Sarfraz Khan
-
అతడి కెరీర్ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్ను హెడ్కోచ్గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న భారత జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా భారత్ ఘోరంగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా బ్యాటర్ల తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.దీంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఈ సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో మొత్తం ఐదు మ్యాచ్లకు సర్ఫారాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫారాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. "కేఎల్ రాహుల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయం గురించి మొదటి టెస్టు సమయంలోనే మేము కామెంటేటరీ బాక్స్లో చర్చించాము. సర్ఫరాజ్కు టీమ్ మేనేజ్మెంట్ మరి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ కారణంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ స్ధాయిలో కూడా సత్తాచాటాడు. అతడు కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆసీస్ సిరీస్కు ఎంపిక చేసినప్పటికి తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. సర్ఫరాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశమివ్వాల్సింది. అప్పటికీ అతడు రాణించకపోయింతే పక్కన పెట్టాల్సింది. ఇది నావరకు అయితే సరైన నిర్ణయం కాదని అన్పిస్తోంది. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ వార్మాప్ మ్యాచ్ల్లో విఫలమయ్యాడని అతడిని తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వార్మాప్ మ్యాచ్లతోనే వారి ఆటతీరును అంచనా వేయకూడదు. అతడికి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది.ఓ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని భావించయారు. కానీ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హజారీలో భారత ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ టాపార్డర్లోనే కొనసాగాడు.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్కు మరో షాక్ -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో గెలుపొందిన భారత్.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధంఇక వర్షం వల్ల బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భారత్- ఆసీస్ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ లైవ్లీ ఫీల్డింగ్ డ్రిల్తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో కోహ్లిగ్రూప్-1లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.. గ్రూప్-2లో మహ్మద్ సిరాజ్ సారథ్యంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.. గ్రూప్-3లో ధ్రువ్ జురెల్ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ డ్రిల్లో పాల్గొన్నారు.జురెల్ సారథ్యంలోని జట్టుదే గెలుపుఅయితే, ఫీల్డింగ్తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. కాగా మెల్బోర్న్లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.అలా అయితేనే ఫైనల్ ఆశలు సజీవంఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఆసీస్తో సిరీస్కు అందుబాటులో ఉండటంతో అశూ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
BGT 2024: సర్ఫరాజ్ ఖాన్పై వేటు.. మిడిలార్డర్లో అతడు ఫిక్స్!
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.కివీస్తో టెస్టులలో నో ఛాన్స్కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్ జురెల్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. జురెల్ను పక్కనపెట్టారు.అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోఇక కివీస్తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్తో పాటు ధ్రువ్ జురెల్ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.161 పరుగులకే ఆలౌట్ఇక ఇప్పటికే ఆసీస్-ఎ, భారత్-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్.టాపార్డర్ కుప్పకూలి 11 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ వికెట్ కీపర్ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. సహచరులంతా ఆసీస్ బౌలర్ల ధాటికి.. పెవిలియన్కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ ఖాన్పై వేటు వేసిఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్ జురెల్ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో జురెల్కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.వికెట్ కీపర్గా పంత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్కు లైన్ క్లియర్ అవుతుంది. కివీస్ సిరీస్లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్ ఖాన్ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కివీస్తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్కు బదులు జురెల్ ఆసీస్ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయిబోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్పై దృష్టి -
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్ జట్టు రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్లో ఓటమిని రుచిచూపించింది.ఆరంభం బాగున్నాఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. Washington bowls a jaffa to castle Latham 🤌 Don't miss LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/BY5BeQRJ08— JioCinema (@JioCinema) November 1, 2024 ఆరంభంలోనే పేసర్ ఆకాశ్ దీప్ డెవాన్ కాన్వే(4) వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(28), స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5)ను పెవిలియన్కు పంపాడు.సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో రాణించి.. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్లో 32 ఓవర్కు ముందు బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. బ్యాటర్కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ సర్ఫరాజ్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.రోహిత్కు వార్నింగ్ఈ క్రమంలో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ సర్ఫరాజ్తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్ అంపైర్తో కాసేపు వాదించాడు. ఆ తర్వాత మిచెల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్ సైతం రోహిత్ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్లో కివీస్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్pic.twitter.com/H0G7GazjgE— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 1, 2024 -
అన్నా.. నన్ను నమ్ము: రోహిత్ను రౌండప్ చేసి మరీ! వీడియో
న్యూజిలాండ్తో టీమిండియా రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో భారత్.. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అశూ మొదలుపెట్టాడుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ అటాక్ ఆరంభించింది. అయితే, ఎనిమిదో ఓవర్ వేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కివీస్ ఇన్నింగ్స్లో తొలి వికెట్ పడగొట్టాడు.న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(15)ను లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత మళ్లీ 24వ ఓవర్లో అశూకు మరో వికెట్ తీసే అవకాశం వచ్చింది. వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ క్రీజులో ఉన్న సమయంలో అశూ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు.రివ్యూకు వెళ్లాలా? వద్దా? ఈ క్రమంలో అశూ వేసిన ఆఖరి బంతిని తప్పుగా అంచనా వేసిన విల్ యంగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించిన దాని కంటే ఎక్కువగా బౌన్స్ అయిన బంతి బ్యాట్ను తాకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. కానీ.. పంత్ మాత్రం విల్ యంగ్ వికెట్ పట్ల కాన్ఫిడెంట్గా లేడు.దీంతో భారత శిబిరంలో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహం నెలకొంది. అయితే, షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం విల్ యంగ్ కచ్చితంగా అవుటేనని కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పాడు. బౌలర్ అశ్విన్, ఫీల్డర్ విరాట్ కోహ్లి కూడా సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ రివ్యూకు వెళ్లగా.. బంతి బ్యాట్ను తాకి కీపర్ చేతుల్లో పడ్డట్లు తేలింది. ఫలితంగా అశూతో పాటు భారత్కు రెండో వికెట్ దక్కింది. విల్ యంగ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా.. అయితే, రోహిత్ శర్మను ఒప్పించేందుకు సర్ఫరాజ్ ప్రవర్తించిన తీరు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ‘‘అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా.. అతడు అవుటే’’ అన్న చందంగా సర్ఫరాజ్ అభినయించాడు. కోహ్లి సైతం అతడికి జత కలిసి రోహిత్ను ఒప్పించడం విశేషం. కాగా బెంగళూరు టెస్టులో 150 పరుగులతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గు చూపిన మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్పై వేటు వేసింది. దీంతో సర్ఫరాజ్ ఖాన్కు పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. భారత్తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది.మూడో వికెట్ కూడా అతడి ఖాతాలోనే..ఇదిలా ఉంటే.. భారత్తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది. లంచ్ తర్వాత కాసేపటికే అశ్విన్ మరో వికెట్ పడగొట్టాడు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(76) రూపంలో భారత్కు మూడో వికెట్ అందించాడు. 45 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 142/3. అప్డేట్: ఇక టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు: 201/5 (62). వాషింగ్టన్ సుందర్ రచిన్ రవీంద్ర(65), టామ్ బ్లండెల్(3) వికెట్లు తీశాడు.చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్కు హెడ్కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ఉన్న శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్తో మ్యాచ్లో కాన్పూర్ పిచ్పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్కు లైన్క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్కు కొత్త కెప్టెన్ -
తండ్రైన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా బ్యాటింగ్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తొలిసారిగా తండ్రయ్యాడు. అతడి భార్య రొమానా జహూర్ సోమవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సర్ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చేతిలో కుమారుడితో దిగిన ఫొటోను ఈ ముంబైకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్కు గతేడాది జమ్మూకశ్మీర్కు చెందిన రొమానా జహూర్తో వివాహమైంది.చిన్నస్వామిలో దంచి కొట్టి..కాగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. జట్టు ఓడిపోయినప్పటకి తన విరోచిత ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీతో సర్ఫరాజ్ చెలరేగాడు. 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్లతో 150 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సర్ఫరాజ్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇప్పుడు పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో అదేదూకుడు కనబరచాలని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. ఒకవేళ గిల్ ఫిట్నెస్ సాధిస్తే సర్ఫరాజ్ను తుది జట్టులో కొనసాగిస్తారో లేదో చూడాలి. -
'అతడొక అద్బుతం.. నడుము సన్నగా లేదని ఛాన్స్ ఇవ్వలేదు'
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఒక అద్బుతమైన ప్లేయర్, బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుందని సన్నీ కొనియాడాడు. అదే విధంగా స్లిమ్గా లేడని ఇప్పటివరకు సర్ఫరాజ్కు అవకాశమివ్వని భారత సెలక్టర్ల తీరును కూడా గవాస్కర్ తప్పుబట్టాడు.దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్కు టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు చేసిప్పటకి భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్కు తగ్గట్టు అతడు స్లిమ్గా లేడని, నడుము సన్నగా లేదని అవకాశాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే సర్ఫరాజ్ అతడి నడుము కంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తూ.. భారత క్రికెట్లో చాలా మంది నిర్ణయాధికారులు ఉన్నారు. వారి ఆ ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని స్పోర్ట్స్ స్టార్ కాలమ్లో సన్నీ రాసుకొచ్చాడు. రిషబ్ పంత్ ఫిట్నెస్పై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఫిట్నెస్ అతి ప్రేమికులు కోరుకున్నట్లుగా లేని మరో క్రికెటర్ రిషబ్ పంత్. ఈ ఫిట్నెస్ ప్యూరిస్ట్లు కోరుకునే సన్నని నడుము పంత్కు కూడా లేదు. కానీ అతడు చాలా టాలెంటడ్ క్రికెటర్. అతను రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఒక టెస్టులో దాదాపు ఆరు గంటల పాటు వికెట్ కీపర్గా పలు రకాల సేవలను అందిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ యోయో-యోయో పరీక్షలను పక్కన పెట్టండి. ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో పరీక్షంచిండి. అది ఆటగాడి ఫిట్నెస్కి నిజమైన పరీక్ష. ఒక ఆటగాడు రోజంతా బ్యాటింగ్ చేయగలడా లేదా ఒక రోజులో 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అనే దాని గురించి ఆలోచించండి. అతని నడుము ఎంత సన్నగా ఉన్నా లేదా లేకపోయినా మ్యాచ్లో మాత్రం పూర్తి ఫిట్నెస్గా ఉంటాడు అని సన్నీ రాసుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్ను బెంచ్కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్ను కూడా బ్యాడ్లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ను బెంచ్కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్లో అతడికి చోటు దక్కలేదు. -
సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
టీమిండియా మిడిలార్డర్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.తొలి ఇన్నింగ్స్లో డకౌట్ సొంతగడ్డ బెంగళూరులో కివీస్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీభారత్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్లో సర్ఫరాజ్ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్ను కూడా మిడిలార్డర్లో ట్రై చేస్తే బాగుంటుంది.అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్క్లాస్ క్రికెట్లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 50 లోపు స్కోరుకే ఆలౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపిందని.. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో తమ జట్టు అద్భుతంగా పోరాడిందని పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారని కొనియాడిన రోహిత్.. వారిద్దరి వల్లే తాము మెరుగైన స్కోరు సాధించామని తెలిపాడు.46 పరుగులకే ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌట్ అయి సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు చేయగలిగింది.సర్ఫరాజ్, పంత్ అద్భుత ఇన్నింగ్స్మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అద్భుతంగా రాణించినందు వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన సర్ఫరాజ్ 150 పరుగులతో చెలరేగగా.. మోకాలి నొప్పి ఉన్నా పంత్ 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టును గెలిపించేందుకు వీరి పోరాటం సరిపోలేదు.మోచ్యూర్గా ఆడారుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్లో మరీ ఘోరంగా బ్యాటింగ్ చేశాం. అయితే, రెండో ఇన్నింగ్స్లో మేము పుంజుకున్నాం. ఆ ఇద్దరు(సర్ఫరాజ్, పంత్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫరాజ్, పంత్ బ్యాటింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్రూంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు.వాళ్లిద్దరు ఎంతో పరిణతి కనబరిచారు. మామూలుగా అయితే, రిషభ్ చాలా వరకు రిస్క్ తీసుకుంటాడు. కానీ ఈసారి మంచి బంతులు పడ్డప్పుడు డిఫెన్స్ చేసుకున్నాడు. కొన్నింటిని వదిలేశాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు.ఇక సర్ఫరాజ్ గురించి చెప్పాలంటే.. ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్లో ఇది నాలుగో టెస్టే అయినా.. ఓవైపు ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న రోహిత్ శర్మ.. తాము మూకుమ్మడిగా విఫలం కావడం బాధించిందన్నాడు.వరుసగా నాలుగు గెలిచాంఅయితే, గతంలో ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తాము.. తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన విషయాన్ని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్లోని సానుకూల అంశాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసునని పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు(అక్టోబరు 16- 20)👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు.. రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాస్కోర్లు:👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్- 110/2👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రచిన్ రవీంద్ర(134, 39 నాటౌట్)చదవండి: IND vs PAK: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కివీస్కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
క్రికెటర్ కేఎల్ రాహుల్పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతడి ఆట తీరులో మార్పు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేస్తున్నారు!ఇక రాహుల్ కోసం ఇప్పటికే ‘ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేసారని.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయవద్దంటూ సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు.దారుణంగా విఫలంఈ క్రమంలో తాజాగా న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కివీస్కు కేవలం 107 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. ఆఖరి రోజైన ఆదివారం నాటి ఆటలో ప్రత్యర్థిని 105 పరుగులకే ఆలౌట్ చేయాలి. లేదంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పదు.సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో దుమ్ములేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఇంకా పోటీలో నిలవగలగడానికి కారణం సర్ఫరాజ్ ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.ఇకనైనా అతడికి అవకాశాలు ఇవ్వండిఇక తుదిజట్టు మిడిలార్డర్లో చోటు కోసం సర్ఫరాజ్ కేఎల్ రాహుల్తో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ గైర్హాజరీ వల్ల విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఆడగా.. సర్ఫరాజ్కు అనుకోకుండా ఛాన్స్వచ్చింది. లేదంటే.. రాహుల్ కోసం అతడిని డ్రాప్ చేసేవారే! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ రాహుల్ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్కు ఇన్నాళ్లూ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.చదవండి: ‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Harsha : Do you remember last time Kl Rahul saved India from a collapse?Ravi : No, because KL Rahul himself is part of the collapse. pic.twitter.com/6LC5UNmI98— mufaddla parody (@mufaddl_parody) October 19, 2024 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదంటే రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ పడుతుంది.బెంగళూరు వేదికగా భారత్- కివీస్ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. రోహిత్, విరాట్ ఫిఫ్టీలుఓపెనర్లలో యశస్వి జైస్వాల్(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ(52), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.చెలరేగిన హీరోలు.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్ పంత్తో కలిసి నాలుగో వికెట్కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే, పంత్ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. విలియం రూర్కీ బౌలింగ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. కివీస్ టార్గెట్ ఎంతంటే?కుల్దీప్ యాదవ్ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్కు స్వల్ప లక్ష్యం విధించింది.అంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్! రోహిత్ రియాక్షన్ వైరల్ -
Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?
టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 89వ ఓవర్ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.స్టాండింగ్ ఓవియేషన్అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన👉పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్!
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను ‘వెనక్కి పంపేందుకు’ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. అసలు సంగతి ఏమిటంటే!?బెంగళూరు వేదికగా భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం(రెండో రోజు) మొదటి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన..తమ తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తద్వారా స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.అయితే, టీమిండియా బ్యాటర్లు విఫలమైన పిచ్పై న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగ్గా ఆడారు. ఓపెనర్ డెవాన్ కాన్వే 91, రచిన్ రవీంద్ర 134, టిమ్ సౌథీ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులు చేసి.. భారత్ కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు.. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకోవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలతో బలమైన పునాది వేశారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ రాకతో టీమిండియా స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. శనివారం నాటి ఆటలో శతకం సాధించాడు.పంత్, సర్ఫరాజ్ దూకుడుఅయితే, కోహ్లి అవుటైన తర్వాత సర్ఫరాజ్కు రిషభ్ పంత్ జతకాగా.. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 56వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ బౌలింగ్లో తొలి బంతికి సర్ఫరాజ్ ఖాన్ షాట్ ఆడి.. సింగిల్ తీసుకున్నాడు. అయితే, పంత్ రెండో పరుగు కోసం పరిగెత్తుకు రాగా.. ప్రమాదాన్ని పసిగట్టిన సర్ఫరాజ్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి కాస్త ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు. వెనక్కి వెళ్తావా? లేదా? పంత్ను ఎలాగైనా వెనక్కి పంపించడం సహా ఫీల్డర్ల ఏకాగ్రత చెదిరేలా గెంతులు వేస్తూ పంత్కు సైగలు చేశాడు. దీంతో పంత్ క్రీజులోకి వెళ్లగా.. అప్పటికే ఫీల్డర్ త్రో చేసిన బంతిని కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వికెట్ల వైపునకు విసిరాడు. అయితే, అంతకంటే ముందే పంత్ క్రీజులోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.రోహిత్ రియాక్షన్ వైరల్ఇదిలా ఉంటే.. పంత్ను వెనక్కి పంపేందుకు సర్ఫరాజ్ చిన్న పిల్లాడిలా జంప్ చేసిన విధానం.. భారత శిబిరంలో నవ్వులు పూయించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి తదితరులు పంత్ సమయానికి చేరుకుంటాడో లేదోనని ఆందోళన పడుతూనే.. నవ్వులు ఆపుకోలేకపోయారు. 🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4— mon (@4sacinom) October 19, 2024 ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సర్ఫరాజ్ 150, పంత్ 99 పరుగులు చేసి అవుటయ్యారు. టీ బ్రేక్ సమయానికి 90.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)ALL INDIA REACTION ON SARFARAZ RISHABH RUN OUT CHANCE #INDvNZ pic.twitter.com/ImFtIck1sp— Wasi (@WasiTheBoi) October 19, 2024 -
'వెల్' డన్ సర్ఫరాజ్.. ఎంతో కష్టపడ్డావు: డేవిడ్ వార్నర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సర్ఫరాజ్కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్బుతమైన ఆట తీరును కనబరిచి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపరిచిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన షాట్లతో అభిమానులను ఈ ముంబైకర్ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 125 పరుగులతో సర్ఫరాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ చేరాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డన్ సర్ఫరాజ్. చాలా కష్టపడ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ" వార్నర్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో సర్ఫరాజ్, వార్నర్ కలిసి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించారు.ఇక ఈ మ్యాచ్లో 71 ఓవర్లు ముగిసే సరికి ఇండియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆట ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
టెస్టు క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ ఫార్మాట్లో 100 సిక్స్లు బాదిన తొలి జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బాదిన సిక్సర్తో టీమిండియా 100 సిక్స్ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ సేన.. 105 సిక్స్లు నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లండ్ (2022) 89 సిక్స్లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది. 2021 ఏడాదిలో భారత్ టెస్టుల్లో 87 సిక్స్లు బాదింది. ప్రస్తుత మ్యాచ్లో భారత్ ఇప్పటివరకు 8 సిక్స్లు కొట్టింది. పంత్, సర్ఫరాజ్ తలా 3 సిక్స్లు బాదగా.. రోహిత్, విరాట్ చెరో సిక్స్ కొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), పంత్(53) పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు' -
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ మెరుపు సెంచరీ..
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సర్ఫరాజ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్లతో శతకాన్ని పూర్తి చేశాడు. వన్డే తరహాలో కివీస్ బౌలర్లపై ఈ ముంబైకర్ విరుచుకుడపడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.మొదటి ఇన్నింగ్స్లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం సర్ఫరాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. రిషబ్ పంత్తో కలిసి భారత్ ఇన్నింగ్స్ను సర్ఫరాజ్ ముందుకు నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్ 106 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక 62 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా 85 పరుగుల వెనకంజలో ఉంది. SARFARAZ KHAN HAS ARRIVED IN INTERNATIONAL CRICKET...!!! 🥶- Maiden Test century at over 90 Strike Rate is simply crazy! 🤯pic.twitter.com/Vdo6JXAGA5— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024 -
NCAలో టీమిండియా స్టార్ క్రికెటర్.. కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ 2024-25 ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఇరానీ కప్ హీరో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.డబుల్ సెంచరీఈ క్రమంలో దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్తో పాటు... ఇరానీ కప్-2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. లక్నోలో అక్టోబరు 1-5 వరకు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ రెడ్బాల్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ముంబై ఇరానీ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో అతడిని బీసీసీఐ.. ఎన్సీఏకు పంపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కివీస్తో సిరీస్కు అతడిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్గా రీ ఎంట్రీకేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. అయితే, బంగ్లాతో సిరీస్ సందర్భంగా రాహుల్ తిరిగి రావడంతో అతడికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. అయితే,ఈసారి మరింత స్ట్రాంగ్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫరాజ్ సిద్దమైపోయాడు. కాగా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరువైన టీమిండియా.. బంగ్లాతో టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనుంది. అక్టోబరు 16 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అయితే, అక్టోబరు 11 నుంచే రంజీల్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టబోతోంది. బరోడాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్కు దూరం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
‘టీమిండియా డ్రెస్సింగ్రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్కు గురై మ్యాచ్కు దూరమైన ముషీర్కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్బాల్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్తో సిరీస్లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
‘భీకర ఫామ్లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్బాల్ మ్యాచ్లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
బంగ్లాదేశ్లో టెస్టు సిరీస్లో బెంచ్కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ మ్యాచ్లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్ విసిరేలా ధనాధన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈసారి ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్ తీసి డ్రెసింగ్ రూం వైపు బ్యాట్ చూపుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్గా నిలిచి.. రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతోంది.భారీ స్కోరు సాధించిలక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్ మొదలైంది. ఇందులో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! 💯 turns into 2⃣0⃣0⃣ 👌A sensational double century for Sarfaraz Khan✌️He becomes the 1⃣st Mumbai player to score a double ton in #IraniCup 👏The celebrations say it all 🎉#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/225bDX7hhn— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024 -
‘అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ’
తన ఆరోగ్యం బాగానే ఉందని భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తెలిపాడు. ఆ దేవుడి ఆశీసుల వల్లే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడని.. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఇరానీ కప్-2024లో పాల్గొనేందుకు ఈ ముంబై ఆటగాడు... తండ్రి నౌషాద్ ఖాన్తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ మెడ భాగంలో గాయాలయ్యాయి.మా నాన్న కూడా నాతోనే ఉన్నారుఅయితే, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వేగంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముషీర్ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ వంటిదని పేర్కొన్నాడు. ‘నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా బాగానే ఉన్నారు.ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్ సంఘం (ఎమ్సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ముషీర్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. కాగా టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ-2024లో ముషీర్ భారీ శతకం సాధించాడు. రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్లకూ దూరంఈ క్రమంలో రంజీ చాంపియన్ ముంబైతో రెస్టాఫ్ ఇండియా ఆడే ఇరానీ కప్-2024 మ్యాచ్కు ఎంపికయ్యాడు. అయితే, ఈ రెడ్బాల్ టోర్నీ మ్యాచ్ ఆడేందుకు లక్నోకు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా అతడు అక్టోబర్ 1 నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. చదవండి: పూరన్ సుడిగాలి శతకం View this post on Instagram A post shared by Naushad Khan (@musheerkhan.97) -
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్కప్ తాజా ఎడిషన్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్తో పాటు.. రంజీ తాజా ఎడిషన్కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దులిప్ ట్రోఫీ-2024 ఫైనల్ రౌండ్ మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇండియా-‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని సూర్య భర్తీ చేయనున్నాడు. కాగా టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా ఈ ముంబై బ్యాటర్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.గాయంతో ఎన్సీఏలో చేరిఈ క్రమంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో సూర్యకుమార్ భాగమయ్యాడు. ముంబై తరఫున ఈ రెడ్బాల్ టోర్నమెంట్ బరిలో దిగాడు. అయితే, బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. ఫీల్డింగ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి బొటనవేలికి గాయం కావడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు చేరుకున్నాడు.అక్కడి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న సూర్యకుమార్ పూర్తిగా కోలుకున్నాడని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని ఎన్సీఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఆడేందుకు సూర్యకు మార్గం సుగమమైంది. ఇండియా- ‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. అనంతపురం చేరుకున్న సూర్యకాగా బంగ్లాదేశ్తో గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఇప్పటికే దులిప్ ట్రోఫీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనంతపురం వేదికగా గురువారం(సెప్టెంబరు 19) నుంచి ఇండియా-‘బి’- ఇండియా- ‘డి’ జట్టుతో తలపడనుంది. ఇందుకోసం 34 ఏళ్ల సూర్య ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఇక ఇప్పటి వరకు.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-‘బి’ దులిప్ ట్రోఫీ-2024లో రెండు మ్యాచ్లు ఆడింది. ఇండియా-‘ఎ’పై గెలుపొందడంతో పాటు.. ఇండియా-‘సి’తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.తదుపరి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది. ఇక సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 3-0తో శ్రీలంకను క్లీన్స్వీప్ చేసింది. ఇక దులిప్ ట్రోఫీ తర్వాత సూర్య బంగ్లాదేశ్తో స్వదేశంలో టీ20 సిరీస్కు సిద్ధం కానున్నాడు.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి.చదవండి: శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!? -
భారత తుది జట్టులో వారిద్దరికి నో ఛాన్స్.. హింట్ ఇచ్చిన రోహిత్
సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా, బంగ్లా జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించాయి.వారిద్దరికి నో ఛాన్స్..ఇక బంగ్లాతో తొలి టెస్టుకు భారత తుది జట్టులో యువ ఆటగాళ్లు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో వీరిద్దరూ బెంచ్కే పరిమితం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఈవార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మా ఆఖరి టెస్టు సిరీస్ ఇంగ్లండ్తో ఆడినప్పుడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు గాయం కారణంగా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది.బహుశా ఇప్పుడు కొంతమంది యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవచ్చు. కానీ కచ్చితంగా వారికి ముందుముందు అవకాశాలు లభిస్తాయి అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో జురెల్, సర్ఫరాజ్లకు దాదాపుగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లేనిట్లే. కాగా వీరిద్దరూ తమ అరంగేట్ర సిరీస్లో అదరగొట్టారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జురెల్, సర్ఫారాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కానీ సీనియర్ ఆటగాళ్లు అందరూ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీరిద్దరూ తుది జట్టులో చోటు కోసం వేచి చూడక తప్పదు.చదవండి: వారు ముగ్గురు ఒక అద్బుతం.. కొంచెం కూడా భయం లేదు: రోహిత్ -
DT: జట్లలో మార్పులు.. బంగ్లాతో టెస్టులో సర్ఫరాజ్కు నో ఛాన్స్!
Duleep Trophy second round 2024: దులీప్ ట్రోఫీలో రెండో దశ మ్యాచ్ల కోసం భారత్ ‘ఎ’, ‘బి’, ‘డి’ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ఎంపికైన ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ మేరకు కొత్త ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండగా... శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్ మాత్రం తమ జట్లను వీడారు.‘బి’ టీమ్లో రింకూ సింగ్ఇక కొత్తగా ప్రకటించిన ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్కు చోటు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. అదే విధంగా.. 2022లో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులోనూ రషీద్ కీలక సభ్యుడు. ఇదిలా ఉంటే... రషీద్తో పాటు ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, షమ్స్ ములాలీ, ఆకిబ్ ఖాన్ ‘ఎ’ టీమ్లోకి ఎంపికయ్యారు.ఇక ‘ఎ’ జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ‘బి’ టీమ్లో రింకూ సింగ్, సుయశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి ఎంపికవ్వగా...సర్ఫరాజ్ ఖాన్ టీమ్తో కొనసాగుతాడు. ఇండియా ‘సి’ టీమ్లో ఎలాంటి మార్పులు జరగలేదు కానీ ‘డి’ జట్టులో నిశాంత్ సంధు ఎంపికయ్యాడు.అనంతపురంలోనేగత మ్యాచ్లో ‘డి’ టీమ్లో ఉండి గాయపడిన తుషార్ దేశ్పాండే స్థానంలో విద్వత్ కావేరప్పను తీసుకున్నారు. కావేరప్ప గత మ్యాచ్ ‘ఎ’ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా ‘ఎ’, ‘డి’ మధ్య...‘బి’, ‘సి’ మధ్య రెండు మ్యాచ్లు అనంతపురంలోనే జరుగుతాయి. ఈ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా...భారత జట్టు సభ్యులకు ఈ నెల 12 నుంచి బెంగళూరులో సన్నాహక శిబిరం మొదలవుతుంది. ఇండియా-‘ఎ’ (అప్డేటెడ్)మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుమార్ కుశాగ్రా, అక్షయ్ వాడ్కర్, శస్వత్ రావత్, ప్రథమ్ సింగ్, తనూష్ కొటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, ఎస్కే రషీద్, షంస్ ములానీ, ఆఖిబ్ ఖాన్ఇండియా-బి(అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థిఇండియా-సి(మార్పులు లేవు)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డి(అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, దేవ్దత్ పడిక్కల్, రికీ భుయ్, శరణ్ష్ జైన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వత్ కావేరప్ప, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు!
టీమిండియాలో అరంగేట్రం తర్వాత దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా మళ్లీ మైదానంలో దిగాడు. ఆ తర్వాత దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాదేశ్తో టీమిండియా టెస్టు సిరీస్కు ముందు ఈ రెడ్బాల్ టోర్నీల్లో ఆడటం ద్వారా సర్ఫరాజ్ ఖాన్కు కావాల్సినంత ప్రాక్టీసు లభించనుంది.అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనాఅయితే, బంగ్లాదేశ్తో సిరీస్పై తాను ఆశలు పెట్టుకోలేదంటున్నాడు ఈ ముంబై బ్యాటర్. అవకాశం వస్తే మాత్రం తప్పక సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. ఆటకు చాలా కాలం దూరంగా ఉన్నా ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి రోజూ ఉదయం నాలుగున్నరకే నిద్రలేస్తాను.వీలైనంత ఎక్కువ దూరం పరిగెత్తేందుకు ప్రయత్నిస్తాను. అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనా పరిగెత్తాలనే లక్ష్యంతో రోజును మొదలుపెడతాను. ఆ తర్వాత జిమ్కు వెళ్తాను. అలా ఉదయం పూట రన్నింగ్, వర్కౌట్లతో గడిచిపోతుంది. ఇక సాయంత్రాలు బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెడతా.నాకైతే ఇండోర్ సెషన్లో బౌలింగ్ మెషీన్ నుంచి వచ్చే బంతులను ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే.. అక్కడ ఎక్కువగా బ్యాటర్కు అనుకూలమైన బంతులే వస్తాయి. ఏదేమైనా నాకు మాత్రం బ్యాటింగ్ చాలెంజింగ్గా ఉంటేనే ఇష్టం. అందుకే బయటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా’’ అని తెలిపాడు.టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా!ఇక టీమిండియా- బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకైతే అస్సలు ఆశలు, అంచనాలు లేవు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంటాను. అందుకే ఇంతగా శ్రమిస్తున్నా. ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తుందో తెలియదు. అందుకే మనం సదా సిద్ధంగా ఉండాలి’’ అని సర్ఫరాజ్ ఖాన్ పేర్కొన్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉన్నా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కుడిచేతి వాటం బ్యాటర్కి జాతీయ జట్టులో చోటుదక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మరో సీనియర్ కేఎల్ రాహుల్ గైర్హాజరీ, ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయం వల్ల సర్ఫరాజ్కు ఈ అవకాశం వచ్చింది.ఈ క్రమంలో ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్లో వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపిన సర్ఫరాజ్ ఖాన్.. ఓవరాల్గా ఇప్పటి వరకు మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 200 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్తో సిరీస్లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే సర్ఫరాజ్ గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్ల పునరాగమనంతో అతడికి మొండిచేయి ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: IPL 2025: ధోని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..? -
అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్ కోసం!
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్గా శుబ్మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.అన్నదమ్ముల మధ్య పోటీ?వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్లో కలిపి 200 పరుగులు సాధించాడు.తమ్ముడు ఆల్రౌండర్నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్తో సిరీస్లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్రౌండర్ కావడం గమనార్హం. -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో ఆడనున్న టీమిండియా సారథి
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్టు జట్టులోనూ పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశీ రెడ్బాల్ టోర్నమెంట్ ఆడేందుకు ఈ ముంబై బ్యాటర్ సిద్ధమయ్యాడు. రానున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భాగంగా సూర్య వైట్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ధారించింది. ఇక తన నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘నేను బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడబోతున్నాను. తద్వారా.. దేశవాళీ సీజన్(రంజీ) మొదలయ్యే ముందు నాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. ఈనెల 25 తర్వాత జట్టుతో చేరతా. నాకు వీలున్నపుడల్లా కచ్చితంగా ముంబై జట్టుకు, క్లబ్ టీమ్కు తప్పక ఆడతా’’ అని స్పష్టం చేశాడు.ఇక సూర్య ఈ టోర్నీలో ఆడటంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సూర్య ముందే చెప్పాడు. అతడు అందరిలాంటి వాడు కాదు. క్లబ్ మ్యాచ్లు ఆడతానన్నాడు. కెప్టెన్గా ఉంటారా అని మేము తనని అడిగాం. అయితే, సూర్య మాత్రం సర్ఫరాజ్నే సారథిగా కొనసాగించమని చెప్పాడు. తను ఆటగాడిగా ఉంటానని చెప్పాడు’’ అని ముంబై వర్గాలు తెలిపాయి.కాగా టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా తొలిసారి శ్రీలంకలో పర్యటించిన సూర్యకుమార్ యాదవ్.. 3-0తో క్లీన్స్వీప్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే, టెస్టుల్లో సూర్య రికార్డు అంతగొప్పగా ఏం లేదు. టీమిండియా తరఫున ఇంతవరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ముంబై జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. అజింక్య రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సర్ఫరాజ్కు ఈ సువర్ణావకాశం వచ్చింది. తొలిసారి జట్టుకు నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు. అయితే, సూర్య రాకతో సర్ఫరాజ్ పదవి చేజారుతుందని భావించగా.. సూర్య మాత్రం అతడినే కొనసాగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.కాగా మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో 1868లో జన్మించారు ఆయన. క్రికెట్ క్లబ్లో స్వదేశీయులకు అవకాశాలు కల్పించారు. ఆయన జ్ఞాపకార్థం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. దేశీ రెడ్బాల్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. ఆగష్టు 15న టోర్నీ మొదలుకానుంది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు తొలుత ముంబై ప్రకటించిన జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా. -
సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడాను: రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 4-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి, మహ్మద్ షమీ, రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే ఇంగ్లండ్ను రోహిత్ సారథ్యంలోని యంగ్ ఇండియా చిత్తు చేసింది. కాగా ఈ టెస్టు సిరీస్తో నలుగురు యువ క్రికెటర్లు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అందులో ఒకడు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. భారత జట్టులో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్ఫరాజ్కు రాజ్కోట్ టెస్టు ముందు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్కు భారత జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజ్కోట్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాలన్న అతడి కల నేరవేరింది. కాగా ఇది సర్ఫరాజ్ ఒక్కడి కల మాత్రమే కాదు తన తండ్రి నౌషాద్ ఖాన్ది కూడా. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటరే. అతడు భారత జట్టు తరపున ఆడాలని కలలు కన్నాడు. కానీ అతడి కలను తన కొడుకు రూపంలో నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్ను అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నౌషాద్ ఖాన్ చిన్న కొడుకు ముషీర్ ఖాన్ కూడా దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా "టీమ్ రో" మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. "యువ క్రికెటర్లతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. వారంతా చాలా అల్లరి చేసే వారు. నాకు వారిలో చాలా మంది తెలుసు. వారి బలాలు ఏంటో, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం లేకపోయినప్పటికి దేశీవాళీ క్రికెట్లో ఎలా ఆడారో నాకు తెలుసు. కాబట్టి వారి గత ఇన్నింగ్స్లను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసం నింపడమే నా పని. కుర్రాళ్లు కూడా నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్బుతంగా రాణించారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. వారి డెబ్యూ సమయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారు ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సర్ఫరాజ్ కుటంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో కంగా లీగ్లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. సర్ఫరాజ్ భారత్కు ప్రాతినిథ్యం వహించడం వెనక అతడి తండ్రి కృషి ఎంతో ఉందని" హిట్మ్యాన్ పేర్కొన్నాడు. -
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్కు జాక్ పాట్.. కేవలం మూడు మ్యాచ్లకే
టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే సత్తాచాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ జాక్ పాట్ తగిలింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం (మార్చి 18) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో చెరో మూడు టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. సీ-గ్రేడ్ కేటగీరీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ అదరగొట్టాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం సత్తాచాటాడు. రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ధ్రువ్ నిలిచాడు. వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగానే కేవలం మూడు మ్యాచ్లకే బీసీసీఐ కాంట్రాక్ట్లు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. -
IPL 2024: సర్ఫరాజ్ ఖాన్కు లక్కీ ఛాన్స్.. ఐపీఎల్లో రీ ఎంట్రీ!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు సర్ఫరాజ్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలసిందే. దీంతో అతడు ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో మింజ్ స్ధానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేయాలని గుజరాత్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గత ఐపీఎల్సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో సర్ఫరాజ్ అదరగొట్టడంతో గుజరాత్ ఫ్రాంచైజీ తమ జట్టులో చేర్చుకునేందుకు సిద్దమైంది. సర్ఫరాజ్ గతం ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు, ఆర్సీబీకి కూడా ప్రాతనిథ్యం వహించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 585 పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్కోట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్తక్తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం? -
ఐపీఎల్లో నా పేరు లేకపోవటమే మంచిదైంది: సర్ఫరాజ్ తమ్ముడు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్! కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు. ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్. నాన్న చెప్పాడు ‘‘ఐపీఎల్లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్లో చోటు కూడా దక్కుతుందన్నారు. ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు. ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్కూ నో ఛాన్స్ కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
నన్ను క్షమించండి సన్నీ సార్.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టు సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్.. తన బ్యాటింగ్ స్కిల్స్తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్లో కన్పించిన సర్ఫరాజ్ ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బంతిని తప్పుగా అంచనా వేసిన సర్ఫరాజ్.. లేట్ కట్ షాట్ ఆడి స్లిప్లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. కాగా సర్ఫరాజ్ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. సర్ఫరాజ్ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "బంతి ఒక్కసారిగా పైకి పిచ్ అయ్యింది. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. ఇటువంటి సమయంలో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ మాటలను గుర్తు చేసుకోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడినని చెప్పేవారు. కానీ సర్ఫరాజ్ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే గవాస్కర్ అంతలా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్కు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం చెత్త షాట్ ఆడి ఔట్ కావడంతో లిటిల్ మాస్టర్కు కోపం వచ్చింది. అయితే గవాస్కర్ సీరియస్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి మరీ.. -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
రోహిత్ వార్నింగ్.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సర్ఫరాజ్!
రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త సీరియస్ అయిన సంగతి తెలిసిందే. హెల్మెట్ ధరించకుండా సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేయడానికి సిద్దమైన సర్ఫరాజ్ను రోహిత్ మందలించాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే శ్రీకర్ భరత్ హెల్మెట్ తీసుకువచ్చి సర్ఫరాజ్కు ఇచ్చాడు. అయితే రోహిత్ సలహానే ఇప్పుడు సర్ఫరాజ్ను పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఏమి జరిగిందంటే? ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్లో సర్ఫరాజ్ షార్ట్ లెగ్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కుల్దీప్.. బ్యాటర్ షోయబ్ బషీర్కి షార్ట్ బాల్ సంధించాడు. ఈ క్రమంలో బషీర్ లెగ్ సైడ్ బలంగా ఫ్లిక్ చేశాడు. వెంటనే బంతి నేరుగా సర్ఫరాజ్ హెల్మెట్కు వచ్చి తాకింది. అయితే హెల్మెట్ ఉండడంతో ఈ ముంబైకర్ గాయపడకుండా తప్పించుకున్నాడు. ఒకవేళ హెల్మెట్ లేకపోయింటే తీవ్రమైన గాయం అయి ఉండేది. ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. And that’s why Rohit Bhai said “Hero banne ki zaroorat naheen hai” pic.twitter.com/41tsvFUXrg — Vishal Misra (@vishalmisra) March 9, 2024 -
ఎందుకంత మిడిసిపడుతున్నావు?.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్స్టో.. 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది. Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z — Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా జానీ బెయిర్స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’. శుబ్మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’. జానీ బెయిర్స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’. ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’ సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు. ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రాలే మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఓవరాల్గా 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో క్రాలీ 79 పరుగులు చేశాడు. అయితే 61 పరుగుల వద్ద క్రాలే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల క్రాలే బతికిపోయాడు. ఏం జరిగిందంటే? లంచ్ విరామం తర్వాత కుల్దీప్ యాదవ్ 26 ఓవర్ పూర్తి చేసేందుకు బౌలింగ్ ఎటాక్లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో ఐదో బంతిని క్రాలే డౌన్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్కు దగ్గరకు వెళ్తూ వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. అయితే బంతిని ధ్రువ్ జురెల్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. కానీ బంతి జురెల్ గ్లౌవ్కు తాకి కాస్త గాల్లోకి లేవగా.. షార్ట్ లెగ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. వెంటనే సర్ఫరాజ్తో పాటు భారత ఆటగాళ్లు క్యాచ్కు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే సర్ఫరాజ్ పూర్తి నమ్మకంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. రోహిత్ మాత్రం వికెట్ కీపక్ ధ్రువ్ జురెల్ సలహా తీసుకున్నాడు. జురెల్ బంతి బ్యాట్కు కాకుండా ప్యాడ్కు తాకిందని చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో మాత్రం బంతి క్లియర్గా బ్యాట్కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన రోహిత్ ఎంత పనిపోయిందని అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా నేను చెప్పా కదా భయ్యా అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Team India missed out on a big chance, but the skipper made sure that the feels were positive. ROHIT SHARMA IS A MOOD! 🤣 Watch Till End#INDvsENG #TeamIndia #RohitSharma pic.twitter.com/DGUJcobu8G — R.Sport (@republic_sports) March 7, 2024 -
వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్ తండ్రి?! నిజం ఇదీ..
తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ స్పందించాడు. తన పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. యువ క్రికెటర్లు ఎవరూ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కవద్దని.. తాను ఏ జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించడం లేదని నౌషద్ ఖాన్ స్పష్టం చేశాడు. కాగా తన ఇద్దరు కుమారులు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లను టీమిండియాకు ఆడించాలన్నది నౌషద్ కల. ఇందుకోసం వారిద్దరిని చిన్ననాటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించి.. అనేక కష్టనష్టాలకోర్చి కోచ్గా శిక్షణనిచ్చి మెంటార్గా మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్, ముషీర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తండ్రి పేరును నిలబెడుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి.. ముషీర్ ఖాన్ ఇటీవల అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్లో టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో నౌషద్ ఖాన్ కూడా కొడుకు పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల మనసును మెలిపెట్టాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్తో పాటు నౌషద్ ఖాన్ పేరు కూడా నెట్టింట మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో.. ‘‘డబ్బులు కడితే ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా లేదంటే దేశవాళీ క్రికెట్లో ఆడే ఛాన్సులు ఇప్పిస్తాం’’ అని నౌషద్ ఖాన్ పేరిట ప్రకటనలు రాగా.. అతడు తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘నా పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అనేక మంది నకిలీ ఖాతాలు సృష్టించి.. ఐపీఎల్ నెట్బౌలర్లుగా, రాష్ట్రస్థాయి క్రికెటర్లుగా, అకాడమీ సెలక్షన్ విషయంలో సాయం చేస్తామంటూ డబ్బు అడుగుతున్నారు. దయచేసి వీటిని ఎవరూ నమ్మకండి. మీ ప్రతిభ, హార్డ్వర్క్పైనే నమ్మకం ఉంచండి. నాకు ఏ ఐపీఎల్ జట్టుతోనూ సంబంధం లేదు. అదే విధంగా నేను ఏ జట్టుకు కూడా కోచింగ్ ఇవ్వడం లేదు. నకిలీ ప్రచారాలను నమ్మకండి. థాంక్యూ’’ అని నౌషద్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ధర్మశాలలో ఇంగ్లండ్తో జరుగనున్న ఆఖరిదైన నామమాత్రపు ఆఖరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్ సేన ఇప్పటికే ఈ సిరీస్ను 3-1తో గెలిచిన విషయం తెలిసిందే. -
Sarfaraz Khan: 'నాన్నకు ప్రేమతో..' ఆ రికార్డ్ను బ్రేక్ చేసి చూపించాను!
"2009.. ఓ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్లో 439 పరుగుల స్కోరు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ‘సచిన్ రికార్డ్ను బద్దలు కొట్టాలని నాన్న చెప్పాడు. చేసి చూపించాను!’ 2014.. ఐదేళ్ల తర్వాత.. అదే కుర్రాడు ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్–19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 'ఇది ఆరంభం మాత్రమేనని నాన్న చెప్పాడు'. నేను ఇక్కడితో ఆగిపోనని మాటిచ్చాను!" 2024.. మరో పదేళ్లు.. అదే అబ్బాయి భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ‘మా నాన్న కళ్ల ముందు దేశం తరఫున ఆడాలనుకున్నాను.. ఇప్పుడు ఆ కల నెరవేరింది!’ తండ్రి, కోచ్, మెంటర్.. ఏదైనా.. ఆ అబ్బాయి క్రికెట్ ప్రపంచం నాన్నతో మొదలై నాన్నతోనే సాగుతోంది. ఆరేళ్ల వయసులో ఆట మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇప్పుడు భారత సీనియర్ టీమ్కు ప్రాతినిధ్యం వహించే వరకు అన్నింటా, అడుగడుగునా నాన్నే ఉన్నాడు. అపార ప్రతిభావంతుడిగా వెలుగులోకి వచ్చి అద్భుత ప్రదర్శనలతో పై స్థాయికి చేరే వరకు ఈ తండ్రీ కొడుకులు పడిన శ్రమ, పట్టుదల, పోరాటం ఎంతో ప్రత్యేకం. అందుకే అతని అరంగేట్రం క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అతడే సర్ఫరాజ్ ‘నౌషాద్’ఖాన్! భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 311వ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అదే రోజు వికెట్ కీపర్ జురేల్ కూడా అరంగేట్రం చేశాడు. గతంలోనూ తొలి టెస్ట్ సమయంలో ఆటగాళ్లు తమ సంతోషాన్ని ప్రదర్శించి, తమ పురోగతిని గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి టీమిండియా గడప తొక్కినవారూ ఉన్నారు. కానీ సర్ఫరాజ్ తొలి టెస్ట్ రోజున మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సందడి కనిపించింది. గత కొంతకాలంగా దేశవాళీలో అతని ఆటను చూసినవారు, అతన్ని భారత జట్టుకి ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్న వారు.. అతనికి ఆ అవకాశం వచ్చిన రోజున ఊరట చెందినట్లుగా ‘అన్ని విధాలా అర్హుడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘నువ్వు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న, కుటుంబసభ్యులు ఈ ఘనతను చూసి గర్విస్తారు’ అంటూ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించడం.. ‘నేను చూసుకుంటా.. మీరు మీ అబ్బాయి కోసం ఏమేం చేశారో మా అందరికీ బాగా తెలుసు’ అంటూ స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ భరోసానివ్వడం సర్ఫరాజ్ అరంగేట్రం విలువను చాటాయి. కఠోర శ్రమ.. అకుంఠిత దీక్ష.. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత కష్టపడాలి?’ అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ను అడిగితే ‘తట్టుకోలేనంత’ అని జవాబిస్తాడు. ఎందుకంటే ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ఆయన తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు, అతని బాల్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘సర్ఫరాజ్ తన ఫ్రెండ్స్తో ఏనాడూ బయటకు వెళ్లింది లేదు. గాలిపటాలు ఎగరేసింది లేదు. తెల్లవారుజామున లేవగానే ప్రాక్టీస్కు వెళ్లిపోవడం.. గంటల కొద్దీ సాధన చేయడం.. ఇంటికి రావడం.. మళ్లీ సాయంత్రం కూడా ఇదే తరహాలో ప్రాక్టీస్ చేసింది’ అని కొడుకు కోసం తను ప్లాన్ చేసిన దినచర్యను స్వయంగా నౌషాదే చెప్పాడు. రోజుకు దాదాపు 600కు పైగా బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు అతనొక్కడే ఆడేవాడు. ఆరేళ్ల ఆట తర్వాత స్కూల్ క్రికెట్ ద్వారా తొలి సారి సర్ఫరాజ్ పేరు ముంబై క్రికెట్లో వినిపించింది. 439 పరుగుల స్కోరు సాధించి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 12 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనత అతని కష్టాన్ని మరింత పెంచింది. తర్వాత ఐదేళ్ల పాటు సర్ఫరాజ్ను రాటుదేల్చే క్రమంలో ఆ శిక్షణను తండ్రి మరింత కఠినంగా మార్చాడు. తర్వాతి నాలుగేళ్ల పాటు సర్ఫరాజ్ స్కూల్ ముఖమే చూడలేదు. వ్యక్తిగతంగా ట్యూటర్ను పెట్టినా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అతనికి కష్టం విలువ తెలియాలని కొన్నిసార్లు రాత్రిళ్లు భోజనం కూడా పెట్టేవాడు కాదు నౌషాద్. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నింటిలోనూ సర్ఫరాజ్కు తండ్రి మాత్రమే కనిపించేవాడు. తన కోసం కాకుండా తండ్రి కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది. ‘మీ అబ్బాయి ఇదంతా ఇష్టంతోనే చేశాడా? అతను అంతలా కష్టపడ్డాడు.. అతనిలో ఇంకా శక్తి ఉందా? అంటూ నన్ను చాలామంది ప్రశ్నించారు. బయటినుంచి చూస్తే కఠినంగా అనిపించినా అది తప్పలేదు. తన లక్ష్యంపై మరింత ఏకాగ్రత పెట్టేందుకు.. ఇతర విషయాల వైపు దృష్టి మరల్చకుండా చేసేందుకు నేను అనుసరించిన తీరు కరెక్టే. తర్వాత రోజుల్లో మావాడు దాన్ని అర్థం చేసుకున్నాడు అని వాళ్లకు సమాధానం ఇచ్చాను’ అంటాడు నౌషాద్. అయితే కెరీర్ ఆరంభంలో వయసు విషయంలో మోసం చేశాడంటూ ఓవర్ ఏజ్ ఆరోపణలు సర్ఫరాజ్పై వచ్చాయి. చివరకు అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా అతను తప్పు చేయలేదని తేలింది. కానీ ఇది మానసికంగా ఆ పిల్లాడిపై ప్రభావం చూపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను ఇక క్రికెట్ ఆడనంటూ ఏడ్చేశాడు. దాన్నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు 2014లో ముందుగా ముంబై అండర్–19 జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. ఆ వెంటనే భారత్ తరఫున అండర్–19 ప్రపంచకప్లో సర్ఫరాజ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత రెండోసారి అతనికి అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. రెండు వరల్డ్ కప్లలో కలిపి 7 అర్ధ సెంచరీలు సహా 566 పరుగులు సాధించడంతో అతను ఒక స్థాయికి చేరుకున్నాడు. వివాదాలను దాటి తప్పులు సరిదిద్దుకొని.. చదువులో, వ్యాపారంలో లేదా ఏ ఇతర రంగంలోనైనా తాను సాధించలేకపోయిన విజయాలను, ఘనతలను తమ పిల్లలు సాధించాలని కోరుకోవడం.. తమ జీవితంలో మిగిలిన ఆశలు, కోరికలను వారి ద్వారా తీర్చుకొని సంతోషపడటం ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు చేసేదే. నౌషాద్ కూడా అలాంటివాడే. ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్ స్వస్థలం. క్రికెటర్గా కనీస నైపుణ్యం ఉండటంతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ముంబై చేరాడు. అయితే మహానగరంలో ఉపాధి దొరికినా తగిన అవకాశాలు రాక క్లబ్ క్రికెటర్ స్థాయికే పరిమితమయ్యాడు. దాంతో స్థానిక పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒకింత పేదరికంలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకును ఆటగాడిగా తీర్చిదిద్దాలని, ఎలాగైనా పెద్ద స్థాయిలో ఆడించాలనే తపన మొదలైంది అతనిలో. దీని కోసం దేనికైనా సిద్ధమనే కసితో అతను పని చేశాడు. అయితే కొన్ని సార్లు అదుపు తప్పాడు. వరుస తప్పులతో కొడుకు ఇబ్బందులకు పరోక్ష కారణమయ్యాడు. ఎంత బాగా ఆడినా తగిన అవకాశాలు రావడం లేదనే ఆగ్రహంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులతోనే తలపడేందుకు సిద్ధమవడంతో వాళ్లు అతనిపై చర్య తీసుకున్నారు. టీమ్తో ఉన్నా జట్టు కోచ్ కాకుండా మా నాన్న వద్దే శిక్షణ తీసుకుంటానంటూ మొండికేయడంతో సర్ఫరాజ్పైనా హెచ్చరిక జారీ అయింది. సెలక్టర్ల వైపు అభ్యంతరకర సైగలు చేయడంతో రెండేళ్ల పాటు అతని మ్యాచ్ ఫీజులను నిలిపేసింది. ఈ వరుస గొడవలతో ఆగ్రహం చెందిన నౌషాద్ ఇక తన కొడుకు ముంబైకి ఆడడంటూ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు తీసుకుపోయాడు. మూడేళ్లు యూపీ తరఫున ఆడిన తర్వాత కనీస గుర్తింపు రాకపోవడంతో తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది. అద్భుత ప్రదర్శనతో.. ముంబైకి తిరిగొచ్చాక.. ఒక్కసారిగా కొత్త సర్ఫరాజ్ కనిపించాడు. వరుసగా రెండు సీజన్లలో అత్యద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయి రెండుసార్లూ 900కు పైగా పరుగులతో సత్తా చాటాడు. వరుసగా డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి ఒక దశలో 82.83 సగటుతో ఫస్ట్క్లాస్ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో అతని పేరు కనిపించడం విశేషం. కోవిడ్ సమయంలో ముంబైలో ఆడటం సాధ్యం కాకపోతే తన మిత్రుల సహకారంతో యూపీలో వేర్వేరు నగరాలకు వెళ్లి సాధన కొనసాగించాడు. పరుగుల వరద పారిస్తూ.. ముంబై వరుస టోర్నీల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సర్ఫరాజ్. అతని గ్రాఫ్ చూసిన గవాస్కరే.. సర్ఫరాజ్ని భారత జట్టుకు ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినా ప్రతి సిరీస్కూ ఎదురు చూడటం, నిరాశపడటం రొటీన్ అయిపోయింది. అసలు భారత్కు ఆడతాడా అనే సందేహాలూ మొదలయ్యాయి. సహనం కోల్పోతున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ సమయం 2024 ఫిబ్రవరి 15న వచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా ముక్తకంఠంతో సరైన ఎంపికగా అందరూ అభినందిస్తుండగా తీవ్ర భావోద్వేగాల మధ్య సర్ఫరాజ్ తొలి టెస్ట్ ఆడి రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. ‘నాన్న కలను నిజం చేశాను’ అంటూ సర్ఫరాజ్ చెబుతుంటే నౌషాద్ కన్నీళ్లపర్యంతం అయిన దృశ్యం అందరి కళ్లల్లో నిలిచిపోయింది. ఎన్నో ప్రతికూలతలను దాటి ఇక్కడికి చేరిన సర్ఫరాజ్ భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనేదే సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: దేవుడా..! బచ్చన్కి బిడియం ఎక్కువే..! -
ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో భారత్ నిలిచింది. 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు. అంతకుముందు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, జడేజా ఒక్క వికెట్ సాధించారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్పై రోహిత్ శర్మ కాస్త సీరియస్ అయ్యాడు. ఏమి జరిగిందంటే? ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 47 ఓవర్ వేసేందుకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు చేస్తూ.. సర్ఫరాజ్ను సిల్లీ పాయింట్లో ఉండమని సూచించాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ హెల్మట్ ధరించకుండానే సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. దీంతో సర్ఫరాజ్పై కెప్టెన్ రోహిత్ సీరియస్ అయ్యాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకువచ్చి సర్ఫరాజ్కు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సిల్లీ పాయింట్లో హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేయడం చాలా ప్రమాద కారం. ఎందుకంటే ఈ ఫీల్డింగ్ పొజిషన్ బ్యాటర్కు దగ్గరగా ఉంటుంది. అంతకుముందు ఈ మ్యాచ్లో ఇదే స్ధానంలో ఫీల్డింగ్ చేస్తూ సర్ఫరాజ్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. 🔊 Hear this! Rohit does not want Sarfaraz to be a hero?🤔#INDvsENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/ZtIsnEZM67 — JioCinema (@JioCinema) February 25, 2024 -
సర్ఫరాజ్కు షాకిచ్చిన బషీర్.. ఊహించలేదు కదా!
టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్. సర్రేలో జన్మించిన 20 ఏళ్ల ఈ రైటార్మ్ స్పిన్నర్ మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చే క్రమంలో వీసా సమస్యలు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల ఖాతా తెరిచిన బషీర్.. తన తొలి మ్యాచ్లో మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, మూడో టెస్టులో మార్క్వుట్ ఎంట్రీ కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. రాంచి మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా శుబ్మన్ గిల్(38), రజత్ పాటిదార్(17)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బషీర్.. రవీంద్ర జడేజా(12) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బషీర్ బౌలింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇదిలా ఉంటే.. బౌలింగ్ కంటే ముందు రెండో రోజు ఆటలో బ్యాట్తో బరిలోకి దిగాడు బషీర్. జడేజా బౌలింగ్లో ఒలీ రాబిన్సన్(58) అవుట్ కాగానే అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ బషీర్ను ఉద్దేశించి తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చే సరికి సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. సహచర ఆటగాళ్లతో.. ‘‘అతడికి హిందీ రాదు కదా’’ అని వ్యాఖ్యానించాడు. Sarfaraz - isko to Hindi nahi aati hain Shoaib - Aati hai thodi thodipic.twitter.com/DJ7ZWGS5Jf — Vector Bhai (@Vectorism_) February 24, 2024 టీమిండియా ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్న సమయంలో సర్ఫరాజ్ అన్న ఈ మాటలకు బదులిస్తూ.. ‘‘నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు’’ అని బషీర్ బదులిచ్చాడు. దీంతో అవాక్కవడం సర్ఫరాజ్ వంతైంది. నెటిజన్లు ఈ సరదా సంభాషణ గురించి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా.. రెండో రోజు ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ తమ్ముడు..
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఖాన్కు ఇదే తొలి ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ. కాగా ముషీర్ ఖాన్ తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముషీర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్తో పాటు హార్దిక్ తామోర్(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో సత్తా చాటాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
IPL: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ ఫిక్స్!
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, అతడి కుటుంబం ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ రంజీ వీరుడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే ఇందుకు కారణం. అంతేకాదు అరంగేట్రంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్ ప్రతిభపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే వార్త తెరమీదకు వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ పునరాగమనం చేయనున్నాడనేది అందులోని సారాంశం. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా.. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్ఫరాజ్ తండ్రి, కోచ్, మెంటార్ నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే ఉండి మ్యాచ్ను కూడా వీక్షించాడు. ఈ క్రమంలో తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్తో ఇరగదీశాడు. 48 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, రవీంద్ర జడేజా రాంగ్కాల్ కారణంగా పరుగుకు వెళ్లి దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా సర్ఫరాజ్ బ్యాటింగ్కు ఫిదా అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడిని కోల్కతా నైట్ రైడర్స్కు ఆడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు గానూ గంభీర్ కేకేఆర్ మెంటార్గా నియమితుడైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈసారి జరిగిన మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్ ఖాన్ను రిలీజ్ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ కేకేఆర్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వేలం ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకునే వీలులేదు. అయితే, ఎవరైనా ఆటగాడు గాయపడితే మాత్రం అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలోని ఏ ఆటగాడైనా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిస్తే వెంటనే సర్ఫరాజ్ను పిలిపించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు బెంగాల్ వార్తా పత్రిక ఆనంద్బజార్ కథనం ప్రచురించింది. కాగా సర్ఫరాజ్ ఖాన్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 37 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన అతడు 22.5 సగటుతో 585 పరుగులు సాధించాడు. చదవండి: మార్చి 22న ఐపీఎల్ 2024 ప్రారంభం.. సంకేతాలు ఇచ్చిన లీగ్ చైర్మన్ -
సెంచరీ వీరుడికి గాయం.. సర్ఫరాజ్ తమ్ముడికి లక్కీ ఛాన్స్!
రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ క్వార్టర్ ఫైనల్కు ముందు ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి తీవ్రమైతరమైన నేపథ్యంలో రంజీ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లో టీమిండియా తరఫున అదరగొట్టిన శివం దూబే.. వెంటనే రంజీ బరిలో దిగాడు. ముంబై తరఫున ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తూ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బ్యాట్తో మ్యాజిక్ చేస్తూ రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ శతకాలు బాదాడు. చివరగా అసోంతో మ్యాచ్లో 140 బంతుల్లో 121 పరుగులు చేసిన దూబే నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు ముందు విశ్రాంతి తీసుకున్న ఈ ఆల్రౌండర్.. మ్యాచ్ అనంతరం మళ్లీ పక్కటెముల నొప్పితో ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘దూబే గాయపడిన కారణంగా రంజీ ట్రోఫీ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాడు. అసోంతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పక్కటెముకలు పట్టేశాయి. అందుకే రెండో ఇన్నింగ్స్లో అతడు మళ్లీ మైదానంలో దిగలేదు’’ అని పేర్కొన్నాయి. కాగా ముంబై తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బరోడాతో తలపడనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్కు శివం దూబే దూరం కానుండగా.. భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రంజీల్లో పరుగుల వరద పారించి ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో భారత్ తరఫున 338 పరుగులు చేశాడీ ఆల్రౌండర్. అదే విధంగా ముంబై తరఫున ఇప్పటి వరకు మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 96 రన్స్ సాధించాడు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
ఈ పిల్లలు ఉన్నారే.. వారెవ్వా!.. ఎవ్వరూ తగ్గేదేలే!
ఒకరు డబుల్ సెంచరీతో చెలరేగితే.. మరొకరు ధనాధన్ ఇన్నింగ్స్తో.. ఇంకొకరేమో అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో అదరగొట్టారు. జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు టీమిండియా యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్. 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి ఇప్పటికే భారత టెస్టు జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్లో భాగంగా వైజాగ్ టెస్టులో ద్విశతకం బాదిన ఈ ముంబై బ్యాటర్.. రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టులోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు రాజ్కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 48 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ 26 ఏళ్ల రైట్హ్యాండర్.. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్. మరో ఎండ్లో ఉన్న యశస్విని ఆద్యంతం ప్రోత్సహిస్తూ.. అతడు ద్విశతకం పూర్తి చేసుకోగానే తానే ఆ ఇన్నింగ్స్ ఆడినంత సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్ డిక్లరేషన్ తర్వాత యశస్విని ముందుండి నడవమంటూ డ్రెసింగ్రూం వైపు దారి చూపాడు. ఇక 23 ఏళ్ల ధ్రువ్ జురెల్ సైతం ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేశాడు. కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా స్థానం దక్కించుకున్న అతడు.. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఈ యూపీ ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, అద్భుత రనౌట్ చేసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ బెన్ డకెట్ను పెవిలియన్కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఈ ముగ్గురు టీమిండియా చారిత్రాత్మక విజయంలో తమ వంతు భూమిక పోషించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ తరం పిల్లలు ఉన్నారే’’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ.. ఒకే ఫ్రేములో ముగ్గురూ కనిపించేలా ఉన్న ఫొటోను హిట్మ్యాన్ ఇన్స్టా స్టోరీలో పంచుకున్నాడు. చప్పట్లు కొడుతున్న ఎమోజీని ఇందుకు జతచేశాడు రోహిత్ శర్మ. కాగా మూడో టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1తో ముందంజ వేసింది. తదుపరి.. రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్తో మొదలుకానున్న నాలుగో టెస్టుకు సన్నద్ధం కానుంది. -
జైస్వాల్పై సీరియస్ అయిన సర్ఫరాజ్.. రోహిత్ సైతం! వీడియో వైరల్
సర్ఫరాజ్ ఖాన్.. తన అరంగేట్ర టెస్టు మ్యాచ్లో అదరగొట్టాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ కాస్త తన సహనాన్ని కోల్పోయాడు. భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ సీరియస్ అయ్యాడు. అయితే సర్ఫరాజ్ అగ్రహానికి కారణం లేకపోలేదు. అస్సలు ఏమి జరిగిందో ఓసారి పరిశీలిద్దాం. కుల్దీప్ యాదవ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. జైశ్వాల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహాలో బౌండరీలు వర్షం కురిపించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 94 ఓవర్ వేసిన రెహాన్ అహ్మద్ బౌలింగ్లో మూడో బంతిని సర్ఫరాజ్ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. ఫీల్డర్ దూరంగా ఉండటంతో ఈజీగా రెండు పరుగులు సాధించవచ్చు. కానీ అప్పటికే 196 పరుగులతో డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న జైశ్వాల్ రెండో పరుగుకు ఆసక్తి చూపలేదు. సర్ఫరాజ్ రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు పరిగెత్తినా జైశ్వాల్ నిరాకరించాడు. వెంటనే సర్ఫరాజ్ వెనక్కి పరిగెత్తి నాన్స్ట్రైక్ ఎండ్ వైపు చేరుకున్నాడు. దీంతో సర్ఫరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. అక్కడ ఈజీగా రెండు పరుగులు తీయవచ్చని జైస్వాల్పై అరిచాడు. ఈ సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి మ్యాచ్ను వీక్షిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ సైతం జైశ్వాల్ తీరును తప్పుబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్లో జడేజా తప్పిదానికి సర్ఫరాజ్ రనౌట్ రూపంలో బలైన సంగతి తెలిసిందే. ఇక రాజ్కోట్ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అదే విధంగా యశస్వీ జైశ్వాల్ సైతం అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. pic.twitter.com/y30qhx8zOw — Jas Pope (@jas_pope93438) February 18, 2024 -
Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ.. పాపం సర్ఫరాజ్! రోహిత్ ఫైర్
India vs England, 3rd Test - Rohit sharma was not happy with Jadeja: టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రంలోనే మెరుపు అర్ధ శతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్ రనౌట్గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ .. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. రాజ్కోట్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. చక్కటి షాట్లు ఆడుతూ.. బౌండరీలు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 తొలుత తప్పించుకున్నాడు రవీంద్ర జడేజాతో కలిసి రోహిత్ మాదిరే మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనించాడు. కానీ.. 82వ ఓవర్లో సర్ఫరాజ్ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో మూడో బంతికి జడేజా ఆఫ్ దిశగా షాట్ ఆడి.. సర్ఫరాజ్ ఖాన్ను పరుగుకు పిలిచాడు. కానీ అంతలోనే ఫీల్డర్ బంతిని దొరకబుచ్చుకోగా.. లక్కీగా అది స్టంప్స్ మిస్ కావడంతో అప్పటికే డైవ్ చేసిన సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి అలా ప్రమాదం తప్పింది. అయితే, ఆ మరుసటి రెండో బంతికే మళ్లీ సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. దురదృష్టం వెంటాడింది ఆండర్సన్ బౌలింగ్లో జడ్డూ పరుగు తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా.. సర్ఫరాజ్ కూడా అతడికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, బంతిని గమనించిన జడేజా వెనక్కి వెళ్లగా.. అప్పటికే క్రీజు వీడిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోపే ప్రమాదం జరిగిపోయింది. బంతిని అందుకున్న ఫీల్డర్ మార్క్ వుడ్ స్టంప్నకు గిరాటేయగా.. సర్ఫరాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఒకరకంగా జడ్డూ వల్ల పొరపాటు జరిగిందన్న చందంగా క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొక మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తారనుకుంటే నిరాశ ఎదురుకావడంతో హిట్మ్యాన్ ఇలా అసహనానికి లోనయ్యాడు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 మరోవైపు.. సర్ఫరాజ్ సైతం తాను రనౌట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ రనౌట్తో టీమిండియా డ్రెసింగ్రూంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొనగా.. ఆ మరుసటి బంతికే జడేజా సెంచరీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: #Gill: మొన్న సెంచరీ.. ఇప్పుడు డకౌట్! ఏంటిది గిల్? Jadeja was so selfish 🙄 🤔👀 Your thoughts on this run-out of #SarfarazKhan 🤔#INDvENG #INDvsENGTest #RohitSharma#Jadejapic.twitter.com/brhecR1UqW — Fourth Umpire (@UmpireFourth) February 15, 2024 Rohit sharma was not happy with Sarfaraz run out.... He know jadeja was selfish#INDvsENGTest #SarfarazKhan #INDvENG pic.twitter.com/93cGrcOjXO — Neha Bisht (@neha_bisht12) February 15, 2024 -
Ind vs Eng: సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు.. గిల్ను దాటేసి!
India vs England, 3rd Test: రాజ్కోట్ టెస్టు సందర్భంగా టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ పుటల్లో అరుదైన జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ తొలి రెండో మ్యాచ్లలో చెరొకటి గెలిచి ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం(ఫిబ్రవరి 15) మూడో టెస్టు మొదలైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రంజీల్లో పరుగుల వరద పారించి తొలి టెస్టు తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోకపోవడంతో సర్ఫరాజ్కు తుదిజట్టులో చోటు దక్కింది. తద్వారా.. రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేనాటికి సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సగటు 69.85తో 3,912 పరుగులు రాబట్టాడు. సెంచరీల వీరుడు తద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే నాటికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను అధిగమించి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 45 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఖాతాలో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్ తరఫున అరంగేట్రం నాటికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగి ఉన్న బ్యాటర్లు 88.37 - వినోద్ కాంబ్లీ (27 మ్యాచ్లు) 81.23 - ప్రవీణ్ ఆమ్రే (23) 80.21 - యశస్వి జైస్వాల్ (15) 71.28 - రుషి మోదీ (38) 70.18 - సచిన్ టెండుల్కర్ (9) 69.85 - సర్ఫరాజ్ ఖాన్ (45) 68.78 - శుబ్మన్ గిల్ (23) . చదవండి: Rohit Sharma: అతి వద్దు రోహిత్! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
Ind vs Eng 3rd Test: తొలిరోజు టీమిండియాదే.. కానీ ఆ ఒక్కటే!
India vs England 3rd Test 2024- 3rd Test Day 1 Updates: ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. గురువారం నాటి ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 326 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(131), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(110- నాటౌట్) శతకాలతో మెరిశారు. అయితే, అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(10), శుబ్మన్ గిల్(0), రజత్ పాటిదార్(5) పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ దక్కింది. మొత్తానికి మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఆరంభంలో టీమిండియా తడబడినా.. రోహిత్, జడ్డూ, సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కారణంగా పుంజుకుని ఆధిపత్యం కనబరిచిందని చెప్పవచ్చు. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 జడేజా సెంచరీ రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోరు: 315-5(82). కుల్దీప్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు. సర్ఫరాజ్ రనౌట్.. ఐదో వికెట్ డౌన్ 81.5: జడ్డూతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి జోష్లో ఉన్న అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 45 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు సాధించి అర్ధ శతకానికి చేరువయ్యాడు. మరోవైపు.. జడ్డూ 95 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 291/4 (76) 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 242-4 జడేజా 86, సర్ఫరాజ్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అవుట్ 63.3: సెంచరీ వీరుడు రోహిత్ శర్మ(131) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో హిట్మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత టెస్ట్ల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో హిట్మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. హిట్మ్యాన్తో పాటు జడేజా (68) క్రీజ్లో ఉన్నాడు. భారత్ స్కోర్ 190/3గా ఉంది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 185/3 (52) రోహిత్ శర్మ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా.. జడేజా 68 పరుగులతో ఆడుతున్నాడు. జడ్డూ హాఫ్ సెంచరీ గాయం కారణంగా జట్టుకు దూరమై మూడో టెస్టుతో తిరిగి వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అర్ధ శతకంతో మెరిశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే క్రమంలో విలువైన యాభై పరుగులు జత చేశాడు. టెస్టుల్లో అతడికి 21వ ఫిఫ్టీ. ఈ క్రమంలో తనదైన శైలిలో కత్తిసాము చేస్తున్నట్లుగా సెలబ్రేడ్ చేసుకున్నాడు జడ్డూ. రోహిత్ 79 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 150/3 (44) వందకు పైగా పరుగుల భాగస్వామ్యం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకుంటున్నారు. తొలి రోజు 41 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 77, జడ్డూ 47 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, జడ్డూ రోహిత్ శర్మ 53, రవీంద్ర జడేజా 39 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. స్కోరు: 111/3 (32) సెంచరీ కొట్టిన టీమిండియా రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 31 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యం కారణంగా టీమిండియా వంద పరుగుల మార్కును అందుకుంది. స్కోరు: 100-3(26) లంచ్ బ్రేక్ రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: : 93/3 (25) రోహిత్ శర్మ అర్ధ శతకం 22.5: టామ్ హార్లే బౌలింగ్లో రెండు పరుగులు తీసి భారత సారథి రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 51, జడ్డూ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 81-3(23). టీమిండియా హాఫ్ సెంచరీ 13.2: ఆండర్సన్ బౌలింగ్ రవీంద్ర జడేజా ఒక పరుగు తీయడంతో.. టీమిండియా 50 పరుగుల మార్కు అందుకుంది. జడ్డూ 4, రోహిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 8.5: రజత్ పాటిదార్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్ అవుటయ్యాడు. రోహిత్ శర్మ 17, రవీంద్ర జడేజా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 33-3(9) రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.4: ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ టీమిండియాను మరోసారి దెబ్బకొట్టాడు. భారత వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను అవుట్ చేశాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 24/2 (6) తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 3.5: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్ బౌలింగ్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ జో రూట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10 బంతులు ఎదుర్కొన్న యశస్వి 10 పరుగులు చేసి మైదానం వీడాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 4 ఓవర్లలో భారత్ స్కోరు: 22-1 మొదటి ఓవర్లో భారత్ స్కోరు: 6-0 రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు. వాళ్లిద్దరి అరంగేట్రం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలైంది. రాజ్కోట్ వేదికగా గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ టెస్టు ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. తుదిజట్లు: టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
ఇంగ్లండ్తో మూడో టెస్టు.. భరత్పై వేటు! సర్ఫరాజ్, దృవ్ అరంగేట్రం?
ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లండ్తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈమ్యాచ్లో గెలిచి సిరీస ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్ సైతం తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే భారత జట్టు రాజ్కోట్కు చేరుకోగా.. దుబాయ్లో ఉన్న ఇంగ్లీష్ జట్టు మంగళవారం రాజ్కోట్కు రానుంది. అయితే చివరి మూడు టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఆకాష్ దీప్ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అదే విధంగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్కు ముందు వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు రెండో టెస్టుకు భారత జట్టులో కలిసిన సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లను ఆఖరి మ్యాచ్ల దృవ్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఇక రాజ్కోట్ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్, సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్పై వేటు వేసి, దృవ్ జురల్ను జట్టులోకి తీసుకోవాలని మేన్జ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో భరత్ నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో భరత్.. 41, 28, 17, 6 చేసిన స్కోర్లు ఇవి. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన భరత్కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మరోవైపు వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్ పాటిదార్ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్ సిరాజ్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్ బెంచ్కే పరిమితం కానున్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి. అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లతో పాటు సర్ఫరాజ్కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది. అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో చోటు కోసం పాటిదార్తో పోటీపడ్డ సర్ఫరాజ్కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) సిరాజ్ స్థానంలో అతడు కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు -
Ind vs Eng: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది. ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan — Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024 I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND — Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024 కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. 🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd. Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN — BCCI (@BCCI) February 1, 2024 తుది జట్లు: టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్ -
రజత్ పాటిదార్ అరంగేట్రం.. జహీర్ చేతుల మీదగా! ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏 Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU — BCCI (@BCCI) February 2, 2024 -
అతడి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా: డివిలియర్స్
వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఊవ్విళ్లరూతోంది. ఇక వైజాగ్ టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో రెండో టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అయితే జడ్డూ స్ధానంలో కుల్దీప్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం కాగా.. రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్, రజిత్ పాటిదార్ ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతమైనది. భారత జట్టు తరపున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అతడు 66 ఇన్నింగ్స్లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అదే విధంగా 14 సెంచరీలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో సైతం అతడు సత్తచాటుతాడని ఆశిస్తున్నాను. మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమాస్టిక్ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని" తన యూట్యూబ్ ఛానల్లో ఏబీడీ పేర్కొన్నాడు. -
సర్ఫరాజ్ను ఆడిస్తారా? లేదంటే.. టీమిండియా కోచ్ స్పందన
India vs England, 2nd Test- Sarfaraz vs Patidar: ‘‘ఎట్టకేలకు టీమిండియా సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.. దేశవాళీ క్రికెట్లో, భారత్-ఏ తరఫున సత్తా చాటుతున్న ఈ ముంబై బ్యాటర్ను ఇన్నాళ్లకు బీసీసీఐ కరుణించింది.. ఇక భారత్ తరఫున అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే తరువాయి. ఇంతకీ రెండో టెస్టు తుదిజట్టులో అతడికి చోటు దక్కుతుందా?’’.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎట్టకేలకు పిలుపు రంజీల్లో పరుగుల వరద పారించినా.. నోటి దురుసు కారణంగా సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు అతడి ప్రతిభ వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అంతకంటే ముందుగానే పాటిదార్ అయితే, అంతకంటే ముందే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్కు జట్టులో చోటిచ్చారు. హైదరాబాద్ టెస్టు తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరం కాగా.. సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో పాటు సర్ఫరాజ్కు తలుపులు తెరిచారు. కానీ విశాఖపట్నం టెస్టులో తుది జట్టులో అతడికి చోటిస్తారా లేదంటే పాటిదార్ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ అంశం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు? ‘‘వాళ్లిద్దరూ సూపర్ ప్లేయర్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎప్పుటికపుడు వారి ప్రదర్శనలు మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక స్వదేశీ పిచ్ల మీద జట్టు ఆడేపుడు వాళ్లిద్దరి చేరిక మాకు అదనపు ప్రయోజనంగా మారుతుందనడంలో సందేహం లేదు. వాళ్ల నిర్ణయాన్ని బట్టే ముందు చెప్పినట్లుగానే ఇద్దరిలో ఒకరినే తీసుకోవాల్సి రావడం వల్ల కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నిర్ణయాలకు అనుగుణంగానే తుదిజట్టు ప్రకటన ఉంటుంది’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. తొలి టెస్టులో ఓటమితో తామేమీ కుంగిపోలేదని.. రెండో మ్యాచ్లో తమ ఆటగాళ్లు కచ్చితంగా తిరిగి పుంజుకుంటారని ఈ సందర్భంగా రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఫిబ్రవరి 2 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. -
నిన్న టీమిండియాలోకి అన్న.. ఇప్పుడేమో తమ్ముడి విధ్వంసకర సెంచరీ
అండర్ 19 వరల్డ్కప్-2024లో టీమిండియా ఆటగాడు ముషీర్ ఖాన్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ ముషీర్ ఖాన్(118)సెంచరీతో సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ముషీర్.. 325 పరుగులు చేశాడు. కాగా ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు స్వయానా ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. నిన్న ఇంగ్లండ్తో రెండో టెస్టుకు సర్ఫరాజ్కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు రావడం.. ఈ రోజు తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ముషీర్తో పాటు ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో..
Ind vs Eng 2nd Test: యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఉద్దేశించి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ ముంబై ఆటగాడికి తుదిజట్టులో గనుక చోటు దక్కితే తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. అలా కాని పక్షంలో.. సర్ఫరాజ్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా.. దేశవాళీ క్రికెట్ పరుగుల హీరో సర్ఫరాజ్ను బీసీసీఐ సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వైజాగ్ టెస్టులో ఆడేనా? ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్- ఏ జట్టుకు ఆడుతూ అదరగొట్టిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి టీమిండియాలో స్థానం సంపాదించాడు. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి అవకాశంలోనే ప్రభావం చూపగలగాలి. ఎందుకంటే విరాట్ కోహ్లి గనుక తిరిగి వస్తే సర్ఫరాజ్పైనే ముందుగా వేటు పడుతుంది. తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథాగా పోనివ్వకూడదు. ఎంతో కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు ఇక్కడిదాకా వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి అవకాశంలోనే తనదైన ముద్ర వేయాలి’’ అని ఆకాంక్షించాడు. తొలి ప్రయత్నంలోనే తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో సర్ఫరాజ్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లి జట్టుతో తిరిగి చేరతాడా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: బుమ్రా విషయంలో ఫోక్స్ చేసిందేమిటి? ఇదేనా మీ ‘క్రీడా స్ఫూర్తి’? -
టీమిండియాకు బిగ్ షాక్! రాహుల్, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది. ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV — BCCI (@BCCI) January 29, 2024 -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
అన్నాదమ్ముళ్ల బ్యాటింగ్పై ఐసీసీ ప్రత్యేక వీడియో.. తప్పని ట్రోలింగ్
భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్ తరఫున ఒకేరోజు వేర్వేరు ఫార్మాట్లలో శతకాలు బాదిన ఈ అన్నాదమ్ముళ్లు.. ఎప్పటికప్పుడు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్, ముషీర్ల అర్హతకు తగినట్లుగా బీసీసీఐ అవకాశాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముంబై ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని పోలుస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి వీడియో షేర్ చేయడం విశేషం. ‘‘మా అన్నయ్య.. నేనూ ఒకే తరహాలో బ్యాటింగ్ చేస్తాం’’ అంటూ ముషీర్ ఖాన్ మాట్లాడుతున్న దృశ్యాలను తమ అధికారిక ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఐసీసీ.. నీలం రంగు జెర్సీలో అన్నాదమ్ముళ్లు బ్యాట్ ఝలిపించిన తీరును కొనియాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంలో బీసీసీఐ కంటే ఐసీసీ బెటర్గా ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం.. ముషీర్ కచ్చితంగా టీమిండియా ఆల్రౌండర్గా ఎదుగుతాడని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందేమో.. మీ అన్నలా ఇగో చూపించకుండా హుందాగా ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ముషీర్కు సూచనలు ఇస్తున్నారు. కాగా గురువారం ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు తరఫున సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం(161)తో మెరిశాడు. మరోవైపు.. ఇదే రోజు అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో ముషీర్ ఖాన్ 118 పరుగులు సాధించి.. ఐర్లాండ్పై యువ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మేరకు వీడియో షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక డిసెంబరు 2022లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లాడి 96 రన్స్ చేశాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రైట్హ్యాంట్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇక ముషీర్ ఖాన్ అన్న సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొట్టాడు. భారత్-ఏ జట్టు తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్తో బిజీగా ఉండగా.. ముషీర్ సౌతాఫ్రికాలో వరల్డ్కప్ టోర్నీ ఆడుతున్నాడు. సుమారుగా 7625 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరిద్దరూ ఒకేరోజు శతకాలు బాదడం ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్కప్లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘దేశం మారితేనైనా ఫలితం ఉంటుందేమో!’
ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన 14వ సెంచరీ నమోదు చేశాడు. ధనాధన్ బ్యాటింగ్తో కేవలం 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. డబుల్ సెంచరీ దిశగా బ్యాట్ ఝులిపిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్పై ప్రశంసలు కురిపిస్తున్న టీమిండియా అభిమానులు.. అదే సమయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టు రేసులో ఎల్లప్పుడూ ముందే ఉన్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించడం లేదు. ప్రధాన జట్టుకు ఈ ముంబై ఆటగాడిని ఎంపిక చేయడం లేదు. అయితే, ఇంగ్లండ్ లయన్స్తో స్వదేశంలో మూడు అనధికారిక టెస్టు సిరీస్లో తలపడే భారత-ఏ జట్టులో మాత్రం చోటిచ్చారు. ఇందులో భాగంగా వామప్ మ్యాచ్లో 96 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలి అనధికారిక టెస్టులో 55 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకు ముందు సౌతాఫ్రికా గడ్డపై ఈ 26 ఏళ్ల ముంబై బ్యాటర్ మొత్తంగా 102 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టీమిండియా తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరం కాగా సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు పిలుపునిస్తారని అతడి అభిమానులు భావించారు. కానీ మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్తో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడంతో సర్ఫరాజ్కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు సెంచరీ బాదిన తర్వాత నెట్టింట బీసీసీఐపై ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. ‘‘తన బ్యాటింగ్లో తార స్థాయికి వెళ్లిన తర్వాత .. రెండు- మూడు ఛాన్సులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ జట్టు నుంచి తప్పిస్తారు. ఇదంతా భరించే బదులు.. అతడు ఉన్ముక్త్ చాంద్ను సంప్రదించి.. దేశం నుంచి వలస వెళ్లి.. అక్కడే క్రికెట్ ఆడుకుంటే మంచిది!! ఇక్కడుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్కు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మన సెలక్టర్ల ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు కదా. ఏదేమైనా అతడికి అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం’’ అంటూ ఫైర్ అవుతున్నారు. If you are him and not getting selected for test cricket,what are you thinking??? pic.twitter.com/uVzUfvNPTx — Irfan Pathan (@IrfanPathan) January 24, 2024 కాగా గత రంజీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున బరిలోకి దిగి సగటు 92.66తో 556 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021/22 సీజన్లో 982 పరుగులతో అతడు టాప్ స్కోరర్గా నిలిచాడు. HUNDRED FOR SARFARAZ KHAN...!!!! Hundred from just 89 balls against England Lions 🔥 India A lost 4 quick wickets in the space of 22 runs and then Sarfaraz show started - A special knock. pic.twitter.com/PDz5WGCfaj — Johns. (@CricCrazyJohns) January 25, 2024 ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఓవరాల్గా 65 ఇన్నింగ్స్లో 3751 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెటర్గా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్కు కూడా ఇదే గతి పట్టిస్తారేమోనంటూ అతడి అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీమిండియాలో రీఎంట్రీకి కసరత్తు: కెప్టెన్గా అజింక్య రహానే
Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అదే విధంగా.. గత ఎడిషన్లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండేలతో పాటు గత సీజన్లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు. బిహార్తో తొలి మ్యాచ్ రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్లో బిహార్తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. 39 టైటిళ్లు సాధించిన ఘనత దేశవాళీ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది. గత సీజన్లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్లకు ముంబై జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్. చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ.. -
రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ.. సర్ఫరాజ్కు మొండిచేయి
Ruturaj Gaikwad ruled out of Test series Vs South Africa: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ప్రొటిస్ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. రుతు స్థానంలో అతడే రుతురాజ్కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించిందని.. కాబట్టి అతడు భారత్కు తిరిగి రానున్నట్లు పేర్కొంది. త్వరలోనే అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నాడని తెలిపింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. రింకూ భారత- ఏ జట్టులో ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత-ఏ జట్టులోని పేసర్ హర్షిత్ రాణా రెండో మ్యాచ్కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అదే విధంగా రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్లను భారత-ఏ జట్టులో చేర్చుతున్నట్లు వెల్లడించింది. కుల్దీప్ యాదవ్ను ఈ జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అభిమన్యుకు లక్కీ ఛాన్స్.. పాపం సర్ఫరాజ్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వీరిద్దరికి ఇంతవరకు సెలక్టర్లు ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదు. అయితే, సౌతాఫ్రికా టూర్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం వల్ల దూరం కావడంతో ఈశ్వరర్కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ కోసం అప్డేట్ చేసిన భారత-ఏ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, నవదీప్ సైనీ, ఆకాశ్ దీప్, విద్వత్ కావేరప్ప, మానవ్ సుతార్, రింకూ సింగ్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం! -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు తెలుసు: ఆసీస్ మాజీ బౌలర్
Sarfaraz Khan- Brad Hogg: వెస్టిండీస్తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవపోవడంపై వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఇక తాజాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రాడ్ హాగ్ ఈ విషయంపై స్పందించాడు. టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు తెలుసనంటూ ఈ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. రంజీల్లో సంచలనమే.. కానీ ‘‘రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాట వాస్తవమే. కానీ వెస్టిండీస్తో టెస్టు ఆడే జట్టులో అతడికి చోటెందుకు దక్కలేదో నాకు తెలుసు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి.. దేశవాళీ క్రికెట్లో అతడు తన జట్టు మిడిలార్డర్లో ఆడతాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక రెండోది.. ఐపీఎల్లో పేసర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. క్వాలిటీ బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాడు. పుజారా పని అయిపోయినట్లే! బహుశా అందుకే భారత సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ విషయంలో వెనుకడుగు వేసి ఉంటారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో మెరుగుపడితే అతడిని టెస్టు జట్టుకు ఎంపిక చేస్తారేమో!’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఇక నయా వాల్ ఛతేశ్వర్ పుజరాను జట్టు నుంచి తప్పించడంపై స్పందిస్తూ.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నాడు. దశాబ్ద కాలంగ వన్డౌన్లో ఆడుతున్న పుజారా గత రెండేళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని బ్రాడ్ హాగ్ పెదవి విరిచాడు. పుజారా స్థానంలో దూకుడైన ఆటగాడిని వారసుడిగా నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నాడు. వెస్టిండీస్తో టెస్టులకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత.. -
భారత జట్టులో సర్ఫరాజ్కు నో ఛాన్స్.. కారణమిదే! సెలక్టర్లు ఫూల్స్ కాదు కదా?
వెస్టిండీస్తో టెస్టులకు, వన్డేలకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్ టెస్టులకు సర్ఫరాజ్ ఖాన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్రాజ్ గైక్వాడ్కు మాత్రం సెలక్టర్లు తొలి సారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే రుత్రాజ్ కంటే అద్భుతమైన ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే సర్ఫరాజ్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కారణమిదే.. "సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే వరుస రంజీ సీజన్లలో 900కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని ఎంపికచేయకపోవడానికి సెలెక్టర్లు ఏమైనా ఫూల్స్ అనుకుంటున్నరా? సర్ఫరాజ్ను పరిగణనలోకి తీసుకోపోవడానికి బలమైన కారణం ఉంది. అతడి ఫిట్నెస్ అంతర్జాతీయ ప్రమాణాలు అనుగుణంగా లేకపోవడం ప్రధాన కారణం. అదే విధంగా ఆఫ్ ది ఫీల్డ్లో కూడా అతడి ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. మేము అన్ని గమనిస్తున్నాం. కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. సర్ఫరాజ్ తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ ఈ విషయాలపై దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాను. అతడు కష్టపడి బరువు తగ్గాలి. అదే విధంగా పూర్తి ఫిట్గా ఉండాలి. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే బ్యాటింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ Sarfaraz Khan's latest Instagram Story after he wasn't selected for West Indies Tests. 👇🏻👇🏻 pic.twitter.com/ITzJMl7QUD — Harshit Bisht (@rk_harshit29) June 25, 2023 -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్తో టెస్టు సిరీస్కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
అతడేం నేరం చేశాడు.. ప్రతీసారి ఇంతే! నిజంగా సిగ్గుచేటు!
వెస్టిండీస్తో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రుత్రాజ్ గైక్వాడ్కు తొలి సారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. అయితే దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 78 పైగా సగటుతో అదరగొడుతున్న సర్ఫరాజ్కు సెలక్టర్లు ఛాన్స్ ఇవ్వకపోవడం అందర్నీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది. అయ్యో సర్పరాజ్.. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్లో 11 సెంచరీలు , 9 హాఫ్ సెంచరీలు ఉండడం గమానార్హం. ఇక అభినవ బ్రాడ్మన్గా పేరొందిన సర్ఫరాజ్ అహ్మద్ పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరును అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో భారత సెలక్షన్ కమిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెలక్షన్ కమిటీ కావాలనే సర్ఫరాజ్ను ఎంపిక చేయడం లేదని, అతడేం నేరం చేశాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రుత్రాజ్ గైక్వాడ్ స్ధానంలో సర్ఫరాజ్ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: IND Vs WI India Sqaud: వెస్టిండీస్ టూర్కు భారత జట్టు ప్రకటన.. జైశ్వాల్, రుత్రాజ్ ఎంట్రీ -
బ్రాడ్మన్తో సరిసమానమైన గణాంకాలు.. అయినా ఏం ప్రయోజనం..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 ఇన్నింగ్స్ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్మన్తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ కెరీర్లో బ్రాడ్మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి. అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్ను మాత్రం ఎంపిక చేయట్లేదు. బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో భీకరమైన ఫామ్లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో 43 ఇన్నింగ్స్లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు. Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9 Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8 Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz — Mohandas Menon (@mohanstatsman) October 2, 2022 43 ఇన్నింగ్స్ల తర్వాత బ్రాడ్మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్ల్లో బ్రాడ్మన్ 8 సార్లు నాటౌట్గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్గా నిలిచాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు. -
సర్ఫరాజ్ ఇన్నింగ్స్కు ఫిదా అయిన సూర్యకుమార్..
ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళీ టోర్నీల్లో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్.. ఇప్పడు ఇరానీ కప్లో కూడా అదరగొట్టాడు. ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సర్ఫరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇరానీ కప్లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదర్కొన్న సర్ఫరాజ్ 20 ఫోర్లు, 2 సిక్స్లతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ను టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రశసించాడు. సోషల్ మీడియాలో సర్ఫరాజ్ ఖాన్ ఫోటోను సూర్య షేర్ చేస్తూ.. "నీ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఇరానీ కప్ తొలి ఇన్నింగ్స్లో రెస్ట్ ఆఫ్ ఇండియా 374 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో సర్ఫరాజ్తో పాటు కెప్టెన్ హనుమా విహారి 82 పరుగులతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు 276 పరుగుల అధిక్యం లభించింది. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కాగా అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. So so so Proud of you👏 pic.twitter.com/aHtT20LeQY — Surya Kumar Yadav (@surya_14kumar) October 1, 2022 చదవండి: IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా? -
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్తో జరుగుతోన్న ఫైనల్లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన సర్ఫరాజ్.. జట్టు 374 పరుగుల చేయడంలోకీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 937 పరుగులు సర్ఫరాజ్ సాధించాడు. గత రంజీ సీజన్లో కూడా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. అతడు 928 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 23 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 80.4 సగటుతో 2252 పరుగులు చేశాడు. "ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో అతడి ప్రదర్శనలు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అతడు గత ఏడాది భారత-ఏ జట్టు తరపున కూడా అద్భుతంగా ఆడాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 -
సర్ఫరాజ్ సూపర్ సెంచరీ.. ముంబై 374 పరుగులకు ఆలౌట్..!
బెంగళూరు: రంజీ ట్రోఫీ సీజన్లో తొలి మ్యాచ్నుంచి చెలరేగుతూ వచ్చిన ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ ఫైనల్ పోరులోనూ అదే జోరును కొనసాగించాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ (243 బంతుల్లో 134; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో సత్తా చాటాడు. కఠిన పరిస్థితులను అధిగమించి అతను చూపించిన బ్యాటింగ్తో ప్రదర్శనతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్లో సర్ఫరాజ్కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. మరో 2 అర్ధ సెంచరీలు సహా 133.85 సగటుతో సర్ఫరాజ్ ఏకంగా 937 పరుగులు సాధించాడు. గత రంజీ సీజన్ రద్దు రాగా, 2019–20 సీజన్లో కూడా సర్ఫరాజ్ 928 పరుగులు చేశాడు. ఫైనల్లో మరో ఇన్నింగ్స్ ఆడే అవకాశం వస్తే అతను 1000 పరుగులు దాటవచ్చు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ రెండో రోజు గురు వారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 123 పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి (31) అవుట్ కాగా, యశ్(44 నాటౌట్), శుభమ్ శర్మ (41 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరో 251 పరుగులు వెనుకబడి ఉంది. అతనొక్కడే... రెండో రోజు ముంబై తమ ఓవర్నైట్ స్కోరుకు 126 పరుగులు జోడించగా...అందులో సర్ఫరాజ్ ఒక్కడే 94 పరుగులు చేశాడు. 248/5తో ముంబై ఆట కొనసాగించగా, రెండో బంతికే షమ్స్ ములాని (12) వెనుదిరిగాడు. దాంతో జట్టును ఆదుకునే భారం సర్ఫరాజ్పై పడింది. చివరి వరుస ఆటగాళ్లను కాపాడుకుంటూ పట్టుదలగా ఆడిన అతను మధ్యప్రదేశ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థి కెప్టెన్ శ్రీవాస్తవ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని నిలువరించలేకపోయాడు. కార్తికేయ బౌలింగ్లో నేరుగా కొట్టిన ఫోర్తో 190 బంతుల్లో సర్ఫరాజ్ సెంచరీ పూర్తయింది. ఆ సమయంలో గాల్లోకి ఎగిరి భావోద్వేగం ప్రదర్శించిన అతను...ఇటీవల మరణించిన పంజాబీ గాయకుడు మూసేవాలా శైలిలో తొడకొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత తన స్కోరుకు మరిన్ని పరుగులు జోడించిన అనంతరం వేగంగా ఆడే క్రమంలో చివరి వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం మధ్యప్రదేశ్కు హిమాన్షు శుభారంభం అందించాడు. తొలి వికెట్కు 47 పరుగులు జోడించిన అనంతరం హిమాన్షును తుషార్ అవుట్ చేశాడు. అయితే యశ్, శుభమ్ కలిసి క్రీజ్లో పట్టుదలగా నిలిచారు. చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 -
ముంబై జట్టు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్...
Four Mumbai players test positive for COVID 19: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. షామ్స్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి,సాయిరాజ్ పాటిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. ఈ దేశవాళీ టీ20 లీగ్ నవంబరు 4 నుంచి ప్రారంభంకానుంది. ఎలైట్ గ్రూపు-బిలో ఉన్న ముంబై లీగ్ స్టేజ్లో గౌహతిలో మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్హహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఈ నలుగురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐషోలేషన్కు వెళ్లారు. మిగితా ఆటగాళ్లకు నెగిటివ్గా తేలడంతో గౌహతి చేరుకున్నారు. కాగా ముంబై జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహిస్తున్నాడు. ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), ఆదిత్య తారే, శివమ్ దూబే, తుషార్ దేశ్పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, శామ్స్ ములానీ, అథర్వ అంకోలేకర్, ధవల్ కులకర్ణి, హార్దిక్ తమోర్, మోహిత్ అవస్తీ, సిద్ధేష్ పాటిల్, సిద్ధేష్ లాడ్ అమన్ ఖాన్, అర్మాన్ జాఫర్, యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్, దీపక్ శెట్టి , రాయిస్తాన్ డయాస్ చదవండి: T20 World Cup 2021: న్యూజిలాండ్కు మరో బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!