Priest
-
సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవితఖైదు
-
రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్ను ఆదివారం లక్నోలోని ఎస్జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.ఇది కూడా చదవండి: మస్క్కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్ -
పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
ఉదయపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి -
అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు
ఈ ఏడాది జనవరిలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువయ్యాడు. అదిమొదలు అయోధ్యకు భక్తుల తాకిడి అధికమయ్యింది. తాజాగా అయోధ్య రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు శ్రీరాముని సేవలో నిమగ్నమైన సహాయ అర్చకులు, సేవాదార్లకు జీతాలను పెంచారు.రామాలయంలోని ప్రధాన అర్చకుడి జీతం రూ.3500 పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.దీంతో వారికి రామమందిర్ ట్రస్ట్ 15 రోజల పాటు సెలవు ఇచ్చింది. కాగా జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రామమందిరం ట్రస్ట్ ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి వేతనాన్ని రూ.2500 పెంచారు. అదేవిధంగా కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు. -
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
రామ్ లల్లాకు ఒక గంట విశ్రాంతి!
జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు. అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్ లల్లాకు ఒక గంట బ్రేక్ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్. (చదవండి: ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..) -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
పోలీస్ స్టేషన్ లో పూజారి ఫన్నీ పూజ
-
వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ..
కరీంనగర్రూరల్: ఎనిమిది రోజులపాటు వినాయకుడికి నిష్టతో రెండుపూటల పూజలు చేసిన ఓ పూజారి నిమజ్జనోత్సవం బుధవారం రాత్రి చివరిపూజచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన తిరువరంగం పాపయ్యశాస్త్రి(45) పూజారిగా పనిచేస్తున్నాడు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చెర్లభూత్కూర్లోని వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నాడు. చివరిరోజు బుధవారం రాత్రి వినాయకుడి పూజలు పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై ఇరుకుల్లకు బయల్దేరాడు. చెర్లభూత్కూర్ నుంచి మొగ్ధుంపూర్ రోడ్డుపైకి వచ్చిన ఆయన వెహికిల్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వనజ, కుమారుడు భరద్వాజ్, కూతురు హోత్రి ఉన్నారు. -
పెళ్లి పీటలపై పంతులుకి షాకిచ్చిన పెళ్లి జంట..
-
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్పల్స్ 200 మోటార్ బైక్పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్లో పాల్గొని రేసర్గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
నదిలో కొట్టుకుపోయిన పూజారి
కర్ణాటక: నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి అర్చకుడు మృతి చెందిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా కమలశీలలో జరిగింది. శేషాద్రి ఐతాళ్ (75) బుధవారం ఉదయం కమలశీల గుడికి వెళ్లాడు. పక్కనే ఉన్న కుబ్బా నదిలో నీరు తేవడానికి వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నూరు మీటర్ల దూరంలో శవం బయట పడింది. వర్షంలోనే లైన్మ్యాన్ మరమ్మతులు దక్షిణ కన్నడ జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వానలు పడుతున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మంగళూరు సమీపంలోని దేరళకట్టలో కరెంట్ వైర్లు తెగిపోయి 40 శాతం ఇళ్లకు కరెంట్ కట్ అయ్యింది. వర్షంలోనే లైన్మ్యాన్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
అర్చకులకు రూ.10 వేల గౌరవ వేతనం
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మన్నా ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహర్దశ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మునిసిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, వార్డు కౌన్సిలర్లు తుమ్మల రవీందర్,తోటకూరి రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని శ్రీరామలింగేశ్వర, లక్ష్మి నర్సింహస్వామి ఆలయాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, పిట్టల జ్యోతి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఆశీ ర్వదించి స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. -
HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ఓ పూజారి హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది వరకే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కాగా, అప్సర అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన సాయికృష్ణ.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి మ్యాన్ హోల్లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు పోలీసులు బయటపెట్టారు. నిందుతుడికి ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని, ఈనెల 3 తేదీన హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది? -
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్ -
పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా వైరల్గా మారింది. ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్ రాడ్ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజారమ్మ.. అమ్మవారే స్వయంగా!
సరస్వతీ పరమేశ్వర్ బాగావలే... అతి సాధారణ మహిళ. సమాజం స్త్రీ కోసమే నిర్మించిన ఆంక్షల వలయాన్ని ఛేదించింది. ఇందుకోసం ఆమె పోరాటం చేయలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. చేపట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజాదికాలు నిర్వర్తిస్తోంది. అమ్మ పిలిపించుకుంది సరస్వతి పరమేశ్వర్ వయసు 36. ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఆలయం ప్రాంగణంలోనే జీవిస్తోంది. రోజూ ఉదయాన్నే ఆలయం ఆవరణ శుభ్రం చేయడం, స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆరోగ్యభవాని విగ్రహంతో సహా ఆలయం లోపల శుభ్రం చేయడం, విగ్రహాలను అలంకరించడం, ఆ తర్వాత వంట చేసుకుని వచ్చి ఆరగింపు సేవ చేయడంతో శుభోదయ సేవలు పూర్తవుతాయి. సాయంత్రం ఐదు గంటలకు మరోసారి పూజ చేసి, చపాతీలు చేసుకుని వచ్చి పటిక బెల్లంతో నివేదన చేస్తానని చెప్పింది. ‘‘నాలుగేళ్ల కిందట కొందరు ఊరి పెద్దలు వచ్చి ఆలయంలో పూజాదికాలు ఎవరు చేస్తారని అడిగారు. అప్పటివరకు పూజలు చేస్తున్న పూజారి బాగా వృద్ధులయ్యారు. వాళ్ల పిల్లలు వచ్చి తాము నివసించే పట్టణానికి తీసుకెళ్లిపోయారు. ఇక ఆయన కుటుంబం నుంచి పూజ చేయడానికి ఎవరూ లేరు. దాంతో మరొకరిని నియమించడానికి అందరినీ అడిగారు. అప్పుడు నేను ఆడవాళ్లు కూడా రావచ్చా అని అడిగాను. ఆ తర్వాత వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ‘అమ్మవారే స్వయంగా నిన్ను పిలిపించుకుంటుందేమో...’ అని నన్ను పూజారిగా నియమించారు. భూగర్భంలో మరో ఆలయం మరాఠీ యూ ట్యూబర్లు వచ్చి ఈ ఆలయాన్ని వీడియోలు తీసుకుంటున్నారు. ఈ ఆలయంలో ఈ మాత కింద భూగర్భంలో మరో గుడి ఉంది. ఇక్కడ ఉన్న జాలీ తొలగించి మెట్ల నుంచి కిందకు వెళ్తే కనిపిస్తుంది. భూగర్భంలో ఉన్న ప్రతిమలు ఇక్కడ కనిపిస్తాయి చూడండి’’ అంటూ సీసీ టీవీ చూపించింది. ‘భక్తులు కిందకు వెళ్లి చూడవచ్చు’ అని మెష్ అమర్చిన ఉడెన్ ఫ్రేమ్ను తొలగించింది. కిందకు దిగితే అక్కడ మరో చిన్న ఆలయమే ఉంది. అందులో పూజాదికాలు కూడా సరస్వతి చేతుల మీదుగానే జరుగుతాయి. తనకు సాధ్యం కాని రోజుల్లో తన కూతురు పూజ చేస్తున్నట్లు చెప్పిందామె. ఇక్కడ ఏ ఉద్యమమూ జరగలేదు, కానీ ఒక అవసరం సమాజపు ఆధిపత్య గిరిగీతను తుడిచివేసింది. సరస్వతి పూజ చేస్తున్న ఆలయం మహారాష్ట్ర, బీడ్ జిల్లాలో ఉంది. మనకు సులభంగా తెలియాలంటే... ద్వాదశ జ్యోతిర్లింగం పర్లి వైద్యనాథ్ ఆలయం ఆధారంగా చెప్పుకోవాలి. వైద్యనాథ ఆలయం ఉన్న పర్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చాందాపూర్ గ్రామంలో ఉంది సరస్వతి చేతుల మీదుగా పూజలందుకుంటున్న ఆరోగ్యభవాని ఆలయం. – వాకా మంజులారెడ్డి చదవండి: యాకమ్మ.. ఒక గొప్ప వెలుగు -
చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..
సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు. పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే.. ప్రసాద్ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు. ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. -
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్లోని తాజ్పూర్లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..
కృత్తివెను (కృష్ణా జిల్లా): పాము కాటుకు పురోహితుడు బలైన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు (48) పౌరోహిత్యం, వాస్తుశాస్త్రం చెబుతూ జీవనం సాగిస్తారు. శనివారం మధ్యాహ్నం పీతలావ గ్రామంలోని ఓ రొయ్యల మేత షెడ్డులో పాము ఉందన్న స్థానికుల సమాచారంతో నాగబాబు వెళ్లాడు. తాచుపామును పట్టుకున్న వెంటనే ఆయన చేతిపై రెండుమార్లు కాటు వేసింది. అయినప్పటికీ పామును విడిచిపెట్టకుండా సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. తరువాత తనకు తెలిసిన సొంత వైద్యం చేసుకుని వెంటనే మచిలీపట్నంలోని హాస్పిటల్కు వెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఆయన మృతదేహాన్ని వేలాది మంది సందర్శించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కాటు వేసినా కానీ దానికి ఎటువంటి హాని చేయకుండా సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టడం ఆయనకు మూగజీవాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ప్రజలు చర్చించుకున్నారు. నాగబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు తండ్రి కొండూరి గోపాలకృష్ణ శాస్త్రి ఎన్నో ఏళ్లుగా పౌరోహిత్యం చేసుకుంటూ, పాము, తేలు కాటుకు నాటు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వీరు పాముకాటుకు విరుగుడు వేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. శాస్త్రి మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు నాగబాబు పాముకాటుకు మంత్రం వేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన పాముకాటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: (మంత్రి విశ్వరూప్కు సీఎం జగన్ పరామర్శ) -
కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి -
వివాదంలో జొమాటో యాడ్.. హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్కాట్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిత్రం 'విక్రమ్-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన పనితో ఈ బాయ్కాట్ ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్ రోషన్ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్ డెలీవరి యాప్ జొమాటో యాడ్లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్ హృతిక్ రోషన్తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్లో హృతిక్ చెప్పిన డైలాగ్లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్లు.. ఎక్కడో తెలుసా? ఈ యాడ్లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్ నుంచి తాలీ ఆర్డర్ చేశా' అని హృతిక్ రోషన్ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు. అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్ను చూపించలేదు. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం మహాకాల్ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్ట్యాగ్తో పాటు 'బాయ్కాట్ జొమాటో' అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్ చేశారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్ రెస్టారెంట్లను ప్రమోట్ చేసే పాన్ ఇండియా క్యాంపెయిన్లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్ రెస్టారెంట్ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. ఆ ఫుడ్ను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు' అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొంది జొమాటో. ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ Logically looking at the biased history of @deepigoyal's @zomato, none can negate that @iHrithik's ad trivializing Bhagwan #Mahakal was a deliberate attempt to demean Hindu Dharma thereby hurting Hindus' sentiments. O Hindus, its high time to resort to financially #BoycottZomato pic.twitter.com/BgbATbiKcZ — Sanatan Prabhat (@SanatanPrabhat) August 21, 2022 -
అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల
సాక్షి, అనంతపురం (డి.హీరేహాళ్, రాయదుర్గం): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేన రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. స్వయాన ఆయన భార్య స్రవంతి మంగళవారం మీడియాకు ఆధారాలు అందజేశారు. ఆమె తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన స్రవంతికి డి.హీరేహాళ్ మండలంలోని మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేనతో 2008 సంవత్సరంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. ఈ క్రమంలో కొందరిని లొంగదీసుకుని రాసలీలలు సాగించాడు. మరోవైపు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నీవు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. తర్వాత అతని సెల్ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూసి ఆమె విస్తుపోయింది. పరాయి మహిళలతో రాసలీలల వ్యవహారంపై భర్తను నిలదీసింది. అయినా అతను పద్ధతులు మార్చుకోలేదు. పైగా భార్యను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసి ఆమె పిల్లల సహా రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత అతను స్రవంతికి మతిస్థిమితం లేదంటూ విడాకుల నోటీసు పంపించాడు. పెద్దమనుషుల సమక్షంలో ఘర్షణ విడాకుల నోటీసు విషయంపై మాట్లాడేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం మురడికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకుడు అనంతసేనను నిలదీశారు. అలాగే అతను ఇతర అమ్మాయిలను ముద్దు పెడుతూ అభ్యంతరకరంగా దిగిన ఫొటోలను పెద్ద మనుషుల సమక్షంలో చూపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. పోలీసులు, పెద్దలే తనకు న్యాయం చేయాలని స్రవంతి వేడుకున్నారు. అనంతరం ఆమె రాయదుర్గం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్కుమార్ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్లో పూజారి. బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్కుమార్ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్కుమార్పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. (చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం) -
మల్కాజ్గిరి మహిళ హత్య కేసులో ట్విస్ట్.. గర్భగుడిలోనే చంపేశాడు
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం చదవండి: వరంగల్లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే... పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు. -
ఇది నా ఆజ్ఞా యుద్ధం ఆపండి! వైరల్ వీడియో
Russia ruk jaaye, Ukraine jhuk jaaye: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్ అత్యంత దారుణంగా అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుపట్టడమే కాక హెచ్చరికలు జారీ చేశాయి. అంతేగాదు ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. అయినా రష్యా వాటిని లక్ష్యపెట్టక ఉక్రెయిన్ పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. దీంతో చాలామంది అగ్రనేతలు పలు రకాలుగా రష్యా అధ్యుక్షుడు వ్లాదిమర్ పుతిన్కి నచ్చచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పూజారి యుద్ధం ఆపమంటూ పుతిన్కి వింతైన రీతిలో సందేశం ఇచ్చాడు. అంతేకాదు రష్యా రుక్ జాయే, ఉక్రెయిన్ ఝుక్ జాయే(రష్యా యుద్ధం ఆపాలి, ఉక్రెయిన్ తప్పు చేసింది కాబట్టి క్షమించాలి) అంటూ తనదైన రీతిలో పిలుపు నిచ్చాడు. రష్యా గొప్పది కాబట్టి యుద్ధం ఆపాలి అని చెబుతూ అందర్నీ ఆకర్షించాడు. అంతేకాదు భారత్ హింసకు స్వస్తి చెప్తి శత్రత్వానికి ముగింపు పలుకుతుంది అని భారతదేశం గొప్పతనాన్ని కూడా వివరించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. पुतिन,जेलेन्सकी सुन लें- अयोध्या से ऑर्डर हो गया है !! pic.twitter.com/bho9EFR8Og — Gaurav Singh Sengar (@sengarlive) March 3, 2022 (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
సన్నీపై పూజారుల ఆగ్రహం.. మధు'బ్యాన్' చేయాలని డిమాండ్
Priest Protest Against On Sunny Leone Dance In Madhuban Song: సినిమాలు, సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకుపోతాయి. అలాంటి చిత్రాలను ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేస్తారు ఆడియెన్స్. ఇలా హిట్టు ఇవ్వడమే కాకుండా వారి మనోభావాలను కించపరిస్తే అదే రేంజ్లో ఫట్మనిపిస్తారు కూడా. ఇలా కాంట్రవర్సీల మధ్య చిక్కుకుని ఫట్టయిన సాంగ్స్, సీన్స్, మూవీస్ ఎన్నో ఉన్నాయి. తమ సంస్కృతి మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా అసభ్యంగా ఉన్నాయని విరుచుకుపడిన వారూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఇటీవల సన్నీ లియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్ విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్గా పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పర్ఫామెన్సే ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బృందావన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు. అలా డ్యాన్స్ చేసినందుకు సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే భారత దేశంలో ఉండనివ్వకూడదన్నారు. అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా 'మధుబన్ మే' సాంగ్లో సన్నీ డ్యాన్స్ను తప్పుబట్టారు. అలా అవమానకర రీతిలో నృత్యం చేయడం ద్వారా 'బ్రిజ్భూమి' ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన ఈ పార్టీ నంబర్ను సరేగమ మ్యూజిక్ 'మధుబన్' పేరుతో బుధవారం (డిసెంబర్ 22) విడుదల చేసింది. ఈ పాటలో కృష్ణుడు, రాధల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉండగా.. సన్నీ లియోన్ బాడీ మూమెంట్స్ హిందూ మనోభావాలను కించపరిచేలా ఉందని నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను రీమేక్ చేశారు. ఇదీ చదవండి: సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా! -
పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!
Man poses as priest to run drug trade near temples: ఇటీవలకాలంలో ఆ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూశాం. పైగా సెలబ్రేటిలు దగ్గర నుంచి దిగజ కంపెనీలు సైతం ఈ డ్రగ్స్ నీలి నీడ ఛాయలు మాటున దాగి ఉంటున్నాయి. నార్కొటిక్క్ బృందం చేధించేంత వరకు ఎవరు ఏంటో ప్రజలకు అర్థంకానీ గందగోళ పరిస్థితిని చవి చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదేమో!. అచ్చం అలానే చెన్నైలో పవిత్రమైన దేవలయ ప్రాంగణంలో పూజారి ముసుగులో ఒక వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. (చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్నే పాడు చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే....చెన్నైలోని దామో అనే 50 ఏళ్ల వ్యక్తి పూజారిలా జనాలకు ఫోజులిస్తూ దేవాలయం వెలుపల గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అయితే చెన్నైలోని పోలీసులు దేవలయ ప్రాంగణాల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారంటూ సమాచారం రావడంతో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్యల్లో భాగంగానే పోలీసులు కస్టమర్లల వేషంలో దేవాలయం ప్రాంగణాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. అయితే దామో కాషాయా వస్త్రాలు ధరించి వివిధ ఆలయాల వద్ద కనిపించడంతో అనుమానించి పోలీసులు కస్టమర్ల వేషంలో అతని వద్దకు వెళ్లి విచారించారు. ఈ క్రమంలో పోలీసులు దామోని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో విక్రయించే నిమిత్తం అతని వద్ద గంజాయిని కొనుగోలు చేసే ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) -
పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..
తిరువొత్తియూరు( చెన్నై): నీలగిరిలో ఏడేళ్ల బాలుడిని అమ్మవారి ఆలయంలో పూజారిగా నియమించడంపై దేవదాయశాఖను హైకోర్టు వివరణ కోరింది. నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్ ఆలయం ఉంది. అమ్మవారు ఓ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ కుమారుడు రాణేష్ (7)ను పూజారిగా నియమించారు. ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్ బండారి, ఆదికేశవులు బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పూజారిగా నియమించడం వల్ల బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు. చదవండి: MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్లోని ఖేరియా మోడ్లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
Supreme Court of India: ఆలయ భూహక్కులు దేవుడివే
న్యూఢిల్లీ: దేవాలయ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని, పూజారి ఎప్పటికీ భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ ఆస్తులుగా ఉన్న భూముల నిర్వహణ మాత్రమే పూజారిదని, భూములన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించిన పత్రాలలో యజమాని అన్న కాలమ్లో ఆ ఆలయంలో కొలువు తీరిన దేవుడి పేరు రాయాలని, చట్టపరంగా దేవుడికే ఆ భూమిపై హక్కులుంటాయని న్యాయమూర్తులు చెప్పారు. పూజారులు, దేవస్థానంలో ఇతర సిబ్బంది ఆ దేవతామూర్తి తరఫునే పనులు నిర్వహిస్తారని, పూజారి ఎన్నటికీ కౌలుదారుడు కాలేడని భూ చట్టాలలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో దేవాలయ భూముల్ని పూజారులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరోధిస్తూ రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరుని తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లను హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ఆ పిటిషన్ను విచారించిన సుప్రీం బెంచ్ దేవాలయ భూముల నిర్వహణ, పరిరక్షణ మాత్రమే పూజారి విధి అని ఒకవేళ తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైతే మరొకరికి అప్పగించే అవకాశాలు ఉండడం వల్ల ఆయనను భూస్వామిగా చెప్పలేమంది. రెవెన్యూ రికార్డుల్లో పూజారి, మేనేజర్ల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
తొమ్మిది పీజీలు చేసిన పూజారి
-
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
సాక్షి, అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
మైనర్లను రేప్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్ విజేత సింగ్ రావత్ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు. ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. -
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..! పెల్లుబికిన నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్ ప్రతాప్సింగ్ ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు క్రైమ్ బృందం దర్యాప్తు కోసం నమూనాలను సేకరించారని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హామీ ఇచ్చారు. పోలీసులు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. లేదంటే ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్వీట్లో తెలిపింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు అందించిన సమాచారం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెడుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు. పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ పూజారి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూజారి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు
ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్గా చెప్పలేం. తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్ల్యాండ్లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ వారసత్వ అర్చకుల నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల శాశ్వత నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్రావుని కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యయనం చేసి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు స్పష్టం చేసింది. -
షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు -
దేవాలయాల్లో మహిళలూ అర్చకులే.. ఆ 5 రోజులు సెలవు
ఆగమశాస్త్రంలో శిక్షితులైన మహిళలను ఆలయాల్లో అర్చకులుగా నియమించనున్నామని వారికి ప్రతి నెలా ఐదు రోజుల బహిష్టు సెలవు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై సామాజికంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు అనుమతి ఇచ్చినా గత పదేళ్లుగా అర్చకత్వం చేయడానికి పెనుగులాడుతున్న మదురై మహిళా అర్చకురాలు పిన్నియక్కల్ ఇప్పుడు వార్తల్లో ఉంది. ‘ఆలయంలో అమ్మవారు స్త్రీ రూపం. కాని ఆమెను అర్చించడానికి స్త్రీలను వద్దనడం విడ్డూరం’ అని మదురై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. సామాజిక న్యాయం, లైంగిక సమానత్వం అనే మాటలు ప్రతిపాదించినప్పుడు ఆదర్శనీయంగా ఉంటాయి కాని వాటిని అమలు చేయాల్సివచ్చినప్పుడు సంఘపరంగా పాతుకుపోయిన అభిప్రాయాల వల్ల, సెంటిమెంట్ల వల్ల సమస్యలు వస్తుంటాయి. చర్చ కూడా జరుగుతుంది. తమిళనాడు లో ఇప్పుడు అర్చకులుగా మహిళలను నియమించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ‘మాకు మహిళల నుంచి అర్చకుల ఉద్యోగాల కోసం వినతులు వస్తున్నాయి. మేము వాటిని పరిశీలిస్తున్నాం’ అని ఆ రాష్ట్ర హైందవ ఆలయాల నిర్వహణ ఇన్చార్జ్ మంత్రి శేఖర్బాబు అన్నారు. మాతృస్వామ్యం నుంచి పురుషస్వామ్వానికి ‘మాతృస్వామ్యంలో ఆలయాల్లో అర్చకులు మహిళలే ఉండేవారు. ఆ తర్వాత ఆర్యుల రాకతో వీరి స్థానంలో పురుషులు వచ్చారు.’ అంటారు తమిళనాడుకు చెందిన సత్యభామా అమ్మయార్. ఆమె తన సాయిబాబా ట్రస్ట్ తరపున మహిళలకు అర్చకత్వంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నిజానికి దక్షణాది రాష్ట్రాలలోని కొన్ని గ్రామీణ అమ్మతల్లుల గుడులలో, గిరిజన గద్దెలలో మహిళలు అర్చకులు గా పని చేసే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అలాంటి వాళ్లు ఉన్నారు. అయితే శాస్త్ర ప్రకారం పూజాదికాలు జరిగే ఆలయాలలో స్త్రీలు అర్చకులు గా ఉండటం సరికాదన్న అభిప్రాయం కొందరి నుంచి వినిపిస్తోంది. ‘ఇలాంటి లైంగిక మూసను మనం బద్దలు కొట్టాలి. స్త్రీ అర్చకుల విషయంలో ఎవరి నుంచైనా అభ్యంతరాలు వస్తే అవి ఎలాంటివో వాటిని ఏ విధంగా పరిగణించాలో కూడా చూస్తాం. కొన్నాళ్ల క్రితం కోర్టు ద్వారా మంగుళూరులో ఒక మహిళ అర్చకురాలిగా నియమితురాలైంది’ అని తమిళనాడు మంత్రి అన్నారు. ‘స్త్రీలకు ప్రతి నెల బహిష్టు సమయంలో అర్చనకు దూరంగా ఉండేలా ఐదు రోజుల సెలవు ఇస్తాం’ అని ఆయన అన్నారు. తమిళనాడులో అన్ని వర్గాల పురుషులు అర్చకత్వానికి యోగ్యులేనని పూర్వం కరుణానిధి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆరు ఆలయాల్లో అర్చక పాఠశాలలు తెరిచింది. వాటిలో ఒక సంవత్సరం కోర్సు చేసిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఆలయాల్లో బ్రాహ్మణేతరులను సామాజిక సమానత్వంలో భాగంగా అర్చకులుగా నియమించనుంది. అలాగే లైంగిక సమానత్వంలో భాగంగా స్త్రీలను నియమించనుంది. అంతేకాదు తమిళంలో అర్చకత్వం చేసేవారిని ప్రోత్సహిస్తోంది. కొనసాగుతున్న పోరాటం ఈ సందర్భంలోనే పిన్నియక్కల్ అనే మహిళా అర్చకురాలి పోరాటం కూడా చర్చకు వస్తోంది. మదురై సమీపంలో ఉన్న ఉసిలంపట్టి అనే గ్రామంలో పిన్నియక్కల్ కుటుంబం వంశ పారంపర్యంగా అక్కడి దుర్గ ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తోంది. 2004లో పిన్నియక్కల్ తండ్రి పిన్నయ్తేవర్ జబ్బుపడ్డాడు. దాంతో అతని కుమార్తె పిన్నియక్కల్ రెండేళ్లపాటు అర్చకత్వం చేసింది. అప్పుడు గ్రామస్తులు అభ్యంతరం చెప్పలేదు. కాని 2006లో పిన్నయ్తేవర్ మరణించాక పిన్నియక్కల్ను ఆలయంలో రావడానికి వీల్లేదని గ్రామపెద్దలు అన్నారు. దాంతో పిన్నియక్కల్ హైకోర్టు (మదురై బెంచ్)కు వెళ్లింది. కేసును విచారించిన జస్టిస్ చంద్రు పిన్నియక్కల్ పక్షాన తీర్పు ఇచ్చారు. ‘ఆలయాల్లో కేవలం పురుషులే అర్చకత్వం నిర్వహించాలనేదానికి ఏ ప్రమాణం లేదు. స్త్రీలు కూడా ఇందుకు యోగ్యులే’ అని తీర్పు ఇచ్చారు. ‘అమ్మవారిని స్త్రీలు అర్చించేందుకు అడ్డంకులా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆ తీర్పు చాలా ప్రశంసకు పాత్రమైంది. అయితే తీర్పుల అమలు కూడా ఒక్కోసారి అంత సులువు కాదు. ఆ దుర్గ ఆలయాన్ని ఆరాధించే చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు నేటికీ పిన్నియక్కల్ను అర్చకురాలిగా సంపూర్ణంగా స్వీకరించలేదు. ‘అమ్మవారి ముందుకు డబ్బున్నవాళ్లు, పేదలు, పై వర్గం వారు కింది వర్గం వారు అందరూ వస్తారు. అమ్మవారు ఎవరినీ వేరు గా చూడదు. మరి అర్చకురాలిగా నన్ను ఎందుకు వేరుగా చూడటం. నేను ఇంకా నా అర్చకత్వం కోసం ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోర్టుల చుట్టూ తిరగాలో’ అని 59 సంవత్సరాల పిన్నియక్కల్ అంది. ప్రార్థనా స్థలాల నిర్వహణ, ఉపాధి, ఆధిపత్యం ఎన్నో ఏళ్లుగా పురుషుల చేతిలో ఉంది. ఇప్పుడు స్త్రీలు తమ న్యాయమైన వాటా కోసం గొంతెత్తుతున్నారు. మున్ముందు ఈ గొంతు ఇంకా గట్టిగా వినిపించవచ్చు.– సాక్షి ఫ్యామిలీ చదవండి: భూ వివాదం : పూజారి సజీవ దహనం -
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
నారాయణ దీక్షితులు మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి పైడిపల్లి వంశీయు లు అర్చక మిరాశీ కుటుంబానికి చెందిన శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన కుమారుడు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. సీఎం జగన్ సంతాపం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధానార్చకుడి మృతిపై టీటీడీ ఉన్నతాధికారులు, అర్చక కుటుంబసభ్యులు సంతాపం తెలిపారు. -
పూజారికి కరోనా.. మానవత్వం చాటుకున్న అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, చార్మినార్: లాల్దర్వాజ సింహవాహిని దేవాలయం పూజారి నర్సింహ పంతులు కరోనా వైరస్తో బాధపడుతున్నారు. నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్తో బాధపడుతున్న ఆయన గురువారం వరకు హోం క్వారంటైన్లో వైద్య సేవలు పొందుతున్న ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తక్కువ కావడంతో గురువారం ప్రైవేట్ ఆసపత్రులను ఆశ్రయించారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చెప్పడంతో మొఘల్పురాలోని ఆస్రా ఆస్పత్రికి తరలించారు. నర్సింహ పంతులును చేర్చుకోవడానికి వైద్యుల నిరాకరించడంతో ఆయన పెద్ద కుమారుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఫోన్లో సంప్రదించారు. వెంటనే స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ అస్రా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి చెప్పడంతో నర్సింహ పంతులను అడ్మిట్ చేసుకుని వైద్య సేవలందిస్తున్నారు. ఈ విషయం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. చదవండి: కరోనా పాజిటివ్ వచ్చినా బయట తిరిగేస్తున్నారు ఈ కాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం -
సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్
తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణజన్ముడిలా ధర్మసంస్థాపన కోసం సనాతన ధర్మాన్ని కాపాడారని తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు చెప్పారు. ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్లుగా అర్చకుల వంశపారంపర్యాన్ని ముఖ్యమంత్రి పునరుద్ధరించారన్నారు. వైఎస్ జగన్ హిందూ దేవాలయాలు, ప్రాచీన దేవాలయాల ప్రతిష్ట కాపాడతారని, ఆలయాలకు పునర్వైభవం కల్పిస్తారని నమ్మకం కలిగిందని చెప్పారు. విశ్రాంత అర్చకులను పునర్నియమించడంపై తిరుమలలోని అర్చక భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశపారంపర్య అర్చకుల కోసం దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో చేసిన చట్టసవరణను తిరిగి ఆయన తనయుడు అమలు చేయడం, మళ్లీ స్వామి సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 2018లో చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం మిరాశి అర్చకులను వయోపరిమితి పేరుతో పదవీవిరమణ చేసి బాధపెట్టిందన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వ హక్కులను గత ప్రభుత్వం కాలరాయడంతో అర్చకులు చాలా నష్టపోయారని తెలిపారు. దీనిద్వారా చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవుళ్లకు ఆరాధనలు కరువయ్యాయని చెప్పారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్పై జస్టిస్ రామచంద్రరావు తీర్పు మేరకు విధుల్లోకి తీసుకోవాలని సూచించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో పాలకమండలి తీసుకున్న 50వ తీర్మానాన్ని కోర్టు రద్దుచేసిందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల అర్చకులకు వయోపరిమితి నిబంధనల సడలింపు ఆలస్యమైందన్నారు. శ్రీవారిని, దేవాలయాలను, అర్చకుల కుటుంబాలను ఈ మధ్య రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు, తమకు సంబంధం లేదని, అలా వాడుకునేవారు ఉంటే తమ విజ్ఞప్తిని స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకుల పునర్నియామకానికి కృషిచేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు నరసింహదీక్షితులు, వెంకటదీక్షితులు, శ్రీనివాసదీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు. మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు.. వారికి జీవితాంతం శ్రీవారికి సేవచేసే భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తుండటంతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని మొదటగా దర్శనం చేసుకునే యాదవులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్చకులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి తీసుకుంటూ.. వారికి వారసత్వ హక్కు కల్పించారు. అర్చకులకు వయోపరిమితి నిబంధనను ఎత్తేశారు. వైఎస్ మరణానంతరం రద్దు శ్రీవారి ఆలయానికి సంబంధించి 1987లో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు పోరాడుతున్నారు. 1996లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిని తిరిగి ఆలయ అర్చకులుగా నియమించినా.. వారికి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ మహానేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలోని అర్చకులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారందరికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ 2007లో జీవో నంబరు 34 జారీచేశారు. మహానేత మరణానంతరం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం 2012లో అర్చకులకు వయోపరిమితి విధించింది. శ్రీవారి ఆలయంలో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అర్చకుల అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసినప్పటికీ 2018 మే 16న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వయోపరిమితి నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోని ప్రధాన అర్చకులు నలుగురితోపాటు మరో ఐదుగురు అర్చకులు, గోవిందరాజస్వామి ఆలయం అర్చకుడు, తిరుచానూరు ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులను వయోపరిమితి నిబంధనతో తొలగించింది. నాడు మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు అర్చకులు కోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్లో అర్చకులకు అనుకూలంగా వచ్చిన తీర్పును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ విషయాన్ని రమణదీక్షితులు, ఇతర అర్చకులు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రభుతం వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులకు వయసుతో సంబంధం లేకుండా శ్రీవారికి సేవచేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 డిసెంబర్లో రమణదీక్షితుల్ని శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారుడిగా, గౌరవ ప్రధాన అర్చకులుగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎంను కలుసుకున్న రమణదీక్షితులు అర్చకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. రమణదీక్షితులు సహా రిటైర్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు. సీఎంకు రుణపడి ఉన్నాం మా తాతలు, మా తండ్రి చేసిన వంశపారంపర్య అర్చకత్వాన్ని తిరిగి మాకు కల్పించినందుకు సీఎంకు రుణపడి ఉన్నాం. స్వామికి సేవ చేయడమే మా భావన. రాజులను, చక్రవర్తులను మా వంశీకులందరూ చూశారు. మా కుటుంబం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని మా తపన. తిరిగి మా హక్కులను మాకు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – నరసింహదీక్షితులు, మాజీ ప్రధాన అర్చకులు (తిరిగి విధుల్లోకి చేరబోయే అర్చకులు) -
దేవుడికే పంగనామాలు!
మంగళగిరి (గుంటూరు): ఓ అర్చకుడు రూ.4 కోట్ల విలువైన ఆలయ భూమికి తన పేరుతో పాస్పుస్తకం పుట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 14లో 13.20 ఎకరాల భూమి ఉంది. అందులో 3.40 ఎకరాలను సాగు చేసుకునే హక్కును అర్చకుడికి దేవదాయ శాఖ కల్పించింది. అయితే ఆలయ అర్చకుడు నిడమానూరు కృష్ణమూర్తి 1998లో తన పేరున పాస్పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 1.71 ఎకరాలకు అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. దేవాలయం పేరిట ఉన్న భూమిని రెగ్యులర్ ఖాతాలో ఆన్లైన్ చేయాలని ఇటీవల ఆలయ ఈఓ దరఖాస్తు చేశారు. అర్చకుడు కృష్ణమూర్తి కూడా పాస్పుస్తకం ఇచ్చి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు. తహసీల్దార్ జి.వి.రామ్ప్రసాద్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అర్చకుడికి అనుభవించే హక్కు మాత్రమే ఉందని తేలింది. అయితే అతని పేరుతో 1998లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైందని వెల్లడైంది. అర్చకుడి పేరుతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కాజ గ్రామంలో 11 ఎకరాల పీర్ల మాన్యం, నూతక్కిలో 80 సెంట్ల దేవదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ గుర్తించేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని, రికార్డులను పరిశీలించి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటామని తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి
సాధారణంగా, ఆలయాల్లో పూజలు, వివాహం, వ్రతం, యాగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే పూజారి తప్పనిసరి. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించే వారు. కానీ ప్రస్తుతం అక్కడక్కడ కొందరు ఇతర సామాజిక వర్గాల వారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అయితే ఎక్కడైనా ఈ విధులు నిర్వహించే వారే పురుషులే. పౌరోహిత్యం చేసే స్త్రీలు చాలా అరుదు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నయా ట్రెండ్ సెట్ చేశారు. పురోహితురాలి చేతుల మీదుగా తన వివాహ వేడుక జరుపుకున్నారు. మీరు చదివింది నిజమే.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దియా ఇది వరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు దియా మీర్జా. Thank you Sheela Atta for conducting our wedding ceremony. So proud that together we can #RiseUp #GenerationEquality https://t.co/aMZdyEZRdF pic.twitter.com/BeyFWCSGLw — Dia Mirza (@deespeak) February 17, 2021 ‘‘మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలా అట్టా.. ‘అందరం కలిసి ఎదుగుదాం’’.. ‘‘జనరేషన్ ఈక్వాలిటీ’’’’ అనే హాష్ట్యాగ్తో ట్వీట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దియా మీర్జా ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ‘‘పితృస్వామ్య వ్యవస్థని నాశనం చేయండి’’.. ‘‘ఈ మహిళ ఎంతో దీక్షగా, శ్రద్ధగా వివాహ తంతు జరిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను’’.. ‘‘వారిని ఎదగనివ్వండి’’.. ‘‘మహిళాసాధికరతకు నిదర్శనం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి? ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా -
పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం
బెంగళూరు: మతాధికారులు, పూజారులు, గురువులు, బాబాలకు మన సమాజంలో ఎంతో ఉన్నత స్థానం ఉంటుంది. ప్రజలు వీరిని దైవానికి ప్రతి రూపంగా భావిస్తారు. ఎంతో గౌరవమర్యాదలు ఇస్తారు. కానీ వారిలో కొందరు గురవింద గింజలు ఉంటారు. వెలుగులో ఎన్నో నీతులు బోధిస్తూ.. చీకట్లో దారుణాలకు పాల్పడతారు. వీరిలో కొందరు తమని నమ్మి.. శరణు కోరి వచ్చే ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడే మృగాళ్లు కూడా ఉంటారు. దైవం పేరు చెప్పి దారుణాలకు పాల్పడే ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా పాపం లేదు. తాజాగా ఈ మృగాళ్ల జాబితాలోకి ఓ బెంగళూరు పూజారి చేరాడు. దేవాలయం ప్రాంగణంలో ఉంటూ.. ఆలయ బాగోగులు పర్యవేక్షిస్తున్న పూజారి.. పదేళ్ల బాలికపై రాక్షసకాండ కొనసాగించాడు. స్వీట్స్ ఇస్తానంటూ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.. చిక్బళ్లాపుర్కి చెందిన వెంకటరమణప్ప(68) పూజారిగా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కుమార్తె ఇంటికి వచ్చాడు. అల్లుడు పనిమీద వేరే ఊరికి వెళ్లడంతో అతడికి బదులుగా ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సమయంలో ఆలయం బయట ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారి వెంకటరమణప్ప కంట పడింది. బాలికను చూడగానే అతడి మనసులోకి ఓ దుష్ట ఆలోచన వచ్చింది. దాంతో చిన్నారి దగ్గరకు వెళ్లి తనతో పాటు వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశపెట్టి ఆలయ ప్రాంగణంలో ఉన్న తన కూతురింటికి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పాప ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. పాప గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆలయం బయట పూలు అమ్ముకునే వ్యక్తి బాలిక, పూజారితో పాటు వారింటికి వెళ్లడం చూశానని తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా భయంతో గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ వారికి కనిపించింది. (చదవండి: కామాంధులపై పాక్ సర్కారు ఉక్కుపాదం!) ఏం జరిగిందని తల్లి అడగ్గా చిన్నారి దారుణాన్ని వివరించింది. వెంటనే వారు పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సీ కే బాబా మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ఆలయం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించాము. బాలిక పూజారితో పాటు వెళ్లిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అలానే పూలకొట్టు అతడి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడు వెంకటరమణప్పపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
భూ వివాదం : పూజారి సజీవ దహనం
జైపూర్ : రాజస్ధాన్లోని కరౌలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. కరౌలి జిల్లాలోని గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్ వైష్ణవ్ తన భూమిని ఆనుకుని ఉన్న ఈ ప్లాట్లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు స్థలం చదును చేసే పనులు చేపట్టారు. ఈ భూమి తమదని ఇందులో నిర్మాణాలు చేపట్టరాదని అంటూ మీనా వర్గీయులు అడ్డుకున్నారు. వివాదం గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు పూజారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ భూమి తనదే అంటూ పూజారి ఆ స్థలంలో తన పంట దిగుబడిని ఉంచాడు. పూజారి చదును చేసిన స్ధలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగడంతో స్ధలంలో ఉన్న తన పంటను ఆరుగురు వ్యక్తులు తగులబెట్టడంతో పాటు తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని స్టేట్మెంట్లో పూజారి పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. పూజారి కాలిన గాయాలతో జైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి హజ్రి లాల్ యాదవ్ తెలిపారు. చదవండి : ముగ్గురు విద్యార్ధినుల సజీవ దహనం -
అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
కరోనాతో టీటీడీ అర్చకుడు మృతి
సాక్షి,తిరుపతి: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కరోనాతో కన్నుమూశారు. గోవిందరాజు స్వామి ఆలయం నుంచి శ్రీనివాసాచార్యులు డిప్యూటేషన్పై తిరుమలకు వచ్చారు. వారం క్రితం ఆయనకు కరోనా వైరస్ రావడంతో తిరుపతి స్విమ్స్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగారు. -
భవ్య రామాలయం: పూజారికి బెదిరింపులు
అయోధ్య : భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజకు ముహార్తాన్ని నిర్ణయించారు. బెళగావిలో ఉండే విజయేంద్ర శర్మ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి సన్నిహతులు. విజయేంద్రకు గత మూడు, నాలుగు రోజులుగా తనకు దాదాపు 60 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తనకు కాల్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) దీంతో విజయేంద్ర శర్మ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను మోహరించారు. గతంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయిలకు, పీవీ నరసింహరావులకు శర్మ సలహాదారునిగా వ్యవహరించారు. అంతేకాకుండా వాజ్పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలోనూ శర్మనే ముహూర్తం పెట్టారు. ఇక బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఏప్రిల్లోనే రామాలయ నిర్మాణ వేడుకలు జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. (అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!) -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్నైట్లో స్టార్స్ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
సిరిమాను అధిరోహించిన పూజారి ఇకలేరు..
సాక్షి, విజయనగరం: ఎనిమిది సార్లు పైడితల్లి అమ్మవారి సిరిమానును అధిష్టించిన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సిరిమాను అధిరోహించిన పూజారిగా ఆయన గుర్తింపు పొందారు. భాస్కరరావు మృతితో విజయనగరంలో విషాదం అలుముకుంది. 2009- 2016 మధ్య కాలంలో శ్రీపైడితల్లమ్మ సిరిమానును భాస్కరరావు అధిరోహించారు. సిరిమానుపై అధిరోహించిన పూజారిని భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. (సిరులిచ్చే తల్లి.. శ్రీపైడితల్లి) -
కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!
భోపాల్: దేవాలయాల్లో ఆల్కహాల్తో తయారైన శానిటైజర్లను అనుమతించేది లేదని మధ్యప్రదేశ్లోని ఓ పూజారి కొత్త వాదన లేవనెత్తారు. తమ ఆలయంలోకి ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ మెషీన్లు తీసుకురావొద్దని శనివారం స్పష్టం చేశారు. భోపాల్లోని మా వైష్ణవధమ్ నవ్ దుర్గా ఆలయ పూజారి చంద్రశేఖర్ తివారీ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాగా, అన్లాక్-1లో భాగంగా జూన్ 8 (సోమవారం) నుంచి దేవాలయాలు పునఃప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ‘దేవాలయాల్లోకి శానిటైజర్లు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా నేను ఒప్పుకోను. దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. మద్యం తాగి గుళ్లోకి ఎవరైనా వెళ్తారా. ఇదీ అంతే. కావాలంటే చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు గుడి బయట సదుపాయాలు కల్పిస్తాం. భక్తులెవరైనా స్నానమాచరించాక నేరుగా దైవదర్శనానికి రావాలి’అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసి కేంద్రం.. ఆల్కహాల్తో తయారైన శానిటైజర్లనే వాడాలని చెప్పిన విషయం విదితమే. దాంతోపాటు ఆరు ఫీట్ల భౌతిక దూరం పాటించాలని.. 40 నుంచి 60 సెకండ్లపాటు హ్యాండ్వాష్తో చేతులు కడుక్కోవాలని కేంద్రం చెప్పింది. ఇక దైవ దర్శనాలకు వెళ్ల భక్తులు వాహనాల్లోనే చెప్పులు విడిచి వెళ్లాలని, దేవుడి ప్రతిమలు, అక్కడున్న పురాతన వస్తువులను తాకొద్దని మార్గదర్శకాల్లో తెలిపింది. (చదవండి: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..) -
ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సాధువులపై దాడి చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని బలివాలి వద్ద ఉన్న జఘ్రుత్ మహాదేవ్ మందిర్ ఆశ్రమంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయం పూజారులపై దాడి చేసి రూ. 6800 విలువైన వస్తువులతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ జాగ్రీత్ మహాదేవ్ ఆలయంలో పూజారులుగా ఉన్న శంకరానంద్ దయానంద్ సరస్వతి (54), శ్యామ్సింగ్ సోమ్సింగ్ ఠాకూర్ (60) పై దాడి చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 వేలు రికవరీ చేశారు.మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా ముగ్గురు నిందితులపై ఐపీసీ 394 సెక్షన్తో పాటు పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సురేష్ వరడే తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 16న చెందిన కారు డ్రైవర్తో పాటు ఇద్దరు సాధువులు ముంబై నుంచి సూరత్ వైపు వెళుతుండగా పాల్ఘర్ జిల్లాలో ఒక గుంపు వీరిని అడ్డగించింది. దొంగలేమోనన్న అనుమానంతో వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది మైనర్లతో కనీసం 133 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..
కటక్ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణత్యాగం చేస్తే కరోనా పారిపోతుందంటూ ఒక పూజారి నిండు మనిషి ప్రాణం తీసేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్లో చోటుచేసుకుంది.(నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) వివరాలు.. కటక్ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్సారి ఓజా( 72) బందా మా బుద్ద బ్రాహ్మణి దేయి గుడిలో పూజారీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్ ప్రధాన్(52) పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన అనంతరం ప్రధాన్ ఓజాను పలకరించాడు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పాడంటూ సన్సాన్ ఓజా ప్రధాన్తో పేర్కొన్నాడు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఇంకా ఇలాంటి మూడ నమ్మకాలెందుకంటూ ప్రధాన్ తెలిపాడు. దీంతో ఇరువరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఓజా తనకే దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న గొడ్డలితో ప్రధాన్ తలపై బలంగా బాధడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఓజారు అదుపులోకి తీసుకొని ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్ను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఫోరెన్సిక్ రిపోర్టుకోసం సీజ్ చేసి ఓజాపై కేసు నమోదు చేశారు.(అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు) ఇదే విషయమై సెంట్రల్ రేంజ్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ' ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సన్సారి ఓజా మూడ నమ్మకాలను బలంగా నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే దేవుడే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రధాన్ను హత్య చేశాడు. అయితే హత్య చేపే సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని మామిడిచెట్టు పైకి ఎక్కించి రాత్రంతా పక్కనే కూర్చున్నాడు. కొంతకాలంగా ఓజా మనసిక పరిస్థితి సరిగా లేదని, ఇంతకుముందు కూడా తనకు దేవుడు కనిపించేవాడంటూ చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా గురువారం ఉదయం మత్తు దిగాక ఓజా చెట్టు మీద నుంచి దిగి తానే ఈ హత్య చేసినట్లు ఓజా పోలీసులకు లొంగిపోయాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్ను హత్య చేశాడంటూ' తెలిపారు. -
ఆలయంలోకి పాము.. ఆడేసుకున్న పూజారి
సాక్షి, సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం పాము కలకలం సృష్టించింది. సింహగిరి వంటశాల నుంచి ఆలయ ప్రాంగణం వైపు వస్తున్న పామును కొందరు సిబ్బంది చూసి ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ ఉప ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు ఆ పామును పట్టుకుని దూరంగా తోటల్లో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. -
సీఎం జగన్కు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాలు
-
అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!
అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు. ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు. ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు. ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు. -
గుడిలో తవ్వకాలు జరిపిన పూజారి
తుక్కుగూడ: గుప్త నిధులు కోసం ఓ పూజారి తాను పూజలు చేసే ఆలయాన్నే తవ్వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జిన్నాయి గూడెం శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో సత్యంశివంసుందరం దాస్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల నుంచి ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనంది కావడంతో ఇక్కడ గుప్త నిధులతో పాటు స్వామి వారి బంగారు విగ్రహం ఉంటుందని భావించాడు. వాటిని పొందాలని కొంత మందితో కలిసి దాదాపు ఎనిమిది నెలల క్రితం గర్భగుడి ఎదుట సుమారు 12 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టాడు. ఇలా ప్రయత్నించిన అతనికి ఏమీ లభించలేదు. అయితే, ఆ ప్రదేశంలో గుప్త నిధులు ఏమీ లేకపోవడంతో గొయ్యిని మట్టి వేసి చదును చేశాడు. ఇలా వెలుగులోకి.. ఈ ఆలయ పూజారి వద్ద ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్పూర్కు చెందిన సోను అనే వ్యక్తి శిష్యుడిగా పనిచేశాడు. పూజారితో సోనుకు భేదాభిప్రాయాలు రావడంతో సోను నుంచి ఈనెల 11న ఖాన్పూర్కు వెళ్లిపోయాడు. ఆలయ పూజారి గుప్త నిధులు కోసం తవ్వకాలు చేసిన సమయంలో సోను తన సెల్ఫోన్లో తీసిన వీడియోను సోను గురువారం జిన్నాయిగూడెం, రావిర్యాల వాసులకు పోస్టు చేశాడు. ఈ గ్రామాల నుంచి స్థానికులు ఆలయానికి వస్తుండడంతో వారి ఫోన్ నంబర్లు సోను వద్ద ఉన్నాయి. సోను పంపిన వీడియో క్లిప్పింగ్లను చూసిన స్థానికులు శుక్రవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూజారి సత్యంశివంసుందరందాస్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
మత ప్రచారకుడికి వల
మొయినాబాద్ (చేవెళ్ల): హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు డబ్బుకోసం ఓ మత ప్రచారకుడికి వలవేశారు. అతడిని నమ్మించి డబ్బులు తీసుకున్నారు. భోజనం కోసం అంటూ పిలిచి జూస్లో మత్తుమందు కలిపారు. అనంతరం అసభ్యకరంగా ఉన్న ఫొటోలు తీసి రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్లోని ఓ మత ప్రచారకుడి వద్దకు గత ఆగస్టు 11న ఓ మహిళ(23) వచ్చింది. తన ఆరోగ్యం బాగలేదని తనకోసం ప్రార్థనలు చేయాలని అతడిని కోరింది. అలా పరిచయం ఏర్పరచుకుని తాను ఓ అనాథాశ్రమం నడుపుతున్నట్లు చెప్పింది. ఆయన ఫోన్నంబర్ తీసుకుని వాట్సప్ చాటింగ్ చేసేది. కొన్నాళ్ల తర్వాత శంషాబాద్లో ఓ రెస్టారెంట్కు, మరోసారి వండర్లాకు పిలిచి అతనితో సెల్ఫీలు దిగింది. తన భర్త విజయవాడలో ఓ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, పెట్టుబడిగా సాయం కావాలని రూ.10 లక్షలు తీసుకుంది. వ్యాపారం పేరుతో బాధితుడిని పిలిచి తమ పథకం అమలుచేసి అతడిని బ్లాక్మెయిల్ చేసి రూ.కోటికి ఒప్పందం రాయించుకొని రూ.10 లక్షలు గుంజారు. వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె ఎయిర్హోస్టెస్గా పనిచేసిందని, ఆమె భర్త హైదరాబాద్లో హోటల్ వ్యాపారం నడిపి నష్టపోయారని పోలీసులు గుర్తించారు. వారిని సోమవారం రిమాండ్కు తరలించనున్నారు. -
వేధింపులు బరించలేక పూజారి ఆత్మహత్య
-
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పూరి : ఒడిశాలో కొందరు భక్తులు ఆచరిస్తున్న మూఢ నమ్మకం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఎవరైనా అర్చకులు, వేద పండితులు తమ చేతులతో భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ ఒడిశాలోని ఖోర్దా జిల్లా భాన్పూర్ ప్రాంతంలో మాత్రం పూజరి తన కాళ్లతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ అర్చకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు వరుసలో కూర్చోని ఉంటే.. ఆ అర్చకుడు ప్రతి ఒక్కరి తలపై తన కాలును ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వెన్నుపై కూడా కాలుతో తొక్కుతాడు. ఆ భక్తుల్లో కొందరు చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన విజయదశమి వేడుకల సందర్భంగా వాహన పూజ చేయించుకున్న పలువురు భక్తులు అర్చకుని కాలును తమ నెత్తిపై పెట్టించుకుని ఆశీస్సులు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి మూఢ నమ్మకాలు వల్ల ప్రపంచంలో భారత్కు చెడ్డపేరు వస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆచారాలను పాటిస్తున్న ప్రజలు వాటి నుంచి బయటకు రావాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. -
‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వస్తున్న వరుస హత్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆరెస్సెస్ కార్యకర్త అయిన గోపాల్, ఎనిమిది నెలల గర్భవతి అయిన అతని భార్య, ఆరేళ్ల కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను మర్చిపోకముందే.. మరో హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ పూజారి గురువారం నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇతను కూడా బీజేపీ కార్యకర్త కావడం గమనార్హం. (చదవండి: తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య) వివరాలు.. నాదియా జిల్లాకు చెందిన సుప్రియో బెనర్జీ(42) అనే పూజారి ఈ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు గురువారం ఓ నది ఒడ్డున బెనర్జీ మృతదేహం కనిపించింది. అయితే డబ్బు కోసమే బెనర్జీని హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్లినప్పుడు బెనర్జీ కొంత డబ్బు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. అయితే బెనర్జీ హత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. బీజేపీ కార్యకర్త కావడం మూలానే బెనర్జీని చంపేశారని ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మరో బీజేపీ నాయకుడు బాబుల్ సుప్రియో.. ‘సుప్రియో బెనర్జీ బీజేపీ కార్యకర్త కావడం వల్లే అతడిని దారుణంగా చంపేశారు. గడిచిన నాలుగు రోజుల్లో 8 మందిని హత్య చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఓ జోక్గా మారింది. బెంగాల్ ప్రజలు వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారు ప్రతీకారం తీర్చుకుంటారు. లిబరల్స్గా చెప్పుకునే మేథావులు ఈ హత్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు. స్పందించడం లేదేందుకు’ అంటూ ట్వీట్ చేశారు. -
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
-
వైరల్ : కాలు కదిపిన ఫాదర్..!
న్యూఢిల్లీ : ఉత్సాహం ఉప్పొంగితే ఏ వయసువారైనా.. ఏ హోదాలో కొనసాగుతున్నా దాన్ని వ్యక్తం చేస్తారు. లోన దాగున్న పసిహృదయానికి స్వేచ్ఛనిస్తారు. ఢిల్లీలో తాజాగా అలాంటి విశేషమే ఒకటి వెలుగుచూసింది. ఓ చర్చి ఫాదర్ మలయాళ హిట్ సినిమా ‘లవ్ యాక్షన్ డ్రామా’లోని అద్భుతమైన పాట ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’కు కాలు కదిపాడు. అద్భుతమైన స్టెప్పులతో అక్కడున్న వారిని అలరించాడు. ఫాదర్ నుంచి ఊహించని ప్రదర్శన రావడంతో చర్చి ప్రాంగణంలో ఉన్నవారందరూ ఈల వేసి గోల చేశారు. ఆయనకు మద్దతు పలికారు. ఈ వీడియోను ‘లవ్ యాక్షన్ డ్రామా’ హీరో నివిన్ పౌళీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ‘మా సినిమాలోని కుడుక్కు పొట్టియా కుప్పాయాం పాటకు ఫాదర్ మాథ్యూస్ కిజాచెచిరా డ్యాన్స్ చేశారు. తన టీమ్తో పాటు స్టెప్పులు వేసి అలరించారు. థాంక్యూ.. ఫాదర్’అని పేర్కొన్నాడు. అయితే, తనతో పాటు చర్చి పనుల్లో భాగమయ్యే కొందరు యువకుల పిలుపుమేరకే సరదాగా డ్యాన్స్ చేశానని ఫాదర్ మాథ్యూస్ చెప్పారు. ఇక 2018లో వచ్చిన లవ్ యాక్షన్ డ్రామా సినిమాలోని ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’పాట బాగా ఫేమస్ అయింది. ఇటీవల జరిగిన ఓనమ్ పండుగలో ఈ పాటకు భారీ ప్రాచుర్యం లభించింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ కుడుక్కు పొట్టియా కుప్పాయాం అంటూ తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఇక ఫాదర్ డ్యాన్స్ వీడియో గత మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు కాగా.. నాలుగు రోజుల్లోనే పాపులర్ అయింది. యూట్యూబ్లో దాదాపు 3 మిలియన్ వ్యూస్ సాధించింది. -
అర్చకుడే దొంగగా మారాడు
రాంగోపాల్పేట్: దేవాలయంలో పనిచేసే అర్చకుడే దొంగగా మారి అమ్మవారి చీరలను చోరీ చేశాడు. భక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ప్రధాన అర్చకుడితో పాటు అతని సహాయకుడు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్బజార్లోని సంతోషీమాత దేవాలయంలో భాస్కరబట్ల రామశర్మ ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సహాయకుడిగా బాబురావు పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి అమ్మవారికి వచ్చే చీరలు, బియ్యం కొన్ని వస్తువులు దేవాలయంలో అప్పగించకుండా ప్రధాన అర్చకులు తీసుకుని వెళుతుండటం భక్తులు, మాజీ ధర్మకర్తలు గమనించారు. ఇదే విధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన 42 చీరలు దేవాలయంలో ఉండగా వాటిని తన ఇంటికి తీసుకుని భాస్కరబట్ల రామశర్మ బాబూరావుకు సూచించాడు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో బాబూరావు ఈ చీరలను తీసుకుని రామశర్మ ఇంటికి యలుదేరాడు. గమంచిన మాజీ చైర్మన్ రాయి వెంకటేష్, ధర్మకర్త రామ్మోహన్లు అతని వాహనాన్ని ఆపి తనికీ చేయగా చీరెలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈఓ విఠలయ్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదుచేసి శనివారం ఇద్దరినీ అరెస్టుచేశారు. -
తండ్రీకొడుకుపై దాడి
సాక్షి, పెండ్లిమర్రి, కడప: మొయిళ్లకాల్వ గ్రామం మసీదు మత గురువు మహమ్మద్ హనీఫ్, ఆయన కుమారుడు యూసఫ్పై అదే గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కత్తితో దాడి చేశాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మహమ్మద్ హనీఫ్కి, మహబుబ్ బాషాకు గతంలో గొడవ అయ్యింది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని గురువారం తెల్లవారుజామను తండ్రీకొడుకుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరినీ కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి
కర్ణాటక ,యశవంతపుర : ఐటీ, బీటీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. మాకు ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూజలు, హోమాల పేరుతో రోజు దేవస్థానాలలో అర్చకులకు బీజీగా ఉంటున్నారు. కనీసం వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
పూజారి వికృత చేష్టలకు దంపతులు ఆత్మహత్య
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పక్కింట్లో నివసిస్తున్న పూజారి కామ దాహానికి నిండు నూరేళ్లు జంటగా బతకాల్సిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకా సాదరహళ్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దారుణ ఉదంతం జరిగింది. లోకేశ్ (30), కౌసల్య (22) ఆత్మహత్య చేసుకున్న దంపతులు. వీరింటి పక్కనే నివసిస్తున్న మారమ్మ దేవాలయం పూజారి త్యాగరాజ్... కౌసల్యను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులపాటు బెంగళూరు తీసికెళ్లి సహజీవనం చేశాడు. తరువాత కౌసల్య పశ్చాత్తాపం చెంది భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది. భారీగా మోహరించిన పోలీసులు, ప్రజలు , కాలిపోతున్న పూజారి ఇల్లు ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు కౌసల్య దూరమవడంతో ఆగ్రహించిన పూజారి త్యాగరాజ్ ఆమెతో గతంలో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో అసలే గుసగుసలాడుకుంటున్న గ్రామస్తులు ఈ సంఘటనతో మరింతగా చిన్నచూపు చూడసాగారు. ఈ అవమానం భరించలేని లోకేశ్, కౌసల్య ఇక చావే శరణ్యమనుకున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి, వాహనాలకు నిప్పు విషయం తెలుసుకున్న పూజారి తనకు బడితపూజ తప్పదని గ్రామం నుంచి పరారయ్యాడు. దంపతుల మృతితో అగ్రహోదగ్రులైన గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. అతడి కారుని కూడా కాల్చేశారు. ఈ మంటలకు దేవాలయం వద్ద నిలిపి ఉన్న ఒక భక్తునికి చెందిన స్విఫ్ట్కారు, నాలుగు బైక్లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు కాలిపోయాయి. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మోహరించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అది చదివితే ఆమె మనసు మారుతుంది’
లక్నో : వారణాసి ఆలయ పూజారి ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పవిత్ర రామ్చరిత మానస్ గ్రంధాన్ని పంపించారు. దీన్ని పారాయణం చేస్తే మమత మనసు బాగుపడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నాటి నుంచి మమతా బెనర్జీ ‘జై శ్రీ రాం’ నినాదాలు వింటే చాలు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అలాంటి నినాదాలు చేసే వారిని నేరస్థులుగా.. పరాయి దేశం వారిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు పూజారి మాట్లాడుతూ.. ‘జై శ్రీ రాం నినాదాలు వినిపిస్తే చాలు ఆమె ఆగ్రహంతో ఊగి పోతున్నారు. రాముడి పట్ల ఆమె చూపించే ద్వేషమే ఏదో ఓ రోజు ఆమె పతనానికి కూడా కారణమవుతుంది. అందుకే ఆమె మనసు మారాలనే ఉద్దేశంతో రామాయణ గ్రంధాన్ని ఆమెకు పంపించాను. దాన్ని చదివితే ఆమెకు మంచి బుద్ధితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది’ అన్నారు. ‘రామాయణాన్ని చదివి అర్థం చేసుకోవడానికి నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. అందుకే పుస్తకంతో పాటు నా ఫోన్ నంబర్ను కూడా పంపించాను’ అని పేర్కొన్నారు. -
శని వదిలిస్తానని నమ్మించి..!
మహబూబ్నగర్ క్రైం: ‘మిమ్మల్ని.. మీ ఇంటిని శని ఆవహించింది.. ప్రత్యేక పూజలు చేస్తే తప్పా ఆ శని పోదు’ అంటూ నమ్మించాదు.. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చి ఈ రాగి చెంబులో ఉంచాలని.. పూజల అనంతరం సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి చెంబులో ఉన్న బంగారంతో దొంగస్వామి ఉడాయించిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ భాస్కర్రెడ్డి కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డకు చెందిన నవనీత, ఆమె పిల్లలు, అత్తతో కలిసి ఇంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్వామిజీ వేశంలో వచ్చాడు. మీ ఇంటికి శని పట్టుకుంది, మీకు అంత మంచిగా చేస్తానని వారికి చెప్పి.. ఓ రాగి చెంబులో నీరు, స్టిల్ టిఫెన్ బాక్స్, అగరబత్తులు, బియ్యం, ఇంట్లో ఉన్న బంగారం తీసుకురావాలని చెప్పాడు. దీంతో అతను చెప్పిన విధంగా అన్ని రకాల సామగ్రితో పాటు మూడు తులాల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత అతను పలు రకాల పూజలు చేసి టిఫిన్ బాక్స్లో బియ్యంతో పాటు బంగారం పెట్టి..మీ ఇంటి దేవుడిని తలుచుకోవాలని చెప్పాడు. అప్పటికే బంగారం కాజేసిన అతను టిఫిన్ బాక్స్ సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. వారు సాయంత్రం చూడగా దాంట్లో బంగారం మాయమైంది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి చేసిన పూజారితోనే వధువు జంప్
భోపాల్ (సిరోంజ్) : వధు, వరులను వేద మంత్రాలతో ఒక్కటి చేసిన పూజారే వంకర బుద్ధి చూపించాడు. నవవధువుతో పూజారి పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని విధిష జిల్లా సిరోంజ్లోని బాగ్రడ్లో చోటుచేసుకుంది. వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్ మహరాజ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పురహితురాలు
ఈమె పేరు చిత్ర చంద్రచూడ్. వయసు 72 ఏళ్లు. స్వస్థలం పుణె. ఇరవై ఏళ్ల నుంచీ పౌరోహిత్యం చేస్తున్నారు. వ్రతాలు, నోముల దగ్గర్నుంచి పెళ్లిళ్లు, కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆచార వ్యవహారాలను జరిపించవలసిందిగా కోరుతూ దేశం నలుమూల నుంచీ ఆమెకు పిలుపు వస్తూంటుంది. చిత్ర పౌరోహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో.. ఆడవాళ్లు పూజాపునస్కారాలు చేయించడమేంటని పెదవి విరిచినవారు, భృకుటి ముడివేసిన వారూ లెక్కలేనంతమంది. నిజానికి అంతకుముందు ఆమెకే ఈ అనుమానం ఉండేది. పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించే కంటే ముందు అంటే 1997లో ఆమె ‘గార్గి అజున్ జీవంత్ అహే (గార్గి ఇంకా బతికే ఉంది)’ అనే మరాఠీ పుస్తకాన్ని చదివారు. ఇందులో కథానాయిక వారణాసిలో కర్మకాండలను నిర్వహిస్తూంటుంది. ఆ పుస్తకం చిత్రకున్న భ్రమలను తొలగించింది. ఆమె దృక్పథాన్ని మార్చేసింది. తానూ పౌరోహిత్యం చేయాలనే సంకల్పాన్నిచ్చింది. ఆమె ఒక్కరే.. పుణె కేంద్రంగా.. విద్య, పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి, స్త్రీ సాధికారత కోసం పనిచేసే సంస్థ. ఇందులో చేరి పూజా, పెళ్లి, కర్మకాండలను (హిందూమతాచారాలకు సంబంధించి) జరిపించే విధానాలను నేర్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆమెకు యాభై రెండేళ్లు. ఇంట్లో ఇంకా బాధ్యతలున్నాయి. తను తీసుకున్న నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారు చిత్ర. ‘‘ఇంటి పనుల్లో సహాయపడ్తాను.. వెళ్లి నేర్చుకో’’ అని భర్త ప్రోత్సహించాడు. జ్ఞానబోధినిలో చేరారు ఆమె. పూజావిధానాలను నేర్చుకోవడానికి చేరిన వాళ్లలో చిత్ర మినహా మిగిలిన వాళ్లంతా పురుషులే. నిర్దేశించినదాని కంటే తక్కువ సమయంలో అన్నీ నేర్చుకున్నారు ఆమె. చిత్రంగా... మొదట్లో జ్ఞానబోధిని తరపునే పూజాకార్యక్రమాలు చేయించడానికి వెళ్లేవారు చిత్ర. ఆవిడను చూడగానే ‘‘గురువుగారికి ఆలస్యమవుతుందని మిమ్మల్ని పంపించారా?’’ అని అడిగేవారట యజమానులు. ‘‘లేదండి.. నేనే చేయిస్తాను’’ అని సమాధానమిచ్చేవారట చిత్ర. సందేహంతోనే పూజలో కూర్చునేవారట. అయిపోయాక.. ఆనందంగా సంభావన ఇచ్చుకునేవారట ‘‘మీలాగ ఇంత వివరంగా.. ఇంత బాగా ఏ పురోహితుడూ చేయించలేదండీ’’ అంటూ! ఇప్పుడైతే చిత్రే రావాలనే డిమాండ్..అంత ప్రాచుర్యం పొందారు ఆమె. ‘‘సాం కేతికంగా.. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ఉన్నా.. ఆచారాల పరంగా చాలా వెనకబడే ఉన్నాం. ఎంతలా అంటే.. జన్మనిచ్చిన వాళ్లు పోయినా వాళ్లకు తల కొరివి కొడుకే పెట్టాలి కాని ఆడపిల్ల పెట్టకూడదు. అలాంటి నమ్మకాల కోసం కడుపులో ఉన్న ఆడశిశువులు కన్ను తెరవకుండా చేసుకుంటున్నాం. ఇలాంటి సంప్రదాయాలను నేను పాటించను. అందుకే నేను కర్మకాండలు చేయించడానికి వెళ్లినప్పుడు.. ఆ ఇంటి ఆడపిల్లలనూ అందులో పాల్గొనేలా చేస్తా.. ఇంకో మాట.. సాధారణంగా నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు చేయించే పురోహితులు కర్మకాండలు చేయించరు. అలాగే కర్మకాండలు చేయించే పురోహితులు పెళ్లిళ్లూ చేయించరు. కాని నేను అన్నీ చేయిస్తాను. అంతేకాదు.. మన దగ్గర శుభకార్యాలకు సంబంధించిన పూజాకార్యక్రమాల్లో భర్త పోయిన స్త్రీ పార్టిసిపేట్ చేయదు. కాని భార్య పోయిన పురుషుడు ఆ పూజలు చేయొచ్చు. అలాంటి సంప్రదాయానికీ చెక్ పెట్టాను. ఒకసారి ఓ పెళ్లి జరిపించడానికి వెళ్లాను. వధూ వరులిద్దరికీ తండ్రి లేకపోవడంతో ఆ ఇద్దరు మహిళలు ఆ శుభకార్యానికి దూరంగా ఉండి అన్ని వ్యవహారాలను ఎవరి చేతనో చేయిస్తున్నారు. అప్పుడు నేను వాళ్లను పిలిచి.. పీటల మీద వాళ్లనే కూర్చోబెట్టి.. నిర్విఘ్నంగా ఆ పెళ్లి జరిపించా. మొదట కొంత జంకినా, తర్వాత వాళ్లు తమ పిల్లల పెళ్లికి తాము నిమిత్తమాత్రులు కాకుండా తామే కర్తలుగా పీటల మీద కూర్చుని పెళ్లి చేయించగలిగినందుకు ఎంతో సంతోషించారు. ఇప్పటికీ ఆ జంట చక్కగా ఉంది’’ అని గుర్తు చేసుకున్నారు చిత్ర చంద్రచూడ్. చిత్ర స్ఫూర్తితో ఆమె కోడలూ పౌరోహిత్యంలోకి అడుగుపెట్టారు. -
కిరీటాలు మాయంలో పురోగతి
-
గర్భాలయంలో అర్చకులు లేని సమయంలో..!
సాక్షి, తిరుపతి: భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శనివారం మూడు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీ వెనుక అర్చకులు, సిబ్బంది ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో వారి ప్రమేయం లేకపోవచ్చనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. అయినా కూడా ఆ రోజు ఆలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి కాల్డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించారు. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బయటి వ్యక్తులే భక్తుల ముసుగులో ఆలయంలోకి చొరబడి కిరీటాలు ఎత్తుకెళ్లినట్టు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు సీసీ ఫుటేజిలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు. అం దులో భాగంగా సోమవారం రాత్రి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అనుమానితుడి ఫో టోను విడుదల చేశారు. చోరీకి పాల్పడ్డ వారి కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ట్టు ఎస్పీ వెల్లడించారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తె లిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. అయితే ఆటో డ్రైవర్తో పాటు తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. కాల్డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్డేటాను పరిశీలిస్తున్నా రు. దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ కోసం పోలీ సు బృందాలు వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లా రు. కాల్డేటాను సేకరించిన పోలీసులు వాటి ఆధా రంగా గాలింపు చేపట్టారు. ఈ మేరకు పోలీసు బృం దాలు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లారు. దొంగల ను కాల్డేటా పట్టిస్తుందనే పోలీసులు భావిస్తున్నా రు. గర్భాలయం ముందు ఉన్న సీసీ కెమెరా గత కొన్ని రోజులుగా పనిచేయకపోవటానికి గల కారణా లపైనా కూపీ లాగుతున్నారు. అర్చకుల్లో రెండు వర్గా లు ఉండటంతో విచారణకు సహకరించటం లేదనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించాలని జేఈఓ అర్చక బృందాలను కోరినట్టు తెలిసింది. అర్చకులు లేని సమయంలోనే.. గోవిందరాజస్వామి గర్భాలయం, సమీపంలో విధులు నిర్వహించాల్సిన అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కిరీటాలు చోరీకి గురైన స మయంలో అర్చకులు గర్భాలయంలో లేరని తెలిసింది. ఇదే అదనుగా చూసి ఉత్సవమూర్తులకు అలంకరించి ఉన్న మూడు కిరీటాలను అపహరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అర్చకులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. గోవిందరాజస్వామి గర్భాలయంలో విధులు నిర్వహించే అర్చకులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంపై తొ లుత పోలీసులు వారినే అనుమానించారు. అయి తే విచారణలో వీరికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అయినా గర్భాలయంలో విధులు నిర్వహించేవారి నిర్లక్ష్యమే చోరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. -
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
శ్రీకాకుళం, వీరఘట్టం: కళ్లు, కాళ్లు సక్రమంగా ఉన్న వాళ్లే డిగ్రీలు పూర్తిచేసి లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉపాధి వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్లు సరిగ్గా కనిపించకపోయినా డిగ్రీ పూర్తి చేసి స్వయం ఉపాధితో తనకో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావు విజయగాథ ఇది.. తిరుపతిరావుకు చిన్నప్పటి నుంచే దృష్టి లోపం ఉంది. అయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ బ్రాహ్మణుల వలే మంత్రాలు చదువుతూ బతుకు తెరువు కోసం అర్చకుడిగా మారాడు. గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో బాబా సేవలో ఉంటూ భక్తుల గోత్రనామాలతో పూజలు చేస్తుండేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతులు ఇస్తూ వేదపండితుని మాదిరిగా మంత్రాలు చదువుతూ ఆదర్శంగా నిలిచాడు. భక్తులు ఇచ్చే దక్షిణలతో కొంత మొత్తంతో పూజా సామగ్రి కొని మిగిలిన దానితో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల ఆవరణలో 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ కూడా చెబుతూ ముందుకు సాగుతున్నాడు. పట్టుదలతో ఉన్నత చదువు పూర్తి.. వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావుకు పుట్టినప్పటి నుండే దృష్టి సమస్య ఉంది. రాత్రి పూట మాత్రం ఏమాత్రం కనిపించదు. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. 1 నుంచి 7వ తరగతి వరకు కంబర పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు కంబరవలస హైస్కూల్లో, ఇంటర్ వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివాడు. పార్వతీపురం వెంకటేశ్వర కళాశాలలో బీకాంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉపాధి కోసం దూరప్రాంతం వెళ్లలేని పరిస్థితి కావడంతో గ్రామంలో ఉన్న సాయిబాబాను నమ్ముకున్నాడు. గ్రామస్తులు కూడా అండగా నిలిచారు. పక్కనే ఉన్న రామాలయం పూజారి వద్ద మంత్రాలు, పూజా విధానం నేర్చుకుని సాయిబాబా ఆలయంలో శాశ్వత అర్చుకుడిగా మారాడు. దేవుని సేవలో.. దృష్టిలోపం ఉన్న ఈ కుర్రాడికి పెళ్లి ఎలా అవుతుంది.. పిల్లను ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. ఇంతలో దేవుడే తోవ చూపించాడు. నాలుగేళ్ల కిందట పాలకొండ మండలం తంపటాపల్లికి చెందిన అప్పలనరసమ్మ అనే ఓ యువతి తిరుపతిరావును వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. పెద్దలు వీరికి వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. బాబానే నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి సాయిబాబానే నమ్ముకున్నాను. బీకాం డిగ్రీ పూర్తి చేసినా దూరం ప్రాంతంలో పనిచేయలేను. అందుకే బాబాసేవలో ఉంటూ స్థానికంగా ట్యూషన్ చెబుతూ స్వయం ఉపాధి పొందుతున్నాను. దేవుని సేవ చేసే అదృష్టం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భార్య చేదోడుగా ఉంటోంది.– పొగిరి తిరుపతిరావు, అర్చకుడు ,సాయిబాబా గుడి, కంబర, వీరఘట్టం మండలం -
అష్టావధానం.. ఎంతో ఇష్టంగా!
అమెరికా గడ్డపై పుట్టి పెరిగాడు.. పరాయి భాషలో విద్యాభ్యాసంచేస్తున్నాడు.. అయితేనేం, అమ్మభాషలో కమ్మగా అష్టావధానం చేస్తున్నాడు లలిత్ ఆదిత్య.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ యువకుడు బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం నిర్వహించాడు. అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా తన అష్టావధాన ప్రస్థానంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. సాక్షి, సిటీబ్యూరో :భారత గడ్డతో అనుబంధమున్న ఎవరైనా తమ కష్టకాలంలో, ఆపద సమయంలోఉన్నపళంగా తలుచుకొనే దైవం హనుమంతుడు. ఆ దైవమే తనను అష్టావధానం వైపు అడుగులు వేయించాడు. ఆయన ఆశీర్వాదం బలంతోనే అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నానని యువ అష్టావధాని లలిత్ ఆదిత్యపేర్కొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆయన అష్టావధానంలో పేరు ప్రఖ్యాతులుసంపాదించారు. బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానంనిర్వహించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. నాలుగు నెలల పాటు శిక్షణ.. సరిగ్గా మూడేళ్ల క్రితం హనుమంతుడిని స్తుతిస్తూ నేను రాసిన ఆంజనేయస్వామి శతకం అష్టావధానం వైపు అడుగులు వేయించింది. శతకంలోని తప్పొప్పులు విశ్లేషించుకునేందుకు వెళ్లిన నన్ను ధూళిపాళ్ల మహదేవ రమణి గురువు వద్ద అష్టావధానంలో శిక్షణ పొందేలా మార్చింది. ఇందులో నాలుగు నెలల పాటు శిక్షణ తీసుకున్నా. గొప్ప అదృష్టం.. అవకాశం.. రవీంద్ర భారతి నా కలల స్వప్నం. ఈ వేదికపై ప్రదర్శన పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఆ అదృష్టాన్ని మాటల్లో వర్ణించలేను. పద్యాలు రాయడం, వేదం, సంగీతం వంటి వాటిపై పట్టు ఉండటంతో అష్టావధానం తేలికైంది. అమెరికాలో పలు అష్టావధాన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇటీవల రాజమండ్రి, విజయవాడల్లో నిర్వహించిన అష్టావధాన ప్రక్రియల్లో పాలుపంచుకున్నాను. భక్తి కావ్యం.. జీవిత లక్ష్యం ప్రస్తుతం నేను అమెరికాలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. కెరీర్లో ఎదగడానికి అష్టావధానం ఎంతగానో ఉపకరిస్తుంది. సృజనాత్మకత, ఏకాగ్రత రెండూ పెరుగుతాయి. భవిష్యత్తులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో స్థిరపడతా. భక్తిభావాన్ని పెంపొందించే మంచి కావ్యం రాయాలనేదినా జీవిత లక్ష్యం. . తెలుగు భాషలో ఆత్మీయత.. అమెరికాలోని పిల్లలకు బాల్యంలోనే సంప్రదాయ నృత్యాలు, సాహితీ పఠనం, వేదాలు నేర్పిస్తున్నారు. తెలుగుభాష ఉచ్చారణలో స్పష్టత మాత్రమే కాదు.ఆత్మీయత దాగి ఉంటుంది. రు. నాన్న మారుతీ శశిధర్, అమ్మ శైలజ నా బాల్యంలోనే భారతీయ సంస్కృతీసంప్రదాయాలను అలవర్చారు. తెలుగులో మాట్లాడమే కాదు, చిన్నతనంలోనే పద్యాలు చెప్పటం.. తిరిగి చెప్పించటం ఇలా కన్నవారి ప్రేరణతోనే అమ్మ భాషపై పట్టు సాధించాను. పుస్తకపఠనం, సంగీతం రెండింటితో సహవాసంతో స్వయంగా పద్యాలు రాసేంతగా ఎదిగాను. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పద్యాలు రాసి గురువుల ప్రశంసలు పొందాను. -
శబరిమల పూజారులపై చర్యలుంటాయా!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనమే కాదు, అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుంది. ఈ కారణంగా ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఈ ఉల్లంఘనకు 1955లో తీసుకొచ్చిన ‘అంటరానితనం నిషేధ చట్టం’ కింద నేరస్థులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలోకి అదే మతానికి చెందిన కొంత మందిని అనుమతించడం, మరికొంత మందిని అనుమతించక పోవడం అంటరానితనమే అవుతుందంటున్న రాజ్యాంగంలోని 17వ అధికరణను స్ఫూర్తిగా తీసుకొనే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన సుప్రీం కోర్టు బెంచీ గత సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రకాల అంటరానితనాలను నిషేధించినట్లు రాజ్యాంగంలోని 17వ షెడ్యూల్ స్పష్టం చేసింది. ఎలాంటి సామాజిక కారణాల వల్ల కూడా ఎవరి పట్ల వివక్షత చూపినా అది అంటరానితనమే అవుతుందని కూడా చెప్పింది. అందుకనే ఇది స్వచ్ఛం, అది అపవిత్రం అంటూ మహిళల పట్ట వివక్షత చూపడం కూడా అంటరానితనమే అవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇద్దరు మహిళ అయ్యప్పను సందర్శించుకోవడం వాస్తవమేనంటూ ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. అపచారమంటూ శుద్ధి చర్యలు తీసుకున్న పూజారులపై కేసు పెట్టగలరా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు శుద్ధి పూజల పేరిట శబరిమల ఆలయాన్ని మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. -
పేటలో కలకలం
నెల్లూరు , సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని ఇసుకమిట ప్రాంతంలో ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో పూజారిగా ఉంటూ వచ్చిన ఇ.కె.గిరీష్సింగ్ భక్తి పేరుతో ఘరానా మోసానికి పాల్పడి కటకటాలపాలైన ఘటన సంచలనం రేపింది. ఆర్థిక నేరాలకు పాల్ప డిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.గతేడాది విజయదశమికి శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేందుకు రోల్స్ రాయీస్, బెంజికారులతో పాటు సుమారు ఎనిమిది మంది బౌన్సర్లతో సూళ్లూరుపేటలో నానా హంగామా చేశారు. ఒక మామూలు పూజారి పనిచేసుకుంటున్న వ్యక్తి ఇలా పెద్ద పెద్ద కార్లతో పాటు బౌన్సర్లతో వచ్చి హంగామా చేయడంతో ఇదేదో కథే అనుకున్నారు అందరూ. అందరూ అనుకున్నట్టుగానే భక్తులను మోసం చేసి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి పలు కేసుల్లో ఇరుక్కుని హైదరాబాద్లో ఊచలు లెక్కిస్తున్నారు. అసలు కథలోకి వెళితే సూళ్లూరుపేటకు చెందిన గిరీష్సింగ్ స్వామిజీ పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెట్టవచ్చని, తద్వారా కోట్లు పోగేసుకోవచ్చని ప్లాన్ చేసుకుని మకాం హైదరాబాద్కు మార్చుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తెలివిగా మోసం చేసి సుమారు రూ.25 కోట్లు మోసం చేశారని బాధితులు ఆరోపించడం విశేషం. తన తమ్ముడు దిలీప్సింగ్తో కలిసి ఆద్వైతక్రియ పేరుతో ప్రక్రియలను సృష్టించి మూఢ నమ్మకాలు ఉన్న వానిరి బాగా నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు ఫిర్యాదులు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని తమ్ముడు దిలీప్సింగ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూళ్లూరుపేటకు చెందిన సామాన్య పూజారి గిరీష్సింగ్ ఇంత భారీ ఎత్తున మోసం చేశారని పలు టీవీ ఛానెళ్లలో వరుస కథనాలు ప్రసారం కావడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా స్థానికంగా కూడా ఎవరైనా బాధితులున్నారా?, నగదు వసూలు చేశాడా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
అర్చకుడి పై నలుగురు టీడీపీ వర్గీయుల దాడి
-
‘‘మా సారొస్తే..హారతి ఇవ్వరా..? ఎంత ధైర్యం..?
చిత్తూరు, తిరుచానూరు: ‘‘మా సారొస్తే..హారతి ఇవ్వరా..? మీకు ఎంత ధైర్యం..?’’ అంటూ పంచాయతీ అధికారులు గురువారం ఆలయ అర్చకునిపై రెచ్చిపోయారు. ఆపై వారి ఇంటికి ఉన్న పంచాయతీ నీటి కొళాయి కనెక్షన్ తొలగించేందుకు యత్నించారు. వివరాలు.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ నాయుడు తన కుటుంబ సభ్యులతో వాహనసేవకు వచ్చారు. అయితే వాహన సేవలో ఆయనకు హారతి ఇవ్వకపోవడంతో ఆగ్రహించారు. అలాగే బుధవారం అమ్మవారి పంచమితీర్థంలో కూడా ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని సుమారు గంట పాటు సెక్యూరిటీ సిబ్బంది నిలువరించారు. ఈ నేపథ్యంలో, గురువారం చోటుచేసుకున్న పరిణామాలు కక్ష సాధింపునకు అద్దం పట్టాయి. పంచాయతీ ఇన్ఛార్జ్ ఈఓ కిరణ్ తన సిబ్బందితో కలసి ఆలయ అర్చకుడు బాబు స్వామి ఇంటికి వచ్చారు. అక్రమంగా పంచాయతీ కొళాయిని ఏర్పాటు చేసుకున్నారంటూ హడావుడి చేశారు. కనెక్షన్ను తొలగించేందుకు యత్నించారు. తాము 20 ఏళ్ల క్రితమే పంచాయతీకి డబ్బులు కట్టి కొళాయి కనెక్షన్ పొందామని బాబుస్వామి బదులిచ్చారు. అయితే, రసీదులు చూపమంటూ అధికార దర్పం ప్రదర్శించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న స్థానికులు వారిని నిలదీశారు. దీంతో బాబుస్వామిని పంచాయతీ కార్యాలయానికి రావాలంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత కార్యాలయానికి వెళ్లిన బాబుస్వామిపై ఇన్చార్జ్ కార్యదర్శి చిందులుతొక్కారు. ‘మాసారు వాళ్లు అమ్మవారికి హారతి ఇస్తుంటే తోసేస్తారా?.. పంచాయతీ అధికారులంటే మీకు భయం లేదా..మీరు ఏమనుకుంటున్నారు?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించడంతో బాబుస్వామి మనస్తాపంతో ఇంటిముఖం పట్టారు. దీనిపై కిరణ్ను వివరణ కోరగా...అలాంటిదేమీ లేదని, బాబుస్వామి ఇంటి వద్ద కొళాయికి మోటారు పెట్టి నీటిని వాడుతున్నారని ఫిర్యాదు అందడంతో తాను తనిఖీ చేసినట్టు చెప్పుకొచ్చారు. -
‘పాలక’ పెత్తనం.. తీస్తోంది ప్రాణం
పాలక మండళ్లు పరిధి దాటుతున్నాయి. అర్చకులపై పెత్తనం చెలాయించే క్రమంలో వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండాలనే వారి అహంకారానికి అర్చకులు తట్టుకోలేక పోతున్నారు. అర్చకత్వం తప్ప మరో పని తెలియని ఆ అమాయకులు తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవాలయాలలో నియమితులైన పాలక మండళ్లు అర్చకులను వేధింపులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేవాలయాలపై వచ్చే ఆదాయంతో పాటు దేవాలయాల భూములపై వచ్చే ఆదాయంపై పాలక మండళ్ల దోపిడీ పెరిగిపోవడంతో అర్చకులను బలిపశువులను చేస్తున్నారు. గతంలో అర్చకులకు చాలా గౌరవంగా చూసేవారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత పాలక మండళ్లు అర్చకులను తమ ఇంట్లో పని మనుషుల్లా చూస్తు వారి చేత పనులు చేయించుకోవడం, వారు చేసే పనులలో తప్పులు వెదికి వేధింపులకు గురి చేయడం వంటివి చోటు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ రెండున కోరుకొండ మండలం, కణుపూరులోని శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జున దేవాలయం అర్చకుడు కొత్తలంక మల్లికార్జున శర్మ ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ఈ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని తీసేందుకు అర్చకుడు సహకరించడం లేదని కక్షగట్టిన పాలక మండలి సభ్యులు దైవ సన్నిధి నుంచి మెడపెట్టి గెంటేశారు. దీనితో పాటు అర్చకుడు ఉంటున్న ఇంటి తలుపులను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు పగులగొట్డాడు. సామాన్లు బయటపడవేసి, ధర్మకర్త మండలిలోని కొందరు సభ్యులు వెకిలిగా నవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకప్పుడు స్వల్ప ఆదాయం ఉండే శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయా నికి ప్రస్తుతం శివరాత్రి, కార్తిక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనితో ఆదాయం కూడా పెరిగింది. ధర్మకర్త మండలి లెక్కల ప్రకారం ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. దీనితో పాటు దేవాదాయ భూములపై కూడా ఆదాయం వస్తుంది. దీనిని ప్రశ్నిస్తున్న మల్లికార్జున శర్మను వెళ్లగొట్టాలనే లక్ష్యంతో వేధింపులకు గురి చేశారు. రామచంద్రపురంలో... రామచంద్రపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుడు పాణిగంపల్లి ఫణికుమారాచార్యులు ఆలయ నిర్వాహకులు వేధింపులు తాళ్లలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు. ఏడాదిగా ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న తనను ఆలయ నిర్వాహకులు పనివాడిగా చూస్తు అన్ని పనులు తనతో చేయిస్తున్నారని, చేసే పనిలో తప్పులు వెదుకుతున్నారని, తనలా మరొకరు బలికాకూడదని సెల్ ఫోన్ వీడియోలో ఫణికుమారాచార్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫణికుమారాచార్యులు పరిస్థితి విషమంగా ఉందని అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నాయి. ఇదే మాదిరి పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అర్చకుడిని వేధింపులకు గురి చేసి, గోడను పడగొట్టి వేధింపులకు గురి చేశారని అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా పవిత్ర దేవాలయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. ట్రస్టీలకు పునరావాస కేంద్రాలు టీడీపీ ప్రభుత్వంలో ట్రస్టీలకు దేవాలయాలు పునారావాస కేంద్రాలుగా మారాయి. కొంత మంది రాష్ట్రపతి పదవులుగా భావిస్తున్నారు. అర్చకులను బానిసలుగా చూస్తు హేళన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.– కేవీఎస్ఆర్ఎన్ అచార్యులు,ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి -
మీరాశీ అర్చకులను కొనసాగించాల్సిందే..
సాక్షి, తిరుపతి :తిరుమలలో పని చేస్తున్న మీరాశీ వంశీకుల అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రయోగించిన రిటైర్మెంట్ అస్త్రం బెడిసికొట్టింది. మీరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలంటూ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో టీటీడీ పాలక మండలికి షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది. టీటీడీలో మీరాశీ కుటుంబాలకు చెందిన 52 మంది వంశపారంపర్య అర్చక స్వాములు ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల ఆలయాల్లో వేలాది మంది అర్చకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మే 16న టీటీడీ పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న వారిలో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ తప్పదని తేల్చిచెప్పింది. దీనిపై అర్చకులు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం అమలైతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులందరికీ వర్తించే అవకాశం ఉంది. తిరుమలలో జరుగుతున్న అపచారాలను బయటపెడుతున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కక్ష సాధించడానికే రిటైర్మెంట్ అస్త్రాన్ని టీటీడీ ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న మీరాశీ వంశీకులకు చెందిన నలుగురు ప్రధాన అర్చకులు, ఆరుగురు అర్చకులను రిటైర్మెంట్ పేరుతో టీటీడీ ధర్మకర్తల మండలి ఇంటికి పంపించింది. ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్ 16న జీఓ నంబర్ 1171, 2012 అక్టోబర్ 16న ఇచ్చిన జీఓ నంబర్ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని ఈవో సింఘాల్ గుర్తుచేశారు. వారిని కొనసాగించండి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరుకు చెందిన అర్చకస్వాములు హైకోర్టును ఆశ్రయించారు. రిటైర్మెంట్ను తప్పుబడుతూ అర్చకస్వాములకు అనుకూలంగా గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. మీరాశీ అర్చకులను రిటైర్మెంట్ ప్రసక్తి లేకుండా కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ నిర్ణయం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రిటైర్మెంట్ అనే విషయం పాలకమండలి పరిధిలోనిది కాదని అంటున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీ పాలకమండలి అర్చకులపై రిటైర్మెంట్ అస్త్రాన్ని ప్రయోగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుతో... హైకోర్టు తాజా తీర్పు మీరాశీ వంశీకుల అర్చకులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది అర్చకుల్లో ఆనందాన్ని నింపింది. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే... అర్చకులపై ప్రయోగించిన రిటైర్మెంట్ అస్త్రాన్ని తిరుమలలోని సన్నిధి గొల్లలపైనా ప్రయోగించాలని టీటీడీ భావించినట్లు తెలిసింది. రమణ దీక్షితులును తొలగించినట్లే సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా పరిగణించి, వారికి రిటైర్మెంట్ ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. టీటీడీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి శిక్ష తప్పదని హైకోర్టు తీర్పును గుర్తుచేస్తూ అర్చక సంఘాలు, సన్నిధి గొల్లలు హెచ్చరిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను టీటీడీలో పనిచేసే కొందరు మంట గలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము టీటీడీలో ఉద్యోగులం కాదని, శ్రీవారి సేవకులం మాత్రమేనని అంటున్నారు. సేవకులకు రిటైర్మెంట్ ఉండదని పేర్కొంటున్నారు. టీటీడీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో మొదటిది అర్చక స్వాముల రిటైర్మెంట్ అయితే... ఆభరణాలు, పింక్డైమండ్ మాయంతో పాటు పోటులో తవ్వకాలు వంటి అనేక ఆరోపణలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారిలో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యంస్వామి ఉన్నారు. ఆ ఆరోపణలపై న్యాయస్థానాల తీర్పు ఎలా ఉండబోతోందని టీటీడీ పాలకమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైకోర్టు సంచలన తీర్పుపై అర్చక సమాఖ్య హర్షం సాక్షి, అమరావతి: వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ వర్తించదని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీటీడీలోని వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పిందని రాంబాబు తెలిపారు. -
వేధింపులు తట్టుకోలేక..
తూర్పుగోదావరి, రామచంద్రపురం: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పనిచేసే అర్చకుడు ఆలయ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండల ఎం కోటపాడు గ్రామానికి చెందిన పాణింగపల్లి çఫణికుమారాచార్యులు ఏడాది కాలంగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో నడుస్తోంది. ఆలయ నిర్వాహకులు కొంత కాలంగా తనను వేధిస్తున్నారని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని పేర్కొంటూ వాట్సాప్లో వీడియో మెసేజ్ పెట్టి ఎలుకల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు హుటాహుటిన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర బ్రహ్మణ సంఘం నాయకులు దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రామచంద్రపురం ఎస్సై ఎస్ లక్ష్మిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే విషయం తెలుçసుకుని పోలీసులను కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి పంపామని, ఎంఎల్సీ అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్ డిమాండ్ చేశారు. వీడియో మెసేజ్ సారాంశమిది హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ యాజమాన్యం తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ హింసిస్తోందని, తాను చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ సూటిపోటి మాటలతో తనను నిర్వాహకులు బాధపెడుతున్నారని బాధితుడు వాట్సాప్ వీడియో సందేశంలో తన గోడు వినిపించాడు. ఇక తట్టుకోలేక మానసికంగా విసిగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనలా మరో వైఖానుసుడెవరూ బలికాకుండా చూస్తారని కోరుకుంటున్నాని తెలిపాడు. ఫణికుమారాచార్యులు పంపిన వాట్సాప్ వీడియో మెసేజ్ అందరినీ కలచివేసింది. -
కార్తీక పూజలు చేస్తూ అర్చకుడు మృతి
-
కార్తీక పూజలు చేస్తూ.. శివైక్యం చెందిన పూజారి
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): పంచారామా క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగవెంకట ప్రసాద్(నాగబాబు) మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టుగా తెలుస్తోంది. పూజారి శివైక్యం చెందడటంతో క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 11న భీమవరం పంచారామ ఆలయ గర్భగుడిలో కుప్పకూలిన పూజారి రామరావు శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. -
అర్చకుడు సత్యనారాయణ శర్మకు కన్నీటి వీడ్కోలు
గీసుకొండ(పరకాల): అర్చకుడు దేవళ్ల సత్యనారాయణ శర్మకు అర్చకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సత్యనారాయణ శర్మ భౌతిక కాయాన్ని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో కడదాకా పాల్గొన్నారు. సత్యనారాయణ శర్మకు భార్య, పిల్లలు లేకపోవడంతో ఆయన అన్న శంకర్రావు కుమారుడు సురేష్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఎనుమాముల, రెడ్డిపాలెం నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. అంతిమయాత్రలో తెలంగాణ బ్రాహ్మణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, ప్రధానకార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, అర్బన్ జిల్లా అధ్యక్షులు వల్లూరి పవన్కుమార్, నాగిళ్ల శంకర్శర్మ, నాయకులు జగన్మోహన్శర్మ, వాణి, బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్రెడ్డి, పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, గట్టికొప్పుల రాంబాబు, గ్రామ పెద్దలు ఆడెపు రమేశ్, దొంగల రమేశ్ పాల్గొన్నారు. డీసీపీ అనురాధ, ఏసీపీలు ప్రతాప్కుమార్, సుధీంద్ర, సీఐ సంజీవరావు, ఎస్ఐ రహీంలతో పాటు పలువురు పోలీస్ అధికారులు అవాంఛనీయ టనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి.. అర్చకుడు సత్యనారాయణశర్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్గేషియా చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా మొగిలిచర్లలో సత్యనారాయణశర్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్చకుల భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్ నుంచి సత్యనారాయణ కుటుంబానికి తక్షణ సాయం అందించాలన్నారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
దేవస్థానం పెద్దాయన ఇకలేరు
చిత్తూరు,శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయ ప్రధాన అర్చకులు, మీరాశీదారులు, స్థానాచార్యులు, దేవాదాయ ధర్మదాయశాఖ ఆగమ సలహాదారులు ఎస్ఎంకే సదాశివ గురుకుల్(82) 40 ఏళ్ల పాటు శివయ్యకు సేవలు అందించారు. అనారోగ్యంతో ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రభుత్వం మీరాశీ రద్దు చేసినప్పుడు దేవస్థానం అస్తులను పైసాతో సహా అప్పగించిన కుటుంబం గురుకుల్ది. దేవస్థానం ఆస్తులు ఆభరణాలు పరిరక్షించడంలోనూ ఆయన పాత్ర కీలకమైనది. ఆయన కన్నుమూయడంతో శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయం మూత వేశారు. ఆలయ ఈఓ శ్రీరామరామస్వామితోపాటు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధం గా ఆలయం నుంచి సారెను తీసుకువచ్చారు. దేవస్థానం తరుఫున ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూత వేశారు. ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. అనంతరం యథావిధిగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన్ని చివరిసారిగా చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవస్థానం మాజీ చైర్మన్లు కోలా ఆనంద్, పోతుగుంట గురవయ్యనాయుడు, శాంతారామ్ జేపవర్తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు, పట్టణ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. భరద్వాజ మహర్షి వంశీయులు శ్రీకాళహస్తీశ్వరుని, జ్ఞానప్రసూనాంబను పూజించి తరించిన వారెందరో ఉన్నారు. వారిలో భరద్వాజ మహర్షి ముఖ్యుడు. ద్వాపర యుగానికి చెందిన ఈయన ఇక్కడనున్న వాయులింగేశ్వరుడిని పూ జించి ముక్తి పొందినట్లు స్థలపురాణం చెబుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజా విధానం, సంప్రదాయాలను ఆ కాలంలోనే అమలు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. భరద్వాజుడు తమ పూజ కోసం తవ్వించిన పుష్కరిణే నేటి భరద్వాజ తీర్థంగా పేరుగాంచింది. సదాశివ గురుకుల్ భరద్వాజ మహర్షి వంశీయులు. 300 ఏళ్లుగా భరద్వాజ గోత్రానికి చెందిన వారే మీరాశీ విధానంలో ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సదాశివ గురుకల్ 40 ఏళ్లుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో శివయ్యకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన వృద్ధాప్యం నేపథ్యంలో ఆయన అన్న కుమారుడు స్వామినాథన్ గురుకుల్ స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు. -
పూజారి హత్యపై సీబీఐ విచారాణ చేపట్టాలి
-
చచ్చేందుకు అనుమతించండి మహా ప్రభో..!
భువనేశ్వర్ : తమ ఆదాయానికి అడ్డంకులు సృష్టించి పూట గడవకుండా చేస్తున్నారని పేర్కొంటూ పూరి జగన్నాథస్వామి ఆలయ పూజారి నరసింఘ పుజపంద ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించి చచ్చే బదులు ఆత్మహత్యే శరణ్యమనీ, చనిపోయేందుకు తనకు అనుమతివ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బుధవారం లేఖ రాశారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దనే నియమం వల్ల ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్న తమ ఏకైక ఆదాయ వనరును నాశనం చేశారని నరసింఘ వాపోయారు. తమకు బతికే ఆధారమే లేదనీ, తమ హక్కులపై ఉక్కుపాదం మోపడం దారుణమని ఒడిషా ప్రభుత్వం, సుప్రీం కోర్టుపై ఆయన నిరసన వెళ్లగక్కారు. సుప్రీం ఆదేశాలు.. దేవాలయాల్లో పూజరుల ఆగడాలు పెరిగిపోయాయనీ, పాలనా వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ కటక్కు చెందిన న్యాయవాది మృణాళిని పధి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు ఆలయాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు జూలై నెలలో పలు ఆదేశాలు జారీ చేసింది. పూజారులెవరూ భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. అలాగే, ఇష్టానుసారం వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దనీ, వరసక్రమంలో (క్యూ) భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని వెల్లడించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి జగన్నాథ ఆలయంలోకి క్యూ పద్ధతిలో భక్తులను అనుమతిస్తున్నారు. ఇదిలాఉండగా.. జగన్నాథస్వామి ఆలయంలోకి పురావస్తు శాఖ అధికారులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ గత మార్చిలో నరసింఘ ప్రాణత్యాగం చేస్తానని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఆలయ కోశాగారం (రత్న భండార్)లోని ఆభరణాల వాస్తవస్థితిని తెలుసుకునేందు పురావస్తు శాఖ ఒడిషా హైకోర్టు అనుమతి తీసుకుంది. -
అమ్మవారి ఆరగింపు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెల్లవారుజామున బాలభోగ నివేదనతో పాటు మధ్యాహ్నం మహానివేదన సమర్పిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వంటశాల నుంచి నివేదనలను ఆలయానికి తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామివార్లతో పాటు ఉపాలయాలలోని దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న వంటశాలలో తయారుచేస్తారు. అమ్మవారికి నివేదనను సకాలంలో సమర్పించేందుకు వీలుగా ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్, అర్చకులు రంగావఝల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షకులుగా ఉంటారు. తొలిపూజ – నివేదన లోక కళ్యాణార్థమే తెల్లవారుజామున 2–30 గంటలకు అమ్మవారి ఆలయం తెరిచిన తరువాత తొలిపూజను లోకకళ్యాణార్థం చేస్తారు. అర్చనానంతరం అమ్మవారికి బాలభోగంగా దద్ధ్యోదనాన్ని ఉదయం ఆరు గంటలకు నివేదన చేస్తారు. ఉదయం 8–30 గంటలకు కట్టె పొంగలి, బూందీ లడ్డూ, ఉదయం 10–30 గంటలకు పులిహోర, సాయంత్రం 4–30 గంటలకు సెనగలు, పాలు సమర్పిస్తారు. ఉదయం 11–40 గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన, ఆలయాన్ని శుభ్రం చేసి, మహానివేదనగా అన్నం, రెండు కూరలు, పప్పు, సాంబారు, పాయసం, గారెలను అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి సమర్పించిన చిత్రాన్నాన్ని ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాల నుంచి అమ్మవారికి అప్పాలను నివేదించి, భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు. దసరా ఉత్సవాలలో ప్రత్యేకం... సాధారణ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన సమర్పిస్తుండగా, దసరా ఉత్సవాల సమయంలో మాత్రం సాయంత్రం 6–30 గంటలకు మహా నివేదన సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటలకు వడలు, పది గంటలకు అమ్మవారికి రాజభోగాలుగా చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, రవ్వకేసరి, పరమాన్నం, బూందీ లడ్డూ, గారెలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మహానివేదన సమర్పిస్తారు. అనంతరం పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతుంది. దసరా ఉత్సవాలలో మహానివేదనతో పాటు మరికొన్ని వంటకాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దసరా ఉత్సవాలు – అలంకారాలు – నివేదనలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి– స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (మైసూర్పాక్, పులిహోర) ఆశ్వయుజ శుద్ధ విదియ – బాలాత్రిపుర సుందరీదేవి (లడ్డూ, పెసర వడ) ఆశ్వయుజ శుద్ధ తదియ– గాయత్రీదేవి (సున్నుండలు, అరటికాయ బజ్జీ) ఆశ్వయుజ శుద్ధ చవితి – లలితాత్రిపుర సుందరీదేవి (కొబ్బరి లవుజు, మినప వడ) ఆశ్వయుజ శుద్ధ పంచమి – సరస్వతీదేవి (జాంగ్రీ, ఆవడ) ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – అన్నపూర్ణాదేవి (గోధుమ హల్వా, సెనగ వడ) ఆశ్వయుజ శుద్ధ సప్తమి – మహాలక్ష్మీదేవి (చక్కెర పొంగలి, బొబ్బర్ల గారె) ఆశ్వయుజ శుద్ధ అష్టమి – దుర్గాదేవి (పాయసం, బూందీ) ఆశ్వయుజశుద్ధ నవమి/దశమి – మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి (అప్పాలు, పెసర పునుగులు) – ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్, విజయవాడ -
హంసపై వైకుంఠనాథుడు
తిరుమల/కాణిపాకం : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) ఆవిష్కరించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా సీనియర్ కాద్రిపతి నరసింహాచార్యులు క్రతువును, పతాకావిష్కరణ చేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులపాటు సప్తగిరి క్షేత్రంలో ఉంటూ దేవదేవుని ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలతో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ కాగా, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయన సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు సీఎంకు పట్టువస్త్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. పెద్దశేషుడిపై శ్రీనివాసుడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు శేషవాహనం మీద ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వారిని వాహన మండపంలో బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర, సుగంధ పరిమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 8 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. వాహనసేవ ముందు భజన బృందాల సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి. హంసపై వైకుంఠనాథుడు బ్రహ్మోత్సవాల రెండో రోజు శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామి హంస వాహనాన్ని అధిరోహించి సర్వ విద్యాప్రదాయని అయిన సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ గురువారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి కంకణం ధరించాలి. కాణిపాకంలోనూ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఈఓ పి.పూర్ణచంద్రరావు, చైర్మన్ వి. సురేంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖ నక్షత్రం, తులా లగ్నంలోని శుభగడియల్లో ఉ.9.30–10.15 గంటల మధ్య ఆలయ అర్చక, వేదపండితులు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూషిక పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం రాత్రి సిద్ధి బుద్ధి సమేత ఉత్సవమూర్తులను హంస వాహనంపై పురవీధుల్లో భక్తులను ఊరేగించారు. -
చోరీ కేసులో పూజారి అరెస్ట్
మారేడుపల్లి: ఇళ్లల్లో పూజలు చేస్తూ నమ్మకంగా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న పూజారిని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీఐ అప్పలనాయుడు ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మారేడుపల్లి సామ్రాట్ కాలనీకి చెందిన గోపాలరావు (38) పౌరోహిత్యం నిర్వహిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అతను వెస్ట్ మారేడుపల్లికి చెందిన బెల్పు జనార్దన్రావు ఇంట్లో పూజలు చేస్తూ వారి ఇంట్లో నమ్మకం సంపాదించుకున్నాడు. 2017 ఏప్రెల్లో జనార్దన్ రావు ఇంట్లో చోరీ జరగడంతో బాధితుడు మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గోపాల్రావుపై అనుమానం వ్యక్తం చేయగా జనార్దన్ రావు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గత నెల 16న మరో సారి జనార్దన్ రావు తల్లి సత్యభామ గదిలో పర్సు మాయమైంది. అందులో 40 తులాల బంగారం, ఏటీఎం కార్డు, లాకర్ తాళాలు ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27 నుంచి ఈ నెల 6 వరకూ మారేడుపల్లిలోని పలు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడు పూజారి గోపాల్ రావుగా గుర్తించా రు. ఆదివారం అతడిని అరెస్టు చేసి, 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, లాకర్ తాళం చెవి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసులను చేధించిన మహాంకాళీ ఏసీపీ వినోద్కుమార్, సీఐ శ్రీనివాసులు, డీఐ అప్పలనాయుడు, ఎస్ఐ సుబ్బారెడ్డిలను, డీసీపీ సుమతి అభినందించారు. -
ఏపీ అర్చక సమఖ్య రాష్ట్ర సమావేశం
-
నెరవేరిన కరుణానిధి చిరకాల కోరిక
సాక్షి, చెన్నై : తమిళనాడు మధురైలోని ఓ ఆలయంలో బ్రాహ్మనేతర పూజారిని నియమించడం ద్వారా ఆలయ అధికారులు కులనిర్మూలన దిశగా ఒక ముందడుగేశారు. దీంతో తమిళ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి చిరకాల కోరిక నెరవేరినట్లయింది. ఆలయంలో బ్రాహ్మణేతర పూజారులను నియమించడం తమిళనాడులో ఇదే తొలిసారి. 1970లో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో బీసీ (బ్రాహ్మనేతర) కులాల వారికి కూడా ఆలయ పూజారులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలోని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై 2006లో మరోసారి సమీక్ష నిర్వహించిన కరుణానిధి.. అర్చకులుగా శిక్షణ పొందేందుకు ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చేసిన అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పించాలని భావించారు. డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తప్పపట్టింది. కోర్టు తీర్పుపై అప్పట్లో కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేకురాలనే పెరియార్ రామస్వామి ఆశయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల డిమాండ్ మేరకు 2015లో ఆలయంలో అర్చకుల నియామకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు ఉండకూడదని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరు నెలలపాటు అర్చకత్వ కోర్సులో శిక్షణపొందిన వారిని దేవాదాయశాఖ పూజారులుగా నియమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారని డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆలయం సన్నిధిలోనే దిగ్భ్రాంతికర సంఘటనలు
విశాఖపట్నం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ: పవిత్రమైన, ప్రముఖమైన ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. దైవ సన్నిధిలోనే ఆలయం పరువుకు గ్రహణం వాటిల్లింది. ఇసుక కొండపై వెలసిన రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్టు సన్నిధిలోనే క్షోభ కలిగించే సంఘటన జరిగింది. ఆషాడ పౌర్ణమి రోజున.. ఉదయ సమయంలో పూజలు జరుగుతూ ఉండగా.. ఆలయ ప్రధానార్చకుడు సూపరింటెండెంట్పై గర్భగుడిలోనే దాడి చేయడంతో కలవరం చోటు చేసుకుంది. భక్తులంతా నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఈ ఉదంతం జరిగింది. భక్తులకు, భగవానుడికి మధ్య వారధిగా ఉండే అర్చకుడు ఇలా హేయంగా ప్రవర్తించారని దేవాలయాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురు పూర్ణిమ పురస్కరించుకొని శుక్రవారం ఉదయం భక్తులు సత్యనారాయణస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. భక్తుల, ఆలయం ఈవో శైలజ కథనం ప్రకారం.. ప్రధానార్చకుడు అనధికారికంగా ఓ పూజారిని తీసుకువచ్చి గర్భగుడి వద్దనియోగించారు. ఆయన కారణంగా గర్భగుడిలో స్వామి విగ్రహం కనిపించకుండా ఉందని భక్తులు అనడంతో సూపరింటెండెంట్ సురేష్ ఆయనను పక్కకు జరగమని ఆలయ సూపరింటెండెంట్ సురేష్ కోరారు. దీంతో ప్రధానార్చకుడు ఫణిహార నరసింహమూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. సూపరింటెండెంట్పై మండిపడడమే కాక, దేవుని చెంత, భక్తులు చూస్తుండగా అతడి చెంప ఛెళ్లుమనిపించారు. ఎడాపెడా కొడుతూ విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమారుడు కూడా ఓచెయ్యి వేశారు. సురేష్పైనే గాక అల్లిపురం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి డి ప్యూటేషన్పై వెళ్లిన రవిపై కూడా ఇద్దరూ దాడికి దిగారు. ఇదంతా సీసీ కెమారాల్లో రికార్డయింది. ఈ సంఘటనలతో భ క్తులు నివ్వెరపోయారు. వెంటనే ఆలయ ఈవో కె.శిరీష అక్కడకు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు. దక్షిణలు కూడా వారికే.. ప్రధానార్చకుడు నరసింహమూర్తి సుమారుగా రూ. 50వేల వేతనం అందుకుంటున్నారు. ఆయన కుమారుడు ఆరేళ్ల కిందట అర్చకుడిగా నియమితులయ్యారు. ఆయనకూ పీఆర్సీ ప్రకారం వేతనం వస్తోంది. ఇదికాక పళ్లెం రాబడిని కూడా వారే తీసుకుంటున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రూ. 5 లక్షల పైబడి రాబడి ఉన్న ఆలయాల్లో పీఆర్సీ ప్రకారం వేతనాలు తీసుకుంటున్న అర్చకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పళ్లెంలో నగదు తీసుకోకూడదని సిబ్బంది వాదిస్తున్నారు. దీనిపై విభేదాలు ఉండవచ్చని, అర్చకుడి దాడికి అది కారణం కావచ్చని అభిప్రాయం వినవస్తోంది. దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆగ్రహం పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తించే అర్చకులు ఇలా దాడులు చేయడంపై వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది మండిపడతున్నారు. సిబ్బందితో సమన్వయంగా మెలిగి, ఆలయం పట్ల భక్తుల్లో గౌరవప్రపత్తులు పెంచాల్సినవారు ఇలా దాడి చేస్తే దేవాలయం పరువుప్రతిష్టలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. దాడులకు దిగిన పూజారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముగిసిన విచారణ ఆలయంలో జరిగిన సంఘటనలపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి విచారణ నిర్వహించారని ఈవో శైలజ తెలిపారు. ఆయన నివేదికను కమిషనర్ కార్యాలయానికి పంపినట్టు తెలియజేశారు. మరోవైపున అర్చకుల తీరును నిరసిస్తూ ఆలయంలో సిబ్బంది శనివారం నుంచి విధులకు గైర్హాజరవుతున్నట్టు నోటీసు ఇచ్చారని ఆమె చెప్పారు. అర్చకులపై చర్యలు తీసుకునేటంత వరకు విధులకు హాజరు కాబోమని తెలిపారన్నారు. అనుమతి లేకుండానే.. ప్రతి పౌర్ణమికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో ప్రధానార్చకుడితోపాటు ఆయన కుమారుడు కూడా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి వారిద్దరే కాకుండా నా అనుమతి లేకుండా ఓ అర్చకుడిని తెచ్చి గర్భగుడిలో నియోగిస్తున్నారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో, సూపరింటెండెంట్ సురేష్ను అక్కడికి పంపించి లోపల ఉన్న పూజారిని బయటకు రప్పించాలని ఆదేశించాను. సూపరింటెండెంట్ గర్భగుడి వద్దకు వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని బయటకు వచ్చేమని చెబితే..ప్రధానార్చకుడు, మిగిలినవారు సూపరింటెండెంట్పై దాడికి దిగారు. భక్తుల ముందు ఇలా దాడి చేయడం సబబు కాదని ప్రధానార్చకుడికి స్పష్టం చేశాను. ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణ చేపడుతుంది.–కె.శిరీష, ఈవో,సత్యనారాయణ స్వామి ఆలయం -
అర్చకుడిపై ఇద్దరు మహిళల ఆరోపణలు
పనాజి : ఓ అర్చకుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇద్దరు మహిళలు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గోవాలోని మంగూషి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అర్చకుడు తమను కౌగిలించుకోవడంతో పాటు, ముద్దు పెట్టుకున్నాడని ఇద్దరు మహిళలు వేర్వేరుగా ఆలయ కమిటీకి లేఖలు రాశారు. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 14న ఆ అర్చకుడిపై తొలి ఫిర్యాదు రాగా, రెండోది జూన్ 22న వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ సెక్రటరీ అనిల్ కేన్ర్క్ ధ్రువీకరించారు. సదరు మహిళల ఆరోపణల్లో నిజం లేదని తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఒకవేళ ఆ లేఖల్లో ప్రస్తావించిన అంశాలు నిజమని తెలితే అర్చకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కానీ ఇప్పుడే అతన్ని తన విధుల నుంచి సస్పెండ్ చేయలేమన్నారు. ‘నేను కుటుంబంతో పాటు గుడికి వచ్చినప్పుడు, అర్చకుడి పాదాలకు నమస్కరించే సమయంలో తను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను భయపడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఆలయంలో వేరేచోట ఉన్నారు. మీకు అంతగా అనుమానం ఉంటే ఆ రోజు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాల’ని మొదట ఫిర్యాదు చేసిన మహిళ తన లేఖలో పేర్కొంది. మరో మహిళ తన లేఖలో ఆ అర్చకుడు లాకర్ ఏరియాలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ముద్దు కూడా పెట్టాడాని ఆరోపించారు. అకస్మాత్తుగా అతను అలా చేయడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆధారాల కోసం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని కోరారు. అతడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కాగా రెండో మహిళ లేఖకు అనిల్ స్పందించారు. ఆమె ఫిర్యాదుపై జూలై 4వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా.. అందులో నిజం లేదని తెలిందన్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేపట్టడానికి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కావాంటే ఆమె సంబంధిత అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. -
మృగాళ్లలా ప్రవర్తించారు.. వదిలిపెట్టొద్దు
సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్రేప్ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్ చేయాలని బుధవారం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు. కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని చర్చి మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేస్తూ.. ఆమె భర్త ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. ‘20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్మెయిలింగ్కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా, 2006లో మహిళకు వివాహం కాగా, వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదంట. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు వివరించగా.. ఆయన మత గురువుల ఆరాచకాలను వెలుగులోకి తెచ్చాడు. మృగాళ్లలా ప్రవర్తించారు.. కాగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మత గురువులు మృగల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకడైన ఫాదర్ జాబ్ మాథ్యూ పోలీసులకు గురువారం లొంగిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలో గత 18 నెలలుగా.. మొత్తం 12 మంది మత గురువులను లైంగిక దాడుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మేమేం రక్షించట్లేదు.. కాగా, ఈ వ్యవహారంలో చర్చి అధికారులపైనా విమర్శలు చెలరేగాయి. వారిని రక్షిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫిర్యాదు అందగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇప్పుడు వారికి-చర్చికి ఎలాంటి సంబంధం లేదు’ అని ఓ ప్రకటనలో చర్చి మేనేజ్మెంట్ పేర్కొంది. -
అర్చకుల నెత్తిన శఠగోపం
శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి. తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య రేగిన వివాదాలు, విమర్శలు భక్తులను మనస్తాపానికి గురి చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, శ్రీవారి ప్రధాన అర్చకుల నిర్బంధ పదవీ విరమణకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కేవలం ప్రధాన అర్చకుల సమస్యగా చూడలేం. ఎందుకంటేæ ఇది మన సనాతన ధర్మానికి ఎదురైన సమస్య. కాబట్టి అందరూ తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలూ ఆచారాలూ గతి తప్పుతున్నాయంటూ సాక్షాత్తు ప్రధాన అర్చకులు శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. కానీ ఆయన చేసిన ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పకుండా కొన్ని స్వార్థపర శక్తులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలక మండలి కూడా శ్రీరమణ దీక్షితులుకి రాజకీయ ప్రయోజనాలు అంటగడుతున్నాయి. ఇంతకీ ఈ పాలక మండలి అంటే ఏదీ? ప్రస్తుత ప్రభుత్వం ఎంపిక చేసిన భజన బృందమే. ప్రభుత్వం నుంచి స్వప్రయోజనాలనూ; టీటీడీ అధికారుల నుంచి ప్రత్యేక దర్శనం కోసం ఉచిత టికెట్లూ ప్రసాదం పొట్లాలూ ఆశించే ఒక వర్గం మీడియా వారికి వంత పాడుతున్నది. రామానుజుల వారు నిర్దేశించిన మేరకు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరిగే పూజాదికాలకి శ్రీవారి సన్నిధిలో భంగం వాటిల్లుతున్నది. అలాగే దారుణమైన రీతిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అయినప్పటికీ హిందూ సమాజం మౌన ప్రేక్షక పాత్రకు పరిమితమౌతున్నది. ఇది మరింత బాధించే అంశం. ఈ రెండు దశాబ్దాలలో హిందూ ధర్మమే లక్ష్యంగా రెండు దారుణమైన దాడులు జరిగాయి. మొదటిది కంచి మఠం మీద జరిగిన దాడి. అప్పటి హిందూ సమాజం ప్రదర్శించిన ధోరణి మౌన ప్రేక్షక పాత్రకు ఉదాహరణగా నిలుస్తుంది. కొందరు భక్తులు వ్యక్తిగత స్థాయిలో స్పందించడం మినహా, మఠాల నుంచి, సాధుసంతుల నుంచి వచ్చిన స్పందన పరిమితం. మఠాచార్యులు ఆశించిన మేర హిందూ సమాజం స్పందించలేదు. అసలు ఆచార్యులు అంటే వ్యక్తులు కారు. వారు వ్యవస్థల వంటివారు. కానీ సనాతన ధర్మాన్ని సేవించేందుకు రెండున్నరవేల ఏళ్ల క్రితం స్థాపించిన ధార్మిక సంస్థల ఎడల మనం చూపవలసిన మర్యాదను చూపలేదు. రెండోది– తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకస్వామి మీద, ఆలయ సంప్రదాయ మర్యాదల మీద, సాంస్కృతిక సంపద మీద జరుగుతున్న దాడి. ఇప్పుడు కూడా హిందూ సమాజం అదే విధంగా మౌన ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. శ్రీరమణ దీక్షితులు (ఆయన మోలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ తీసుకోవడమే కాదు, వైఖానస ఆగమశాస్త్రంలో నిష్ణాతులు) దేవస్థానంలో జరుగుతున్న అపచారాల మీద ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి నిత్యోపచారాలలో రాజకీయనేతల, పాలక మండలి సభ్యుల, ఇతర ఉద్యోగుల జోక్యం వంటి అంశాలు అందులో ఉన్నాయి. కంచే చేను మేసిన చందంగా తయారయింది పరిస్థితి. శ్రీవారి ఆభరణాలపై ఏటా జరగవలసిన ఆడిట్ జరగడంలేదని ఆయన ఆరోపించారు. దీనిని పెడచెవిన పెట్టగలమా? పైగా ఇలాంటి ఆరోపణ చేస్తారా అంటూ ఆ వ్యక్తి మీద ప్రత్యారోపణలకు దిగడం, పరువు నష్టం దావాలు వేయడం సబబేనా? ఇంతకీ ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి? శ్రీవారి సేవల విషయంలో పాలక మండలి జోక్యం నిరంతరం ఉంటోం దని ఆయన చెప్పారు. శ్రీరమణ దీక్షితులు చెప్పిన ప్రకారం, వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవ నిర్వహించాలంటూ అర్చకుల మీద టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకురావడం వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు స్వామివారిని మేల్కొల్పడం అపచారం. తోమాల సేవను తూతూమంత్రంగా ముగించాలంటూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వీఐపీల కోసం కొన్నిసార్లు, జనం తాకిడి పేరుతో కొన్నిసార్లు సేవలను ఇలా అసంపూర్ణంగా ముగించేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్రీరమణ దీక్షితుల ఆరోపణ. శ్రీవారి పోటులో జరిగిన అపచారం మరొకటి. పోటు అంటే శ్రీవారి నిత్యనైవేద్యాల కోసం అన్నప్రసాదాలను వండివార్చే చోటు. అక్కడ హఠాత్తుగా మరమ్మతులు చేపట్టారు. కానీ ప్రధాన అర్చకులే పాలకమండలికి ఆగమశాస్త్ర సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు. అలాంటిది ప్రధాన అర్చకులకు తెలియకుం డానే శ్రీవారి పోటులో మరమ్మతులు చేపట్టారు. లోపల ఉన్న గ్రానైట్ పలకలను మార్చారు. ఆ సమయంలో అన్నప్రసాదాలను బయట చేయిం చారు. ఇది ఆగమశాస్త్ర విరుద్ధం. పైగా ఆ నైవేద్యాలను కూడా చెల్లించవలసిన పరిమాణంలో చెల్లించలేదు. కానీ అలాంటిదేమీ జరగలేదంటూ పోటుకు చెందిన పేద పనివారితో ప్రకటనలు ఇప్పించి ఈ విషయం వెలుగులోకి రాకుండా అధికారులు ప్రయత్నించారు. నాలుగు కుటుంబాలకు చెందినవారే ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వహిస్తారు. తమ వంతుగా ఆ సంవత్సరం బాధ్యతలు స్వీకరించే అర్చకులకు ఆభరణాలను అప్పగించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. శ్రీవారి ఆభరణాలను ఏటా ఆడిట్ చేస్తారు. ఇది బహిరంగ ఆడిట్ కూడా. బంగారు గొలుసులు, విడి వజ్రాలు, కెంపులు వంటి వాటిని కూడా ఆడిట్ చేస్తారు. అప్పుడే తమ వంతు మేరకు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాన అర్చకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇదంతా టీటీడీ అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. కానీ 1996 నుంచి ఈ విధానానికి మంగళం పాడారు. పైగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్వామివారి అలంకారానికి శ్రీకృష్ణదేవరాయల వంటి ప్రభువులు సమర్పించిన ఆభరణాలను ఇవ్వవలసిందని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కూడా శ్రీరమణ దీక్షితులు ఆరోపించారు. అధికారులు ఇచ్చిన ఆభరణాలతోనే స్వామివారు తృప్తిపడాలి. ఆయా కానుకలు సమర్పించడంలో అప్పటి భక్తులకు ఉన్న అభిమతానికి ఇలా గౌరవమే లేకుండా పోయింది. ఇలాంటి ధోరణి కొన్ని ప్రశ్నలకు కారణమవుతున్నది. ఆ ఆభరణాలన్నీ అక్కడ ఉన్నాయా? ఇక్కడ ఆ ప్రశ్న సబబైనదే కూడా. ఎవరైనా భక్తులు స్వామివారికి ఏదో ఒక ఆభరణం కానుకగా సమర్పించదలిచి పాలక మండలిని సంప్రతిస్తే వారు స్వామివారి పురాతన నగలలో ఒక దాని నమూనాను ఇస్తున్నారు. అప్పటి నుంచి ఆ కొత్త ఆభరణమే స్వామి వారి అలంకారానికి నోచుకుంటున్నది. పాతది ఇనప్పెట్టెలలోకి పోతున్నది. నిజానికి ఆ రెండు అక్కడ భద్రంగా, అందుబాటులో ఉన్నాయా? కాబట్టి ఇలాంటి ఆరోపణలలోని వాస్తవాలను హిందూ సమాజం తెలుసుకోవలసిన అవసరం లేదా? మనం ఏం చేస్తున్నాం? మన ఆచార వ్యవహారాలపై నిర్ణయాలను కోర్టుల పరం చేసి చోద్యం చూస్తూ ఉండిపోవాలా? హిందువుల ప్రార్థనా స్థలాల మీద, దేవస్థానాల వ్యవహారాలలోను ఆదరాబాదరా నిర్ణయాలు వెల్లడిస్తూ అత్యున్నత న్యాయ స్థానం కూడా తన స్థాయిని దిగజార్చుకోరాదు. ఏ సేవకు, ఏ పూజకు ఎంత సమయం సరిపోతుంది, ఎలాంటి నైవేద్యం అర్పించాలి, ఎలాంటి ఆభరణాలతో అలంకరించాలి, బ్రహ్మోత్సవాల నిర్వహణ వంటి అన్ని అంశాలలో కోర్టుల ప్రమేయం సరికాదు. ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునే అధికారం పండితులైన అర్చకస్వాముల పరం చేయాలి. తిరుమలకు కూడా గోపాల్ సుబ్రహ్మణ్యం వంటి అమికస్ క్యూరీ అవసరం ఉందా? నిజానికి దేవస్థానాలలో జరుగుతున్న ఇలాంటి అనర్థదాయక అంశాల మీద హిందూ సమాజంలో శ్రద్ధ చూపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కరే. వీటి గురించి సుప్రీంకోర్టులో పోరాడుతూనే, దేవస్థానంలో అవకతవకలపై నిజ నిర్ధారణ చేయడానికి, వాటిని సరిదిద్దడానికి ఆచార్యులను కూడా ఏకత్రాటి మీదకు తీసుకువచ్చే పనిని కూడా ఆయన చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. ఒక సంఘంగా ఏర్పడడానికి మఠాధిపతులంతా వెంటనే ముందుకు రావాలి. తిరుపతి జీయరు, అహోబిల మఠం అధిపతి, త్రిదండి జీయరు, ఆండవర్, పెజావర్ స్వామి, హాథీరామ్ మఠం అధిపతి వంటి వారంతా కూడా ఆ సంఘంలో సభ్యులు కావాలి. తిరుపతి జీయరు ఇప్పటికే టీటీడీ పాలక మండలి/ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. అయితే వాస్తవాలు వెలుగులోకి రావలసిన ఈ సమయంలో ఆయనను ఈ పనికి ఒప్పించాలి. కంచి ఆచార్యులు, శృంగేరి మఠాధిపతి కూడా ఈ అంశానికి మద్దతు పలికితే వచ్చే ఊపు వేరుగా ఉంటుంది. ఈ సంఘం ఏం చేయాలి? మఠాధిపతులంతా తమ భక్తులైన ముగ్గురు లేదా నలుగురు ఆడిటర్ల పేర్లు సూచించాలి. అలాగే ఆభరణాల వెల కట్టే వారిని కూడా సూచించాలి. ఈ బృందం కూడా ఆభరణాల ఆడిట్లో ఉంటుందని ప్రకటించాలి. ప్రభుత్వం ఆమోదించక తప్పదు. సేవలు, పూజలు, నైవేద్యాల విషయంలో అధికారులకు సంబంధం లేదని స్వాములు ప్రకటించాలి. తమ అనుభవంలోకి వచ్చిన అన్ని వాస్తవాలను వారు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. 22 ఏళ్ల క్రితం ఆభరణాల ఆడిట్ ఆగిపోయినప్పటికి, అప్పటి జాబితాను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ తరువాత భక్తులు సమర్పించిన అన్ని ఆభరణాల వివరాలను ఆ జాబితాకు జోడించాలి. ఇది డిజిటల్ యుగం కాబట్టి ప్రతి ఆభరణం వివరాన్ని డిజిటల్ విధానంలో నమోదు చేయాలి. మఠాధిపతుల సంఘం చేసే సేవ భవిష్యత్తులో హిందూ ధర్మానికి మార్గదర్శనం చేయాలి. మన ఆలయాలు, మఠాల నుంచి ప్రభుత్వాలను బయటకు నెట్టే విధంగా చేయాలి. ఏదో చేస్తారని నమ్మి ఓటు వేసిన నాయకులు మరింత కుహనా సెక్యులరిస్టులుగా కని పిస్తున్నారు. ఇలాంటి నేతలు, భక్తిలేని అధికారులు మన మందిరాలలోకి చొరబడ్డారు. అవి నాయకులవి కావు, కోర్టుల ప్రమేయం అవసరం లేదు. అవి స్వాములు, మఠాధిపతుల ఆవాసాలు. వాటిని వారే నిర్వహించాలి. ఎస్వి. బద్రీ, వ్యాసకర్త తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు contact@globalhinduheritagefoundation.org -
వింత చర్యకు పాల్పడిన మతగురువు
జైపూర్ : రాజస్థాన్లోని ఓ మతగురువు వింత చర్యకు పాల్పడ్డారు. సేవాగిరిదామ్కు చెందిన 40 ఏళ్ల మత గురువు మహంత్ అనిల్ పురోహిత్ తన జననాంగాన్ని కోసేసుకున్నారు. మత గురువు అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తన గదిలోనే ఈ చర్యకు పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో బాబాలు, స్వామిజీలపై తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ విధంగా చేసినట్టు తెలుస్తోంది. తన క్యారెక్టర్ను నిరూపించుకోవడానికే అతను ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. గాయపడ్డ అనిల్ను ఆయన అనుచరులు తొలుత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జైపూర్ తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అనిల్ ప్రస్తుతం జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనిల్ నుంచి వివరాలు సేరిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పూజలు చేస్తూ శివలింగం చెంతనే...
సాక్షి, భీమవరం: పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. గర్భగుడిలో స్వామివారికి పూజలు చేస్తూ ఆలయ ప్రధాన అర్చకుడు కందుకూరి వెంకటరామారావు శివలింగంపైనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందడంతో గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నట్టుండి కిందపడిపోయిన వెంకటరామారావు మరో అర్చకుడి సాయంతో లేచి నిల్చున్నారు. అయితే మళ్లీ కాసేపటికే ఆయన శివలింగం చెంతనే పడిపోయారు. గుడిలోని అర్చకులు అప్రమత్తమయ్యే లోపల ఆయన ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది. గర్భగుడిలోని సీసీ కెమెరాలలో రికార్డైన ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆరోజు ఏంజరిగిందనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
భీమవరం: గుండెపోటుతో ఆలయ పూజారి మృతి
-
అర్చకులపైనే దాడి చేస్తారా?
-
నగ్నంగా ఊరేగింపు.. యాసిడ్ విసిరారు
సాక్షి, బెంగళూరు: మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పూజారిని చితకబాది, నగ్నంగా ఊరేగించారు స్థానికులు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బెలగావిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... షంబాజీ రోడ్లోని కపిలేశ్వర ఆలయ పూజారి గోపాలయ్య(రామ పూజారి) గత కొంత కాలంగా గుడికొచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో కొందరు గోపాలయ్యను హెచ్చరించినప్పటికీ లాభం లేకుండా పోయింది. సోమవారం సాయంత్రం గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని చితకబాది ప్యాంట్ ఊడదీయించి ఊరేగించారు. ఆ వీడియోలు స్థానికంగా పలు ఛానెళ్లలో ప్రసారం అయినట్లు టౌమ్స్ నౌ ప్రచురించింది. అయితే ఈ క్రమంలో గోపాలయ్య అనుచరులు కొందరు యాసిడ్ దాడికి దిగినట్లు ఆ కథనం పేర్కొంది. ఊరేగింపు కొనసాగుతుండగానే గోపాలయ్యపై దాడికి పాల్పడ్డ కొందరు యువకులపై యాసిడ్ బాటిళ్లను విసిరారు. ఈ ఘటనలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా, ఆ దృశ్యాలు కూడా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొట్టాయి. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే పలువురురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
‘లోకేశ్ను ఎలా మంత్రిని చేశారు’
మొయినాబాద్(చేవెళ్ల): ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్కు ఏ అర్హత ఉందని మంత్రిని చేశారని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీటీడీ పాలకమండలికి చట్టాలపై అవగాహన లేదన్నారు. తిరుమలపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న ఆలయాలపై పడుతుందన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు. ఎండోమెంట్ యాక్ట్ని సవరించ కుండా రిటైర్మెంట్ చేయడానికి వీలులేదని, ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ ను ట్రస్టు బోర్డు కొట్టేయడానికి వీలులేదన్నారు. వంశ పారంపర్యంగా తండ్రి తరువాత కొడుకు అర్చకత్వం నిర్వహించవద్దని చెబుతున్న చంద్రబాబు ఆయన కుమారుడిని మాత్రం వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మండి పడ్డారు. ‘అర్చక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టారు కాబట్టి మేం మిమ్మల్ని ప్రశ్నలడుగుతాం. మీకు రాజకీయమెందుకని అడుగుతాం.. రాజకీయ నాయకుడు మా దగ్గరకొస్తే మేం రాజకీయ నాయకుడి దగ్గరకొస్తాం’ అని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
అర్చకులకు రిటైర్మెంట్ ఉండదు
సాక్షి, అమరావతి: టీటీడీలో అక్రమాలను ప్రశ్నించారనే కక్షతో అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అర్చకులపై కక్ష సాధింపులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తూ గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపులకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో చంద్రబాబు ధనయావ, అధికార దాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులుగా స్వామి వారికి అన్ని కైంకర్యాలు నిర్వహించే హక్కు శక్తి ఉన్నంత కాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పేస్కేలు, పదవి తరువాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వనపుడు, ఉద్యోగిగా పరిగణించనపుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంటును ప్రకటించడం అర్థం లేనిది. దేవుని మీద భయం, భక్తి లేని వారు కాబట్టి గుడి భూములను కాజేయాలని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలో దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తాం’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం
-
అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, గోపాలపురం(ఏలూరు) : టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో అన్యాయానికి గురవుతున్న అర్చకులకు ఆయన మద్దతుగా నిలిచారు. తాము అధికారంలోకొస్తే అర్చకులకు రిటైర్మెంట్ లాంటివి లేకుండా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు పలు అంశాలు ప్రస్తావిస్తూ జననేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించిన కారణంగా టీటీడీ అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధనయావ, అధికారదాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులుగా స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వర్తించే హక్కు శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదు. దేవుని మీద భయం, భక్తి లేనివారు కాబట్టే గుడిభూములను కాజేయాలని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకొస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేస్తామని’ వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. (చదవండి: టీటీడీ అర్చకులపై వేటు) pic.twitter.com/tBW8iw9wBu — YS Jagan Mohan Reddy (@ysjagan) 17 May 2018 -
టీటీడీ అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎండోమెంట్ యాక్టు ప్రకారం అర్హత గల మిరాశీ, నాన్ మిరాశీ కుటుంబాలకు చెందిన వేద పండితులను ఖాళీ పోస్టుల్లో అర్చకులుగా నియమి స్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో మండలి తొలి సమావేశం జరిగింది. మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్కుమార్ సింఘాల్లు వివరాలను వెల్లడించారు. ఎజెండాలో పొందుపరిచిన 200 అంశాలపై సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉండగా కేవ లం 2 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపా రు. టీటీడీలో ఉన్న శ్రీవారి కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్లు వేసే వ్యవహారంపై మంచీచెడులను విశ్లే షించి తగిన సూచనలు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. రమణ దీక్షితులుకు నోటీసు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసు జారీ చేస్తున్నామని ఈవో అనిల్ కుమార్సింఘాల్ వెల్లడించారు. దీక్షితులు మీడియా ముందు ప్రస్తా వించిన అంశాలపై వివరణ కోరుతున్నామన్నారు. 65 ఏళ్లు పైబడి 16 మంది.. తిరుమలలో మిరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది ఉన్నారు. ఇందులో 65 ఏళ్ల పైబడిన వారు 16 మంది ఉన్నారు. మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వీరి తొల గింపు అనివార్యమవుతుంది. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షి తులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస, నారాయణ దీక్షితులు సైతం ఉద్యోగ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఎదుర్కొంటాం: రమణ దీక్షితులు అరవై ఐదేళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వంశ పారంపర్య అర్చకత్వంలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న తప్పులను మీడియా ముందు ఎత్తిచూపినందుకే ప్రతీకార చర్యగా టీటీడీ అర్చకుల వయోపరిమితిపై నిర్ణయం తీసుకుందని దీక్షితులు ఆరోపించారు. టీటీడీ అధికారులు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడాల్సి రావడం బాధగా ఉందంటూ.. అర్చకులకు న్యాయస్థానం కల్పించిన హక్కులను వివరించారు. 1996లో మిరాశీలను రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను ఉటంకించారు. బహు మానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆటంకం కలిగించ కూడదన్నారు. సంభావన ఏర్పాటుపై కూడా కోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టీటీడీ అర్చకులను ఉద్యోగులుగా చూపుతూ ఉద్యోగ విరమణ వర్తింపజేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. స్వామివారి కైంకర్యాలకు వెళ్లిన అర్చకులను దుర్భాషలాడుతూ, సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
‘బాల్యవివాహం చేస్తే పూజారిపై కేసు’
సాక్షి, నారాయణపేట రూరల్: అవగాహన రాహిత్యంతో నారాయణపేట డివిజన్లో ఎక్కువగా బాల్యవివాహాలు చేçయడానికి సిద్ధమవుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే రహస్యంగా తిరిగి పెళ్లిళ్లు చేసినట్లు సమాచారం వస్తుందని కలెక్టర్ రొనాల్డ్రోస్ అన్నారు. గురువారం పేటలో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన బాల్యవివాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసులు నమోదు చేస్తేనే మార్పు కనిపిస్తుందని ముందు పెళ్లి చేసిన పూజారిపై కేసు నమోదు చేయాలన్నారు. ఇటీవల దామరగిద్ద మండలం కంసాన్పల్లికి చెందిన అమ్మాయిని మద్దూరు మండలంలోని ఓ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని, కౌన్సిలింగ్ ఇచ్చినా తిరిగి పెళ్లి చేయడంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన అందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాల్యవివాహాలపై మాట్లాడారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు కోడేరు (కొల్లాపూర్): మండలంలోని రాజాపూర్లో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివతో పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ఈ నెల 25న వివాహం జరిపారు. చిన్నతనంలో పెళ్లి చేశారని సీడబ్ల్యూఎస్ దశరథం ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఏఎస్ఐ ఇస్మాయిల్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టేట్హోంకు తరలించారు. మండలంలో ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ తెలిపారు. -
శ్రీకృష్ణుడికే పంగనామాలు
ఓజిలి : ఆలయ పూజారి తాను పూజించే శ్రీకృష్ణుడికే పంగనామాలు పెట్టి దేవుడి మాన్యం భూములను గుటకాయాస్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తం 7.55 ఎకరాల భూమిలో వచ్చే ఫలసాయాన్ని పూజారి ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ ఆ భూములను రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి విక్రయించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. ఓజిలి మండల పరిధిలోని ముమ్మాయపాళెం గ్రామంలో 1947 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని గ్రామస్తులు నిర్మించుకున్నారు. అప్పట్లో సర్వేనంబర్ 239–2, 246–2లలో 1.66 ఎకరాలు మాగాణి పొలాన్ని గ్రామస్తులు విరాళంగా ఇవ్వగా, ప్రభుత్వం 305–2లో5.89 ఎకరాల మెట్ట భూమిని దేవాలయానికి కేటాయించింది. అప్పటి నుంచి మందిరంలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. ఈ భూములను ఆలయ పూజారికి గ్రామస్తులు అప్పగించారు. భూముల్లో వచ్చే ఫలసాయంతో దేవునికి దీపారాధన జరుగుతుండేది. ఈ క్రమంలో 1995లో మందిరం గాలివానలకు కూలిపోయింది. అప్పటి నుంచి మందిరం మొండిగోడలకు పరిమితమైంది. దేవుడి భూములు మొత్తం శ్రీకృష్ణ మందిరం పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. గతంలో దేవుడి మాన్యంలో గంగ కాలువ వెళ్లడంతో ప్రభుత్వం రూ.28,500 నగదును పూజారి, కమిటీ పేరుతో మంజూరు చేసింది. అప్పట్లో ఈ నగదును స్వాహా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మందిరం భూములపై పూజారి కన్నుపడి అనుకున్నదే తడవుగా గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు కాసులు ముట్టజెప్పి రికార్డులను పూజారి పేరుతో మార్పుచేశారు. దీంతో ఈ భూములను హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి సుమారుగా రూ.80 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పూజారి పొలంపై స్టే తెచ్చేందుకు హైదరాబాద్కు వెళ్లిన్నట్లు సమాచారం. ఆలయ భూములను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు ఆర్డీఓ శీనానాయక్, తహసీల్దార్ సత్యవతిలకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి ఆలయభూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రికార్డులు పరిశీలించి చర్యలు శ్రీకృష్ణుడి భూముల రికార్డులు తారుమారు జరిగిన విషయం నాదృష్టికి వచ్చింది. గ్రామస్తులు భూముల విషయాన్ని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ పత్రాలను పరిశీలించి రికార్డులు తారుమారు చేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. – సత్యవతి, తహసీల్దార్, ఓజిలి భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీకృష్ణ మందిరానికి చెందిన 7.55 ఎకరాల భూములను ఆలయ పూజారి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో శ్రీకృష్ణ మందిరం పేర్లు తొలగించి పూజారి పేరు నమోదు చేసుకున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు ఆలయం శిథిలావస్థలో ఉంది. ధూప దీప నైవేద్యాలు లేవు. భూములను రూ.80 లక్షలకు విక్రయించేందుకు పూజారి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులు స్పందించి దేవుడి భూములను కాపాడాలి. – మామిడి భక్తవత్సలరావు, సర్పంచ్, ముమ్మాయపాళెం నా దృష్టికి రాలేదు కృష్ణ మందిరం భూముల విషయం నాదృష్టికి రాలేదు. మందిరం భూముల విషయాన్ని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భూములు విక్రయించకుండా చర్యలు చేపడుతాం. – రమణారెడ్డి, దేవదాయశాఖ ఈఓ, ఓజిలి -
స్నేహితుడితో కలిసి పూజారి ..
అన్నానగర్: వడపళనిలో చేతులు, కాళ్లు కట్టేసి పూజారి భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కీలక మలుపు తిరిగింది. భర్తే స్నేహితుడితో కలిసి హత్య చేసి నాటకం ఆడినట్లు తెలిసింది. దీంతో ఆలయ పూజారి సహా ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. చెన్నై వడపళని దక్షిణ శివుడి ఆలయ వీధికి చెందిన బాలగణేష్ (27). ఇతను వడపళని శివుడి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య జ్ఞానప్రియ(24) 5వ తేదీ ఉదయం చేతులు, కాళ్లు కట్టిన స్థితిలో మృతిచెంది ఉంది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వచ్చి గాయాలతో ఉన్న బాలగణేష్ని చికిత్స కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఉత్తర్వుల ప్రకారం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో మలుపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలగణేష్ను పోలీసులు విచారణ చేశారు. ఇందులో బాలగణేష్ తన స్నేహితుడు ధనశేఖర్తో కలిసి జ్ఞానప్రియాని హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు బాలగణేష్, ధనశేఖర్ని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐదేళ్ల కిందట బాలగణేష్ జ్ఞానప్రియని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాలగణేష్కి లోపం ఉందని తెలియడంతో జ్ఞానప్రియ అతన్ని అవహేళన చేసేదని తెలిసింది. బాలగణేష్ పోరూర్కు చెందిన తన స్నేహితుడు ధనశేఖర్కు ఈ విషయం చెప్పాడు. తరువాత ఇద్దరూ పథకం వేసి బుధవారం అర్ధరాత్రి ధనశేఖర్తో కలిసి భార్య జ్ఞానప్రియని సుత్తితో కొట్టి హత్య చేశారు. అనంతరం ధనశేఖర్ ఇద్దరి చేతులను, కాళ్లను కట్టేసి నగలను తీసుకొనిపోయాడు. తనపై దాడి చేసి మరుగుదొడ్డిలో పాడేసినట్లు బాలగణేష్ నాటకం ఆడినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు వెల్లడించారు. -
ఆలయ పూజారి భార్య దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వడపళనిలో గురువారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణహత్యకు గురైంది. తీవ్రరక్తగాయాలైన ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు. కాంచీపురం నగరానికి చెందిన బాలగణేష్ (27) ఐదేళ్ల క్రితం జ్ఞానప్రియ (24) అనే యువతిని ప్రేమించి పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం చెన్నై వడపళనిలోని శివాలయంలో తాత్కాలిక పూజారిగా పనిలో చేరాడు. అక్కడి సమీపంలోని ఒక అద్దె ఇంటిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. పెళ్లయి ఐదేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతోనే కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. బుధవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన బాలగణేష్ భార్యతో కలిసి భోంచేసి నిద్రపోయాడు. అద్దె ఇంటి యజమాని విజయలక్ష్మి గురువారం ఉదయం 6 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్ వెళ్లగా అక్కడ అర్ధనగ్నంగా కాళ్లు, చేతులూ కట్టిపడేసి గాయాలైన స్థితిలో బాలగణేష్ పడి ఉన్నాడు. ఈ సమాచారాన్ని అతని భార్యకు చెబుతామనే ఉద్దేశంతో ఇంటిలోకి ఆమె తొంగిచూడగా పడుకగదిలో రక్తపుమడుగులో కాళ్లూ చేతులు కట్టివేసిన స్థితిలో జ్ఞానప్రియ పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్తో అక్కడి చేరుకుని వైద్యపరీక్షలు నిర్వహించగా జ్ఞానప్రియ అప్పటికే చనిపోయినట్లు తేలడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం పంపారు. తీవ్రగాయాలైన స్థితిలో ఉన్న బాలగణేష్ను చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దంపతుల ఇంటి బీరువాలోని బంగారునగలు, జ్ఞానప్రియ మెడలోని ఐదుసవర్ల తాళిబొట్టు కనిపించలేదు. దుండగులను గుర్తించేందుకు పోలీస్ జాగిలంతోపాటు వేలిముద్రల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటిలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది. -
విగ్రహం చోరీ కేసులో పూజారి అరెస్ట్
టీ.నగర్: కాంచీపురం మురుగన్ ఆలయంలో కచ్చియప్పర్ విగ్రహం చోరీ కేసులో పూజారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మురుగన్ ఆలయంలో కచ్చియప్పర్కు 29 సెంటీ మీటర్ల ఎత్తు, 18 సెంటీమీటర్ల వెడల్పుగల 7,470 కిలోగ్రాముల పంచలోహ విగ్రహం ఉంది. ఏడాదికి ఒకసారి ఈ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం జరిపి ముఖ్య నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవం గత మార్చి మొదటి వారంలో జరిగింది. తర్వాత విగ్రహాన్ని ఆలయంలో భద్రపరిచారు. ఇలావుండగా మార్చి 10వ తేదీన కచ్చియప్పర్ విగ్రహం కనిపించడం లేదని ఆలయ పూజారులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి త్యాగరాజన్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ పూజారి కార్తిక్ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరపగా మద్యం మత్తులో సమీపంలోగల సర్వతీర్థ కొలనులో పారేసినట్లు తెలిపాడు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెదికినప్పటికీ కనిపించకపోవడంతో అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కుంభకోణం విగ్రహాల తరలింపు నిరోధక విభాగం ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి అతన్ని 15 రోజులపాటు రిమాండ్లో ఉంచాలని ఆదేశించారు -
ఉన్నాయి
లోకంలోని డొంక తిరుగుళ్లు చెడ్డ చికాకును తెప్పిస్తాయి అత్యుష్ణకి. ఏదీ నేరుగా ఉండదేం అనుకుంటాడు. చిన్నప్పుడు అతడికి పెద్దవాళ్ల మాటలు అర్థమయ్యేవి కావు. పాయింట్లెస్ అనుకునేవాడు. పాయింట్ ఉండే ఉండొచ్చు. తనకు అర్థం కానప్పుడు.. అది ఎంత పెద్ద పాయింట్ అయినా.. ‘నో పాయింట్ ఇన్ ఇట్’ అత్యుష్ణకి.అత్యుష్ణ ఇప్పుడు పెద్దయ్యాడు కానీ, పెద్దగా ఏం కాలేదు! ఓ పాతిక ఉంటాయంతే. పాతిక అంటే ఓ మోస్తరు పెద్దే. అయితే తను ఆ పాతిక్కంటే ముందే పెద్దవాడయ్యాడని అత్యుష్ణ నమ్మకం. అతడికి ఆ నమ్మకాన్నిచ్చింది కూడా ఈ లోకమే. లోకం మాట్లాడుకునే కొన్ని విషయాల మీద అత్యుష్ణకు అమితమైన ఆసక్తి కలిగేది. వాటి గురించి ఇంకా క్లియర్గా చెప్పమని లోకాన్ని అడిగేవాడు. లోకం ఏదో చెప్పేది. ‘ఏదో చెప్పడం కాదు, ఉన్నదేదో కరెక్టుగా’ చెప్పమనేవాడు. లోకం కళ్లు తేలేసేది. అప్పుడే అతడికి అనిపించేది.. లోకం పెద్దదే కానీ, తనకంటే పెద్దదేం కాదని! సంతృప్తికరమైన సమాధానం చెప్పలేనివారు.. గురుబ్రహ్మ అయితేనేం, గురువిష్ణు అయితేనేం, గురుదేవో.. మహేశ్వర అయితేనేం? ముఖ్యంగా మూడు విషయాలు అత్యుష్ణకు ఈ లోకాన్ని చులకన చేసిపడేశాయి. దేవుడు, దెయ్యం, ప్రేమ! దేవుడు.. దేవుడు అనడమే కానీ దేవుణ్ణెక్కడా ఈ లోకం అత్యుష్ణకు చూపించింది లేదు. ‘దేవుణ్ణి ఎవరో వచ్చి చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారు చూసుకోవడం మాత్రమే ఉంటుంది’ అని పూజారి అన్నప్పుడు.. వినడానికి బాగుంది కానీ నమ్మడానికి బాగోలేదు అత్యుష్ణకు. అయితే పూజారి మీద అతడికి నమ్మకం కలిగింది. తనను మూర్ఖుడా అని అంత గట్టిగా అన్నాడంటే.. అతడి దగ్గర తన మూర్ఖత్వానికి తగిన విరుగుడు జ్ఞానమేదో కచ్చితంగా ఉండి ఉంటుంది! ఆయన్ని కొంచెం తవ్వితే అది తనకు దొరకొచ్చు. ‘‘ఎవరికివారు దేవుణ్ణి చూసుకోవడం వరకు అర్థమైంది స్వామీ. సృష్టిలో ఏదైనా ఉందీ అంటే అది అందరికీ ఒకేలా కనిపిస్తున్నదై ఉండాలి కదా అని నా సందేహం’’ అన్నాడు. పూజారి నవ్వుతూ చూశాడు. ‘‘మనుషులంతా ఒకేలా ఉన్నారా అబ్బాయ్.. మనుషులందరికీ దేవుడు ఒకేలా కనిపించడానికి?’’ అన్నాడు. పూజారి మళ్లీ ఇంకోసారి ‘మూర్ఖుడా’ అనకుండా ‘అబ్బాయ్’ అనడం గమనించాడు అత్యుష్ణ. తన పాయింట్లో పూజారికి పాయింట్ కనిపించిందన్నమాట! ఎప్పుడూ దేవుడి దగ్గర ఉండే పూజారే.. ఎవరి దేవుణ్ణి వారే వెతుక్కోవాలి అని చెప్పినప్పుడు అత్యుష్ణకు ఒకటి స్పష్టం అయింది. దేవుడి దగ్గర పూజారి ఉన్నాడు కానీ, పూజారి దగ్గర దేవుడు లేడు! దెయ్యాన్ని కూడా ఈ లోకం అత్యుష్ణకు చూపించలేకపోయింది. ‘‘మేం చూశాం’’ అని చెప్పినవాళ్లను పట్టుకుని అడిగాడు.. ‘‘నిజంగా మీరు చూశారా?’’ అని. ‘‘నిజంగానే మేము చూశాం’’ అన్నారు. ‘‘ దెయ్యం ఎలా ఉంది?’’ అని అడిగాడు. చనిపోయిన.. వాళ్ల పిన్నమ్మలా ఉందనో, సూసైడ్ చేసుకున్న ఫలానా వెంకటలక్ష్మిలా ఉందనో చెప్పారు తప్ప.. దెయ్యం అంటే ఇలా ఉంటుందన్న ఒక పిక్చర్ అయితే రాలేదు అత్యుష్ణకు. ‘దేవుణ్ణి ఎవరో వచ్చి చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారు చూసుకోవడం మాత్రమే ఉంటుంది’ అన్న పూజారి సూత్రాన్ని దెయ్యాలకూ అన్వయించుకుని చూస్తే మాత్రం.. దెయ్యాలు ఉన్నాయనే అనుకోవాలి. అంటే దేవుడు కానీ, దెయ్యం కానీ.. మనిషి అనుకుంటే ఉండడం తప్ప, మనిషి అనుకోకుండా ఉండడం అనేది ఉండదు అని సరిపెట్టుకున్నాడు అత్యుష్ణ. అయితే దేవుణ్ణి, దెయ్యాన్ని వదిలించుకున్నంత తేలిగ్గా ప్రేమను వదిలించుకోలేకపోతున్నాడు అత్యుష్ణ. ఆ ప్రేమ పేరు విరాళి. మెస్లో అత్యుష్ణకు భోజనం వడ్డించే అమ్మాయి విరాళి. అందరికీ తనే వడ్డిస్తుంది. అత్యుష్ణకు వడ్డించడానికి మాత్రం ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది! ఎప్పుడూ.. మెస్ టైమింగ్స్ అయిపోతున్నప్పుడు మాత్రమే వస్తాడు అత్యుష్ణ. మొదట్లో ఉన్నదేదో వడ్డించేది విరాళి. తర్వాత కొన్నాళ్లకు వడ్డించడం కోసం ఉంచి పెట్టేది! ఒకవేళ ఆ రోజుకి అత్యుష్ణ రాకపోతే.. అదలా ఉండిపోతుందంతే. ఆ విషయం అత్యుష్ణకు చెప్పేది కాదు. చెప్పినా, ‘మీ కోసం ఎదురు చూశాను’ అని చెప్పేదే తప్ప, ‘మీ కోసం తీసిపెట్టాను’ అని మాత్రం చెప్పేది కాదు. విరాళి వడ్డించే అమ్మాయే కానీ, వడ్డించే పనిలోకి వచ్చిన అమ్మాయి కాదు. మెస్వాళ్ల అమ్మాయి. అందుకే అత్యుష్ణకు ఏ టైమ్లో వెళ్లినా తినడానికి ఇంత దొరికేది. ఎప్పటిలా ఆ రోజు కూడా తినడానికి ఇంత దొరికింది అత్యుష్ణకు. నిజానికి ఆ రోజు అతడికి ఇంకాస్త ఎక్కువే దొరికింది! ‘‘ఇలాగైతే ఆరోగ్యం పాడైపోతుంది’’ అంది విరాళి మెల్లగా.ఫస్ట్ టైమ్ అత్యుష్ణతో ఆమె అలా అనడం. ఆమె వైపు చూశాడు అత్యుష్ణ. కొత్తగా ఉంది. తలస్నానం చేసిందేమో అనుకున్నాడు. వాళ్లిద్దరే ఉన్నారు అక్కడ.‘‘ఇలాగైతే మీ ఆరోగ్యం పాడైపోతుంది’’.. మళ్లీ అంది విరాళి.. ఈసారి కొంచెం వినిపించేలా. ‘మీ ఆరోగ్యం కూడా’ అందామనుకున్నాడు. అనలేదు.చిన్నమాటను పట్టుకుని ఆడపిల్లలు ఊరికే అల్లేసుకుంటారని అతడి భయం. దేవుడు, దెయ్యం లాగే.. ప్రేమ కూడా ఒక ‘అస్పష్టత’ అతడికి. మనిషి దేవుణ్ణి నమ్మినట్లే, దెయ్యాల్ని నమ్మినట్లే.. విరాళి గానీ, ఇంకొక అమ్మాయి కానీ ప్రేమ అనేది ఈ లోకంలో ఒకటుందని నమ్మడానికి తను కారణం కాకూడదనుకుంటాడు. అత్యుష్ణ రూమ్కి చేరుకునేటప్పటికి రాత్రి పన్నెండైంది. ‘‘దేవత వచ్చెళ్లింది. అదిగో నీ కోసమే ఆ టిఫిన్ బాక్స్’’ అన్నాడు రూమ్మేట్.‘దేవత’ అని అతడు అంటున్నది.. రూమ్ కింది పోర్షన్లో ఉండే ఓనర్స్ వాళ్ల అమ్మాయిని. ‘‘దేవతేంటి కొత్తగా?!’’ అన్నాడు అత్యుష్ణ.ఆమెకు అత్యుష్ణ పెట్టిన పేరు దెయ్యం అని. పట్టుకుంటే వదలదని. ‘‘తిండికి వేళ లేని వాళ్లు దెయ్యాలైతే.. ఏ వేళకొచ్చినా వడ్డించేవాళ్లు దేవతలేగా’’ అన్నాడు రూమ్మేట్. బాక్స్ని ఓపెన్ చెయ్యలేదు అత్యుష్ణ. పడుకుని నిద్రలోకి జారుకుంటూ ఉండగా.. అతడికో క్లారిటీ వచ్చింది. ఒకే మనిషిలో ఒకరికి దేవత, ఒకరికి దెయ్యం కనిపిస్తుంటే.. దెయ్యాలు, దేవుళ్లు ఉండడమన్నది ఒక పాయింటే కాదని! జీవితాన్ని ప్రేమ తాకందే ఆ పాయింట్ అర్థం కాదనీ!! -మాధవ్ శింగరాజు -
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అర్చక ఉద్యో గులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారని అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి విమర్శించారు. ఈ నెల 10వ తేదీలోగా సీఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించకపోతే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గుంటు మల్లన్న దేవస్థాన ఆవరణలో ఖమ్మం జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అర్చక ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,625 మంది అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతేడాది సీఎం చెప్పారని గుర్తుచేశారు. కేవలం 738 మందికే డిసెంబర్, జనవరి వేతనాలను సగం ట్రెజరీ నుంచి మిగతా సగాన్ని దేవాలయాల నుంచి తీసుకోవాలని దేవాదాయ అధికారులు చెప్పారని తెలిపారు. సీఎం హామీని నెరవేర్చకపోతే జనవరి 11న కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ జిల్లాల అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొన్నారు. -
కాంచీపురం ఆలయ పూజారిపై కేసు
కాంచీపురం: తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దొంగలే ఆలయ బంగారం దోచేయటంతో పోలీసులు మోసాన్ని ఛేదించి విచారణ జరుపుతున్నారు. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు బంగారు నగలు చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. నగలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగ తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందించారు. తర్వాత కొత్త బంగారు నగలు చేసి స్వామివార్లకు అలంకరించారు. అయితే ఇటీవల పోలీసుల తనిఖీలలో రెండు పంచలోహ విగ్రహాలు పట్టుబడ్డాయి. దీనిపై విచారణ జరపగా ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోనివని తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొందరు పంచలోహ విగ్రహాల స్థానంలో నకిలీ విగ్రహాలను పెట్టి అసలు విగ్రహాలను బయట విక్రయించినట్లు తేలింది. అంతేకాక స్వామివార్ల నగలు కూడా నకిలీవని తేలింది. అసలు బంగారాన్ని స్వాహా చేసి నకిలీ గిల్డ్ నగలను స్వామివార్లకు అలంకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. ప్రఖ్యాత ఆలయంలో స్వామివారి పంచలోహ విగ్రహాలు, నగలు స్వాహా చేయటం తమిళనాట కలకలం సృష్టిస్తోంది. -
మసీదులో మౌజన్ దారుణ హత్య
రాజమహేంద్రవరం రూరల్: మసీదులో నిద్రిస్తున్న మౌజన్ హత్యకు గురవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్రిక్త త నెలకొంది. బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫారూఖ్ (61) మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్ (చిన్నగురువు)గా చేరి అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఇమామ్ అబ్దుల్ హసీఫ్ గేటు తీసి లోపలికి వెళ్లి చూడగా ఫారూఖ్ తలపై బలమైన గాయాలతో మృతిచెంది కనిపించాడు. అక్కడ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్ మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గురువులా, వెట్టి కార్మికులా?
గురువును దైవ సమానంగా భావించి, గౌరవించే సంప్రదాయం దేశంలో నానా టికీ క్షీణించిపోతున్నదని ఆందోళనపడేవారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుతో తల తిరగడం ఖాయం. ఏటా జరిగే ‘కపాల మోచన్ మేళా’ కోసం వంద పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఆరురోజులపాటు ఆలయ పూజారు లుగా, స్నానఘట్టాల్లో పురోహితులుగా పనిచేయాలని... అలాగే హుండీల్లోని ఆదా యానికి పద్దులు రాయడం, భక్తులిచ్చే కానుకల్ని సర్కారీ గోడౌన్లకు చేర్చడంలాంటి పనులు చేయాలని ఆ ఉత్తర్వుల సారాంశం. ఇందుకోసం వారికి మూడురోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. కొందరు ఆ శిక్షణ ఎగ్గొడితే అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందని బెదిరిస్తూ నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యా యులను వెట్టి కార్మికులకన్నా హీనంగా చూడటంలో ఖట్టర్ ప్రభుత్వం ఇప్పటికే తెచ్చుకున్న అప్రదిష్ట అంతా ఇంతా కాదు. కోతలయ్యాక పొలాల్లో మిగిలే గడ్డిని తగలబెట్టే రైతులను గుర్తించడం, వారిని ఆపడం వంటి పనులు చేయడానికి ఇటీ వలే సిర్సా జిల్లాలో ఉపాధ్యాయులను పంటపొలాల వద్ద తెల్లవార్లూ కాపలా పెట్టింది. ఆ వివాదం సద్దుమణగకముందే ఇప్పుడు ఈ ఉత్తర్వులిచ్చింది. గుళ్లూ గోపురాల్లో, స్నానఘట్టాల్లో ఈ ఉపాధ్యాయులు రోజురోజంతా పనిచేసేలా షిఫ్టులు నిర్ణయించింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో భారీయెత్తున ఈ కపాల మోచన్ మేళా ఏటా జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి హర్యానా నలుమూల లనుంచి మాత్రమే కాదు... పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలనుంచి లక్షలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ప్రభుత్వం ఆత్రపడటాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకోసం ఉపాధ్యాయులందరినీ తరలించాలనుకోవడం, పిల్లల చదువులు ఏమైపోయినా పర్వాలేదనుకోవడం క్షమార్హం కాదు. ప్రభుత్వం తల్చుకుంటే ఆ జాతరకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకోవడం కష్టమేమీ కాదు. అడిగితే అలాంటి సేవలందించడానికి వేలా దిమంది స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఉపాధ్యాయులే ఆ పనులన్నీ చేయాలనడం, అందుకు నిరాకరించినవారిపై చర్యలు తీసుకుంటా మని బెదిరించడం భావ్యమేనా? ప్రపంచ దేశాల్లో వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాలూ ఉండొచ్చు. భిన్న రాజకీయ వ్యవస్థలుండొచ్చు. కానీ గురువుల పట్ల గౌరవభావం ఎక్కడికెళ్లినా ఒకలాగే ఉంటుంది. పసి మనసుల్ని సానబట్టి రేపటి సమాజానికి అవసరమయ్యే పటుతర శక్తిగా వారిని మలచడంలో ఉపాధ్యాయులు నిర్వర్తించే పాత్ర గురించిన అవగాహనే ఇందుకు కారణం. కానీ మన దగ్గర రాను రాను ఉపాధ్యాయులను హీనంగా చూసే ధోరణి పెరుగుతోంది. బడి మానేసే పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకు రావడంతో మొదలుపెట్టి పాఠశాలల్లో ఉపా ధ్యాయులు చేయాల్సిన బోధనేతర పనులు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు ఉపయోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడటం, ఆ పిల్లలు మంచి దుస్తులు వేసు కునేలా చూడటం, వారికి పెట్టే మధ్యాహ్న భోజనంపై ఓ కన్నేసి ఉంచడం, అన్ని పదార్థాలూ అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం, తిండి తినే పిల్లల దగ్గర ఆధార్ కార్డుందో లేదో తనిఖీ చేయడం...ఇలా సవాలక్ష పనులు అప్పగించడంతో ఆ టీచర్లు బోధనపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కావడంలేదు. ఇవిగాక జనాభా లెక్కలూ వారే రాయాలి. ఓటర్ల జాబితాల కోసం ఇంటింటికీ తిరిగి పేర్లు సేక రించడమూ వారి బాధ్యతే. మధ్య మధ్యన ఏవో సర్వేలు జరపాలంటే అందుకూ సిద్ధపడాలి. ఈమధ్యకాలంలో యోగ డే, స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటివి కూడా వచ్చిచేరాయి. విద్యాబోధన ఏదో యాంత్రికంగా చేసే పని కాదు. తరగతి గదిలో ఉండే పిల్ల లంతా ఒకే స్థాయిలో ఉండరు. చెప్పింది వెనువెంటనే అర్ధం చేసుకునే పిల్లలతో బాటే ఎన్నివిధాల చెప్పినా అవగాహన చేసుకోలేనివారు కూడా ఉంటారు. వారం దరికీ సమానంగా అర్ధం చేయించడం ఎంతో నైపుణ్యం అవసరమైన పని. అలాంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. వినూత్న పద్ధతుల్లో బోధించడానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇలాంటి కసరత్తులు చేయడానికి టీచర్లకు కాస్తయినా వ్యవధి ఉండాలా? వ్యక్తులుగా కొంతమంది ఉపాధ్యాయులు సృజనాత్మకంగా ఆలో చించి రూపొందించుకునే విధానాలను పదుగురితో పంచుకోవడానికి, వాటికి మరింత సమగ్ర రూపం తీసుకొచ్చి అన్నిచోట్లా అమలు చేయించడానికి అవసర మైన పునశ్చరణ తరగతులను నిర్వహిస్తే మన బడులు మరింత సుసంపన్న మవుతాయి. కానీ బోధనపై దృష్టి పెట్టేందుకు టీచర్లకు కాస్తయినా అవకాశం ఇవ్వ డంలేదు. ఎంతసేపూ ప్రభుత్వాలు చెప్పే పనుల్లో కూరుకుపోయి, అధికారులు తిర గమన్నచోటికల్లా తిరుగుతూ గొడ్డు చాకిరీ చేయడమే వారి బాధ్యతన్నట్టు ప్రభు త్వాలు ప్రవర్తిస్తున్నాయి. అచ్చయిన పుస్తకాలను చూసి, అందులో ఉన్నవి చెప్పడం తప్ప టీచర్లు బడుల్లో చేసేది ఏముంటుందన్న చిన్నచూపు పాలకుల్లో ఉన్నట్టుంది. ఇది ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మంచిది. హర్యానా సర్కారు ఉత్తర్వు చూస్తే వారికి అటు దేవాలయాల్లో జరిగే పూజా దికాలపైగానీ, ఇటు బోధనపైగానీ అవగాహన లేదని అర్ధమవుతుంది. కేవలం సంస్కృతం బోధించే టీచర్లనే పూజార్లుగా ఎంపిక చేశామని ఒక అధికారంటే, ఏ పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయులైనా ఆ పని చేయాల్సిందేనని మరో అధికారి చెబుతున్నాడు. అసలు సంస్కృతం చదివి ఉపాధ్యాయులుగా వచ్చిన ప్రతివారికీ మంత్రాలు వచ్చి ఉంటాయని... ఒకవేళ రాకున్నా మూడురోజుల శిక్షణతో అది ఒంటబడుతుందని ఈ మరుగుజ్జులకు చెప్పిందెవరో?! పాలకుల తీరు ఇలా ఉండ బట్టే విద్యారంగ ప్రమాణాలు కొడిగడుతున్నాయి. పిల్లల భవిష్యత్తు గాలిలో దీపమ వుతున్నది. కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఖట్టర్కు నచ్చజెప్పాలి. లేకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మతిమాలిన పోకడలు పుట్టుకొస్తాయి. -
అర్చకులైన అధ్యాపకులు
ప్రమోద్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడు ప్రస్తుతం : శ్రీ మహాకపాలేశ్వర్ ఆలయంలో అర్చకుడు సంజీవ్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో క్రీడాపాధ్యాయుడు ప్రస్తుతం : శివాలయంలో అర్చకుడు జై కిషన్ : ప్రభుత్వ పాఠశాల ప్రధానోధ్యాపకుడు, ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు మోహన్ లాల్ : ప్రభుత్వ పాఠశాలలో హిందీ అధ్యాపకుడు ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు బిలాస్ పూర్ : వీళ్లేకాదు.. మరో 91 మంది టీచర్లు.. బిలాస్పూర్లోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. హరియాణాలో పవిత్ర రోజులుగా పేర్కొనే కపాల్ మోచన్ మేళ సందర్భంగా వివిధ ఆలయాల్లో టీచర్లు అర్చకులుగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ టీచర్లకు గత నెల 29న అర్చకత్వంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీచర్లను ఇలా ఇతర కార్యక్రమాలకు వినియోగంచడంపై ప్రభుత్వ టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్లను వేరే కార్యక్రమాలకు వినియోగించడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని ఇతర అధ్యాపకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధ్యాపకులను ఇతర కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారంటూ.. విద్యాశాఖాధికారులకు జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖాధికారులు.. ఇటువంటి పర్వదినాల్లో భక్తులకు అవసరమైన సేవలు అందించాలంటే అర్చకలు సరిపొవడం లేదని.. కేవలం ఆరు రోజులు మాత్రమే ఇలా వినియోగించడం జరగుతుందని వివరణ ఇచ్చారు. -
టీచర్లు అర్చక శిక్షణ తీసుకోవాల్సిందే!
చండీగఢ్ : ప్రభుత్వ టీచర్లందరూ అర్చక శిక్షణ తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 29న ప్రభుత్వం నిర్వహించిన శిక్షణకు హాజరు కానీ టీచర్లపై కఠినచర్యలకు మనోహర్లాల్ కట్టర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్చక శిక్షణ తీసుకున్న టీచర్లు.. ఆయా గ్రామాల్లో పండుగలు, ఇతర పర్వదినాల్లో అర్చకత్వం చేయాల్సి ఉంటుందని గతంలో హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అర్చక శిక్షణపై పలువురు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం అంటూ.. పలువురు టీచర్లు ఈ అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కాలేదు. శిక్షణా కార్యక్రమానికి టీచర్లు హాజరు కాకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో వివరించాలంటూ.. ఆయా టీచర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కానీ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓ అధికారులు తెలిపారు. -
మనసులు గెలిచిన దళిత అర్చకులు
తిరువనంతపురం : దేశ చరిత్రలో తొలిసారి ఆలయాల్లో దళితులను అర్చకులుగా నియమించి సంచలనం ట్రావెన్కోర్ దేవస్థానంబోర్డు (టీడీబీ) సంచలనం సృష్టించింది. శబరిమల ఆలయం సహా కేరళలోని పలు దేవస్థానాల్లో కొత్తగా 62 మందిని అర్చకులుగా నియమించింది. ఇందులో 36 మంది బ్రాహ్మణేతరులుకాగా.. ఆరుగురు దళితులున్నారు. టీడీబీ నమ్మకాలను, భక్తుల విశ్వాసాలను నిలబెడుతూ.. దళిత అర్చకులు కొత్త చరిత్ర సృష్టించారు. ఎర్నాకుళం జిల్లా అర్కెపాడులోని మహదేవాలయంలో అర్చకునిగా నియమించబడ్డ.. 31 ఏళ్ల మనోజ్ (దళిత అర్చకుడు) టీడీబీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భగవంతుడికి.. ఆయన భక్తులకు సేవలు చేయాలన్న నాకలను టీడీబీ నిజం చేసిందని అన్నారు. భక్తులు నన్ను ఎంతో ఆదరంగా చూస్తున్నారని.. నాతో పూజలు చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. ‘నేను చిన్నతనంలో మా గ్రామంలోని ఆలయంలో బ్రాహ్మణ పురోహితునికి సేవలు చేసేవాడిని.. ఆయన నన్ను ఏనాడు కులపట్టింపుతో చూడలేదు.. ఆయన దయవల్లే నేను ఈ రోజు ఈస్థానంలోకి రాగలిగాను’ అని ఆనందంగా చెప్పారు. జన్మతో కులాన్ని చూడకుండా.. గుణాలతో చూడాలని మనోజ్ అన్నారు. మా గ్రామ అర్చకుడి సేవలో గడడం వల్ల నేను ఏనాడు మద్య, మాంసాలు ముట్టుకోలేదని చెప్పారు. సంస్కృతంలో పీజీ చేసిన మరో దళిత అర్చకుడు మదుకృష్ణ కూడా టీడీబీ నిర్ణయంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పథినంతిట్ట జిల్లాలోని కిచ్చీరివల్ శివాలయంలో యదుకృష్ణ అర్చకత్వం వహిస్తున్నారు. యదుకృష్ణ కూడా ఎనిమిదేళ్ల వయసులో గ్రామంలోని శివాలయంలో అర్చకుడికి సహాయకుడిగా విధులు నిర్వహించారు. మా అమ్మకు భక్తి చాలా ఎక్కువ. అందువల్ల నన్ను చిన్నతనం నుంచే ధార్మిక కార్యక్రమాలు, పూజాదికాలు, సంస్కృతంపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు. యదుకృష్ణ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ.. అభిషేకం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవని భక్తులు చెబుతున్నారు. -
ఉం‘గరం..గరం’
అనగనగా ఓ వజ్రపుటుంగరం చేతి వేలు నుంచి దారి తప్పింది. ఓ రక్షణ భటుడి చేతిలో పడింది. దానిని ఆయన ఓ అర్చకుడికి ఇచ్చారు. అక్కడ ఇక్కడా ఆరా తీసిన అర్చకుడు..ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలయ అధికారికి అప్పజెప్పారు. అటుఇటుగా నెల రోజులైంది. ఎవరూ దాని కోసం రాలేదు. భద్రంగా దాచిన అధికారి సైతం ఈ విషయమే మరచినట్లు వ్యహహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉంగరం విషయం ఆరా తీయడానికి వచ్చిన రక్షక భటునికి గట్టి సమాధానమే ఎదురైంది. ఎవరు నువ్వు అనడంతో ఖంగుతినడం ఆయన వంతైంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అహోబిలం(ఆళ్లగడ్డ) : తనకు దొరికిన లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు ఉంగరం ఓ కానిస్టేబుల్ నిజాయితీతో ఆలయ అధికారులకు అప్పగిస్తే దానిని గుట్టుచప్పుడు నొక్కేసే ప్రయత్నం కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో చోటు చేసుకుంది. దిగువ అహోబిలం క్షేత్రంలో గత నెల 27వ తేదీ స్వాతి ఉత్సవ సందర్భంగా హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉభయదారులు ఈ హోమంలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సమయంలో ఓ భక్తుని ఉంగరం హోమం నిర్వహించే ప్రదేశంలో పడిపోయింది. రద్దీ ఎక్కవగా ఉండటంతో ఎవరూ గమనించలేదు. అక్కడే భక్తుల సమక్షంలో హోమం దగ్గర కూర్చుని స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ యువై యల్లప్పకు ఈ ఉంగరం కనిపించింది. అది వజ్రాలు, కెంపులు పొదిగిన ఉంగరంగా గుర్తించిన యల్లప్ప.. నిజాయతీతో అక్కడ హోమం నిర్వహిస్తున్న ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్కు ఇచ్చారు. ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తులు రావాలని మైకులో అనౌన్స్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆలయ ఈఓకు దానిని అప్పగించారు. ఒకటి రెండు రోజులు చూసి విచారించి ఎవరూ రాక పోతే అందరి సమక్షంలో స్వామి హుండీలో వేద్దామని నిర్ణయించుకున్నారు. వారం, పదిరోజులైనా ఎవరూ రాలేదు. అధికారులు, అర్చకులు ఆ ఉంగరం గురించి పట్టించుకోకపోవడంతో పాటు ఈఓకు సన్నిహితులైన సిబ్బంది దొరికిన ఉంగరం సాధారణమైనదనే ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఉంగరం దొరికిన కానిస్టేబుల్ యుల్లప్ప.. అధికారి దగ్గరకు వెళ్లి దానిని అందరి సమక్షంలో హుండీలో వేద్దామని సూచించారు. రెండ్రోజుల తరువాత ఆలోచిస్తామని ఆయన చెఆప్పరు. మరో పది రోజులు తరువాత ఆ అధికారి దగ్గరకు వెళ్లి ఉంగరం గురించి అడగ్గా ఆగ్రహంతో ఎవరు నువ్వు..అని ప్రశ్నించడంతో ఆయన తెల్లబోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాన అర్చకులతో పాటు స్థానిక సీఐకి కూడా తెలిపినట్లు హెడ్ కానిస్టేబుల్ యల్లప్ప తెలిపారు. ఇదే విషయమై ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ మాట్లాడుతూ..ఉంగరం దొరికిన మాట వాస్తమేనని..దానిని ఆలయంలోనే భద్రపరిచామన్నారు. పోగొట్టుకున్న వారు వస్తే ఇస్తామని చెబుతున్నారు. -
అర్చకులకు పే స్కేల్
-
అర్చకులకు పే స్కేల్
► ప్రభుత్వ ఉద్యోగుల తరహా వేతనాలు ► నవంబర్ నుంచి అమలు ► ప్రస్తుతం ‘ధూపదీప నైవేద్యం’ అమలవుతున్న దేవాలయాలు1,805 ► అదనంగా వర్తింప చేయనున్న దేవాలయాలు 3,000 ► ఆలయాల ఆధ్వర్యంలో ఉన్న భూములు (ఎకరాల్లో) 83,000 సాక్షి, హైదరాబాద్: అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వచ్చే నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయాల్లో అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకాన్ని అదనంగా మరో 3 వేల దేవాలయాలకు వర్తింపచేస్తామని ప్రకటించారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అర్చకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ‘‘దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో 83 వేల ఎకరాల భూములు దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నట్లు లెక్క ఉంది. ఈ భూమిని రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పొరపాట్లు కాకుండా చూడాలి. అర్చన బాగా చేస్తే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తాడు. ఉద్యమ సమయంలో మీరంతా బాగా పూజలు చేసి, ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్నారు. నేను ఏ గుడికి వెళ్లినా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించేవారు. దేవుడు అనుగ్రహించాడు. మీ దీవెనలు ఫలించాయి. రాష్ట్రం వచ్చింది. దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం. ధార్మిక పరిషత్ను మరింత విస్తృతపరుస్తాం. శృంగేరి పీఠాధిపతులు, చినజీయర్ స్వామి, కంచి పీఠాధిపతుల సలహాలు, సూచనలు పాటించి ధార్మిక పరిషత్ కార్యక్రమాలు రూపొందిస్తాం. అర్చకుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇతర ముఖ్య నిర్ణయాలు తీసుకున్న ఈ సమయంలో నాకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉంది’’అని ముఖ్యమంత్రి అన్నారు. అర్చకుల హర్షం.. సుదీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్ను పరిష్కరించినందుకు తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అధ్యక్షుడు రంగారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అర్చకులతో సీఎం భేటీ సందర్భంగా నల్లకుంట నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు అర్చక, ఉద్యోగులు ర్యాలీగా తరలివెళ్లారు. -
జీతాలపై స్పష్టత కరువు
కడప కల్చరల్ : దేవాలయాల్లో పనిచేసే అర్చకుల్లో ఆందోళన తగ్గలేదు. వారి జీతాలను రూ. 10 వేల నుంచి సగానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు ఆ విషయం పట్ల ఎలాంటి ప్రకటన చేయకపోవడమే దీనికి కారణం. రూ. 10 వేలు తీసుకుంటున్న అర్చకులకు సగం తగ్గించి కేవలం రూ. 5 వేలే ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు సాక్షి బుధవారం ఆధారాలతోసహా బయటపెట్టింది. ఈ విషయంపై రాష్ట్రంలోని అర్చకులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలువురు అర్చకులు నేరుగా ఆ శాఖ కమిషనర్కే ఈ విషయంగా స్పష్టత కోరుతూ ఫోన్లు చేశారు...మెసెజ్లు పెట్టారు. దీంతో స్పందించిన ఉన్నతా«ధికారి ఒకరు వారందరికీ తిరిగి మెసెజ్లు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల అర్చకులు, కొత్తగా చేరే అర్చకులకు మాత్రమే రూ. 5 వేలు ఇస్తామని, మిగతా వారిలో రూ. 10 వేలు జీతం తీసుకుంటున్న వారికి ఏమాత్రం తగ్గించబోమని మెసెజ్లో పేర్కొన్నారు. దీంతో అర్చకుల్లో కొద్దిగా ఆందోళన తగ్గినా ఇలా వ్యక్తిగతంగా కాకుండా నేరుగా ప్రసార మాధ్యమాల ద్వారానే ఈ విషయం ప్రముఖంగా ప్రకటిస్తారని ఎదురు చూశారు. ఆ శాఖగానీ, ముఖ్యమంత్రిగానీ ఈ విషయంగా స్పందించకపోవడంతో అర్చకుల్లో తిరిగి ఆందోళన మొదలైంది. శాపగ్రస్తులా..? గ్రామీణ అర్చకులు దేవాలయ భూములను సాగు చేసుకుంటున్నారు అందువల్ల వారికి ఇస్తున్న రూ.10 వేల జీతాన్ని రూ.5 వేలకు తగ్గిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి ఆ భూములు పేరుకు మాత్రమే అర్చకులవి. చాలా భూములు సాగుకు పనికి రాని స్థితిలో ఉన్నాయి. అర్చకుడు వాటిని పెట్టుబడి పెట్టి సాగు చేసుకునే స్థితిలో లేడు. మరికొన్నిచోట్ల భూములు ఆ ప్రాంత పెద్దల చేతిలో ఉన్నాయన్నది అందరికీ తెలిసిన సత్యం. వారు అర్చకులకు విదిలింపుగా మాత్రమే కౌలు ఇస్తున్నారు. ఇలాంటి దశలో గ్రామీణ అర్చకులు కేవలం రూ.10వేల జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 1,886 దేవాలయాల్లో కేవలం 100 మంది అర్చకులకు మాత్రమే రూ.10 వేల జీతం అందుతోంది. మిగతా వారు ముఖ్యంగా గ్రామీణ అర్చకులు హారతి పల్లెంలో భక్తులు సమర్పించే కానుకలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సీజన్లో మినహా మిగతా రోజుల్లో రోజుకు పల్లెం ద్వారా రూ. 20 కూడా లభించదన్నది పచ్చినిజం. ఈ దశలో అరకొర మందికి ఇస్తున్న రూ. 10 వేలు జీతంలో కోత పెట్టడం పట్ల అర్చకులు ఖిన్నులవుతున్నారు. ఈ విషయంగా నిరసన తెలిపేందుకు అర్చక సంఘాల్లో కొందరు ప్రయత్నించినా ఏదో కారణంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా పీకేస్తారేమోనన్నభయంతో వారు మిన్నకుండిపోతున్నారు. అధికారుల స్పందన ఏదీ? అర్చకుల్లో ఆందోళన పోగొట్టేందుకు దేవాదాయశా ఖ అధికారులుగానీ, ఆ శాఖ మంత్రిగానీ, ముఖ్య మంత్రిగానీ స్పందించలేదు. ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు అర్చకులను కనీసం సముదాయించేందుకు కూడా ప్రయత్నించలేదు. రాష్ట్ర బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ మాత్రం ఈ విషయంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ తీరును తీవ్రం గా విమర్శించారు. అర్చకులకు కనీసం రూ.20 వేల జీతం ఇవ్వడం న్యాయమని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో అర్చకుల్లో అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వార్త అబద్ధమైతే వారెందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఈ విషయంగా తమలో నెలకొన్న ఆందోళనను తగ్గించేదుకైనా దేవాదాయశాఖ మంత్రిగానీ, అ«ధికారులుగానీ స్పష్టత ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. -
బాసర సరస్వతీ ఆలయంలో అపచారం
-
ఆలయంలో అపచారం
భద్రాద్రిలో లక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు మూయని అర్చకులు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడి ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మవారి కోవెల తలు పులను శుక్రవారం రాత్రి మూయకుండానే వదిలేశారు. రాత్రి వేళ విధుల్లో ఉన్న సెక్యూరిటీ(ఎస్టీఎఫ్)సిబ్బంది దీనిని గుర్తించి, తెల్లవార్లూ అక్కడనే కాపలా కాయాల్సి వచ్చింది. భద్రాద్రి రామాలయ తలుపులు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు మూస్తారు. గర్భగుడి తలుపులతో పాటు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా ఇదే సమయంలో మూస్తారు. అయితే శుక్రవారం రాత్రి విధు ల్లో ఉన్న అర్చకుడు పూజాది కార్యక్రమాల అనంతరం లక్ష్మి అమ్మవారి కోవెల ప్రధాన తలుపులు వేయకుండా బయట గేట్లును వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం(రాజగోపురం) తలుపులు కూడా వేసి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత ఆలయం లోపల విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, దీనిపై ఆలయ అర్చకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి కావటంతో ఆ సమయంలో ఎవరూ అందుబాటులోకి రాలేదని ఎస్టీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తీసిన సమయంలో ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ సిబ్బంది ఆలయ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం విధులకు హాజరైన అర్చకులు సంప్రోక్షణ అనంతరం తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శేఖర్ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అర్చకుడికి మెమో జారీ చేస్తాం లక్ష్మి తాయారు అమ్మవారి కోవెల తలుపులు శుక్రవారం రాత్రి వేయకుండా వదిలేసిన విషయమ వాస్తవమే. దీనిపై ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడికి మెమో జారీ చేస్తాం. ఎందుకిలా జరిగిందనే దానిపై ఆయన వివరణ కోరుతాం. ఆయన ఇచ్చిన సమాధానం అనంతరం ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను. – ఈఓ ప్రభాకర శ్రీనివాస్ -
అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం
ఆలయాల ఉద్యోగులకు కూడా... - ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు - గ్రామాల్లో రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10–12 వేల వరకు - ఆలయ నిధులు సరిపోకుంటే ప్రభుత్వ గ్రాంటుతో భర్తీ - మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలను మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలుగా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతి పాదించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల అంశంపై ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యం లో నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్లతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ప్రభుత్వానికి ప్రతి పాదనలు సమర్పించింది. మంగళవారం తుది దఫా భేటీ అయి ప్రభుత్వానికి మరిన్ని సిఫార్సులు చేయనుంది. చాలా కాలంగా ఎదురుచూపులు తగిన ఆదాయం లేని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు ప్రస్తుతం నామమా త్రపు వేతనాలే అందుతున్నాయి. దాంతో తమ జీవనం దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో.. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ సబ్ కమిటీ అర్చకులు, ఉద్యోగులు, దేవా దాయశాఖ అధికారులతో పలు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే దేవాలయాల్లోనూ కనీస వేతనాలు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. అయితే ఓ పద్ధతంటూ లేకుండా, అర్హతలేమీ పట్టించుకోకుండా పాలక మండళ్లే అర్చకులు, ఉద్యోగుల నియామకాలు చేస్తున్నందున.. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ గుర్తించిన ఆలయాలకే కనీస వేతనాలను పరిమితం చేశారు. 3,300 మందికి లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,500 వరకు ఆల యాలు ఉన్నాయి. వాటిలో కనీస వార్షికా దాయం రూ.50 వేలు, ఆపైన ఉన్న ఆలయా లుగా దేవాదాయశాఖ గుర్తించినవి 650 వరకు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ఈవోలు, క్లర్కులను నియమించి పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయాలన్నింటిలో కలిపి 6 వేల మంది అర్చకులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2,700 మంది ఎక్కువ ఆదాయమున్న ఆలయాల్లో నిర్ధారిత స్కేల్కు సమంగా వేతనాలు పొందుతున్నారు. మిగతా 3,300 మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో తాత్కాలిక పద్ధతిలో (రోజుకు మూడు నాలుగు గంటల పాటు) పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రూ.8 వేలు... పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.10 వేలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక పట్టణ ప్రాంతా ల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.12 వేలు చొప్పున చెల్లించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం వీరందరి వేతనాల కింద ఆయా దేవాలయాలు రూ.28 కోట్లు చెల్లిస్తున్నాయి. ఇప్పుడా మొత్తం సుమారు రూ.68 కోట్లకు పెరగనుంది. అంటే మిగతా రూ.40 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇచ్చే నిధి నుంచి చెల్లిస్తారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లిం చాలనే విషయాన్ని దేవాదాయ శాఖ త్వరలో సర్వే చేసి నిర్ధారిస్తుంది. మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ కొత్తగా మరో 1,200 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కిందకు తేవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ పథకం కింద ఆ ఆలయాలకు నెలకు రూ.6 వేలు చొప్పున అందజేస్తారు. ప్రస్తుతం 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇక ఆలయాల భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని.. అన్ని ఆలయాల కైంకర్యాల వివరాలను భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక నుంచి కమిషనర్ అనుమతి లేకుండా ఆలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకుండా నిబంధన తీసుకురావాలని, వారసత్వ అర్చక నియామకాలను చట్ట ప్రకారం చేపట్టాలని, సిటీ సివిల్ కోర్టు ఇచ్చే డిక్రీ తరహాలో దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ప్రతిపాదించింది. ఆలయాల్లో ఖాళీల భర్తీ, వీలైనంత త్వరలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలని సూచించింది. అర్చకులు, ఉద్యోగుల హర్షం ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలన్న మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలాకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఇక మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు మంత్రులను కలసి హర్షం వ్యక్తం చేశారు. -
పురోహితుడిపై వధువు బంధువుల దాడి
పాలకుర్తి: మంత్రాలు సరిగ్గా చదవడం లేదని, పెళ్ళి ఆలస్యంగా చేస్తున్నాడని పురోహితుడిపై వరుడి బంధువులు దాడి చేశారు. సంఘటన శనివారం కరీంనగర్ జిల్లాలోని బసంత్నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్నగర్కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకు స్థానిక కోదండ రామాలయం పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు. అయితే పెళ్ళి ముహూర్త సమయానికి కంటే ఆలస్యంగా జరిగింది. ఈనేపథ్యంలో చిత్తుగా మద్యం సేవించిన వధువు తరఫు బంధువు ఒకరు.. మంత్రాలు సరిగ్గా చదవడం లేదంటూ గొడవకు దిగి పెళ్లకి ఆటంకం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువైపులా బంధువులు సర్థిచెప్పి వివాహతంతు ముగించారు. వివాహం ముగిసిన అనంతరం చొప్పదండి మండల కేంద్రానికి చెందిన వధువు తరుపు బంధువు సమీపంలోని కర్రతో పూజారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో పూజారి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్రం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు. విషయం తెలిసిన బసంత్నగర్ పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు. -
పూజారి ఆత్మహత్య
నంద్యాల: వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్యాన్ని తాళలేక ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన నెరవాటి సుబ్రమణ్యం (75) గ్రామంలో ఉన్న ఆలయంలో పూజారి సేవలందిస్తూ చిరు వ్యాపారం నిర్వహించేవాడు. వయస్సు అధికం కావడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆలయానికి కూడా వెళ్లడం మానేశాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు నంద్యాలకు వచ్చిన ఆయన చిన్న చెరువు వద్దకు వెళ్లి కుమారుడి సెల్ నంబర్ను కాగితంపై రాసి దుస్తులు అక్కడే ఉంచి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా కుమారుడు నాగరాజుకు సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన సుబ్రమణ్యంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
దేవుళ్ల పేర్లతో అర్చకుడి నిర్వాకం..!
జైపూర్: కత్రినా కైఫ్ పేరు కేరళ జనాభా లెక్కల్లో కనిపించడం, హాలీవుడ్ సినిమా హీరోలకు హైదరాబాద్లో ఓటు హక్కు లభించడం లాంటి వింతలు ఇంతకుముందు ఎన్నో చూశాం. ఇక రేషన్ కార్డుల విషయంలో.. కొందరు కోటీశ్వరులకు తెల్లకార్డులు, కూటికిలేనని వాళ్ళకు గులాబి కార్డులు అందడం గమనించాం. కానీ ఏకంగా తాను పనిచేసే ఆలయంలోని దేవుళ్ల పేరు మీదే రేషన్కార్డులు పొంది, ఏళ్లుగా సరుకులు బొక్కేస్తున్న అర్చకుడి గురించి విన్నారా? రాజస్థాన్లోని బరాన్ జిల్లా కేంద్రానికి చెందిన బాబూలాల్ అనే వ్యక్తి కజిఖేర్ ప్రాంతంలోని కృష్ణభగవానుడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఏమంత అవసరం అనుకున్నాడోగానీ కృష్ణుడు, ఆయన భార్య మారుపేర్లతో(మురళీ మనోహర్, ఠాకురాయన్జీ) రేషన్ కార్డు సంపాదించాడు. శివపుత్రుడు గణేశ్ పేరుమీద కూడా ఇంకో కార్డు తయారుచేయించాడు. అలా 2005 నుంచి దేవుళ్ల పేరుమీద నెలనెలా సబ్సిడీ ధరకు సరుకులు తెచ్చుకునేవాడు. అయితే తెలంగాణ, ఏపీల పౌరసరఫరాల శాఖలు చేపట్టినమాదిరే మాదిరే రాజస్థాన్లోనూ ఇటీవలే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలియని బాబూలాల్ గత వారం యధావిధిగా రేషన్షాప్కు వెళ్లాడు.. కార్డులను పరిశీలించిన అధికారులు.. ‘ఆ పేరుగల వ్యక్తులను మా ముందు ప్రవేశపెట్టండి’ అని ఆదేశించడంతో పూజారి బాబూలాల్ బెంబేలెత్తిపోయాడు. చివరికి అసలు విషయం కక్కేశాడు.. ఆ పేర్లన్నీ దేవుళ్లవేనని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి సమన్లు జారీచేసిన పీడీఎస్ అదికారులు.. 2005 నుంచి ఇప్పటివరకు బాబూలాల్కు ఎంత సరుకు అందింది? అనే వివరాలను లెక్కకడుతున్నారు. బాబులాల్పై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఇప్పుడే చెప్పలేమని, బయోమెట్రిక్ విధానంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని రాజస్థాన్ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. -
ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం
చింతామణి (కర్ణాటక): ఆస్తి ఖాతా మార్పు చేయాలంటూ అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఓ అర్చకుడు నగర సభ కార్యాలయం ఎదుట గురువారం పిండ ప్రదానం చేశారు. కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లా చింతామణికి చెందిన అర్చకుడు ప్రకాశ్ తన ఆస్తికి సంబంధించి 4 నెలల క్రితం సరైన ఆధారాలతో ఈ- ఆస్తికి దరఖాస్తు చేశారు. అధికారులు లంచం అడగడంతో ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పారు. అయినా వారు స్పందించకపోవడం తో ఆఫీస్ ఎదుట పిండప్రదానం చేశారు. దీంతో నగర సభ అధ్యక్షురాలు సుజాత, కమిషనర్ మహేశ్కుమార్ అక్కడికి చేరుకుని ఆస్తి ఖాతా మార్పు చేయాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. -
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
కడప అర్బన్ : కడప–తిరుపతి ప్రధాన రహదారిలో శనివారం ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్లిన భూమిరెడ్డి చెన్నమ్మ (80) అనే వృద్ధురాలిని రాజంపేట వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మృతి చెందింది. రామాంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న జయరామిరెడ్డి తల్లి చెన్నమ్మ. వీరి స్వగ్రామం గోపవరం మండలం సంగసముద్రం. తల్లిదండ్రులు జయరామిరెడ్డి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో మృతురాలు పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని లారీ ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాల పాలైన చెన్నమ్మను రిమ్స్కు 108 వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ట్రాఫిక్ ఎస్ఐ చాంద్బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నగల మాయంపై మరో కోణం!
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగదీతలో ఆంతర్యమేమిటో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు. -
దేవుళ్ల పేర్ల మీద మాన్యం భూములు
– వీడియో కాన్ఫరెన్స్లో సీసీఎల్ఏ కర్నూలు(అగ్రికల్చర్): మాన్యం భూములు దేవుళ్ల పేరుమీదే ఉండాలని..వాటిని అర్చకులు సాగు చేసుకంటుంటే వెబ్ల్యాండ్లో అనుభవదారులు(అక్రమణదారులు)గా నమోదు చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్రపునీట ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాసాధికార సర్వేను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం 100 గజాలలోపు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే ఎలాంటి రుసుం తీసుకోకుండా క్రమబద్ధీకరించాలన్నారు. అదే 500లోపు గజాలు అక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే నిర్ణీత పీజుపై క్రమబద్ధీకరించాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అర్చకుడిపై పోలీస్ జులుం
మూలా నక్షత్రం రోజున ఘటన అదేరోజు ధర్నాకు దిగేందుకు అర్చకుల యత్నం వీడియో పుటేజ్లో దాడి చేసినట్లు స్పష్టం సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గగుడిలో పోలీసుల జులుం సాగుతోంది. ఇటీవల ఒక పోలీస్ ఉన్నతాధికారి అంతరాలయంలో పూజ చేయించుకుంటున్నారనే ఉద్దేశంతో పంచభోగ నివేదనను అమ్మవారికి సమర్పించకుండా బయటే నిలుపుదల చేశారు. ఇది చివరకు దేవస్థానం ఉద్యోగులకు మెమోలు ఇచ్చే వరకూ వెళ్లింది. ఈ ఘటన మరిచిపోక ముందే దేవస్థానం అర్చకుడ్ని ఒక పోలీస్ ఉద్యోగి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూలానక్షత్రం రోజున వివాదం పోలీస్ కానిస్టేబుల్ తనకు తెలిసిన ఒక వ్యక్తిని దర్శనం నిమిత్తం మల్లేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఆ వీఐపీ అంతరాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ విధినిర్వహణలో ఉన్న ఒక అర్చకుడు వారించాడు. బయట నుంచే దర్శించుకోవాలని సూచించి ఆపే ప్రయత్నంలో చెయ్యి అడ్డం పెట్టాడు. దీంతో వీఐపీతో వచ్చిన పోలీస్ కానిస్టేబుల్కు కోపమొచ్చి అర్చకుడిని కొట్టడమే కాకుండా.. ఆలయంలో దుర్భాషలాడాడు. ఇదంతా అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్లో నమోదైనట్లు దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. ధర్నా చేసేందుకు అర్చకుల యత్నం సమాచారం తెలుసుకున్న అర్చకులు అదేరోజు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మూలా నక్షత్రం రోజు కావడంతో వారికి వారే సర్ది చెప్పుకొని శాంతించారు. అయితే, దాడి విషయాన్ని ఈవో సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. వీడియో పుటేజ్లు పరిశీలించిన ఆమె.. అర్చకుడు ఫిర్యాదు చేస్తే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దేవస్థానంలో చిరుద్యోగి అయిన అర్చకుడు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని చెబుతున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈవోనే జరిగిన ఘటనను పరిశీలించి సుమోటోగా పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదుచేసి న్యాయం చేయాలని అర్చకులు కోరుతున్నారు. -
అర్చకులకు వేతనాల పెంపు
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ప్రాంతంలోని 1,810 దేవాలయాల అర్చకులకు ధూపదీప నైవేథ్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.2,500లను రూ.6 వేలకు పెంచిందని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి తెలిపారు. మంగళవారం స్థానిక సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అర్చక సంక్షేమం కోసం అర్చక వెల్ఫేర్ బోర్డుకు రూ.87 కోట్లు కేటాయించారని, ఈ నిధులను అర్చకుల పిల్లల వివాహాలు, గృహ నిర్మాణాలు, విద్యా, వైద్య ఖర్చులకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న 20 లక్షల మంది పేద బ్రహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించిందని, త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద బ్రహ్మణులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రాచీన దేవాలయాల అభ్యున్నతికి ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించడంపై సమాఖ్య సంతోషం వ్యక్తం చేస్తుందని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీన వరంగల్లో బ్రహ్మణ వధూవరుల వివాహాల కోసం కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని బ్రహ్మణులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా చిలకమర్రి శ్రావణ్కుమారాచర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పెన్నా మోహన్శర్మ, బ్రహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గుండెపూడి జానకీరామశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ దేవాలయ అర్చక ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అర్చక సంఘం భవనంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దౌలతాబాద్ వాసుదేవశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా దౌలతాబాద్ వాసుదేవశర్మ, నూతన అధ్యక్షుడిగా పోతులపాటి రామలింగేశ్వరశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమరజవాన్లకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారావు, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లకీS్ష్మనర్సయ్య, నాగరాజుశర్మ, పులిరామకృష్ణ శర్మ, కోడుగంటి వెంకటరమణశాస్త్రీ, నందిభట్ల నాగరాజు శర్మ, విశాలక్ష్మమ్మ, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
పురోహితుడిని చితకబాదిన కాలనీవాసులు
-
అర్చకులకే శఠగోపం..!
160 ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా అందని వేతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాల ఆదాయం భారీగా పెరుగుతోంది. కొన్నిచోట్ల బడ్జెట్ కోట్ల రూపాయలు దాటుతోంది. అయినా అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించని దుస్థితి. కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించకపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 160 దేవాలయాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాలకమండళ్లతోపాటు కొందరు అధికారుల అవినీతి కారణంగానే ఈ దుస్థితి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో అక్రమాలు పెచ్చరిల్లి.. దేవాలయాలకు వస్తున్న ఆదాయం పక్కదారి పడుతోంది. ఓ ఆలయానికి ఎంత ఆదాయం వస్తోంది, అందులో దేవాదాయశాఖకు చెల్లించాల్సిందెంత, ఆలయ ఖర్చులకు, సిబ్బంది జీతభత్యాలకు చేస్తున్న వ్యయం ఎంతనే లెక్కల్లో స్పష్టత ఉండడం లేదు. చాలా దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. అదేమంటే ఆదాయం సరిపోవడం లేదనే సమాధానం వస్తోంది. కొన్ని నెలలుగా అందని జీతాలు దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 635 ఆల యాలున్నాయి. వాటిలో కొన్నింటికే పాలక మండళ్లు ఉన్నాయి. పాలక మండళ్లు లేని చోట కార్యనిర్వహణాధికారు(ఈవో)ల పాలన. వీటికితోడు పలు ఆలయాలను వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాల్లో 5,600 మంది అర్చకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరేగాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారు. అయితే వేములవాడ, యాదగిరిగుట్ట వంటి పలు ప్రధాన దేవాలయాలు కాకుండా.. చాలా ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా వేతనాలు అందడం లేదు. కామారెడ్డి సమీపంలోని భిక్కనూరు సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నెలలుగా సిబ్బందికి, అర్చకులకు జీతాలు చెల్లించడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఉండి, రూ.కోట్లలో వార్షికాదాయం ఉన్న కీసర రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ సకాలంలో వేతనాలు అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, మెదక్ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి... ఇలా చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా దేవాలయాల్లో ఇదే దుస్థితి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి అర్చకులు, సిబ్బంది జంకుతున్నా రు. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుం దోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పాలకమండళ్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం ఏమవుతోంది? ఆలయానికి సమకూరే మొత్తం ఆదాయంలో 12 శాతాన్ని దేవాదాయశాఖ అధికారుల వేతనాల కోసం ఆ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. సర్వశ్రేయోనిధికి మరో 3శాతం సమర్పించాలి. మరో 30శాతానికి మించకుండా నిధులను జీతాలకు కేటాయించాలి. మిగిలే నిధులను ఆయా ఆలయాల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. దేవాదాయశాఖకు అందాల్సిన మొత్తాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారు. ఆల య ఖర్చులు, సిబ్బంది జీతభత్యాల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇటీవల సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన ప్పుడు.. సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు తేలింది. దీనిపై అధికారులు దేవాదాయశాఖ కమిషనర్కు నివేదిక సమర్పించగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇలా చాలాచోట్ల అధికారులు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ దేవుడి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మరీ విచ్చలవిడిగా కొనసాగుతుండడంతో దేవాలయాల్లో నిధులకు కటకట ఎదురవుతోంది. చివరికి అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందున తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. తమకు జీతాలు సరిగా రావడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అర్చకులు, సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోదనే అవుతున్నాయి. ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు పట్టదా..? అర్చకులు, ఆలయ సిబ్బంది తమ వేతనాల సమస్యపై ఆందోళనలు చేయడంతో కొన్నేళ్ల కింద ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేవాలయాల ఆదాయంలో 30 శాతం వరకు అర్చకులు, సిబ్బంది వేతనాల కోసం వెచ్చిస్తున్నారు. పలు దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండడంతో కనీస వేతనాల్లో వ్యత్యా సం వస్తోంది. అంతేగాకుండా ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో ఆదా య, వ్యయాల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు అన్ని ఆలయాల ఆదాయం నుంచి 30 శాతం చొప్పున వసూలు చేసి ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేయాలని... ఆ నిధి నుంచే అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల అర్చకులు, సిబ్బందికి వేతనాలు సకాలంలో అందడంతోపాటు, ఆలయాల ఆదాయ, వ్య యాలను ప్రభుత్వం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఐదురుగు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సబ్ కమిటీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేయకపోవడం గమనార్హం. తమ అవకతవకలు బయటపడతాయని కొందరు పాలక మండళ్ల సభ్యులు, అధికారులు... పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సబ్ కమిటీ పరిశీలనను జాప్యం చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. -
అర్చకుడు.. హంతకుడు
బాబాయిని కొట్టి చంపిన కుమారుడు బైరాన్పల్లిలో విషాదం మద్దూరు : దేవుడి గుడిలో నిత్యం పూజలు చేసే చేతులు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. అర్చకుడి చేతిలో ఓ విశ్రాంత ఉపాధ్యాయు డు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బైరాన్పల్లిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం.. మద్దూరు మండలంలోని బైరాన్పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుడ్డం లింగయ్య(72)కు, అతడి అన్న కుమారుడైన స్థానిక అంగడి వీరన్న దేవాలయ పూజారి గుడ్డం ఈశ్వరయ్యకు గ్రామ శివారులో పక్క పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో తాను సాగు చేసిన మొక్కజొన్న చేనును కోతుల బారి నుంచి రక్షించేందుకు లింగయ్య మంగళవారం కంచె వేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం తనకున్న భూమిలో కంచె వేశాడని ఈశ్వరయ్య ఆ కంచెను తొలగించాడు. ఈ విషయమై బుధవారం తెల్లవారుజామున లింగయ్య తన పాలేరు దేవులపల్లి నర్సయ్యతో కలిసి ఈశ్వరయ్య ఇంటికి వెళ్లి నిలదీశాడు. అప్పటికే ఇంట్లో పూజ చేస్తున్న ఈశ్వరయ్య కోపంతో పక్కనున్న కర్రతో బయటికి వచ్చి లింగయ్య తలపై బాదాడు. దీంతో పక్కనే ఉన్న నర్సయ్య భయంతో పరుగు పెట్టి లింగయ్య కుమారుడు వీరభద్రంకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చే లోపే చుట్టుపక్కల వాళ్ల కేకలతో ఈశ్వరయ్య పారిపోయాడు. దీంతో రక్తపుమడుగులో ఉన్న లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ముగ్గురు భార్యలు ఉండగా.. గతంలో ఒక భార్య అనారోగ్యంతో చనిపోయింది. భార్యలు ఈశ్వరమ్మ, సోమేశ్వరమ్మ, కుమారుడు వీరభద్రం, కూతురు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్, ఎస్సై తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేర్యాలకు తరలించారు. కాగా, ఈశ్వరయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. -
గుండెపోటుతో పురోహితుడి మృతి
మైలవరం(కృష్ణాజిల్లా): మైలవరానికి చెందిన సూరె రంగారావు(57)అనే పురోహితుడు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మైలవరం నుంచి ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్దకు బస్సులో వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బాధితుడిని సమీప ఆసుపత్రికి బస్సు డ్రైవర్ తీసుకువచ్చాడు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే రంగారావు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.