staff
-
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల్లో పురోగతి కరువు ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య విచారణ చేయించాలిఏలూరు జీజీహెచ్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్స్టేషన్లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు. మాట వినకుంటే ఉద్యోగం ఫట్ జీజీహెచ్లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
నీళ్లు పోసి నిద్ర లేపుతున్నారు..
-
సర్కారు ఓకే : మరి 26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీల మాటేంటి?
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. 1998కి ముందు 120 మంది... ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది. ఇప్పుడైనా ఆమోదం లభించేనా? ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా వైద్య విధాన పరిషత్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు, నర్సులు, ఇతర మెడి కల్ స్టాఫ్ ప్రభుత్వం ద్వారా నియమించబడి.. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే పనిచేస్తారు. వారికి జీత భత్యాల కోసం ప్రభుత్వమే నిధులిస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కానీ, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించే ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ద్వారా జతభత్యాలు పొందుతూ.. ప్రభుత్వం తర ఫున పనిచేసే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఉద్యోగులు వీరు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా వీరు ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేర బోతున్నది. సుమారు 40 ఏళ్లుగా ప్రభుత్వంలో ప్రత్యేక కేటగిరీగా కొనసాగుతన్న వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వ శాఖగా గుర్తించాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోకి వీవీపీని తీసుకొని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చాలని సంకల్పించింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.సీహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వీవీపీ పరిధిలోనే..రాష్ట్రంలో వీవీపీ పరిధిలో కింగ్కోఠి, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్లు సహా175 వరకు ఉన్నా యి. ఈ ఆసు పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్కు సాంకేతికంగా ప్రభుత్వం నుంచి నేరుగా జీతభత్యాలు అందవు. వీవీపీ కింద సుమారు 11 వేల మందికిపైగా ఉద్యో గులు పనిచేస్తు ండగా, వీరికి చెల్లించే జీతాలకు పే స్కేల్ కనిపించదు. ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏటా కేటాయించే మొత్తాన్ని నెలనెలా వేతనాల కోసం సర్దు బాటు చేస్తారు. తమను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను కలిసి ఈ మేరకు విన్నవించడంతో ఫైలు కదిలింది. త్వరలో ఉత్తర్వులు.. వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా వైద్యారోగ్య శాఖలోకి తీసుకోవాలనే ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం.. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)ని కోరారు. ఆస్కి ఇటీవలే ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. మంత్రి రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నివేదికపై ఇటీవల చర్చించారు. ఆ తర్వాత వీవీపీని వైద్యారోగ్య శాఖలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రోగుల నుంచి వసూలు చేసే యూజర్ చార్జీల నుంచి జీతాలు చెల్లించే విధానాన్ని రద్దుచేసి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో వీవీపీ ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఇప్పటికే వీవీపీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మా పోరాటం ఫలించిందివీవీపీని వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకొని సాంకేతికంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొంతకాలంగా పోరాడుతున్నాం. రెండున్నరేళ్ల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని తీవ్రతరం చేశాం.రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి 12 వేలకు పైగా ఉన్నాం. ప్రభు త్వం వైద్యారోగ్య శాఖలోకి విధాన పరిషత్ను తీసుకోవాలని భావిస్తుండడం శుభ పరిణామం. మా పోరాటానికి ఫలితం దక్కింది. – డాక్టర్ వినయ్ కుమార్, జేఏసీ చైర్మన్ -
ప్రత్యేక ఆఫర్ను ఆమోదించిన ‘జీతం లేని ఆఫీసర్’!
జొమాటో గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ను ప్రవేశపెట్టింది. అందుకు చీఫ్ ఆఫ్ స్టాప్ ఆమోదం లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల జొమాటో సీఈఓ దీపిందర్గోయల్ ఓ ప్రకటన చేస్తూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ.20 లక్షలు సంస్థకు ఇవ్వాలని చెప్పారు. అయినాసరే ఈ ప్రకటన వెలువడిన తర్వాత దాదాపు 10 వేలమంది ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వింత ఉద్యోగ ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందించడంతో జొమాటో సీఈఓ గోయల్ స్పందిస్తూ రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కంపెనీ ప్రారంభించిన గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ ప్రవేశపెట్టేందుకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ పోస్ట్ కోసమే గోయల్ వింత ఉద్యోగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
-
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
స్తంభించిన వైద్యసేవలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్యకళాశాలలో రెసిడెంట్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆ అఘాయిత్యానికి నిరసనగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు 24 గంటల పాటు వైద్యసేవల బంద్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలు స్తంభించాయి. అన్ని జిల్లాల్లోను ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.ఐఎంఏ, పలు వైద్యసంఘాల ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థిసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల వారు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు అనేకచోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్జీ కర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు, అత్యాచారం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరారు. ఇందుకోసం ఓ ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు కూడా దూరంగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ వైద్యులు సైతం అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఐఎంఏ చేపట్టిన ఈ బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. -
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
-
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఏఐఎక్స్ కనెక్ట్తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
మార్గదర్శి సిబ్బందిపై కేసు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖ అకౌంట్ అసిస్టెంట్ వి.లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్ మొదటి లైన్లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్.రమేష్ తెలిపారు. -
విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!
విమాన సిబ్బందిలో మహిళలు పనిచేయాలంటే కచ్చితంగా స్కర్టులు, కోట్లు ధరించాల్సిందే. అందులోనూ లండన్లో అయితే కచ్చితంగా ఆ ఆహార్యంలోనే ఉండాల్సిందే. భారతీయ మహిళలైనా ఆ రూల్స్ పాటించక తపని రోజులవి. కానీ ఓ మహిళ ఆ ఎయిర్ ఇండియా రూల్స్నే తిరగరాసింది. చీరకట్టుతోనే పనిచేస్తామని తెగేసి చెప్పడమే గాక ఉద్యమం చేసి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేసే ప్రతి సిబ్బంది చీరకట్టకునేలా చేసింది. అంతేగాదు రాజకీయాల్లోకి రావడానికి మహిళలు భయపడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన గళం వినిపిస్తూ అంచెలంచెలుగా పైకొస్తూ.. మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నేటితరానికి, భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఎవరీమె అంటే.. ఆమె పేరు బృందా కారత్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించి మరీ ఓషుకోనా సూరజ్ని పెళ్లి చేసుకున్నారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే. బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో మిరిండా హౌస్లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. అప్పుడే ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడాలని సూచించారు. దీంతో ఆమె 1967లో లండన్ వెళ్లి ఎయిర్ ఇండియాలో చేరారు. అయితే లండన్లోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించరు. అందుకు ససేమిరా అని బృందాకారత్ తెగేసి చెప్పడం జరిగింది. ఆ టైంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్. ఆయన కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చీర ధరించేందుకు అనమితించమని చెప్పేశారు. అయితే తాము సమ్మే చేస్తామని నిర్భయంగా చెప్పింది బృందాకారత్. చేస్కోండి! అని ఆయన కూడా తీసిపడేసినట్లుగా అన్నారు. దీంతో ఆమె చీరే కట్టుకుంటాం అనే డిమాండ్తో నిరవధికంగా మూడు రోజు సమ్మే చేసి మరీ ఎయిర్ ఇండియా మెడలు వంచింది బృందా. దెబ్బకి ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్ దిగి రావడమే గాక మీరే విజయం సాధించారు, పైగా ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కరూ చీరకట్టుకునేలా చేశారు అన్నారట. కానీ బృందాకారత్ ఆ మాటలకు పొంగిపోలేదు. ఈ విజయం తనదేనని ఒప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పి ఎయిర్ ఇండియా అధికారిని షాక్కి గురయ్యేలా చేసిందట. ఆమె తన వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పడమేగాక ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు ఆయన. అంతేగాదు అలా ఎయిర్ ఇండియాకు సెలక్ట్ అయిన బ్రిటిష్ యువతులందరికీ చీరకట్టుకోవడం నేర్పించారు బృందాకారత్. అలా ఆమె అక్కడ కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాని రోజుల్లో వామపక్ష రాజకీయాల వైపుకి వెళ్లారు. అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్. అంతేగాదు ఆమె సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య. ఇక బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. “యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే నేటితరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలోని పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు.పైగా ఈ పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నులన్నింటిని చక్కగా వివరించారు. అయితే అందులో ఉన్న రీటీ ఎవరో కాదు బృందాయే అని పుస్తకం చదివిన తర్వాత గానీ తెలియదు. అయితే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలపి పోరాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక తానెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే మాత్రం బృందా..తన వయసు 70 దాటిందని, ఈ వయసులో పరిగెత్తడం సమంజసం కాదని చెబుతుంటారామె. నేటి పరిస్థితులన్ని మార్చాలంటే యువతీ యువకులే నడుం కట్టాలని చెబుతుంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో చూస్తున్నారామె. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
Sajjanar: ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగటం దురదృష్టకరం
సాక్షి, హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని, ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. ‘తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇద్దరు ఫరూక్నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగింది. డ్రైవర్ షేక్ అబ్దుల్కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని సజ్జనార్ తెలిపారు. పదే పదే హెచ్చరిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా #Hyderabad ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్… pic.twitter.com/qSgAk4zTYy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 5, 2024 -
భారత్లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్కు ప్రస్తుతం ఫ్రాన్స్లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్కు యూరప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్కు ఫ్రాన్స్లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!
మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!. అలాంటి వెరైటీ స్టోర్ సియోల్లో ఉంది. దీనిపేరు రామెన్ స్టోర్. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్పే చేసే ఆటోమెటిడ్ మెషిన్లో ఎంటర్ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్ పేయింగ్ అన్నమాట!. ఈ మేరకు ఫుడ్ వ్లోగర్ లిల్లీ హ్యూన్ అనే ఆమె ఆ స్టోర్కి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్, ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్ డిష్లను తాను ఎలా తీసుకుని బిల్ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్ డిష్లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్ ఔట్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Lily Huynh (@biteswithlily) (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న జేపీ మోర్గాన్.. అదేంటంటే?
ఇజ్రాయెల్ - హమాస్ వార్ కారణంగా అక్కడి వాతావరణం భీకర దాడులతో భయానకంగా ఉంది. ఈ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇజ్రాయెల్లోని తన సిబ్బందిని పరిస్థితులు చక్కబడే వరకు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాల్సిందిగా కోరింది. పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ చేసిన ఆకస్మిక దాడి రెండు వైపుల హింసాత్మక సంఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, మిలిమెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశం లేదు. కావున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్వాలా..!! ఇజ్రాయెల్లో జేపీ మోర్గాన్లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో వందల మందికిపైగా మరణించినట్లు, మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రానున్న రోజులు మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. -
బైడెన్ శునకాన్ని వైట్హౌజ్ నుంచి వెళ్లగొట్టిన అధికారులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ శునకం 'కమాండర్' వైట్ హౌజ్లో సిబ్బందిని తరచూ కరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ అధికారిని కరిచి వార్తల్లోకెక్కింది. అయితే.. ఈ శునకాన్ని వైట్హౌజ్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని ప్రదేశానికి ఆ శునకాన్ని పంపించినట్లు వైట్హౌజ్ అధికారులు తెలిపారు. 2021లో కమాండర్ను బైడెన్ వైట్హౌజ్కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కనీసం 11 సార్లు అది సిబ్బందిని కరిచినట్లు వార్తలు వచ్చాయి. బైడెన్ వద్ద అంతకుముందు ఉన్న మేజర్ అనే శునకంపై కూడా ఇదే తరహా కేసులు నమోదు కావడంతో దాన్ని కూడా వైట్ హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే.. ప్రస్తుతం కమాండర్ను ఎక్కడికి పంపించారో వివరాలు మాత్రం బయటికి వెళ్లడించలేదు. కమాండర్ రక్షణలో ఎంతో శ్రద్ధ కనబరిచిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రశంసించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
పారా మెడికల్ సిబ్బంది తొలగింపునకు కుట్ర
ముషీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని తొలగించి ఆ శాఖను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద వేలాది మందితో భారీ ధర్నా తలపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, ఏరియా ఆస్పత్రులు, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సరిపడినంతమంది సిబ్బందిని నియమించకుండా.. ఉన్నవారిని కుదించడానికి కుట్ర పన్నుతూ జీవో 142ను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుని కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే పారా మెడికల్ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. -
గర్ల్ఫ్రెండ్తో గొడవ.. ఎమ్మెల్యే నివాసంలో సిబ్బంది ఆత్మహత్య
లక్నో: ప్రియురాలితో గొడవపడి బీజేపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. శ్రేష్టా తివారీ అనే 24 ఏళ్ల యువకుడు లక్నోలోని బక్షి కా తలాబ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా వద్ద మీడియా సెల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు రావడంతో దూరం పెరిగింది. ఈ క్రమంలో శ్రేష్టా తివారీ ఆదివారం హజ్రత్గంజ్లోని ఎమ్మెల్యే నివాసంలో ఉండగా.. తన ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ప్రేయసికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయన్ని గుర్తించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. అలాగే ఆమె కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే తలుపులు లోపలి నుండి లాక్ చేయడంతో ఎంత కొట్టిగా డోర్స్ తీయలేదు. చివరికి పోలీసులు చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా.. తివారీ శవమై కనిపించాడు. అయితే ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఫ్లాట్లో తివారీ ఒంటరిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ పాండే పేర్కొన్నారు. తివారీ తన గర్ల్ఫ్రెండ్కు కి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని, కావున ఆమె మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్గా, కేన్సర్ స్పెషలిస్ట్గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్లో చూసి ‘నేను ట్రావెలింగ్ని ఇష్టపడతాను. యూరప్కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
Telangana Cabinet Meeting: కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఆర్అండ్బీ, రవాణా, కార్మిక, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వివిధ పనులు, కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది. వరద మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. సుమారు 50కిపైగా అంశాలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సహచర మంత్రులతో కలసి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రవాణా, ఆర్థిక శాఖల మంత్రులు, ఆర్టీసీ చైర్మన్తోపాటు కార్మికుల నుంచి వచి్చన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఆరీ్టసీని కాపాడేందుకు, ప్రజారవాణాను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. వరద తక్షణ సాయంగా రూ.500 కోట్లు రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఆర్అండ్బీ/ పంచాయతీరాజ్ రోడ్లు, చెరువులు, కాల్వలు, పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆదేశించినట్టు వివరించారు. ఇక వివిధ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు తరలించిన 27వేల మంది ముంపు బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వరదల్లో మృతిచెందిన 40 మందికిపైగా వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదలతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఇతర సమస్యలపై సమగ్రమైన నివేదిక అందించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించిందని.. రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించిందని వివరించారు. ఖమ్మం పొడవునా ప్రవహిస్తున్న మున్నేరువాగు వరద నుంచి పట్టణానికి రక్షణకోసం వరద గోడలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారి సేవలు భేష్.. వరద ముప్పును సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ధైర్య సాహసాలతో విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్మన్, హెల్పర్తోపాటు ముందుచూపుతో 40మంది విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుడు మీనయ్యను ఈ పంద్రాగస్టు సందర్భంగా సన్మానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారి సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావించి కొనియాడారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అనాథల కోసం ప్రత్యేక పాలసీ రాష్ట్రంలోని అనాథ పిల్లలను ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్’గా గుర్తిస్తూ.. వారి సంరక్షణ, ఆలనా పాలన చూసుకోవడానికి పకడ్బందీగా ‘అనాథ బాలల పాలసీ’ని రూపొందించాలని శిశుసంక్షేమ శాఖను కేబినెట్ ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు తల్లిదండ్రులుగా నిలుస్తుందని.. ఆశ్రయం క ల్పిం చి, ప్రయోజకులుగా మార్చి, వారికంటూ ఓ కుటుంబం ఉన్నట్టుగా సంరక్షిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలివీ.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని కార్మిక శాఖను కేబినెట్ ఆదేశించింది. వరంగల్లోని మామునూరులో విమానాశ్ర యం నిర్మాణానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కోరిన మేరకు 253 ఎకరాల భూమి ని సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. బీదర్ తరహాలో ఇక్కడ విమానాశ్రయం నిర్వహించాలని, ఇకపై కుంటిసాకులు చెప్పవద్దని అథారిటీకి మంత్రి కేటీఆర్ సూచించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. ఇతర నగరాల తరహాలో హైదరాబాద్లోనూ రెండో ఎయిర్పోర్టు అవసరమని మంత్రివర్గం అభిప్రాయపడింది. పుణె, గోవాలలో రక్షణ రంగ విమానాశ్రయాలను పౌర విమానాశ్రయాలుగా విని యోగిస్తున్న తరహాలోనే హకీంపేట ఎయిర్పోర్ట్ను పౌర విమానయాన సేవలకు వినియో గించాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రక్షణ, పౌరవిమానయాన శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ వంటి కాపు అనుబంధ కులాల కోసం ‘సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారమైందని కేటీఆర్ చెప్పారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ క ళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వరదల్లో చనిపోయినవారిలో రైతు బీమా ఉన్న వారికి రూ.5 లక్షల సొమ్ము ఆటోమెటిగ్గా వస్తుందని, మరో రూ.4లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ వేసేలా చూస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టును ఆమె సందర్శించారు. కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి మొక్క నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కోర్టులో అదనంగా రెండు ఫ్లోర్లు నిర్మించాలని, సిబ్బందిని నియమించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న 7 వేల కేసుల పరిష్కారానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, లేబర్ కోర్టును మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొండ్రాల అశోక్ పోర్టుఫోలియో కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ, సూర్యాపేట జిల్లా కోర్టుకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రధాన న్యాయమూర్తి తన దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి కె.శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు కామిశెట్టి సురేశ్, జె.ప్రశాంతి, శ్యాంసుందర్, మారుతి ప్రసాద్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలేబోయిన నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు. -
‘భరోసా’ మరింత పెంచేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న భరోసా కేంద్రాల్లో బాధితులకు భరోసా మరింత పెంచడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలకు సాయం కోసం వచ్చిన బాధితుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. లైంగికదాడులు, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికలో పోలీస్, న్యాయ, వైద్య సాయం అందించేందుకు రూపొందించిన ఈ కేంద్రాల్లో.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? సకాలంలో స్పందిస్తున్నారా? ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? భరోసా సెంటర్కు అదే రోజు తీసుకెళ్లారా? మీతో లేడీ కానిస్టేబుల్ వచ్చారా? పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లారా? భరోసా సెంటర్లో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? కేసుల ఫాలోఅప్ సక్రమంగా ఉంటోందా? లైంగిక దాడులకు గురైన చిన్నారుల విషయంలో కేంద్రాల సిబ్బంది సరైన రీతిలో స్పందిస్తున్నారా? సేవల్లో ఇంకేమైనా లోపాలున్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఇంకా ఏయే చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు కూడా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
షావోమి కూడా రంగంలోకి: ఆందోళనలో ఉద్యోగులు
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా? -
బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. టీఎస్ఆర్టీసీ మానవత్వం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసీ)కు ప్రయాణీకులు దైవంతో సమానమని, టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే కాదు వారిపట్ల మానవత్వంతో వ్యవహరించడంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం శుభపరిణామమని ఆయన కొనియాడారు. బస్సులో గుండెపోటుతో మరణించిన ఓ ప్రయాణికుడి మృతదేహాన్ని మానవతా దృక్ఫథంతో వ్యవహరించి అదే బస్సులో ఇంటికి చేర్చిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను శనివారం హైదరాబాద్లోని బస్భవన్లో అయన అభినందించారు. ప్రత్యేకించి ఆ సమయంలో చొరవ తీసుకున్న మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ ను కూడా ప్రశంసించి శాలువా, ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక బహుమతి అందించి వారి సేవలు ప్రశంసనీయమన్నారు. బస్సులో మృతదేహాన్ని తరలించడంలో పెద్దమనసుతో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే గుణం సిబ్బందిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివరాల్లోకి వెళితే, మహబుబాబాద్ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్కు 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్(57), బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. దీంతో కండక్టర్, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కండక్టర్, డ్రైవర్ల చొరవ అభినందనీయమని, సంస్థ వారిని చూసి ఎంతో గర్విస్తోందని సంస్థ ఎండీ సజ్జనర్ చెప్పారు. టిఎస్ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావంతో వ్యవహరిస్తున్న సిబ్బందికి సంస్థలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. -
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
రూ.2 వేల నోటు ఎఫెక్ట్.. స్కూటీ నుంచి పెట్రోల్ తిరిగి తీసుకున్నాడు!
లక్నో: దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ. 2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30వ వరకు ఈ నోట్లు చలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్ల మార్పిడికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూలైన్, కేవైసీ అంటూ గంటల సమయం పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బంగారం కొనుగోలు, షాపులో వస్తువుల కొనుగోలు ద్వారా 2 వేల నోటు మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకొందరైతే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఇచ్చేసి తమ వస్తువులను మళ్లీ వెనక్కి కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్కు వెళ్లి తన స్కూటీలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బంకులోని సిబ్బందికి తన వద్ద ఉన్న రూ. 2 వేల నోటు ఇచ్చాడు. ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు వద్దని వేరే నోటు ఇవ్వాలంటూ కోరాడు. వాహనదారుడు తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. దీంతో ఆ సిబ్బంది స్కూటీలో నింపిన పెట్రోల్ను పైపు సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు పలు రాష్ట్రాల్లో కొందరు వ్యాపారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే రూ. 2 వేల నోటును స్వీకరించబోమని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. A petrol pump of Maharaja Chowk, Durg chattisgarh is denying acceptance of Rs 2000 Notes. Have 2000 notes lost their legal tender status? @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/57FdunTURo — Tejas 🇮🇳 (@railmintejas) May 20, 2023 @DirMktg_iocl @DirMktg_iocl @IOCRetail @FinMinIndia @RBI @nsitharaman @PMOIndia This sign at an Indian Oil Petrol Pump says all about how and panic can be created with wrong understanding of simple withdrawal process for ₹2000 currency. Pl take care and inform your pumps. pic.twitter.com/Fe6DPWMVVr — nipunsheth (@nipunsheth2) May 21, 2023 చదవండి: కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ -
కోర్టు సిబ్బందిని కొట్టిన సీఐపై విచారణ
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్, అతనికి సహాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులను అనంతపురం జిల్లా హిందూపురం వన్టౌన్ సీఐ ఇస్మాయిల్ కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణ కోసం వెళ్లగా.. హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్ అనే వ్యక్తిని అక్కడ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సదరు పోలీస్ స్టేషన్కు వెళ్లి వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఉదయ్సింహారెడ్డిని అడ్వొకేట్ కమిషనర్గా నియమించింది. గిరీష్ అక్రమ నిర్బంధంలో ఉంటే తీసుకురావాలని అడ్వొకేట్ కమిషనర్కు స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 21న ఉదయ్సింహారెడ్డి హిందూపురం వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. అతనికి సహాయకులుగా కోర్టు సిబ్బంది, గిరీష్ తరఫు న్యాయవాది, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్ పోలీసుల నిర్భంధంలో ఉన్నారని, అతన్ని పోలీసులు కొట్టినట్టు అడ్వొకేట్ కమిషనర్ గుర్తించారు. అతనికి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్స్పెక్టర్ను ఉదయ్సింహారెడ్డి కోరారు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్ కమిషనర్తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సదరు ఇన్స్పెక్టర్ను వివరణ కోరారు. అయితే, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో జడ్జి ఈ విషయాన్ని డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా జడ్జి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జడ్జి సైతం హైకోర్టుకు ఓ నివేదిక పంపారు. ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమోటో పిల్గా పరిగణించాలని, తగిన ఉత్తర్వుల నిమిత్తం సీజే ముందుంచాలని జస్టిస్ దేవానంద్ రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ తరువాత డీజీపీ స్పందిస్తూ.. బాధ్యుౖలెన పోలీసులకు శిక్ష విధించామని, రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్ను నిలుపుదల చేశామని కోర్టుకు నివేదించారు. జిల్లా జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు దీనిని సుమోటోగా పిల్గా పరిగణించాలని నిర్ణయించింది. ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన) -
చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే గంప గోవర్థన్.. అసలు వివాదం ఏంటి?
సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. బిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన జరిగింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే రైస్మిల్లుకు వెళ్లారు. రైస్ మిల్లు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గంప గోవర్థన్ చెంప చెల్లుమనిపించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వీడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మిల్లులో మిల్లర్లు లోడింగ్ నిలిపివేశారు. మిల్లరతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ చేశారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
ఐసీయూలో తల్లి .. ఆకలితో చిన్నారి
(హైదరాబాద్, గాందీఆస్పత్రి): చావుబతుకుల మధ్య తల్లిప్రాణం కొట్టుకుంటుంది.. ఆరుబయట చిన్నారి ఆకలితో అల్లాడుతున్నాడు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి తనకేమి పట్టనట్లు ఇద్దరినీ అలాగే వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో పాటు అమ్మకోసం ఏడుస్తున్న చిన్నారిని చేరదీసి, ఆకలి తీర్చి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న తల్లిని చూపించి మానవత్వం చాటుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ సలూరాకేంపు ప్రాంతానికి చెందిన గంగాధర్, మాధవి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు సాతి్వక్ ఉన్నాడు. రెండవ కాన్పు కోసం ఈ నెల 1న మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడశిశువు పుట్టిన వెంటనే చనిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయస్థితి చేరిన మాధవికి మెటరీ్నటీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ) లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. జాడలేని భర్త ఆచూకీ.. కారణం తెలియదు కానీ మాధవి భర్త గంగాధర్ ఈనెల 2వ తేదీన కుమారుడు సాతి్వక్ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో అల్లాడుతూ అమ్మ కోసం రోధిస్తున్న చిన్నారిని గాంధీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అన్నం పెట్టి బుజ్జగించి ఆరా తీశారు. పలు వార్డులను తిప్పుగా వెంటిలేటర్పై అపస్మారకస్థితిలో ఉన్న అమ్మను చిన్నారి సాతి్వక్ గుర్తించాడు. కేస్ ట్లో ఉన్న గంగాధర్ సెల్ఫోన్ నంబరుకు కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఆంజనేయులు, శ్రీకాంత్, నర్సింహా, కళ్యాణ్, నాగరాజు, శివకుమార్, వరలక్ష్మీ, లావణ్య, అనురాధలు గత మూడు రోజులుగా చిన్నారి సాతి్వక్ను షిఫ్ట్డ్యూటీ ప్రకారం వంతుల వారీగా చేరదీసి అన్నం పెట్టి ఆకలి తీర్చి అమ్మను మరిపిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి రోగి సహాయకులు లేకపోవడంతో మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మాధవి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఆధారంగా ఉన్న ఫోన్ నంబరు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. చిన్నారిని చేరదీసి మానవత్వం చాటుకున్న సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, జీడీఎక్స్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి రవికుమార్లతోపాటు పలువురు వైద్యులు, రోగి సహాయకులు అభినందిస్తున్నారు. -
AP: గుడ్న్యూస్.. టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ ఎంత పెరిగిందంటే?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్ను ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. 2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో.. -
బార్లో రగడ..పదిమంది అరెస్టు
బార్లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు సంబంధించి పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని బార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నిన్న సాయంత్రం ముంబై బార్ సిబ్బందికి కస్టమర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం వంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు సిబ్బందిని, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Mumbai Bar Brawl Caught On Camera, 10 Arrested Read here: https://t.co/djgS4TaDUJ pic.twitter.com/3nTUca4O7f — NDTV Videos (@ndtvvideos) April 8, 2023 (చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్దే హవా! శరద్ పవార్) -
త్వరలో ప్రత్యేక అగ్నిదళం
సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదాలతోపాటు ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన 50 మంది అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) తరహాలో ఉండే ఈ బృందానికి అన్నిరకాల అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఈ బృందం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. అగ్నిమాపకశాఖ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, అందుబాటులో ఉన్న ఫైర్ ఫైటింగ్ పరికరాలు, అగ్నిప్రమాదాల నియంత్రణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీ నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, ఫైర్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్తో కలిసి వివరించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు వినియోగించే పరికరాలు, బ్రాంటో స్కైలిఫ్ట్ పనితీరును మాదాపూర్ ఫైర్ స్టేషన్లో అధికారులు వివరించారు. అనంతరం బహుళ అంతస్తుల్లో నిర్మితమవుతున్న అరబిందో భవనం, గోపన్పల్లిలోని హానర్స్ హోమ్స్ భవనంలో ఫైర్ సేఫ్టీ కోసం ఏ వ్యవస్థ ఏర్పాటు చేశారన్నది ప్రయోగాత్మకంగా పరిశీలించి చూపారు. వట్టినాగులపల్లి అగ్నిమాపకశాఖ శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, ఏర్పాటు చేసిన వ్యవస్థను సైతం డీజీ నాగిరెడ్డి వివరించారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు సంసిద్ధం వేసవిలో ఎదురయ్యే అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు అగ్నిమాపకశాఖ సన్నద్ధంగా ఉందని నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్స్టేషన్లలో అన్ని రకాలు కలిపి 400కుపైగా ఫైర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతోనే స్వప్నలోక్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగిందని గుర్తు చేశారు. షార్ట్సర్క్యూట్ కారణంగానే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఫైర్ ఫైటింగ్ కోసం రోబోలు, డ్రోన్లను వినియోగించేలా ప్రణాళికలు ఉన్నాయని, మరో ఏడాదిలో ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి సైతం శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సైతం ఆరోగ్య భద్రత సదుపాయం కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాగిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైర్సిబ్బంది నిర్వహించిన మాక్డ్రిల్లో పలురకాల అగ్నిప్రమాదాలను ఎలా నియంత్రిస్తారన్నది ప్రయోగాత్మకంగా చూపారు. -
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో పారా మెడికల్ స్టాఫ్ ఆందోళన
-
కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో!
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెరసి కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్ల మంత్రం అనుసరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు, కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థలోని 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గతంలో కూడా ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. 18 వేల మంది తొలగింపు ‘ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని మేము నవంబర్లోనే ప్రకటించాము. ప్రస్తుతం 18,000 సిబ్బందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని’ సీఈఓ ఆండీ జాస్సీ ఒక ప్రకటనలో తెలిపారు. జాస్సీ మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాల తొలగింపు చాలా మందిని ప్రభావితం చేస్తాయని తెలుసు, కానీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ లేఆఫ్లు వల్ల ప్రభావితమైన వారికి సపోర్ట్ ఇచ్చేందుకు కంపెనీ సహకరిస్తుందన్నారు. వారి చెల్లింపులు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, వేరే కంపెనీలో ఉద్యోగం కోసం కావాల్సిన సపోర్ట్ వంటి ప్యాకేజీలను అందిస్తున్నామని చెప్పారు. కొన్ని తొలగింపులు యూరప్లో ఉంటాయని, జనవరి 18 నుంచి ఎవరని తొలగించారనేది తెలుస్తుందని జాస్సీ చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల మంది ఉద్యోగులుండగా.. తాజా నిర్ణయాలతో 6 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాటపట్టనున్నారు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
AP: రైతు బజార్ల సిబ్బందికి గుడ్న్యూస్.. భారీగా జీతాల పెంపు
సాక్షి, అమరావతి: రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు (సూపర్వైజర్లు) ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ.57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. 2021వరకు స్థానిక మార్కెట్ కమిటీలే ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మిగిలిన రైతుబజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ కీలక ప్రకటన -
ఆఫీస్కి రావాలంటే అవి తప్పనిసరి.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్
టాటా గ్రూప్.. ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మార్కెట్లో వాటికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వ్యాపారంలో అడుగుపెడితే తమ సంస్థ మార్క్ పని తీరుతో లాభాల బాట పట్టించడం టాటా గ్రూప్ ప్రత్యేకత. ఇటీవల భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఈ సంస్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థను కూడా మిగిలిన సంస్థల మాదిరి లాభాలవైపు నడిపేందుకే వ్యూహాలు రచిస్తోంది టాటా గ్రూప్. ఈ క్రమంలోనే యాజమాన్యంలో ఎయిర్ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. పురుషుల కోసం ►హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. ► బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయిన వారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ఇక ప్రతి రోజూ షేవ్ చేసుకుంటూ ఉండాలి. ►తెల్లవెంట్రకలు ఉన్నవారు సహజ సిద్దంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు. మహిళల కోసం ►ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. ఫ్లైట్ అటెండెంట్లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. ►రింగ్స్ వెడల్పు 1 cm కంటే ఎక్కువగా ఉండకూడు. అది కూడా చేతికి ఒకటి మాత్రమే. ►అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్లో ఉండే రంగు వేసుకోవాలి. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
Registrations Department: కుర్చీ వదిలేదేలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించే రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మంది అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. తమకు కాసుల పంట పండుతుండటంతో కొందరు డిప్యుటేషన్ల గడువు ముగిసినా సీట్ల నుంచి కదిలేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్రిజిస్ట్రార్ పదేళ్లుగా అక్కడే పనిచేస్తుండగా మరో జిల్లా కేంద్రంలోని ఓ సబ్రిజిస్ట్రార్కు పోస్టింగ్ ఇచ్చి ఏకంగా 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బదిలీ కాలేదు. ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారు సైతం పదోన్నతులు పొందినా ప్రస్తుత స్థానాలను వదలడం లేదు. ఆయా సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా రాజకీయ అండదండలతో అవే సీట్లలో కొనసాగుతున్నారు. దీంతో ఆమ్యామ్యాలు లేనిదే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దొడ్డిదారి.... పైరవీల రహదారి రాష్ట్రవ్యాప్తంగా 25 మంది వరకు డిప్యుటేషన్లపై కొనసాగుతుండగా ఇటీవలే బంజారాహిల్స్, నార్సింగి, ఉప్పల్, మహబూబ్నగర్ సబ్రిజిస్ట్రార్ల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇలాంటి కార్యాలయాల్లో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్, ఇన్చార్జి పోస్టింగుల కోసం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. డిప్యుటేషన్ పోస్టింగుల కోసం పైరవీలు చేసిన వారే మళ్లీ వాటి రద్దు కోసం ప్రయత్నాలు చేయడం, కీలక బాధ్యతల్లో ఉన్న ఓ మంత్రిపై ఒత్తిడి చేస్తుండటం ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అలాగే జిల్లా రిజిస్ట్రార్ పోస్టింగుల కోసం కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో డీఆర్ పోస్టింగుల కోసం కూడా ప్రభుత్వ పెద్దలపై అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది. బదిలీలు ఏమయ్యాయి? రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి దశాబ్ద కాలం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్రిజిస్ట్రార్ల సాధారణ బదిలీలు జరగ్గా మియాపూర్ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరిని బదిలీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్ కేడర్ అలాట్మెంట్లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటూఇటు అయ్యాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే. ఇక కిందిస్థాయి సిబ్బంది బదిలీలు 2010 తర్వాత జరగనేలేదు. అధికారులు, సిబ్బంది బదిలీల కోసం కొన్ని నెలల కిందటే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం దానిపై నిర్ణయం మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. సుదీర్ఘకాలంగా బదిలీలు జరగకపోవడంతోనే డిప్యుటేషన్ల కోసం పైరవీలు, ఇన్చార్జీల పాలన నడుస్తోందని.. వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. లంచాలివ్వకుంటే అన్నీ కొర్రీలే... చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లలో కొందరు తమకు ‘రావాల్సినవి’అందిన డాక్యుమెంట్లు... ఏజెంట్లు తీసుకొచ్చే డాక్యుమెంట్ల విషయంలో ఒకలాగా, మిగిలిన డాక్యుమెంట్ల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమంటే రిజిస్ట్రేషన్ల చట్టంలోని ఏదో ఒక రూల్ చెప్పి కొర్రీ వేయడం వారికి పరిపాటిగా మారింది. నాలుగు సార్లు ఏదో రకంగా వెనక్కు పంపిస్తే ఐదోసారి తమకు కావాల్సినవి ముట్టజెప్తారనే ధోరణిలోనే సబ్రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారని, ముట్టిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నా పని అయిపోతుందనే చర్చ బహిరంగ రహస్యమే. -
3 వేలమందిపై వేటు వేసిన లగ్జరీ కార్ మేకర్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ మేకర్, అమెరికాకుచెందిన ఫోర్ట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 3 వేలమందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు అధికారికరంగా ఫోర్డ్ ధృవీకరించింది. ఉద్యోగాల కోత సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫోర్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. (‘ఆడి’ లవర్స్కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ సంతకం చేసిన ఇమెయిల్ పోస్ట్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 3వేల మంది ఉద్యోగులు, మరికొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు ఫోర్ట్ తెలిపింది. ఈ మేరకు ఫోర్డ్ ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్ సమాచారం అందించింది. ఈ కోతలు ప్రధానంగా అమెరికా, కెనడా, ఇండియాలోని సిబ్బందిని ప్రభావితం చేసింది. (జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా... కానీ ఇక్కడో ట్విస్ట్) ఫోర్డ్లో చాలామంది ఉద్యోగులున్నారని, ఎలక్ట్రిక్, కొత్త సాఫ్ట్వేర్ వాహనాల పోర్ట్ఫోలియోకు మారడానికి అవసరమైన నైపుణ్యం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు లేదని ఫార్లే ఇటీవల చెప్పారు. 2026 నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా వెల్లడించడం గమనార్హం. అప్పటికి 10 శాతం ప్రీ-టాక్స్ ప్రాఫిట్ మార్జిన్ను చేరుకోవాలని, గత ఏడాది ఇది 7.3 శాతంగా ఉందని చెప్పారు న్యూటెక్నాలజీకి మారడం, వాహనాల అధునాతన సాఫ్ట్వేర్ అభివృద్ధి లాంటి పరిణామాల నేపథ్యంలో నిర్వహణా విధానాన్ని మారుస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
కదిలే రైలు నుంచి ప్యాసింజర్ను తోసేసిన సిబ్బంది
లక్నో: రైల్వే ప్యాంట్రీ సిబ్బంది దాష్టికానికి తెగపడ్డారు. కదిలే రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు తోసేశారు. వాటర్ బాటిల్ విషయంలో అతను వాళ్లతో వాగ్వాదానికి దిగగా.. పాన్ మసాలా రైలులో ఉమ్మేశాడంటూ సిబ్బంది అతనిపై దాడికి దిగారు. ఉత్తర ప్రదేశ్ లలిత్పూర్ దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ బాటిల్ విషయంలో చెలరేగిన గొడవ.. చిలికి చిలికి దుమారం రేపింది. ఆ కోపంలో సిబ్బంది.. సదరు ప్రయాణికుడిపై కక్ష కట్టారు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ గొడవ పెట్టుకుని.. చితకబాది బయటకు తోసేశారు. రవి యాదవ్(26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. జిరోలి దగ్గరకు చేరుకోగానే ప్యాంట్రీ స్టాఫ్తో అతనికి గొడవ మొదలైంది. వాటర్ బాటిల్ కొనుగోలు మొదలై.. రైలులో పాన్ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో లలిత్పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు. ఈలోపు రైలు కదిలింది. బలవంతంగా అతన్ని ఆపేసి.. రైలులోనే దాడి చేశారు. ఆపై అతన్ని పట్టాలపైకి విసిరేశారు. స్థానికులు రవిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్లు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని.. ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. -
పని మధ్యలో నిద్ర.. ఏం పర్లేదు మా కంపెనీకి ఓకే!
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అప్పుడప్పుడు బల్లల మీదే తలవాల్చి కునుకుతీసే సందర్భాలు మామూలే! ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. మధ్యాహ్నంపూట కాస్త కునుకు తీస్తే, మెదడు చురుకుదేరి పనితీరు మెరుగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. అయినా, పనివేళల్లో ఉద్యోగులు కునుకుతీయడానికి తగిన ఏర్పాట్లు ఏ ఆఫీసులోనూ కనిపించవు. జపాన్లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్బాక్సెస్) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం. -
ఉద్యోగులకు డిమాండ్..భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వార్షిక నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్కు డిమాండ్ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 2022– 23లో ఫిన్టెక్, ఐటీ–ఇన్ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్ స్టాఫింగ్ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్గా పరిగణిస్తారు. యువతే ఎక్కువ ఫ్లెక్సీస్టాఫ్కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్కు డిమాండ్ 10 శాతం పెరుగుతుందని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. -
లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరు
పాములపాడు: ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా, మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు గ్రామంలో ఉద్యోగం కల్పించింది. ఈ విధానం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి పూనుకున్నాయి. అయితే కొన్నిచోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో సచివాలయ ఉద్యోగుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉదయం 11.30 దాటినా ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడం, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరీక్షించి వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని కోరుతున్నారు. -
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన.. వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
-
ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. చాదర్ఘాట్లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. -
రుయాలో అడుగడుగునా నిర్లక్ష్యం
ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప రుయా ఆస్పత్రి అధికారుల తీరు మారడంలేదు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు మెరుగైన చికిత్స కరువైంది. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మందలించినా ప్రయోజనం లేదు. తిరుపతి తుడా: రాయలసీమ పెద్దాస్పత్రిగా తిరుపతి రుయా పేరుపొందింది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వైద్య పరికరాల కోసం నాడు–నేడు ద్వారా రూ.450 కోట్లు కేటాయించింది. వైద్యుల పదోన్నతులు, బదిలీలను చేపట్టింది. వైద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ యజమానుల తీరు పై ఓ అ«ధికారిని సస్పెండ్ చేశారు. మరో ఉన్నతాధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఆస్పత్రిలో పర్యటించి లోటుపాట్లపై కన్నెర్ర చేశారు. అత్యవసర విభాగం నిర్వహణ లోపంపై మండిపడ్డారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినా అధికారుల తీరు మారలేదు. రుయా ఆస్పత్రి వర్కింగ్ కమిటీ సభ్యుడు బండ్ల చంద్రశేఖర్ రాయల్ గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో పర్యటించారు. నైట్ డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడంపై ఆరా తీశారు. వార్డుల్లో రోగు లను ఎంఎన్వో, ఎఫ్ఎన్వోలు స్ట్రెక్చర్లపై తీసుకెళ్లడంలోను నిర్లక్ష్యాన్ని గుర్తించారు. సహాయకులే రోగులను మరో వార్డుకు, వైద్య పరీక్షలకు తీసుకెళుతుండడం ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆస్పత్రి పర్యవేక్షణాధికారి నిర్వాకంవల్లే.. ఆస్పత్రి పర్యవేక్షనాధికారి ఎవరి అధికారాలను వారికి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు నెలకొంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులకు డ్యూటీలు కేటాయించడం, వైద్య సిబ్బందితో విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని రుయాలో పాలనను గాడినపెట్టి రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు -
గతంలో ఆ ఉద్యోగాలు పురుషులకే పరిమితం.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది!
సాక్షి,బళ్లారి: ఇంటి నుంచి మింటి వరకు దూసుకెళ్తున్న నారీమణులు రైళ్లను కూడా నడిపిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన లోకోపైలెట్ ఉద్యోగాల్లో మహిళలు కూడా కొలువుదీరి సత్తా చాటుతున్నారు. మంగళవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుబ్లీ రేల్వే అధికారులు హుబ్లీ నుంచి గదగ్ మీదుగా కారటిగి వెళ్లే రైలు నిర్వహణను మహిళా సిబ్బందికే అప్పగించారు. లోకో పైలెట్, టీటీఈలు, పోలీసులు ఇతర సిబ్బంది మొత్తం 15 మంది మహిళలను నియమించి రైలు నడిపించారు. అంబికా అంకలిగి అనే మహిళా పైలెట్ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా 200 కిలోమీటర్ల మేర రైలును నడిపించారు. మహిళా దినోత్సవం రోజున రైలును నడిపే బాధ్యతలను తమకు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. -
తల పట్టుకున్న పుతిన్.. రష్యాలో ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్
మాస్కో: ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో పుతిన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వార్ కారణంగా పుతిన్కు స్వదేశంలో మరోసారి నిరసన తగిలింది. రష్యాకు చెందిన TV Rain టీవీ చానల్ సిబ్బంది లైవ్లో మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ ఆ దేశానికి చెందిన టీవీ రెయిన్ చానల్ సిబ్బంది రాజీనామా చేశారు. ఓ వైపు లైవ్లో న్యూస్ రన్ అవుతుండగానే వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చానల్ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో టీవీ ప్రసారాలు చేసి రాజీనామాలు అందించారు. వారి నిర్ణయాన్ని సంస్థ యాజమాన్యం సైతం మద్దతు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అంతకు ముందు ‘టీవీ రెయిన్’ చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం యుద్ధాన్ని ప్రసారం చేసేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ చానల్ ప్రసారాలను రష్యా ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు.. ఛానెల్ ఫౌండర్స్లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయారని అన్నారు. అనంతరం తమ చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. Meanwhile TVRain, the last independent media outlet operating in Russia, has shut down — here's the last few minutes of its broadcast, poorly Google Translated. It then cut to Swan Lake, which has particular relevance: https://t.co/XXtUHroZkt pic.twitter.com/Iq7HSal7FW — Timothy Burke (@bubbaprog) March 3, 2022 -
‘టౌన్’ బండి.. డౌన్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరత, సమస్యలకు చిన్న ఉదాహరణ ఇది. పంచాయతీలుగా ఉన్నప్పటి నామమాత్రపు సిబ్బందితోనే చాలా మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం.. ఉన్నా ఇన్చార్జులే కావడంతో కొత్త పురపాలక సంస్థల్లో పాలన సరిగా జరగని దుస్థితి నెలకొంది. దీనితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని, వివిధ అనుమతులు, పారిశుధ్యం వంటి సేవలు సరిగా అందడం లేదని.. పన్నుల వసూళ్లు కూడా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: పెరిగిన జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పలు మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలి టీలుగా, కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేసింది. కొత్తగా 77 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా వాటికి అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం జరగలేదు. పేరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారినా.. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొత్తవి ఏర్పాటైన మొదట్లో.. ఆయా జిల్లాల్లో అప్పటికే ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరిని సీనియారిటీ ఆధారంగా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లు, మేనేజర్లుగా డిప్యుటేషన్లపై నియమించారు. కొందరికైతే రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా, మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి సిబ్బంది నుంచే.. శానిటేషన్ ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను ఎంపిక చేసి వెళ్లదీసుకొస్తున్నారు. అక్రమాలను అడ్డుకునేదెలా? మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేది టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల నుంచే. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల అనుమతి పొంది, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు టీఎస్బీపాస్ అనుమతి తప్పనిసరని పురపాలక శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా అనుమతులు మంజూరు చేయడానికిగానీ, పంచాయతీలు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పడానికిగానీ టౌన్ ప్లానింగ్ అధికారులు లేని దుస్థితి. కేవలం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం డిప్యుటేషన్ మీద టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నియమించడంతో.. వారు అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టగలుతున్నారు. ఇతర చోట్ల చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పన్నుల ఆదాయానికీ గండి ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నుల వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. అభివృద్ధి పనులతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ప్రతి మున్సిపాలిటీకి ఇంజనీర్లు ఉండాలి. కానీ కొత్త మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత నెలకొంది. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు, ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయాలన్న నివేదికలు రూపొందించేందుకు అధికారులు లేరు. ఏదైనా అంశంపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారు కూడా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా..: రాష్ట్రంలోని కొత్త, పాత మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ నుంచి శానిటరీ జవాన్ వరకు 4 వేల పోస్టులు అవసరమని పురపాలక శాఖ గతంలో లెక్కతేల్చింది. జనాభా ప్రాతిపదికన ఏయే మున్సిపాలిటీకి, కార్పొరేషన్కు ఏయే స్థాయిలోని అధికారులు, సిబ్బంది ఎంద మంది అవసరమనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020 జూలై 14న మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై.. తొలివిడతగా 2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. తాజాగా 129 మున్సిపాలిటీల్లో 3,700 మంది వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలనేది ఆలోచన. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్త మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఇబ్బంది తప్పదని స్థానికులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీలుగా ఉన్న అలంపూర్, వడ్డేపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన నిత్యానంద్.. ఈ రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో మేనేజర్, అకౌంటెంట్, బిల్ కలెక్టర్, ఏఈ, టౌన్ప్లానింగ్ ఏఈ పోస్టులకు ఇన్చార్జి అధికారులే ఉన్నారు. ఆర్ఐ, శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శానిటేషన్, ఇతర సిబ్బంది అయితే పూర్తిగా ఔట్ సోర్సింగే. వడ్డేపల్లి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. పది కీలక పోస్టులకుగాను ఏడింటిలో ఇన్చార్జులే ఉన్నారు. ► మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలి టీలో కమిషనర్తోపాటు టీపీవో పోస్టులకు ఇన్ చార్జులను నియమించిన ప్రభుత్వం.. మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే డిప్యుటేషన్ మీద పంపించింది. ఇక ఏ పోస్టుకూ అధికారులు లేరు. శానిటరీ ఇన్స్పెక్టర్ సహా పారిశుధ్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్లో తీసుకొని బండి నడిపిస్తున్నారు. ► బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ప్లానింగ్ సిబ్బంది కొరత ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇన్చార్జినే. నలుగురు సూపర్వైజర్లు, ఒక ఏసీపీ పోస్టులకు సంబంధించి ఎవరూ లేరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఏఈలు అవసరం. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఈఈ ఉండాల్సి ఉన్నా.. ఎవరూ లేరు. ► రామాయంపేట మున్సిపాలిటీలో అంతా ఇన్ చార్జుల పాలనే. 20 మందికిగాను.. మున్సిపల్ కమిషనర్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి సిబ్బందితోనే పాలన కొనసాగుతోంది. ళీ చిట్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్, మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఇన్చార్జులే ఉన్నారు. ► కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీవో ఇన్చార్జులే. ఏఈ, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ , అకౌంట్స్ విభా గంలో ఏవో, జేఏవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ టీపీ, టీపీఎస్, శానిటర్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్ కలెక్టర్లు నలుగురికి ఒక్కరే, జూనియర్ అసిస్టెంట్లు నలుగురికి ఇద్దరే ఉన్నారు. పలు కొత్త మున్సిపాలిటీల్లోని పరిస్థితి ఇదీ.. ► కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో అంతకు ముందున్న గ్రామ పంచాయతీ పరిస్థితికి ఇప్పటికి తేడా లేని దుస్థితి. ► మున్సిపాలిటీల్లో గెలిచిన పాలక మండళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదు. ► కొందరు కమిషనర్లు, కీలక అధికారులు రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జులుగా ఉంటుండటంతో పాలన కుంటుపడుతోంది. ► టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే యంత్రాంగం లేదు. ► గ్రామ పంచాయతీ పర్మిషన్ పేరుతో కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాలిటీల్లో మాత్రం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి.. ఇతర మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖల నుంచి సిబ్బందిని తెప్పించి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు. ► పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం లేదు. కమిషనర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు, ఇతర పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ► హైదరాబాద్ శివార్లలోని జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ వంటి కొత్త కార్పొరేషన్లలో పాలకమండళ్ల హడావుడే తప్ప అధికారులు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. అడుగడుగునా సమస్యలే.. అధికారులు, సిబ్బంది లేకుంటే మున్సిపాలిటీలు ఎందుకు? పౌరులకు మౌలిక సదు పాయాలు కల్పించడమ నేది స్థానిక సంస్థల బాధ్యత. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నుంచి సౌకర్యాలు ఆశిం చడం ప్రజల హక్కు. కొత్త మున్సి పాలిటీలు ఏర్పాటు చేసి.. కమిషనర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఉద్దేశం దెబ్బతింటుంది. అధికారులను నియ మించకపోవడం శోచనీయం. పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రెగ్యులర్ స్టాఫ్ను నియమిస్తే మంచిది. – ఆర్వీ చంద్రవదన్, రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీహెచ్ మాజీ అదనపు కమిషనర్ -
బీరు కొనుగోలు ‘గొడవ’.. బార్లో యువకులపై నిర్వాహకుల దాడి
మేడిపల్లి: మద్యం సేవించడానికి బార్కు వెళ్లిన ఇద్దరు యువకులపై బార్ నిర్వాహకులు, సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్నగర్కు చెందిన దంతూరి సాయి కృష్ణ, సాయిరాం స్నేహితులు. వారిరువురు మద్యం సేవించేందుకు సోమవారం ఉప్పల్ డిపో సమీపంలోని దర్బార్ బార్కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వెయిటర్కు వీరిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో బార్ సిబ్బంది మూకుమ్మడిగా వీరిద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పక్కనే ఆస్పత్రిలో చేర్పించగా సమాచారం అందుకున్న బార్ సిబ్బందిలో మరికొందరు అక్కడికి వెళ్లి వారిని మరోసారి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిపై కేసు నమోదు.. బార్ నిర్వాహకులు, సిబ్బంది ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కటిక కుమార్, జగన్, అమ్మోజు నవీన్, చెంచు వీరేశ్, సుదగాని నర్సింహ్మ, బర్ల రాజిరెడ్డి, చొక్కాల రాజవర్థన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బార్ వద్ద ఆందోళన ... సాయి కృష్ణ, సాయిరాంపై దాడిని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు దర్బార్ బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. బార్ అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన ఇద్దరు బారు నిర్వాహకులపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దం పగిలిపోయింది. సంఘటనా స్థలానికి వచ్చిన మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఓయోలో ఉద్యోగులకు వాటా
న్యూఢిల్లీ: వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బందిసహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్(ఇసాప్)లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ పేర్కొంది. ఇసాప్ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది. కంపెనీ భారీ డిస్కౌంట్లో జారీ చేసిన ఇసాప్ల ద్వారా సిబ్బంది షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ గతేడాది ఆగస్ట్లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 5 మిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఓయో విలువ 9.6 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల విలువను రూ. 330 కోట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఇటీవల ఇసాప్ల జారీని 41 శాతానికి విస్తరించడంతో ప్రస్తుత సిబ్బందిలో 80 శాతం మందికి ఇవి లభించినట్లు తెలుస్తోంది. 2021 మార్చికల్లా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బంది సంఖ్య 5,130కు చేరింది. వీరిలో దాదాపు 71 శాతం మంది దేశీయంగానే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! గతేడాది అక్టోబర్లో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన విషయం విదితమే. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, చెన్నై(తమిళనాడు): పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్లపై అత్యారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కరోనా సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్లో 15 రోజుల క్వారంటైన్ను గడిపారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యురాళ్లు చెన్నై టీ నగర్లోని ఒక స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. అదే హోటల్లో క్వారంటైన్లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్రాజ్ (28) ఇద్దరు మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. హతమారుస్తామని బెదిరించి అత్యారానికి పాల్పడ్డారు. వీడియో తీసి పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్.. చెన్నై తేనాంపేట మహిళా పోలీస్లతో విచారణ జరిపించారు. ప్రాథమికంగా నేరం నిర్ధారణ కావడంతో వైద్యులు వెట్రిసెల్వన్, మోహన్రాజ్లను గురువారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా ఆరోగ్య, సంక్షేమశాఖ శుక్రవారం డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసింది. -
లేడీ బాస్ ఉదారత.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్
సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు. ఇప్పుడు ఈ బాస్ల టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా బాస్ మీద ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్. ఆ వివరాలు... (చదవండి: ట్రెండింగ్లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే) స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్బైబిల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ బ్లాక్స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది సారా. ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది. (చదవండి: అద్భుతం చేసిన ఫేస్బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత) "ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని తమదైన రీతిలో జరుపుకోవాలని, జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్లో బిగ్బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు -
కొత్త వ్యూహం..నవంబర్ 15లోపు ఆఫీసుకు రండి..!
త్వరలో వర్క్ ఫ్రం హోంకి శుభం కార్డ్ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ 2022 జనవరి కల్లా ఉద్యోగుల్ని ఆఫీస్కు రప్పించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్లో వర్క్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తుంది. అయితే తాజాగా ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో ఉద్యోగ భద్రత, ఆరోగ్యాల్ని సైతం పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. 528,748 మంది ఉద్యోగులు దేశ, విదేశాల్లో మొత్తం 528,748 మంది టీసీఎస్లో పనిచేస్తున్నారు. వారందరూ నవంబర్ 15లోపు తిరిగి ఆఫీస్కు రావాలని గతవారం అఫీషియల్గా మెయిల్ పెట్టినట్లు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ మిలింద్ లక్కడ్ తెలిపారు. 5 శాతం మంది తమ సహచరులు (ఉన్నత ఉద్యోగులు) ఆఫీస్కు వస్తున్నట్లు చెప్పారు. హైబ్రిడ్ వర్క్ కల్చర్ను మార్చడానికి ముందే.. ఇప్పటి నుంచే ఆఫీస్లకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఉంటుందని చెప్పిన ఆయన.. ఇందుకు సంబంధించి టీమ్ లీడర్లు- ప్రతి టీమ్ ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని' ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ తాము 25/25 మోడల్కి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కానీ ఆ మోడల్కు మారడానికి ముందే తాము ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకటించారు కొద్ది రోజుల క్రితం 2025 నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్జీ సుబ్రమణియం తెలిపారు. ఇప్పటి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడం వల్ల హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఈజీ అవుతుందని టీసీఎస్ భావిస్తోంది. కాగా, 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్ఫ్రమ్ హోం చేసే పద్దతిని హైబ్రిడ్ వర్క్ కల్చర్ అంటారు. చదవండి: హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నది ఈ సంస్థలోనే -
తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 15లోగా తమ విభాగాధిపతి/శాఖాధిపతికి దరఖాస్తు చేసుకో వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఏపీకి వెళ్లాలనుకుంటున్న అధికారుల విష యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. ఈమేరకు ఏపీకి అంతర్రాష్ట బదిలీలకు సీఎస్ సోమేశ్ కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఏపీకి పంపేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి నిరభ్యంతర పత్రం జారీచేస్తారు. చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం -
మీరెక్కడికి వెళ్లినా వదలం.. పొలాల్లోను కోవిడ్ వ్యాక్సిన్
పలమనేరు: కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో టీకా వేసుకోనివారి జాబితాను చేతబట్టుకొని చిత్తూరు జిల్లాలో వైద్య సిబ్బంది పొలంబాట పట్టారు. మీరెక్కడికి వెళ్లినా వదలబోమంటూ వైద్య సిబ్బంది వరినాట్లలో ఉన్న కూలీలకు అక్కడే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదిగో ఈ దృశ్యం గంగవరం మండలం జీడిమాకులపల్లి వద్ద శుక్రవారం ‘సాక్షి’కి కనిపించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి రేంజ్లో రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం, ఎంతంటే!
కరోనా కారణంగా ఎంతోమంది ఉపాధిని కొల్పోయారు. ఆయా రంగాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు జాబ్స్ పోయి నిరుద్యోగులుగా మారారు. ఇక కొన్ని కంపెనీలో ఉద్యోగుల జీతాల్లో కోతలు వేశారు. ఇలా కరోనా, లాక్డౌన్ వల్ల ఎంతోమంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ సినీ సెలబ్రెటీలకు దగ్గర పనిచేసే స్టాఫ్పై మాత్రం కరోనా ఎఫెక్ట్ తక్కువగానే పడింది. దీంతో అందరి దృష్టి మన స్టార్ల వద్ద పనిచేసే ఉద్యోగులపై, వారి జీతాలపై పడింది. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల దగ్గర పనిచేసే కారు డ్రైవర్లు, బాడీగార్డుల నెల జీతాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ కారు డ్రైవర్ జీతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మెగా కుటుంబం ఇంట్లో పని చేసే స్టాఫ్కు ఎలాంటి కోరత ఉండదు. వారి దగ్గర పనిచేసే వారిని మెగా కటుంబంగా సొంతవాళ్లల ఆదరిస్తుంది. జీతంతో పాటు పండగలకు, స్పెషల్ డేస్, బర్త్డేలకు వారికి బోనస్లు ఇస్తుంటారట. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల బాధ్యత తమది అన్నట్టుగా భావిస్తాడట చెర్రి. అందుకే తన స్టాఫ్కు భారీగా జీతాలు ఇస్తాడట. ఇక తన కారు డైవర్కు అయితే దాదాపు రూ. 45 వేల పైనే వేతనం ఇస్తాడని సమాచారం. అంటే ఓ సాఫ్ట్వేర్ బెసిక్ శాలరీకి సమానంగా చెర్రి తన కారు డ్రైవర్కు జీతం ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ శాతం చెర్రియే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు. డ్రైవర్ను అతి తక్కువ సమయంలోనే తనతో పాటు తీసుకు వెళతాడు. అలాంటిది అంతగా జీతం ఇవ్వడమంటే ఆశ్చర్యమే కదా. అయితే కేవలం డ్రైవర్కు మాత్రమే కాదు ఇంట్లో పని చేసే పనివాళ్లకు కూడా బాగానే జీతం ఉంటుందట. కాగా ప్రస్తుతం చరణ్ ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. దీనితో పాటు శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్టాప్ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్టాప్ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
ఇకపై నో జీన్స్, నో టీ షర్ట్స్.. సీబీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కార్యాలయంలోని అధికారులు జీన్స్, టీషర్ట్స్,స్పోర్ట్స్ షూస్, వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఇకనుంచి ప్రతీ ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. దీని ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు ఇకపై షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అలాగే నీట్గా షేవ్ చేసుకోవాలి. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకొని కార్యాలయాలకు రావాలి. ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల అధిపతులకు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా? -
Lockdown: నారా వారి గుర్తింపు కార్డులు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ...టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సిబ్బందికి సొంత గుర్తింపు కార్డులిచ్చి రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు దోహదపడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నీరూస్ చౌరస్తాలో జాషువా అనే డ్రైవర్ ద్విచక్ర వాహనంతో బయటకు వచ్చాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని ఆపగా ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’పేరుతో గుర్తింపు కార్డుని చూపించాడు. దీంతో ఈ కార్డుల గురించి పోలీసులు అతడిని ప్రశ్నించగా...చంద్రబాబు కుటుంబం వద్ద పనిచేస్తున్న ఓ పాతికమందికి పైగా సిబ్బందికి ఈ గుర్తింపు కార్డులిచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడికి జరిమానా విధించి కేసు నమోదు చేశారు. -
భారత నౌకలో 14 మందికి పాజిటివ్: అధికారుల టెన్షన్
జొహన్నెస్బర్గ్: భారత్లో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక నౌకలపై కూడా ఆంక్షలు విధించేలా పరిణామాలు కన్పిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం లోడుతో ఓ భారీ నౌక దక్షిణాఫ్రికాకు చేరుకుంది. అక్కడి పోర్టు అధికారులు నౌక సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల భారత్ నుంచి ఓ నౌక సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో సాతాఫ్రికాలోని డర్బన్ పోర్టుకు చేరుకుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నౌకలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆశ్చర్యంగా అందులో 14 మంది సిబ్బందికి పాటిజివ్గా నిర్ధారణ అయిందని దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌకను క్వారంటైన్లో ఉంచామని, అందులోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎవరికీ అనుమతి లేదని పోర్టు అధికారులు వెల్లడించారు. నౌకతో ముడిపడి ఉన్న అన్ని కార్యకలాపాలను ప్రస్తుతం నిలిపివేశారు. నౌకలోని సిబ్బందిని ఎవరెవరు కలిశారనే విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిపారు. ఆ నౌకలో గత ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నాయని, వాటిని దింపడానికి ఈ సిబ్బంది పని చేసినట్లు తెలిసింది. భారతదేశంలో రోజూ వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా తీరాలకు చేరిందనే వార్త ప్రస్తుతం అక్కడి మీడియాలో వైరల్గా మారింది. ( చదవండి: 22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్ ) -
డోర్ డెలివరీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తల దాడి
తడ (నెల్లూరు జిల్లా): రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు వెళ్లిన డోర్ డెలివరీ వాహన సిబ్బందిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అడ్డుపడిన ఇద్దరు వలంటీర్లపై సైతం దాడి చేశారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు పంచాయతీ మట్టిగుంటలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు శనివారం మట్టిగుంట సెంటర్లో బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో నెట్వర్క్ సమస్య తలెత్తింది. ఎన్నికల వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు దీనిని ఆసరాగా చేసుకుని డోర్ డెలివరీ వాహనం డ్రైవర్ ఆర్ముగం, సహాయకుడు తోట ప్రసాద్లపై దాడికి దిగారు. ఈ దాడిలో ప్రసాద్కు రక్త గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వలంటీర్లు దేవి, సురేష్లపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని అడ్డుపడ్డారు. దీనిపై బాధితులు తడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర -
కరోనా బూచి.. డబ్బు దోచి!
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కరోనా సమయంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి, అంత్యక్రియలకు అంబులెన్స్ నిర్వాహకులు రూ.85 వేలు వసూలు చేశారు. డెత్ సర్టిఫికెట్లో కరోనాతో చనిపోలేదని తెలుసుకుని అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది చేతిలో మోసపోయామని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరొకరు మోసపోవద్దని కోరారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు(67) ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ప్రైవేటు అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. (8,827 మంది డిశ్చార్జ్) పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందకముందే తరలించాలని తొందరపెట్టారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్ అక్కడి నుంచే ఫోన్లో అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్ పే ద్వారా సురేష్బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది. (అత్యధికంగా 69,878 పాజిటివ్, 945 మరణాలు) డెత్ సర్టిఫికెట్తో వెలుగులోకి.. సాయినాథ్రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నారు. సాయినాథ్రావు కరోనాతో చనిపోలేదని, సీఆర్ఎఫ్(క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేదా క్రానిక్ రీనల్ ఫెయి ల్యూర్)తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్ రేవతి పేరుతో ధ్రువపత్రం అందించారు. దీనిని వాట్సాప్ లో విదేశాల్లోని కుమారుడు క్రాంతి కిరణ్కు పంపించారు.జరిగిన మోసాన్ని తెలుసుకున్న అతను..విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. -
రాజ్భవన్లో 38 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్లో కరోనా కలకలం రేగింది. 38 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణైం ది. గవర్నర్కు నెగెటివ్ అని తేలింది. రాజ్భవన్లో విధులు నిర్వహిస్తున్న 28 మంది స్పెషల్ పోలీసు బెటాలియన్ సిబ్బంది, 10 మంది ఉద్యోగులు, మ రో 10 మంది వారి కుటుంబసభ్యులు కరోనా బారి నపడినట్టు రాజ్భవన్ స చివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్భవన్ పోలీసు సిబ్బందిలో కొందరు కరోనా బారినపడడంతో గవర్నర్ తమిళిసై చొరవ తీసుకుని రెండ్రో జులుగా రాజ్భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయించారు. తాను కూడా పరీక్ష చేయించుకున్నారు. 395 మందికి పరీక్షలు నిర్వహించగా, 347 మందికి నెగెటివ్, 48 మందికి పాజిటివ్ వచ్చింది. గవర్నర్కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది. కరోనా పరీక్షలకు భయపడొద్దు కరోనా సోకిన రాజ్భవన్ సిబ్బంది, కుటుంబసభ్యులను ఎస్ఆర్ నగర్లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి, 28 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. రెడ్జోన్లలో నివసిస్తున్న ప్రజలు, కరోనా సోకినవారితో కాంటాక్ట్ ఉన్న వారు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. -
ప్రగతిభవన్ సిబ్బందిలో ఐదుగురికి కరోనా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధికారిక నివాసం ప్రగతిభవన్లో పనిచేసే ఐదుగురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రభుత్వవర్గాల్లో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. గత నాలుగు రోజులుగా సీఎం గజ్వేల్లోని ఆయన నివాసగృహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతిభవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
కరోనా : ఆమీర్ ఖాన్ కీలక ప్రకటన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ (55)ఇంటిని తాకాయి. తన సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఆమీర్ వెల్లడించారు. వెంటనే వారిందరినీ క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆమీర్ ఈ సమాచారాన్ని షేర్ చేశారు. కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిందని ఆమీర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఆమెకు నెగిటివ్ రావాల్సిందిగా కోరుకోవాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించి, సహాయం అందించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోకిలా బెన్ ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు కూడా ఆమీర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్' హిందీ రీమేక్ లో 'లాల్ సింగ్ చద్దా' లో అమీర్ కనిపించనున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్' దర్శకుడు అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆమీర్ భార్య కిరణ్ రావు దీన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/TATvKCf6gf — Aamir Khan (@aamir_khan) June 30, 2020 -
చనిపోయే ముందు సుశాంత్ ఔదర్యం!
ముంబాయి: సుశాంత్ సింగ్రాజ్పుత్ మరణం బాలీవుడ్లో మాత్రమే కాకుండా అందరిని ఎంత శోకసంద్రంలో ముంచిదో తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సుశాంత్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే తనని తాను సన్నద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే ఇంట్లో పనివారిని, తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసినట్లు ఇంట్లో పనివారు పోలీసులకు తెలిపారు. ('సుశాంత్ కాంట్రాక్ట్ ముగిసింది.. నువ్వు కూడా') ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చి ఇంకా తాను వారికి జీతాలు ఇవ్వలేనని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఇన్ని రోజులు తన బాగోగులు చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఆర్థికంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంట్లో పనివారు కరోనా కారణంగా ఇబ్బంది పడటం చూసి వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే సాయం చేయడం బట్టే సుశాంత్ మంచి తనం అర్థం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. (సుషాంత్ మరణం టిక్టాక్లో చూసి..) -
ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు అండగా నిలవాలని భావించింది. వేతనాలు పెంపు, పదోన్నతులు ప్రకటించి ప్రత్యేకంగా నిలిచింది. తన సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం కీలకమని, అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని రెనాల్ట్ ఇండియా తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం పోలిస్తే ఈ పెంపు ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) తన ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును అమలు చేయనుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి పదోన్నతులు కూడా ఇస్తోంది. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా 250 మంది ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును ప్రకటించింది. అలాగే 30 మందికి పైగా అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలందించేందుకుగాను తన డీలర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కార్లు, విడిభాగాలపై మార్జిన్ను 200-300 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. చదవండి : మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే! -
42 మందికి కరోనా: నోకియా ప్లాంట్ మూత
సాక్షి, చెన్నై : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లోని ప్లాంట్ లో కార్యకలాపాలను నిలిపివేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ కర్మాగారంలోని సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారనేది నోకియా వెల్లడించలేదు. మరోవైపు కనీసం 42 మందికి కరోనా సోకిందనే వాదన వినిపిస్తోంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఇటీవల ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించామని, భౌతిక దూరం, క్యాంటీన్ లో మార్పులు లాంటి నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా పరిణామం నేపథ్యంలో పరిమిత సిబ్బందితో త్వరలోనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని చెప్పింది. కాగా చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కూడా ఇటీవల తిరిగి ప్రారంభించిన ఢిల్లీ శివార్లలోని ప్లాంట్ ను మూసివేసింది. తొమ్మిది మందికి కరోనా సోకడంతో ప్లాంట్లో కార్యకలాపాలను గత వారం నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
కరోనాను ఓడించగలం
తన ఇంట్లో పని చేసే సిబ్బందిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించారు బాలీవుడ్ దర్శక – నిర్మాత కరణ్ జోహార్. ‘‘మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే మా భవనంలోని ఓ ప్రత్యేక గదిలో వారిని ఉంచి సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు, మా ఇతర సిబ్బంది.. అందరం కరోనా పరీక్ష చేయించుకున్నాం. నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ మేమందరం 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే కరోనా బారిన పడ్డ మా సిబ్బంది బాగోగులను చూసుకుంటాను. వారు త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉంది. కరోనా బారినపడకుండా మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలి. అందరం ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరాన్ని పాటిస్తూనే అందరం కలిసికట్టుగా ఈ వైరస్ను ఓడించగలమని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కరణ్ జోహార్. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం జరిపిన కోవిడ్ పరీక్షలో తన ఇంటి స్థాఫ్ ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యిందని స్వయంగా కరణ్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. మిగతా ఇంటి సభ్యులకు, సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదని అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా సోకిన ఇద్దరిని వెంటనే తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచామని, వారికి అన్ని విధాల అండగా నిలుస్తాం. అధికారులు సూచించిన అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. వారికి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాం త్వరలోనే వారు కోలుకుంటారు అని కరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (ఒంటరినైపోయినట్లు అనిపించింది ) "ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కాగానే వెంటనే ముంబై మున్సిపాల్ కార్పోరేషన్కి సమాచారం ఇచ్చాం. సిబ్బంది వచ్చి మా ఇంటిని, చుట్టు పక్కన ప్రాంతాన్ని కెమికల్ స్ప్రే చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా ఇంట్లో వాళ్లందరం రానున్న 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటాం. కరోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తే కరోనాను ధీటుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి" అంటూ కరణ్ ట్వీట్ చేశారు. pic.twitter.com/mjcsXZcQ0w — Karan Johar (@karanjohar) May 25, 2020 ఇక సోమవారం కరణ్ పుట్టినరోజు. 47 ఏళ్లు పూర్తిచేసుకొని 48వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంట్లోనే కేక్ కట్ చేసిన కరణ్..తన ఇద్దరు పిల్లలు యశ్ , రూహి సరదాగా తనను బుడ్డా (ముసలోడా )అంటూ పిలిచిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. (యశ్ నోట ‘ఐ లవ్ ఇండియా’ ) లాక్డౌన్ మొదలైనప్పటినుంచి జట్టుకు రంగు వేయక తెల్లబడిందని, దీంతో పిల్లలు తనను ముసలోడా అంటూ ఆటపట్టిస్తున్నారని పేర్కొన్నాడు. అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే టాప్ 10 లో చోటు దక్కించుకుంది. దేశంలో ఇప్పటివరకు 1,38,345 కరోనా కేసులు నమోదవగా, 4021 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్
కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఒక ఒప్పందం కుదర్చుకోనుంది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి తొలగించనుది. అంతేకాదు రానున్న రెండు నెలల్లో సగం జీతానికే (50 శాతం వేతన కోత) పైలట్లు విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. మరోవైపు మరో ప్రత్యర్థి సంస్థ వర్జిన అట్లాంటిక్ రాబోయే రోజుల్లో వందల మిలియన్ల పౌండ్ల విలువై ఉద్దీపన కోసం యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించనుందని భావిస్తున్నారు. అయితే యూకే ఆర్థికమంత్రి రిషి సునక్ ఇటీవలమాట్లాడుతూ, విమానయానసంస్థలకు "చివరి ప్రయత్నంగా"సహాయం చేయడానికి మాత్రమే ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వాటాదారుల నుండి డబ్బును సేకరించడానికి ప్రయత్నించమని విమానయాన సంస్థలను కోరారు. ఈ విషయంలో "కేసుల వారీగా" నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా కరోనా కల్లోలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీదాదాపు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశాయి. బీఏ కంపెనీ కూడా దాదాపు అన్ని విమానాలు సేవలు నిలిపి వేసింది. ప్రపంచ ప్రయాణ ఆంక్షలు, క్షీణిస్తున్న డిమాండ్ విమానయాన సంస్థలు కుదేలవుతున్న సంగతి విదితమే. (కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్) చదవండి : కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
ఆస్పత్రిలో డ్యాన్సులపై ఆరా
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ ఏవీఆర్ మోహన్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించి ఐదేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 2న ఆస్పత్రి వైద్య అధికారులు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది డ్యాన్సులతో హోరెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు డ్యాన్సుల ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా జాయింట్ కలెక్టర్–2 నంబూరి తేజ్ భరత్ను నియమించారు. ఆయన మంగళవారం ఉదయం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో విచారణ చేపట్టారు. డ్యాన్సులు చేసిన హాలును, సమీపంలోని రోగుల వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్యసేవలపైనా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థినులనూ ఆరా తీశారు. ఆ రోజు ఏమి జరిగిందనే దానిపై క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన సిబ్బంది, అధికారులు, విద్యార్థినులు, రోగుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ముత్యాలరాజు విచారణకు ఆదేశించారని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అందరినీ విచారించాల్సి ఉందని వెల్లడించారు. -
త్రిదళాధిపతి