School teacher
-
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారికి టీచర్ బెదిరింపులు
-
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024 -
యల్లనూరులో కీచక టీచర్
యల్లనూరు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపుతుంటారు. అలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ కట్టుతప్పాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను వేధిస్తూ పైశాచికానందం పొందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని చిలమకూరు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా భాస్కర్నాయక్ పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతను 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాకకూడని చోట తాకుతూ వికృతానందం పొందుతున్నాడు. ఈ క్రమంలో విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహం చెందిన వారు.. వారం క్రితం పాఠశాలకు చేరుకుని ఎంఈఓ చంద్రశేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్ను నిలదీశారు. అయితే, విషయం బయటకు తెలియకుండా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు భాస్కర్నాయక్పై డీఈఓ వరలక్ష్మి, మోడల్ స్కూల్ ఏడీ నాగరాజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి విధులకు రావొద్దని ఆదేశించారు. వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని తెలియజేసినట్లు సమాచారం. అయితే, భాస్కర్నాయక్ను విధుల నుంచి తొలగించాలని విద్యారి్థనుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మహేష్ను సంప్రదించగా, వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్ను విధులకు రానివ్వలేదని చెప్పారు. -
టీచర్ల ‘సర్దుబాటు’పై కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవీ మార్గదర్శకాలు.. » ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు (ఎస్ఏ), ఎస్జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి » అర్హత గల మిగులు ఎస్జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్లో సర్దుబాటు చేస్తారు » ఒక స్కూల్లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు » ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు » యూపీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తరగతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు. » కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు » ఎస్ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు రెండు దశల్లో సర్దుబాటు కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇంటర్ మేనేజ్మెంట్ కింద రెండో దశలో డివిజన్ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్జెక్టు ఉన్నవారికి అదే డివిజన్లో, డివిజన్లోని ఇంటర్ సబ్జెక్ట్, ఎస్జీటీలను డివిజన్ పరిధిలో స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. కేడర్ సీనియారిటీలో అత్యంత జూనియర్ను మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు. ఎక్కడ సబ్జెక్టు టీచర్, ఎస్జీటీలు లేరో ఆ స్కూల్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.పాత నిబంధనలే కొత్తగాపాఠశాల విద్యా శాఖ ఆదివారం ప్రకటించిన మార్గదర్శకాల్లో ‘కేడర్ సీనియారిటీ’ మినహా మిగిలినవన్నీ పాతవే. తొలుత ఈనెల 9న ఒకసారి మార్గదర్శకాలు విడుదల చేయగా, ఉపాధ్యాయవర్గాలు పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. పలు సూచనలు చేశాయి. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సర్దుబాటు ప్రక్రియ చేపట్టనుండగా ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో అన్నీ పాతవే ఉన్నాయి. వాటినే కొత్తగా ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, మరెందుకు చర్చలకు పిలిచారని ప్రశి్నస్తున్నాయి. -
కాసరగోడులో లవ్ జిహాద్?
యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్ స్కూలులో టీచర్ అయిన నేహా, యువకుడు తన్వీర్ మిర్థాద్లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది. తాము 25న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్ జిహాద్ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది. -
ML Ashwini: ఆరు భాషలు నిలబెట్టాయి
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది. అశ్విని పరిచయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని. భాషతో గెలిచింది కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను. తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది. ఢిల్లీ వెళ్లాక జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు. కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది. భాష గొప్ప సాధనం: ‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం. -
స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు!
ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించే గలిగే సామార్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంత వరకు సాధ్యమనేది క్లారిటీ లేదు గానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీనే తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడూ టీచర్ అవసరం లేకుండానే క్లాస్లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. ఎలా పాఠాలు చెప్పిందంటే.. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. అక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. దీని నాలెడ్జ్ బేస్లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇది చాట్ జీపీటీ వంటి ప్రోగ్రామ్ల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్ ఎలా పాఠాలు చెబుతుందో అలా అర్థవంతంగా చెప్పగలదు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా విడమరిచి వివరించి చెబుతాడో అలానే అన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్. ఈ మేరకు మేకర్స్ ల్యాబ్ సీఈవో హరిసాగర్ మాట్లాడుతూ.."విద్యార్థులు తమ ల్యాబ్ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. రోబిటిక్స్ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందారు కూడా. అలాగే విద్యార్థుల నుంచి ఈ ఏఐ టీచరమ్మ పట్ల సానుకూల స్పందన వచ్చింది. ఎక్కువ మంది క్లాస్ రూంలో ఈ ఏఐ టీచర్ ఉండే బాగుంటుంది అని తమ అభిప్రాయన్ని వెలిబుచ్చడం విశేషం". అని అన్నారు. (చదవండి: జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!) -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్గా.. అమెరికాలోని అయోవా స్టేట్లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్లకు బిగ్గెస్ట్ క్లయింట్స్గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్లు, స్కిన్కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్లు బ్రాండ్తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!
గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్బోర్డులో నివాసం ఉంటున్న విజయ్మోహన్రెడ్డి(53) మోమిన్మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆనంద్ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్(42) మరికల్లో ఓ హేర్కంటింగ్ షాప్లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్ లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు. ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. -
షాకింగ్: బర్త్ డే రోజు.. విద్యార్థితో బలవంతంగా వాంతిని తినిపించిన టీచర్
పాఠశాలలో విద్యార్థులకు మంచి ప్రవర్తన నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారులకు చదువు చెప్పించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తోడ్పడాల్సిన టీచరే హద్దుమీరి ప్రవర్తించింది. పుట్టిన రోజు నాడే ఓ విద్యార్థితో అతడి వాంతిని తినిపించింది. ఈ షాకింగ్ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్లో సెప్టెంబర్ 15న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలువాన్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నారు. సెప్టెంబర్ 15న తన పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు ధరించి స్కూల్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత.. టీచర్ అతడికి బలవంతంగా గుమ్మడికాయ ముక్కలు తినిపించారు. అప్పటికే బాలుడు ఎక్కువ తినడంతో వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీంతో టీచర్ అతడిని వాంతిని తినాలని ఆదేశించింది. ఇంటికి చేరుకున్న బాలుడు తనకు జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. నర్సరీ టీచర్ ప్రవర్తనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బాలుడికి బలవంతంగా తినిపించడంతోనే వాంతింగ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి తల్లిదండ్రులు పాఠశౄల యాజమాన్యం క్షమాపణలు కోరింది. అదే విధంగా సదరు టీచర్ను విధుల నుంచి బహిష్కరించింది. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్పూర్లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్లో రావడం రాయ్పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు
కథలాపూర్ (వేములవాడ): వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఇక్కడి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో వల్లంపెల్లి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డిప్యుటేషన్పై నియమించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఎనిమిదేళ్లుగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని ఎస్ఎంసీ చైర్మన్ కొక్కుల శంకర్, సర్పంచ్ సింగిరెడ్డి నరేశ్రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి -
ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్తో
అన్నానగర్ (తమిళనాడు): ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో స్కూల్ టీచర్ పరారైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచ్చి జిల్లా కోంబైపూదూర్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ రెండేళ్ల క్రితం నిత్య అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేదు. నిత్య కోంబైపూదూరులోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో నవీన్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు రోజులక్రితం నిత్య అదృశ్యమైంది. ఆమె భర్త పుష్పరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు) -
పాక్లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. -
నిద్ర భంగం చేశారని విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
సాక్షి, హైదరాబాద్: తన నిద్ర భంగం చేశారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి విద్యార్థులను స్కేలుతో చితకబాదాడు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేష్ రేణుకల కుమారుడు ఆశీష్కుమార్ మడ్ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో రవికుమార్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రిస్తున్నాడు. విరామం అనంతరం విద్యార్థులు తరగతి గదికి రాగా శబ్ధం రావడంతో నిద్ర భంగమైందని కోపోద్రిక్తుడైన రవికుమార్ స్కేల్తో పలువురు విద్యార్థులతో పాటు తన టేబుల్ దగ్గర ఉన్న ఆశీష్కుమార్ పిక్కలు, మోకాలి కింది భాగంలో కొట్టాడు. ఈ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. శుక్రవారం స్నానం చేయించే సమయంలో తల్లి నల్లగా కమిలినట్లు ఉండటం గమనించి ఆరా తీయగా ఉపాధ్యాయుడు కొట్టినట్లు తెలిపాడు. పాఠశాలకు వెళ్లి నిలదీయగా తాను కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మిగతా విద్యార్థులు సైతం తమని కూడా కొట్టాడని చెప్పడంతో శుక్రవారం కార్ఖాన పీఎస్లో రవికుమార్పై ఫిర్యాదు చేశారు. -
హెడ్ మాస్టర్ బాగోతం.. హాస్టల్ విద్యార్థినులను ప్రత్యేక క్లాస్ల పేరుతో పిలిచి..
యశవంతపుర(కర్ణాటక): హాస్టల్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ముఖ్యోపాధ్యాయుడికి హాసన జిల్లా అరకలగూడు పోలీసులు బేడీలు వేశారు. అరకులగూడు వసతి పాఠశాలలో 35 మంది విద్యార్థినులు వసతి పొందుతుండగా ముఖ్యోపాధ్యాయుడు శివకుమార్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి లైంగికంగా వేధించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈయన మొత్తం 15 మందిని లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ‘మీ కుమారుడు మా స్కూల్లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’ -
టీచర్ క్రూరత్వం.. విద్యార్థిని స్కూల్ బాల్కనీలోంచి తోసేసి హత్య!
బెంగళూరు: కర్ణాటకలోని గడక్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాది.. పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హగ్లీ గ్రామంలోని ఆదర్శ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. కుటుంబ గొడవలే కారణం.. ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి. అదే పాఠశాలలో పని చేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. భరత్ను చితకబాది బాల్కనీలోంచి బయటకు తోసేశాడని గడక్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి శివప్రకాశ్ దేవరాజ్ తెలిపారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాధితుడు భరత్ తల్లి, అదే పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న గీతా బార్కర్ను సైతం ముత్తప్ప తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య -
పాఠాలు చెప్పాలి కానీ ఇవేం పనులు.. కీచక టీచర్కు బడితపూజ..
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు తమ స్థానం మరిచిపోయి విద్యార్థినిలను వేధింపులకు గురిచేస్తున్నారు. పాఠాలు నేర్పించే క్రమంలో కామకాంక్షను వారిపై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కటకటాల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాడ్రన్ఎయిడెడ్ పాఠశాలలో రమణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పాఠాలు చెప్పే క్రమంలో రమణ.. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, ఆవేదనకు గురైన విద్యార్థినిలు ఈ విషయాన్ని ఇంటి వెళ్లి తమ పేరెంట్స్కు చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రమణకు దేహశుద్ధి చేశారు. టీచర్ రమణకు విద్యార్థులు, టీచర్స్ చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థులు పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణకు పోలీసులు తీసుకువెళ్తున్న క్రమంలో కూడా రమణను విద్యార్థులు పేరెంట్స్ తీవ్రంగా కొట్టారు. అనంతరం, చిరిగిన చొక్కాతోనే రమణను పోలీసులు స్టేషన్కు తరలించారు. -
విమానంలో అద్భుతమైన ఘట్టం...30 ఏళ్ల తర్వాత....
విద్యార్థి జీవితంలో టీచర్లు చాల కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు బోధనతో మన జీవితాలపై చెరగని ముద్ర వేస్తారు. మనం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన చిన్ననాటి ఉపాధ్యాయులను కలవడం అత్యంత అరుదు. అదీగాక బిజీ లైఫ్, పలు పనుల ఒత్తిడితో కలిసే అవకాశం రాకపోవచ్చు. అనుకోకుండా మన చిన్ననాటి స్కూల్ టీచర్ ఎదురుపడితే ఎవ్వరైనా మాటల్లో చెప్పలేనంత ఆనందం తోపాటు ఒక విధమైన భావోద్వేగానికి గురవుతాం. అచ్చం అలానే ఇక్కడొక ఫ్లైట్ అటెండెంట్ ఆ విధమైన గొప్ప అనుభూతిని పొందింది. వివరాల్లోకెళ్తే...కెనడాలోని జెట్ సీఎస్ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూస్తుంది. దీంతో పట్టరాని ఆనందంతో విమానంలోని మైక్రోఫోన్తో ప్రయాణికులను చూస్తూ మాట్లాడుతుంది. ఈ మేరకు ఫ్లైట్ అటెండెంట్ భావోద్వేగంగా మాట్లాడుతూ...."ఈ విమానంలో నా చిన్ననాటి ఉపాధ్యాయురాలు ఉంది. ఆమెను 1990 తర్వాత చూసిందే లేదు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను ఇప్పుడే చూడటం. ఆమె నన్ను షేక్స్పియర్ని ప్రేమించేలా చేసింది. పియానో వాయించేలా చేసింది. అంతేకాదు పియానాలో మాస్టర్స్ చేశాను. ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు ఓకానెల్ అంటూ తన గురువు పేరుని చెబుతుంది." అంతేగాదు చిన్నపిల్లలా ఆనందంతో పరుగెత్తుకుంటూ తన టీచర్ వద్దకు వెళ్తుంది. ఈ ఘటన అనుహ్యంగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజున జరగడం విశేషం. ఈ క్రమంలో సదరు ఎయిర్వేస్ కూడా ఇది చాల అద్భుతమైన క్షణం, టీచర్స్ డే రోజునే దీన్ని మాతో పంచుకున్నందుకు లోరీకి ఆమె టీచర్కి ధన్యావాదాలు అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు కియోనా థ్రాషెర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Keona Thrasher (@vancouver_kthrasher) (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
ముంబై: స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కొని టీచర్ మృతి
ముంబై: స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండేజ్ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్ పూర్తి చేసుకున్న జెనెల్.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్కు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉంది. లిఫ్ట్లోకి ఎక్కి రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే లిఫ్ట్ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్ లిఫ్ట్లో చిక్కుకుంది. బ్యాగ్ను తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకొని జెనెల్ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్గా చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు -
పాఠాలు బోధించే బడిలోనే ప్రాణాలు విడిచింది..
సాక్షి, హన్మకొండ: పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు అలసటగా ఉందని, ఒళ్లు చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయంటూ రెస్ట్ రూంలోకి వెళ్లింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలపడటంతో పాఠశాల శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన మంగళవారం హనుమకొండలోని యాదవనగర్లోని సిద్దార్థ హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ ఇల్లందుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపెల్లి ఉషశ్రీ (45) సుమారు 12 సంవత్సరాలుగా సిద్దార్థ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదంటూనే మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 1గంట సమయంలో ఒళ్లు అలసటగా ఉందని, చేతులు లాగుతున్నాయంటూ తరగతిలో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే సహచర సిబ్బంది ఏమైందని తెలుసుకునేలోగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు పాఠాలు బోధించిన టీచర్ ఇకలేరని తెలుసుకున్న విద్యార్థులు రోదనలు మిన్నంటాయి. చదవండి: (Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు) -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. యూకేజీ విద్యార్థిపై లైంగిక దాడి
సాక్షి, చెన్నై: భార్య పేరుతో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తూ నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది. ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్ కామరాజ్ తరచూ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో కామరాజ్ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మురగేష్ పాఠశాల టీచర్ కామరాజ్ను సస్పెండ్ చేశారు. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్లో 8వ తరగతి విద్యార్థిని అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించింది. అంతేగాక క్లాస్లో అల్లరి చేయడం గమనించిన టీచర్ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది. దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపం చెందిన విద్యార్థిని.. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని అత్మ హత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు విగతా జీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే టీచర్ మందలించడం వల్లే అక్షయ చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మరణానికి స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాప బంధువులు ఆగ్రహంతో స్కూల్పై రాళ్ల దాడి చేయడంతో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, కృష్ణా: విద్యార్థినులకు తండ్రి స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే లెక్క తప్పాడు. పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు. 9, 10 తరగతులకు గణితం బోధిస్తారు. పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థినులతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తాకరాని ప్రదేశాల్లో చేతులు వేస్తున్నారు. రోజూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హెచ్ఎం సుధారాణికి ఫిర్యాదు చేసి ఘటనపై నిలదీశారు. హెచ్ఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఉడాయించటంతో దీనిపై తల్లిదండ్రులు ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడుపై అసభ్యకర ప్రవర్తన, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. హెచ్ఎం పైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. ఎంఈఓ కనకమహాలక్ష్మి, రూరల్ ఎస్ఐ రమేష్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈఓ కనకమహాలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయుడు సాయి బాబును సస్పెండ్ చేస్తూ డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
స్టూడెంట్తో మేడమ్ మసాజ్.. వేటు
లక్నో: పాఠాలు నేర్పే గురువులు తమను వదిలి వెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం.. చూస్తున్నాం. అదే సమయంలో ఆ వృత్తికి కళంకం తెస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టూడెంట్స్లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. సదరు టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ హర్దోయ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉర్మిలా సింగ్ ఆ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పని చేస్తోంది. వీడియో వైరల్ అయిన వెంటనే ఆమెపై వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వీడియో తనదాకా వచ్చిందని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు హర్దోయ్ విద్యాధికారి బీపీ సింగ్. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను స్కూల్ నుంచి తొలగిస్తేనే.. తమ పిల్లలను బడికి పంపుతామంటూ ధర్నా చేపట్టారు అక్కడ. Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ — Grading News (@GradingNews) July 27, 2022 ఇదీ చూడండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’ -
Photo Feature: వెనుక ‘బడి’..
జగదేవ్పూర్ (గజ్వేల్): ఆ గ్రామ ప్రభుత్వ బడిలో విద్యార్థులున్నారు.. కానీ చదు వు చెప్పేందుకు ఉపాధ్యాయుడు లేరు. ఇదీ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండ లం నిర్మల్నగర్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాలలో 30 మందికి పైగా పిల్లలున్నా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేరు. దీంతో డిప్యుటేషన్పై ఒక ఉపాధ్యాయుడిని ని యమించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ శ్యామలరాజు, గ్రామస్తుల సహకారంతో రెండేళ్లుగా ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పించారు. పాఠశా లలు పునఃప్రారంభమయ్యాక డిప్యుటేషన్ ఉపాధ్యాయుడు మొదటి రోజు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత నుంచి రాకపోవడంతో కొందరు పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరారు. మరికొందరు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక ఇబ్బందిగా ఉందని, విద్యావలంటీర్ను ఏర్పాటు చేసి పాఠశాలను నడిపిస్తామని చెప్పారు. -
Viral Video: వావ్ అమేజింగ్.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్!
టీచర్లంటే స్ట్రిక్ట్గా ఉంటారు. పిల్లలకు చదువు చెప్పడం.. హోం వర్క్ చేయకుంటే దండించడం వారి విధి. టీచర్ ముందు విద్యార్ధులందరూ డిసిప్లెన్గా ఉండాలి. ఈ విషయాలే మనకు బాగా గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఓహో టీచర్లు పిల్లలతో ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా తప్పదు. ఇంతకీ విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినితో కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే డ్యాన్స్ చేసింది. పిల్లలందరిలో ఓ విద్యార్థి ముందుకు వచ్చి హర్యాన్వీ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇంతలో పక్కనే ఉన్న టీచర్ మను గులాటీ.. విద్యార్థినితో కలిసి కొన్ని స్టెప్పులు వేశారు. విద్యార్థినిని అనుకరిస్తూ చాలా అందంగా డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో క్లాస్లోని మిగతా స్టూడెంట్స్ చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. చదవండి👉బాయ్ఫ్రెండ్పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్లో లవర్ Students love to be teachers. They love role reversal. "मैम आप भी करो। मैं सिखाऊंगी।" English lang teaching followed by some Haryanvi music- A glimpse of the fag end of our school day.☺️💕#MyStudentsMyPride #DelhiGovtSchool pic.twitter.com/JY4v7glUnr — Manu Gulati (@ManuGulati11) April 25, 2022 దీనిని స్వయంగా టీచర్ ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘వావ్ అమేజింగ్. అద్భుతంగా డ్యాన్స్ చేశారు. టీచర్లు విద్యార్థులతో ఇలా కలివిడిగా ఉంటూ బోధించడం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి టీచర్లు ఉంటే బాగుంటుంది. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి👉 సెలవు కావాలని వైరల్ లేఖ -
సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా?
కేవీపల్లె(అన్నమయ్య జిల్లా): ‘సారూ.. మేము పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. మీరు పని చేయిస్తే ఎలా?’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులకు తాళం వేశారు. ఈ సంఘటన మారేళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆవరణలో స్టేజీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయులు గంగాధరం, ఉపాధ్యాయులు భావించారు. బుధవారం విద్యార్థులతో గుణాతం తవ్వకం పని చేపించారు. గురువారం నిర్మాణానికి అవసరమయ్యే కట్రాళ్ల కోసం వారిని ఓ బండకు పంపించి ట్రాక్టర్కు లోడు చేయించారు. సిమెంట్ బస్తాలను ఆటోకు లోడు చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెంది పాఠశాల వద్దకు వచ్చారు. స్థానిక సర్పంచ్ మధుసూదన్రెడ్డి సహకారంతో శుక్రవారం తరగతి గదులకు తాళాలు వేశారు. తమ బిడ్డలతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయరాదని డిమాండ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులను నిలదీశారు. గురువారం హెచ్ఎం గంగాధరం లేకపోయినా, ఆయన ఆదేశాల మేరకే పిల్లలతో పని చేయించామని ఇన్చార్జి హెచ్ఎం వెంకటసుబ్బయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పి తాళాలు తెరిపించారు. అనంతరం విద్యార్థులకు ఆలస్యంగా సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై ఎంఈవో రెడ్డిబాషాను వివరణ కోరగా విచారణ జరిపి డీఈవోకు నివేదిక పంపిస్తామని తెలిపారు. పిల్లలచే పని చేయించడం అన్యాయం మా పిల్లలతో పని చేయించడం అన్యాయం. మేము కష్టపడి పిల్లలను బాగా చదివించుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. అయితే ఎర్రటి ఎండలో బండపైకి పంపించి కట్రాళ్లు ట్రాక్టర్కు లోడు చేయించడం ఎంత వరకు సమంజసం. పాఠశాల పేరెంట్స్ కమిటీకి ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేదు. – రమణయ్య, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ -
స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్! అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు. చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
మెదక్: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది. అలుముకున్న విషాదం శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. -
TS Schools:ఈ ఏడాదీ విద్యావలంటీర్లు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది కొత్తగా చేరారు. అయితే ఉపాధ్యాయుల కేటాయింపులో ఈ లెక్కను కొలమానంగా తీసుకోలేమని పాఠశాల విద్యాశాఖ నిక్కచ్చిగా చెబుతోంది. విద్యార్థుల పెరుగుదలపై ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదిక అంద జేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొంది. తెలంగాణవ్యాప్తంగా 42,575 స్కూళ్లుం టే, ఇందులో 30,001 ప్రభుత్వ, 702 ప్రభుత్వ ఎయిడెడ్, 11,688 ప్రైవేటు, 184 ఇతర యాజ మాన్యాల స్కూళ్లున్నాయి. వాస్తవానికి గతేడాది ప్రభుత్వ స్కూళ్లలో 28,37,635 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 22,26,329 మంది హాజరవుతున్నట్టు తెలిసింది. మిగిలిన ఆరు లక్షల మంది విద్యార్థులు ఇంకా పాఠశాలలకు, వసతి గృహాలకు రావాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలకు వస్తున్న వారిలో కొత్తగా చేరిన వారి సంఖ్య దాదాపు 2.5 లక్షలు. వీళ్లంతా ప్రైవేటు స్కూళ్ల నుంచే వచ్చి నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులనూ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీసం విద్యా వలంటీర్లనైనా నియమించాలనే డిమాండ్ తెరమీదకొచ్చింది. వాళ్లుంటారా..? ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వల్ల అక్టోబర్ చివరి వరకూ ప్రైవేటు స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. స్కూళ్లు తెరిచినా ఊళ్లకెళ్లిన పేద, మధ్య తరగతి వర్గాలు తిరిగి పట్టణాలకు రాలేదు. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఫీజులు కట్టేందుకు వెనకాడుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎక్కువ మంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించారు. దీనివల్లే సర్కారీ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అంటు న్నారు. ప్రతీ ఏడాది మాదిరే ఈసారీ కొంతమంది ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటుకు వెళ్లారని అధికా రులు తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలోనూ తమ వద్దే ఉంటారన్న నమ్మకం ఏమిటనే సందేహం విద్యాశాఖ వ్యక్తం చేస్తోంది. అందువల్లనే హేతుబద్ధీకరణ ప్రక్రియను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఏడాదంతా ఇంతేనా? రేషనలైజేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ గత ఆగస్టులోనే విడుదల చేసింది. వాస్తవ సంఖ్య తెలిస్తేనే ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణ సాధ్యమంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతుల విషయంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఈ తరగతుల మధ్యే ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు రేషనలైజేషన్ సాధ్యం కాదని చెప్పింది. దీన్నిబట్టి విద్యా వలంటీర్ల నియామకం కూడా సరైంది కాదంది. ఈ ఏడాది మొత్తం స్థానిక సర్దుబాటు ద్వారానే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్నిబట్టి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయుల సర్దుబాటే తప్ప, ఎలాంటి మార్పునకు అవకాశం లేదని విద్యాశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. -
పాఠం చెప్పమంటే పాట పాడుతున్న మాష్టారూ..!
యడ్లపాడు(గుంటూరు): ఆ మాష్టారూ ఎక్కడ ఉన్నా..విద్యార్థులు స్కూల్కు డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఆ బడిలో పుస్తకాలు తెరిచి పాఠాలు చెప్పరు..కాని అక్కడి పిల్లలకు ఆ పుస్తకాల్లోని పాఠాలన్నీ కంఠోపాఠం అవుతాయి. ప్రాథమిక విద్యాబోధనను కొందరు పిల్లల వేలుపట్టి రాయించి నేర్పిస్తారు. మరికొందరు బట్టీ పట్టిస్తారు. ఇంకొందరు బొమ్మలతో బోధన చేస్తారు. ఆయన వీటన్నింటికీ భిన్నం. అదేమని ప్రశ్నిస్తే..పాఠం ఎలా బోధించామన్నది కాదు వాటిని ఎంత శ్రద్ధగా విని పిల్లలు గుర్తుంచుకున్నరన్నదే ప్రధానమంటారు. బడి అంటే భయం..పాఠం రాలేదనే టెన్షన్ లేకుండా చెప్పడమే తన లక్ష్యం అంటారు. పాఠం పాటయితే.. ఆయన తరగతి గదికి పాఠ్యపుస్తకం బదులుగా పాటల పుస్తకం తీసుకువస్తారు. అతని చేతిలో చాక్పీస్కు మారుగా స్మాల్మైక్ ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన గొంతునుంచి ట్రాక్మ్యూజిక్ సౌండ్తో కమ్మని పాటలు వినిపిస్తాయి. ఆయన గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉందికదూ.. ఆయన స్వరబోధనే అక్కడ సమ్థింగ్ స్పెషల్ అన్నమాట. ఈ వినూత్న బోధకుడు గుంటూరు జిల్లాకు చెందిన పరావస్తు హనుమాసూరి. ఆలోచన అలా అంకురించింది... ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మాస్టారు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం అలవాటు. గుళ్లో ఓ సాయంత్రాన ఏర్పాటైన కార్యక్రమంలో భజన బృందం రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పరిస్థితిని అర్థం చేసుకుని జేబులోని సెల్ఫోన్ తీసి ట్రాక్మ్యూజిక్ ఆన్చేసి తనకు వచ్చిన భక్తిగీతాలను ఆలపించారు. ట్రాక్మ్యూజిక్తో పాడిన ఆయన పాటలకు అర్చకుడితో పాటు భక్తులంతా ఫిదా అయ్యారు. పెద్దవాళ్లనే ఆకర్షించిన ట్రాక్మ్యూజిక్ విధానం గుడితో పాటు బడిలోనూ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన అంకురించింది. పాటలతో పాఠాలబోధన ప్రస్థానం ఇక్కడి నుంచే... సూరి మాష్టారు పాటల ద్వారా పాఠాలను బోధించే స్వర ప్రస్థానాన్ని యడ్లపాడు మండలం నుంచే ప్రారంభించారు. కొండవీడు హెచ్డబ్ల్యూ స్కూల్కు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చారు. కాలనీ వాసుల్లో అత్యధికశాతం నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు కావడంతో పట్టించుకునే వారులేక పిల్లలు బడికి రావడం కష్టమైంది. పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లల్ని బడిబాట పట్టించాలనే ఆలోచన, అవ్వేషణలోనే గుడిపాట బడికి చేరింది. మైండ్ట్యూనింగ్ ఇదుగో ఇలా.. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వివిధ సినిమా పాటలుగా మార్చుచేసి గానం చేస్తారు. స్కూల్ ప్రారంభ దశలో పేరడీ పాటలు పాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఆకర్షిస్తారు. తర్వాత పాఠాలను వాడుక భాషలో బాగా అర్ధమయ్యేలా చిన్నచిన్న పదాలుగా తర్జుమా చేసి పాడేస్తారు. రోజు పాఠశాలకు వస్తూ తన సెల్ఫోన్లో ఏదోఒక సినిమా పాటకు సంబంధించిన మ్యూజిక్ట్రాన్ను ఎంచుకుని రావడం, ఆరోజు చెప్పాల్సిన పాఠాన్ని ఆ ట్రాక్లో పాడటం, పిల్లలచే పదేపదే పాడించడంతో విద్యార్థులకు కంఠోపాఠం అవుతాయి. దీంతో పాఠం శాశ్వతంగా గుర్తుండమే కాదు, తరచు అందరితో కలిసి పాడటంతో స్టేజీఫియర్ కూడా పోతుంది. అన్నింటికి మించి పిల్లల్లో ఉత్సుకత, ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిపాఠం పదమై, చిన్నగొంతులో స్వరమై వారి పెదాలపై లయబద్ధంగా నాట్యం చేస్తుంది. 500లకు పైగా పేరడీ పాటలు... మాట గుండెల్లో దూసుకెళ్లే తూటా అయితే.. ఆ గుండెగాయాన్ని మాయం చేసే పాట అమృతమే కదా. సూరి మాష్టారూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై రూపొందించిన పాటలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక పేరడీ పాటల్ని రాసి పాడించి నవ్విస్తారు. భక్తి, దేశభక్తి, అభ్యుదయం, మానవీయం కోణాల్లోనూ పాటల్ని నేర్పించి వారిని మంచి క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. సినీ గీతాలను మార్పు చేసి తనకు అనుగుణంగాఇప్పటికీ 500పైగా పాటలు రచించారు. ప్రముఖ కవి పరావస్తు చిన్నయసూరి వంశీయుడే.. నీతి చంద్రిక, బాలవ్యాకరణం, మిత్రలాభం వంటి రచించిన ప్రముఖ కవి పరవస్తు చిన్నయసూరి వంశీయులు హనుమసూరి కావడం విశేషం. మద్రాసులోనిపెరంబుదుర్ స్వస్థలం కాగా వీరి తాతగారు జీయర్సూరి శతాబ్ధాకాలం కిందట బతుకుదెరువు కోసం ఆంధ్రరాష్ట్రానికి కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుకు నలుగురి సంతానంలో సూరి చివరిసంతానం. పెద్దవారు ముగ్గురు కుమార్తెలే. మొదట రెంటచింతల మండలంలోని తుమ్మురుకోటలో ఉన్న వీరి కుటుంబం, ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రానికి మారారు. ఏంఏ బీఈడీ పూర్తిచేసిన సూరి ప్రస్తుతం ఇదే మండలంలోని డోకిపర్రు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలా సేవలు చేస్తున్నారు.. నాన్వెజ్తో వచ్చే ఇబ్బందులు–ఆకుకూరలతో చేకూరే ఆరోగ్యం, స్నేహం విలువ, భారతీయ సంప్రదాయాలు, తల్లిదండ్రులు, గురువులను పూజించడం, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం వంటి అనేక కోణాల్లో సూరి పేరడీ రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతిపాట సినీబాణీ అయినా..సమాజ హితాన్ని కోరే భావం అందులో దాగుంటుంది. తన పాటలు బడి,గుడిలోనే కాదు బంధుమిత్రుల శుభకార్యాలలోనూ పాడుతుంటారు. తన పేరడీ పాటలకు మెచ్చి వారిచ్చే కానుకలు, నగదును అనాధ, వృద్ధాశ్రమాలకు ఇవ్వడం సూరి సేవాగుణానికి నిదర్శనం. అదే తృప్తి..పరవస్తు హనుమాసూరి, ఎస్జీటీ చిన్ననాటి నుంచి సాహీత్యం అంటే ఇష్టం. బహుశ కవి వంశీయులు కావడమే కావొచ్చు. పేరడీ అంటే ఇష్టపడని వారుండరు. కాని అది రాయడం ఒకింత కష్టమే. సాహిత్యంలో విభిన్నం ఉండాలని, అవి భావితరాలకు, సమాజానికి ఉపయోగపడేలా ఉండలన్నదే ఆకాంక్ష. -
టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు
Teacher Expresses Joy Over Pakistan Win Against India Gets Expelled: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్లో స్టేటస్ పెట్టింది. ఇందులో 'మేం గెలిచాం' అంటూ పాక్ ఆటగాళ్ల ఫోటోలు ఉంచింది. ఇది గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లోని ఒకరు మీరు పాక్కు మద్దతిస్తున్నారా అని నఫీసాను ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు..నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును జారీ చేసింది. ఇది కూడా వైరల్ కావడంతో సర్వత్రా దీనిపై చర్చ నడుస్తుంది. చదవండి: T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
సీతానగరం (పార్వతీపురం): మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో బల్లి కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యుల వివరణతో ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గెంబలివారివీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, భోజన నిర్వాహకులు విద్యార్థులను భోజనం చేయనివ్వకుండా నిలువరించారు. ముందు జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 27 మంది విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రిలో 2 గంటల సేపు వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించడంతో ఉపాధ్యాయులు, విద్యారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్వీ రమణ, ఆర్ఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ వీరబాబు పాఠశాలకు చేరుకుని వాకబు చేశారు. ఆస్పత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటలకు టమాటా రైస్ వడ్డించారు. ఈ ఘటనపై తహసీల్దార్ మాట్లాడుతూ సాంబారులో బల్లిపడడం వాస్తవమేనని, ఉపాధ్యాయులు, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో చిన్నారులకు ప్రమాదం తప్పిందన్నారు. -
కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట
సీమా రథీశ్ లెక్కల టీచర్. కేరళలోని కసర్గోడ్ జిల్లా, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం. గత ఏడాది నుంచి కోవిడ్ స్కూళ్ల టైమ్టేబుల్ను, క్యాలెండర్లను తలకిందులు చేసింది. సీమ ఉద్యోగ జీవితం కూడా కొద్దిపాటి ఒడిదొడుకులకు లోనయింది. ఉద్యోగాలు లేని కారణంగా కొందరు, ఆన్లైన్లో ఇంటినుంచి పని చేయడం అనే వెసులుబాటు వల్ల కొందరు పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల బాట పట్టారు. సీమ కూడా భర్తతోపాటు తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి ఊరికే కాలక్షేపం చేయలేదామె. గత ఏడాది నవంబరులో పుచ్చకాయ మొక్కలు నాటింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. ఈ ఎండాకాలం నాటికి ఐదు టన్నుల తియ్యటి కాయలు కాశాయి. కాయలు కేజీ పాతిక లెక్కన అమ్మింది. అమ్మో! ఇంత ధరా!! అని నోరెళ్లబెట్టిన వాళ్లకు ‘ఇది షుగర్క్వీన్ వెరైటీ పుచ్చకాయ. సేంద్రియ ఎరువులతో పండించాను. తియ్యదనంలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మరో కాయ కోసం రాకుండా ఉండగలరేమో చూడండి’ సున్నితంగా సవాల్ విసిరింది సీమ. ఆమె అన్న మాట నిజమే అయింది. కాయలన్నీ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఖర్చులు పోను రెండు లక్షలు మిగిలాయి. పంట పండింది! ‘‘లాక్డౌన్ తర్వాత నేను, మా వారు మా సొంతూరు మీన్గోత్కు వెళ్లాం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నప్పుడు పదిహేను ఎకరాలు సాగుచేసేవాడు. ఇప్పుడు మా అన్న, అమ్మ మా కుటుంబ వ్యవసాయం చూసుకుంటున్నారు. లాక్డౌన్లో మా ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు గమనించిన మా అన్నయ్య ‘వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగానే ఉంటోంది. ప్రయత్నించకూడదూ’ అని సలహా ఇచ్చాడు. సాగు చేయకుండా ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో కలుపుతీసి, రాళ్లు ఏరివేసి, మంచి ఎరువు వేసి సాగుకు అనువుగా మట్టిని గుల్లబరిచాం. నషీద్ అనే స్నేహితుడి సూచన ప్రకారం షుగర్ క్వీన్ రకం పుచ్చమొక్కలు నాటాం. మొత్తం ఐదు లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోగా తొలి పంట ఆదాయం రెండు లక్షలు. ఇప్పుడు బెండకాయ, మిర్చి, ఉల్లిపాయ పంటలు వేస్తున్నాను. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయి పూర్తిస్థాయిలో మా ఉద్యోగాలు గాడిన పడినా సరే... ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తాను. కోవిడ్ చాలా నేర్పించింది. నేను వ్యవసాయం చేయగలనని నాకు తెలియచేసింది’’ అంటోంది సీమ. చదవండి: Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస -
తరగతి గదిలో టీచర్పై హత్యాయత్నం
ఇరగవరం: ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై జానా సతీష్ కథనం ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్కు 2016లో పెళ్లయింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఉపాధ్యాయురాలైన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్ను కలవాలని అడిగాడు. ఆమె క్లాస్రూమ్లో ఉందని చెప్పడంతో క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్ కట్టర్లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై దాడి చేశాడు. విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వన్సైడ్ లవ్.. టీచర్పై కాల్పులు
లక్నో : తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో స్కూల్ టీచర్పై కాల్పులు జరిపాడో యువకుడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 22 ఏళ్ల నీతు యాదవ్ షేర్పట్టిలోని ఓ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది. సుల్తాన్పూర్ఘౌరీకి చెందిన అంకుల్ యాదవ్ బైక్పై ఆమెను వెంబడించాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను అడ్డగించటంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అంకుల్ ఆమెపై పిస్టల్తో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ( సైకో ఫ్రెండ్.. ఇద్దరిని కాల్చిపడేసిన పీజీ విద్యార్థి ) ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారణాసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతోనే అంకుల్ ఈ దారుణానికి తెగబడ్డట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరూ 12 వ తరగతి వరకు ఒకే చోట చదువుకున్నారని తెలిసింది. -
ప్రియురాలు ఆగ్రహించింది..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం(కారేపల్లి): పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన తన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన మండల పరిధిలోని భాగ్యనగర్తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన కుంజా హేమలత ప్రస్తుతం పినపాక మండలం ఐలాపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) ఇకారేపల్లి మండలం భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్ గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ భద్రాచలంలోని ఐటీడీఏ బీఈడీ కళాశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను లొంగదీసుకున్న అశోక్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, కుటుంబ సభ్యులతో హేమలత ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) -
2,894 మంది టీచర్లు, సిబ్బందికి కరోనా..
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 2,894 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,212 మంది టీచర్లు ఉండగా, 682 ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2,27,775 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో 1,51,539 మంది టీచర్లకు కరోనా పరీక్షలు పూర్తికాగా, 2,212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు 92,343 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది ఉండగా, వీరిలో 56,034 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 682 మందికి కరోనా వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ ఆఖరి వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రం కానున్న నేపథ్యంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల బడి బాట రాష్ట్రంలోని ఏడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన పాఠశాలకు విశేష ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని పాఠశాలలను ప్రారంభించారు. అలాగే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం దాదాపు రెట్టింపు అయిందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 8 జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా ఉన్నాకూడా తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పలువురికి కరోనా సోకుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25,866 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. చదవండి: (21వ శతాబ్దపు పౌరులకు టీచర్ను!) వీటిలో 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్లలో చదివే విద్యార్థుల సంఖ్య 59,27,456గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నవంబర్ 23వ తేదీ నుంచి 35 శాతం అనగా 9,127 పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోగా కేవలం 2,99,193 మంది విద్యార్థులు హాజరయ్యా రు. ప్రస్తుతం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలకు వస్తున్న విద్యార్థు ల సంఖ్య పెరుగుతుండటంతో తాజాగా మరో రెండు వేలకుపైగా పాఠశాలలు ప్రారం భమయ్యాయి. దీంతో డిసెంబర్ 3వ తేదీ వర కు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో మొ త్తం 11,296 పాఠశాలలు తెరుచుకున్నాయి. అదేవిధంగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయిం దని చెప్పవచ్చు. ప్రారంభంలో కేవలం 2,99,133 మంది విద్యార్థుల హాజరుకాగా ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగిన 4,88,222కు చేరిందని విద్యా శాఖ పేర్కొంది. చదవండి: (న్యూ ఇయర్ జోష్కు బ్రేక్) ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గడ్చిరోలి, ఉస్మానాబాద్, సాతారా, లాతూర్, షోలాపూర్, చంద్రాపూర్, ధులే, నాందేడ్ జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు తెరుచుకున్నాయి. మరోవైపు అకోలా, యావత్మాల్, జాల్నా, ఔరంగాబాద్, నందుర్బార్, రత్నగిరి, సింధుదుర్గా, వర్దా జిల్లాల్లో 60 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభంకాని జిల్లాల్లో కూడా అక్కడి పరిస్థితులను అనుగుణంగా తొందర్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
స్కూలు టీచర్కు భారీ బహుమతి.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్సిన్హ్ డిసేల్ (32) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి మరీ డిసేల్ ఈ ఘనతను సాదించారు. అంతేకాదు తన ప్రైజ్ మనీని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి విశేషంగా నిలిచారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా తన బహుమతిలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. అంటే మిగతా తొమ్మిదిమంది ఫైనలిస్టులు ఒక్కొక్కరూ 55 వేల డాలర్లు చొప్పున అందుకుంటారు. బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు. డిసేల్ కృషి 2009 లో సోలాపూర్లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం. స్టోర్ రూంగా, పశువుల కొట్టంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్గా తీసుకున్న డిసెల్ పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా డిసేల్ విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్ , ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరడం విశేషం. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ద్వారా వీకెండ్స్లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్కు తీసుకెళతారు. మరీ ముఖ్యంగా తన ఇంటిలో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ ప్రయోగాలతో విద్యార్థులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. కాగా 2014 లో వర్కీ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్లను గౌరవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా డిసేల్ ఎంపికయ్యారు. నైజీరియాకు చెందిన ఒలాసుంకన్మి ఒపీఫా, యూకేకు చెందిన జామీ ఫ్రాస్ట్, ఇటలీ నుండి కార్లో మజ్జోన్, దక్షిణాఫ్రికా నుండి మోఖుడు సింథియా మచాబా, అమెరికాకుచెందిన లేహ్ జుయెల్కే, యున్ జియాంగ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యూన్, మలేషియాకు చెందిన శామ్యూల్ యెషయా, వియత్నాం నుండి హన్హ్ ఫాంగ్ , బ్రెజిల్ నుండి డోని ఇమాన్యులా బెర్టాన్ టాప్ 10లో నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీని 10 సంవత్సరాలలో సమాన వాయిదాలలో చెల్లిస్తుంది -
264 మంది టీచర్లకు కరోనా
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు చేస్తున్న పరీక్షలలో కేవలం మూడు ప్రాంతాల్లోనే 264 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దాటుతుందోనని విద్యాశాఖ అప్రమత్తమైంది. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయా లేదా మళ్లీ ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై కొంత అయోమయం నెలకొంది. అయితే రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్పురే మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు విద్యార్థులను పంపించడం తప్పనిసరేం కాదని వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభమైంది. అయితే ఈ పరీక్షల్లో 264 మంది టీచర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ముఖ్యంగా షోలాపూర్ గ్రామీణ ప్రాంతంలో 178 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. నాసిక్ జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాగ్పూర్ జిల్లాలో 41 మందికి కరోనా సోకింది. ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వందలాది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు వెల్లడవడంతో విద్యాశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో ఇప్పటికే ముంబై, థానేలతోపాటు అనేక ప్రాంతాల్లో పాఠశాలలను మరి కొన్ని రోజులు మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా పాఠశాలలను ఇప్పుడే తెరవద్దని ఈ సంవత్సరం మొత్తం ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలతోపాటు పలువురు విద్యా«ర్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. (భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా? ) నాసిక్లో జనవరిలోనే పాఠశాలలు నాసిక్ జిల్లాలో 2021 జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా ఇన్చార్జీ మంత్రి ఛగన్ భుజ్బల్ అధ్యక్షతన నాసిక్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులకు చేసిన కోవిడ్ పరీక్షల్లో నాసిక్లో ఎనిమిది మందికి, గ్రామీణ ప్రాంతంలో 37 మందికి పాజిటివ్గా తేలింది. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో 2,556 మంది కరోనా రోగులున్నారు. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లకు రావడం తప్పనిసరి కాదు: విద్యాశాఖ సహాయ మంత్రి ప్రాజక్తా తాన్పురే నవంబర్ 23వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రావడం తప్పనిసరికాదని రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్పురే తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవడం కూడా తప్పనిసరేమి కాదని, విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు నవంబర్ 23వ తేదీ నుంచి తెరవనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీపావళి పండుగ అనంతరం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ముంబై, నవీముంబై, థానే, పుణేలతోపాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు డిసెంబర్ నెల వరకు తెరవబోమని ప్రకటించాయి. (కరోనా టీకాపై భారత్ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్) మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పాఠశాలలు తెరువాలా..? వద్దా..? అనే విషయంపై స్థానిక పాలక సంస్థలదే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాఠశాలలు తెరవకముందే ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించుకోవడం అనివార్యం చేసింది. దీంతో పరీక్షలు చేసుకున్న వందలాది మంది ఉపాధ్యాయులకు, సిబ్బందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఇలాంటి నేపథ్యంలో పాఠశాలలకు తమ పిల్లలను పంపే విషయంపై అనేక మంది నిరాకరిస్తుండగా మరి కొందరు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యాశాఖ సహాయక మంత్రి ప్రాజక్తా తాన్పురే పిల్లలను పాఠశాలలకు పంపించడం తప్పనిసరేమి కాదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులల్లో కొంత అయోమయం తగ్గి ఊరట లభించింది. నాగ్పూర్లోనూ బంద్ నాగ్పూర్లోనూ డిసెంబర్ 13వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతారని నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. దీంతో పాఠశాలలు మూసే ఉంచాలని కమిషనర్ నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు ఆదివారం సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశా రు. ఇప్పటి వరకు ముంబైతోపాటు థానే, పుణే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్, నవీముంబై, భివండీతోపాటు రెండు మున్సిపాలిటీల్లో డిసెంబర్ తర్వాతే పాఠశాలలు తెరవాలని ఆయా స్థానిక పాలక సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. -
ట్రావెలింగ్ టీచర్
భారతదేశం నుంచి బహుశా ఆమె ఒక్కర్తే ఈ బిరుదుకు అర్హురాలు. త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం కువైట్లో టీచరుగా పని చేస్తూ అమెరికాకు వెళ్లి 2004లో ప్రపంచంలో అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్లో ‘ట్రావెలింగ్ టీచర్’గా చేరారు. సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగిన ఆ సర్కస్ అమెరికా అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఆ రైలులో కేటాయించిన ఒక గదిలో ఉంటూ 8 ఏళ్లు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు. చెన్నైలో స్థిరపడిన మన్నా ఇటీవల తన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో రాయడంతో అందరూ ఆమెను వెతుకుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన టీచర్ పరిచయం ఇది. కాలు కుదురుగా ఉండని లక్షణం మన్నాకు లాభించింది. ఆమె ఎలాగైతే లోకాన్ని చుడుతూ ఉండాలని కోరుకున్నారో అలాగే చుట్టే అవకాశం దొరికింది. ఒక భారతీయ మహిళ అమెరికాలో ప్రఖ్యాత సర్కస్ కంపెనీలో 8 ఏళ్ల పాటు ఉండి, వారితో పాటు తిరుగుతూ, వారి పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. పెద్ద ఘనత. ఆ ఘనతను సాధించిన వ్యక్తి మన్నా అబ్రహం. ఇటీవల ఆమె తన అనుభవాలను ఒక సోషల్ మీడియా గ్రూప్లో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. అందరూ ఆ అనుభవాల కోసం చెవి ఒగ్గుతున్నారు. పేపర్ ప్రకటన చూసి త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం మొదట చెన్నైలో ఆ తర్వాత కువైట్లో టీచర్ గా పని చేశారు. అయితే అక్కడ కూడా ఉండలేకపోవడంతో 2001లో అమెరికా వెళ్లారు. అక్కడ పాఠాలు చెబుతూ ఉండగా ఒక ప్రకటన ఆమె దృష్టికి వచ్చింది. ‘ఒక సర్కస్ కంపెనీకి ట్రావెలింగ్ టీచర్ కావాలి’ అని ఉంది అందులో. అయితే తర్వాత తెలిసింది ఆ సర్కస్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ కంపెనీ అని. ‘మొత్తం మీద సర్కస్లో పని అని అప్లై చేశాను’ అని గుర్తు చేసుకున్నారు మన్నా అబ్రహం. అమెరికన్ విద్యా చట్టాల ప్రకారం సంచార ఉపాధిలో ఉండే బృందాల పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్య అందాలి. అందువల్ల సర్కస్లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ కావాలి. అలా మన్నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ‘నేను చేరింది 2004లో. అప్పుడు నా వయసు 41. నేను పాఠాలు చెప్పాల్సింది సర్కస్లో పని చేసే కళాకారుల పిల్లలు లేదా సర్కస్లో ప్రదర్శనలు ఇచ్చే పిల్లలు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్ట్లు చెప్పమన్నారు. ఒప్పుకున్నాను’ అన్నారామె. రైలు జీవితం రింగ్లింగ్ బ్రదర్స్ చాలా భారీ సర్కస్. చాలా డబ్బున్న సర్కస్. అందులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో పాటు రకరకాల పనులు చేసే వందల కొద్ది కళాకారులు ఉండేవారు. వారిని, జంతువులను, సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి సర్కస్ కంపెనీ సొంతంగా ఒక విలాసవంతమైన రైలును కొనుక్కుంది. ‘దాని పొడవు ఒక మైలు ఉండేది’ అన్నారు మన్నా నవ్వుతూ. సర్కస్ యజమాని, మేనేజర్లు, కళాకారులు అందరూ దాదాపు అందులోనే జీవితం గడిపేవారు. ‘నాకు ఒక చిన్న గది రైలులోనే ఇచ్చారు. అందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్. కిచెన్ ఉండేవి. నేను భారతీయ వంటకాలు చేసుకు తినేదాన్ని. వాటి కోసం వివిధ దేశాల కళాకారులు నా రూమ్కు వచ్చేవారు’ అంటారు మన్నా. 27 దేశాల జాతీయలు ‘సర్కస్ అంటే ప్రపంచ దేశాల వారు నివశించే ఒక సంత. రింగ్లింగ్ బ్రదర్స్లో 27 దేశాల జాతీయులు ఉండేవారు. చైనా, బ్రెజిల్, రష్యా, చిలీ, కంబోడియా... అయితే అందరు పిల్లలకు ఇంగ్లిష్ బోధన భాషగా అర్థమయ్యేది కాదు. నేను ఇతర సీనియర్ విద్యార్థుల చేత వారితో మాట్లాడించి వారికి కొద్దో గొప్పో నా పాఠాలు అర్థమయ్యేలా చేసేదాన్ని. రైలు ఎక్కడ ఆగితే అక్కడ నాకు కేటాయించిన స్థలంలో ఆరుబయట క్లాసులు నిర్వహించేదాన్ని. రైలు వెళుతున్నప్పుడు పాఠాలు ప్లాన్ చేసుకునేదాన్ని. పిల్లల పుస్తకాలు, పరీక్ష పేపర్లు అన్నీ నా అజమాయిషీలోనే ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు మధ్య మధ్య ఇన్స్పెక్షన్కు ఊడిపడేవారు... క్లాసులు ఎలా జరుగుతున్నాయా అని’ అన్నారు మన్నా. 48 రాష్ట్రాలు అమెరికాలో పుట్టి పెరిగిన వారు కూడా తమ జీవిత కాలంలో అమెరికా అంతా చూడరు. కాని మన్నా అబ్రహమ్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో 48 రాష్ట్రాలు చుట్టేశారు. ‘మా రైలు వెళ్లని రాష్ట్రం లేదు’ అంటారామె. మంచు దిబ్బల మధ్య నుంచి, ఎడారి దారుల నుంచి రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ రైలు ప్రయాణించింది. ‘మేము ఆగిన చోట ఉంచి తెలిసినవాళ్లో స్నేహితులో వచ్చి నాకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించేవారు.’ అన్నారామె. వీడ్కోలు వందేళ్ల క్రితం సర్కస్ మొదలైనప్పుడు దానికి ఉండే ప్రాభవం వందేళ్ల తర్వాత ఏ సర్కస్కూ లేదు. ఒక రకంగా మన్నా సర్కస్లపై చివరి ప్రభావం చూసినట్టు లెక్క. ఆమె రింగ్లింగ్స్లో 2004–2013 మధ్య పని చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. 2017లో ఆ సుదీర్ఘ చరిత్ర ఉన్న సర్కస్ మూతపడింది. ‘సర్కస్ ఒక వింత ప్రపంచం. అక్కడే పుట్టుకలు, చావులు, ప్రేమలు, గుండెకోతలు, కలయికలు, వీడ్కోళ్లు... ఎన్నో. అక్కడ ఉన్న 8 ఏళ్లు నేను ఎన్నో విలువైన అనుభవాలు మూటగట్టుకున్నాను. లోకం తిరగగా నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రతి మనిషి బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని. సర్కస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ఏనుగుల గుంపు నన్ను కావలించుకొని సాగనంపాయి. అది మాత్రం మర్చిపోలేను’ అంటారామె. మన్నా అబ్రహమ్ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన డాక్యుమెంటేషన్ అవుతుంది. ఆ పని చేస్తారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఒళ్లంతా పచ్చబొట్లే.. ఇదేం పిచ్చిరా నాయనా
పారిస్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి వేషధారణ ఎంత సక్రమంగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. టీచర్ ఎంత పద్దతిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటారని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఇక్కడ ఒక టీచర్ మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. చివరికి కంట్లోని గుడ్డు పక్కన ఉన్న పొరను కూడా తొలిగించుకొని టాటూ వేయించుకున్నాడు.. అతని అవతారం చూసిన పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. (చదవండి : పార్లమెంట్లోని బార్లలో పొంగుతున్న బీర్లు) వివరాలు.. సిల్వైన్ అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశంలోని పలైసేలోని డాక్టూర్ మోరే ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. తల నుంచి కాలు వరకు టాటూలు వేయించుకున్నాడు. 35 ఏండ్ల సిల్వైన్ ఆరు సంవత్సారాల వయసున్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దలకు బోధిస్తున్నాడు. దీంతో అతనిని ఫ్రెంచ్ కిండర్ గార్టెన్లో బోధించకుండా విధుల నుంచి తొలగించారు. 'త్వరలో నా ప్రొఫెషన్ను మళ్లీ కొనసాగిస్తా. పిల్లలకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. వారి తల్లిదండ్రులు కూడా నాతో బాగానే ఉంటారు. కాకాపోతే నన్ను దూరం నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నారంటూ' సిల్వైన్ చెప్పుకొచ్చాడు. కాగా సిల్వైన్కు 27 ఏండ్ల వయసు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్పడింది. ఈ 8 సంవత్సరాల్లో అతని చెవులు, నాలుకతో సహా దాదాపు మొత్తం శరీరాన్ని సిరాతో కప్పేశాడు. (చదవండి : ఆర్మేనియా– అజర్బైజాన్ మధ్య ఘర్షణ) -
నిత్య పెళ్లి కొడుకు: స్పందించిన మొదటి భార్య
సాక్షి, విజయవాడ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కట్నం కోసం ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ క్రమశిక్షణ తప్పాడు. ఆగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తూ ముగ్గురు మెడలో మూడుముళ్లు వేశాడు. రెండో భార్య దిశ పోలీసులను ఆశ్రయించడంతో బడిపంతులు బాగోతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవనిగడ్డకు చెందిన శీలం సురేష్ చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2011 లో శాంతిప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తేలేదని ఆమెను వదిలేసి, మొదటి పెళ్లి గురించి చెప్పకుండా 2015 లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కట్నం కింద నాలుగులక్షల రూపాయలు, పది సవర్ల బంగారం తీసుకొన్నాడు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని శైలజతో తెగతెంపులు చేసుకొని 2019 లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి నిలదీసిన భార్య శైలజ ,అత్తలపై దాడి చేశాడు. సురేష్ నయవంచనపై జిల్లా విధ్యాశాఖాధికారితో పాటు దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సురేష్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు పెళ్లిళ్లకు సహకరించిన సురేష్ తల్లిదండ్రులు, అన్నయ్యపై చర్యలు తీసుకోవాలని విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ మోసపోకముందే సురేష్ను అరెస్ట్ చేయాలని రెండో భార్య శైలజ విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. బాధిత భార్యలకు మహిళ సంఘాలు అండగా నిలిచాయి. సురేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అదనపు కట్నం కోసం వేధించాడు : సురేష్ మొదటి భార్య నిత్య పెళ్లికొడుకు సురేష్ బాగోతంపై ఆయన మొదటి భార్య శాంతి ప్రియ స్పందించారు. తనలాగే మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. సురేష్ పై చర్యలు తీసుకోకుంటే మరింతమందిని మోసం చేస్తారని పేర్కొన్నారు. తాను కేసు పెట్టినప్పుడే చర్యలు తీసుకుంటే మరో ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగేది కాదని వాపోయారు. రూ.10లక్షలు కట్నంగా తీసుకొని ఇంకా కావాలని తనను వేధించారని ఆరోపించారు. పుట్టింట్లో ఘనంగా పుట్టిన రోజు జరుపుతానని చెప్పి వదిలేసి కనిపించకుండా వెళ్లాడని చెప్పారు. సురేష్కు పలుకుబడి ఉండటం వల్ల ఏ కేసులోనూ చిక్కకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయమని త్వరలోనే మహిళా కమిషన్ను కూడా కలుస్తానని శాంతిప్రియ పేర్కొన్నారు. -
నిత్య పెళ్లికొడుకుగా మారిన ఓ ప్రధానోపాధ్యాయుడు
-
బడికి రాకపోతే చర్యలే..!
నెల్లూరు (టౌన్): జిల్లాలోని పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడు రోజుల సమయమిస్తామని, ఆలోపు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కావలి, గూడూరు, నెల్లూరు డివిజన్ల వారీగా పాఠశాలలకు రాని ఉపా«ధ్యాయుల వివరాలను ఆయా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు సేకరించారు. జిల్లాలో రెండు వేల మందికిపైగా ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. అయితే వీరిలో దాదాపు వెయ్యి మంది వరకు కంటైన్మెంట్ జోన్లలో ఉండటం, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీరికి పాఠశాలల హాజరుకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మరో వెయ్యి మందికి పైగా టీచర్లు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. వీరికి త్వరలో మెమోలు జారీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం మ«ధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు. -
సార్ రేపటి నుంచి రారని చెప్పడంతో..
సాక్షి, ఆదిలాబాద్: విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు వృత్తిలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం, లేదంటే ఉద్యోగ విరమణ పొందడం సహజం. అయితే, కేవలం మాష్టారుగానే కాకుండా.. పిల్లలతో ఓ స్నేహితుడిలా, మార్గదిర్దేశకుడిగా వ్యవహరించేవారు అరుదు. అలాంటి వారిలో బజార్ హత్నూర్ మండలం ప్రాతమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ ఒకరు. ఆయన నిన్న (ఫిబ్రవరి 29) పదవీ విరమణ పొందారు. శంకర్ సార్ రేపటి నుంచి పాఠశాలకు రారని తోటి ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పడంతో.. పిల్లలు ఆయనను చుట్టూచేరి వెళ్లొద్దంటూ భోరున ఏడ్చారు. విద్యార్థులు తనపట్ల చూపిన ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ కన్నీరు పెట్టారు. (చదవండి: ఉచ్చుకు చిరుత బలి) -
క్లాస్రూమ్లో కర్కశత్వం..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో ఓ విద్యార్థిపై టీచర్ ప్రతాపం చూపించారు. 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో బాలుడి చర్మం ఎర్రగా కందిపోయింది. విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా టీచర్ కర్కశంగా వ్యవహరించింది. అరగంట పాటు తమ బిడ్డను టీచర్ చితక్కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపించారు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. ‘ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీ ఉంది. ఆ రికార్డులను పరిశీలించి టీచర్పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
నట‘రాజకీయం’
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : పట్టణంలోని ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కీచకోపాధ్యాయుడు నటరాజ్పై చర్యలకు మున్సిపల్ ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారు. తోటి మహిళా ఉపాధ్యాయినులను, విద్యార్థినులను లైంగికంగా వేధించగా.. అతనిపై గత ఏడాది డిసెంబర్ 9న పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో కొన్నిరోజులు మెడికల్ లీవ్లో వెళ్లిపోయిన నటరాజ్.. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించగా.. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. వెంటనే నటరాజ్ను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కేవలం బదిలీతో సరిపెట్టారు. బుధవారం అతన్ని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వగా.. వెంటనే నటరాజ్ విధుల్లో చేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి.. నటరాజ్కు అండగా నిలిచే క్రమంలో మున్సిపల్ ఆర్డీ అతన్ని పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు, అక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్న మధుసూదనరాజును ప్రకాశం ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం నటరాజ్ తాను పనిచేస్తున్న ప్రకాశం ఉన్నత పాఠశాల బాధ్యతలు కొత్త హెచ్ఎంకు ఇచ్చి రిలీవ్ కావాల్సి ఉంది. ఇవేమీ పట్టించుకోని నటరాజ్ నేరుగా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లి హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి మధుసూదన్రాజు బుధవారం సెలవుపై వెళ్లగా నటరాజ్ బుధవారం హడావుడిగా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. మధుసూదన్ రాజుకు ఇంత వరకు బదిలీ ఉత్తర్వులు కూడా అందలేదు. ఏకపక్షంగా బదిలీ మున్సిపల్ ఆర్డీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న మధుసూదనరాజు కుమారుడు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో అనంతపురంలోని మానసిక వికలాంగుల పాఠశాలలో చేరి్పంచారు. ఇక్కడే నివాసం ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ సమయంలో కూడా మొదటి ప్రాధాన్యత మధుసూదన్రాజుకే ఇవ్వడంతో ఆయన రోజు అనంతపురం నుంచి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన్ను 800 మందికి పైగా విద్యార్థులున్న ప్రకాశం పాఠశాలకు బదిలీ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ హెచ్ఎంగా బాధ్యతలు నిరి్వహించాలంటే తాడిపత్రిలోనే నివాసం ఉండాలి. తన కుమారుని పరిస్థితి కారణంగా తాడిపత్రిలో నివాసం ఉండలేని స్థితిలో ఉన్న ఆయన ప్రకాశం పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. నటరాజ్ మాకొద్దు నటరాజ్ వ్యవహారం తెలుసుకున్న మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు..ఉపాధ్యాయినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడిని తమ పాఠశాలకు బదిలీ చేయడమేమిటని ప్రశి్నస్తున్నారు. కమిషనర్కు తెలియకుండా సరి్టఫికెట్ జారీ ఎస్సీ, ఎస్టీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటరాజ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు అవసరం కాగా... పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున ఉపాధ్యాయుడు సూర్యనారాయణరెడ్డిని సంప్రదించి ఒప్పించాడు. అయితే పూచికత్తు ఇస్తున్న వ్యక్తి తన నెలసరి జీతం తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంది. ఆ సరి్టఫికేట్ను మామూలుగా డ్రాయింగ్ అధికారి(మున్సిపల్ కమిషనర్) ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న రాధాకృష్ణ శాలరీ సరి్టఫికేట్ను మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్డీ ఉత్తర్వుల మేరకే బదిలీ మున్సిపల్ ఆర్డీ ఆదేశాల మేరకు హెచ్ఎం నటరాజ్ను బదిలీ చేశాం. అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధుసూదన్రాజు ఇప్పటి వరకూ రిలీవ్ కాలేదు. – డి.చెన్నుడు, ఇన్చార్జి కమిషనర్, తాడిపత్రి కమిషనర్ అందుబాటులో లేక... శాలరీ సరి్టఫికెట్ మంజూరు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సూచన మేరకు సర్టిఫికేట్ మంజూరు చేయాల్సి వచ్చింది. – రాధాకృష్ట, హెచ్ఎం, మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల -
వినూత్న ప్రయత్నం.. నెటిజన్లు ఫిదా
స్పానిష్ : బోధన అనేది ఒక గొప్ప కళ. ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే ప్రక్రియనే బోధన. అయితే బోధించడం వేరు.. సులభంగా బోధించడం వేరు. టీచింగ్లో ప్రత్యేకత ఉంటేనే విద్యార్థులు ఆసక్తికరంగా పాఠాలు వింటారు.. అర్థం చేసుకుంటారు. అలా కాదని ఓ ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని మొత్తం పిల్లల ముందు ప్రదర్శించినా ఉపయోగం ఉండదు. ఓ ఉపాధ్యాయుడికి ఎంత మేర జ్ఙానం ఉందని ముఖ్యం కాదు.. ఆ జ్ఞానాన్ని ఏ మేరకు విద్యార్థులకు అందిచారనేదే ముఖ్యం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు వెరైటీగా పాఠాలు చెప్పేందుకు సిద్దపడింది. దాని కోసం ప్రత్యేకమైన డ్రెస్ను వేసుకొని తరగతి గదిలోకి వెళ్తోంది. మరి ఆ టీచరమ్మ ఎవరు.. ఆ డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం. స్పానిష్కి చెందిన వెరోనికా డ్యూక్(43) 15 ఏళ్ల నుంచి టీచర్గా పని చేస్తున్నారు. 3వ తరగతి విద్యార్ధులకు సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను బోదిస్తారు.ఆ టీచర్ అంటే ఆ విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వెరోనికా టీచర్ చెప్పే అనాటమీ క్లాస్ (శరీర నిర్మాణ శాస్త్రం) కోసం విద్యార్ధులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ప్రాక్టికల్. ఆ పాఠం చెప్పేందుకు మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి క్లాస్కి వెళతారు. ఆమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సూట్ ఐడియా ఎలా వచ్చిందంటే.. ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తుండగా చటుక్కున ఓ యాడ్ చూసి.. దాని ప్రభావంతో ఇలా వెరైటీ బోధన చేస్తున్నానని చెబుతోంది వెరోనికా. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థం కావాలంటే ఇలా బాడీ సూట్ ధరించడమే మేలని అంటోంది. పైగా వారికి ఇది తమాషాగా, వింతగా కూడా ఉంటుందని తెలిపింది. మానవ అంతర్గత అవయవాలపై చిన్నారులకు తక్కువ అవగాహను ఉంటుందని, ఇలా చేస్తే వారు సులువుగా అర్థం చేసుకుంటారని ఆమె చెబుతోంది. అనాటమీ సూట్ ధరించి పాఠాలు బోధిస్తున్న వెరోనికా ఫోటోలను ఆమె భర్త మైక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన భార్యకు ఇలాంటి సరికొత్త ఐడియాకు తానెంతో గర్విస్తున్నాని మైక్ అన్నారు. కాగా, వెరోనికా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ పోస్ట్కు స్పందన భారీగా వస్తోంది. వేల కొద్దీ రీట్వీట్లు, 67వేల లైక్లు వచ్చాయి. వెరోనికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. వ్యాకరణ అంశాల్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వంటివి దొర్లినప్పుడు సంబంధిత కార్డ్ బోర్డ్ క్రౌన్లను ధరించి పాఠాలు చెప్పేదట. ఈ సమాజంలో పిల్లలకు బోరింగ్గా, లేజీగా పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారనే అపోహలు తప్పని నిరూపించడానికే ఇలా ఫన్నీగా ప్రయోగాలు చేస్తున్నానని వెరోనికా చెబుతోంది. వృత్తి పట్ల వెరోనికాకు ఉన్న నిబద్ధత, విధేయతకు ఈ ప్రయోగమే నిదర్శనం. -
పోలీసుల అదుపులో కీచక టీచర్
ఏలూరు టౌన్: పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోని వన్టౌన్ బావిశెట్టివారిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఐదవ తరగతి చదువుతున్నారు. ఉపా«ధ్యాయుడు కూరపాటి కిశోర్ వారి పట్ల మధ్యాహ్నం సమయంలో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయాన్ని ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలపటంతో వారు సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులతో కలసి పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీచర్ కిశోర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. -
బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు
సాక్షి, పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూళ్లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
టీచర్పై సామూహిక అత్యాచారం
సిధి/దమోహ్/మోవ్: మధ్యప్రదేశ్లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారం జరగగా, మరో చోట వేధింపులు తాళలేక ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకుంది. రెండు ఘటనలు గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులో కొచ్చాయి. సిధిలో సాయంత్రం స్కూల్ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్కు ఎత్తుకెళ్లి గ్యాంగ్రేప్ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆమె ఇంటికెళ్లి వివరాలను తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, దమోహ్లో 17 ఏళ్ల బాలిక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకులు కొందరు ఆమెను వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
సాక్షి, వరంగల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పు చేస్తే దండించాల్సింది పోయి అతనే తప్పుగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. మట్టేవాడ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు పోశాల శ్రీనివాస్ చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ, పిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక ఇంట్లో చెప్పగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
-
బడిలో అమ్మ భాష లేదు
గీతాంజలి సామాజిక కార్యకర్త, ఎంటర్ప్రెన్యూర్, విద్యావేత్త, ఒడిస్సీ నాట్యకారిణి, రష్యన్ బాలే నర్తకి. వీటితోపాటు కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించారామె. లధాక్లో విద్యా సంస్కరణ బాధ్యతను తలకెత్తుకున్నారు.దాంతోపాటు ఆమె దేశంలోని ప్రతి అమ్మాయికీ కరాటే నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. ‘స్త్రీ సాధికారత సాధన అనేది ఒక కలగా మిగలకూడదు. ఆ కల సాకారం కావాలంటే స్త్రీ... తన మీద జరిగే దాడులను తనకు తానుగానే సమర్థంగా ఎదుర్కోగలగాలి’ అంటారు గీతాంజలి. ఫెయిలవుతున్నది పిల్లలు కాదు కశ్మీర్లోని లధాక్లో పిల్లల మీద... ‘బడికి రార’నే అపవాదు ఉండేది. నూటికి 95 మంది పిల్లలు మధ్యలోనే బడి మానేసేవాళ్లు. ఏడాదంతా బడికి వెళ్లిన పిల్లల్లో కూడా పై తరగతికి పాస్ అయ్యే వాళ్లకంటే ఫెయిల్ అయ్యే వాళ్లే ఎక్కువ. నిజానికి ఇక్కడ ఫెయిల్ అయింది పిల్లలు కాదు, ప్రభుత్వ విద్యావిధానం. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యావిధానం లధాక్ వాసుల భాషకు, స్థానిక సంస్కృతికి పూర్తిగా భిన్నంగా ఉండడమే. దాంతో లధాక్లో విద్యాసంస్కరణకు, ప్రత్యామ్నాయ విద్యావిధానానికి బీజం పడింది. పిల్లలు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములయ్యారు. మంచు స్థూపాలను కడుతున్నారు, కృత్రిమమైన హిమానీనదాలను సృష్టిస్తున్నారు. పిల్లలు ఇష్టపడే ఇలాంటి కార్యకలాపాలే పిల్లల్ని స్కూలుకు దారి వెతుక్కుంటూ పరుగులు తీయించాయి. చిన్న పిల్లలు నీటి కొరతను తీర్చడంలో నిమగ్నమవుతుంటే, పెద్ద పిల్లలు సోలార్ హీటెడ్ మడ్ బిల్డింగ్స్ నిర్మాణంలో నిష్ణాతులవుతున్నారు. దాంతో ఓ యూనివర్సిటీ క్యాంపస్ ఎకో విలేజ్గా మారింది. గీతాంజలి కార్పొరేట్ రంగాన్ని వదిలి లధాక్ దారి పట్టింది ఇలాంటి విద్యాసంస్కరణ కోసమే. లాహోర్ టూ లధాక్ వయా పాండిచ్చేరి ఒరిస్సాలోని బాలాసోర్లో పుట్టిన గీతాంజలి మూలాలు లాహోర్లో ఉన్నాయి. దేశ విభజన సమయంలో గీతాంజలి తాతగారు లాహోర్ నుంచి పంజాబ్కి వచ్చి స్థిరపడ్డారు. ఆమె క్రిస్టియన్ మిషనరీ కాన్వెంట్, కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. పదహారేళ్ల వయసులో పాండిచ్చేరి పర్యటన ఆమె దృక్పథాన్ని మార్చేసింది. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో భారతీయ ఆధ్యాత్మికత సారాన్ని ఒంటపట్టించుకున్నారు. తత్వం, వేదం, ఉపనిషత్తులను చదివారు. ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ తర్వాత భువనేశ్వర్లోని గ్జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబిఏ చేశారు. చదువు పూర్తయిన తర్వాత డెన్మార్క్లో మార్కెటింగ్ విభాగంలో పనిచేశారామె. ఉద్యోగ జీవితం నుంచి మెల్లగా ఎంటర్ప్రెన్యూర్గా మారారు గీతాంజలి. పుషన్ ప్రాజెక్ట్స్ పేరుతో ఇంజనీరింగ్ ఫర్మ్ స్థాపించారు. చెన్నై కేంద్రంగా హీలియోస్ పుస్తక ప్రచురణ సంస్థ కూడా ఆమె మానస పుత్రికే. పాండిచ్చేరిలో ఏయుఎమ్ హాస్పిటల్స్ను సమర్థంగా నిర్వహించారు. ఇన్నింటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా వాటన్నింటికీ దూరంగా వెళ్లి పోయారు. ‘ఇప్పుడు లధాక్ పిల్లల కోసం మంచి భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నానని, అందులో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండబోద’’ని అంటున్నారామె తన నిర్ణయం పట్ల సంతోషంగా. అవసరాలే ఆలోచనలు గీతాంజలి ఇప్పుడు లధాక్లో ‘హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్’(హియల్) విద్యాసంస్థ సీఈవో. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్తోపాటు ఆమె విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. లధాక్లోని పైయాంగ్ గ్రామంలో స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్లో విద్యావిధానాన్ని లధాక్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ‘‘మనదేశంలో మైదాన ప్రాంతంలో భవన నిర్మాణానికీ, లధాక్లో భవన నిర్మాణానికి ఒకటే ఫార్ములా పని చేయదు. మైదాన ప్రదేశాల్లో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా భౌగోళిక సమతుల్యత లేని నేలలకు అనువైన నిర్మాణ విధానాన్ని కరికులమ్లో చేర్చుకోవడం లేదు. అందుకే భౌగోళిక స్థితికి అనుగుణంగా భవన నిర్మాణం చేయడంతోపాటు స్థానిక వనరులే పెట్టుబడిగా చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి అనువైన కోర్సులను కూడా ప్రవేశ పెట్టాం’’ అన్నారు గీతాంజలి. అక్కడ ఇప్పుడు ఎకో రెస్పాన్సివ్ హోమ్స్ కడుతున్నారు. అంటే... లధాక్లోని విపరీతమైన చల్లదనం దృష్ట్యా ప్లస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేటట్లు ఇళ్లను నిర్మించడం అన్నమాట. వరదలు, కొండ చరియలు విరిగి పడకుండా నివారించే ఉపాయాలను కూడా సమ్మిళితం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. ‘‘ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిషింగ్, హెల్త్కేర్ రంగాల్లో అనేక సంస్థల వ్యవస్థాపకురాలిగా, నిర్వహకురాలిగా ఇరవై ఏళ్ల కాలంలో పొందిన సంతోషంకంటే లధాక్లో చేస్తున్న సర్వీస్తో పొందుతున్న ఆనందమే ఎక్కువ’’ అన్నారామె. గీతాంజలి లధాక్ పిల్లలతో ఎంతగా కలిసిపోయారంటే... స్కూలుకి వెళ్లేటప్పుడు తరచుగా లధాక్ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దీనివల్ల పిల్లలు తనను తమలో ఒకరిగా చూస్తారని చెప్పారామె. ‘‘పిల్లలు టీచర్ను, విద్యాసంస్థల నిర్వహకులను సొంత మనుషులుగా స్వీకరించడం చాలా అవసరం. అప్పుడే టీచర్ చెప్పిన మంచిని అనుసరిస్తారు, ఆ విద్యాసంస్థ నియమాలను గౌరవిస్తారు’’ అన్నారు గీతాంజలి. చెన్నై నేర్పిన పాఠాలు గీతాంజలి 2015లో చెన్నైలోని కేంబ్రిడ్జి స్కూల్ సీఈవోగా పనిచేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూలు బాధ్యతలు చూసేవారు. శని, ఆదివారాలు పాండిచ్చేరిలోని హాస్పిటల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘నేను స్కూల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తొలి వారంలో ఆ స్కూల్లో పని చేస్తున్న గణితం, ఫిజిక్స్ టీచర్లు ఉద్యోగం మానేశారు. వాళ్లిచ్చిన నోటీస్ పీరియడ్ అప్పటికి అయిపోయింది, కానీ ఆ లోపు కొత్త టీచర్ల నియామకం జరగలేదు. దాంతో స్కూలు యాజమాన్యం ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా నన్ను కోరింది. కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకునే వరకు పాఠాలు చెప్పకుండా పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు. పిల్లలు నేర్చుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడం పెద్ద నేరం. అలాగని ఏదో ఒక టీచర్కి అడిషనల్ డ్యూటీ వేయడం కూడా అన్ని వేళలా సమర్థనీయం కాదు. అందుకే ఆ పాఠాలను బాగా చదువుకుని, ఒక స్టూడెంట్లాగ ప్రిపేరయ్యి టీచర్గా క్లాస్ రూమ్లో అడుగుపెట్టాను. చెన్నై స్కూల్లో పాఠాలు చెప్పినన్ని రోజులు మా అబ్బాయి ఆర్యన్తో పాటు నేను కూడా హోమ్ వర్క్ చేసేదాన్ని. నిజానికి అప్పుడు వేసిన ఆ అడుగే ఇప్పుడు నన్ను లధాక్కు చేర్చింది. స్కూలు నిర్వహణ నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పాఠాలు చెప్పడం... అలా కాదు. ఏదో మానసిక సంతృప్తి, మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని కలకాలం నిలుపుకోవాలనుకున్నాను. లధాక్లో పరిస్థితులు తెలిసిన తర్వాత నా చదువు, నా ఇష్టాలు, నైపుణ్యాలన్నింటినీ ఏకకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చనిపించింది’’ అన్నారామె. బడిలో అమ్మ భాష లేదు లధాక్... పేరుకి మనదేశంలో భాగమే కానీ జీవనశైలి, సంస్కృతి టిబెట్కు దగ్గరగా ఉంటుంది. భాష వేరు, ఆహారం వేరు, ఆహార్యం వేరు. అక్కడి వాళ్లు లధాకీ భాష మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బడిలో కాలు పెట్టిన చిన్ని మెదళ్లను ఒక్కసారిగా అయోమయం ఆవరిస్తుంది. ఇంటి గుమ్మం వరకు మాట్లాడిన లధాకీ భాషకు తాళం పెట్టి రాష్ట్ర అధికార భాష ఉర్దూలో పెదవి విప్పాల్సిందే. అదే లధాక్ వాసుల జీవితాలను తరాలకు తరాలు వెనక్కు నెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు వేలు సంవత్సరం వరకు అక్కడ మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్ల సంఖ్య ఐదు శాతానికి లోపే. అమ్మానాన్నల బహుమతి మా అమ్మానాన్నలు నాకు ‘నమ్మకం, స్వేచ్ఛ’ అనే రెండు బహుమతులనిచ్చారు. ఏ పిల్లలకైనా అంతకంటే పెద్ద వరాలు మరేవీ ఉండవు. ఉన్నది ఒక్కటే జీవితం, అందులోనే మన ఆలోచనలను, ఆశయాలను నెరవేర్చుకోవాలి. మనల్ని మనం ఎన్నో కోణాల్లో ఆవిష్కరించుకున్నప్పుడే మనలో కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకు లియోనార్డో డా విన్సీనే పెద్ద ఉదాహరణ. ఆ చిత్రకారుడిలో... ఓ గణిత మేధావి, వృక్ష శాస్త్రజ్ఞుడు, ఇంకా గొప్ప తత్వవేత్త కూడా ఉన్నారు. ఒక మెదడులో ఇన్ని రకాల జ్ఞాన సంపద ఉన్నప్పుడు... అవన్నీ ఊరికే ఉండవు. అనుక్షణం ఒకదానితో ఒకటి ప్రేరేపితమవుతూనే ఉంటాయి. కొత్త ఆవిష్కరణలకు బీజం పడేది కూడా అలాంటప్పుడే. హియల్ (హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్) పుట్టుక కూడా అలాంటిదే. ఇందులో మేము అనుసరిస్తున్న విధానం ‘లెర్నింగ్ బై డూయింగ్’. పిల్లలు తామేం నేర్చుకోవాలో దానిని అక్షరాలలో చదువుతూ నేర్చుకోవడంతో సరిపెట్టరు. ఆ పని చేస్తూ నేర్చుకుంటారు. ఇలా చదువుకోవడం వల్ల వాళ్లు పెద్దయిన తర్వాత ఒకరి దగ్గర ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం గడపరు, ఎంటర్ప్రెన్యూర్ మారి సొంతంగా సంస్థను స్థాపించి నిర్వహించుకోగలుగుతారు.– గీతాంజలి,హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్విద్యాసంస్థ సహస్థాపకురాలు శాంతి యోధులు గీతాంజలి హియల్లో అమ్మాయిలకు కరాటే క్లాసులు కూడా తీసుకుంటారు. తాను తయారు చేసిన కరాటే యోధులకు ‘పీస్ఫుల్ వారియర్స్’ అని పేరు పెట్టారు. ఆమె శిక్షణలో తొలి బృందం సర్టిఫికేట్లు అందుకున్నది. వీరి సహకారంతో లధాక్ రీజియన్లోని ప్రతి మహిళకూ కరాటే నేర్పించాలనేది గీతాంజలి ఆలోచన. ‘‘కరాటే ప్రాక్టీస్ అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ అవసరం. రాబోయే పదేళ్లలో దేశంలోని విద్యార్థినులందరూ కరాటే బ్లాక్బెల్ట్ సాధించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరతాను. నలభై ఆరేళ్ల జీవితంలో అనేక ప్రయోగాలు చేశాను, అంతే స్థాయిలో విజయాలనూ సాధించాను. హియల్ విద్యాసంస్కరణ తర్వాత పీస్ వారియర్స్ను దేశమంతటా విస్తరించడం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను’’ అన్నారు గీతాంజలి. – వాకా మంజులారెడ్డి -
కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..
సాక్షి, భువనేశ్వర్ : విద్యా బుద్దులు నేర్పించి భవిష్యత్లో సమాజానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే, తరగతి గదిలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు బజారు మనిషిలా వ్యవహరిస్తే అలాంటి ఉపాధ్యాయులను ఏమనుకోవాలి. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సరిగ్గా అదే జరిగింది. ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న ఎ.రాంబాబు అనే ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనలకు గురి చేసేవాడు. లైంగిక వేధింపులు భరించలేని పదో తరగతి విద్యార్థిని నేరుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందంటే ఆ ఉపాధ్యాయుడు కీచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం గురువారం దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ దుమారానికి విద్యార్థిని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తెరపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ అందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఎ.రాంబాబు విద్యార్థినిల పట్ల కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అభం శుభం తెలియని విద్యార్థినిల శరీరంపై చేతులు వేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ ఎట్టకేలకు పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయుడు రాంబాబుపై 354(ఎ), 509, సెక్షన్ 8, 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బాధిత విద్యార్థిని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం కీచక ఉపాధ్యాయుడి భాగోతం బట్టబయిలయ్యింది. కేసు నమోదు చేసాం... బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణితం ఉపాధ్యాయుడు ఎ.రాంబాబుపై కేసు నమోదు చేసామని ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తెలిపారు. తరగతి గదిలో తమ శరీరంపై చేతులు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో విద్యార్థిని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు 354(ఎ), 509, సెక్షన్ 8, సెక్షన్ 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు క్రింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
టీచర్ పైశాచికం : చదవడంలేదని గొడ్డలితో..
కశ్మీర్ : సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే గొడ్డలితో నరుకుతా’ అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలిపెట్టలేదు. తరగతి గదిలోని మిగతా విద్యార్థుల వైపు చూస్తూ .. ‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’ అని హెచ్చరించాడు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్థానిక నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పైశాచిక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను గురువు కాదు నరరూప రాక్షసుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ వీడియో చూడగానికే భయంగా ఉంది. ఆ సమయంలో ఆ విద్యార్థి ఎంత భయానికి లోనైయ్యాడో ఉహించుకోలేం. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. -
విద్యార్థిని గొడ్డలితో బెదిరించిన టీచర్
-
ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడిపై కేసు
కొండపాక(గజ్వేల్): ఓ ప్రైవేటు స్కూల్లో తోటి ఉపాధ్యాయురాలిని వేధించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైన సంఘటన దుద్దెడలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ అంశంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధి.లోని దుద్డెడలో గల ఓ ప్రైవేటు పాఠశాలల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన పడిగే గణేష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిని కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తుండటంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా గణేష్లో మార్పు రావడం లేదని తెలిపారు. దీంతో మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై పరమేశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడని ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన గండిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయురాలు మనోరమ, హెడ్ మాస్టర్ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పాఠశాలలో పిల్లల ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు సెల్ఫోన్ విసురుకున్నారు. ఆ తర్వాత మనోరమ హెడ్ మాస్టర్పై నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
సాక్షి, విజయవాడ : అనుమానం పెనుభూతంగా మారిన భర్త గర్భిణి అని కూడా చూడకుండా నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి కిరాతకంగా హతమార్చిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలోని ఫకీర్గూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన ముక్కా శైలజ (32) కు గుడివాడ సమీపంలోని జొన్నపాడు గ్రామానికి చెందిన నంబియార్ (35) తో వివాహమైంది. నగరంలోని ఫకీర్గూడెం రావిచెట్టు సెంటర్లో వారు నివాసం ఉంటున్నారు. భార్య బీఎస్సీ, బీఈడీ చదివి నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. ఎమ్సెస్సీ బీఈడీ చదివిన భర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజులు సజావుగా సాగిన వారి సంసారంలోకి అనుమానం అనే భూతం భర్త మనస్సును ఆవరించింది. అప్పటి నుంచి ప్రతి రోజు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకొని ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు ప్రవర్తనపై అనుమానం పెరిగిపోయి, ఆమెను ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకుని అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం బాటిల్లో పెట్రోలు తీసుకువచ్చి ఇంట్లో భద్రపరిచాడు. రాత్రి భోజనాల అనంతరం బెడ్రూంలో నిద్రించిన సమయంలో అదను కోసం వేచి చూసిన భర్త తెల్లవారుజామున 4.45 గంటలకు ముందుగానే తెచ్చుకున్న పెట్రోలును నిద్రిస్తున్న భార్యపై పోసి నిప్పు అంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ కాలిపోయింది. ఆమె మెలకువ వచ్చి అరుపులతో చుట్టుపక్కల వారు రావటంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు భార్యను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలో అతనికి స్పల్ప గాయాలు కూడా అయ్యాయి. దీంతో స్థానికులు మంటలను ఆర్పివేసి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. మృతురాలు మూడు నెలల గర్భవతి అని తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, బంధువుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యాయత్నం చేసింది తానేనని అంగీకరించాడు. దీనిపై సీఐ పి.రామచంద్రరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన ఎస్ఐ దారుణ హత్య..!
రాయ్పూర్ : దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గల రేవలి గ్రామంలో ఆదివారం ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఎస్ఐ కాగా, మరొకరు స్కూల్ టీచర్. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా వివరాల ప్రకారం.. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్ను సీఆర్పీఎఫ్ బెటాలియన్తో సమన్వయం చేస్తూ అరన్పూర్కు బదిలీ చేశారు. అక్కడే ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లాడు. సమాచారం అందుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆ గ్రామంలోకి చొరబడ్డారు. కశ్యప్, జైసింగ్లను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా కూంబింగ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సున్నిత ప్రాంతమైన రేవలి, అరన్పూర్ గ్రామాలు రాయపూర్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాగా, మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన ఇద్దరిలో ఎస్ఐ లలిత్ కశ్యప్ను దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. స్కూల్ టీచర్ మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి : భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి) -
పెళ్లికి నిరాకరించడంతో తరగతి గదిలోనే టీచర్ హత్య
చెన్నై : పెళ్లికి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ను తరగతి గదిలోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్లో విద్యార్ధులకు గణితం బోధించేందుకు స్కూల్కు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై తరగతి గదిలోనే నిందితుడు రాజశేఖర్ దాడి చేశాడు. విద్యా సంస్థకు సమీపంలోనే బాధితురాలి ఇల్లు ఉండటంతో ఆమె ముందుగానే అక్కడికి చేరుకోగా అదును చూసి నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే ఆమెపై నిందితుడు దాడికి తెగబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలేజీలో చదువుకునే సమయం నుంచి నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల కిందట ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లితండ్రులను రాజశేఖర్ సంప్రదించగా వారు అందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
చిన్నారిపై ఉపాధ్యాయుడు అత్యాచారం
-
బాలిక ఉసురు తీసిన లేఖ..
ముంబై : మహారాష్ట్రలోని పందార్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రాసిన లవ్లెటర్తో మనస్థాపం చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికకు దుండగుడు రాసిన లేఖ క్లాస్ టీచర్ చేతికందడంతో ఆమె అందరి ఎదుట బాలికను మందలించింది. బాలిక తల్లితండ్రులను పిలిచి లేఖ విషయం వారికి చేరవేసింది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాధిత విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ తమకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడికి వెళ్లగా తన కుమార్తె ఏడుస్తూ కనిపించిందన్నారు. తమ కుమార్తె చేతిలో ప్రేమలేఖ ఉందని టీచర్ చెప్పగా, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఈ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని తమ బాలిక చెప్పిందన్నారు. అనంతరం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన తమ కుమార్తె సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాలిక మరణించిన కొద్దిసేపటికే వాఖ్రి గ్రామస్ధులు పందార్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మరణానికి కారణమైన గుర్తుతెలియని ప్రేమికుడు ఎవరనేది నిగ్గుతేల్చనున్నారు. -
టీచర్పై ఇనుపరాడ్తో విద్యార్ధి దాడి..
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలకు హాజరుకావడం లేదని,పుస్తకాలు తీసుకురావడం లేదని మందలించినందుకు టీచర్పై ఎనిమిదో తరగతి విద్యార్థి ఇనుప కడ్డీతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన టీచర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సాకేత్ ప్రాంతంలోని వీర్ చందర్ సింగ్ గర్హేల్ ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది రోజులుగా స్కూల్కు హాజరు కానందుకు ఎనిమిదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ చౌధరి మందలించారు. విద్యార్థి బ్యాగ్ను పరిశీలించిన శ్యామ్ సుందర్కు అందులో ఇనుప రాడ్ కనిపించడంతో తీవ్రంగా మందలించి తన టేబుల్పై దాన్ని ఉంచారు. మరోసారి ఇనుప కడ్డీని విద్యార్థి తన బ్యాగ్లో వేసుకోవడంతో ఆగ్రహించిన టీచర్ దాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, విద్యార్థి ఇనుప రాడ్తో దాడికి తెగబడ్డాడు. విద్యార్థి దాడితో టీచర్ కన్ను, చెవు, తలపై గాయాలయ్యాయి. దాడి అనంతరం స్కూల్ ప్రహరీ గోడను దూకి నిందితుడు పారిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విద్యార్థి దాడి చేసేందుకు సిద్ధమై స్కూల్కు వచ్చాడని వెల్లడించారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్..వీడియో వైరల్
-
పోస్టింగ్ అందుకోవలసిన వేళ.. పోలీస్ స్టేషన్కి
జైపూర్ : పోస్టింగ్ ఆర్డర్ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్ దౌసా జిల్లాకు చెందిన జగ్మోహన్ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్ మోహన్ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తోంది. అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్మోహన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్ ఆర్డర్ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర కుమార్ జగ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేంద్ర కుమార్ తెలిపారు. జగ్మోహన్ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్ ఆర్డర్ని పెండింగ్లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్ మోహన్పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సొంత పిన్నిపైనే యాసిడ్ దాడి..
జీడిమెట్ల: స్కూల్ టీచర్పై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జీడిమెట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలికి స్వయానా అక్క కుమారుడు కావడం గమనార్హం. ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా ఆర్ధిక లావాదేవీల కారణంగా గొడవలు జరుగుతుండటమే ఇందుకు కారణంగా పోలీసులు పేర్కొన్నారు...వివరాల్లోకి వెళితే..స్కూల్ టీచర్గా పని చేస్తున్న సూర్యకుమారి తన అక్కకుమారుడైన వెంకటరామ సుబ్రమణ్యంను 12 ఏళ్ల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని పెంచింది. అంతేగాక అక్క,చెల్లెళ్ల కుమార్తెలను ఒకే ఇంటికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నిందితు డి సోదరి హేమలక్ష్మి, ఆమె భర్త అదిత్య మ«ధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ విషయంలో సూర్యకుమారి తమకు సహాయం చేయడం లేదని, ఆర్థికంగా ఆదుకోవడం లేదని వెంకటరామసుబ్రమణ్యం ఆమెపై కోపం పెంచుకున్నాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న అతను గురువారం సా యంత్రం ఆమెపై బాత్రూంలో వాడే యాసిడ్ చల్లి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చేధించిన సీఐ శంకర్ రెడ్డి, సిబ్బందిని బాలనగర్ ఏసీపీ అభినందించారు. -
స్కూల్ టీచర్ యాసిడ్ దాడి కేసులో పురోగతి
-
యాసిడ్ దాడి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుటంబ కలహాల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్లు తేల్చారు. బాధితురాలి దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 12 గంటల్లో యాసిడ్ దాడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. భాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పరిధి చింతల్లో ఉన్న సిద్ధార్థ స్కూల్లో టీచర్గా పనిచేస్తోన్న సూర్యకుమారిపై గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాసిడ్ దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని కూకట్పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నారు. సూర్య కుమారి అక్క కుమారుడే ఈ దాడి చేసినట్లు సమాచారం. -
హైదరాబాద్: స్కూల్ టీచర్పై యాసిడ్ దాడి
-
స్కూల్ టీచర్పై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చింతల్లో ఉన్న సంస్కార్స్కూల్ టీచర్పై ఆసిడ్ దాడి జరిగింది. స్కూల్నుంచి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్ టీచర్ సూర్య కుమారి మొహంపై యాసిడ్ పోయగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కూకట్పల్లి రెమోడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
అయ్యా సారూ.. ఏందీ పాడు పని
పోతవరప్పాడు (ఆగిరిపల్లి) : పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్కు యత్నించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి ఎస్ఐ వి.ఏసేబు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కుమార్తె అదే పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దాసరి గణేష్ బుధవారం బాలికకు మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని అదృశ్యమయ్యాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఏసేబు ఉపాధ్యాయుడు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉపాధ్యాయుడు, మైనర్ బాలిక రాజమహేంద్రవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి గణేష్ను అదుపులోకి తీసుకుని బాలికను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.