Tesla
-
మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారీగా టారిఫ్లుప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు. ఇదీ చదవండి: యాక్టివ్గా ఉన్న కంపెనీలు 65 శాతమేసుంకాలు తగ్గింపుమోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్లు ఉన్నప్పటికీ భారత మార్కెట్లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది. -
భారత్ టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం
-
టెస్లా వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్లా.. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న అమెరికాకు చెందిన ఈ ఈవీ దిగ్గజం ఎట్టకేలకు భారత్లో అడుగుపెడుతోంది. ఇందుకోసం నియామకాలను మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై కేంద్రంగా 13 రకాల పోస్టులకు సిబ్బంది అవసరమంటూ లింక్డ్ఇన్ వేదికగా కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. దీంతో కంపెనీ రాక ఇక లాంఛనమే అయింది. ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా వ్యవస్థాపకుడు, అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో టెస్లా నియామకాలు మొదలుపెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్న విషయం విదితమే. తొలుత మోడల్–3.. పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను తొలుత భారత్కు టెస్లా దిగుమతి చేసుకోనుంది. అన్ని అనుకూలిస్తే తయారీ కేంద్రం కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్లా ఈ ఏడాది భారత్లో తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్లో కంపెనీ నుంచి చవక కారు ‘మోడల్–3’ ధర దాదాపు రూ.26 లక్షలు ఉంది. భారత మార్కెట్లో పోటీగా ఉండేందుకు మోడల్–3లో చవక వెర్షన్ ముందుగా రంగ ప్రవేశం చేసే చాన్స్ ఉంది. దశాబ్దం తర్వాత క్షీణత.. టెస్లా ప్రపంచవ్యాప్తంగా 2024లో 17.9 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2023తో పోలిస్తే అమ్మకాలు 1.1 శాతం క్షీణించాయి. విక్రయాలు 12 ఏళ్ల తర్వాత తగ్గడం గమనార్హం. కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నంబర్–1 ర్యాంక్ను నిలబెట్టుకోవడానికి కంపెనీ గత సంవత్సరం ధరలను పదేపదే తగ్గించినప్పటికీ విక్రయాలు క్షీణించాయి. ప్రస్తుతం సగటు కారు విక్రయ ధర 41,000 డాలర్లు నమోదైంది. ప్రధానంగా చైనాకు చెందిన బీవైడీ నుంచి టెస్లా పోటీ ఎదుర్కొంటోంది. బీవైడీ గత ఏడాది 17.6 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థ మొత్తం అమ్మకాల్లో చైనా వాటా ఏకంగా 90 శాతం ఉంది. భారత్లో 2024లో వివిధ కంపెనీల ఈవీల విక్రయాలు 99,068 యూనిట్లు నమోదయ్యాయి. చైనాలో ఈ సంఖ్య 1.1 కోట్లకుపైమాటే. షోరూంలు ఎక్కడంటే.. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో, ముంబై విమానాశ్రయం సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లా షోరూంలు రానున్నాయి. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి. ఇవి షోరూంలు మాత్రమే. సరీ్వస్ కేంద్రాలు కావు.ఉద్యోగాలివీ..బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సరీ్వస్ మేనేజర్, సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్, స్టోర్ మేనేజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్జూమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ కావాలంటూ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు, దరఖాస్తుకు లింక్డ్ఇన్లో టెస్లా పేజీని చెక్ చేసుకోవచ్చు. భారత్పై ఆసక్తి... టెస్లా కొన్నేళ్లుగా భారత్లో అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉంది. ఇక్కడి పన్నులే అడ్డంకిగా నిలిచాయి. దేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలతో మొదట విజయం సాధిస్తే టెస్లా భారత్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయవచ్చని 2021 ఆగస్టులో మస్క్ ప్రకటించారు. టెస్లా తన వాహనాలను భారత్లో విడుదల చేయాలని భావిస్తోందని ఆయన చెప్పారు. అయితే దిగుమతి సుంకాలు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేనంతగా ఇక్కడ అత్యధికంగా ఉన్నాయని అన్నారు. కాగా, 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై 110 శాతం దిగుమతి సుంకాన్ని గతంలో భారత్ విధించింది. విదేశీ ఈవీ సంస్థలను భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాన్ని 70 శాతానికి తగ్గించింది. -
ముంబై, ఢిల్లీలో నియామకాలు చేపడుతున్న మస్క్ కంపెనీ
-
భారత్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న టెస్లా
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యూహాత్మక ఎత్తుగడ..టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో అవకాశాలుచైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..స్టార్ లింక్కు గ్రీన్ సిగ్నల్..?ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. -
మోదీతో మస్క్ భేటీ.. స్పేస్ఎక్స్, టెస్లాకు లైన్క్లియర్?
అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్లో సమావేశమయ్యారు. మోదీ ట్రంప్తో చర్చలకు ముందు మస్క్ను కలిశారు. ఈ సమావేశం ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార సంబంధాల భవిష్యత్తుపై ఊహాగానాలను రేకెత్తించింది.వ్యాపార సంస్కరణలకు భారత్ మద్దతుసమావేశం అనంతరం ఇరువురి మధ్య చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయని మోదీ తెలిపారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. వ్యాపార సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన(మినిమం గవర్న్మెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్)’ అనే భావనను మోదీ హైలైట్ చేశారు. మోదీతో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకొని వచ్చారు. ఆ చిన్నారులతో మోదీ కాసేపు ముచ్చటించారు.వ్యాపార ఆసక్తులు, అవకాశాలుఈ సమావేశం అనంతరం మస్క్కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి దేశం ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నందున ఇండియాలోకి టెస్లా ఉత్పత్తులను తీసుకురావడానికి ఈ చర్చలు దారితీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ క్యాంపస్లో కార్మిక శాఖ అధికారుల విచారణభారత్-అమెరికా సంబంధాలపై ప్రభావంఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారానికి మోదీ-మస్క్ మధ్య జరిగిన సమావేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఆంత్రప్రెన్యూర్షిప్, సుపరిపాలనలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను కూడా ఈ చర్చల్లో ప్రస్తావించినట్లు అధికారులు చెప్పారు. -
టెస్లా బాస్ చేతికి టిక్టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అధిక ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok)ను ఇప్పటికే భారత్తో సహా చాలా దేశాలు నిషేధించాయి. అమెరికా కూడా ఈ యాప్ను నిషేదించనున్నట్లు సమాచారం. కానీ దీనిని (టిక్టాక్) ఇలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత?.. దీనిపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చూసేద్దాం.భద్రతా కారణాల దృష్ట్యా.. టిక్టాక్ యాప్ను అమెరికా నిషేధించాలని యోచిస్తోంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి.. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ (ByteDance) ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత మస్క్కు విక్రయించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ స్పందించారు.నేను టిక్టాక్ కొనుగోలుకు బిడ్డింగ్ వేయలేదు. దానిని కొనుగోలు చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళా ఆ యాప్ కొనుగోలు చేస్తే దానిని ఏమి చేయాలో తెలియదు. కంపెనీలను కొనుగోలు చేయడం కంటే.. కొత్త కంపెనీలను నెలకొల్పడమే నాకు ఇష్టం అని మస్క్ స్పష్టం చేశారు.2017లో ప్రారంభమైన టిక్టాక్, అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో.. అంతే వేగంగా ఈ యాప్ను పలు దేశాలు రద్దు చేశాయి. అమెరికా కూడా ఈ యాప్పై ఆంక్షలు విధించింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: యూట్యూబర్పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం.. తరువాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు ఓ డెడ్లైన్ ఇచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లో టిక్టాక్ను విక్రయించాలని సూచించింది. అయితే కంపెనీ జాయింట్ వెంచర్లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే.. టిక్టాక్కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ టిక్టాక్ను మస్క్కు విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి. -
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్మస్క్ టిక్టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
మస్క్కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
సోరోస్కు మెడల్ హాస్యాస్పదం: మస్క్
వాషింగ్టన్ : బిలియనీర్ జార్జ్ సోరోస్కు అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందించడాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి అధ్యక్షుడు బైడెన్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రదానం చేయడం హాస్యాస్పదమన్నారు. నిక్కీ హేలీ, సెనేటర్ టిమ్ షీహీ సహా పలువురు రిపబ్లికన్ నేతలు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రధాని మోదీని జార్జ్ సోరోస్ ఇటీవల బహిరంగంగా విమర్శించడం తెలిసిందే. ఆయనతో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత పురస్కారమైన మెడల్ ఆఫ్ ఫ్రీడంను బైడెన్ ప్రదానం చేశారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ, ఫుట్బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ, నటుడు డెంజల్ వాషింగ్టన్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు తీసుకునేందుకు వేదికనెక్కిన హిల్లరీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సోరోస్ తరపున ఆయన కుమారుడు అవార్డును స్వీకరించారు. ఈ గౌరవం తననెంతగానో కదిలించిందని సోరోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వలసదారునైన తనకు అమెరికాలో స్వేచ్ఛ లభించిందన్నారు. -
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
అమెరికాలో దాడులు.. ట్రెండింగ్లో ఆ కంపెనీ
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో జరిగిన వరుస ప్రమాదాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. లాస్ వెగాస్లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump)కు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో పలువురు మృతి చెందారు.లాస్ వెగాస్లోని టెస్లా సైబర్ట్రక్ పేలుడు.. న్యూ ఓర్లీన్స్ ట్రక్ దాడికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ప్రమాదాలు ఒకే రోజు సంభవించాయి. అంతే కాకుండా ఈ రెండు వాహనాలను 'టూరో' (Turo) నుంచి అద్దెకు తీసుకున్నారు.న్యూ ఓర్లీన్స్లో జరిగిన సంఘటన తర్వాత, అనుమానితుడు 'షంసుద్ దిన్ జబ్బార్' కారును ఎలా స్వాధీనం చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్బీఐ తెలిపింది. దాడి చేసిన ఈవీ పికప్ ట్రక్కులో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండా కనిపించిందని ఎఫ్బీఐ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే.. అనుమానితునికి ఐఎస్ఐఎస్ మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు పుడుతున్నాయి.లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ట్రక్ పేలుడులో అనుమానితుడుగా 37 ఏళ్ల 'మాథ్యూ లైవెల్స్బెర్గర్'గా గుర్తించినట్లు యుఎస్ మీడియా నివేదికలు తెలిపాయి. అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. షంసుద్ దిన్ జబ్బార్ 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన ఆర్మీ వ్యక్తి. మాథ్యూ లైవెల్స్బెర్గర్ కూడా యుఎస్ ఆర్మీ వెటరన్. అంటే వీరిరువురూ.. ఆర్మీలో పనిచేసినవారే. ఆర్మీలో పనిచేసిన వారు ఈ దాడులకు పాల్పడ్డారా? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.టూరో కంపెనీ గురించిటూరో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ రెంటల్ యాప్. దీనిని శాన్ ఫ్రాన్సిస్కోలో 2010లో స్థాపించారు. 2010లో రిలే రైడ్స్గా ప్రారంభమై.. 2015లో టురోగా మారింది. ఇది వినియోగదారులు కలవకుండానే వారికి నేరుగా కార్లను అద్దెకు తీసుకునేందుకు అనుమతిస్తుంది.ఎలా అంటే.. వినియోగదారులు తమ లొకేషన్ను ఎంటర్ చేసిన తర్వాత సమీపంలో అందుబాటులో ఉన్న అద్దె కార్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. టయోట, పోర్షెస్, టెస్లాస్తో సహా అనేక రకాల కార్లు టూరోలో అద్దెకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కారును అద్దెకు తీసుకోవాలంటే.. 18 సంవత్సరాలు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి కార్లను బుక్ చేసుకున్న వారిగురించి తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్
రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూసినప్పటి నుంచి.. చాలా మందికి రోబోలు మనిషిలాగే ప్రవర్తిస్తాయా? అనే అనుమానం వచ్చింది. అయితే రోబోలు మనుషులను మించిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నట్లు, కొన్ని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మనిషిలా నడిచే ఒక రోబో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సారథ్యంలో టెస్లా.. కార్లను మాత్రమే కాకుండా.. రోబోలను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి రోబోలు మనిషి మాదిరిగానే నడుస్తున్నాయి. వీడియోలో గమనిస్తే.. ఒక రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతూ.. కొంత తడబడింది. అంతలోనే కంట్రోల్ చేసుకుని కిందకి పడిపోకుండా.. మెల్లగా దిగడం చూడవచ్చు.ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని నెమ్మదిగా దిగటమే కాకుండా.. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని కూడా రోబో ఎక్కడం కూడా చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రోబోలు మనుషుల్లా ప్రవర్తించే రోజులు వచేస్తున్నాయని స్పష్టంగా అవగతమవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tesla (@teslamotors) -
భారత్కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్లోని సైబర్ హబ్తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
చర్చల దశలోనే టెస్లా, స్టార్లింక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్ను చూస్తుంది. స్టార్లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు. నేపథ్యం ఇదీ... ఈ ఏడాది ఏప్రిల్లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది. భారత్లో టెస్లా తయారీ యూనిట్ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్లింక్ కోసం భారతీయ మార్కెట్పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. స్టార్లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది. ట్రంప్ ’భారత్ స్నేహితుడే’ సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు. ల్యాప్టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు భారత్ ల్యాప్టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు. 300 చట్టాలు డీక్రిమినలైజ్.. 300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. 32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ఎస్డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్లో వెలువరించే యాడ్స్కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్తో మస్క్కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్
చదువుకునే చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యమవుతుందంటున్నాడు.. పూణేకు చెందిన ఓ యువకుడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.పూణేకు చెందిన 'ధృవ్ లోయ' అమెరికాలో ఉద్యోగం కోసం ఐదు నెలలు శ్రమించాడు. జాబ్ కోసం 300 అప్లికేషన్స్, 500 కంటే ఎక్కువ ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా తాను 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరైనట్లు పేర్కొన్నాడు. చివరకు ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్గా ఉద్యోగం సంపాదించాడు.ఉద్యోగం సాధించిన తరువాత.. జాబ్ కోసం ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇందులో తాను ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. మూడు ఇంటర్న్షిప్లు పొందినా, మంచి జీపీఏ ఉన్నప్పటికీ.. జాబ్ తెచ్చుకోవడానికి ఐదు నెలల సమయం పట్టిందని చెప్పాడు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..వీసా గడువు పూర్తయిపోతుందేమో అన్న భయం.. ఉద్యోగం లేకుండానే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనేలా చేసింది. అయినా ప్రయత్నం ఆపకుండా.. అమెరికాలో ప్రతి డాలర్ను జాగ్రత్తగా వినియోగించాను. మిత్రుల అపార్ట్మెంట్లలో ఉండాల్సి వచ్చింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని టెస్లా కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నాడు. -
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్గా మారుతున్నాయి. ఇటీవల వైరల్గా మారిన ఓ మీమ్కు సంబంధించి ఇలొన్మస్క్ స్పందించారు.ఎక్స్లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
మరో సంచలనానికి తెరతీసిన ఎలాన్ మస్క్
-
టెస్లా .. రోబోట్యాక్సీ..
లాస్ ఏంజెలిస్: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్క్యాబ్’ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్ చెప్పారు. సైబర్క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్ తెలిపారు. అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్ను కూడా మస్క్ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. -
కదిలి వచ్చిన రోబోల దండు..!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.pic.twitter.com/VK9vlGF0Ms— Elon Musk (@elonmusk) October 11, 2024ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాభవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు. -
‘సిక్లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్లీవ్లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్లీవ్లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
ప్రపంచ తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా 2027 నాటికి రికార్డ్ సృష్టించనున్నారు. మరుసటి ఏడాది (2028లో) అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సైతం ట్రిలియనీర్ అవుతారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక అంచనా వేసింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2033లో ఈ స్థానానికి చేరుకుంటారని పేర్కొంది. ఎలాన్ మస్క్ 237 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. 2027 నాటికి ట్రిలియనీర్ స్థానానికి చేరుకోవాలంటే మస్క్ నికర సంపద ఏటా 110 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. అదానీ 100 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మాదిరే అదానీ సంపద ఏటా 123 శాతం చొప్పున పెరుగుతూ పోతే, ఎలాన్ మస్క్ తర్వాత 2028లో ప్రపంచ రెండో ట్రిలియనీర్ అవుతారని ఈ నివేదిక అంచనా వేసింది. 111 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్ అవుతారని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2035లో లక్ష కోట్ల డాలర్ల మార్క్ను చేరుకుంటుందని అంచనా వేసింది. 2025లో టీఎస్ఎంసీ: తైవాన్కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ టీఎస్ఎంసీ మార్కెట్ విలువ 893.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, వచ్చే ఏడాది ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఎలాన్ మస్్క, గౌతమ్ అదానీ, ఎన్వీడియా వ్యవస్థాపకుడు జెన్సెస్ హాంగ్, ఇండోనేసియాకు చెందిన ప్రజోగో పాంగెట్సు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఫేస్బేక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ట్రిలియనీర్లుగా అవతరించే అవకాశాలున్నట్టు వివరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్, ఎన్వీడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్కో, మెటా, బెర్క్షైర్ హాత్వే ఉన్నాయి. -
టెస్లా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా.. కారణం ఇదే
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికి చెందిన ''శ్రీలా వెంకటరత్నం'' రాజీనామా చేశారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.శ్రీలా వెంకటరత్నం టెస్లాలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్గా తన ఉద్యోగం ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపటానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.టెస్లాలో ఆమె ప్రారంభ రోజుల నుంచి ప్రాజెక్ట్లను మ్యాపింగ్ చేస్తూ కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తుంన్నాను అంటూ వెల్లడించింది. తానూ కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని, ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.శ్రీలా వెంకటరత్నం లింక్డ్ఇన్ పోస్ట్కు, టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలను సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. -
రోజుకు రూ.28000 జీతం: ఏడు గంటలే పని!
ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు రూ. 28000 సంపాదించుకోవచ్చు. ఇంతకీ జాబ్ ఏంటి? అక్కడ ఏం చేయాల్సి ఉంటుందనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్-క్యాప్చర్ సూట్ & వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి రోజూ ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5'7' నుంచి 5'11' ఎండీ ఉండాలి. వీరు 13 ఫౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవేఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు.. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పని చేయాల్సి ఉంటుంది. -
‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.జీఓక్యూఐఐ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కంపనీ సీఈఓ గోండాల్ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్ 3 కారును ప్రీబుకింగ్ చేసుకున్నాను. ఏప్రిల్ 2016లో టెస్లా కారు భారత్లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ట్రక్ ఆర్డర్ల నిలిపివేత!ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్గరేజ్, బెంజ్, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
సైబర్ట్రక్ ఆర్డర్లను నిలిపేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్ట్రక్ బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్ట్రక్ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్ను ఆర్డర్ చేయాలని తెలిపింది.టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కలిగిన సైబర్ట్రక్ బేసిక్ వేరియంట్ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్ వస్తున్నట్లు సమాచారం. సైబర్ట్రక్ ప్రీమియం వేరియంట్ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్ చేసుకున్నారని ఇలాన్మస్క్ తెలిపారు. ఇందులో బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్ట్రక్ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్ను బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్ పెరిగి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్ను ఆర్డర్చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది. ఇది యూఎస్లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్ట్రక్ను ఆవిష్కరించింది. బేసిక్ వేరియంట్ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్ మోటార్ వేరియంట్ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్ వేరియంట్ సైబర్బీస్ట్’ మోడల్ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
భారీగా తగ్గిన టెస్లా సేల్స్.. కారణం ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) సపోర్ట్ చేస్తున్నారనే విషయం రాజకీయ వివాదం రేకెత్తించింది. ఇది టెస్లా అమ్మకాలపైన తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.ట్రంప్కు మస్క్ ఇస్తున్న మద్దతును చాలామందికి నచ్చడం లేదు. దీనివల్ల టెస్లా కార్లను కొనుగోలు చేయకుండా ఊరుకున్నారు. ఈ కారణంగా టెస్లా కార్ల విక్రయాలు 50 శాతం తగ్గిపోయింది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా తెలియడం లేదు.బ్యాటరీతో నడిచే వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యునైటెడ్ స్టేట్స్లో మాత్రం అమ్మకాలు క్షిణించాయి. టెస్లాతో పోలిస్తే.. ఇతర ప్రత్యర్థుల సేల్స్ కొంతవరకు ఉత్తమంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. టెస్లా కార్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పలువురు నెటిజన్లు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాల ద్వారా పేర్కొంటున్నారు. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్
వాషింగ్టన్: గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వెల్లడించారు. టెక్సాస్లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఓ యూజర్ ‘దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్.. రేపు మీ వంతు రావచ్చు’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ... ‘నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్ చేశారు’అని తెలిపారు. ఏ సమయంలోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
టెస్లాలో కాఫీ కప్పుల దొంగలు.. 65 వేల కప్పులు మాయం!
టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్లు మాయవుతున్నాయట.కాఫీ మగ్ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.బెర్లిన్కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. -
భారత్కు టెస్లా ఇక రానట్టేనా?
ఇలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు తమను సంప్రదించడం మానేయడంతో టెస్లా ఇక్కడ పెట్టుబడుల పెట్టే అంశంలో ముందుకు వెళ్తుందని భారత్ ఆశించడం లేదు.మస్క్ ఏప్రిల్ చివరిలో భారత పర్యటనను వాయిదా వేసుకున్న తరువాత మస్క్ బృందం తమతో తదుపరి సంప్రదింపులు జరపలేదని న్యూఢిల్లీలోని అధికారులు చెప్పినట్లు మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. టెస్లాకు మూలధన సమస్యలు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో భారత్లో కొత్త పెట్టుబడులు పెట్టే యోచన లేదని ప్రభుత్వానికి అర్థమైంది.టెస్లా ప్రపంచవ్యాప్తంగా త్రైమాసిక డెలివరీలలో వరుసగా రెండవసారి క్షీణతను నివేదించడం, చైనాలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నందున భారత్పై ఆసక్తి తగ్గింది. ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షించే భారత భారీ పరిశ్రమల శాఖ, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గానీ, టెస్లా గానీ దీనిపై స్పందించలేదు. -
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులకు ముందు అమరికలో సైబర్ట్రక్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత కంపెనీ సుమారు 11,688 సైబర్ ట్రక్కులకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి? దీనికోసం కంపెనీ చార్జెస్ వసూలు చేస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెస్లా కంపెనీ లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్కులను రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.. విండ్షీల్డ్ వైపర్ పనిచేయకపోవడం, ట్రంక్ బెడ్ ట్రిమ్ సమస్య అని తెలుస్తోంది. ఈ రెండు సమస్యల కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వెల్లడించింది.ఏజెన్సీ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో విండ్షీల్డ్ వైపర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా విఫలమవుతుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు సమయంలో ప్రమాదానికి కారణం అవ్వొచ్చని తెలుస్తోంది. 2023 నవంబర్ 13 నుంచి జూన్ 6 మధ్య తయారైన వాహనాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టమర్లకు ఆగష్టు 18న మెయిల్ ద్వారా మెయిల్ అందుతుంది. ఈ రీకాల్ కోసం కంపెనీ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.ఇప్పటి వరకు సైబర్ ట్రక్కుల వినియోగదారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని.. కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. దీనిని సైబర్ట్రక్ వినియోగదారులు సులభంగా ఎటువంటి చార్జీలు చెల్లించకుండా వినియోగించుకోవచ్చు. -
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్వేర్ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?
ప్రముఖ ఎలక్ట్రిక్కార్ల తయారీసంస్థ టెస్లా సీఈఓ ఇలాన్మస్క్ ఏడాది వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మనలో చాలామంది వేతనం ఏటా రూ.లక్షల్లో ఉంటుంది కదా. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారి జీతం రూ.కోట్లల్లో ఉంటుందని తెలుసు కదా. మరి, మస్క్ వేతనం ఎంతో తెలుసా.. ఏకంగా రూ.4.67లక్షల కోట్లు(56 బిలియన్ డాలర్లు). ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయనకు ఇంత వేతనం ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు కూడా అనుమతించారు. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో మస్క్ నం.1గా కొనసాగుతున్నారు.టెక్సాస్లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన వార్షిక వేతనం ఏకంగా 56 బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.4,67,880 కోట్లు)గా నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ప్యాకేజీలో వాటాదారులు సవరణలు చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేతనంలో సింహభాగం నగదు రూపంలో కాకుండా ‘ఆల్-స్టాక్ కంపెన్జేషన్’(ఏడాదిలో స్టాక్ విలువ పెంపు ఆధారంగా షేర్ల కేటాయింపు)గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. తాజాగా నిర్ణయించిన ప్యాకేజీలోని స్టాక్లను ఐదేళ్లపాటు విక్రయించనని మస్క్ హామీ ఇచ్చారు.టెస్లా కంపెనీలోని ఏఐ పురోగతిని వేరేచోటుకి తీసుకెళ్లకుండా నిరోధించడానికి కంపెనీలో 25% వాటాను కోరుతున్నట్లు గతంలో మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన కోరుకున్న వేతన ప్యాకేజీని ఇవ్వడంలో వాటాదారులు విఫలమైతే కంపెనీ తయారుచేస్తున్న ఏఐ, రోబోటిక్స్ ఉత్పత్తులను బయట తయారుచేస్తానని జనవరిలోనే చెప్పారు. తాను కంపెనీతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు మస్క్ ఏజీఎంలో తెలిపారు. ఇప్పటికే వేతనానికి సంబంధించి ఇలాన్మస్క్ డెలావేర్ ఛాన్సరీ కోర్టులో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్కు తేదీ ఖరారు..?ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బీవైడీ, షావోమీ వంటి చైనా కంపెనీలు రంగప్రవేశం చేయడంతో టెస్లాకార్లకు డిమాండ్ మందగించిందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇటీవల విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు క్షీణించాయి. లాభాల మార్జిన్లు తగ్గినట్లు కంపెనీ నివేదించింది. -
మనిషికో రోబో!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. సంస్థ వాటాదారుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో భాగంగా టెస్లా లీగల్ కార్యాలయాన్ని యూఎస్లోని డెలావర్ నుంచి టెక్సాస్కు మార్చేందుకు షేర్హోల్టర్లు అనుమతించారు.టెస్లా ట్యాక్సీలుఏజీఎంలో మస్క్ మాట్లాడుతూ..‘టెస్లా యాజమానులకు మరింత విలువ జోడించేలా, కంపెనీ వల్ల తమ ఆదాయం పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్లా వినియోగదారులు తమ కార్లను ఉబర్, ఎయిర్బీఎన్బీ మాదిరిగానే రెంట్కు ఇచ్చేలా కొత్త యాప్ను తీసుకు రాబోతున్నాం. కొన్ని గంటలు, రోజులు, వారాలపాటు యాజమానులు తమ కారును రెంట్కు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నాం. దాంతో యూజర్లకు అదనంగా ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.హ్యూమనాయిడ్ రోబోట్స్‘హ్యూమనాయిడ్ రోబోట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారు. దాంతో కంపెనీ తయారుచేసే ఆప్టిమస్ రోబోలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదు’ అని మస్క్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంసస్టైనబుల్ ఎనర్జీ‘టెస్లా కార్లలో వినియోగించే బ్యాటరీల సమర్థతను పెంచేలా చర్యలు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. స్థిరమైన శక్తిని అందిస్తూ స్టోరేజీ కెపాసిటీను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మస్క్ చెప్పారు. -
కారణం లేకుండానే ట్రంప్ పిలుస్తారు.. మస్క్ కీలక వ్యాఖ్యలు!
టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల తన కంపెనీలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడారు. కారణం లేకుండానే ట్రంప్ తనను పిలుస్తూ ఉంటారని, ఎందుకు పిలుస్తారో నాకే తెలియదని అన్నారు.డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో జరిగిన ర్యాలీలో తనను (మస్క్) ప్రశంసించారని పేర్కొన్నారు. ట్రంప్.. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాకుండా నాకు కూడా పెద్ద అభిమాని అని చెప్పినట్లు వెల్లడించారు. సైబర్ట్రక్కి ట్రంప్ పెద్ద ఫ్యాన్ కూడా అని ఈ సందర్భంగా మస్క్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్ నన్ను పిలిచినప్పుడు చాలా బాగుంటుందని మస్క్ అన్నారు. ఈవీలు భవిష్యత్తుకు మంచివని, బ్యాటరీతో నడిచే కార్లలో అమెరికా అగ్రగామిగా ఉందని ట్రంప్ చెప్పినట్లు టెస్లా సీఈఓ వెల్లడించారు. టెస్లా కార్లను నా స్నేహితులలో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారని అన్నారు. -
మస్క్పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
కర్ణాటకలో టెస్లా..? ‘నేను స్వార్థపరుడిని కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తాను స్వార్థపరుడిని కాదని, తన దృష్టి దేశ అభివృద్ధిపైనే ఉందని అన్నారు. తాను దృష్టి కేవలం సొంత రాష్ట్రం కర్ణాటకపైన లేదని, మొత్తం భారత్ దేశం అంతటా అభివృద్ది చెందాలని ఉన్నట్లు తెలిపారు. ఆయన భారీ పరిశ్రమల శాఖమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో తన ఫ్యాక్టరీ పెట్టాలని ఆసక్తి చూపుతుందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించారు. ‘‘ టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా ప్రాధ్యాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అభివృద్ధి. దాని ప్రకారమే పని చేస్తాం. నేను అంత స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని హెచ్డీ కుమార స్వామి అన్నారు.నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా టెస్లా సీఈఓ ఇలాన్ మాస్క్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఇక.. బీజేపీ కూటమిలో భాగంగా కుమార స్వామి జేడీఎస్ పార్టీ రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి కేంద్రమంతి పదవి దక్కించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్డీయే కూటమి పార్టీలు 28 స్థానాలకు గాను 19 సీట్లతో విజయం సాధించాయి. -
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్ను ఓ చిన్న కంప్యూటర్తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్వర్క్లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024 -
భారత్లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్కు ఆహ్వానంఆ ట్వీట్కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
మస్క్ రూ.24వేలకోట్లు తిరిగి ఇచ్చేయాలి.. పిటిషన్ దాఖలు
టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్మస్క్ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్ప్లస్ కూటమి ప్రభావంఇన్సైడ్ ట్రేడింగ్ అంటే..కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్టైమ్లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు. -
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం. -
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్తో భారత్లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
పిల్లల తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిన మస్క్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండడం పట్ల టెస్లా సీఈఓ ఎలొన్మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్లోని వివాటెక్ ఫెయిర్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐ అల్గారిథమ్ల ద్వారా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించారు. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పిల్లలను సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. వాటిలోవాడే అధునాతన ఏఐ అల్గారిథమ్లు పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తాయి. అవి చిన్నారుల్లో డొపమైన్ స్థాయిలను పెంచేలా ఉంటాయి. దాంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏఐ ఆధారిత కంటెంట్తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో నా పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించకపోవడం తప్పుగా భావిస్తున్నాను. ప్రస్తుతం కొన్ని పరిమితులు విధించాను. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో గమనిస్తున్నాను’ అని చెప్పారు.ఎలొనమస్క్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో వచ్చే పిల్లల కంటెంట్ అంశంపై ఆయన స్పందించారు. చిన్నారుల కంటెంట్ విషయంలో తమ సంస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అనవసర అంశాలను తొలగించడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అదికాస్త వైరల్గా మారింది. పారిస్ ఈవెంట్లో మస్క్ ఏఐ ప్రభావంపై మాట్లాడుతూ..‘కృత్రిమమేథ చివరకు అందరి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తుంది. ఏఐ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో మానవ మనుగడ ఎలా ఉండబోతుందోననే ఆందోళనలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరతమస్క్ ఈ సందర్భంగా ఇయాన్ ఎం.బ్యాంక్స్ విడుదల చేసిన ‘కల్చర్ బుక్ సిరీస్’ గురించి ప్రస్తావించారు. ఇది అధునాతన ఏఐ ఉండే సమాజాన్ని తెలియజేస్తుంది. ఈ బుక్ సిరీస్లో భవిష్యత్తును చూపించారని మస్క్ అన్నారు. ‘కంప్యూటర్లు, రోబోట్లు ప్రతిదీ మీ కంటే మెరుగ్గా చేస్తే మీ జీవితానికి అర్థం ఉందా? ఇకపై ఏఐను మించేలా మానవులు మరిన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది’ అని తెలిపారు.A lot of social media is bad for kids, as there is extreme competition between social media AIs to maximize dopamine! https://t.co/bzB8m5qL9z— Elon Musk (@elonmusk) May 23, 2024 -
టెస్లా కొనుగోలు దారులకు మస్క్ అనూహ్య ఆఫర్
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ బంపరాఫర్ ప్రకటించారు. టెస్లా ‘మోడల్ వై’ (Model Y) కొనుగోలు దారులకు 0.99శాతం ఏపీఆర్(యాన్యువల్ పర్సెంటేజ్ రేట్) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ మే 31వరకు కొనసాగుతుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల నుంచి పోటీ, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు టెస్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.ఈ తరుణంలో టెస్లా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో టెస్లా మోడల్ వైపై మోడల్ వై భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వాహనదారులు జీరో పర్సెంట్ వడ్డీతో టెస్లా కారును కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించారు. దీంతో వడ్డీ చెల్లించే అవసరం లేకుండా టెస్లా కారును సొంతం చేసుకోవచ్చు.తాజాగా, అమెరికాలో మోడల్ వైపై 0.99% ఫైనాన్సింగ్తో భారీ తగ్గింపుతో పరిమిత కాల ఆఫర్ను అందిస్తున్నట్లు టెస్లా అధికారికంగా తెలిపింది. సాధారణంగా ఈ వడ్డీ 5 నుండి 7శాతం వరకు ఉంటుంది. కానీ మస్క్ వాహన కొనుగోలు దారులకు 0.99 శాతం వడ్డీకే టెస్లా వై మోడల్ కారును అందిస్తున్నారు. టెస్లా వెబ్సైట్ ప్రకారం, నిబంధనల మేరకు టెస్లా మోడల్ వై కొనుగులు దారులు 4,250వేల డాలర్లు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 72 నెలల టెన్యూర్ ఫైనాన్స్ అందిస్తుంది. ఎలాంటి బెన్ఫిట్ లేకుండా నెలకు 603 డాలర్ల ఈఎంఐ చెల్లించాలి. అర్హతగల కొనుగోలుదారులు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కేవలం 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
శ్రీలంకలో స్టార్లింక్ సేవలకై చర్చ
టెస్లా అధినేత ఎలొన్మస్క్ శ్రీలంకలో స్టార్లింక్ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్ సమావేశమయ్యారు.ఎలొన్మస్క్ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.ప్రెసిడెంట్ మీడియా విభాగం తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్లో దేశాధ్యక్షుడు స్టార్లింక్ అమలుపై మస్క్తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మినిస్టర్ జీవన్ తొండమాన్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్లో దేశ అధ్యక్షుడు, ఎలొన్మస్క్తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.Bringing connectivity to remote communities radically improves access to education and economic opportunitiespic.twitter.com/hDVYvpRDKZ— Elon Musk (@elonmusk) May 19, 2024 -
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎలోన్ మస్క్ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్కు కారణమని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్, హెచ్ఆర్తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. -
టెస్లా సైబర్ట్రక్ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్
సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్ట్రక్ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్ట్రక్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.Cool https://t.co/oS0gzawPCg— Elon Musk (@elonmusk) May 18, 2024 -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
మరో 600 జాబ్స్కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ త్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ భారత్లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్ వేదికగా వివేక్ వాధ్వా మస్క్ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్కు మెయిల్ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్ను వివేక్ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్ తన పోస్ట్లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్మెంట్ టెక్నిక్ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. -
అసోం కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్లో టెస్లా లోగో.. ఏం జరిగిందంటే..
అసోం కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా బుధవారం హ్యాక్ అయింది. ప్రొఫైల్ పేరు 'టెస్లా ఈవెంట్'గా మారిపోయింది. ప్రొఫైల్ ఫొటోగా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా లోగోను పెట్టారు హ్యాకర్లు.ఈ మేరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాతా హ్యాక్కు గురైందని ఏపీసీసీ సోషల్ మీడియా & ఐటీ చైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని, ఇప్పుడే పునరుద్ధరించామని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ పోస్ట్లో తెలిపింది. పూర్తి భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమీక్షలో ఉందని పేర్కొంది. ఇది ప్రభుత్వ పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.We would like to inform you that our official Twitter handle, Assam Pradesh Congress Committee, was hacked but has now been restored and is currently under review to ensure full security. This attempted silencing by the fascist government will not deter us. We remain committed to… pic.twitter.com/DE7vWGXWcv— Tesla Event (@INCAssam) May 8, 2024 -
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో ఒకరు సూపర్చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్షాట్ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్చార్జింగ్ టీమ్తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్చార్జింగ్ టీమ్లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది. -
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది. -
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
గురుగ్రామ్లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్మార్క్ను వాడుకుంటోందని ఎలొన్మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్మార్క్ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్ ఇండియా.. టెస్లా ఇంక్ ట్రేడ్మార్క్ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్లాల్ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్ను పోలి ఉండే ట్రేడ్మార్క్తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం. -
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్చార్జర్ టీమ్లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. -
మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ)కార్లలోని సాఫ్ట్వేర్ను విడుదల చేసేందుకు,ఎఫ్ఎస్డీ అల్గారిథమ్లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్ఎస్డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు. -
నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్ మొత్తానికి మంగళం!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా కంపెనీ వ్యాప్త తొలగింపులలో భాగంగా కొత్తగా ఏర్పడిన మార్కెటింగ్ బృందం మొత్తాన్ని తొలగించింది. సాంప్రదాయ ప్రకటనలకు భిన్నంగా కొన్ని నెలల కిందటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ టీమ్ను ఏర్పాటు చేశారు. సీనియర్ మేనేజర్ అలెక్స్ ఇంగ్రామ్ పర్యవేక్షణలో యూఎస్లో 40 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన "గ్రోత్ కంటెంట్" టీమ్ అంతటినీ తొలగించిట్లు తెలిసింది. గ్లోబల్ టీమ్కు నాయకత్వం వహించిన ఇంగ్రామ్, జార్జ్ మిల్బర్న్లను తొలగించినట్లు వారు తెలిపారు. అయితే ఐరోపాలో కంపెనీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది ఉన్నట్లు ఒకరు చెప్పారు.అలాగే కాలిఫోర్నియాలోని హౌథ్రోన్లో ఉన్న టెస్లా డిజైన్ స్టూడియో సిబ్బందిలో కూడా గణనీయమైన తొలగింపులు జరినట్లుగా తెలిసింది. కాగా బ్లూమ్బెర్గ్ నివేదికకు ఎలాన్ మస్క్ ప్రతిస్పందిస్తూ కంటెంట్ బృందం పని గురించి ‘ఎక్స్’ పోస్ట్లో "ప్రకటనలు చాలా సాధారణంగా ఉంటున్నాయి.. ఏదైనా కారుకైనా సరిపోవచ్చు" అంటూ రాసుకొచ్చారు. తొలగింపులకు గురైన గ్రోత్ టీమ్ను ఇంగ్రామ్ నాలుగు నెలల క్రితం నుంచే నిర్మించడం ప్రారంభించారు.టెస్లా గ్రోత్ టీమ్ తొలగింపు సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతను సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ఎలాన్ మస్క్ గతవారం తెలిపారు. అయితే కంపెనీ సీఈవో 20 శాతం ఉద్యోగులను తొలగింపులకు ఆదేశించినట్లుగా బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 20,000 మందిపైగా ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చు. -
టాప్ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన వాయిదా.. టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. మస్క్ భారత్లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్లో ప్రవేశించేందుకు లైన్క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. -
ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు
దేశంలో అమల్లోకి తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పాలసీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆయా ఈవీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుండగా టెస్లా సలహాదారు కూడా ఇందులో పాల్గొన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, స్కోడా, ఫోక్స్వ్యాగన్ ఇండియా, రెనాల్ట్ వంటి ప్రధాన తయారీదారుల ప్రతినిధులు ఉన్నారు. వీరితోపాటు మెర్సిడెస్ జెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధుల నుంచి ప్రభుత్వ వర్గాలు అభిప్రాయాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలోని అంశాలను ఆయా కంపెనీలకు వివరించింది. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ ఏప్రిల్ 22 నుంచి ఎలొన్మస్క్ భారత పర్యటన ప్రారంభంకానుంది. మస్క్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని భావిస్తున్నారు. మస్క్ను కలిసేందుకు భారత్లోని కొన్ని అంతరిక్ష రంగ స్టార్టప్ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అందులో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ వంటి కంపెనీలున్నట్లు తెలిసింది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా తమ ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించడానికి సన్నద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగిన టెస్లా కంపెనీలో 2023 డిసెంబర్ నాటికి 1,40,473 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల 14000 కంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది. టెస్లా సిబ్బందికి పంపిన ఇమెయిల్లో.. ఇలాన్ మస్క్ (Elon Musk) ఇలా పేర్కొన్నారు.. కంపెనీ తదుపరి వృద్ధికి సిద్దమవుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని అన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్లోని కొంతమంది సిబ్బందికి ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో టెస్లా సైబర్ ట్రక్ ఉత్పత్తి తగ్గించడం కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపుకు కారణం అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే.. టెస్లా షేర్లు ఇటీవలి బాగా దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే.. ఇది సుమారు 31 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ.. ఆ విభాగంలో ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఇది టెస్లా అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
భారత్లో ప్రవేశించనున్న ఎలొన్మస్క్ మరో కంపెనీ
ప్రపంచ ఎలక్ట్రిక్కార్ల దిగ్గజ సంస్థ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఏప్రిల్ 21న భారత్కు రానున్నారు. ఈ తరుణంలో భారత్లో టెస్లా ప్లాంట్ తయారీకి సంబంధించిన అంశాలు చర్చించనున్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రధానితో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అయితే కేవలం టెస్లా అంశమే కాకుండా మస్క్ కీలక ప్రాజెక్ట్ అయిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే స్టార్లింక్ను కూడా ఇండియాలో ప్రవేశపెట్టేలా అధికారులతో చర్చలు జరుపనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్కు సంబంధించి లైసెన్స్ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ), ట్రయల్ స్పెక్ట్రమ్పై పని చేసేందుకు డీఓటీ లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. స్టార్లింక్ లైసెన్స్ కోసం గతంలోనే ఆ సంస్థ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం దరఖాస్తు చేసింది. అయితే డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ విషయంలో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో లైసెన్స్ రద్దు అయింది. తాము అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలనే పాటిస్తామని అప్పట్లో స్టార్ లింక్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం తమ దరఖాస్తును తిరస్కరించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్కు స్పష్టం చేసింది. తర్వాత కొన్నిరోజులకు తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందింది. సెక్యూరిటీ చెక్ తర్వాత శాటిలైట్ సర్వీసులకు సంబంధించిన అనుమతులు మంజూరు అవుతాయని తెలిసింది. దేశీయంగా భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టార్ లింక్కు కూడా అనుమతులు లభిస్తే మూడో సంస్థ అవుతుంది. అదే జరిగితే ఎయిర్టెల్, జియోకు ఈ విభాగంలో గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై డాట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. టెస్లా కంపెనీను భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. -
ఆంధ్రప్రదేశ్కు టెస్లా!?
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. అనంతపురం జిల్లాలో.. “రాష్ట్రాన్ని సందర్శించి, వారి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని టెస్లాను ఆహ్వానించాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని, వారు తమ ప్లాంట్ను నెలకొల్పేందుకు కావాల్సిన చోట భూమిని ఇస్తామని చెప్పాం. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించాం. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉటంకించింది. ఎన్నికల తర్వాత.. టెస్లా బృందం రాష్ట్రానికి వచ్చి వారి అవసరాలకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే వారికి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ పార్టీల నుంచి భూమిని కొనుగోలు చేసైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, 2021, 2022 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ను ఆహ్వానించింది. ఇప్పుడు మరోసారి మస్క్ భారతదేశ పర్యటన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే..
అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మస్క్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఏప్రిల్ 22న భారత్ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానితో భేటీలో భాగంగా భారత్లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్ భారత్లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. Looking forward to meeting with Prime Minister @NarendraModi in India! — Elon Musk (@elonmusk) April 10, 2024 ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఇదీ చదవండి: వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం ఏం జరగబోతుంది.. కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్లో ఇన్వెస్ట్ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్ కంపెనీలకు కాంట్రాక్ట్లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, వైరింగ్ పరిశ్రమలోని కంపెనీలు, టైర్ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్లో తయారీ ప్లాంట్ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు.