజలు పాల్గొనే విధంగా ఒప్పంద ప్రక్రియలను రూపొందించడం అవసరం. ఈ ఒప్పందం తయారీలో, అన్ని దేశాలు ఆమోదించే దశలలో ఎదు రయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలలో అవగాహన పెరగాలని ఈ ఒప్పందం మీద ఆశ పెట్టుకున్నవాళ్ళు భావిస్తున్నారు. ప్లాస్టిక్ మీద ఈ ఒప్పందాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి ప్రక్రియలతో అనుసంధానించేలా ముడిపెడితే బాగుంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాలను తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచే క్రమంలో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ముడి చమురు శుద్ధి నుంచి వస్తుంది కనుక. ముడి చమురు విని యోగం తగ్గితే ప్లాస్టిక్ వినియోగం తగ్గవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధ నాలతో పాటు ప్లాస్టిక్కు కూడా ప్రత్యామ్నాయం తేవాలి. అయితే ఇదంత సులువు కాదు. కాగా, మనుషులు ధరించే దుస్తులలో పత్తి, పట్టు, ఉన్ని వంటి సహజమైనవి ప్రోత్సహిస్తే, వేల టన్నుల పాలిస్టర్ వస్త్ర వ్యర్థాలు తగ్గుతాయి. ఎక్కడ వీలైతే అక్కడ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచి, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశంలో చేనేత రంగానికి ఊతం ఇస్తే ప్లాస్టిక్ తగ్గించవచ్చు. కాలుష్యం తగ్గుతుంది, ఉపాధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది. దొంతి నరసింహా రెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742 (ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ కోసం ఐరాస ‘ఐఎన్సీ’ రెండో సమావేశాలు మే 29 నుంచి జూన్ 2 వరకు ఫ్రాన్స్లో జరగనున్నాయి.) -
చిన్నారి కంటి నుంచి వస్తోన్న ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు
-
కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు..
-
కేటీఆర్తో ‘హస్క్ ఇంటర్నేషనల్’ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హస్క్ పెల్లెట్లు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ‘హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్’ప్రతినిధులు ఆదివారం మంత్రి కె. తారక రామారావుతో లండన్లో భేటీ అయ్యారు. సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఏటా వెయ్యి మెట్రిక్ టన్నుల బయో పెల్లెట్ల తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హస్క్ (ధాన్యం ఊక/పొట్టు), పునర్వినియోగానికి వీలుండే ప్లాస్టిక్ను సహకార పద్ధతిలో సేకరించేందుకు హస్క్ ఇంటర్నేషనల్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో హస్క్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్కు చెందిన ‘ఇంక్రెడిబుల్ హస్క్ యూకే’సీఈఓ కీత్ రిడ్జ్వే, ఇంక్రెడిబుల్ హస్క్ ఇండియా సీఈఓ సీకా చంద్రశేఖర్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఆత్మకూరి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు లండన్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రతిష్టించిన భారీ అంబేడ్కర్ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు ఆయన బహూకరించారు. బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు ఆయన నివసించిన ఇంటినే మ్యూజియంగా మార్చారు. -
ప్లాస్టిక్ రహితంగా తిరుమల
తిరుమల/తిరుచానూరు(చంద్రగిరి): తిరుమలలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపైనా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆయన తొలగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తిరుమల కొండలు పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని.. ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెలా రెండో శనివారం సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమలను పరిశుభ్రంగా.. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. తిరుమలకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ని రంగనాయకుల మండపంలో లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
ప్రాణాలు తీస్తున్న ప్లాస్టికోసిస్ వ్యాధి.. వాటి ఉనికే ప్రశ్నార్థకం
సాక్షి, అమరావతి: మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్.. సముద్ర పక్షులను సైతం పొట్టన పెట్టుకుంటోంది. సముద్ర జలాల్లోకి చేరుతున్న చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తింటున్న పక్షులు మూకుమ్మడిగా మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల ఆస్ట్రేలియా సమీపంలోని లార్డ్ హోవ్ ద్వీపంలో బ్రౌన్ సీగల్స్పై అధ్యయనం చేసి.. మరణించిన పక్షుల శరీరాలను పరీక్షించగా కడుపులో ప్రమాదకరమైన స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టు తేలింది. అక్కడి ద్వీపంలోని 90 శాతం పక్షుల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్టు తేల్చారు. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు ఈ పరిస్థితికి ‘ప్లాస్టికోసిస్’ వ్యాధిగా నామకరణం చేశారు. వర్తమాన ప్రపంచంలో ప్లాస్టిక్ ద్వారా వచ్చే సమస్యకు పేరు పెట్టడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 8 మిలియన్ ప్లాస్టిక్ ముక్కలు సముద్రాల్లోకి చేరుతున్నాయని, అందులో ఎక్కువ భాగం సముద్ర పక్షులు ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థను నాశనం చేసి మరణానికి దారి తీస్తున్నట్టు తేల్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న పక్షులు చూడ్డానికి ఆరోగ్యంగా కనిపించినా తక్కువ కాలంలోనే జీర్ణ వ్యవస్థ పనిచేయక చనిపోతున్నట్టు నేచురల్ హిస్టరీ మ్యూజియం జీవశాస్త్రవేత్త అలెక్స్ బాండ్ ప్రకటించారు. తరుణోపాయం ఇదొక్కటే ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం భవిష్యత్లో మరింత ప్రమాదకారిగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)–2022 నివేదిక ప్రకారం మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నట్టు తేలింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన 10 బిలియన్ టన్నుల ప్లాస్టిక్లో దాదాపు 6 బిలియన్ టన్నులు భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నట్టు తేల్చారు. సాధ్యమైన మేర ప్లాస్టిక్ను వాడకపోవడమే ఉత్తమమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కట్లర్లు, స్ట్రాలు, బెలూన్ స్టిక్స్, కాటన్ బడ్స్ను పూర్తిగా నిషేధించాయి. గతేడాది 175 దేశాలు 2024 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశంలో సైతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించారు. అయినప్పటికీ మార్కెట్లో దాని వినియోగం మాత్రం తగ్గలేదు. ప్లాస్టికోసిస్ అంటే.. పక్షులు ఆహారంగా భావించి తింటున్న ప్లాస్టిక్ వాటి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరిస్తోంది. ఇది పక్షి కడుపులోని గ్రంథులను, జీర్ణ ప్రక్రియను నాశనం చేసి మరణానికి చేరువ చేస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మొత్తం ప్రక్రియకు ‘ప్లాస్టికోసిస్’గా పేరు పెట్టారు. హవాయి ద్వీపంలోని అల్బట్రాస్ పక్షులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు తిని మరణిస్తున్నాయని, ఏటా 2.50 లక్షల అల్బట్రాస్ పక్షి పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నాయని గుర్తించారు. ఈ తరహా లక్షణాలు చాలా సముద్ర జంతువులు, జీవుల్లో కూడా కనిపించాయని పేర్కొన్నారు. ప్లాస్టికోసిస్ లక్షణాలు మానవుల్లోనూ కనిపించాయని, ఇటీవల ఆ్రస్టేలియాలో 52 మంది ప్రేగుల్లో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆకలి మందగించడంతో పాటు ఇతర పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించి మరణానికి దారితీయవచ్చని చెబుతున్నారు. 1,200కు పైగా జీవుల ఉనికి ప్రశ్నార్థకం లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి వెళ్లిన శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాకు 600 మైళ్ల దూరంలోని లార్డ్హోవ్ ద్వీపంలో పక్షుల మరణాలపై అధ్యయనం చేపట్టింది. అక్కడ డజన్లకొద్దీ చనిపోయి పడి ఉన్న బ్రౌన్ సీగల్స్ పక్షుల కళేబరాలను ల్యాబ్లో పరీక్షించి ఒక్కో పక్షి కడుపులో దాదాపు 200కు పైగా ప్లాస్టిక్ ముక్కలను వెలికితీశారు. ఈ తరహా ప్లాస్టిక్ ముక్కలు కేవలం సముద్ర పక్షులనే కాకుండా దాదాపు 1200కు పైగా సముద్ర జీవుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి 5 మి.మీ. కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు రెండేళ్ల క్రితం ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. కానీ.. బయట వాతావరణంలో ఇలాంటి జబ్బును లార్డ్ హోవ్ ద్వీపంలోనే మొదటిసారి గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. పైగా.. జీవించి ఉన్న చాలా పక్షులు బరువు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వాస్తవానికి 2010లోనే ఈ పక్షులు తక్కువ బరువు ఉన్నట్టు గుర్తించినా కారణాలను మాత్రం అంచనా వేయలేకపోయారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిశోధనల ప్రకారం వాటి కడుపులోని ప్లాస్టిక్ ముక్కలు జీర్ణం కాకపోవడం వల్లనే అవి ఆహారం తీసుకోవడం లేదని, ఫలితంగా రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నట్టు గుర్తించారు. -
పేపర్ కప్పుల్లో వేడివేడి టీ, కాఫీ? ఈ విషయం తెలిస్తే మళ్లీ అలా చేయరు..!
సాక్షి, అమరావతి: ‘పేపర్ కప్పుల్లో వేడివేడి టీ, కాఫీ, సూప్లు తీసుకుంటే హానికరం’ అని ఇటీవల సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీనిని కొందరు కొట్టిపారేస్తుంటే మరికొందరు గాజు, స్టీలు, పింగాణీ పాత్రలే ముద్దంటున్నారు. మన దేశంలో ఏటా 22 బిలియన్ (2,200 కోట్లు) పేపర్ కప్పులను వాడుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజానిజాల్లోకి వెళితే.. కాఫీలు, టీలు తాగేందుకు ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో పేపర్ కప్పుల వాడకం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో 70 – 80 డిగ్రీల వేడిగల ద్రవాలు, పదార్థాలు పేపర్ కప్పుల్లో పోసినప్పుడు దాని లోపల అతికించేందుకు పూత పూసిన ‘మైక్రోప్లాస్టిక్’ పొర కరిగిపోయి ద్రవాలతో కలిసిపోతున్నట్టు ఖరగ్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ సుధా గోయెల్ బృందం వెల్లడించింది. ఆ వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్తో పరిశీలించగా 15 నిమిషాల్లో గ్లాసులోని మైక్రో ప్లాస్టిక్ పొర కరిగిపోయినట్లు గుర్తించారు. 100 ఎంఎల్ గ్లాసులోని పొర 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలను విడుదల చేసింది. ఈ పొరలో ప్లాస్టిక్ అయాన్లు, జింక్, మాంగనీస్, నికెల్, కాపర్, లెడ్, కాడ్మియం, క్రోమియం, పల్లాడియం లాంటి భార లోహాలను గుర్తించారు. మైక్రోప్లాస్టిక్ కణాలతో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కాకపోయినా, దీర్ఘకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, వివిధ అవయవాలకు పక్షవాతం సోకడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బ తినడం లాంటి దు్రష్ఫభావాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 15 నిమిషాల్లో 25 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నపుడు.. నాలుగైదు నిమి షాల్లో తాగేస్తే పోలా! అన్న వారూ ఉ న్నారు. అలా చేస్తే పెద్దగా హాని ఉండకపోవచ్చు కానీ, ఎంతో కొంత మేర మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయన్నది వాస్తవం. భారత్లో రెట్టింపు వేగంతో.. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ ఐమార్క్ గ్రూప్ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచ వ్యాప్తంగా 263.80 బిలియన్ల పేపర్ కప్పులు వినియోగించారు. 2028 నాటికి ఇది 283.22 బిలియన్లకు చేరుతుందని అంచనా. 2022లో మన దేశంలో 22 బిలియన్ పేపర్ కప్పులు వినియోగించగా 2028 నాటికి 25.7 బిలియన్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం ఏటా 1.11 శాతం పెరుగుతుండగా భారత్లో పెరుగుదల 2.5 శాతంగా ఉంది. పునరుత్పత్తి వ్యవస్థకు చేటు నిత్యం పేపర్ కప్పుల్లో వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. వాటిల్లోని మైక్రోప్లాస్టిక్ పొర కరిగిపోయి ద్రవాలతోపాటు శరీరంలోకి చేరుతుంది. మైక్రోప్లాస్టిక్ పునరుత్పత్తి వ్యవస్థకు చేటు చేస్తుంది. – డాక్టర్ భరణి ధరణ్, ఎన్ఐటీ–ఏపీఅసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ విభాగం హెచ్వోడీ నరాలపై దుష్ప్రభావం చాలా స్వల్ప పరిమాణంలో ఉండే మైక్రో ప్లాస్టిక్ కణాలు నరాలు, రక్తం ద్వారా ప్రయాణించి శరీర భాగాల్లోకి చేరుతాయి. అలా చేరే క్రమంలో అవి ఎక్కడో ఒకచోట పేరుకుపోవడంతో ఆ అవయవం దెబ్బ తింటుంది. నరాల వ్యవస్థను దెబ్బతీసి పక్షవాతానికి కారణమయ్యేలా చేస్తుంది. పురుషుల్లో వంధ్యత్వ సమస్యలకు ఇవి కూడా ఒక కారణం. – డాక్టర్ కంచర్ల సుధాకర్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, విజయవాడ. -
పర్యావరణమే ప్రాణం!
పర్యావరణ పరిరక్షణ కోసం నల్లగొండ పట్టణానికి చెందిన మిట్టపల్లి సురేశ్ గుప్తా విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి, కుటుంబాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి క్షణం పని చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు లేచి, మార్కెట్కు వెళ్లి, అక్కడ ప్లాస్టిక్ కవర్లతో ఎవరు ఎదురుపడినా, వారికి ఓ జూట్ బ్యాగ్/క్లాత్ సంచి ఇవ్వడంతో ఆయన దిన చర్య ప్రారంభం అవుతుంది. ఇక పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వారిని శాలువాతో సత్కరించడం ఆయన ప్రత్యేకత. అంతేకాదు భూగర్భ జలాల పెంపునకు సొంతంగా ఇంకుడు గుంతలు తవ్వించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గుప్తా పని చేస్తున్నారు. తాను కూడా చేనేత బనియన్, దోవతి ధరించడం ప్రారంభించారు. ఇవన్నీ చేస్తున్న ఆయనేం కోటీశ్వరుడు కాదు. ఉద్యోగాలు చేయగా వచ్చిన డబ్బునంతా లక్ష్యం కోసమే ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను భార్యకు అప్పగించి.. దాతలను వెతికి, సమయానికి దొరక్కపోతే అప్పు చేసి మరీ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మలుపు తిప్పిన సంఘటన 2008లో ఒక ఆవు చెత్త కుప్పలో వేసిన ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్ కవర్లను తినడం గుప్తా చూశారు. ఆ ఆవుకు ఆపరేషన్ చేసినప్పుడు కడుపు నిండా ప్లాస్టిక్ కవర్లు ఉండటం చూసి చలించిపోయారు. ప్లాస్టిక్ వల్ల జీవరాశికి ప్రమాదం పొంచి ఉందని అప్పుడే గ్రహించారు. దాని వాడకాన్ని తాను నిషేధించలేను కాబట్టి కనీసం వినియోగాన్ని అయినా తగ్గించేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరిగినా, పండుగలు జరిగినా అక్కడికి వెళ్లి ప్లాస్టిక్ను వాడొద్దని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఉద్యోగాన్ని వదిలేసి.. 1999లో నల్లగొండలో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న సురేశ్ గుప్తా వద్దకు ఏపీఆర్ఎల్పీ ప్రాజెక్టు ఉద్యోగులు వస్తుండేవారు. తర్వాత తమ ప్రాజెక్టులో పని చేసేవారు కావాలని వారు గుప్తాను తీసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం హైదరాబాద్కు రావాలని చెప్పడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత నల్లగొండలోనే ఒకటి రెండు ఉద్యోగాలతో పాటు 2013 నుంచి 2017 వరుకునల్లగొండ సుధా బ్యాంకు మేనేజర్గా పని చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తూనే ఈ ఉద్యోగాలన్నీ చేశారు. అయితే తాను చేస్తున్నది సరిపోదని, ఈ దిశగా మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిగా పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేశారు. నీటి పరిరక్షణపైనా శ్రద్ధ ఓసారి ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. వర్షపు నీరు వృథాగా పోతుండటాన్ని గమనించి సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. భవిష్యత్ అవసరాలకు నీటిని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు జీవనోపాధి కరువైన చేనేత కార్మికులను ఆదుకోవాలని, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో పని చేయడం ప్రారంభించారు. ఇందుకు తానే ఓ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్లేటు, గ్లాసు సంచిలోనే.. ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ పర్యావరణంపై ప్రచారం చేసేందుకు మోటారు సైకిల్ వాడక తప్పడం లేదు. అది వెలువరించే పొగతో వాతావరణం కలుషితం అవుతోంది. అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నా. చెప్పులు లేకుండా తిరగాలని నిర్ణయించుకున్నా. ఇక నేను తినే ప్లేటు, నా గ్లాసు నా సంచిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా నా ప్లేట్లోనే భోజనం చేస్తా. పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పని చేస్తా. – మిట్టపల్లి సురేశ్ గుప్తా షాక్ తగిలినా..కోలుకుని.. సురేశ్ గుప్తా తన కుటుంబ బాధ్యతను పూర్తిగా గెస్ట్ లెక్చరర్గా పనిచేసే తన భార్య కల్పనపైనే మోపారు. ఆ విధంగా దొరుకుతున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, తనకు ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్లిపోయేంత ప్రేమికుడిగా మారిపోయారు. అయితే 2018 మే 22వ తేదీన రోజున జరిగిన ఓ సంఘటన తన కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తుతుందని ఆయన ఊహించలేదు. వార్షిక పరీక్షల చివరి రోజు కావడంతో ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కుమారుడు ప్రణీత్ను తీసుకువచ్చేందుకు హైదరాబాద్కు బయలుదేరిన గుప్తా.. అతని వద్దకు వెళ్లకుండా స్థానికంగా వరల్డ్ ఎర్త్ డే కార్యక్రమం వద్దే ఆగిపోయారు. అదే సమయంలో కొడుక్కి యాక్సిడెంట్ అయిందని, చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి గుప్తాతో పాటు కుటుంబానికి చాలా రోజులు పట్టింది. -
'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి'.. దెబ్బకు 15 రోజుల్లోనే..
ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ఆలోచనతో జస్ట్ 15 రోజుల్లోనే ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారి ఆ ఊరు ఆదర్శంగా నిలిచింది. అతను అమలు చేసిన ఆ ఆలోచన త్వరితగతిన చక్కటి ఫలితం ఇవ్వడమేగాక ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది. వివరాల్లోకెళ్తే.. కాశీర్మర్లోని సదివార పంచాయితీ పర్యావరణ పరిరక్షణ చొరవలో భాగంగా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్, వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఫరూక్ అహ్మద్ 'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి' అనే నినాదంతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పథకం కింద ఎవరైనా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ఇస్తే వారికి పంచాయితీ బంగారు నాణేలను అందజేస్తోంది. దీన్ని ఆ ఊరి గ్రామపెద్దలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా బాగా ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభించిన 15 రోజుల్లోనే ఊరంతా స్వచ్ఛంగా మారింది. అంతేగాక అధికారులు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించడం విశేషం. ఈ నినాదం ప్రజాదరణ పొందడమే గాక అందరిచే ప్రశంసలందుకుంది. ఇతర గ్రామ పంచాయితీలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సర్పంచ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. మా గ్రామంలోని వాగులు, నదులు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొచ్చాను. దీంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోగలిగారు. అలాగే రోడ్డు, వీధుల్లో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ని పడేసిన గ్రామం ఇప్పుడూ పూర్తిగా క్లీన్గా ఉంది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవడమే గాక ప్రభుత్వం కూడా దీన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ పథకం కాకపోయినా ప్రజలంతా ఆసక్తిగా ముందుకు వచ్చి మరీ ప్లాస్టిక్ సేకరించారని అనంత్నాగ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నారు. కాగా, ఈ గ్రామం దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని హిల్లర్ షహాబాద్ బ్లాక్లో ఉంది. (చదవండి: స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయ్..స్పీడ్ పెంచేయడంతో..) -
ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ ఇంట్లోనే మొదలవ్వాలి
మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్యాకింగ్ మెటీరియల్లో మూడింట రెండు వంతులు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికే ఖర్చవుతోంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్లో పేపర్, పేపర్ బోర్డ్, కార్డ్బోర్డ్, వ్యాక్స్, ఉడ్, ప్లాస్టిక్లు, మోనో కార్టన్లు... ఇంకా రకరకాలవి ఉపయోగిస్తారు. మిగిలిన అన్నిటికన్నా ప్యాకింగ్ మెటీరియల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ శాతం తక్కువే. కానీ మట్టిలో కలిసిపోకుండా పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతూన్న ప్లాస్టిక్ తోనే సమస్య. క్లైమేట్ చేంజ్, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల మీద చర్చించిన ఐక్యరాజ్య సమితి... నదులు, సముద్రాలను ముంచెత్తుతోన్న కాలుష్యాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న ఈ సమస్యకు మన వంతుగా చెక్ పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూద్దాం. ఫ్యామిలీ ఆడిట్ ప్యాకింగ్ మెటీరియల్ని తిరిగి ఉపయోగించడం పట్ల శ్రద్ధ చూపించకపోవడం కూడా ప్రధానమైన కారణం. ‘స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో ఒక్కశాతం కంటే ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ చెత్త లోకి వెళ్లదు. అంటే అక్కడ 99 శాతం మళ్లీ వాడకంలోకి వస్తోంది. అదే మనదేశంలో రీయూజ్ 22 శాతానికి మించడం లేద’ని బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త నరేశ్ హెగ్డే చెప్పా రు. ‘‘మన దేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఉదయంపాలప్యాకెట్తో మొదలయ్యే ప్యాకింగ్ అవసరం రాత్రి పడుకునే ముందు ఇంటి బయట పెట్టే చెత్త కవర్ల వరకు సగటున రెండు నుంచి మూడు కిలోల ప్యాకింగ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. ఫుడ్ ఆర్డర్ల ద్వారా వచ్చే ప్యాకెట్లది సింహభాగం. ఈ సమస్య సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ. కానీ ఈ విషయంలో ప్రతి కుటుంబం ఆడిట్ చేసుకోవాలి. వ్యర్థాల ఉత్పత్తిని ఎంత మేర నిలువరించవచ్చు అని విశ్లేషించుకుని అమలు చేయాలి’’ అని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. రీ యూజ్ ‘‘మనం ఇప్పుడిప్పుడు ఇళ్లలో తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేయడం వరకు అలవరుచుకుంటున్నాం. ఇకపై ఈ రెండింటితోపాటు రీ యూజబుల్ మెటీరియల్ను వేరు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఒకసారి వాడిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ దఫాలు వాడడం ఒక సూచన. ఇక కొన్నింటిని వాడిపారేయాల్సిందే, తిరిగి వాడడానికి వీలుకాదు. ఉదాహరణకు షాంపూ ప్యాకెట్లు, కాస్మటిక్ ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి. చైతన్యం ఉన్నప్పటికీ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం ఒక కారణం. ప్లాస్టిక్ని సరైన విధానంలో రీ సైకిల్ చేయడం, పరిహరించడం మనకు మనంగా చేయగలిగిన పని కాదు. తయారు చేసిన కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని పలు సందర్భాల్లో సూచించాం. ఇదెలాగంటే... సౌందర్యసాధనాలు, షాంపూ, వాషింగ్పౌ డర్, క్లీనింగ్ ఉత్పత్తులను వాడేసిన తర్వాత ప్యాకెట్లను ఏ దుకాణంలో కొన్నామో అదే దుకాణంలో తిరిగి డిపాజిట్ చేయడం అన్నమాట. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి కిరాణా దుకాణం వరకు సరఫరా అయినట్లే ఖాళీ ప్యాకెట్లు కూడా సప్లయ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా తయారీ స్థానానికి తిరిగి చేరాలి. ఈ నియమాన్నిపాటించగలిగితే ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయవచ్చు’’ అంటారు పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. నిజానికి భారతీయుల జీవనశైలిలో సింగిల్ యూజ్ కంటే ముందు రీ యూజ్ ఉండేది.పాళీతో రాసే ఇంకు పెన్నుల నుంచి కాటన్ చేతి సంచీ వరకు ప్రతి వనరునీ వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించేవాళ్లం. యూజ్ అండ్ త్రో, సింగిల్ యూజ్ మాటలుపాశ్చాత్యదేశాల నుంచి నేర్చుకున్న అపభ్రంశమే. కానీ ఇప్పుడు ఆయా దేశాలు రీ యూజ్ వైపు మరలుతూ ఇండియాను వేలెత్తి చూపిస్తున్నాయి. మనం వీలైనంత త్వరగా మనదైన రీ యూజ్ విధానాన్ని తిరిగి మొదలుపెడదాం. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే అది పర్యావరణ సమతుల్యత సాధనలో తొలి అడుగు అవుతుంది. ప్రత్యామ్నాయాలున్నాయి! ► బర్త్డేపార్టీలో ధర్మాకోల్ బాల్స్, ప్లాస్టిక్ చమ్కీలను వాడుతుంటారు. అవి లేకుండా వేడుకను ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ► పెళ్ళిళ్లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చేసుకోవాలి. ► ఇంట్లో ప్లాస్టిక్ని అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరిగా రీయూజ్ చేయాలనే నియమాలను పెట్టుకోవాలి. ఆ నినాదాన్ని ఇంటి గోడ మీద రాసుకుంటే మనల్ని చూసి మరికొంత మంది ప్రభావితమవుతారు. ► పేపర్ బ్యాగ్, కాటన్ బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారవుతున్న క్యారీ బ్యాగ్ల వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు. – వాకా మంజులారెడ్డి -
రీసైకిల్ ప్లాస్టిక్ తో నోకియా ఫోన్లు తయారీ
-
పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకున్న నోకియా
-
పర్యావరణంలో మీ పాత్ర?
పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం మీరు ఏమి చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ మీకు సరైన సమాధానం రాకపోతే ఈ కింద చెప్పుకున్న పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. ♦ ఈ పర్యావరణంలో జంతువులు, పక్షులు కూడా భాగమే కాబట్టి వాటికోసం ఆవాసాలు, చెట్ల మీద గూళ్లు ఏర్పాటు చేయడం. ♦ జల, మృత్తికా కాలుష్యాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం. ♦ పాతవస్తువుల పునర్వినియోగం గురించి పిల్లలకు తెలియజేయటం. ♦ వీధులు,పార్కులు, ఇతర ప్రదేశాల్లో వ్యర్థాలను తీసిపారేయటం. ♦ వీలైతే పర్యావరణ భద్రత గురించిపాటలు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనన్ని మొక్కలను నాటటం, నాటించటం. ♦ భూమిని, సహజవనరులను కాపాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవంగానే భావించడం, అలా భావించాల్సిందిగా మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం. ♦ మన భూమి భవిష్యత్తు రేపటి పౌరులైన పిల్లల చేతిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని, సహజవనరులను కాపాడాల్సిన బాధ్యతను గురించి వారికి తెలియజేసేందుకుపాఠశాలలో వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ♦ స్వచ్ఛత, కాలుష్యనివారణ, పర్యావరణం తదితర అంశాలకు సంబం ధించి కృషి చేస్తున్నవారిని, వాటికోసం ఎంతగానోపాటుపడుతున్నవారిని సత్కరించడం వల్ల ఇతరులు సైతం స్ఫూర్తిపొందే అవకాశముంది. ♦ పర్యావరణ హితం కోసం మన చుట్టుపక్కల చేపడుతున్న, జరుగుతున్న కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వీటి గురించి మీ మీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేందుకు మీరే సమాచార సారథిగా మారడం. ఇతరులకు ప్రేరణ అందించడం. -
ప్లాస్టిక్ కవర్లలో వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా?
ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్కు వెళ్లి చికెన్ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్గా మారే ప్రక్రియలో 30% వేస్ట్గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్ వేస్టేజ్ను ఏం చేస్తున్నారు? వేడి వేడి చాయ్ని ప్లాస్టిక్ కవర్లలో మనకు నీట్గా ప్లాస్టిక్ కవర్లలో చికెన్ ప్యాక్ చేసిస్తారు సరే, వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్ దగ్గర హోటల్ ఉంది. కర్రీ ప్యాకింగ్ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్ని ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా? తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు. ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్ విప్పిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్ సింబల్ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది? కడుపులో కుక్కేయాలా? మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్ హాల్. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు. అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా? మిగిలిపోతోంది చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్ నొక్కగానే వస్తున్నాయి. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి జంక్ఫుడ్ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది. నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ? అప్పటి నుంచి విప్లవం మన సైన్స్ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది. 200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు. ఇంకెన్నాళ్లో ఉండదు ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు. అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి. -శ్రీనాథ్ గొల్లపల్లి చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే? -
ప్లాస్టిక్ నిజాలు
ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది. ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు. ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్ ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ! -
ప్లాస్టిక్ భవంతి
ప్లాస్టిక్ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో రీసైక్లింగ్ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది. అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్ హువాంగ్ అనే డిజైనర్ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తైవాన్లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది. ఇస్మాయిల్ -
ఇంట్లోనే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే అదిరిపోయే గాడ్జెట్స్.. ధర ఎంతంటే?
పర్యావరణానికి అతిపెద్ద బెడద ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ చెత్త సమస్య పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వాటిలో భాగమే ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఇప్పటివరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ భారీగా పారిశ్రామిక స్థాయిలోనే అరకొరగా జరుగుతోంది. అయితే, ఇంటిపట్టునే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యంత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ బహుళజాతి సంస్థ ‘క్లియర్డ్రాప్’ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసే ‘సాఫ్ట్ ప్లాస్టిక్ కాంపాక్టర్’ను రూపొందించింది. వాషింగ్ మెషిన్లా కనిపించే ఈ యంత్రంలో ప్లాస్టిక్ సంచులు వంటి మెత్తని ప్లాస్టిక్ చెత్తను పడేసి, స్విచాన్ చేస్తే, నిమిషాల్లోనే రీసైక్లింగ్కు పనికొచ్చే ఇటుకలుగా తయారు చేస్తుంది. ఈ యంత్రం పనిచేసేటప్పుడు ఎలాంటి పొగ వెలువడదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తయారీదారులు చెబుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. -
Andhra Pradesh: ‘ప్లాస్టిక్’పై నిషేధం పక్కాగా అమలు
సాక్షి, అమరావతి: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసింది. నిషేధించిన ప్లాస్టిక్ సంచుల తయారీదారులు, స్టాకిస్టులు, వినియోగదారులపై చర్యలు చేపడుతోంది. 75 మైక్రాన్లు, అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను గతేడాది జూలై నుంచి ప్రభుత్వం నిషేధించింది. దీనిపై తయారీదార్లు, స్టాకిస్టులకు ముందుగానే కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తయారీదార్ల విజ్ఞప్తి మేరకు గత డిసెంబర్ 31 వరకు 75 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచుల వాడకానికి అనుమతించారు. అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్పై నిషేధాన్ని కొనసాగించారు. గతేడాది జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల్లో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 964 బృందాలు 39,242 చోట్ల తనిఖీ చేశాయి. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను నిల్వ చేసిన వ్యాపారుల నుంచి 117.57 టన్నుల సరుకును సీజ్ చేశారు. స్టాకిస్టులు, వాడకందారుల నుంచి రూ.1.80 కోట్లు జరిమానాగా వసూలు చేశాయి. పర్యావరణానికి హానికలిగించే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ చెత్తను తగులబెట్టిన వారి నుంచి అధికారులు రూ.6,53,643 జరిమానా వసూలు చేశారు. ఇకపై 120 మైక్రాన్ల సంచులకే అనుమతి గత ఏడాది డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ వాడకంపై కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తయారీ నుంచి వాడకం వరకు అన్ని స్థాయిల్లోనూ పునర్వినియోగానికి అనువైన 120 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచులకే అనుమతినిచ్చింది. అంతకంటే తక్కువ మందం ఉంటే తయారీ, అమ్మకంతో పాటు వాడకంపైనా భారీ జరిమానాలు విధించేందుకు కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లోని ప్లాసిŠట్క్ తయారీ సంస్థల నుంచి వచ్చే సరకు లెక్కలున్నాయి, యూపీ, బిహార్ నుంచి అనుమతి లేకుండా వస్తున్న దిగుమతులపై అధికారులు నిఘా పెట్టారు. వ్యాపారులు, నిల్వదారులు ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులను ఉంచుకుంటే భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు. -
ప్లాస్టిక్ డ్రమ్ములో యువతి శవం
బెంగళూరు: యువతిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి పైన క్లాత్తో మూత బిగించి రైల్వే స్టేషన్లో దుండగులు వదిలివెళ్లిన దారుణమైన ఘటన ఐటీ సిటీ బెంగళూరులోని యశవంతపుర రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... గూడ్స్ రైలు ప్లాట్ ఫాం వద్ద ఒక నీలి డ్రమ్ము, దాని మూత చుట్టూ బట్ట కట్టి ఉంది. మూడు రోజులుగా నిలిచి ఉన్న గూడ్స్ వెళ్లిపోవడంతో డ్రమ్ము బయటకు కనిపించింది. అందులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్వీపర్ జయమ్మ రైల్వే పోలీసులకు తెలియజేసింది. వారు వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. మృతదేహం గొంతుకు తెల్లటి దుపట్టా చుట్టి ఉంది. ముఖమంతా గుర్తుపట్టలేకుండా ఉంది. మూడు నాలుగు రోజుల కిందటే ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. యువతి రూపురేఖలను బట్టి విద్యావంతురాలై ఉంటుందని, ఎక్కడో చంపి, డ్రమ్ములో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో ఎవరైనా దుండగులు ఆమెను అపహరించి హత్య చేసి ఉంటారనే సందేహాలూ వినిపిస్తున్నాయి. చదవండి: (అయోధ్య రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా కీలక ప్రకటన) -
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లకు చెక్.. అమల్లోకి నిషేధం
సాక్షి, అమరావతి: ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు 75 మైక్రాన్ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇకపై పునర్ వినియోగానికి అవకాశమున్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణను వార్డు శానిటేషన్ కార్యదర్శులు చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో తనిఖీలు చేయనున్నాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
పర్యావరణ స్నేహిత.. స్నేహాషాహీ
ఆమె పేరు స్నేహాషాహీ. పర్యావరణంతో స్నేహం చేసింది. పర్యావరణ రక్షణను చదివింది. నీటి చుక్క... మీద పరిశోధన చేస్తోంది. నీటి విలువ తెలుసుకుని జీవించమంటోంది. ఇన్ని చేస్తున్న ఆమెను యూఎన్ గుర్తించింది. ఇటీవల ‘యూత్ ఫర్ ఎర్త్’ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా ఆమె గురించి. స్నేహాషాహీకి 28 ఏళ్లు. ఎం.ఏ. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కోసం 2019లో బరోడాలోని మహారాజా షాయాజీరావ్ యూనివర్సిటీలో చేరింది. పర్యావరణ పరిరక్షణను ప్రాక్టికల్గా చేసి చూపించడం కూడా అప్పుడే మొదలు పెట్టిందామె. క్రియాశీలకంగా పని చేయడానికి ముందుకు వచ్చిన మరో మూడు వందల మంది విద్యార్థులను కూడా చేర్పించింది. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన ప్రచారంలో ఆ యూనివర్సిటీ క్యాంపస్లోని స్టూడెంట్స్ అందరినీ భాగస్వాములను చేసింది. అందరూ కలిసి క్యాంపస్లో ప్రవహిస్తున్న కాలువను శుభ్రం చేసే పని మొదలు పెట్టారు. అది సహజమైన కాలువ, అందులో అనేక ప్రాణులు నివసిస్తుంటాయి. అలాంటి వాటర్ బాడీ మనుషుల బాధ్యతరాహిత్యం వల్ల మొత్తం ΄్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకు పోయింది. స్టూడెంట్స్ అంతా కలిసి బయటకు తీసిన చెత్త ఎంతో ఊహించగలరా? ఏడు వందల కేజీలు. ఆ తర్వాత వర్షాలకు ఆ కాలువ పూర్వపు వైభవాన్ని సంతరించుకుని తాబేళ్లు, మొసళ్లకు ఆలవాలం అయింది. వ్యర్థాల ప్రదర్శన కాలువ నుంచి తీసిన థర్మోకోల్ షీట్లు, గాజు సీసాలు, మైక్రో ΄్లాస్టిక్ వ్యర్థాలను వాల్ హ్యాంగింగ్లు, పూల కుండీలుగా రీ సైకిల్ చేసి క్యాంపస్లోనే ప్రదర్శనకు ఉంచారు. ఒకసారి కాలువను శుభ్రం చేయడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చినట్లు కాదు, ఇకపై కూడా ఇలాంటివేవీ కాలువలో కనిపించకూడదనే సందేశం ఇవ్వడానికే ఈ పని చేశారు వాళ్లు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేసిన స్నేహ, ఆమె బృందం ‘యూత్ ఫర్ ఎర్త్’ అవార్డుకు ఎంపికయ్యారు. స్నేహ ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మనకందరికీ చెత్తను అలవోకగా ఏదో ఒక వైపుకు విసిరేయడం బాగా అలవాటై ΄ోయింది. చాక్లెట్ ర్యాపర్ని రోడ్డు మీద వేయడానికి సందేహించే వాళ్లు కూడా నీటి కాలువ కనిపిస్తే మరో ఆలోచన లేకుండా అందులోకి విసిరేస్తారు. నిజానికి ఆ పని రోడ్డు మీద వేయడం కంటే ఇది ఇంకా ప్రమాదకరం. మా క్యాంపస్లో చెత్తను తొలగించడానికి ముందు కొద్ది నెలల ΄ాటు చెత్తను ఇష్టానుసారంగా పారేయవద్దని ప్రచారం మొదలు పెట్టాం. ఆ మేరకు బాగానే చైతన్యవంతం చేయగలిగాం. నిజానికి కాలువను శుభ్రం చేయడానికంటే చైతన్యవంతం చేయడమే అదే పెద్ద టాస్క్. అయితే అందరూ యూత్, చదువుకుంటున్న వాళ్లు, మంచి మార్పుని స్వాగతించడానికి సిద్ధంగా ఉండే వాళ్లే కావడంతో మొత్తానికి మా ప్రయత్నం విజయవంతమైంది. ఆ తర్వాత క్యాంపస్ బయట నివసిస్తే స్థానికుల్లో కూడా మార్పు తీసుకు రాగలిగాం. క్లీనింగ్ మొదలుపెట్టిన తర్వాత క్యాంపస్లో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేశారు. మేము మొదలు పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇప్పుడు మా జూనియర్ బ్యాచ్లు కొనసాగిస్తున్నాయి. బరోడా వాసులు ఎంతగా చైతన్యవంతం అయ్యారంటే... ఎవరైనా చేతిలోని ప్లాస్టిక్ కవర్ని నిర్లక్ష్యంగా రోడ్డుమీద కానీ కాలువల్లో కానీ విసిరేస్తుంటే చూస్తూ ఊరుకోవడం లేదు. ‘ఇది ఏం పని? పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిద్దాం’ అని గుర్తు చేస్తున్నారు’’ అని చెప్పింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1972లో ప్రారంభమైంది. ఈ విభాగం భూగోళాన్ని ప్లాస్టిక్ రహితం గా మార్చడం కోసం పని చేస్తోంది. ఇందుకోసం 25 దేశాల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది యువతను భాగస్వాములను చేసింది. అందులో భాగంగానే స్నేహ ఈ గుర్తింపును, గౌరవాన్ని అందింది. ఇప్పుడామె బెంగళూరులో ఎక్స్ట్రీమ్ హైడ్రోలాజికల్ ఈవెంట్స్లో పీహెచ్డీ చేస్తోంది. ‘‘చిన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలను చూశాను. రక్షిత మంచినీటి సౌకర్యం లేకపోవడంతో వాళ్లు వీథిలో బోరు నీటినే తాగుతున్నారు. అప్పటినుంచి నాకు తెలియకుండానే నీటి గురించి శ్రద్ధ మొదలైంది. ఎవరైనా నీటి కష్టాలు తెలియకుండా పెరిగారంటే నా దృష్టిలో వాళ్లు విశేషాధికారాలు, సౌకర్యాలతో పెరిగినట్లే. నీటి ఎద్దడి కారణంగా కిలోమీటర్ల దూరం నుంచి నీటిని మోసుకునే జీవితాలెన్నో. ఒకవేళ నీరు ఉన్నప్పటికీ అది కలుషితమైన నీరు అయితే ఆ బాధలు వర్ణనాతీతం. అందుకే నీటి వనరులను కా΄ాడుకుందాం. రేపటి రక్షణ కోసం నేడు కొద్దిగా శ్రమిద్దాం’’ అని చెస్తోంది స్నేహాషాహీ. -
విశాఖలోని డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు
-
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్
మధురవాడ (భీమిలి): నగరంలోని మధురవాడ జోన్–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్లు, ఎన్జీవోలు, పలు సంస్థలు సహాయ సహకారాలతో ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి రోటరీ ఫౌండేషన్, ఆమెరికాలోని నేపర్ విల్లే, సన్రైజ్, అరోరా, డారియన్, బ్రాడ్లీబోర్బోనైస్, ఓక్ పార్క్ రివర్ ఫారెస్ట్, సోనోమా వ్యాలీ రోటరీ క్లబ్ సహకారం, భారతీ తీర్థ, నార్త్ సౌత్ ఫౌండేషన్ వంటి ప్రభుత్వేతర సంస్థలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్, విహాన్ కియా వంటి సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులు సమకూర్చాయి. ఈ ప్రాజెక్టు ఇండియా యూత్ ఫర్ సొసైటీ (ఐవైఎఫ్ఎస్) వంటి పర్యావరణ పరిరక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఎన్జీవో ద్వారా అమలు చేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ను సేకరించి రోజుకు రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒక కిలోకి 60–70 బాటిల్స్ ఉంటాయన్నారు. ఈ వ్యర్థాలతో టూత్ బ్రష్లు, దువ్వెనలు, ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి తాజాగా మొయినాబాద్ సహకారంతో ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థ రహిత విశాఖగా మారే అవకాశం ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోటరీ 7 ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు అమెరికా, ఇండియాలతో రోటరీ ప్రతినిధులు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ విజయవంతమైతే ప్రపంచంలో మరిన్ని చోట్ల ఆయా రోటరీ క్లబ్లతో కలసి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. పూర్వ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ మెహతా మాట్లాడుతూ రోటరీ గ్లోబల్ గ్రాంట్తో ఇండియా,అమెరికా క్లబ్ కలిసి పనిచేశాయన్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినా బాద్ ప్రెసిడెంట్ పతాంజలి రామ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇక్కడ బాటిల్ రీసైక్లింగ్ చేస్తుందని, భవిష్యత్లో మరిన్ని నిధులు వెచ్చించి వేరే రకాల ప్లాస్టిక్ కూడా రీసైక్లింగ్ చేసేవిధంగా రూపకల్పన చేస్తామన్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ రఘనాథన్ కన్నన్ మాట్లాడుతూ వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేసే విదంగా ఈ ప్రాజెక్టులు డిజైన్, ప్లానింగ్ చేశామన్నారు. అలాగే యువత కూడా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగించిన అనంతరం సక్రమంగా డస్ట్బిన్స్లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ నీరజ్ జెల్లి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సునీల్ వడ్లమాని, సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ ఉదయ్ పిలానీ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అంజు బ్రిజేష్, రోటరీ క్లబ్ అమెరికా ప్రతినిధి శ్రీ నమశ్శివాయం, రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ ప్రతినిధి రవీంధ్ర నాథ్ డొక్కా తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ ప్రయత్నాలు
-
ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!
దంపతులకు పిల్లలు లేకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. నలుగురిలోనూ ఇబ్బందిగా ఉండి ఎక్కడికి వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అచ్చం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఒక మహిళ ఆ బాధ నుంచి తప్పించుకునే క్రమంలో ఆడిన నాటకమే ఆమెను పట్టుబడేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...40 ఏళ్ల మాహిళ పెళ్లై 18 ఏళ్లు అయినా పిల్లలు లేరు. చుట్టుపక్కల సూటిపోటీ మాటలకు బాధపడి తాను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది. ఈ మేరకు ఆమె ప్రతి నెల స్థానిక ఆస్పత్రిలో చెకప్ చేయించుకునేందుకు వెళ్తుండేది. ఆ తర్వాత ఒకరోజు కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పి హడావిడి చేసి...నెలలు నిండకుండా బిడ్డ పుట్టిందంటూ ఒక ప్లాస్టిక్ బొమ్మను చూపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి చెకప్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న వైద్యులు చెక్ చేసి ఇది బిడ్డ కాదని ఒక ప్లాస్టిక్ బొమ్మ అని తేల్చి చెప్పారు. అంతేకాదు వైద్యులు ఆమె హెల్త్ రిపోర్టులు తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు. వైద్యులు తీసుకువచ్చిన ఆ ఎక్స్రే రిపోర్టులన్ని నకిలీవని తేల్చారు. ఆమె ప్రతినెల చెకప్కి వెళ్తున్న ఆస్పత్రిని సైతం విచారించగా.....ఆమె కడుపులో ఇన్ఫక్షన్ ఉందంటూ ఆస్పత్రికి వచ్చేదని, ఆమె గర్భవతి కాదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లి అయ్యి చాలా ఏళ్లైన పిల్లలు లేరంటూ తిడుతుంటే తట్టుకోలేక ఇలా కట్టుకథ అల్లానని చెప్పుకొచ్చింది సదరు మహిళ. (చదవండి: నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...) -
ప్లాస్టిక్కి చెక్పెట్టేలా... నీటిని ఫిల్టర్ చేసే చేప
మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి. ఇప్పుడూ ఆ ప్లాస్టిక్ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే...తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్ని ఏరేసి ఫిల్టర్ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్ ఎలియనోర్ మాకింతోష్ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు. ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్ డాక్టర్ రాబర్ట్ సిడాల్ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్పాప్కి ఉన్న మెష్ ద్వారా ఫిల్గర్ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు. (చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ) -
తల్లిపాలలోనూ ప్లాస్టిక్!
సాక్షి, హైదరాబాద్: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు. రకరకాలుగా కలుషితం ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిందే.. భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఐసీఎంఆర్ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి తల్లిపాలలో ప్లాస్టిక్తోపాటు లెడ్ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో ఉండే ఆహారం తీసుకోవద్దు. – డాక్టర్ బబిత మాటూరి, సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమాదం ఎంత వరకు? తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. -
తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్... ఆందోళనలో శాస్త్రవేత్తలు
తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్ని గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్స్టెషానో చెబుతున్నారు. అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్లు, సింథటిక్ ఫ్యాబ్రిక్తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. (చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!) -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
Plastic: అంతం కావాలంటే పంతం కొనసాగాలి
ప్లాస్టిక్ వాడకం తగ్గించి భయంకర జబ్బులను నియంత్రించే దిశగా జూలై ఒకటో తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధికారులు అడుగులు వేశారు. కానీ రెండు మాసాలు కూడా గడవక ముందే అధికారులు శ్రద్ధ తగ్గించారు. దీంతో మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మళ్లీ యథాతథంగా పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలకు చిరునామాగా నిలిచిన అనంతపురం నగరపాలక సంస్థలో జూలై నెలకు ముందు ఎంత ఉత్పత్తి అయ్యేవో అంత కంటే ఎక్కువగా ఆగస్టులో పెరిగాయి. దీన్ని బట్టి ప్లాస్టిక్ అంతం కోసం అధికారులు దూకుడు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం జరిగేది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి ముందు నెలకు సగటున 28.5 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. జూలై ఒకటి తర్వాత అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ మాసంలో ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. అనంతపురంలో టన్నులకొద్దీ... అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మరీ దారుణంగా ఉంది. నియంత్రణ చర్యలు తీసుకోకమునుపు నెలకు 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయ్యేవి. జూలైలో రెండు టన్నులు తగ్గి 10 టన్నులకు చేరింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో ఆగస్టులో గతం కంటే ఎక్కువగా 14 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరులోని హోల్సేల్ దుకాణాల నుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు ఇలా రకరకాల వస్తువులు ఇతర మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్నాయి. చిన్న చిన్న షాపులు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకూ మళ్లీ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడుతున్నారు. మున్సిపల్ అధికారుల తనిఖీలు తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు దాడులు చేస్తేనే నియంత్రణలోకి రాదని, ప్లాస్టిక్పై ప్రజలు కూడా ఆలోచించి వాడకాన్ని తగ్గిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రజల్లోనూ మార్పు రావాలి అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలపై ప్రజలూ ఆలోచించాలి. అత్యంత భయంకర జబ్బులకు మూలమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ సాధ్యం. – శంకర్రావు, పర్యావరణ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి స్పెషల్ డ్రైవ్ చేపడతాం ప్లాస్టిక్ నివారణ చర్యల్లో భాగంగా మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే శానిటేషన్ కార్యదర్శులు వారి పరిధిలోని వ్యాపార సముదాయాల్లో రోజూవారీ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ను వినియోగిస్తే..అపరాధ రుసుం వసూలు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేయాలి. – కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, అనంతపురం నగరపాలక సంస్థ -
Hyderabad: పరోటాలో ప్లాస్టిక్ కవర్.. ఇదేమని అడిగితే!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారం తిందామని హోటల్కు వెళ్లి పరోటా ఆర్డర్ ఇస్తే అందులో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి.గణేష్ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో పరోటా ఆర్డర్ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. -
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్లో వివరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతోపాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుంది. నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వ్రస్తాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘిస్తే జరిమానా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం–1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి వసూలుచేస్తారు. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్ ఫెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారు. -
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేదం.. ఆ రోజు నుంచే అమల్లోకి
సాక్షి, విజయవాడ: ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేదం నవంబర్ 1 నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ముద్రించడం, అంటించడం, రవాణాపైన నిషేదం విధించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మెటీరియల్ ఇంపోర్ట్పైనా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: (ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్) -
గూగుల్ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం!
పెనుముప్పుగా పరిణమిస్తోన్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ‘‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’’ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ప్రపంచదేశాల్లోని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ మాటలను సీరియస్గా తీసుకుని ఆచరించేవారు తక్కువే. కానీ సామాజిక స్పృహ కలిగిన కొంతమంది మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి తమ వంతు సాయంగా సరికొత్త పరిష్కార మార్గాలతో ముందుకొస్తున్నారు. ఈ కోవకు చెందిన నేహా జైన్ టెక్ ఉద్యోగాన్నీ సైతం వదిలేసి మట్టిలో వేగంగా కలిసిపోయే బయోప్లాస్టిక్ను రూపొందిస్తోంది. సముద్ర నాచుతో తక్కువ ఖర్చుతోట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ను అందుబాటులోకి తీసుకొచ్చి, కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తోంది. ముంబైకి చెందిన నేహా జైన్ చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించేది. బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో జర్నలిజం పూర్తిచేశాక, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గూగుల్లో ఉద్యోగం సంపాదించింది. ఐదేళ్లపాటు వివిధ విభాగాల్లో పనిచేసిన నేహకు ఇంకా ఏదో చేయాలన్న తపన. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఆలోచిస్తున్న నేహ ఓ రోజు..‘‘రోజురోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి నా వంతు సాయంగా ఏదైనా మార్పు కలిగించేదిగా చేయాలి’’ అని అనుకుంది. అదేవిధంగా∙పర్యావరణానికి హాని చేయని జీవనశైలిని అనుసరించాలనుకుంది. అందుకే 2011లో కారు కొనుక్కోవడానికి బదులు సైకిల్ను ఎంచుకుంది. ఇలా ఒక్కో వస్తువును వినియోగించే ముందు పర్యావరణానికి అనుకూలంగా ఉండేవే ఎంచుకోవడం మొదలు పెట్టింది. గూగుల్ను వీడి... ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి చక్కని పరిష్కారం చూపాలని గట్టిగా నిర్ణయించుకున్న నేహ.. 2018లో గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. వెంటనే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పటిష్టంగా ఉండే వాటికోసం పరిశోధించడం మొదలు పెట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడానికి అనేక తయారీ కంపెనీలను సంప్రదించింది. ‘‘ఫాస్ట్మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కోసం ప్లాస్టిక్ను అధికంగా వినియోగిస్తున్నారు. కానీ అవన్నీ రీసైకిల్ కావడం లేదు’ అని గ్రహించి మట్టిలో కలిసిపోయే సరికొత్త ప్లాస్టిక్ను రూపొందించడం కోసం తీవ్రంగా అన్వేషించి సముద్ర నాచుతో ప్లాస్టిక్ను తయారు చేయాలనుకుంది. ఈ ఆలోచన రాగానే 2020 జూలైలో ‘జీరోసర్కిల్’ పేరిట స్టార్టప్ను ప్రారంభించి సముద్ర నాచుతో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ తయారీ మొదలు పెట్టింది. సముద్రనాచు ఎందుకంటే... సముద్ర ఉపరితలంపై తొమ్మిదిశాతం సముద్రనాచు దట్టంగా పెరిగి ఉంటుంది. ఈ నాచు వాతావరణంలో 53 బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తొలగిస్తుంది’’ అని ముంబై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న బయాలజిస్టుల ద్వారా తెలుసుకుంది. ఈ నాచును పెంచడానికి ఎరువులుగానీ, క్రిమిసంహారకాలు గానీ వినియోగించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా, నీరు, భూమిని కూడా కేటాయించాల్సిన పనిలేదు. 30–40 రోజుల్లోనే పెరిగి వినియోగానికి అందుబాటులోకి వస్తుంది అని క్షుణ్ణంగా తెలుసుకుని ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగులలోని శిలీంధ్రాలను సేకరించి ఎండబెట్టి, పొడి చేసి ఆ పొడితో ప్లాస్టిక్ను రూపొందిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోని మత్స్యకారుల ద్వారా ఈ నాచుని సేకరించి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ తయారు చేస్తోంది. 20 లక్షలతో ప్రారంభమైన జీరోసర్కిల్ కంపెనీ నేడు సముద్ర నాచులతో పారదర్శకమైన ప్లా్లస్టిక్ బ్యాగ్లను తయారు చేస్తూ దూసుకుపోతుంది. సొంత ఆర్అండ్డీ బృందంతో కాలుష్యరహిత సరికొత్త బయోప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది నేహ. -
అనంతపురంలో సినీతారల క్రికెట్ మ్యాచ్..
అనంతపురం నగరంలో సినీ తారలు సందడి చేశారు. నో డ్రగ్స్, నో ప్లాస్టిక్ క్యాంపెయిన్ లో భాగంగా టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ను ఆదివారం నిర్వహించారు. అనంతపురం పీటీసీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సంపూర్ణేష్ బాబు, ఓంకార్, వరుణ్ సందేశ్, సామ్రాట్ సహా మొత్తం 45 మంది సినీ, జబర్దస్త్, బిగ్ బాస్ నటీనటులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమం క్రీసెంట్ క్రికెట్ కప్ నిర్వాహకులు షకిల్ షఫీ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ముందు సినీ నటులు, ప్రజాప్రతి నిధులు సంతాపం తెలిపారు. చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
అయ్యో పాపం.. అడవి కుక్క
మైసూరు: ప్లాస్టిక్ వల్ల జీవజాలం మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. మైసూరు సమీపంలోని నారగహోళె అడవిలో ఒక అడవి కుక్క మెడకు దారం చుట్టుకుని మెడభాగం దాదాపు తెగిపోయే స్థితిలో ఉంది. అంతలో అటవీసిబ్బంది దానిని పట్టుకుని చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రపంచంలోనే అరుదైన అడవి కుక్కలు నాగరహోళె అడవుల్లో కనిపిస్తాయి. వీటిపై పలు అంతర్జాతీయ చానెళ్లలో కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల కుక్కల గుంపు తిరుగుతుండగా ఒక కుక్క మెడకు ప్లాస్టిక్ దారం చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. మృత్యువు అంచుల్లో ఉన్న దానిని అటవీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని దారాన్ని తొలగించి వైద్యం చేయించారు. (చదవండి: పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య) -
మహాయజ్ఞంలా మెగా బీచ్క్లీనింగ్ (ఫొటోలు)
-
ప్లాస్టిక్ కాలుష్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్
సాక్షి, విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్స్కిల్స్లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తైంది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన కళ్లద్దాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి ఎన్నడూ శిక్షణ అందించలేదని సీఎం తెలిపారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్, సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. పార్లే సంస్థ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన వివిధ ఉత్పత్తులను (బూట్లు, కళ్లద్దాలు, టీ షర్టులు) సీఎం స్వయంగా పరిశీలించారు. ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పార్లే ఫర్ ఓషన్స్ సంస్థ సీఈవో సిరిల్ గచ్చ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం.. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ ప్రజలకు అభినందనలు. గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 28 కి.మీ. పరిధిలో 40 ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది ప్రజలు పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతం. అదే విశాఖను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది. అటు పర్యావరణం.. ఇటు ఆర్థికం నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ కీలకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే మనకు మనుగడ లేదు. సుస్థిరత, సమగ్రత మన ప్రధాన లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే దీర్ఘకాలిక మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్థిక వనరులతో సుస్థిర ప్రగతి కోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడంతో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. వంద శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన బూటును చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సాగరాన్ని కాపాడుకుందాం.. భూమి మీద ఆక్సిజన్లో 70 శాతం సముద్ర మొక్కల నుంచే లభిస్తోంది. రెయిన్ ఫారెస్ట్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. మెరైన్ ప్లాంట్స్లో ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్ట్ లాంటి మొక్కలు కిరణజన్య సంయోగ ప్రక్రియతో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైటో ప్లాంక్ట్లో ముఖ్యమైనదైన ప్లోక్లోరో కాకస్ వాతావరణంలోకి అత్యధికంగా ప్రాణ వాయువును ఉత్పత్తి చేస్తోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద, సముద్ర పక్షులు, సముద్ర క్షీరదాలు లాంటి దాదాపు 267 జాతులకు ముప్పు వాటిల్లుతోంది. రూ.16 వేల కోట్లు.. 20 వేల మందికి ఉపాధి సముద్రతీరంతో పాటు సాగర గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనికి స్థిరమైన పరిష్కారం దిశగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ (జీఏఎస్పీ), పార్లే ఫర్ ది ఓషన్స్తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైంది. భాగస్వాములను ఎంపిక చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో గ్లోబల్ అలయన్స్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్ కనుగొనడానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు, అద్దాలు లాంటి మెటీరియల్ తయారు చేసే రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ హబ్ ఏర్పాటవుతుంది. వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి 10 ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయి. వీటిద్వారా ఆరేళ్లలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. స్ధానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, పార్లే ఫర్ ది ఓషన్స్ ప్రతినిధులు ప్రఖ్యాత కంపెనీలకు పార్లే ఉత్పత్తులు.. అందమైన బ్యాగుల నుంచి షూస్, కంటి అద్దాల వరకూ రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, లూయిస్ విట్ట¯, ఆడిడాస్, అమెరికా ఎక్స్ప్రెస్ లాంటి కంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్థ తయారు చేసి అందచేస్తోంది. రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్లోకి చాలా ఎంఎన్సీలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి, పార్లే ఫర్ ది ఓష¯న్స్ సీఈవో సిరిల్ గచ్చ్తో పాటు అందరికీ హృదయపూర్వక అభినందనలు. దారంతా ఫ్లెక్సీలే ‘‘విశాఖ విమానాశ్రయం నుంచి కారులో వస్తుంటే దారిపొడవునా నా ఫొటోలతో ఫ్లెక్సీలు కనిపించాయి. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి వెళ్తూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించినట్లు అవుతుందని కలెక్టర్ మల్లికార్జునకు చెప్పా. అయితే అవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదని, క్లాత్తో తయారైనవని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ ఫెక్సీకి రూ.8 ఖర్చయితే.. క్లాత్కు రూ.32 ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా క్లాత్తో తయారైనవే ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనలో తొలి అడుగు వేస్తున్నాం. ఇప్పటికే తిరుమలను ప్లాస్టిక్ రహితంగా చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి’’ – సీఎం జగన్ రీసైక్లింగ్ ద్వారా తయారు చేసిన కళ్లజోడును పెట్టుకున్న సీఎం జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్న నాయకుడు ఇది ఆరంభం మాత్రమే. లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. అది సాకారమైతే ప్రపంచంలోనే ప్లాస్టిక్ రహిత తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుంది. 2027 నాటికి సాధించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్కు అభినందనలు. పలు దేశాల్లో ఎంతో మంది రాజకీయ నేతలను కలిశాం. అందరూ అనేక హామీలిచ్చి మర్చిపోవడాన్ని చూశా. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని చూస్తున్నాం. – సత్య ఎస్ త్రిపాఠి, జీఏఎస్పీ సెక్రటరీ జనరల్ చాలా ముఖ్యమైన సందర్భమిది. నేను భారత్కు రాకపోతే కీలక ఘట్టాన్ని మిస్ అయ్యే వాడిని. పర్యావరణం ప్రమాదంలో ఉందంటూ అనేక దేశాల ముఖ్యులు రోజుల తరబడి చర్చించడం, భారీగా నిధులు వెచ్చించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశం చాలా భిన్నంగా అనిపించింది. సీఎం సమక్షంలో అధికార యంత్రాంగం కేవలం రెండు గంటల్లోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్మూలనలో విశాఖ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మానవ జీవనానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఆరేళ్ల పాటు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలం. మరో పదేళ్లలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రపంచంలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పుగా పరిణమించనుంది. – సిరిల్ గచ్చ్, పార్లే ఫర్ ఓషన్స్ సీఈవో ‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’ – సీఎం జగన్ ఇదీ చదవండి: విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం.. -
వింత సమస్య.. ప్లాస్టిక్లా మారిపోయిన యువతి చర్మం!
లండన్: విహారయాత్రకు వెళ్లి ఎండలో నిద్రలోకి జారుకున్న ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె నుదుటిపై చర్మం ప్లాస్టిక్లా మారిపోయింది. బ్రిటన్కు చెందిన బ్యూటీషియన్ సిరిన్ మురాద్ (25) అనే యువతి కొద్ది రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. ఓ పూల్ వద్ద కూర్చొని అక్కడే కాసేపు కునుకుతీసింది. 30నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ.. పట్టించుకోలేదు. ఎండకు పొడిబారినట్లుందని మళ్లీ నిద్రపోయింది. అయితే మరుసటి రోజు నుదుటిపై చర్మం ప్లాస్టిక్లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దీనికి కారణమని భావించింది.. పైగా సన్స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోలేదని పేర్కొంది. తాను నిద్రపోయిన ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 21డిగ్రీలు ఉన్నట్లు తెలిపింది. నుదుటిపై చర్మం ప్లాస్టిక్లా కనిపిస్తున్నా.. ఏం జరగదులే అని భావించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు సిరిన్ మురాద్. రోజులకు ఆమె ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు మారింది. అయితే.. ప్రస్తుతం కోలుకున్నానని, కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్బుక్లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది సిరిన్. మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తాను ఎదుర్కొన్న వింత, భయానక అనుభవాన్ని వివరిస్తూ.. ఆ యువతి ప్రస్తుతం సన్స్క్రీన్ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎండలో వెళితే అందరికి అలా జరగదని, క్యాన్సర్ ఉన్నవారు ఆ తరహా సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా? -
ఈ 'రోబో చేప'తో సముద్రాలు క్లీన్.. ప్లాస్టిక్ను తినేస్తుందటా!
బీజింగ్: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్ యుయాన్ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా. ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్ను తినేసే కృత్రిమ ఎంజైమ్లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్సెప్టర్కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణహితం.. ప్లాస్టిక్ రహితం
వెనకటికి ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. ఇక అప్పటి నుంచి భూమి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్లి ఏంలాభం? ఎక్కడ దాక్కున్నా... భూమే కనిపిస్తుంది! పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యం కూడా అలాంటిదే. ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎన్ని సాకులు వెదుక్కున్నా... భూమి కనిపిస్తుంది. బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. కొందరు మాత్రం భూమాతతో శభాష్ అనిపించుకుంటారు. ఆ కోవకు చెందిన మహిళ అహుజ... ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యావరణప్రేమికులలో హర్షం వ్యక్తం అయింది. ఎంతోమంది, ఎన్నో విధాలుగా వ్యక్తిగత స్థాయిలో పర్యావరణహిత ఉద్యమాలకు, జీవనశైలులకు ఊపిరిపోయడం వల్లే ఇలాంటి నిషేధం ఒకటి సాధ్యం అయింది. ఇలాంటి వారిలో ముంబైకి చెందిన చైట్సీ అహుజ ఒకరు. మార్కెటర్, ఎర్త్ అడ్వోకెట్ అయిన అహుజ గత అయిదు సంవత్సరాలుగా ప్లాస్టిక్–రహిత జీవనశైలిని అనుసరిస్తుంది. తాను అనుసరించడమే కాదు మిగిలిన వారిని కూడా తన మార్గంలో తీసుకువెళుతుంది. ‘బ్రౌన్ లివింగ్’ స్థాపకురాలైన అహుజ దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్–ఫ్రీ మార్కెట్కు శ్రీకారం చుట్టింది. బ్రౌన్ లివింగ్లో అన్ని ఆర్డర్ల ప్యాక్లు ప్లాస్టిక్ మెటీరియల్కు దూరంగా ఉంటాయి. ‘బ్రౌన్ లివింగ్ అనేది బ్రాండ్స్, కంపెనీలకు సంబంధించిన సేంద్రీయ, పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించే వేదిక మాత్రమే కాదు, మన జీవనశైలిలో బలమైన మార్పు తీసుకువచ్చే నిర్మాణాత్మక విధానం కూడా’ అనే పరిచయ వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘బ్రౌన్ లివింగ్’ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెట్లు నాటడానికి సంబంధించిన కార్యక్రమాలకు వెచ్చిస్తారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై అహుజ ఇలా స్పందించారు... ‘ప్లాస్టిక్–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు. ఒక ప్రయాణం మొదలైంది. కొంతమందిగా మొదలైన ప్రయాణం, ఎంతోమందిని కలుపుకుంటూ వెళుతుంది.ఈ ప్రయాణమే ఉద్యమం అవుతుంది. మన జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది’ అంటున్న అహుజ ‘ప్లాస్టిక్–రహిత జీవన విధానాన్ని అనుసరించడం ఖరీదైన వ్యవహరం’లాంటి అపోహలను ఖండిస్తుంది. ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయాలకు రూపకల్పన చేసిన కంపెనీలకు ప్రభుత్వం అవసరమై ఆర్థిక సహాయం అందించాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ‘ప్లాస్టిక్–రహిత దారి వైపు అడుగులు వేయడానికి ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి’ అంటున్న అహుజ ప్లాస్టిక్ వాడని కిరాణషాపులకు అండగా ఉండాలని చెబుతుంది. తన ప్రయాణంలో ‘మార్పు అసాధ్యమేమో’ అని కొన్ని సందర్భాలలో అనిపించేది. అంతలోనే ‘మార్పు అనివార్యం కూడా’ అనిపించి తనను పట్టుదలగా ముందుకు నడిపించేది. పరిమితమైన వనరులతోనే మన పూర్వీకులు రకరకాల మార్గాలలో పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేశారు. ఒకసారి వెనక్కి వెళ్లి అలాంటి కార్యక్రమాలు మళ్లీ ఉనికిలో ఉండేలా చూడాలంటుంది అహుజ. ‘బ్రౌన్ లెన్స్ మెథడ్ (ప్రతి ఉత్పత్తిని, పనిని పర్యావరణ దృష్టి కోణం నుంచి చూడడం) అనుసరిద్దాం’ అని పిలుపునిస్తున్న అహుజాకు మర్రిచెట్టు అంటే ఇష్టం.ఆదర్శం.‘బలంగా వేళ్లూనుకుపోయిన మర్రిచెట్టును చూస్తే మహాయోధుడిని చూసినట్లుగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: బడా కంపెనీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాక్లలో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు (పుల్లలు) జోడించడం మొదలు పెట్టాయి. పార్లే ఆగ్రో, డాబర్, అమూల్, మథర్ డెయిరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి. రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్ అలియన్స్ (ఏఏఆర్సీ) మాత్రం.. ప్లాస్టిక్ స్ట్రాలను మార్చే విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇది సరఫరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాకిస్టుల వద్ద నిల్వలు అడుగంటాయని.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవి పేపర్ స్ట్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఏఏఆర్సీ తెలిపింది. పేపర్ స్ట్రాల తయారీ ఫ్రూటీ, అపీ ఫిజ్ పేరుతో పెద్ద మొత్తంలో పండ్ల రసాలను విక్రయించే ప్రముఖ సంస్థ పార్లే ఆగ్రో బయో డీగ్రేడబుల్ (ప్రకృతిలో కలసిపోయే/పర్యావరణ అనుకూల) స్ట్రాలను తన ఉత్పత్తులకు జోడిస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు నాటికి నిబంధనలను పాటించే లక్ష్యంతో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకున్నట్టు పార్లే ఆగ్రో సీఈవో షానా చౌహాన్ తెలిపారు. పేపర్స్ట్రాల నుంచి పీఎల్ఏ స్ట్రాలకు మారిపోతామని చెప్పారు. పీఎల్ఏ స్ట్రాలు అన్నవి మొక్కజొన్న గంజి, చెరకుతో తయారు చేస్తారు. తమ వ్యాపార భాగస్వాములు పీఎల్ఏ స్ట్రాలను తయారు చేసే వరకు, కొన్ని నెలలపాటు పేపర్ స్ట్రాలను వినియోగిస్తామన్నారు. మథర్ డైరీ సైతం దిగుమతి చేసుకున్న పేపర్ స్ట్రాలను జూలై 1 నుంచి తయారు చేసే తన ఉత్పత్తులకు జోడిస్తున్నట్టు ప్రకటించింది. రియల్ బ్రాండ్పై పండ్ల రసాయాలను విక్రయించే డాబర్ ఇండియా సైతం టెట్రా ప్యాక్లతోపాటు పేపర్ స్ట్రాలను అందించడాన్ని మొదలు పెట్టినట్టు తెలిపింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని డాబర్ ఇండియా ఈడీ షారూక్ఖాన్ స్పష్టం చేశారు. పాత నిల్వలపై ప్రభావం ఏఏఆర్సీ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ 30 నాటికి నిల్వలున్న రిటైలర్లకు తాజా పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న ఉత్పత్తులు అమ్ముడుపోయే వరకు కొంత కాలం పాటు ఉపశమనం కల్పించాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ఇవాళ్టి(జులై1, శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో ఏయే వస్తువులపై నిషేధం విధించారో.. ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్)లపై నిషేధం అమలులోకి వచ్చింది. ప్రత్యామ్నాయాలుగా.. పేపర్, జూట్, గ్లాస్, చెక్క, బంక, స్టెయిన్లెస్ స్టీల్, వెదురు.. ఇతరత్ర పర్యావరణానికి నష్టం కలిగించని వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021 ప్రకారం.. పైవాటిపై నిషేధం అమలులోకి వచ్చింది. వీటిని ఉల్లంఘిస్తే.. నిబంధనలను ఉల్లంఘిస్తే.. తయారు చేయడం, అమ్మకాలు, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం..వీటిలో ఏదైనా సరే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హమే. ఐదేళ్ల వరకు గరిష్ఠ జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఉల్లంఘనలు కొనసాగిస్తే.. అదనంగా ప్రతీ రోజూ ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని నేషనల్ కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. దాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్లతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. -
జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీపీసీబీ) చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్యూపీ సరఫరా ముడి సరుకులు, ప్లాస్టిక్ డిమాండ్ తగ్గింపునకు చర్యలు, ఈ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన వంటివి చేపడతామన్నారు. వీటితోపాటు పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పాలనాయంత్రాంగానికి అవగాహన కల్పన, మార్గనిర్దేశానికి ఈ ప్రణాళికలో భాగంగా పీసీబీ బహుముఖ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ఎస్యూపీలపై నిషేధం అమలుకు, ప్రత్యామ్నాయ వస్తువుల ప్రోత్సాహానికి కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికెట్లు జారీ చేస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (సిపెట్), జాతీయ ఎమ్మెస్ఎంఈ శిక్షణ సంస్థ, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్ అసోసియేషన్ల సహకారంతో ఎస్యూపీలకు బదులుగా ఎమ్మెఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ టీపీసీబీ వర్క్షాపులను నిర్వహిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేయడానికి సీపీసీబీ ఎస్యూపీ–సీపీసీబీ ప్రత్యేక ఆన్లైన్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎస్యూపీ వస్తువుల వినియోగానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని సూచించారు. నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్ వస్తువులు ఇవే ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్). -
గుడ్డ సంచీకి వెల్కం
మార్కెట్కెళ్తే సామాన్లు క్యారీ బ్యాగుల్లో ఇస్తారు లెమ్మనుకునే రోజులు రేపటితో పోయినట్టే. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను కేంద్రం జూలై 1 నుంచి నిషేధించింది? ఇకపై మార్కెట్కెళ్తే గుడ్డ సంచీ వెంట ఉండాల్సిందే... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ)వాడకం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుంది. రీ సైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్నూ నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రోన్లకూ వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు. 120 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు, తదితరాలనూ వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకీ నిషేధం? ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనది 98వ స్థానం. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క! ప్రపంచవ్యాప్తంత్తేటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 91% రీ సైక్లింగ్కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశౠలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశలవారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. ఎస్యూపీతో యమ డేంజర్ ఎస్యూపీ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. షాంపూ పాకెట్ల నుంచి కరీ పాయింట్లలో కూరలు కట్టిచ్చే కవర్ల దాకా అన్నీ ఈ బాపతే. ఇవి ఆరోగ్యానికి , పర్యావరణానికి అత్యంత హానికరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్లో మూడో వంతు ఎస్యూపీనే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతుల్యం చేస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10 శాతం ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది కేన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. భూమ్మీద సకల జీవజాలానికీ ప్లాస్టిక్ ముప్పుగానే మారింది. ఇతర దేశాల్లో.. బంగ్లాదేశ్ ప్రపంచంలో తొలిసారి 2002లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. 2019 జులైలో న్యూజిలాండ్ ఇదే బాట పట్టింది. 68 దేశాలు రకరకాల మందమున్న ప్లాస్టిక్ను నిషేధించాయి. 2020లో చైనా దశలవారీగా నిషేధం విధించింది. అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి నిషేధముంది. నిషేధిత వస్తువులివే... ► ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్ ► బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► ప్లాస్టిక్ జెండాలు ► చాక్లెట్లు, ఐస్క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► డెకరేషన్కు వాడే థర్మోకోల్ ► ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు ► స్వీటు బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ పేకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్ ► ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్ ► 100 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు (వీసీ బ్యానర్లు) – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్', 'సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
మరింత కఠిన ఆంక్షలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ కవర్ల తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం మరింత కఠిన ఆంక్షలు విధిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో 50 మైక్రాన్ల మందం గల కవర్లను బ్యాన్ చేసినప్పటికీ మార్కెట్లో వినియోగం తగ్గలేదు. 75 మైక్రాన్ల మందం గల కవర్ల వినియోగానికి అనుమతినిచ్చారు. తక్కువ మందం గల కవర్లు పునర్ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించిన కేంద్రం వాటి స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, అంతకంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేసింది. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? మన రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరికి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను బ్యాన్ చేస్తున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమల యజమానులు, హోల్సేల్ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు.. ఒక్కసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్.. ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని జూలై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులతో పాటు, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్ పరిశ్రమలు తక్కువ మందంగల క్యారీబ్యాగులను తయారు చేస్తుండటంతో వాటి లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. జూలై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్కు పంపించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ తయారు చేస్తున్నవారిపైనా, స్టాకిస్టులపైన, ప్లాస్టిక్ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నవారిపైనా దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీఎత్తున ప్లాస్టిక్ కవర్లు, వినియోగ సరుకును సీజ్ చేయడమే కాకుండా రూ.1.54 కోట్ల పెనాల్టీ సైతం విధించారు. -
ప్రధాని మోదీకి ‘అమూల్’ సంస్థ లేఖ.. ఎందుకో తెలుసా..?
ప్లాసిక్ట్ రహిత సమాజం కోసం ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలని కోరుతూ అమూల్ సంస్థ ప్రధాని మోదీని కోరుతూ లేఖ రాసింది. ఈ మేరకు అమూల్ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీ తన లేఖలో ప్రధాని మోదీని కోరారు. ఈ లేఖలో తక్షణమే స్ట్రాలను బ్యాన్ చేయడం వల్ల రైతులు, పాల వాడకంపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్ట్రాలపై నిషేధం విధిస్తే చిన్న జ్యూస్ ప్యాకులు, డెయిరీ ఉత్పత్తుల ప్యాక్లపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇదే క్రమంలో కూల్ డ్రింక్ సంస్థలైన పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. ఇక, అమూల్ సంస్థ తన ప్రొడక్ట్స్ అన్నింటికీ ప్లాస్టిక్ స్ట్రాలను వాడుతుంటుడం గమనార్హం. కాగా, ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇది కూడా చదవండి: ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు -
అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై
1 జూన్ 2018. జీహెచ్ఎంసీలో సింగిల్యూజ్ ప్లాస్టిక్ను 2022 లోగా పూర్తిగా నిషేధిస్తామని 2018లో పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటి యూఎన్ఈపీ(యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్సోలెంతో కలిసి ఆమేరకు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల కోసం ఆరు ఎలక్ట్రిక్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. 4 జూన్ 2022. నిజంగానే గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధం.. ఈపాటికి సింగిల్యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలవుతాయనుకున్న వారి అంచనాలు తప్పాయి. ఏదీ జరగలేదు. నిర్ణీత మైక్రాన్లలోపు ప్లాస్టిక్ నిషేధం అమలు కాలేదు. సింగిల్యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం సాధ్యం కాలేదు. ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్లు ఏమయ్యాయో తెలియదు. సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లు గడిచిపోయినా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. సింగిల్యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి, అనంతరం కమిషనర్గా పనిచేసిన దానకిశోర్ అమలు చర్యలు ప్రారంభించి, కొంతకాలం అమలు చేసినప్పటికీ, అనంతరం పూర్తిగా కనుమరుగైంది. చిరువ్యాపారులు, మాంసం దుకాణాల వారు సైతం చాలావరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పొంది అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, తదుపరి అధికారుల అశ్రద్ధతో ఆ కార్యక్రమం కుంటుపడింది. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఆమోదం సై.. అమలు నై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత మార్చిలో మరోసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి, 75 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు గత సంవత్సరమే ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి.. జీహెచ్ఎంసీలో దాదాపు దశాబ్దం క్రితమే ప్లాస్టిక్ నిషేధచర్యలు ప్రారంభమైనప్పటికీ, రాజకీయ నేతల జోక్యం.. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల ప్రభావంతో ముందుకు సాగలేదు.జనార్దన్రెడ్డి, దానకిశోర్లు కమిషనర్లుగా వ్యవహరించే సమయంలో కొంతమేర అమలు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు.అప్పటి నిబంధనల కనుగుణంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్పై నిషేధం అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. నాలాల్లోనూ ప్లాస్టికే.. జీహెచ్ఎంసీలో రోజుకు సగటున ఆరున్నరవేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిల్లో దాదాపు600 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే.నాలాల్లోని వ్యర్థాల్లో 40 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే. నాలాల్లో వరదనీరు సాఫీగా సాగకుండా ముంపు సమస్యలకు ఇదీ ఓ ముఖ్య కారణమేనని ఇంజినీర్లు పేర్కొన్నారు. నగరంలో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ క్యారీబ్యాగులు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్నశించేందుకు 500 సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీల కోసమేనా..? ప్లాస్టిక్ నిషేధంపై జీహెచ్ఎంసీ కొద్దిరోజులు హడావుడి చేయడం.. చిరువ్యాపారులపై పెనాల్టీలు విధించడం.. అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఏళ్ల తరబడి ఇదే తంతు. దీని వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేరు. వారికి డబ్బులు అవసరమైనప్పుడు పెనాల్టీల పేరిట వేధిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనిదే ఎంతకాలమైనా అమలు సాధ్యం కాదు. – మహేశ్, గోల్నాక ఉన్నది భూమి ఒక్కటే.. కాపాడుకోవాలి.. ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ థీమ్ ‘ఉన్నది ఒక్కటే భూమి’. దీన్ని పరిరక్షించుకునేందుకు వివిధ అంశాలతోపాటు ప్లాస్టిక్ వినియోగం మానేయాలి. భూమి, నీటిలో సైతం అంతం కాకుండా ఏళ్ల తరబడి ఉండే ప్లాస్టిక్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుంది. – అశోక్ చక్రవర్తి, కవి (చదవండి: ‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్ల పేరిట గేమ్లకు బానిసగా...) -
టీటీడీ హెచ్చరిక.. వాటిని వినియోగిస్తే షాపులు సీజ్
సాక్షి,తిరుమల: తిరుమలలో దుకాణాలు, హోటళ్ల యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. టీటీడీ రెవెన్యూ విభాగం, ఆరోగ్య శాఖ, నిఘా, భద్రతా విభాగం అధికారులు 10 బృందాలుగా ఏర్పడి తిరుమలలోని పలు ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లతో కూడిన వస్తువులు, షాంపులు, బొమ్మలు, దుస్తులు విక్రయించకూడదని ఆదేశించారు. చదవండి: కాకినాడ: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్ బ్లాక్ -
కొండపై ప్లాస్టిక్ ఉండదిక..
తిరుమల: ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒక రోల్ మోడల్. భద్రత, క్యూలైన్ నిర్వహణ, లక్షలాదిమంది భక్తులకు ఇబ్బందుల్లేకుండా శ్రీవారి దర్శనం కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీకి) ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉంది. ప్రత్యేక సెక్యూరిటీ విభాగం, సీసీ కెమెరాల నిర్వహణ తదితరాలు టీటీడీకే సొంతం. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ, క్యూలైన్ మేనేజ్మెంట్ వరకు శ్రీవారి ఆలయం ఎంతో ఆదర్శం. అంతేకాకుండా శిక్షణలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడికి వచ్చి పలు విషయాలపై అవగాహన పెంపొందించుకోవడం పరిపాటి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారి ఆలయం ప్రత్యేకతలు ఎన్నో. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణలో తనదైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అతితక్కువ కాలంలోనే దశల వారీగా ఏడుకొండలపై ప్లాస్టిక్ను నిషేధిస్తూ ప్లాస్టిక్ రహిత తిరుమలగా టీటీడీ తీర్చిదిద్దుతోంది. ప్రపంచానికే రోల్ మోడల్గా ఉన్న టీటీడీ పర్యావరణ పరిరక్షణలో కూడా అనేక దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అధికసంఖ్యలో భక్తులు ప్లాస్టిక్ వాడుతుంటారు. ఈ క్రమంలో తిరుమలలో ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర పర్యావరణ సంస్థ అధికారులు టీటీడీని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో దశల వారీగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. తొలిదశలో భాగంగా శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండోదశలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను నిషేధించింది. హోటళ్లు, మఠాల్లోను, స్థానిక నివాసితులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను ఉపయోగించరాదని హెచ్చరించింది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతో తిరుమలలో చాలావరకు ప్లాస్టిక్ వాడకం తగ్గింది. ఇక మూడోదశలో భాగంగా స్థానికులు, హోటళ్లు, దుకాణదారులతో సమావేశమైన అధికారులు ఇకపై తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా దుకాణదారులు, మఠాలు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే లైసెన్స్ రద్దుచేసి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షుణ్ణంగా తనిఖీలు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమల వెళ్లే స్థానికులు, వ్యాపారులు, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక వ్యాపారులు పంచెలు, వివిధ రకాల బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయో డిగ్రేడబుల్ కవర్లుగానీ, పేపర్లుగానీ ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేగాకుండా నిత్యావసరాల్లో భాగంగా ఎక్కువగా ఉపయోగించే షాంపూ ప్యాకెట్లు కూడా కొండపైకి భక్తులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తమ అవసరాల నిమిత్తం తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్, వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి డస్ట్బిన్లలో పడేస్తున్నారు. ఈ విషయమై బ్రాడ్కాస్టింగ్ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలంటే టీటీడీకి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులకు సూచనలు ► తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని టీటీడీ పూర్తిగా రద్దుచేసింది. ► అలిపిరి తనిఖీ కేంద్రం, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ► తిరుమలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లు, షాంపు ప్యాకెట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావడం నిషిద్ధం. ► తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ లేకుండా రావాలి. ► వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను తిరుపతిలోని తనిఖీ కేంద్రాల వద్ద వదిలేసి రావాలి. ► తనిఖీ సిబ్బందికి సహకరించాలి. -
టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే..
సాక్షి, తిరుపతి: తిరుమలలో రేపటి(బుధవారం) నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దుకాణదారులు, హోటళ్లు, ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. షాంపులను కూడా తిరుమలలో టీటీడీ నిషేధం విధించింది. దుకాణదారులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ప్లాస్టిక్ రహిత వస్తువులనే అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. చదవండి: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి!
ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. చివరికి ఇది మన శరీరంలోనూ పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. పీల్చేగాలి నుంచి తినే ఆహారం ద్వారా అనేక రకాలుగా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తోందని ప్రకటించారు. మరి మన శరీరంలోకి ఏయే మార్గాల ద్వారా.. ఎంతెంత ప్లాస్టిక్ చేరుతోందో చెప్పే లెక్కలివీ.. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేగజైన్ విడుదల చేసిన ‘హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ నివేదిక ప్రకారం.. సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. – సాక్షి సెంట్రల్డెస్క్ చదవండి 👉🏼Russia Ukraine War: తస్మాత్ జాగ్రత్త! 👉🏼గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
కబళించనున్న వాయుకాలుష్యం
మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2019లో ప్రపంచ వ్యాప్తంగా సంభ వించిన వాయుకాలుష్య మరణాలలో మన దేశంలోనే 25 శాతానికి పైగా నమోదయ్యాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కాటుకు 66.7 లక్షల మంది బలయ్యారని తెలుస్తోంది. ఇందులో 16 లక్షల మరణాలు భారత్లోనే నమోదయ్యాయట. వాయు కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచంలో పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 4.76 లక్షలు కాగా, మన దేశంలో అది 1.16 లక్షలుగా నమోదయింది. ప్రపంచంలో 99 శాతం మంది ప్రజలు పీలుస్తోంది కలుషిత గాలేనని డబ్లు్యహెచ్ఓ కుండ బద్దలు కొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతున్న కర్బన ఉద్గారాల విడుదల రానున్న కాలంలో మరింత పెరిగితే ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ముప్పు బారిన పడతాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. మానవ కల్పిత వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నింటిపైనా తీవ్ర విపరిణామాలు చూపుతున్నాయని ఐపీసీసీ కమిటీ ఛైర్మన్ హో సెంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారికి సంబంధించిన మౌలిక వసతుల వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. ఈ మానవకల్పిత వాతావరణ మార్పులకు మన దేశంలో లక్నో, పట్నా నగరాలు ప్రధానంగా గురవు తున్నా... అనేక ఇతర నగరాలూ ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోయింది. కర్బన ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్ది చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రపంచ వ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా పెరిగే ప్రమాదం వుందని ఐపీసీసీ ఛైర్మన్ హెచ్చరిస్తున్నారు. రానున్న కాలంలో వాతావరణ మార్పుల బాధితులను ఆదుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల బాధితు లను ఆదుకునేందుకు ఇప్పటికే జాతీయ స్థాయి నిధినీ, ‘విపత్తు నివారణ మౌలిక వసతుల వ్యవస్థ’నూ ఏర్పాటు చేశామనీ, 2030 నాటికి మన విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు దేశం శిలాజ ఇంధనాల వినియోగాన్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు 2015 నాటి పారిస్ ఒప్పందంలో అంగీకరించిందనీ ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావల్సిన అవసరం వుంది. మన దేశంలో పర్యావరణ మండలి వంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉంది. దీన్ని ఏర్పాటు చేస్తే 2070 నాటికి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయా లన్న లక్ష్యసాధనకు చేరుకోవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) నవీన నాగరికతకు అనుగుణంగా పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో వెలువ డుతున్న ఉద్గారాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచుకు చేరుస్తున్నాయి. ఈ ఉద్గారాలతో కేవలం ధరిత్రి మాత్రమే, కాదు ఇంధన విపణి కూడా ఉడికిపోతోంది. ఈ ధరల పెరుగుదలతో అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మనం ప్రయాణిస్తామా అన్న సందేహం తలెత్తు తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం చమురు సరఫరాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పక తప్పదు. దీనితోనయినా మనం స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోంది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - కేవీ రమణమూర్తి సీనియర్ పాత్రికేయులు -
మైలార్దేవ్పల్లిలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
మనుషుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్
లండన్: భూగోళాన్ని ముంచెత్తుతున్న ప్రమాదకరమైన ప్లాస్టిక్ భూతం ఇప్పుడు మనుషుల శరీరంలోకి సైతం చొరబడుతోంది. మనుషుల ఉపరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను ఇంగ్లాండ్లో యూనివర్సిటీ ఆఫ్ హల్కు చెందిన హల్యార్క్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు గుర్తించారు. గాలితోపాటు ప్రాణాంతక ప్లాస్టిక్ రేణువులను సైతం మనం పీలుస్తున్నామని వారు చెప్పారు. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ తిష్ట వేస్తే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సముద్రాలు, కొండలు, భూమి అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. వ్యర్థాల్లోకి చేరిన పెద్ద ప్లాస్టిక్ వస్తువులు చిన్నచిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలోకీ మారుతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ ప్లాస్టిక్ రేణువులను వాటర్ ఫిల్టర్లు కూడా అడ్డుకోలేవు. చివరకు ఇవి పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. 13 లంగ్ టిష్యూ నమూనాలను పరీక్షించగా, 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయని çపరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ సైన్స్లో ప్రచురించనున్నారు. జీవించి ఉన్న మనుషుల ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లను గతంలోనే గుర్తించినప్పటికీ.. ఊపిరితిత్తుల అంతర్భాగాల్లో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అని సైంటిస్టులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయని, అందులోకి ప్లాస్టిక్ రేణువులు చేరితే శ్వాసలో సమస్యలు వస్తాయన్నారు. -
Sakshi Cartoon: ...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్...
...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్... -
రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్ కణాలు..షాక్లో శాస్త్రవేత్తలు!
Microplastic in human blood: ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించామని డచ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు. ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే. (చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! -
మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్ వేరియంట్ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్పై ఈ వేరియంట్ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. వుహాన్లో ఉద్భవించిన సార్క్ సీఓవీ2 ఒరిజినల్ వేరియంట్తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలటఆ వేరియంట్ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం ప్లాస్టిక్ సర్ఫేస్లపై ఒరిజనల్ వేరియంట్ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్ 191.3 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, గామా వేరియంట్ 59.3 గంటలు, డెల్టా వేరియంట్ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్పై 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: కరోనా ఉధృతి: గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు అదే విధంగా చర్మం మీద ఒరిజినల్ వేరియంట్ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్ 21.1 గంటలు ఉంటుందని తెలిపారు. కాగా ఆల్ఫా, బీటా వేరియంట్ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు. -
ఆవు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్.. ఆపరేషన్ చేసి
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో పశువైద్యాధికారి గోవింద్ నాయక్ ఆవుకు ఆపరేషన్ చేసి దాని కడుపులోని 20కిలోల ప్లాస్టిక్ను తొలగించారు. మండలంలోని అడేగామకే గ్రామానికి చెందిన ఆశన్నకు చెందిన రైతు ఆవు కడుపు ఉబ్బింది. దీంతో ఆవును పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా పశువైద్యాధికారి పరిశీలించి ఆపు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆవుకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య -
యాదాద్రి ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని బేగంపేట్కు చెందిన సందీప్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 11న యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. స్వామి వారి నిత్య కల్యాణ వేడుకలో పాల్గొన్న వీరికి వడ ప్రసాదం అందజేశారు. ఇంటికెళ్లిన తర్వాత సోమవారం రాత్రి వడ ప్రసాదం తింటున్న సమయంలో అందులో ప్లాస్టిక్ కవర్ తగిలింది. దీంతో సందీప్ ‘‘ఎవరైనా చూసుకోకుండా తింటే ప్రాబ్లెమ్ అవుతుంది..దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను’’అంటూ వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయమై దేవస్థానం సూపరింటెండెంట్ అశోక్ను సాక్షి వివరణ కోరగా..ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని వాటిపై ఉన్న కవర్ చిన్నది పడినట్లుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ముంచుకొస్తున్న ముప్పు
సమస్త జీవన రంగాలనూ ఇప్పటికే చుట్టుముట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలు మున్ముందు మరింత ముప్పుగా పరిణమించబోతున్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక చేస్తున్న హెచ్చరిక అందరి కళ్లూ తెరిపించాలి. ఈ బెడద నుంచి బయటపడాలన్న ప్రయత్నాలు నత్తనడకనే ఉండటం ఆందోళన కలి గిస్తోంది. దేశంలో ఏటా 33 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ఎన్నడో అంచనా వేసింది. అయిదేళ్లలో ఇది రెట్టింపుకన్నా ఎక్కువైందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సగటున ఏడాదికి 21.8 శాతం వ్యర్థాలు కొత్తగా వచ్చిపడుతున్నాయి. ఇందుకు ఆధునిక జీవనశైలిని, ప్రభుత్వాల నిర్లిప్త ధోరణిని ప్రధానంగా తప్పుబట్టాలి. ఏడాదిన్నరగా పట్టి కుదుపుతున్న కోవిడ్ మహమ్మారి కూడా ఈ వ్యర్థాల పెరుగుదలకు కారణమే. అయినా కదలికేది? ప్లాస్టిక్ వ్యర్థాల్లో 66 శాతం వాటా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, తమిళనాడులదే. ఆ రాష్ట్రాలు అమలు చేసే చర్యలు, వాటి లోటుపాట్లు సమీక్షించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తగిన సలహాలివ్వాలి. ఆ పని చురుకందుకోవాలి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే దీన్ని వదుల్చుకోవడం అంత సులభం కాదు. ప్లాస్టిక్ వాడకం సదుపాయంగా ఉంటుందని చాలామంది చూస్తారు తప్ప, వాడి పడేశాక ఆ వ్యర్థాలు ఏమవుతాయన్న స్పృహ ఉండదు. పునర్వినియోగ ప్రక్రియతో అవి కొత్త రూపు సంతరించుకోవడం అంతంత మాత్రమే. దాని వాటా కేవలం 9 శాతం మాత్రమే. మిగతాదంతా నేలపై, డ్రైనేజీల్లో, నదులు, సముద్ర జలాల్లో చేరుతుంది. అవగాహన కొరవడి 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్నారు. అది మరింత ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పశుపక్ష్యాదులకు సైతం ప్రాణాంతకంగా పరిణమిస్తాయని, వందల ఏళ్లపాటు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయనే చైతన్యం జనంలో కొరవడుతోంది. ఒకసారికి మాత్రమే వినియోగపడే ప్లాస్టిక్ను క్రమేపీ నిషేధించాలని మన దేశం చాన్నాళ్లక్రితమే అనుకుంది. అందుకు సంబంధించిన నిబంధనలు సైతం 2016లో ఖరారయ్యాయి. మరో రెండేళ్లకు పూర్తి స్థాయి నిషేధం దిశగా చర్యలుండాలని కూడా సంకల్పించుకున్నారు. కానీ ఆచరణ అంత మెరుగ్గా లేదు. వచ్చే ఏడాది జూలైకల్లా ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించాలనుకుంటున్నట్టు 3 నెలల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్లాస్టిక్ అనగానే అందరికీ ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ 320 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్లకన్నా తక్కువుండే ప్లాస్టిక్ సంచులవరకూ అన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. కానీ వాటిని ఒక్కో రాష్ట్రం ఒక్కోవిధంగా అర్థం చేసుకుని నిబంధనలు తీసుకొచ్చాయి. ఏ రెండు రాష్ట్రాల మధ్యా సారూప్యత లేకుండా నిబంధనలుండటం వల్ల ఉత్పత్తిదారులు సులభంగా తప్పించుకుంటున్నారు. చర్యలు తీసుకునే విషయంలోనూ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎంతసేపూ చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులపై ప్రతాపం చూపుతాయి తప్ప ప్లాస్టిక్ సీసాలు, ఇతరత్రాు ఉత్పతతుŠుతలు చేసే భారీ సంస్థల జోలికిపోవు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేసే సంస్థలేమిటో ఆరాతీయగా అందులో 90 శాతం కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని తేలింది. మనదేశానికి సంబంధించినంతవరకూ గెయిల్, ఇండియన్ ఆయిల్, హల్దియా పెట్రో కెమికల్స్, రిలయన్స్ తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ప్యాకేజింగ్ వాటా 60 శాతం ఉంటుందని లెక్కేస్తున్నారు. కానీ దాన్ని అరికట్టడంపై ఇంతవవరకూ సరైన అవగాహన లేదు. 2016లో రూపొందిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు, దిగుమతి చేసుకునే సంస్థ, దాన్ని వినియోగించే సంస్థ ఆ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీతనం వహించాలి. ఇంతవరకూ అది అమల్లోకి రాలేదు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ చెత్తలో కలిసిపోయి, నదీజలాల్లోకి చేరి పర్యావరణం కాలుష్యమయం అవుతోంది. వాటిని తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకొచ్చినా వినియోగించుకునేవారు స్వల్పం. ఆమధ్య భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సమాఖ్య వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో కేవలం 7,500 రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటిలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలే. మహమ్మారిలా విస్తరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేయడం వీటివల్ల సాధ్యమేనా? మరింత మెరుగైన సాంకేతికత, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాల అమలు, బడా సంస్థలు సైతం రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తేగానీ లక్ష్యసాధన నెరవేరదు. ప్రభుత్వాలు చురుగ్గా కదలకపోతే సమస్య అదుపు తప్పుతుంది. కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రహదార్లు నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. వీటికి నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు, మన్నిక కూడా అధికమంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడటానికి, ప్రాణాంతక వ్యాధులు విస్తరించడానికి పర్యావరణ విధ్వంసమే కారణమని పదేపదే రుజువవుతోంది గనుక ఈ సమస్యను ఇంకెంతమాత్రమూ ఉపేక్షించడానికి లేదు. గాలి, నీరు, నేల... ఇలా అన్నిటినీ సర్వనాశనం చేసే ప్లాస్టిక్ వినియోగంపై అందరినీ చైతన్యవంతం చేసే కార్యాచరణ తక్షణావసరం. -
గేదె పాలు ఇవ్వడం లేదని ఆపరేషన్.. కడుపులో 5 కిలోల ప్లాస్టిక్
సాక్షి, ఆదిలాబాద్(నిర్మల్): ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. యథేచ్ఛగా వినియోగిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో ఆహారంగా భావించి తింటున్న పశువులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మామడ మండలం కొరిటికల్ గ్రామంలో లింగన్నకు చెందిన గేదె ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురైంది. మేత మేయకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, పాలు ఇవ్వకపోవడం వంటి లక్షణాలను గుర్తించిన పోషకుడు పశువైద్యులు ఓంప్రకాష్, శ్రీకర్రాజులకు సమాచారం అందించాడు. గురువారం గేదెను పరీక్షించిన పశువైద్యాధికారులు ప్లాస్టిక్ ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురైందని గుర్తించారు. ఆపరేషన్ ద్వారా గేదె కడుపులోపల ఉన్న ఐదు కిలోలకు పైగా ప్లాస్టిక్ను తొలగించారు. పశుపోషకులు పశువుల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..) -
మృత్యుసాగరం?
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యమే ప్రధాన శత్రువు వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాతపడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ప్రతి రోజూ 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తీరాన్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త -
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ?
సాక్షి, హైదరాబాద్: నేల, నీరును కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ను వదిలించుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. విమానాల విడిభాగాలు, రసాయనాలను తయారుచేసే అంతర్జాతీయ కంపెనీ ‘హనీవెల్’ తాజాగా ప్లాస్టిక్ భూతంపై ఓ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అన్ని రకాల ప్లాస్టిక్ చెత్తను నాణ్యమైన ముడి చమురుగా మార్చేసే ప్రక్రియను ఆవిష్కరించింది. హనీవెల్ అక్కడితోనే ఆగిపోలేదు. స్పెయిన్ సంస్థ సాకైర్ ఎస్ఏతో కలసి ఏటా 30 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్తను ముడి చమురుగా మార్చే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే 2023 కల్లా ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించవచ్చు. సుమారు 57 శాతం సీఓ2ను తగ్గించొచ్చు ఒక్కసారి తయారు చేశామంటే ప్లాస్టిక్ను నాశనం చేయడం అంత సులువైన పని కాదన్నది మనందరికీ తెలిసిన విషయమే. లెక్కలు చూస్తే ఏటా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్లో వాడకం తరువాత సగం చెత్తకుప్పల్లోకి చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇంకో 30 శాతం నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. రెండు శాతం ప్లాస్టిక్ మాత్రం మళ్లీ వాడుకొనే కొత్త ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. ప్లాస్టిక్తో పెట్రోల్, డీజిల్, కృత్రిమ నూలు తయారీలకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే హనీవెల్ అభివృద్ధి చేసిన పద్ధతి వల్ల ప్లాస్టిక్ను కూడా ఇతర పదార్థాల మాదిరిగా మళ్లీమళ్లీ వాడుకొనే అవకాశం లభిస్తుంది. ఆ కంపెనీ అంచనా ప్రకారం ఈ పద్ధతి వల్ల ప్లాస్టిక్ తయారీ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు దాదాపు 57 శాతం వరకూ తగ్గుతుంది. ఏమిటా పద్ధతి? నిజానికి హనీవెల్ ఉపయోగించిన ఆక్సిజన్ లేకుండా మండించే (పైరోలసిస్) పద్ధతి కొత్తదేమీ కాదు. కాకపోతే ముడి చమురులోని సూక్ష్మస్థాయి కాలుష్యాలను కూడా దశాబ్దాలుగా తొలగిస్తున్న హనీవెల్ తన అనుభవాన్నంత ఈ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించింది. అప్సైకిల్ అని పిలుస్తున్న ఈ పద్ధతిలో అన్ని రకాల ప్లాస్టిక్ను కలిపి వాడగలగడం విశేషం. పైరాలసిస్కు తోడు కొన్ని రసాయన ప్రక్రియలను కూడా ఉపయోగించడం ద్వారా తాము ముడి చమురును తయారు చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. స్పెయిన్లో మాదిరిగా మరింత మంది భాగస్వాములను కలుపుకొని ఈ టెక్నాలజీని విస్తృత వినియోగంలోకి తెస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల్లో 90 శాతాన్ని మళ్లీ వాడుకొనేలా ముడిచమురుగా మార్చగలమని కంపెనీ వివరిస్తోంది. చదవండి:బైకు కంటే విమానాలకే చీప్గా ఫ్యూయల్ -
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం.. ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 1 నుంచి వివిధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్ల వంటి వాటిపైనే నిషేధం ఉండగా..ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫికేషన్ రూపంలో దీనిపై ఆదేశాలు జారీచేసింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా.. ప్రజల్లో అవగాహన కల్పనకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. నిషేధం వీటిపైనే.. ► ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ఉత్పత్తి, దిగుమతి, స్టాక్ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ, వినియోగం తదితరాలు.. ► ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్క్రీం, క్యాండీలకు ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్ ► అలంకరణకు ఉపయోగించే థర్మకోల్ ► ప్లేట్లు, గ్లాసులు, ఫోర్క్లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేల వంటి సామగ్రి ► స్వీట్బాక్స్లు ప్యాకింగ్ చేసే ఫిల్మ్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు ► వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్/ పీవీసీ బ్యానర్లు ఉల్లంఘనులపై జరిమానాలు... ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సీపీసీబీ నిర్ణయించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాల పీసీబీలు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలకు కల్పించింది. రిటైల్ వ్యాపారులు, అమ్మకందారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులపై జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిమానాలు విధించవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై రూ.500, పారిశ్రామిక వ్యర్థాలకు కారణమయ్యే వారికి రూ.5 వేల చొప్పున జరిమానా వేయొచ్చు. ప్రత్యామ్నాయాలివే... ► పత్తి/ ఉన్ని/వెదురుతో తయారు చేసిన బ్యాగ్లు ► స్పూన్లు, స్ట్రాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వెదురు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసే వస్తువులను ఉపయోగించవచ్చు ► వేడి పానీయాలు, ఇతర అవసరాల నిమిత్తం మట్టిపాత్రల వంటివి వాడొచ్చు. -
జామరైతు ఆలోచన అదుర్స్
సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. మండలంలోని చెంఘీజ్ఖాన్పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్లోని రెడ్, వైట్ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది. ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్ పాలిథిన్ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా వైజాగ్ బీచ్
-
ఇది నా పూర్వజన్మ అదృష్టం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడూతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండో సారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ.. మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడంలో విజయవంతం అయ్యామని అన్నారు. తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకు రావడంతో పాటు వాటిని అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో దర్శనాలు కూడా కుదించాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించనున్నామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. వెయ్యేళ్ల కిందట ప్రకృతి సిద్ద వ్యవసాయం ఆధారంగా పండించిన ధాన్యాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పించే వారని, మళ్లీ 100 రోజులుగా తిరిగి ఆ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. -
ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతి రేఖ
సాక్షి, హైదరాబాద్: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది. 3 రోజుల పాటు వైరస్ వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్ అభివృద్ధి చేశారు. వైరల్ రీసెర్చి ల్యాబ్స్లో ఉపయోగించే కోటింగ్ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్ కోడ్ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు. ఆస్పత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు భారత్, బ్రిటన్ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్లోని వేల్స్లో థర్మల్ కంపాక్షన్ గ్రూప్ (టీసీజీ) హాస్పిటల్ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్స్ట్రక్షన్ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్లో 27 ఏళ్ల బినిష్ దేశాయ్ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్ఇన్ఫెక్ట్ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్తో మిక్స్ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్ను ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటున్నారు. -
భారీగా పెరిగిన మోల్డ్టెక్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సంస్థ మోల్డ్టెక్ ప్యాకేజింగ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పదింతలకుపైగా ఎగసి రూ.18.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రెండింతలకుపైగా అధికమై రూ.134 కోట్లు సాధించింది. ఎబిటా 176 శాతం పెరిగింది. ఉత్తరాది మార్కెట్ కోసం ఉత్తర ప్రదేశ్లో ప్లాంటు స్థాపించేందుకు కావాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సంస్థ సీఎండీ లక్ష్మణ రావు వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన కాన్పూర్లో తీసుకున్న ప్రాంగణంలో అక్టోబర్లో కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
ఆ రోజు నుంచి ప్లాస్టిక్ ఉండదు
న్యూఢిల్లీ: 2022 జనవరి 1 నుంచి ప్లాస్టిక్ ఉపయోగాన్ని క్రమంగా తగ్గించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కనిపించకుండా చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందిన కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటుకు తెలిపారు. ప్లాస్టిక్ పుల్లలు ఉన్న ఇయర్ బడ్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, డెకరేషన్ చేసేందుకు ఉపయోగించే పాలీస్టైరిన్లు జనవరి 1 నాటికి ఉపయోగించకుండా చూసే ప్రక్రియ సాగుతోందని అన్నారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ,120 మైక్రాన్ల మందం కంటే తక్కవ ఉండే రీసైకిల్డ్ క్యారీ బ్యాగులను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మార్కెట్లో అందుబాటులో లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
కల్తీ కోడిగుడ్ల కలకలం
-
ఆవు కడుపులోని ఆ ద్రవాలతో ప్లాస్టిక్ భూతానికి చెక్!
తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్లు కూడా అలాంటివే. ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. -
ప్లాస్టిక్ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన
నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రపంచ పర్యావరణవేత్తల ఆందోళనను ఆలకించిన నైజీరియా టీనేజర్లు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నడుం బిగించారు. ఒకసారి వాడి పడేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యాషన్ బుల్ డ్రెసులు, బ్యాగులు రూపొందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నైజీరియాకు చెందిన 15 ఏళ్ల ఎసోహి ఒజిగ్బో ‘ట్రాషన్ షో’ ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవచ్చో చెబుతోంది. వినూత్న అవగాహన కార్యక్రమం నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పూనుకున్నారు. డస్ట్బిన్, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలను జాగ్రత్తలు పాటిస్తూ సేకరించి, ఉపయోగపడే వస్తువులు, ఫ్యాషనబుల్ దుస్తులను తయారు చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల డ్రస్లను ‘గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్ షో’ పేరిట ప్రదర్శించారు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫ్యాషన్ షోలో ఫ్యాషన్ డ్రస్సులేగాక ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్లు, డస్ట్బిన్ల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్ మాల్స్ వద్ద విక్రయిస్తున్నారు. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు ఒజిగ్బో మాట్లాడుతూ.. ‘‘ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ.. మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాం. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేకరించి .. శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాబ్రిక్ తో కలిపి కుట్టి మోడల్ వస్త్రాలు, బ్యాగులు రూపొందిస్తున్నాం. మేము రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్ షో మంచి వేదిక అయింది. మేమంతా టీనేజర్లం.. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి మాలో ఉంది. అందుకే స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్నాము’’ అని చెప్పింది. గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవప్థాపకులు నినేడు మొగాంబో మాట్లాడుతూ..‘‘ఒజిగ్బో బందం తయారు చేసిన దుస్తులను షాపింగ్ మాల్స్లో స్టేజ్ షోలను ఏర్పాటు చేసి ప్రమోట్ చేయడమేగాక, ట్రాషన్ షో నిర్వహించి ప్లాస్టిక్ ఫాషన్కు జీవం పోశాం. ఒజిగ్బో బృందంలో అంతా టీనేజర్లే అయినప్పటికీ పర్యావరణంపై వారికున్న అవగాహన, భవిష్యత్తు తరాలకోసం ఆరాటపడడం విశేషం’’ అని మొగాంబో అభినందించారు. ( చదవండి: అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా! ) -
Plastic Toys: అమ్మో ‘ప్లాస్టిక్ బొమ్మ’..
సాక్షి, న్యూఢిల్లీ: మీ చిన్నారులు ఎక్కువ సమయం బొమ్మలతో ఆడుకుంటున్నారా..? ఆటల్లో భాగంగా బొమ్మలను నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తున్నారా...? అయితే మీరు ఇప్పటికైనా పిల్లల అలవాట్లను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కరోనా కారణంగా ఏడాదిగా స్కూళ్ళకు తాళం పడడంతో, చదువులంతా ఆన్లైన్లో అయిపోయేసరికి రోజంతా చిన్నారులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తరువాత ఖాళీ సమయం టీవీ చూడడం, బొమ్మలు వారికి వినోదంగా మారాయి. అయితే చిన్నారులు ఎక్కువగా రోజంతా తమతో పాటే ఉంచుకొనే బొమ్మల విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు. అంతేగాక శిశువుల చేతికి ప్లాస్టిక్ బొమ్మలను అందించే మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆడుకొనే బొమ్మల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయనే విషయంలో ఆందోళన వ్యక్తమౌతూనే ఉంది. ఇదేమీ కేవలం మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ఆడుకొనే ప్లాస్టిక్ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ ఏ మేరకు సురక్షితం అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో, బొమ్మల తయారీలో వాడే రసాయనాల్లో సుమారు 100కు పైగా ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. హార్డ్, సాఫ్ట్, ఫోం బేస్డ్ ప్లాస్టిక్తో తయారుచేసిన బొమ్మల్లో సుమారు 419 రసాయనాలు లభించాయని డెన్మార్క్ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు పీటర్ తెలిపారు. వీటిలోని 126 రసాయనాల కారణంగా చిన్నారుల్లో క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వచ్చేందుకు కారణమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు ఉపయోగించే బొమ్మల్లో ఉండే ప్రాణాంతకమైన ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో ప్రకటించారు. ఈ ప్రమాదం చిన్నారులు ఇటీవల ఎక్కువగా ఆడుకొనే పాలిస్టర్ టన్నెల్తో కూడా ఉందని అధ్యయనం గుర్తించింది. పాలిస్టర్ టన్నెల్ తయారీలో వినియోగించిన మెటీరియల్లో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వాణిజ్య, వినియోగదారు ఉత్పత్తులలో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయన వాడకం 1970 లో ఫ్లేమ్ ఎబిలిటీ స్టాండర్డ్తో ప్రారంభమైంది. అయితే మార్కెట్లో లభించే ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో తయారైన అన్ని ఉత్పత్తులతో ఆరోగ్యపరంగా ప్రమాదం ఉండదని, ఈ రసాయనంతో క్లోరిన్, బ్రోమైడ్ , భాస్వరం రసాయనాలు కలిసి ఉన్న త్పత్తులతో ప్రమాదం ఉందని గుర్తించారు. ఫర్నిచర్, పిల్లల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి, దుస్తులు, కారు సీట్లు , వాహనాల లోపలి భాగాల తయారీలో ఫ్లేమ్ రిటార్డెంట్ ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో ఉన్న రసాయనం నేరుగా చర్మంలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో పాటు, దుమ్ములో పేరుకుపోవచ్చని తెలిపారు. ఒక పరిశోధనలో ఫ్లేమ్ రిటార్డెంట్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేగాక బ్రోమినేటెడ్ రసాయనంతో క్యాన్సర్, హార్మోన్ల్లో తేడాలు, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావంతో పాటు న్యూరో డెవలప్మెంట్ సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. కొద్దిమంది చిన్నారులపై నిర్వహించిన పరిశోధనలో ఈ రసాయనం కారణంగా పిల్లల్లో ఐక్యూ లెవల్స్ తగ్గుతాయని, పిల్లల ప్రవర్తన, వ్యవహార శైలిలో మార్పు వస్తుందని గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక పరిశోధనలో చిన్నారుల్లో ఐక్యూ నష్టానికి బ్రోమినేటెడ్ ఫ్లేమ్ అతిపెద్ద కారణమని తేలింది. అంతేగాక ఇది పిల్లల్లో మేధో వైకల్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఇటీవల శిశువుల ఉత్పత్తులు, కౌచ్ల్లో క్లోరినేట్ ట్రీ రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు. 40 ఏళ్ళ క్రితం మాన్యుఫాక్చరర్లు ఈ రసాయనాన్ని వాడటం మానేసినప్పటికీ, తరువాత దీనిని మళ్లీ ఉపయోగించడం ప్రారంభించినట్లు తాజా పరిశోధనల్లో తేలింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసిఐ) 2019 లో దిగుమతి చేసుకున్న కొన్ని బొమ్మలను పరీక్షించింది. 121 రకాల బొమ్మలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపగా, అందులో 66.90% బొమ్మలు పరీక్షల్లో ఫెయిల్కాగా, 33.1% బొమ్మలు మాత్రమే నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షలు జరిపిన బొమ్మలలో 30% ప్లాస్టిక్ బొమ్మలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వీటిలో సీసం వంటి హెవీ మెటల్ కంటెంట్ ఉందని గుర్తించారు. 80% ప్లాస్టిక్ బొమ్మలు మెకానికల్, ఫిజికల్ భద్రతా ప్రమాణాల విషయంలో విఫలమయ్యాయి. అంతేగాక రీసైకిల్ ప్లాస్టిక్తో చేసిన అన్ని బొమ్మలలో చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరమైన డయాక్సిన్ రసాయనం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. బొమ్మలలో ఇది 690 ప్రతి గ్రాము టిఎఫ్క్యూ (టాక్సిక్ ఈక్వివలెంట్ కోషెంట్) ఉందని తేలింది. పిల్లలు తీవ్రమైన వ్యాధుల బారిన పడేందుకు కారణమైన బ్రోమినేటెడ్ డయాక్సిన్ రసాయనం సైతం ఈ బొమ్మల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్లలను ఎలా రక్షించాలి? ఈ రసాయనాల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్లాస్టిక్ బొమ్మలు కొనడం తగ్గించడం తో పాటు, వారిని ప్లాస్టిక్ బొమ్మలకు దూరం గా ఉంచడమే సులభమైన మార్గం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విదేశాలలో ఉన్న పిల్ల లు ప్రతి సంవత్సరం సగటున 18.3 కిలోగ్రాముల ప్లాస్టిక్ బొమ్మలను కొనుగోలు చేయ డం కానీ జమ చేయడం కానీ చేస్తారు. అవస రాని కంటే ఎక్కువ బొమ్మలు కలిగి ఉన్న పిల్లలతో పోలిస్తే, తక్కువ బొమ్మలు ఉన్న పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. -
మొన్నేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. ఏంటి రోహిత్
చెన్నై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. రోహిత్ ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడతాయి. బంతిని బలంగా బాదే రోహిత్లో కొన్ని తెలియని విషయాలు ఈ ఐపీఎల్ సీజన్లో మన ముందు కనిపిస్తున్నాయి. మ్యాచ్లు గెలిపించడంలోనే కాదు.. పర్యావరణాన్ని కాపాడడంలోనూ రోహిత్ ముందు వరుసలో ఉంటున్నాడు. మొన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ తన షూపై ''సేవ్ ది రైనోస్'' అని రాసుకొని.. అంతరించిపోతున్న వాటిని కాపాడాల్సిన అవసరం ఉందంటూ సందేశాన్ని అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ మరో అంశంతో ముందుకొచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్కు రోహిత్ శర్మ తన కాలి షూపై ''ప్లాస్టిక్ ఫ్రీ ఓషన్'' అని రాసుకొని సముద్రాలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దామంటూ అవగాహన కల్పించాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందిస్తూ..'' ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది ఒక భూతంలా తయారైంది. దానిని తరిమికొట్టకుంటే ప్రకృతిని మన చేతులారా మనం నాశనం చేసుకున్నట్లే. ఎందుకో ఈ అంశం నా మనుసును తాకింది.. అయితే ప్లాస్టిక్ అనే భూతాన్ని వంద శాతం కంట్రోల్ చేయడం మనచేతుల్లోనే ఉంది. నేను ఈరోజు నుంచి దానిని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నా.. మీరు నా వెంట వస్తారని ఆశిస్తున్నా.. రండి ప్లాస్టిక్ భూతాన్ని తరుముదాం.. సముద్రాలను పరిశుభ్రం చేద్దాం.''అంటూ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చాడు. అయితే రోహిత్ పెట్టిన అంశం మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తుంది. ''ఈ సీజన్లో రోహిత్లో కొత్త యాంగిల్స్ చాలా చూస్తున్నాం.. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలో.. మొన్న రైనోస్.. ఇవాళ ప్లాస్టిక్.. రేపేంటి.. మొన్నేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. ఏంటి రోహిత్.. మా కెప్టెన్ మ్యాచ్ను గెలిపించడమే కాదు.. పర్యావరణం కాపాడడంలోనూ ముందుంటాడు.'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కర్టసీ: ఐపీఎల్/ ఇన్స్టాగ్రామ్ ఇక కేకేఆర్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. రసెల్ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ చహర్ (4/27) తన స్పిన్తో కోల్కతాను తిప్పేశాడు. చదవండి: చెన్నైలో అదొక ట్రెండ్: రోహిత్ రనౌట్ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్ The other cause that’s extremely close to my heart. This one hits hard! This is a hundred percent in our control to reverse. I take my cause with me while I go out and do what I love! (1/2) pic.twitter.com/ZF5xP1zy9k — Rohit Sharma (@ImRo45) April 14, 2021 -
ఏపీలో జోరుగా.. ‘స్వఛ్చతా హీరో’
సాక్షి, అమరావతి : ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణంలో స్వఛ్చతా హీరో కార్యక్రమం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎమ్సి)తో కోకో కోలాకు చెందిన బాట్లింగ్ భాగస్వామి శ్రీ సర్వారాయా సుగర్స్ లిమిటెడ్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. కేంద్రప్రభుత్వ స్వఛ్చ భారత్ మిషన్ స్ఫూర్తిగా దీన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు పౌరులనూ భాగస్వాములను చేయడం అవసరమని ఈ కార్యక్రమం ద్వారా చెబుతున్నామన్నారు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు.. వ్యర్ధాల విభజనపై అవగాహన పెంచడం, ప్రజల థృక్పధాలలో మార్పు తీసుకురావడం కూడా ఈ కార్యక్రమంలో భాగమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్లినెస్ డ్రైవ్ చేపడతామని వీరు చెప్పారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ కోసం స్థానికంగా ఉన్న శక్తి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్కు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పలు బ్రాండెడ్ కియోస్క్లు, సెల్ఫీ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరంలోని 50 వార్డులలో కలెక్షన్ వ్యాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను తీసుకుని జ్యూట్ బ్యాగులను ఉచితంగా ఇవ్వడం వంటి ఆకర్షణీయమైన ప్రచారంతో ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ కార్యక్రమం ఊపందుకుంది. తొలిదశ కార్యక్రమంలో భాగంగా నిర్ణీత 35 రోజులలో మురికివాడలు, కాలనీల నుంచి ఇప్పటికే 5టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించామని అంటే సగటున రోజుకి 150 కిలోలు సేకరించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనిలో పాల్గొన్నవారు సదరు ఛాయా చిత్రాలను ఫేస్బుక్, ట్విట్టర్లలో పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మునిసిపల్ అధికారి హెల్త్ ఆఫీసర్ డా.ఎ.వినూత్న మాట్లాడుతూ పరిశుభ్రత, బాధ్యతాయుతంగా వ్యర్ధాలను పారవేయడం అనేవి మనం రోజువారీ జీవితంలో క్రమశిక్షణగా అలవరచుకోవాల్సిన విషయాలు. వ్యర్ధాల నిర్వహణ చుట్టూ అల్లుకున్న సవాళ్లను అధిగమించడానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి’’ అని సూచించారు. -
ఆ బియ్యమే తిన్నాం.. భయంగా ఉంది
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉందనే వార్త మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో శనివారం బియ్యం పంపిణీ చేశారు. ఇంటికెళ్లి పరిశీలించగా ముత్యం వంటి పరిమాణంలో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. వీటిని గమనించిన లబ్ధిదారులు వెంటనే రేషన్ డీలర్కు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ వోలపు శారద, ఎంపీటీసీ సభ్యుడు డేగ బాపు రేషన్ దుకాణాన్ని పరిశీలించి బియ్యం తీసుకున్న వారిని అప్రమత్తం చేశారు. వెంటనే దండోరా కూడా వేయించి ఆ బియ్యం తినొద్దని.. తిరిగి ఇచ్చేయమని చాటింపు వేయడంతో ఆ దుకాణంలో తీసుకున్న లబ్ధిదారులంతా ఆందోళన చెందారు. వారిలో పది మంది తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ రాళ్లు ఉన్నాయి. శుక్రవారం పంపిణీ చేసిన వాటిలో కూడా కొందరికి ప్లాస్టిక్ రాళ్లు వచ్చాయని తేలింది. తహసీల్దార్ మహ్మద్ జమీర్ దుకాణాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ బియ్యం వంటి రాళ్లను కొంతమంది సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. అయితే మూడు రోజుల కిందట నంనూర్ పునరావాస కాలనీలోని రేషన్ దుకాణంలో కూడా బియ్యంలో ప్లాస్టిక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. వండుకుని తిన్నాం మొన్న శుక్రవారం రేషన్ బియ్యం తీసుకువెళ్లా. శనివారం ఉదయం ఇంట్లో ఈ బియ్యాన్నే వండుకుని తిన్నాం. ఇంతలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని దండోరా వేయించారు. అది విన్నప్పటి నుంచి భయంగా ఉంది. వెంటనే వండిన అన్నాన్ని పరిశీలిస్తే అందులో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. మేము అదే అన్నం తిన్నాం.. ఏం జరుగుతోందనని భయమవుతోంది. – మాదినేని రాజమ్మ, వేంపల్లి -
‘మాస్కు’లతో మరో ప్రమాదం
లండన్ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నేడు ప్రజలందరికి మాస్కులు తప్పనిసరి అయిన విషయం తెల్సిందే. ఈ మాస్కులు మరో విధంగా మనకు ముప్పును తీసుకొస్తున్నాయి. ఉతికి ఆరేసుకునే గుడ్డ మాస్కులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే ప్లాస్టిక్తో కూడిన మాస్కులనే ఉపయోగిస్తున్నారు. ఒక్క బ్రిటన్లోనే పౌరులు ప్లాస్టిక్తో కూడిన మాస్కులు వాడుతూ ఏ రోజుకు ఆ రోజు వాటిని పారేస్తున్నారని భావిస్తే ఓ ఏడాదికి అంచనాల ప్రకారం 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల ప్లాస్టిక్ వ్యర్థాలు మహా కూడుతాయి. అంతేకాకుండా వైరస్ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్ మట్టిలోకి కూరుకు పోవడం, జల మార్గాల్లో, భూగర్భ జలాల్లో కలిసి పోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటది. ప్లాస్టిక్ వాడ కూడదనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ప్లాస్టిక్ మాస్కులనే ఎక్కువగా వాడుతున్నారు. గ్లౌజులు కూడా ప్లాస్టిక్వే ఎక్కువగా వాడేవి. ప్రపంచవ్యాప్తంగా మాస్కులను ఎక్కువగా తయారు చేస్తోన్న దేశం ఇప్పటికీ చైనానే. గత ఫిబ్రవరి నెల నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఆ కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరిగిందట. మాస్కుల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్–95 మాస్కులు. గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. వీటికంటే ఎన్–95 మాస్కులు అత్యంత శ్రేయస్కరమైనవి. 95 శాతం ఇవి గాలిద్వారా వచ్చే వైరస్లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ మాస్కులు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. ఈ రెండు రకాల మాస్కులను ఏ రోజుకారోజు పారేయాల్సి ఉంటుంది. ఎన్–95 మాస్కుల స్ట్రాప్ను పోలిసొప్రేన్, స్టాపిల్స్ను స్టీల్తో, ముక్కు వద్ద పోలియురెథేన్, ముక్కు వద్ద క్లిప్ను అల్యూమినియం, ఫిల్టర్ను పోలిప్రొఫిలిన్లతో తయారు చేస్తారు. ముక్కు, మూతి పూర్తిగా మూసుకుపోయే మాస్కులను వాడితే తప్పా గుడ్డ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ప్లాస్టిక్ మాస్కుల వల్ల పలు విధాల ప్రమాదం పొంచి ఉంది. రోజువారిగా ఉపయోగించే మాస్కులను మట్టిలో కలిసిపోయే పదార్థాలతోనే తయారు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: వ్యాక్సిన్ ముందుగా ఎవరెవరికి..) -
ప్రపంచ జలాల్లోకి 5.30 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు
ఒట్టావా : ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నివారించేందుకు అటు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దీంతో చెరువులు, కుంటలు, నదులు, నదాలు, సరస్సులు, సముద్ర జలాలు ప్యాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రపంచ దేశాలు నెరవేర్చినప్పటికీ 2030వ సంవత్సరం నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతాయని ఓ కెనడా బృందం అంచనా వేసింది. ఇది 2005 సంవత్సరం నాటి ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏడింతలు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచ జలాల్లోకి ఏటా 2.40 నుంచి 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని అధ్యయనంలో తేలింది. (శుక్రుడి మీద జీవం: రష్యా సంచలన ప్రకటన) ప్లాస్టిక్ ఉత్పత్తులను తక్షణం సంపూర్ణంగా ఆపేయడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను నూటికి నూరు శాతం రీసైక్లింగ్ చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని అప్పుడే పరిస్థితి మెరగుపడుతుందని టొరాంటో యూనివర్శిటీకి చెందిన కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ హెచ్చరించారు. 2015లో ప్లాస్టిక్ వ్యర్థాల్తో 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్కు పనికి రానివని తేలిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సముద్ర తీర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏటా ఏరివేయడంలో ఎన్జీవో సంస్థల తరఫున కొన్ని లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని, 2030 నాటికి కనీసం వంద కోట్ల మంది కార్యకర్తలు వ్యర్థాల ఏరివేతలో పాల్గొంటే తప్పా పరిస్థితి మెరగుపడే అవకాశమే లేదని ఆమె హెచ్చరించారు. -
ఇక ప్లాస్టిక్ నిషేధం!
సాక్షి, హైదరాబాద్: సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పడేసే) ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలతో కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధమైంది. తమ ప్రాంత పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలను ఆదేశించింది. ప్లాస్టిక్తో పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు, నిల్వలు జరపరాదని రిటైలర్లను కోరాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, సామూహిక కార్యక్రమా ల్లో దీని వాడకాన్ని నియంత్రించాలని పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జరిమానాలు.. ► రిటైలర్లు, విక్రేతలు, వ్యాపార సముదాయాలు తొలిసారిగా ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘిస్తే రూ.2,500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. మళ్లీ ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను పడేసే వ్యక్తులపై ప్రతిసారీ రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా వేస్తారు. ► బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాల్లో నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తారు. -
పనికిరాని ప్లాస్టిక్తో లక్ష కి.మీ రోడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసింది. దీంతో భారత ప్రభుత్వం మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. (చైనా మొబైల్ కంపెనీ డీల్ను వదులుకున్న హీరో!) ఒక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడింది. మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కిలోమీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా ఆరు నుంచి ఎనిమిది శాతం ప్లాస్టిక్, 92 నుంచి 94 శాతం తారు ఉంటాయి. (నాపెళ్లి ఆపండి.. ఓ అమ్మాయి ఫోన్!) గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా 2018లో తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడటం మొదలుపెట్టంది. ప్రస్తుతం అక్కడ తారురోడ్లలో ప్లాస్టిక్ను వాడటం తప్పనిసరి.జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో 270 కిలోమీటర్ల దూరానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు కలిపి రోడ్డు వేశారు. ఢిల్లీ–మీరట్ జాతీయ రహదారిలో కూడా 1.6 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను వాడారు. ధౌలా కువాన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వేసిన రోడ్డులోనూ ప్లాస్టిక్ను వాడారు. భారత్లో రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారవుతున్నాయి. ఇది 4300 ఏనుగుల బరువుతో సమానం. ఇందులో 60 శాతంపైగా రీసైక్లింగ్ అవుతోంది. మిగిలిన దాని మూలంగా వాతావరణం కాలుష్యం అవుతోంది. -
పాలను వేడి చేస్తే ప్లాస్టిక్గా మారింది
ఉడికిస్తే పాలు ప్లాస్టిక్ పదార్థంగా తయారైంది. లాగితే సాగుతోంది. భూమికి కొడితే బంతిలా లేచింది. దీంతో అందోళన చెందిన వినియోగదారులు కల్తీ పాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాన్సువాడ: పాలను ఉడికిస్తే ప్లాస్టిక్ పదార్థంలా మారి నేలకేసి కొడితే బంతిలా ఎగరడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బుధవారం ఈ చోద్యం చోటుచేసుకుంది. స్థానిక రాజారాం దుబ్బలో నివాసం ఉండే అస్లామ్ ఓల్డ్బాన్సువాడలో గల పాల కేంద్రం నుంచి లీటర్ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వేడి చేయగా అవి పగిలిపోయాయి. అయితే పగిలిపోయిన పాలను వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామనే ఉద్దేశంతో మరిగించగా ఆ పాలు కాస్త ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. ఆ ముద్దను ఎంత లాగినా ప్లాస్టిక్ లాగే ఉండడం, తినడానికి ప్రయత్నిస్తే ప్లాస్టిక్ వాసన రావడంతో అవాక్కయ్యారు. దీంతో ఆందోళన చెందిన అతను బాన్సువాడ డీఎస్పీ దామోదర్రెడ్డికి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన డీఎస్పీ, అదే పాలకేంద్రం నుంచి మరో లీటర్ పాలను తీసుకువచ్చి ఆ పాలను పగిలిపోయేలా చేసి వేడి చేయగా, అది కూడా ప్లాస్టిక్ ముద్దలా తయారైంది. దీంతో పాలలో రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసి, ఆ పాల కేంద్రాన్ని సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. లీటర్కు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న ఆ పాలలో రసాయనాలు కలిపి చిక్కగా మారే విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు. పాలలో రసాయనాలు కలపడం వల్ల అది కల్తీ అయి, ప్లాస్టిక్గా మారుతోంది. స్వయాన పరిశీలించాను. పెరుగు కూడా ప్లాస్టిక్గా తయారవుతోంది. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సమగ్ర విచారణ చేస్తారు. ఆయనకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, శాంపిల్స్ను సేకరిస్తారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటాం. – దామోదర్రెడ్డి, డీఎస్పీ పాలను వేడి చేస్తే ప్లాస్టిక్గా మారింది పాల కేంద్రం నుంచి నేను లీటర్ పాలను ఇంటికి తీసుకెళ్లాను. అవి పగిలిపోయాయి. వేడి చేసి చక్కెర కలిపి పిల్లలకు ఇద్దామనుకున్నాం. వేడి చేయగా అవి పూర్తిగా ప్లాస్టిక్లా మారింది. దాన్ని ముద్ద చేస్తే ప్లాస్టిక్ బంతిలా తయారైంది. వెంటనే డీఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాను.–అస్లామ్, పాలను కొనుగోలు చేసిన వ్యక్తి -
నెట్లో వైరల్గా మారిన ప్లాస్టిక్ హగ్
-
కరోనా ఏ వస్తువుపై ఎన్ని రోజులు ఉంటుందంటే..
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నా సంగతి తెలిసిందే. అయితే కరోనాకు మందు లేకడపోవడంతో.. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్(సీడీసీ) లోతైన పరిశోధనలు జరుపుతున్నాయి. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఏయే వస్తువులపైన ఎంత సేపు ఉంటుందనే దానిపై పరీక్షలు కొనసాగుతున్నాయి. అందుకే వైరస్ ఎక్కువ కాలం నిలిచి ఉండే వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వస్తువుల ఉపరితలాలపై కరోనా వైరస్ నిలిచే ఉండే కాలం అక్కడి ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ : కాపర్ మంచి ఉష్ణ కారకం కాకపోవడం వల్ల దాని ఉపరితలంపై కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉంటుంది. అందుకే మిల్క్ ప్యాకెట్లను, ప్లాస్టిక్ బాటిళ్లతోపాటుగా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను వాడేవారు వాటిని తప్పనిసరిగా సబ్బుతోగానీ, నీటితో గానీ శుభ్రపరచాలి. ముఖ్యమైన వస్తువులు తప్ప మిగిలిన ప్లాస్టిక్ వస్తువులను మట్టుకోకుండా దూరంగా పెట్టడం మంచింది. బయటకు వెళ్లినప్పుడు ప్టాస్టిక్ వస్తువులను ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రపరచుకోవడం మంచింది. స్టెయిన్లెస్ స్టీల్ : ప్రస్తుతం వంట గదిలో వినియోగించే వాటిలో ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులే కనిపిస్తున్నాయి. వీటిపై కూడా కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉండే అవకాశం ఉంది. అందుకే కిచెన్లోని వస్తువులను రోజుకు ఒక్కసారైనా శుభ్రపరుచుకోవాలి. అలాగే మనం రోజువారి అవసరాల కోసం వినియోగించుకునే వాటిని ఒక పక్కకు ఉంచి వాటిని మాత్రమే తరుచూ శుభ్రపరుచుకుంటే వైరస్ వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఇంట్లోని టీవీ స్ర్కీన్ను 70 శాతం అల్కహాల్ కలిగిన ద్రావణాలతో శుభ్రపరచాలి. అట్టపెట్టెలు : అట్టపెట్టెలపై కరోనా వైరస్ ఒక్క రోజు వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి అంతా ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. వాటిని ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రపరుచుకోవడం వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంట్లో వినియోగించే వస్తువులు.. : మనం నిత్యం వినియోగించే బెడ్ షీట్స్, కూరగాయలు, పండ్లు.. వంటి వాటి ద్వారా వైరస్ వ్యాప్తి అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు బయటి నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రపరడం.. మళ్లీ వినియోగించేటప్పుడు నీటితో కడుక్కోవడం చేయాలి. కాగా, పలు పరిశోధనల్లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులను కడుక్కోవాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. ముఖ్యంగా నోరు, ముక్కు ద్వారా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో.. చేతులు కడగకుండా నోటిని, ముఖాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించింది. ఒక మనిషి దగ్గినప్పుడు దాదాపు 3 వేల తుంపర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతుంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వచ్చేసింది ఎకో ఫ్రెండ్లీ ఫుడ్జోన్
గచ్చిబౌలి: నో ప్లాస్టిక్, నో వెండింగ్ నినాదంతో జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైటెక్సిటీలో టౌన్ వెండింగ్ కమిటీ ప్రకటించిన రెడ్జోన్లో వీధి వ్యాపారుల కోసం దాదాపు రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫుడ్జోన్లో 50 స్టాళ్లు నెలకొల్పారు. వ్యాపారులను బృందాలుగా చేసి స్టాళ్లను అప్పగించారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ అందించనున్నారు. షీ టాయిలెట్లు, స్టోన్ బెంచీలు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆకర్షించేలా ఫుడ్ సంబంధిత పెయింటింగ్స్ వేశారు. స్టాళ్లలో ఆహారాన్ని తయారు చేసే వారికి జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. రెడ్ జోన్ ఇదే.... చందానగర్ సర్కిల్–21 పరిధిలోని మాదాపూర్లోని నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్కు కుడివైపు, మెటల్ చార్మినార్ కమాన్ నుంచి న్యాక్ గేట్ వరకు రెండు వైపుల రెడ్ జోన్గా ప్రకటించారు. రోడ్లపై వీధి వ్యాపారులు ఉండరాదని.. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడోద్దనే నినాదంతో రెడ్ జోన్ పరిధిలో శిల్పారామం ఎదురుగా అండర్ పాస్ పక్కన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్ను ఏర్పాటు చేశారు. మాదాపూర్లోని ఫుడ్ జోన్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్తదితర సౌకర్యాలు స్టాళ్ల అలాట్మెంట్.. మాదాపూర్లోని ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఇప్పటికే 47 మంది వ్యాపారులకు అప్పగించారు. హైదరాబాద్, ఇండియన్, ఇటాలియన్, చైనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఒకటో నెంబర్ స్టాల్లో మొక్కజొన్న పిండితో చేసిన ప్లేట్స్, గ్లాసులు, స్పూన్లు, కంటెయినర్స్ విక్రయిస్తారు. ఇవి వాడిన తరువాత నీటిలో వేస్తే కరిగిపోతాయి. రెండో నెంబర్ స్టాల్లో కాటన్ బ్యాగ్స్, జ్యూట్ బాగ్స్, పేపర్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇక్కడ నిషేధం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఫుడ్ జోన్ తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నెలకు మెయింటెనెన్స్ రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్, నీటి వసతి జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. సోలార్ ప్యానెల్స్ .. ఫుడ్ జోన్లో 6 కేవీ కెపాసిటీ కల్గిన రెండు చోట్ల సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫుడ్ జోన్కు విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. స్టాళ్లకు ఎదురుగా రాతి బెంచీలు, టేబుల్స్ ఏర్పాటు చేయగా సోలార్ ప్యానెల్స్ వద్ద గ్రీనరీతో పాటు టాయిలెట్లు సిద్ధంగా ఉంచారు. -
టీటీడీకి నేషనల్ ఎర్త్ వర్క్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ప్లాస్టిక్ నిషేధంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఎర్త్ వర్క్ ప్రశంసలు కురిపించింది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయ కర్త జి. అక్షయ్, ఏపీ టీం సభ్యులు రిఖీ, భరత్చంద్ మంగళవారం తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి ప్రశంసాప్రతాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, భక్తులు తిరుమలకు ఎక్కువ భాగం బస్సుల్లో చేరుకుంటారని దీంతో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపేట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను చేపట్టిందని ఆయన తెలిపారు. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఎనలేని కృషి చేస్తున్న నేషనల్ ఎర్త్ నెట్ వర్క్ టీటీడీ చర్యలను ప్రశంసించడంతో దేవస్థానం బాధ్యత మరింత పెరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. -
గుండెకు ప్లాస్టిక్ పట్టీ...
గుండెజబ్బు వచ్చిన తరువాత గుండెపై ఉండే కణజాలం కొంత దెబ్బతింటుందని... ఫలితంగా ఆ భాగం గుండె లబ్డబ్లలో భాగం కాదని తెలుసు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దాని ప్రభావం కాస్తా మన ఆరోగ్యంపైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్లోని డబ్లిన్కు చెందిన ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ ప్లాస్టిక్ పట్టీ అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఈ పట్టీని చెడిపోయిన గుండె కణజాలంపై అతికిస్తే చాలు.. పరిసరాల్లోని గుండె కణాల విద్యుత్ ప్రచోదనాలను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఈ పట్టీలో విద్యుత్ ప్రచోదనాలను ప్రసారం చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ గుండె కణజాల సంకోచ వ్యాకోచాలను ఈ పట్టీ ద్వారా అనుకరించవచ్చునన్నమాట. ప్రస్తుతానికి ఈ పట్టీని తాము పరిశోధన శాలలోని కణజాలంపై ఉపయోగించి చూశామని, త్వరలోనే జంతు ప్రయోగాలు చేపడతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైకేల్ మోనగన్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి పట్టీలు కొన్ని అభివృద్ధి చేసినా వాటిల్లో సజీవ గుండెకణజాల కణాలనే ఉపయోగించే వారు కాగా.. తాము తయారు చేసింది పూర్తిగా ప్రత్యేక పదార్థాంతోనని ఆయన వివరించారు. సజీవ కణాలను చేరిస్తే పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
చేప పొట్టలో ప్లాస్టిక్; వీడియో వైరల్
ప్లాస్టిక్ భూతం మానవాళిని ఎంతగా నాశనం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకి ఎంతలా పెరిగిపోతుందే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్లాస్టిక్ నివారణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ మనుషులతోపాటు జంతువులకు కూడా హానీ కలిగిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో కలపడంతో అక్కడ ఉండే మత్య్స సంపద సైతం అంతరించి పోతుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కడుపులో ప్లాస్టిక్తో నిండిపోయిన చేప దొరికింది అనే క్యాప్షన్తో’ ట్విటర్లో షేర్ చేశారు. స్పెయిన్లోని కెనారాస్ దీవుల్లో ఓ మత్య్సకారుడు రెండు ఆక్టోపస్లను, ఒక చేపను పట్టుకున్నాడు. చేపలో ఏదో విచిత్రంగా ఉందని భావించిన అతడు చేపను కోసి చూడగా దాని పొట్ట మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. ఆశ్యర్యకర విషయమేమిటంటే పొట్టలో ప్లాస్టిక్ చేరినప్పటికీ చేప సజీవంగానే ఉంది. చేప పొట్టలో ప్లాస్టిక్ ఉండటం చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మనుషులు భూమినే కాకుండా సముద్రంలోని చేపలను కూడా నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. అలాగే చిన్న చేపలోనే ఇంత ప్లాస్టిక్ ఉంటే తిమింగలం కడుపులో ప్లాస్టిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని పలువురు కామెంట్ చేస్తున్నారు. Fish found with a stomach full of plastic. pic.twitter.com/ymdkwGmAsb — 🌏💧Yasmin Scott (@YASMINSCOTTREAL) January 22, 2020 -
పొట్టలో పెరుగుతున్న ప్లాస్టిక్
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి సగటున వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ను పొట్టలోకి పంపించేస్తున్నాడు. అంటే క్రెడిట్ కార్డుతో సమానమైన ప్లాస్టిక్ను వారంవారం మనిషి పలు రూపాల్లో తినేస్తున్నాడు. అంటే మనిషి తినే, తాగే పదార్థాల ద్వారా ప్లాస్టిక్ భూతం పొట్టలో పేరుకుపోతోంది. ఇదే విషయమై ఎంత పరిమాణంలో ప్లాస్టిక్ను తింటున్నామో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. దీనిలో భాగంగా తాగునీరు, షెల్ ఫిష్, తేనే వంటి ఆహార పదార్థాల్లో ఎంతమేర సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ కణాలు ఉన్నాయో పరిశీలించారు. దీని ప్రకారం మనిషి వారంలో 5 గ్రాముల మేర ప్లాస్టిక్ను మింగేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇదే ఫైనల్ అయ్యే అవకాశం లేదని, ఇంతకంటే ఎక్కువే ప్లాస్టిక్నే మనిషి తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఎందుకంటే కేవలం కొన్ని పదార్థాల్లోని ప్లాస్టిక్ను మాత్రమే తాము పరిశీలించామని, ప్యాకేజి ఆహారం, ఇతర మార్గాల్లో తీసుకునే పదార్థాలను తాము అధ్యయనం చేయలేదని తెలిపారు. కేవలం వారంలోనే 5 గ్రాములు తింటుంటే.. నెల, సంవత్సరం, దశాబ్దం.. ఇక జీవిత కాలంలో ఎంత మేర ప్లాస్టిక్ను తినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉజ్వల భవితకు చిరునామా ‘సిపెట్’
సాక్షి, అమరావతి బ్యూరో: ప్లాస్టిక్.. దైనందిన జీవితంలో విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిన పదార్థం. లోహయుగంలో ఇనుము మనిషి జీవనాన్ని నిర్దేశిస్తే, ఆధునిక యుగంలో ప్లాస్టిక్ మానవ మనుగడకు చుక్కానిలా మారింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ప్లాస్టిక్ రంగంలో ఏటా 18 శాతం వృద్ధి రేటు నమోదవుతుండటమే దీనికి నిదర్శనం. ఈ రంగంలోని విస్తృత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇవ్వడానికి విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న ‘సిపెట్’ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) సంస్థ కృషి చేస్తోంది. పదో తరగతి విద్యార్హత తోనే ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ‘సిపెట్’ క్యాంపస్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ల్యాబ్, టూల్స్ విభాగం, 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యాధునిక లైబ్రరీ ఉన్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో ఇక్కడ శిక్షణ ఇస్తారు. దేశ విదేశాలకు చెందిన సంస్థలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. నాణ్యమైన మానవ వనరులు అందించడానికే.. ‘సిపెట్’ సంస్థను 2015లో విజయవాడలో ప్రారంభించారు. ఈ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పటైంది. ‘ఐఎస్ఓ 9001: 2008 క్యూఎంఎస్ సర్టిఫైడ్, ఎన్ఏబీఎల్ అండ్ ఎన్ఏబీసీబీ’ గుర్తింపు పొందింది. ఇటీవల విజయవాడ శివారు గన్నవరంలోని అధునాతన భవనంలోకి దీన్ని మార్చారు. ప్లాస్టిక్ సంబంధిత పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులను అందించటమే సిపెట్ లక్ష్యం. దీనికి సంబంధించి రానున్న నాలుగేళ్లలో దాదాపు 25 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు సిపెట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఐఎస్ఐ సర్టిఫికెట్కు సీపెట్ నివేదిక కీలకం సిపెట్లో అత్యాధునిక వసతులతో టూల్ సెక్షన్ ఉంది. ఆర్ఎండీ మౌల్డ్ విభాగంలో ప్రత్యేకంగా డిఫెన్స్, ఈసీఐఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉపయోగించే టూల్స్ని డిజైన్ చేస్తారు. ఎస్ఎస్ఐ విభాగం సూక్ష్మ, స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలకు సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇక్కడ ఐఎస్ఓ నెం. 17025/ఆర్/ఐఇసీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ల్యాబ్ ఉంది. పరిశ్రమల ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్కు దక్కాలంటే ఈ ల్యాబ్లో పరీక్షలు జరిపి సిపెట్ ఇచ్చే నివేదికే కీలకం. ప్లాస్టిక్ పైపులను పరీక్షించే జర్మనీకి చెందిన ఐపీటీ 100 బార్ కెపాసిటీ అత్యాధునిక సాంకేతిక పరికరం ఇక్కడ ఉంది. ఇది ఒకేసారి 60 పైపులను పరీక్షించి ప్లాస్టిక్లో నాణ్యతను నిర్ధారిస్తుంది. ప్రముఖ దేవస్థానాల్లో అందించే లడ్డూ కవర్లకు సిపెట్ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేస్తుంది. దేశవ్యాప్తంగా 24 సీపెట్ కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. విజయవాడలోనూ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజక్షన్ మౌల్డింగ్, ఎక్స్ట్రాషన్, టూల్ రూమ్ అండ్ డిజైనింగ్ విభాగాల్లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల తరఫున యువతకు శిక్షణ ఇస్తున్నారు. విదేశాల్లోనూ ఉపాధి.. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను దేశ, విదేశీ పరిశ్రమలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ప్లాస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులు సైతం శిక్షణ పొంది సొంత పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. పీపీటీ కోర్సు చేసిన విద్యార్థులకు విదేశాల్లో కనీస వేతనం రూ. 90 వేల వరకు లభిస్తుంది. డీపీఎంటీ చేసినవారికి రూ. 50 వేల వరకు జీతం లభిస్తుంది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థి సైతం ఆపరేటర్గా కనీసం రూ. 40 వేలు సంపాదించొచ్చు. ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం సిపెట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్ చదువుతున్నాను. ఈ కోర్సుకు మంచి భవిష్యత్ ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు చైనా, జపాన్, దుబాయ్, సౌత్ కొరియాలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. – వికాసింగ్, ఉత్తరప్రదేశ్ మౌల్డ్ శిక్షణతో అచ్చులు తయారీ నేను డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాను. పదో తరగతి తరువాత సాంకేతిక రంగం బాగుంటుందని చేరాను. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ద్వారా మిషన్కు డిజైన్ను పంపిస్తాము. క్యాడ్ క్యాప్ సాప్ట్వేర్ ద్వారా ఏ పార్టు కావాలంటే ఆ పార్టు డిజైన్ చేయటం వీలవుతుంది. మిషన్ ద్వారా అచ్చులను తయారు చేసే ప్రక్రియ ఇది. మార్కెట్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. – బాలం హరీష్, వీర వాసరం, పశ్చిమగోదావరి బోధన బాగుంది. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులో చేరాను. ఇక్కడ మాకు అర్థమయ్యే విధంగా అధ్యాపకులు భోధన చేస్తున్నారు. ల్యాబ్, లైబ్రరీలు బాగున్నాయి. ఉద్యోగాలు సాధనకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. – పినిశెట్టి గగన్సాయిరాజ్, విశాఖపట్నం ప్రతి ఒక్కరికీ ఉద్యోగం సిపెట్లో లాంగ్టర్మ్ కోర్సులు విద్యార్థుల జీవితాలకు బాటలు వేస్తున్నాయి. పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఉపాధి కచ్చితంగా లభిస్తోంది. రూ. 12–24 వేల జీతాలు చదువుల కాలంలోనే అందుకుంటున్నారు. అనంతరం ఎంఎన్సీ కంపెనీలు వారికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తున్నాయి. క్వాలిటీ ప్లాస్టిక్ను రూపొందించటం, స్కిల్, టెక్నికల్, అకడమిక్, రీసెర్చి విద్యను అందించటం లక్ష్యం. ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలకు సిపెట్ పూర్తి సహకారం అందిస్తుంది. – కిరణ్కుమార్, డైరెక్టర్ అండ్ హెడ్, సిపెట్ -
కిలో ప్లాస్టిక్..కప్పు కాఫీ..
సాక్షి, విశాఖపట్నం: ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని శాసిస్తోంది. పర్యావరణాన్ని ప్రమాదంలో పడేస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా మంది ఇస్తుంటారు. వాటిని ఆచరణలో పెట్టమంటే మాత్రం ఒకడుగు వెనక్కు వేస్తుంటారు. కానీ.. పర్యావరణంపై నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రం సంకల్పంతో ముందడుగు వేస్తారు. సరిగ్గా అలాంటి వినూత్న ఆలోచనతోనే ప్లాస్టిక్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు ఇండియా యూత్ఫర్ సొసైటీ ప్రతినిధులు. ఇందుకోసం బీచ్రోడ్డులో ఓ ప్రత్యేక పార్లర్ను ఈ నెల 27న ప్రారంభించనున్నారు. మీకు కాఫీ తాగాలని ఉందా? అయితే.. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, ఇతర వ్యర్థాలు తీసుకురండి.. మంచి కాఫీని సముద్రం ఒడ్డున కూర్చొని ఆస్వాదించండి... ఆకలిగా ఉందా..? బ్రేక్ఫాస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకాలస్యం.. మొత్తం ప్లాస్టిక్ని పోగెయ్యండి.. మంచి సమతులాహారాన్ని లాగించెయ్యండి..? ఇదేంటి..? ప్లాస్టిక్కు.. కాఫీ, టిఫిన్కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.? ఇదే ఇప్పుడు ట్రెండ్.. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇండియా యూత్ ఫర్ సొసైటీ బీచ్రోడ్డులో మొబైల్ పార్లర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27న బీచ్రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా ‘ప్లాస్టిక్ పార్లర్’ను ప్రారంభిస్తున్నారు. గివ్ ప్లాస్టిక్.. గెట్ ప్రొడక్ట్స్ నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ఈ పార్లర్ మొదలు పెడుతున్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు.. దేశవ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఇచ్చి పుచ్చుకో’ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ బియ్యం ఇచ్చిన కార్యక్రమంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇటీవల హైదరాబాద్లో దోసపాటి రాము అనే సామాజిక వేత్త.. ప్లాస్టిక్ కవర్లు ఇస్తే.. నర్సరీలో నచ్చిన మొక్కని తీసుకెళ్లి పచ్చదనాన్ని పెంపొందించండి అంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో తాజాగా ఇండియా యూత్ఫర్ సొసైటీ ప్రతినిధులు ప్లాస్టిక్ పార్లర్ను ప్రారంభిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ పార్లర్ను నడుపుతామని సొసైటీ అధ్యక్షుడు అప్పలరెడ్డి తెలిపారు. మొత్తంగా 30 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని వివరించారు. ప్రజల్లో అవగాహన కలి్పంచి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. విశాఖ నగర ప్రజలంతా తమ ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్లర్లో ధరలివీ.. ►కప్పు కాఫీ కావాలంటే.. 1 కిలో ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక క్లాత్ బ్యాగ్ కావాలంటే.. 2 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►ఒక జ్యూట్ బ్యాగ్ కావాలంటే.. 4 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి ►100 మి.లీ. పాలు, 2 బిస్కెట్లు, నట్స్, 1 అరటిపండు, ఉడకబెట్టిన గుడ్డు మెనూతో కూడిన బ్రేక్ఫాస్ట్ తినాలంటే.. 3 కిలోల ప్లాస్టిక్ ఇవ్వాలి -
ఢాకా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు: 13 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో అక్రమ నిర్వహణలో ఉన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు వల్ల 13 మంది మృత్యువాత పడ్డారు. 21 మంది తీవ్రగాయాల పాలయ్యారు. «ఢాకా శివారు కెరాణీగంజ్లోని ప్లాస్టిక్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న 13 మంది మరణించారు. ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందనేది నిర్ధిష్టంగా తెలియరాలేదు. నజ్రుల్ ఇస్లాం అనే వ్యక్తికి చెందిన ఈ కంపెనీలో ఈ యేడాది ఫిబ్రవరిలో సైతం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ ప్లేట్లూ, కప్పులను తయారుచేసే ఈ ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తారనీ, బుధవారం ఫ్యాక్టరీలో ప్రమాద సమయంలో 150 మంది పనిచేస్తున్నట్టు కార్మికులు తెలిపారు. -
ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ
(మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిలో 4,500 మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సీఎస్ఐఆర్ పనిచేస్తోంది. పర్యావరణం మొదలు ఆరోగ్యం వరకు.. పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలను దేశానికి అందించడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే చెప్పారు. ‘పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ.. మందులు, టీకాలు కనిపెట్టడానికి జన్యు శ్రేణి మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. జినోమ్ సీక్వెన్స్ (జన్యు శ్రేణి) కూడా మన వాళ్లలో ఉన్నంత విభిన్నంగా మరెక్కడా ఉండదు. అందువల్లే మనదేశంలో అరుదైన జెనెటిక్ డిజార్డర్స్ (జన్యు సంబంధిత సమస్యలు) ఎక్కువ. వీటిని అధిగమించడానికి 1008 మంది జన్యు శ్రేణులను రూపొందించాం. మందులు, టీకాలు కనిపెట్టడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మానవుల జన్యు బ్లూప్రింట్ను డీకోడ్ చేయడానికి జన్యు శ్రేణి పనికొస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్తంగా జన్యుశ్రేణి రూపకల్పన ప్రాజెక్టును చేపట్టాయి. అలాగే డెంటల్ ఇంప్లాంట్స్ను చౌకగా తయారుచేసే పరిజ్ఞానాన్ని రూపొందించాం. దీనివల్ల ఇప్పుడున్న ధరల్లో మూడో వంతుకే ఇంప్లాంట్స్ లభించనున్నాయి. స్పెంట్ వాష్ను శుద్ధి చేస్తే.. మద్యం తయారీ ప్లాంట్ల (డిస్టిలరీస్)లో వ్యర్థ జలాలను ‘స్పెంట్ వాష్’ అంటారు. దీన్ని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు లేదు. ఒక లీటరు మద్యం తయారు చేస్తే 10–15 లీటర్ల వ్యర్థజలం (స్పెంట్ వాష్) వస్తుంది. మొలాసిస్ నుంచి మద్యం తయారుచేసే కర్మాగారాలు దేశంలో 300కు పైగా ఉన్నాయి. ఇవి ఏటా 250 కోట్ల లీటర్ల స్పెంట్ వాష్ను ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. ఇవి స్పెంట్ వాష్, మిగతా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నాయి. ఫలితంగా తీవ్ర దుర్గంధం వెలువడటంతోపాటు పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. స్పెంట్ వాష్లో కాలుష్యానికి కారణం.. పొటాష్. దీన్ని వేరు చేస్తే మిగతా వ్యర్థాలను తొలగించడం చాలా సులువు. పొటాష్ను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) అభివృద్ధి చేసింది. పొటాష్ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. స్పెంట్ వాష్ను శుద్ధి చేస్తే.. రూ.700 కోట్ల విలువైన పొటాష్ను ఉత్పత్తి చేయొచ్చు. శుద్ధి ప్రక్రియలో శుద్ధ జలం కూడా వస్తుంది. ఆ నీటిని డిస్టిలరీస్ వాడుకోవచ్చు. అయితే.. స్పెంట్ వాష్ శుద్ధి ప్లాంట్ ఏర్పాటు మరీ చౌక కాదు. 2.5 ఏళ్లలో పొటాష్ ఉత్పత్తి ద్వారా పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత నుంచి లాభమే. వ్యర్థాల రీయూజ్కు పరిశోధనలు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్ర కాలుష్య సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువైన పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. రైతులు ఆ వ్యర్థాలను సులువుగా ‘రీయూజ్’ చేసే పరిజ్ఞానాన్ని వచ్చే సీజన్కు సీఎస్ఐఆర్ అందిస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి మందు అల్జీమర్స్ వ్యాధికి కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం. క్లినికల్ ట్రయల్స్కు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రత్యామ్నాయ వనరుల నుంచీ బయోఫ్యూయల్ తయారీ.. దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి బయో ఫ్యూయల్కు ఉంది. కానుగ నుంచే ఇప్పటివరకు బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి కూడా తయారు చేయొచ్చు. సీఎస్ఐఆర్ రూపొందించిన బయో ఫ్యూయల్తో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం నడిపాం. వాణిజ్యపరంగా బయోఫ్యూయల్ను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇలా చేస్తే.. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇటు ప్లాస్టిక్ సమస్యను, అటు ఇంధన కొరతను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్ సమస్యను అధిగమించవచ్చు. ‘మేకిన్ ఇండియా’కు సహకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి సీఎస్ఐఆర్ తన వంతు సహకారమందిస్తోంది. వివిధ రంగాల్లో చేస్తున్న పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందించడానికి ఇది దోహదం చేస్తుంది. 19 సీట్ల విమానం సిద్ధమైంది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్తో కలిసి తేలికపాటి విమానాల తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాం. 19 సీట్ల ‘సరస్’ విమానం సిద్ధమైంది. దీన్ని పరీక్షిస్తున్నాం. 70 సీట్ల విమానం డిజైన్ ఆమోదం పొందింది. ఈ పరిశోధనలు పూర్తయితే.. దేశంలో చిన్న విమానాశ్రయాలకు కూడా విమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ‘విజిబిలిటీ’ తక్కువగా ఉన్నప్పుడు విమానాలు దిగడం (ల్యాండింగ్) పెద్ద సమస్య. దీన్ని అధిగమించడానికి హైలెవల్ సెన్సార్స్ ఉన్న ‘దృష్టి’ని రూపొందించాం. ప్రస్తుతం 50 ‘దృష్టి’ వ్యవస్థలను దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రెండు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చాం. ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు కూడా ఇవ్వబోతున్నాం. -
డెడ్లైన్ డిసెంబర్ 31
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర మున్సిపల్ శాఖ చీఫ్ శ్రీదేవి ఆదేశాలకనుగుణంగా డిసెంబర్ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధించాల న్నారు. ఆ దిశగా మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ రిజినల్ డైరెక్టర్(ఆర్డీ) పంకజం స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రం సిద్దిపేట మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో డిసెంబర్ చివరి నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. ఇదే సమయంలో ఆయా మున్సిపాలిటీలు డిసెంబర్ తరువాత ప్లాస్టిక్ను పట్టణంలో నిషేధించినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై థార్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించి అవార్డులు ఇస్తామని తెలిపారు. 100 శాతం పన్నులు వసూలు చేయాలి మున్సిపాలిటీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లలో అధికారులు లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపల్లో ప్రస్తుతం 60శాతం వసూల్లు జరిగాయని, నిర్థేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పథకాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా దరఖాస్తులను స్వీకరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజల్లో అవగహన కల్పించండి జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన కల్పించాలని ఆమె సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా మార్చాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉందన్నారు. వివిధ అంశాలపై మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ పంకజం మున్సిపల్ల వారీగా సమీక్ష నిర్వహిస్తూ వివరాలు సేకరించారు. ఈ సమీక్షలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ల కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, నర్సయ్య, కృష్ణారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిషేధంలో టీటీడీ ముందడుగు
సాక్షి, తిరుమల: తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ పలు నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. లడ్డు, ఇతర ప్రసాదాలను అందించడానికి జ్యూట్ బ్యాగులు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డులు అందిస్తామని, దర్శనం చేసుకున్న వారికే లడ్డులు అందిస్తామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి గతంలో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా లడ్డు కవర్లను నిషేధించారు. వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్ బాక్స్లు ప్రవేశపెట్టారు. మరోవైపు వసతి గృహాల వద్ద వాటర్ కూలర్లు ఏర్పాటు చేశారు. -
కిలో ప్లాస్టిక్ తెస్తే కిలో బియ్యం : ఆర్కే రోజా
సాక్షి, నగరి : హానికర ప్లాస్టిక్ లేని సమాజాన్ని సృష్టించడానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా అడుగులు వేశారు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్ వస్తువులకు కిలో బియ్యం ఇచ్చే వినూత్న పథ కాన్ని ప్రారంభించారు. తొలిరోజే మంచి స్పందన లభించింది. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి టవర్క్లాక్ సెంటర్లో ట్రై సైకిళ్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక్కో పుట్టిన రోజు ఒక్కో పథకం వినూత్నంగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అవాయిడ్ ప్లాస్టిక్.. సేవ్ నేచర్ నినాదంతో కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్లాస్టిక్ వస్తువు లు భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడు తుందన్నారు. అందుకే దీనిపై పోరాటం మొదలుపెట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో హానికర ప్లాస్టిక్ బ్యాన్ అయ్యేలా చూడాలని కోరారు. సీఎం జగన్ ఐదు నెలల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు. ఐదేళ్ల మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు వైఎస్.జగన్మోహన్రెడ్డే సీఎంగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, సోదరులు కుమారస్వామిరెడ్డి, రామ్ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మురళిరెడ్డి, లక్ష్మీపతిరాజు, మాహిన్, కొండేటినాని, సుధాకర్ రెడ్డి, పరశురాం, బాలప్రసాద్, టీకేహరిప్రసాద్, గుణశేఖర్ పాల్గొన్నారు. -
మానవ రక్తంలోనూ ‘ప్లాస్టిక్’ గంటలు!