three died
-
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు. -
130 కిలోమీటర్ల వేగం.. నిద్రమత్తు... ముగ్గురు మృతి
సాక్షి, చిత్తూరు, తవణంపల్లి: బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిపై తవణంపల్లె మండలం నర్తపుచేను చెరువు వద్ద శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. వివరాలు.. బాపట్ల జిల్లా నాగులుప్పులపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన అశోక్బాబు(33), భార్య మౌనిక (29), కుమారుడు ప్రభవ్ (3) కారులో బెంగళూరు నుంచి గుంటూరులోని అత్తగారింటికి బయలుదేరారు. నర్తపుచేను దగ్గరకు వచ్చేసరికి కారు అదుపుతప్పి పక్కన సరీ్వసు రోడ్డులో ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదతీవ్రతకు డ్రైవింగ్ చేస్తున్న అశోక్ తల, మొండెం వేరయ్యాయి. పక్కసీట్లో ఉన్న భార్య, కుమారుడి తలలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఘటనాస్థలం.. రక్తసిక్తం ప్రమాదస్థలం బీతావహంగా తయారైంది. ఛిద్రమైన శరీరాలతో రక్తసిక్తంగా మారింది. కారు పైభాగం ట్యాంకర్ కిందకు వెళ్లిపోవడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. డ్రైవింగ్ చేస్తున్న అశోక్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తూ ట్యాంకర్ను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. కారులో రెండు సెల్ఫోన్లు దొరికినా, అవి లాక్ అయి ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లకు కాల్ వచ్చేవరకు పోలీసులు వేచి ఉండాల్సి వచ్చింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసరెడ్డి వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బంధువుల ఇంటికొస్తూ.. నాగులుప్పలపాడు : చిత్తూరు జిల్లా తవణంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అశోక్ బాబు స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 20 ఏళ్ల కిందట అశోక్బాబు తల్లిదండ్రులు అద్దంకి ఆంజనేయులు, వెంకాయమ్మ కర్ణాటకలోని రాయచూర్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతుంటారు. అశోక్బాబు పదో తరగతి వరకు నాయనమ్మ వద్ద ఉంటూ ఉప్పుగుండూరు పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత చదువుల తర్వాత బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మౌనికతో ఐదేళ్ల కిందట వివాహమైంది. గుంటూరులో అత్తగారింటికి వస్తున్న అశోక్బాబు కుటుంబం ప్రమాదంలో మృత్యువాత పడటంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, రామంతాపూర్: నగర శివారులోని చౌటుప్పల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణానికి గురయ్యారు. వారంతా రామంతాపూర్ నెహ్రూనగర్లోని ఎలక్ట్రికల్ గృహోపకరణాల అధీకృత సర్వీస్ సెంటర్లో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న యువకులు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. వివరాలివీ... హరీష్(25), సల్మాన్(24), ఆసీఫ్(24)లు శుక్రవారం రాత్రి హరీష్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బైక్పై నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ ధర్మాజిగూడెం వే బ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్ చేస్తూ వారి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సర్వీస్ సెంటర్ పై అంతస్తులో నివసిస్తూ పనిచేసుకుంటున్న హరీష్ స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి. సల్మాన్ది గజ్వేల్. మేడ్చల్ జిల్లా గౌరవరంకు చెందిన ఆసీఫ్ సర్వీస్ సెంటర్ యజమాని సలీంకు సమీప బంధువు కావడంతో రామంతాపూర్లోని భరత్నగర్లోని ఆయన గృహంలోనే ఉంటున్నాడు. ఆసీఫ్ అంత్యక్రియలు రామంతాపూర్లో నిర్వహించారు. చదవండి: బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె -
ముగ్గురిని కాటేసిన కరెంట్: కన్నీటిలో ‘కన్నికాపురం’
కడుపులు మాడ్చుకున్నాం. కష్టాలకోర్చి చదివించాం. మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తుంటే ఎంతో పొంగిపోయాం. త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకుని ఆసరాగా నిలుస్తారని ఆశపడ్డాం. ఇక మాకు కష్టాలు ఉండవని కలలుగన్నాం. కానీ ఆ దేవుడు మా ఆశలను చిదిమేశాడు. చేతికొచ్చిన కొడుకులను తీసుకెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు కొడుకా..? అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన చూపరులను కంటతడి పెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పాలసముద్రం: మండలంలోని కన్నికాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో సోమవారం ముగ్గురు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన చిన్నబ్బమందడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కంకర అవసరం కావడంతో వేల్కూరు నుంచి టిప్పర్లో తెప్పించి అన్లోడ్ చేయిస్తున్నాడు. అంతలోనే పైనే ఉన్న కరెంటు వైర్లు టిప్పర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై డ్రైవర్ మనోజ్ (34) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో గ్రామస్తులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19) ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో ముగ్గురూ మృత్యువాత పడడంతో గ్రామంలో తీరని విషాదం అలుముకుంది. ఆశలన్నీ వారిపైనే గ్రామానికి చెందిన సీదల బాలాజీనాయుడు, ఉష దంపతులకు దొరబాబు, సోమేశ్, చంద్రిమ పిల్లలు. దొరబాబు పెద్దవాడు. సోమేష్, చంద్రిమ కవలలు. ఇంటర్ చదువుతున్నారు. పెద్దకుమారుడి భవిష్యత్తు కోసం తపించారు. ఉన్నకొద్దిపాటి పొలంలో పంటలదిగుబడి అంతంతమాత్రంగా రావడంతో అప్పులపాలయ్యా రు. కానీ పిల్లల చదువుకు వెనకడుగు వేయలేదు. పస్తులుంటూ కూడబెట్టి పెద్ద కుమారుడు దొరబాబును తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ఓ బీటెక్ కళాశాలలో చదివించారు. గతేడాది ఫస్ట్క్లాస్లో పాసవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డారు. కష్టాలు తీరుతాయని సంబరబడ్డారు. ఇంతలోనే విధి వారి ఆశలను చిదిమేసింది. అప్పటివరకు కళ్లెదుట కలియదిరుగుతూ మాటలు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లడిల్లిపోయారు. ఇక అదే గ్రామానికి చెందిన వెంకటేష్ నాయుడు, రోహిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పవన్కుమార్ పెద్దవాడు. చిన్నవాడైన జ్యోతీశ్వర్ చదువుల్లో మేటి. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేశాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి రోహిణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సక్రమంగా నడవలేని స్థితి. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉపాధి పనులకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఇంతలో అనుకోని ప్రమాదం ఓ కుమారుడిని కబళించడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ, పెద్దకాలువ గ్రామానికి చెందిన మనోజ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. మృతులు ముగ్గురూ అవివాహితులు. లాక్డౌన్ లేకుంటే..! కరోనా లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దొరబాబు, జ్యోతీశ్వర్ కూడా ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ లేకుంటే పిల్లలు చదువుల కోసం వెళ్లేవారని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఘోరం: కారులోనే ముగ్గురు సజీవదహనం
మండ్య: రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కాగా, ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్ కైజల్ (45) కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. భార్య మెహక్(33), కుమార్తెలు షేక్ ఐహిల్ (6) మెహైరా (11), సుహాన (12)తో కలిసి ఓ పని నిమిత్తం జిల్లాలోని కొళ్లెగాల హనూరు వచ్చారు. శుక్రవారం ఉదయం బెంగళూరు బయల్దేరారు. హలగూరు భారతీయ పెట్రోల్ బంక్ వద్ద కారు నియంత్రణ తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. కారు నుంచి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. షేక్ కైజల్, సుహాన, షేక్ ఐహిల్ మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్ -
ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్హోల్లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వర్క్ ఫ్రమ్ హోంతో ఇంటికి రాగా ముగ్గురు కరోనాకు బలి
సాక్షి బళ్లారి: కరోనా రక్కసి మృత్యుతాండవం చేసింది. ఒక కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బళ్లారి జిల్లాలో కురుగోడు తాలూకా పరిధిలోని మదిరే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుద్రప్ప కుమారుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. లాక్డౌన్ ప్రకటనతో పాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో నెల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడే కుమారుడికి కరోనా సోకింది. ఇంట్లోనే ఐసొలేషన్లో ఉంటూ కోలుకున్నాడు. అయితే కుమారుడి ద్వారా తల్లి సునీతమ్మ (45), చెల్లి నందిని (18)కి, తండ్రి రుద్రప్ప (56)కు కరోనా సోకింది. సునీతమ్మ, నందిని కంప్లిలో చికిత్స పొందుతూ 15 రోజుల కిందట మృతి చెందారు. తాజాగా బళ్లారిలో చికిత్స పొందుతున్న రుద్రప్ప మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ముగ్గురి మృతి కలకలం: అంతా ‘మిస్టరీ’ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వివాదాస్పదమైంది. కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త రంగంలోకి దిగి సదరు కల్లు డిపో బాధ్యులతో కలిసి బాధిత కుటుంబాలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలువురు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందినట్లు సమాచారం. 7వ తేదీన ఒకరెనుక ఒకరు.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు (55), పింజరి సిద్దయ్య (47), వెంకన్న (60)కు కల్లు తాగే అలవాటు ఉంది. దాదాపుగా ప్రతి రోజూ వీరు కల్లు తాగుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రోజు వారీగానే ఈ నెల ఏడో తేదీన కల్లు తాగి సాయంత్రం వారివారి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరెనుక ఒకరు మృతి చెందారు. తెల్లారి ఉదయం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వీరి మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ఏ విషయం బయటికి రాలేదు. కానీ ఆ ముగ్గురి అనుమానాస్పద మృతిపై ఇటీవల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు? అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందడంతో ఉలిక్కిపడిన కల్లు డిపో పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబాలతో సంప్రదింపులు జరిపేలా జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, 50 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎక్సైజ్ అధికారుల పాత్రపైనా అనుమానాలు ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురి మృతి విషయం వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ నెల 24న గ్రామాన్ని సందర్శించారు. నేరుగా కల్లు డిపోకు వెళ్లి శాంపిళ్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందు కలిపినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని.. అనుమానంతో శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. ఇక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందిన విషయాన్ని వెల్లడించకపోగా.. దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలోని మృతి చెందిన బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరో ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఉందని వారు చెప్పారు. దీన్ని బట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్ర ఉందా.. గద్వాల జిల్లాలో సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పారీ్టకి చెందిన నాయకుల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు. జల్లాపురంలో ముగ్గురి అనుమానాస్పద మృతికి సంబంధించి అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ ఈ ముగ్గురి నేతల చుట్టే సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర జరుగుతోందా.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు.. వంటి అంశాలు హాట్టాపిక్గా మారాయి. దీనిపై సదరు జిల్లా కీలక ప్రజాప్రతినిధి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రాజకీయ కక్షలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు చనిపోయిన విషయం వాస్తవమే. మేము ఆ సమాచారం తెలుసుకొని గ్రామానికి వెళ్లాం. అక్కడి పరిస్థితిని చూసి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం. అంత్యక్రియల కోసం ఇద్దరికి డబ్బులు పంపించాం. అందులో ఒక్కరు మాత్రమే తీసుకున్నారు. పదేళ్లుగా గ్రామంలో పెళ్లిలు, శుభకార్యాలకు, మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇస్తున్నాం. కానీ ఒక బీసీ నాయకురాలు ఎదగడం ఇష్టం లేని కొందరు రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారు. విచారణ చేసి నిజనిజాలు వెలికితీయాలని మేము పోలీసులను కోరాం.’ అని తెలిపారు. -
కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తితో సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే రాజకీయ, సాహిత్య, మీడియా రంగాలకు చెందిన ముగ్గురు మృతిచెందారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ రచయిత అనీశ్ దేవ్ (70), మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఏక్నాథ్ గైక్వాడ్ (81), తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ మంత్రిగా పని చేశారు. ఒకసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇక పశ్చిమబెంగాల్కు చెందిన అనీశ్ దేవ్ ప్రముఖ రచయిత. ఆయన 18వ ఏట నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. బెంగాలీ సాహిత్య రంగంలో గొప్ప సేవలు అందించారు. ఆయనకు బెంగాల్ ప్రభుత్వం 2019లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు -
షాక్ అయ్యాం
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్తో మానిటర్లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన. ‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
విషాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామంలో ముగ్గురు యువకులు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఒకరిని కాపాడటానికి మరోకరు బావిలోకి దిగి ముగ్గురు యువకులూ మరణించారు. మొదట రాజేష్ (26) అనే వ్యక్తి బావిలోకి దిగాడు, అతను ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ (25) లోపలికి దిగాడు. వారిద్దరూ బయటకు రాకపోవడంతో వారిని కాపాడేందుకు మహేష్ (18) బావిలోపలికి దిగాడు. చివరికి ముగ్గురూ మృతి చెంది వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చారు. అయితే వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో విషవాయువులు ఏమైనా ఉన్నాయా?, లేక ఊపిరాడక చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా మృతదేహాలను బయటకు తీయడానికి ఎవరినీ బావిలోనికి దిగనీయడం లేదు. జేసీబీ యంత్రాలతో వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు సరదగా ఉన్న ముగ్గురు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లారీని ఢీకొట్టిన కారు,ముగ్గురు మృతి
-
గాజులరామరంలో నీటి గుంతలో పడి ముగ్గురు మృతి
-
ట్రామ్రైలులో కాల్పులు
ది హేగ్: న్యూజిలాండ్లో నరమేధం ఘటన మరవకముందే నెదర్లాండ్స్ నెత్తురోడింది. నెదర్లాండ్స్లోని ఉట్రెక్ట్ పట్టణంలో సోమవారం ట్రామ్రైలులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మేయర్ జాన్వాన్ జానెన్ ప్రకటించారు. ఈ చర్య ఉగ్రదాడేనని భావిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపిన తరువాత దుండగుడు పారిపోయాడని, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి ప్రజల రాకపోకల్ని నియంత్రించి, దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు అక్కడికి హెలికాప్టర్లను పంపించామని చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ భవనం ముందు ఉగ్ర వ్యతిరేక బలగాలు తనిఖీలు విస్తృతం చేశాయి. కెమెరాలతో కూడిన జాకెట్లు వేసిన జాగిలాలతో ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నెదర్లాండ్స్లోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఉట్రెక్ట్లో ట్రామ్ పట్టాలపై వస్త్రాలతో కప్పిన మృతదేహాలు ఉన్న చిత్రాల్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని మార్క్ రుటె తన అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని, అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. దేశంలో అసహనానికి చోటులేదని, ఈ దాడిలో ఉగ్ర కోణాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. అనుమానితుడి అరెస్ట్.. సోమవారం ట్రామ్రైలులో దాడికి అనుమానితుడిగా భావిస్తున్న టర్కీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు, గోక్మన్ టానిస్గా గుర్తించిన అతని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నలుపు రంగు దుస్తులు, గడ్డంతో అతను ట్రామ్లో ప్రయాణిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దాడి తరువాత ఉట్రెక్ట్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు విమానాశ్రయాలు, ఇతర కీలక భవనాలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాల్లో అడపాదడపా ఉగ్ర దాడులు జరిగినా, నెదర్లాండ్స్లో ఇలాంటి ఘటనలు అరుదే. గత ఆగస్టులో 19 ఏళ్ల అఫ్గాన్ పౌరుడు అమ్స్టర్డ్యామ్ ప్రాంతంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఇద్దరు అమెరికన్లను గాయపరిచాడు. -
లారీని ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా..
కార్తీక పున్నమి వెలుగులో దివ్యదేవుని దర్శనభాగ్యం దొరికిందన్న ఆనందం మరుక్షణంలో ఆవిరవుతుందని గుర్తించలేకపోయారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో యాత్ర విశేషాలు పంచుకుందామనుకున్న వారి యాత్ర విషాదంగా మారుతుందని తెలుసుకోలేకపోయారు. మంచు తెరలను చీల్చుకుంటూ కారులో రయ్యిమని దూసుకొస్తున్న వారికి లారీ రూపంలో మృత్యువు తమ ముందే ఉందని గమనించలేకపోయారు. శనివారం వేకువజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద లారీని వెనకగా కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. తెల్ల వారుజామున ఎర్రని నెత్తుటి ముద్దలుగా మారి జిల్లా గుండెలపై కన్నీటి తడి మిగిల్చారు. ‘దేవుడా.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలను అర్ధంతరంగా కొండెక్కించావా’ అంటూ బంధువులు గుండెలవిసేలా రోదించారు. చిలకలూరిపేటరూరల్: దైవదర్శనానికి వెళ్లి వస్తున్న వారి జీవితాలపై విధి విషం చిమ్మింది. రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని తాతపూడి వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాల మేరకు.. అరుణాచలం వెళ్లి అనంతలోకాలకు .... తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన ఇమ్మంది సోమశేఖర్, పలివెల సుబ్బారావు, పల్లి దినేష్, రేగుల సత్యసారథి స్నేహితులు. ఈ నెల 21వ తేదీ గురువారం రాజమండ్రి నుంచి కారులో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్ళారు. సుబ్బారావు, సోమశేఖర్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరిలో సారథి కారు నడుపుతున్నాడు. పక్కనే సీట్లో దినేష్ కూర్చున్నారు. వెనుక సీట్లో సుబ్బారావు, సోమశేఖర్ ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు తాతపూడి బ్రిడ్జి వద్ద కారు ముందు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వేగంగా వస్తున్న కారు.. లారీని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రేగుల సత్యసారథి(28), కారు యజమాని పల్లి దినేష్(31), పలివెల సుబ్బారావు,(30) అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప దీక్షలో ఉన్న మరో వ్యక్తి ఇమ్మంది సోమశేఖర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. బెలూన్స్ తెరుచుకున్నా.. వేగంగా లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఇందులోనే వారు ఇరుక్కుపోయారు. దీంతో బెలూన్స్ తెరుచుకున్నా బయటకు రాలేక మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎస్ విజయ చంద్ర, ఎస్ఐలు ఉదయ్బాబు, వపన్కుమార్, ఆర్టీవో అమరానాయక్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుటాహుటిన తరలివచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఇటీవలే కారు కొనుగోలు చేసి.... రాజమండ్రి పేపర్ మిల్లులో సివిల్ కాంట్రాక్టులు నిర్వహించే పశ్చిమ గోదావరి జిల్లా కోవూరుకు చెందిన మృతుడు పల్లి దినేష్కుమార్ భార్య శృతి పేరుతో అక్టోబర్ నాలుగో తేదీన కారు కొనుగోలు చేశాడు. నవంబర్ ఐదో తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తయినా నేటికీ కారును టీఆర్ పేరుతో కొనసాగిస్తున్నారు. విడదీయరాని స్నేహం ... పలివెల సుబ్బారావు రాజమండ్రిలోని పేపర్ మిల్లులో కాంట్రాక్ట్ కార్మికుడిగా, సోమశేఖర్, పల్లి దినేష్లు సివిల్ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య చాలా కాలంగా స్నేహం కుదిరింది. మృతుడు సుబ్బారావుకు గతేడాది వివాహమై రెండు మాసాల క్రితం కుమారుడు జన్మించాడు. మరో మృతుడు పల్లి దినేష్ పశ్చిమ గోదావరి జిల్లా కోవూరులో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేగుల సత్యసారథి రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం గోకవరం వాసి. స్నేహితులంతా ఒక్కసారి మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. -
కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ స్వైర విహారం
-
డివైడర్ను ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
ఘోర ప్రమాదం..
గజ్వేల్: మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35)తో పాటు మరో 24 మంది కలిసి చేర్యాల మండలం నాగపురిలో ఆత్మహత్యకు పాల్పడిన మల్లేశం అంత్యక్రియలకు వెళ్లేందుకు టాటా ఏస్ (ట్రాలీ ఆటో)లో బయలుదేరారు. కాగా, మృతుడు మల్లేశంకు పాములపర్తి గ్రామానికి చెందిన కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇదే క్రమంలో మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో పుట్టిల్లు పాములపర్తి గ్రామంలో ఉన్న అతని భార్య కనకమ్మ వారితో కలిసి వెళ్లింది. మార్గమధ్యంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే మసీదు మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఆపారు. మండలంలోని దాచారం గ్రామం నుంచి తమ బంధువొకరు వస్తారని చెప్పడంతో ఆయన కోసం ఎదురు చూసే క్రమంలో 10 నిమిషాల పాటు వాహనం నిలిపారు. వెనుక వైపు నుంచి బస్సును ఓవర్టేక్ చేసి దూసుకొచ్చిన లారీ.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆటోను సుమారు 20 మీటర్ల దూరానికిపైగా ఈడ్చుకుపోయి రోడ్డు కిందకు పడిపోయింది. ప్రమాదంలో అక్కారం కిష్టయ్య, అక్కారం సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కారం పోచయ్య గజ్వేల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచాడు. కిష్టయ్యపైకి లారీ దూసుకెళ్లడంతో అతని మెదడు, శరీరభాగాలన్నీ నుజ్జునుజ్జయి భీతావాహ వాతావరణం నెలకొంది. హాహాకారాలు.. ఆర్తనాదాలు ప్రమాదస్థలి వద్ద క్షతగాత్రుల హాహాకారాలు, ఆర్తనాదాలు, మృతుల బంధువుల రోదనలతో దద్దరిల్లింది. ఆటో వెనకాల బైక్పై వస్తున్న మృతుడు కిష్టయ్య కుమారుడు కనకయ్య తండ్రి తల చిద్రమై పడిఉండడం చూసి కుప్పకూలిపోయాడు. ‘మా నాయన సచ్చిపోయిండే దేవుడా..’ అంటూ గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. రిమ్మనగూడకు చెందిన పలువురు యువకులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అప్పటికప్పుడు ఆటోల్లో వెంటవెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ప్రసాద్, గౌరారం, గజ్వేల్, కుకునూర్పల్లి ఎస్ఐలు ప్రసాద్, మధుసూదన్రెడ్డి, పరమేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబీకులను గజ్వేల్ ఆస్పత్రి వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పరామర్శించారు. సిద్దిపేట సీపీ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహశీల్దార్ బాల్రెడ్డి సైతం క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదకరమైన మలుపే కారణం రిమ్మనగూడలో శుక్రవారం చోటుచేసుకున్న విషాదానికి ప్రమాదకరమైన మలుపే కారణమని తెలుస్తోంది. మసీదు వద్ద ఉన్న ఈ మలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో ఈ మలుపును సరిచేసే విషయాన్ని సంబంధిత యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. వాహనాల వేగం మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా పరిణమించి ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి. ఈ ఘటనలో ఆటో రోడ్డు చివరన నిలిపి ఉండటం, పక్కన స్థలం లేక రోడ్డు ఎత్తుగా ఉండి కింది భాగమంతా గుంత మాదిరిగా ఉండడం వల్ల లారీ బస్సును ఓవర్టేక్ చేసి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో కిందికి వెళ్లిపోయి ప్రాణనష్టం జరిగింది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం కూడా మరో కారణం. మే 26న ఇదే గ్రామంలోని ఫార్మసీ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సు క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడం.. తాజాగా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. -
నెత్తురోడిన రహదారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. పోతు నూ రు స్టేజీ వద్ద కారు ఢీకొని బాలుడు.. వల్లభాపురం వద్ద బైక్ అదుపు తప్పి ఒకరు.. ఏపీలింగోటం సమీపంలో ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో మరొకరు మృతిచెందారు. కారు ఢీకొని బాలుడి దుర్మరణం పెద్దవూర(నాగార్జునసాగర్) : కారు ఢీకొని ఓ బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం పెద్దవూర మండలం పోతునూరు గ్రామ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పో తునూరు గ్రామానికి చెందిన రొయ్య మల్లయ్య కూతురు నాగమ్మను చందంపేట మండలం గుంటిపల్లికి చెందిన బయ్య మల్లయ్యకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. రాఖీ పండుగకు తన సోదరులకు రాఖీలు కట్టడానికి గాను బయ్య నాగమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలి సి ఆదివారం తన పుట్టిల్లు పోతునూరు గ్రామానికి వచ్చింది. వీరితో పాటు తన అక్కాచెల్లెళ్లు సైతం రాఖీలు కట్టడానికి రావడంతో ఆదివా రం అంతా ఉత్సాహంగా గడిపారు. సోమవా రం తన సోదరుడు డబ్బులు ఇవ్వడంతో పిల్లలను తల్లిగారింటి వద్ద ఉంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు తన భర్త మల్లయ్యను వెంట తీసుకుని పెద్దవూరకు షాపింగ్ చేయడానికి వచ్చా రు. పిల్లందరూ రోడ్డు దాటి సమీపంలో ఉన్న ఏఎమ్మార్పీ మైనర్ కాలువకు స్నానాలు చేయటానికి వెళ్లారు. ఈ క్రమంలో మిగిలిన పిల్లలు కాలువలో స్నానాలు చేస్తుండగా బయ్య శివకుమార్(8) ఇంటికి రావడానికి రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో శివ అంతెత్తున ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కారు డ్రైవర్ బాలుడిని తన కారులో చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించడంతో వారు బోరున విలపించారు. మృతుడు గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దూది రాజు తెలిపారు. బైక్ డివైడర్ను ఢీకొని ఒకరు.. చివ్వెంల (సూర్యాపేట) : అదుపు తప్పి బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం వల్ల భాపురం గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంపుల గ్రామానికి చెందిన పేరెల్లి నాగ య్య (34) బైక్పై సూర్యాపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వల్లభాపురం గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు, ప్రైవేట్ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలుచివ్వెంల (సూర్యాపేట) : మండల పరిధిలో సో మవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదా ల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడడంతో భార్యాభర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. విజయవాడకు చెందిన భార్గవ్ తన భార్య లక్ష్మితో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గుంజ లూరు గ్రామ స్టే జీ వద్దకు రాగానే హైదరాబాద్–విజయవాడ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. తిర్మలగిరి శివారులో ప్రైవేట్ బస్సు.. జి.తిర్మలగిరి గ్రామ శివారులో జాతీయ రహదా రిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడిం ది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి హాని జరుగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం నార్కట్పల్లి(నకిరేకల్) : నార్కట్పల్లి మం డలం ఏపీలింగోటం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మం డలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కా రింగ్ కృష్ణయ్య (45) లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. విజయవాడ నుంచి హైదరాబా ద్కు బొగ్గు లోడుతో ఒక్కడే వెళ్తూ మార్గమధ్యలో ఏపీలింగోటం గ్రామ శివారులో టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయిస్తున్నాడు. ఆదేదారిలో వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొనడంతో లారీడ్రైవర్ అక్కడికక్కడే మృ తి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కృష్ణయ్య మరణంతో కుటుం బం వీధిన పడనుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎస్ఐ గోవర్ధన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు కేతేపల్లి(నకిరేకల్) : 65 నంబరు జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ వద్ద సోమవారం సా యంత్రం ఆటోను కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కేతేపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాల ముగిసిన అనంతరం కొర్లపహాడ్ గ్రామం వెళ్లేందుకు ఆరుగురు విద్యార్థులు కేతేపల్లిలో ఆటో ఎక్కారు. ఈక్రమంలో ఆటో కొర్లపహాడ్ బస్స్టేజీ సమీపంలోకి చేరుకోగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కా రు ఆటోను వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ కొప్పుల ఉమేష్తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎడ్ల కర్ణాకర్, సూరారపు ప్రగతి, వం టెపాక నవ్యలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి ఎస్ఐ రజనీకర్ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీ సుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కారును పోలీస్స్టేషన్కు తరలించారు. -
ప్రాణం తీసిన అతివేగం
భూత్పూర్ (దేవరకద్ర): వాహనదారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. అతివేగం కారణంగా క్వాలీస్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం జెలదుర్గం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన షేక్ నడిపి జమాల్వలీ, షేక్ జలీల్, జమాల్ బాష, హుస్సేన్, జహీనాబీ, షేక్ హబీబ్లు కలిసి ఆదివారం క్వాలీస్లో హైదరాబాద్ వెళ్తున్నారు. పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి కుడిచేతివైపు ఉన్న డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న షేక్ నడిపి జమాల్ వలీ(50), షేక్ జలీల్(5) అక్కడికక్కడే మృతిచెందగా.. జమాల్ బాష, హుస్సేన్, జహీనాబీ, òషేక్ హబీబ్ గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ వెంకటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. లారీని ఢీకొని వ్యక్తి.. జడ్చర్ల: స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి వెనక నుంచి లారీని ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లెబోయిన్పల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూత్పూర్ మండలం కొత్తమొల్గరకు చెందిన చిన్న కాశన్న(50), పెద్ద కాశన్నలు స్కూటీపై శనివారం రాత్రి జడ్చర్లకు వస్తుండగా మల్లెబోయిన్పల్లి శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న చిన్న కాశన్న అక్కడికక్కడే మృతిచెందగా.. పెద్ద కాశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తర లించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. రూ.1.14 లక్షల నగదు చిన్నకాశన్న వద్ద లభించిన బ్యాగులో రూ.1.14 లక్షల నగదు ఉన్నట్లు 108 అంబులెన్స్ సిబ్బంది శివారెడ్డి తెలిపారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి నగదు అప్పగించారు. -
కాటేసిన కరెంట్!
గట్టు (గద్వాల) : ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువరైతు బోయ గువ్వల తిమ్మప్ప అలియాస్ గోపి(35)కి గంగిమాన్దొడ్డి శివారులో ఎకరా విస్తీర్ణంలో సీడ్ పత్తి సాగుచేశాడు. ఉదయం సీడ్ పత్తి పొలానికి పురుగు మందు పిచికారీ చేసి ఇంటికి వస్తుండగా పక్క పొలానికి చెందిన రైతు మారెప్ప తన బోరు మోటార్కు ఉన్న సర్వీస్ వైరు తెగిపోయిందని చెప్పాడు. దీంతో సర్వీస్ వైరును సరి చేసేందుకు గోపి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా షాక్కు గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు వెంటనే గట్టులోని పీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. గోపికి భార్య సుజాతతోపాటు ముగ్గురు కుమార్తెలు సంధ్య, మంజు, వెన్నెల ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నాయకుల పరామర్శ బాధిత కుటుంబ సభ్యులను సహకార సంఘం అధ్యక్షుడు రాముడు, మండల కోఆప్షన్ సభ్యుడు నన్నేసాబ్, నాయకులు హన్మంతు, రామకృష్ణారెడ్డి, కృష్ణ, బజారి, రామునాయుడు, హన్మంతురెడ్డి, మారెన్న తదితరులు పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం గోపి మృతదేహానికి గద్వాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గోపి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వంటపాత్రలో నీళ్లు పోస్తుండగా.. మన్ననూర్ (అచ్చంపేట): వంట పాత్రలో నీళ్లు పోస్తుండగా షాక్కు గురై ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఎస్ఐ రామన్గౌడ్ కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన బాల్లక్ష్మమ్మ(65) కొన్నేళ్లుగా మన్ననూర్లోని హోటళ్లలో పాచి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. ఆదివారం స్థానిక గోల్డెన్ హోటల్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో రాఖీ పండగ ఉండటంతో త్వరగా పనులు ముగించుకుని వెళ్లాలనే ఉద్దేశంతో వంట పాత్రలు కడిగేందుకు ఓ పాత్రలో నీళ్లు పోస్తుండగా పక్కనే ఉన్న రిఫ్రిజరేటర్ నుంచి షాక్ తగిలింది. ఆమె కేకలు వేయడంతో దుకాణ యజమాని వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా ఆయన కూడా షాక్కు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన బాల్లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బాల్లక్ష్మమ్మ భర్త గతంలోనే మృతి చెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పొలిశెట్టిపల్లిలో యువరైతు బల్మూర్ (అచ్చంపేట): వ్యవసాయ పొలానికి నీ రు పారించేందుకు తండ్రితోపాటు వెళ్లిన ఓ యు వకుడు విద్యుతాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని పొలిశెట్టిపల్లిలో శ నివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ స భ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకారపు రమేష్(23) శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన తండ్రి బాలస్వామితో కలిసి మొక్కజొన్న పంటకు నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ బోరు మోటార్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో కింద పడిపోయాడు. గమనించిన తండ్రి, కు టుంబ సభ్యులు కలిసి ర మేష్ను అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మూణ్నెళ్ల క్రితమే వివాహం రమేష్కు మూడు నెలల క్రితమే కొండారెడ్డిపల్లికి చెందిన లక్ష్మితో వివాహమైనట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. పెళ్లి తీపి జ్ఞాపకాలు మరువక ముందే రమేష్ అకాలమృతితో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తె లిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మనాయక్, నాయకులు లక్ష్మయ్య కోరారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
డోర్నకల్ మహబూబాబాద్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో మహబూబాబాద్ జిల్లా డో ర్నకల్ మండలంలోని కస్నాతండా, గార్ల మం డలంలోని అంజనాపురం, హన్మకొండలోని న్యూ రాయపురలో విషాదఛాయలు అలుముకు నా ్నయి. ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఓ రైతు మృతి చెందాడు. స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలోని కస్నాతండాకు చెందిన గుగులోత్ శంకర్(28)కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. గురువారం పొలాన్ని దున్ని నాటు వేసేందుకు ఇదే తండాకు చెందిన గుగులోత్ శ్రీనుతో కలిసి తన సొంత ట్రాక్టర్ను నడుపుకుంటూ బయలుదేరాడు. శంకర్ ట్రాక్టర్ను నడుపుతుండగా శ్రీను ఇంజన్ వెనుక నిల్చున్నాడు. ట్రాక్టర్ పాతదుబ్బతండా సమీపంలో ఉన్న పొలం వైపు వెళ్తుండగా..మలుపు వద్ద అకస్మాత్తుగా ఎదురుగా ద్విచక్ర వాహనం రావడంతో ట్రాక్టర్ను పక్కకు తిప్పాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్ననీటి గుంతలో తలకిందులుగా పడిపోయింది. ట్రాక్టర్ నడుపుతున్న శంకర్ ట్రాక్టర్ కింద బురదలో కూరుకుపోగా శ్రీను నీటిలో పడిపోయాడు. చుట్టు ప్రక్కల రైతులు వచ్చి శంకర్ను బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. శంకర్కు భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. డోర్నకల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం ట్రాక్టర్ అదుపు తప్పిన ఘటనలో గుగులోత్ శంకర్ మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శంకర్ అన్న వీరభద్రం రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లడంతో వారి సంరక్షణ బాధ్యత కూడా శంకర్ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం తండాలోని ప్రభుత్వ పాఠశాలలో వీరభద్రం కూతురు హర్షవర్ధిని ఐదో తరగతి, కుమారుడు కార్తీక్ రెండో తరగతి చదువుతున్నారు. బాబాయి మృతితో హర్షవర్ధిని, కార్తీక్ రోదనలు మిన్నంటాయి. విద్యుదాఘాతంతో మహిళా రైతు.. గార్ల: విద్యుదాఘాతంతో ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన అంజనాపురం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గార్ల మండలం అంజనాపురానికి చెందిన ఇస్లావత్ బుజ్జి అలియాస్ తోలి(40).. అదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయ చేస్తోంది. కౌలు పొలం నాటు వేసేందుకు గురువారం బావి వద్దకు వెళ్లింది. పొలం నాటు వేస్తుండగా, మోటారును బంద్ చేసేందుకు వ్యవసాయి బావి వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడ్కిక్కడే మృతి చెందింది. ఇరుగు పొరుగు వారు వచ్చే సరికే అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె భర్త హచ్చ 15 ఏళ్ల క్రింతం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. రెడ్కాడితే డొక్కాడని మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. మృతురాలి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు గార్ల ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ.. ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ధర్మసాగర్ మండలంలోని బంజరుపల్లిలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు, ధర్మసాగర్ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ న్యూరాయపురకు చెందిన గండె విజయలక్ష్మి (63) బంజరుపల్లిలోని సాయిబాబా దేవాలయంలో దైవ దర్శనం కోసం ఒంటరిగా వచ్చింది. ఇక్కడే ఉన్న రేకుల షెడ్లో రెండు రోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆలయ ఆశ్రమ సమీపంలో ఉన్న మరుగుదొడ్డిలో తలపగిలి విగత జీవిగా పడి ఉంది. ఆలయ పూజారి గ్రామస్తులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ధర్మసాగర్ ఎస్సై విజయ్రాంకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు గతంలో కూడా ఇక్కడకు దైవదర్శనం కోసం వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్లేదని, తరచూ దేవాలయాలు సందర్శిస్తు ఉంటుందని ఆమె బంధువులు వెల్లడించారు. మృతురాలి కొడుకు సంపత్ ఫిర్యాదు మేరు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమారై ఉన్నారు. -
మూడు రోజుల వ్యవధిలో తల్లిదండ్రి, కుమారుడి మృతి
విధి విలాపం అంటే ఇదేనేమో. అసలే పేదలు.. ఆపై అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పూటగడవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. వైద్యం చేయించుకోలేక మృత్యువుకు తలవంచారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ..పేద కుటుంబంలో పెనువిషాదం అలుముకుంది. నడిగూడెం(కోదాడ) : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామానికి చెందిన మర్ల గోపిరెడ్డి (70), సక్కమ్మ (65) దినసరి కూలీలుగా పనిచేస్తూ తమకున్న నలు గురు సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. కాలగమనంలో అనారోగ్య సమస్యలతో ముగ్గురు కుమారులు వెంకట్రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తనువు చాలించారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వీరారెడ్డి(42)తో బతుకుబండిని లాగిస్తున్నారు. ఒకరి వెంట ఒకరు.. అసలే పూట గడవని దైన్యంలో బతుకీడుస్తున్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సక్కమ్మ ఈ నెల 19న మృతిచెందింది. ఆమెకు దహనసంస్కారాలు నిర్వహించిన అనంతరం కు మారుడు వీరారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని అదే రోజు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గత సోమవారం తనువుచాలించాడు. వీరారెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నా రు. ఓ వైపు జీవిత భాగస్వామి, మరోవైపు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇక లేరనే చేదు నిజాన్ని గోపిరెడ్డి జీర్ణించుకోలేక అతను కూడా మంగళవారం మృతిచెందాడు. రోజుల వ్యవధిలో ముగ్గురిని మృత్యువు కబళించడంతో ఆ పేద కుటుం బంలో పెను విషాదం అలుముకుంది. -
లారీ, కారు, బైక్ ఢీ ముగ్గురు మృతి
-
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
సాక్షి, శ్రీకాకుళం : రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తామని మంత్రి అచ్చన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంజక్షన్ బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో చికిత్స పొందుతున్న వారికి కూడా అవసరమైన చికిత్సను అందిస్తామన్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టామని, విచారణ పూర్తి అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇంజెక్షన్ వికటించి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే?
-
సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనం
-
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి!
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో... నాసిరకం మందులో... అధికారుల పర్యవేక్షణ లోపమో... కారణం ఏదైనా ముగ్గురు మహిళల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వైద్యం కోసం రిమ్స్కొస్తే చికిత్స మాటెలా ఉన్నా వారి కుటుంబాలకు తీరని ఆవేదనే మిగిలింది! ఆరోగ్యం మెరుగుపడి తిరిగొస్తారనుకుంటే విగతాజీవులుగా చూడాల్సి వచ్చిందంటూ బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. రిమ్స్ మహిళా మెడికల్ విభాగంలో రోగులకు ఇచ్చిన యాంటీబయోటిక్ ఇంజెక్షన్ వికటించడంతో పలాసకు చెందిన ఎస్.అనిత (31), కొత్తూరు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఈసై శైలజ అలియాస్ శాంతి (21), ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన వాకాడ దుర్గమ్మ (60) శనివారం విశాఖ నగరంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శాంతమ్మ అనే మరో మహిళ పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వర్షాకాలం ప్రారంభంతోనే డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు విజృంభించాయి. వాటితో చాలామంది రోగుల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. మహిళలలో రక్తహీనత కూడా సమస్యగా మారింది. ఇలాంటి రోగాలతో శ్రీకాకుళంలోని రిమ్స్లో వైద్యం కోసం చేరున్నవారి పేదలు, సామాన్య ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వరాలు, ప్లేట్లెట్స్ తగ్గిపోయిన రోగులతో పాటు హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారందర్నీ రిమ్స్లోని మెడికల్ వార్డుల్లో చేర్చుతుంటారు. వారికి రోగనిరోధక మందులతో పాటు యాంటీబయోటిక్ మందును వైద్య సిబ్బంది ఇస్తుంటారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మెడికల్ వార్డుల్లోని రోగులకు సెఫ్ట్రియాక్షన్ అనే యాంటీబయోటిక్ మందు ఇంజెక్షన్ చేశారు. కానీ మహిళా మెడికల్ వార్డులోని 20 మంది మహిళలకు ఈ మందు వికటించింది. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వారు ఏ రోగంతో అయితే వైద్యం కోసం వచ్చారో ఆ రోగ ప్రభావం మరింత ఎక్కువైంది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది, వైద్యులు వారందరికీ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందించారు. విశాఖ కేజీహెచ్కు రిఫర్...రిమ్స్లో శనివారం ఉదయం వరకూ చికిత్స చేసినా పరిస్థితి మెరుగుపడని నలుగురు మహిళలను అత్యవసరంగా విశాఖలోని కేజీహెచ్కు వైద్యాధికారులు రిఫర్ చేశారు. తొలుత పలాసకు చెందిన ఎస్.అనితను రిమ్స్ అంబులెన్స్లో కేజీహెచ్కు తీసుకెళ్లారు. తర్వాత శైలజను తీసుకెళ్లడానికి మరో అంబులెన్స్ను తీసుకొచ్చినప్పటికీ అందులో ఆక్సిజన్, వెంటిలేటరు వంటి అత్యవసర వైద్య పరికరాలు లేవు. దీంతో కిమ్స్ నుంచి ఆయా పరికరాలున్న అంబులెన్స్ను తెప్పించారు. తర్వాత దుర్గమ్మ, శాంతమ్మలను మరో అంబులె న్స్లో విశాఖకు పంపించారు. అనిత, శైలజ, శాం తమ్మలకు కేజీహెచ్లోనే చేర్పించారు. దుర్గమ్మ పరిస్థితి మరింత తీవ్రమవ్వడంతో విశాఖలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయానికి అనిత చనిపోయింది. సాయంత్రానికి శైలజ మృతి చెం దింది. రాత్రి 9.30 గంటల సమయంలో దుర్గమ్మ కూడా తనువుచాలిచింది. ఇక మిగిలిన శాంతమ్మ పరిస్థితి అదుపులో ఉందని కేజీహెచ్ వైద్యులు ఏపీ పీఎంయూ డైరెక్టరు డాక్టరు ఎన్.సూర్యారావు, సూపరింటెండెంట్ డాక్టరు జి.అర్జున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టరు కె.ఇందిరాదేవి వెల్లడించారు. మిగిలివారంతా రిమ్స్లోనే...యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ వికటించిన బాధితుల్లో మిగిలిన 16 మంది మహిళలు ప్రసుత్తం రిమ్స్లోనే చికిత్స పొందుతున్నారు. అత్యవసర విభాగం (ఐసీ యూ)లో పి.కస్తూరి (ఇచ్ఛాపురం మండలం డొంకూరు), బి.దుర్గ (పొందూరు మండలం ఇజ్జపేట), సనపల తులసమ్మ (కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు), మామిడి మోహిని (జలుమూరు మండలం కోనసింహాద్రిపేట), గం డ్రేసు సాయి (ఎచ్చెర్ల మండలం అక్కివలస), నక్కిట్ల చంద్రమ్మ (ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ) ఉన్నారు. మిగిలిన 9 మంది మహిళా మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే? రిమ్స్ స్థాయి పెరిగినా అందుకు తగిన వైద్య సేవలు అందట్లేదనే విమర్శలు కొన్నేళ్లుగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఎక్కువగా ప్రసూతి విభాగంలో జరిగేవి. ఈ జాడ్యం ఇప్పుడు మెడికల్ వార్డుకూ పాకింది. ముగ్గురు రోగుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం వారికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్ అని తేలింది. వార్డులోని 20 మంది మహిళలకు ఈ ఇంజెక్షన్ ఇవ్వడంలో లోపాలు జరిగాయ నే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది నర్సింగ్ సిబ్బంది విధిలో నిర్లక్ష్యం వహించడం వల్లే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని తరచుగా విమర్శలు వస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించట్లేదని రోగుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఇంజెక్షన్లో సెలైన్ వాటర్ కలిపేశారా? మెడికల్ వార్డులోని రోగులకు శుక్రవారం రాత్రి ఇచ్చిన యాంటీబయోటిక్ మందు సెఫ్ట్రియాక్షన్ పౌడర్లో దానితోపాటు వచ్చిన డిస్టల్ వాటర్ను కలపకుండా సెలైన్ వాటర్ లేదా మరే ఇతర ద్రావమైనా కలిపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వార్డులోని రోగులకూ సెఫ్ట్రియాక్షన్ ఒకే బ్యాచ్ మందు ఇచ్చినా వారిలో ఎలాంటి సమస్య కలగలేదు. కేవలం మహిళా మెడికల్ వార్డులోని 20 మంది రోగులకే అస్వస్థత కలగడానికి కారణం అక్కడ విధుల్లోనున్న నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యమేననే విమర్శలు వస్తున్నాయి. కానీ వారిపై 24 గంటలు గడిచినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. నాసిరకం మందుల వల్లనేనా? రోగులకు అవసరమయ్యే వివిధ రకాల మందులు, చికిత్సకు కావాల్సిన పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా సర్కార్ ఫార్మసీ విభాగమే పంపిస్తుంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వంలో కొందరు పెద్ద నాయకుల బంధువులు మందుల సరఫరా కాంట్రాక్టు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు నాసిరకం మందులు వస్తున్నాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు వెళ్తున్నవి నాసిరకం మందులని, అవి వాడితే రోగులకు ప్రాణాంతకమవుతాయని తెలిసినా కొందరు మంత్రులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాంపిల్స్తో నిగ్గుతేలేనా? యాంటీబయోటిక్ మందు వికటించిన దృష్ట్యా ఆ బ్యాచ్ మందులను రిమ్స్ వైద్యాధికారులు అత్యవసరంగా బ్యాన్ చేశారు. ఇప్పటికే మహిళా మెడికల్ వార్డులో వినియోగించిన మందుల సీసాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. డ్రగ్ శాంపిల్స్ను ఫార్మా కాలేజీకి పంపనున్నట్లు రిమ్స్ రెసిడెంట్ మెడికల్ అధికారి డాక్టరు బీసీహెచ్ అప్పలనాయుడు చెప్పారు. అలాగే ఈ శాంపిల్స్ పై రాష్ట్ర ఫార్మసీ విజిలెన్స్ విభాగం పరిశోధన చేసి మందు వికటించడానికి కారణలేమిటనేదీ వెల్లడిస్తారు. ఈ పరిశోధన కోసం శ్రీకాకుళం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.కృష్ణ రిమ్స్లో నమూనాలను శనివారం సేకరించారు. తొలినుంచి పర్యవేక్షణ లోపమే... రిమ్స్లో రోగుల పట్ల నర్సింగ్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదు. ప్రసూతి విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసినా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. నర్సింగ్, ఇతర సిబ్బందిలో వృత్తిపట్ల అంకితభావం లేకుండా పోయింది. ఏడాదిగా నర్సింగ్ సిబ్బందిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది విశాఖ నుంచి బదిలీపై వచ్చినప్పటి నుంచి అవి మరింత పెరిగాయి. వారిలో ఎక్కువ మంది విశాఖ నుంచి రాకపోకలు సాగించడం వల్ల ఎప్పుడు వెళ్లిపోదామనే ధ్యాసే తప్ప విధులపై సరిగా దృష్టి పెట్టలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆరా... రిమ్స్లో జరిగిన పరిణామాలపై రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. శనివారం సాయంత్రం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య రిమ్స్లో పరిస్థితులపై రిమ్స్ డైరెక్టరు ఎ.కృష్ణవేణి, జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డిలతో ఫోన్లో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితి తలెత్తడానికి కారణాలేమిటో తక్షణమే తెలుసుకోవాలని ఆదేశించారు. ఈమేరకు రిమ్స్కు వచ్చిన కలెక్టరు వైద్యాధికారులతో శనివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వైద్యవిద్య మండలి డైరెక్టరు బాబ్జీ కూడా ఈ సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.తిరుపతిరావు, రిమ్స్ డైరెక్టరు, ఆర్ఎంవోలతో మాట్లాడారు. అలాగే మాజీ డైరెక్టరు సుబ్బారావు ఆదివారం రిమ్స్కు వచ్చి విచారణ చేయనున్నారు. హైలెవల్ కమిటీ ఏర్పాటు... ముగ్గురు మహిళల మృతికి, మరో 17 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు దారితీసిన పరిస్థితులపై విచారించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో శ్రీకాకుళం ఆర్డీవో డీవీ రమణ, విమ్స్ డైరెక్టరు బీఎల్ఎన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
కర్నూలు శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ పేలుడు
-
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
బల్మూర్ (అచ్చంపేట) : ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాత్రి సమయంలో ఎద్దు అడ్డు రావడంతో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కొండనాగుల సమీపంలో అచ్చంపేట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ విక్రం కథనం ప్రకారం.. కొండనాగులకు చెందిన వలూవాయి నర్సింహ(40) రామాజిపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఊశయ్య కలిసి శని వారం రాత్రి ద్విచక్రవాహనంపై రామాజిపల్లికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని రైస్మిల్ వద్ద రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఎద్దును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనక కూర్చున్న నర్సింహ తలకు తీ వ్ర గాయాలు, ఊశయ్య బలమైన గాయాలయ్యా యి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తర లిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఊ శయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హై దరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై నర్సింహ భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. నర్సింహ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థికసాయం అందజేశారు. సైకిల్పై నుంచి కిందపడి.. బల్మూర్ (అచ్చంపేట): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆదినారాయణ(45) సైకిల్పై వెళ్తుండగా పశువులను ఢీకొనడంతో కిందపడి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఆదినారాయణ తాపీ మేస్త్రీ పని కోసం తన సైకిల్పై కొండనాగులకు వెళ్తుండగా గ్రామ స్టేజీ సమీపంలో పశువులను ఢీకొట్టి కింద పడిపోయాడు. గమనించిన బాటసారులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. సంఘటనపై ఆదినారాయణ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొని.. మాగనూర్ (మక్తల్): మండలంలోని చేగుంట రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని కర్ణాటకలోని యాద్గీర్ పట్టణానికి చెందిన రమేష్(38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు హెడ్కానిస్టేబుల్ నాగేశ్వర్రావ్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు యువకుల దుర్మరణం
పెద్దవూర (నాగార్జునసాగర్) : ఐదుగురు స్నేహితులు కలిసి విహారయాత్రకు కారులో బయలుదేరారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్న వారి స్నేహితుని వద్దకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు బాపట్ల బీచ్కు వెళ్లి పగలంతా అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం కారులో ఇంటికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో వీరిని మృత్యువు కబళించింది. నిద్రమత్తులో ఉన్న కారు నడిపే యువకుడు చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సరదాగా గడిపి.. నాగర్కర్నూల్లోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన పొడుగు జయంత్(24), ఖానాపురం అజయ్(22), ముండ్లపాటి సందీప్, మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామానికి చెందిన తూర్పు సంతోష్రెడ్డి(23), హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన గుంటికె రాఘవేందర్రెడ్డి స్నేహితులు. వీరంతా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఈ నెల 14వ తేదీన విహారయాత్రకు కారులో బయలుదేరారు. ముందుగా ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్న వారి స్నేహితుని వద్దకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల బీచ్కు వెళ్లి పగలంతా అక్కడ సరదాగా గడిపి.. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దవూర మండలంలోని నాగార్జునసాగర్– హైదరాబాద్ ప్రధాన రహదారిపై పోతునూరు స్టేజీ సమీపంలో కారు కుడివైపు దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న పొడుగు జయంత్, ఖానాపురం అజయ్, తూర్పు సంతోష్రెడ్డిలు కారులోనే మృతి చెందగా.. ముండ్లపాటి సందీప్, గుంటికె రాఘవేందర్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డున వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సాగర్ సీఐ రవీందర్, పెద్దవూర ఎస్ఐ రాజు అక్కడికి చేరుకుని గాయపడిన సందీప్, రాఘవేందర్రెడ్డిలను నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు. వీరిలో సందీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. మృతులంతా అవివాహితులే. మృతుల్లో పొడుగు జయంత్ పౌల్ట్రీ వ్యాపారం చేస్తుండగా, ఖానాపురం అజయ్ విద్యుత్ శాఖలో ఒప్పంద కార్మికుడిగా, తూర్పు సంతోష్రెడ్డి డీజే సౌండ్స్ స్వతహాగా నిర్వహిస్తున్నారు. సందీప్ హైదరాబాద్లోని చైతన్యపురి, కమలానగర్లో నివాసం ఉంటూ రాజ్ న్యూస్ ఛానల్లో క్రైం రిపోర్టర్గా పనిచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సాగర్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. నిద్రమత్తే కారణమా? పగలంతా బీచ్లో ఈతలు కొడుతూ సరదాగా గడిపి అలసిపోయిన వీరంతా రాత్రి స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఎడమవైపు నుంచి వెళ్లి కుడివైపు రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదే వేగంతో బలంగా ఢీకొట్టింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న కారు కుడివైపు వెళ్లి చెట్టును ఢీకొట్టే వరకు కనీసం డ్రైవర్ బ్రేకులను ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు. కారులో ఉన్న అందరూ నిద్రమత్తులో ఉండడం, ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న వారంతా కారులోనే చెల్లాచెదురుగా పడిపోయారు. డ్రైవర్ సీట్లో ఉన్న జయంత్ మాత్రం అదే సీట్లో స్టీరింగ్పై పడి మృతిచెందాడు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే.. కారు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తులు సీటు బెల్టులు ధరించి ఉంటే ముగ్గురు ప్రాణాలు పోయి ఉండేవి కావని పోలీసులు భావిస్తున్నారు. హోండా కంపెనీకి చెందిన ఆస్సెంట్ కారుకు ఎయిర్ బెలూన్లు సైతం ఉన్నాయి. కానీ ప్రమాద సమయంలో ఎవరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో బెలూన్లు తెరుచుకోలేదు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. లేదంటే ఇంతగా ప్రాణ నష్టం సంభవించేది కాదేమోనని భావిస్తున్నారు. నేరుగా చెట్టును ఢీకొట్టకుండా కొంచెం పక్కకు వెళ్లినా ప్రమాద తీవ్రత తగ్గేది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీలు రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సోమవారం మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు శ్రీనివాసులు, రవికుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషించారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి వెంట నాగార్జునసాగర్, దేవరకొండ సీఐలు రవీందర్, శివరాంరెడ్డి, పెద్దవూర, పీఏపల్లి ఎస్ఐలు రాజు, శ్రీనివాస్ ఉన్నారు. -
వైఎస్ఆర్ జిల్లా: బద్వేల్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
సాక్షి, కడప : జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీ మడలకవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద జరిగింది. మృతులు అనంతపురంలోని మారుతి నగర్కు చెందిన వారిగా గుర్తించారు. వివరాలివి.. వెంకటరామిరెడ్డి, సుజాత దంపతులు. వీరు కారులో నెల్లూరులో ఓ వివాహ వేడుకకు వెళుతూ మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో కారు నుజ్జునుజయింది. కారు నెంబర్ Ka 05mv 6549. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు, డ్రైవర్ మధు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కట్టెల కోసం వెళ్లి..
సంగారెడ్డి రూరల్ : కట్టెల కోసం వెళ్లిన యువతులు కానరాని లోకాలకు చేరుకున్నారు. దప్పిక తీర్చుకునేందుకు పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. ఈ సంఘటన మండలంలోని కలబ్గూర్ పెద్ద చెరువులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకొంది. రూరల్ సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నేపాల్కు చెందిన కొన్ని కుటుంబాలు 20 ఏళ్ల క్రితం సంగారెడ్డిలోని బసవేశ్వర నగర్ (కట్టెకొమ్ము)లో ఉంటూ గూర్కాలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కట్టెలు తెచ్చేందుకు జ్యోతి(17), లక్ష్మి(18), అంజలి(19)ఇంటి నుంచి వెళ్లారు. కల్పగూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి కట్టెలు సేకరించారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు చెరువు చెంతకు వెళ్లి నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్ద గుంతలోకి జారి పోవడంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురూ నీటిలో ముగినిపోయారు. చాలా సేపటి వరకు వీరు బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ చిన్నారి ఇంటికి వెళ్లి విషయాన్ని పెద్దలకు చేరవేసింది. దీంతో కుటుంబీకులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని నీటిలో మునిగిన యువతుల ఆచూకి కోసం ఫైర్ స్టేషన్ సిబ్బంది, ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. జ్యోతి, అంజలి మృతదేహాలు లభ్యం కాగా లక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీరిలో అంజలికి వివాహం కాగా జ్యోతి, లక్ష్మి అవివాహితులు. మృతదేహాలను చూసి కుటుంబీకులు బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్కుమార్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
ఈత సరదా వారింట్లో పెను విషాదాన్ని నింపింది. బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో కవలలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.గూడూరు(మహబూబాబాద్) : చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం... దామరవంచ గ్రామానికి చెందిన షేక్బాబాకు వరంగల్ రంగశాయిపేట శివారు నక్కలపల్లికి చెందిన షాహిద్తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి షేక్ అజీజ్పాషా(12), షేక్ అజీజ్బాబా(12) కవల పిల్లలు ఉన్నారు. వీరి తండ్రి షేక్బాబా చనిపోయాడు.దీంతో తల్లి ఇద్దరు కుమారులను తీసుకొని వరంగల్ సమీపంలోని నక్కలపల్లిలోని తల్లిగారింటి వద్ద ఉంటోంది. షాహిద్ చెల్లెలు షేక్ అంజత్, ఫాతిమా దంపతుల కుమారుడు షేక్ అమ్జద్ ఖాదర్(10) కలిసి మండలంలోని దామరవవంచలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు బాలురు శివారులోని చెరువులోకి ఈతకు వెళ్లారు. పిల్లలు కనిపించకపోవడంతో షాహిద్ బంధువులకు చెప్పింది.రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో, అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు. చివరకు చెరువు సమీపంలో చూడగా, ముందుగా ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న వారు వెళ్లి చెరువులో వెతకగా మరో బాలుడు మృతిచెంది కనిపించాడు. ముగ్గురి మృతదేహాలను ఇంటికి చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. శుభకార్యం జరిగిన ఇంటికి వచ్చిన బాలురు ముగ్గురు చనిపోయారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు బలి!
సాక్షి, గురజాల రూరల్: వేసవి సెలవుల్లో ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటకు చెందిన శ్రీహరి నాయక్, మనోహర్ నాయక్, హరిబాబు నాయక్తో పాటు మరికొందరు పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పరుగులు తీశారు. ఇంతలో మూడావత్ పవన్ (17), శ్రీహరి నాయక్(14), మనోహర్ నాయక్ (11)లకు సమీపంలో పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. హరిబాబు నాయక్ కొద్ది దూరంలో స్పృహ కోల్పోయాడు. స్థానికులు వీరిని రెంటచింతల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. హరిబాబు నాయక్ గురజాల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో పవన్ హైదరాబాద్లో చదువుకుంటూ 10 రోజుల కిందటే వేసవి సెలవులకు సమాధానంపేటలోని మేనమామ నరసింహా నాయక్ ఇంటికి వచ్చాడు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
సాక్షి, గద్వాల : ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. డ్రైవర్ అలక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. -
అదుపులోకి రాని జ్వరాలు
భీమిని(బెల్లంపల్లి): కన్నెపల్లి మండల కేంద్రంలో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. గత వారం రోజులుగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఆదివారం నాటికి విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కన్నెపల్లి గ్రామ సాక్షరభారత్ సమన్వయకర్త ఏదుల మల్లేశ్(40) శనివారం మధ్యాహ్నం కరీంనగర్ ఆస్పత్రిలో మృతి చెందగా, స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన చింతపురి వెంకక్క(70) శనివారం ఉదయం జ్వరంతో ఇంట్లోనే మృతి చెందింది. ఆదివారం ఎస్టీ కాలనీలోని రాజారాం–పోసక్క దంపతుల కూతురు గురుండ్ల వనజ(19) జ్వరంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వనజ బెల్లంపల్లిలో ఇంటర్మీయెడిట్ చదువుతోంది. మరో 50 మంది వరకు జ్వరంతో మంచం పట్టారు. రోజు రోజుకూ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో ఇంటికిద్దరు విషజ్వరం సోకి బాధపడుతున్నారు. ఆదివారం జిల్లా వైద్యాధికారి భీష్మా వైద్య సిబ్బందితో వెళ్లి కన్నెపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి కొంత మందిని 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్రావు, జిల్లా పంచాయతీ అధికారి నరేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో రాధాకృష్ణ, తహసీల్దార్ విజయానంద్ గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. డీఎంఅండ్హెచ్వో మాట్లాడుతూ మృతి చెందిన వారు విషజ్వరంతో మృతి చెందలేదని వేర్వేరు కారణాలతో మృతి చెందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుండగా డీఎంఅండ్హెచ్వో ఇలా మాట్లాడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంపై సర్పంచ్ గురుండ్ల సత్తమ్మ, పంచాయతీ కార్యదర్శి జోసఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని వారికి సూచించారు. గ్రామంలో నీటి నిలువలు లేకుండా చూడాలని క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక చర్యలు: కలెక్టర్ కన్నెపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ అధికారి గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖతో పాటు పలు శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారని, కాలనీలో ఒకే బావి ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఓవర్హెడ్ ట్యాంకు వద్ద బురద నీరు చేరి నీరు కలుషితం అవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ఆ కాలనీ మొత్తం జ్వరాల బారిన పడుతున్నారన్నారు. ఈ ఓవర్హెడ్ ట్యాంకు క్లోరినేషన్తో పాటు చుట్టూ ప్లాట్ఫాం ఏర్పాటు చేయించి తాగునీటి కోసం బోర్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో పారిశుధ్యంపై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. కన్నెపల్లి మండలాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత తహసీల్దార్, ఎంపీడీవో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, వైద్య సిబ్బంది సందర్శించి వైద్య శిబిరంతో పాటు పారిశుధ్యం కోసం ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
ఎంత ఘోరం
మైసూరు : లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారుల సహా కారు డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చామరాజనగర పట్టణం సమీపంలో ఉన్న సోమవార పేట వద్ద చోటుచేసుకుంది. వివరాలు... విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాలో ఉన్న కోలూరగి గ్రామానికి చెందిన ఓ కుటుంబ తమిళనాడు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా చామరాజ పేట వద్ద కొబ్బరి బోండా తాగడానికి నిలిపారు. దంపతులు కారు నుంచి బయటకు వచ్చారు. కారులో సంకేత్ కుమార్ (4), లక్ష్మీకాంత్ (14)లతో పాటు కారు డ్రైవర్ ఉన్నారు. అదే రోడ్డులో వాయువేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును వేగంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న చిన్నారులతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. చామరాజనగర ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరిపోయిన చిరుదివ్వెలు
ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. ఎన్నో ఆశలతో సుదూరంలో ఉన్న బడికి పంపిస్తున్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. తాము నిరుపేదలమైనా.. తమ పిల్లలు చదివి బాగుపడాలన్న వారి ఆకాంక్షలు ఆదిలోనే నీరుగారిపోయాయి. ప్రాథమికోన్నత పిల్లలకు ఉచిత రవాణా సదుపాయం అంటూ చెప్పిన ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వారి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. బస్సుల్లో పిల్ల లను ఎక్కించుకోకపోవడం... ఉన్న బస్సుల్ని రద్దు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వేరే మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం ఆ కుటుంబాల్లో కడుపుకోతకు కారణమయ్యాయి. ఒంటిపూట బడి ముగించుకుని ఇంటికి చేరేందుకు లిఫ్ట్ అడిగి వెళ్తున్న బైక్ కాస్తా ఓ బస్సును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. వారిని తీసుకెళ్తున్న ఆ యువకుడి ప్రాణాలు సైతం గాలిలో కలసిపోయాయి. శృంగవరపుకోట రూరల్: ఒంటి పూట బడులు. మధ్యాహ్నం 12.30 అయింది. బడి వదిలేశారు. ఆకలి వేస్తోంది. వెంటనే ఇంటికి చేరాలి. అమ్మచేతిముద్ద తినాలి. కాస్తంత సేద తీరాలి. మళ్లీ హోం వర్క్కు సిద్ధం కావాలి. ఇదే ధ్యాసతో బయలుదేరిన ఆ పిల్లలకు బస్సులు దొరకలేదు. తమతమ గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు ఇక రాదని తెలుసుకుని అటుగా బైక్పై వెళ్లేవారిని కాస్త ఎక్కించమని బతిమి లాడారు. ఓ అన్న వారిని ఎక్కిం చుకున్నాడు. కానీ అదే వారి ప్రా ణాలు బలిగొంటుందని వారస్సలు ఊహించలేదు. కాసేపట్లోనే వా రు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సం ఘటన ఎస్కోట మండలం కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య శనివారం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఎలా జరిగిందంటే... భోగాపురం మండలం నందిగాం పోస్టు సబ్బన్నపేటకు చెందిన మల్లాడ గౌరీశేఖర్(22) విజయనగరం ఎల్జీ సర్వీస్ సెంటర్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఎస్.కోట పట్టణం నుంచి వచ్చిన ఓ కంప్లయింట్ను పరిష్కరించేందుకు వచ్చిన ఆ యువకుడు అక్కడి పని పూర్తి చేసుకుని కొత్తవలసలో మరో చోటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో లక్కవరపుకోట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చప్పగడ్డి విజయ్(6వ తరగతి), గొర్లె లోకేష్ (7వ తరగతి) బడి విడిచిపెట్టాక ఇంటికి వెళ్లేందుకు శృంగవరపుకోట బస్టాండుకు సమీపంలో లిఫ్ట్ అడిగారు. వారిని ఎక్కిం చుకున్న గౌరీశేఖర్ బైక్ కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య ముందుగా వెళ్తున్న ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టడంతో బైక్ను బస్సు కొద్ది దూరం ఈడ్చుకుని పోయింది. ఈ ప్రమాదంలో బైక్ పై కూర్చున్న ముగ్గురి తలలు, ఇతర శరీర భాగాలు రోడ్డుకు బలంగా తాకటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లాడ గౌరీశేఖర్ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ఆర్టీసీ బస్సు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో హెల్మెట్ పక్కనే గల తుప్పలోకి ఎగిరిపోగా గౌరీశేఖర్ తల రోడ్డుకు గుద్దుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్ నుజ్జు నుజ్జయ్యింది. ఇదిలా ఉండగా ఎస్.కోట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి ఎస్.కోట వైపు అతివేగంగా వస్తూ ఈ బైక్ను ఢీకొందని మరికొంత మంది ఆరోపిస్తున్నారు. హుటాహుటిన మృతదేహాల తరలింపు మృతిచెందిన చప్పగడ్డి విజయ్కు 9వ తరగతి చదువుతున్న సోదరుడు అజయ్, తల్లి కాంత, తండ్రి రమణ ఉండగా.. గొర్లె లోకేష్కు ఎల్.కోట హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న జానకి అనే సోదరి, తల్లి వెంకటలక్ష్మి, తండ్రి రామారావు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసు సిబ్బంది శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి, ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనేజర్ నాగార్జునరాజుతో కలిసి విజయనగరం డీఎస్పీ ఏ.వి.రమణ పరిశీలించారు. మృతదేహాలను ఎస్.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, డీఎస్పీ ఏ.వి.రమణ, ఎంఈఓ బి.అప్పారావు ఓదార్చారు. సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరివీ వ్యవసాయ కుటుంబాలే... రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లాడ గౌరీశేఖర్(22), చప్పగడ్డి విజయ్(11), గొర్లె లోకేష్ (12)లు ముగ్గురూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. గౌరీశేఖర్ రోజూ స్వగ్రామమైన భోగాపురం మండలం సబ్బన్నపేట గ్రామం నుంచి విజయనగరంలోని ఎల్జీ సర్వీస్ సెంటర్కు ద్విచక్రవాహనంపై వచ్చి వెళ్తుంటారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకుల ఆదేశాల మేరకు ఎల్ఈడీ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లు వంటివాటికి మరమ్మతులు చేసేందుకు వివిధ గ్రామాలకు వెళ్తుంటాడు. తండ్రి సన్యాసిరావు తాపీ మేస్త్రీ కాగా, అన్న నాగరాజు వెల్డర్. విద్యార్థి చప్పగడ్డి విజయ్ ఎస్కో ట పట్టణంలోని రామన్ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి, గొర్లె లోకేష్ ఎస్.కోట పట్టణంలోని శ్రీ రవిజేత హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. రోజూ ఎల్.కోట మండలంలోని సీతారాంపురం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సు ఎక్కించకే... బస్సు పాసులు ఉన్నప్పటికీ విద్యార్థులను సక్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించటం లేదనీ, విద్యార్థులు చేతులు ఎత్తి ఆపుతున్నా స్టాపుల్లో ఆపకుండా బస్సులు వేగంగా వెళ్లి పోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో చదువుతున్న స్కూళ్లకు సమయానికి వెళ్లి తిరిగి ఇళ్లకు వచ్చే క్రమంలో విద్యార్థులు అటు వైపుగా ప్రయాణిస్తున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను బాగా చదివించి వారి జీవితాలను ఉన్నతంగా ఉంచాలనే ఆశయంతో ఎస్.కోట పట్టణంలోని కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నామని, చివరికి రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను మింగేసిందంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల తీరు అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. సీతారాంపురంలో అలుముకున్న విషాదఛాయలు లక్కవరపుకోట: అరకు–విశాఖ రోడ్డులోని ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్కవరపుకోట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో చలాకీగా ఉంటూ... అందరి తలలో నాలుకలా ఉండే పిల్లలు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు బోరుమంటూ విలపించారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో తిప్పి ఉంటే తమ పిల్లలు బతికేవారని వారంతా గుండెలు బాదుకుని రోదిస్తున్నారు. -
అతివేగమే ప్రాణాలు తీసింది..
ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు :అతివేగం నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దకడుబూరు సమీపంలో మంగళవారం డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఉదయం మాలపల్లి నుంచి ఎమ్మిగనూరుకు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. పెద్దకడుబూరు మం డలం నాలుగో రాయి సమీపానికి రాగానే డీసీఎం ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొంది. తర్వాత రోడ్డు పక్క నున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. దీంతో ఆటోలో ఉన్న బూదురు చంద్రమ్మ(50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. చాకలి శేకన్న(45), ఆయన భార్య చంద్రమ్మ(ఐరన్గళ్), బూదురుకు చెందిన అక్కాచెల్లెళ్లు విరుపాక్షమ్మ, యంకమ్మ, తిమోతి(మాలపల్లి), ఖలీల్(డోన్), లక్ష్మీ(చిన్నతుంబళం), వీరేష్(గుడేకల్), హతూన్బీ(ఎమ్మిగనూరు)కి తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు వెంటనే వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడతో చాకలి శేకన్న అక్కడే మృతి చెందాడు. బసవలదొడ్డికి చెందిన డైట్ విద్యార్థిని నర్మద(20)ను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విరుపాక్షమ్మ, యంకమ్మ, ఖలీల్ కర్నూలులో చికిత్స పొందుతున్నారు. శేకన్న భార్య చంద్ర మ్మకు ఎముకలు విరగడంతో ఎమ్మిగనూరులోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పెద్దకడుబూరు హెడ్కానిస్టేబుల్ మాహబూబ్బాషా తెలిపారు. -
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
-
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని పాల్గర్లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బోయిసార్ - తారాపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్లోని నోవాపెనే స్ఫెషాలిటీస్ లిమిటెడ్లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడి ఇతర యూనిట్లకి మంటలు వ్యాపించాయి. పేలుడు ప్రభావంతో 12 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మండే స్వభావం ఉన్న ఎల్ఈడీని ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రమాదం సంభవించటంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించామని తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు కంపించడంతో ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. -
పుష్కరిణిలో పడి ముగ్గురు మృతి
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అడ్డాకుల మండలం కుందూరులో ముగ్గురు యువకులు శ్రీరామలింగేశ్వరస్వామి పుష్కరిణిలో పడి మృతి చెందారు. జాతర సందర్భంగా పుష్కరిణిలో స్నానానికి వెళ్లిన రవికుమార్, పవన్కుమార్, ఆంజనేయులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు సోదరులు మహబూబ్నగర్ కు చెందినవారుగా గుర్తించారు. -
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
-
ప్రహరీగోడను ఢీకొట్టిన బైక్ ముగ్గురు మృతి
-
ఓ కొడుకా..
♦ ఆర్టీసీ బస్సు, కారు ఢీ... ముగ్గురు దుర్మరణం ♦ మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు ♦ శ్రీశైలం రహదారిపై మొహబ్బత్నగర్ గేటు వద్ద ప్రమాదం కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కుర్మిద్దకు వెళ్లి తల్లిని చూసి వస్తుండగా దారుణం మహేశ్వరం మండలం మొహబ్బత్ గేటు వద్ద ఘటన అయ్యో కొడుకుల్లారా.. ఎంత ఘోరం జరిగింది.. ఈ కన్నతల్లిని చూడాలని వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా.. అంటూ ఆ తల్లి రోదన అందరినీ కలిచివేసింది. కన్నబిడ్డల మృతదేహాలను చూసిన ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి తరమూ కాలేదు. మహేశ్వరం: ఆర్టీసీ– బస్సు మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీశైలం రహదారిపై మెహబ్బత్నగర్ గేటు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాలోజు చంద్రమౌళి(52), పాలోజు బ్రహ్మచారి(48) పాలోజు శ్వేతæ(20)లు మారుతీ కారులో హైదరాబాద్ నుండి స్వస్థలమైన యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి తల్లిని చూడటానికి వెళ్లారు. తల్లి రామేశ్వరమ్మని చూసి మధ్యాహ్నం 3 గంటలకు కుర్మిద్ద నుండి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీశైలం రహదారిపైన మొహబ్బత్నగర్ గేటు వద్దకు రాగానే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కందుకూరు నుండి హైదరాబాద్ వస్తున్న మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఆర్టీసీ డ్రైవర్కు దేహశుద్ధి.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను చితకబాది మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకు మహేశ్వరం సీఐ కొరని సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నా రు. వర్షం కురుస్తుండటంతో రోడ్డుపైన వాహనాలు కనబడక రెండు వాహనాలు ఢీకొన్నట్టు భావిస్తున్నారు. అయితే, బస్సు డ్రైవర్ అతివేగంగా నడిపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోరున విలపించిన మృతుల తల్లి.. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు నగరంలో నివాసం ఉంటున్నారు. అన్న పాలోజు చంద్రమౌళి రాజేంద్రనగర్ మండలం కాటేదాన్లో నివాసం ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. తమ్ముడు బ్రహ్మచారి పాతబస్తీ ఉప్పుగూడలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అన్న యాదయ్య కూతురు శ్వేత నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో దొరికిన సెల్ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లి రామేశ్వరమ్మ కొడుకులు, మనుమరాలు మృతదేహాలను చూసి కన్నీటి పర్వంతమయ్యారు. తనను చూడడానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా బిడ్డ్డల్లారా అంటూ బోరున విలపించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వారి స్వస్థలమైన కుర్మిద్దలో విషాదం నెలకొంది. ప్రమాద స్థలాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కుర్మిద్దలో విషాదఛాయలు యాచారం(ఇబ్రహీంపట్నం): ఇంటి నుంచి బయల్దేరిన గంట సేపటికే తన ఇద్దరు తమ్ముళ్లతోపాటు కూతురి మరణవార్త తెలుసుకున్న యాదయ్య చారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్వగ్రామం కుర్మిద్దలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు పొలోజ్ యాదయ్య చారి తమ్ముళ్లయిన చంద్రమౌళి, బ్రహ్మచారిలు మంగళవారం మధ్యాహ్నం నగరం నుంచి స్వగ్రామానికి వచ్చారు. అన్నా, వదిన, తమ తల్లిని పలకరించారు. వారితోపాటు అన్న కుమార్తె శ్వేతను కూడా వెంటబెట్టుకుని కారులో బయల్దేరారు. ఇంతలో ఆర్టీసీ బస్సు రూపంలో ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. అన్నదమ్ములిద్దరూ తమ అన్న యాదయ్యచారి, వదిన సుగుణలను శ్రీశైలం దేవస్థానానికి తమతో పాటు రమ్మని పిలవడానికే వచ్చారని.. బుధవారం అందరం కలిసి దైవ దర్శనానికి వెళ్దామని పిలవగా.. వారు కుదరదని చెప్పడంతో వారి కుమార్తెను తమతో తీసుకెళ్లారని చెబుతున్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వనపర్తి: వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామం సమీపంలో అడవిలో ఈ ఘటనలో చోటు చేసుకుంది. మృతులను ఈదన్న(45), పరమేష్(25), లక్ష్మన్న(40)లుగా గుర్తించారు. వీరంతా బాలకిష్టాపూర్కు చెందినవారు. పొయ్యిలోకి కట్టెలు కొట్టుకోవడానికి వీరంతా అడవికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం ..
♦ పూతలపట్టువద్ద ఘోర రోడ్డు ప్రమాదం ♦ ముగ్గురి మృతి ♦ ఐదుగురికి గాయాలు లేకలేక పుట్టిన కొడుకు పుట్టు వెంట్రుకలు తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించాలని మహారాష్ట్రకు చెందిన దంపతులు అనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా టెంపో ట్రావెల్లర్ వాహనంలో బయలుదేరారు. మరో రెండు గంటల్లో స్వామి సన్నిధి చేరుకోవాల్సి ఉంది. ఇంతలో విధి వక్రించింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదమరి మండలంలక్ష్మయ్యకండిగ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మొక్కు తీర్చుకుందామని వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారని తెలియడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. లక్ష్మయ్యకండిగ(యాదమరి) : యాదమరి మండలం లక్ష్మ య్యకండిగ గ్రామం వద్ద చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివా రం వేకువజామున 5 గంటల ప్రాం తంలో టెంపో ట్రావెల్లర్ వాహనం ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు కథనం మేరకు.. మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన సౌరవ్, శివలింగయ్య, విశాల్ కుటుం బాలు పదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలో స్థిరపడ్డాయి. అనేక ఏళ్లుగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. వీలు పడలేదు. ఈ క్రమంలో సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టాడు. బాలుడి పుట్టు వెంట్రుకలను తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించడంతోపాటు స్వామిని తనివితీరా దర్శించుకోవాలని మూడు కుటుంబాల్లోని 11 మంది సభ్యులు అనుకున్నారు. టెంపో ట్రావెల్లర్ను బాడుగకు తీసుకుని శనివారం రాత్రి 11.30 గంటలకు సంతోషంగా బయలుదేరారు. వాహనాన్ని డ్రైవర్ విశాల్ బాబు (26) నడుతుపుతున్నాడు. ఆదివారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో యాదమరి మండలం లక్ష్మయ్యకండిగ గ్రామం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళుతున్న పామోలిన్ ట్యాంకర్ను టెంపో ట్రావెల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి రిధయ్(2) అక్కడికక్కడే మృతి చెందాడు. కామాక్షి(27), సంతోషిని(47), శివలింగయ్య(38), రేణుక(30), పూజ(9), అభిషేక్(8), డ్రైవర్ విశాల్ బాబు(26)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తిం చిన స్థానిక యువకులు వెంటనే పోలీ సులకు సమాచారం అందించి గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కామాక్షి, డ్రైవర్ విశాల్బాబు మృతి చెందారు. సంతోషిని, శివలింగయ్య, రేణుక, పూజ, అభిషేక్ ను వేలూరు సీఎంసీకి తరలించారు. సంతోషిని పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. విశాల్(31), దీప్తి(31), సౌరవ్(30), రవికుమార్(25), లారీ ట్యాంకర్ డ్రైవర్ లోకేష్(26)కు తెలికపాటి గాయాలయ్యాయి. వారు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు తెలిపారు. మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా.. మాది మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతమని, పదేళ్ల క్రితం కర్ణాటకలోని తుమ్ముకూరుకు వచ్చి ఇండస్ట్రియల్ ఏరియాలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని బాధితులు తెలిపారు. సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టడంతో అతనికి తిరుమలలో వెంట్రుకలు తీయాలని మొక్కుకున్నారని పేర్కొన్నారు. సౌరవ్తోపాటు, అతని అమ్మ సంతోషిని, విశాల్, అతని భార్య దీప్తి, శివలింగయ్య, అతని భార్య రేణుక, వారి పిల్లలు అభిషేక్, పూజ, మరో స్నేహితుడు రవికుమార్తో కలిపి 11 మంది బయలుదేరామన్నారు. ప్రమాదంలో మొక్కుబడి ఉన్న పిల్లవాడు, అతని తల్లి చినిపోవడం చాల బాధాకమని కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
తర్లుపాడులో రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తర్లుపాడు మండలం మేకలవారిపాలెం వద్ద జాతీయరహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ ఎమ్మార్వో భార్య సహా ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురంలో ఆదివారం గ్రూప్-2 పరీక్ష రాసి తిరిగి ఒంగోలుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నాగులుప్పలపాడు ఎమ్మార్వో భార్య మాధవి కూడా ఉన్నారు. మాధవి తన అన్న రఘుతో కలిసి గ్రూప్-2 పరీక్ష రాసేందుకు కారులో మార్కాపురం వెళ్లింది. పరీక్ష రాసి తిరిగి వస్తుండుగా ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉన్న మాధవి, రఘు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఎమ్మార్వో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. నాగులుప్పలపాడు ఎమ్మార్వోను పలువురు ఉన్నతాధికారులు ఫోన్లో పరామర్శించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి
వైఎస్ఆర్ కడప: కానగూడురు-టంగుటూరు మధ్య గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
కర్నూలులో మద్యం తాగి ముగ్గురు మృతి
-
కాటేసిన మద్యం
– వివాహ వేడుకలో అతిగా మద్యం తాగి ముగ్గురు మృతి – మిలటరీ మద్యం బాటిళ్లపై పోలీసుల ఆరా – ఎవరిపై కేసు నమోదు చేయని పోలీసులు నంద్యాల: వివాహ విందులో అతిగా మద్యం సేవించిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిల్లలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు భూమా రామకృష్ణారెడ్డి కుమారుడు రవికుమార్రెడ్డి వివాహ విందు సందర్భంగా ఆదివారం సాయంత్రం నుంచే గ్రామంలో సందడి మొదలైంది. హైదరాబాద్లోని గోల్కొండ మిలిటరీ హాస్పిటల్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న రవికుమార్రెడ్డి గ్రామస్తులకు, స్నేహితులకు మందు పార్టీ ఇవ్వడానికి దాదాపు 30 మిలిటరీ బాటిళ్లను గ్రామానికి తీసుకొచ్చారు. ఓల్డ్ఫాక్స్ రమ్, అరిస్ట్రోక్రాట్ విస్కీ, రాయల్ఛాలెంజ్ విస్కీలను బిందెల్లో పోసి, నీళ్లు కలిపి, గ్రామ నడిబొడ్డులోని గంగమ్మ ఆలయం వద్ద పానకంలా పంపిణీ చేశారు. విందులో పాల్గొన్న గ్రామానికి చెందిన కన్నాపుల్లయ్య, చిలకల కృష్ణుడు, గురువయ్య కూడా సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మద్యాన్ని అతిగా తాగారు. తర్వాత వీరు ఇళ్లకు వెళ్లారు. కొద్ది సేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొదట పుల్లయ్యను కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. తర్వాత గురువయ్య, చిలకల కృష్ణుడును కుటుంబ సభ్యులు వేర్వేరుగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వీరు కూడా కోలుకోలేక అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు వీరి మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐలు రమణ, సూర్యమౌళి, గోపాల్రెడ్డి, బిల్లలాపురం గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సోమవారం ఉదయం నంద్యాల ఇన్చార్జి డీఎస్పీ ఈశ్వరరెడ్డి గ్రామాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షలకు పంపుతామని డీఎస్పీ తెలిపారు. అన్ని మిక్స్ చేయడమే ఘటనకు కారణం మిలిటరీ క్యాంటిన్ నుంచి తెచ్చిన పలు రకాల మద్యాన్ని బిందెల్లో పోసి నీళ్లు కలపడంతో కల్తీ జరిగినట్లు ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు తెలిపారు. అన్ని మిక్స్ చేసిన మద్యాన్ని సేవించడం ప్రమాదకరమన్నారు. దీంతోనే ముగ్గురు చెంది ఉంటారని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఎవరిపై కేసు నమోదు చేయలేదని రూరల్ ఎస్ఐ రమణ తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందాక కేసును పరిశీలిస్తామన్నారు. అప్పటి వరకు ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు గ్రామంలోని దళిత వాడకు చెందిన కన్నాపుల్లయ్య నిరుపేద. ఆయన భార్య మరియమ్మ, కుమార్తె మౌనిక గుడిసెలో నివాసం ఉన్నారు. కన్నాపుల్లయ్య పగలంతా పని చేస్తేనే వీరి కుటుంబం గడవదు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వివాహ విందుకు వెళ్లిన పుల్లయ్య విగత జీవిగా ఇంటికి చేరడంతో మరియమ్మ కుప్పకూలిపోయింది. పుల్లయ్య పెద్దకుమార్తె సుమలతకు వివాహం కాగా చిన్నకుమార్తె మౌనిక అవివాహితురాలు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దండబోయిన గురువయ్య కూలీగా పని చేసేవాడు. కాని రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కాలు విరిగింది. దీంతో కూలీ పని చేసే అవకాశం లేక పొట్టెళ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని కుమారుడు మధు టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. గురువయ్య కూడా రాత్రి పెళ్లి విందుకు వెళ్లి మృత్యువాత పడటంతో కుమారుడిపై కుటుంబ భారం పడింది. మృతుడి భార్య లక్ష్మి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. వ్యవసాయ కూలీ చిలకల కృష్ణుడు నిరుపేద. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కృష్ణుడు రోజూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కూడా రాత్రి వివాహ విందులో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సంజీవనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం దిక్కులేనిదైంది. -
పంజాబ్ కాంగ్రెస్ ర్యాలీలో పేలుడు
-
పంజాబ్లో పేలుడు
► ముగ్గురు మృతి ► ఎన్నికల రోడ్షో సమీపంలో ఘటన చండీగఢ్: పంజాబ్లోని బతిండాలో కాంగ్రెస్ అభ్యర్థి రోడ్షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్ మండీ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్ శ్యామ్ థోరీ చెప్పారు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి
-
డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి
జమ్మలమడుగు : వైఎస్సార్జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మలమడుగు పాతబస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతులను జమ్మలమడుగుకు చెందిన అశ్వద్ధామ, గోవర్ధన్, తులసీరామ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
‘ఔటర్’పై ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డుపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇరువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఔటర్ రింగ్ రోడ్డు టోల్ప్లాజాకు కిలోమీటర్ దూరంలో ఘనపూర్ వద్ద చోటుచేసుకుంది. హయత్నగర్కు చెందిన వల్లవోజు కార్తీక్ (38), మర్రి తిరుమలేశ్(34), కె. నర్సింగ్రావు (38) కె. బల్రామ్, రఘులు మారుతి జెన్ (ఏపీ10ఎల్ 6556) కారులో ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు బయలుదేరి సాయంత్రం అదే కారులో తిరుగు పయన మయ్యారు. మార్గమధ్యలో మండలంలోని ఔటర్రింగ్పై వారు పయనిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు (ఏపీ10బీఈ 6607) అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కార్తీక్, తిరుమలేశ్, కె.నర్సింగ్రావులు అక్కడికక్కడే మృతి చెందారు. జెన్ కారు డ్రైవర్ బల్రామ్, రఘులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి భౌతిక కాయాలను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన కారులో పరిటాల రవిచంద్ర అనే ఒకే వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. -
మందుపాతర పేలుడు : ముగ్గురి మృతి
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి మందుపాతర పేల్చారు. నారాయణపూర్ జిల్లా తుంనార్ వద్ద బుధవారం రాత్రి భద్రతా బలగాలే లక్ష్యంగా అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్)ని పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు ఉండగా, మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ చెప్పారు. -
సాగర్లో... లారీ బీభత్సం
నాగార్జుసాగర్/ పెద్దవూర : జిల్లా రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదు. మితిమీరిన వేగం..డ్రైవర్ల నిర్లక్ష్యం..నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. నాగార్జునసాగర్లో సోమవారం రాత్రి లారీ బీభత్సానికి నలుగురు బలైపోయారు. అతివేగంతో వచ్చిన లారీ రోడ్డుపై ఉన్న పోలీస్, జెన్కో, ద్విచక్రవాహనాలతో పాటు నిలబ డిన వారిని కూడా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ప్ర మాదంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), పెద్దవూర పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న బాలునాయక్ (25), పెద్దవూర మండలం నె ల్లికల్లుకు చెందిన నడ్డి చంద్రయ్య(45), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19) మృత్యువాత పడగా మరో నలుగురు గాయపడ్డారు. గడ్డి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో.. పెద్దవూర మండలం పోతునూరు గ్రామం నుంచి ఏడుగురు వ్యక్తులు ట్రాక్టర్పై గడ్డిలోడుతో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గోడుమడకకు బయలుదేరారు. మార్గమధ్యలో సాగర్ సమీపంలోని దయ్యాలగండి వద్దకు రాగానే మూలమల్పు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ట్రాలీ, ఇంజన్ మధ్యలో ఇరుక్కున్నాడు. ఇదే సమయంలో జమ్మనకోటకు చెందిన హోంగార్డు బాలునాయక్ పెద్దవూర పోలిస్టేషన్లో çవిధులు ముగించుకుని బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. దయ్యాలగండి వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనను చూసి ఎస్ఐ గౌరినాయుడుకు సమాచారం ఇచ్చారు. ట్రాక్టర్ను పక్కకు తీస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఐ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బం దితో పాటు రోడ్డుపై నిలిచిపోయిన వాహనదారుల సహాయంతో ట్రాక్టర్ను పక్కకు తీసేందుకు ఉప క్రమించారు. ఒక్కసారిగా దూసుకొచ్చి.. రోడ్డుపై ట్రాక్టర్ అడ్డంగా పడి ఉండడంతో రహదారికి రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న జెన్కో ఉద్యోగుల వాహనం కూడా అక్కడే నిలిచిపోయింది. ఈ క్రమంలో సాగర్ నుంచి హైదరాబాద్ వైపునకు మృత్యు రూపంలో వచ్చిన లారీ అడ్డొచ్చిన వాహనాలతో పాటు రోడ్డుపై నిలబడిన వారిపైకి దూసుకుంటూ వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడున్న వారందరూ ఆహాకారాలు చేసస్తూ ఉరుకులు, పరుగులు తీశాయి. ఈ లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), హోంగార్డు బాలునాయక్ (25), పెద్దవూర మండలం నెల్లికల్లు గ్రామానికి చెందిన నడ్డి చంద్రయ్య(45), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19)లను ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సాగర్ ఎడమకాలువపై ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో పని చేస్తున్న ఏఈ క్రాంతిభూషన్, పందిరి మురళితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్, నల్లగొండ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతుల, క్షతగాత్రుల బంధువుల రోదనలు కమలానెహ్రూ ఆస్పతిలో మిన్నంటాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాశ్రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమలా నెహ్రూ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ రవికుమార్, సాగర్, హాలియా సీఐలు పార్థసారథి, ఆదిరెడ్డి ఉన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ కొద్ది దూరంలో నిలిపివేసి పరారయ్యాడు. లారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు పోలీసులు మృతి
నల్లగొండ: నాగార్జున సాగర్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు పాటు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. సమ్మక్క-సారలమ్మ మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు, ట్రాక్టర్ డ్రైవర్ ల మీదకు దూసుకుపోయింది. స్ధానికుల సమాచారంతో సంఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వలస బతుకులు ఛిద్రం..
ఒక్కసారిగా కూలిన పైకప్పు.. ముగ్గురు దుర్మరణం పాత భవనాన్ని కూల్చివేస్తుండగా దుర్ఘటన మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో ఘటన మేడ్చల్/మేడ్చల్ రూరల్: నానక్రామ్గూడ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి 11 మంది కూలీలు మృత్యువాతపడిన ఘటనను మరువక ముందే గ్రేటర్ పరిధిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం మేడ్చల్ మండల పరిధిలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో నూతన భవనం నిర్మించడానికి పాత భవనాన్ని కూల్చి వేస్తుండగా.. భవనం పైకప్పు కుప్పకూలి ముగ్గురు వలస కూలీలు మృతిచెందారు. మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్గుప్తా గ్రామ పంచాయతీకి సమీపంలో ఉన్న పాత భవనాన్ని కొనుగోలు చేశాడు. దానిని నేలమట్టం చేసి నూతన భవనం నిర్మించాలని భావించి పనులు చేపట్టాడు. రామయ్య అనే కాంట్రాక్టర్కు కూల్చివేత పనులను అప్పగించాడు. బుధవారం నుంచి∙కూల్చివేత పనులు చేపట్టగా గురువారం ట్రాక్టర్ డ్రైవర్ లక్ష్మయ్య(45)తోపాటు వెంకటేశం(40), ముత్యాలునాయుడు(60), రాములు, విఠల్ అనే కూలీలు పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పైకప్పుకు ఉన్న సీకులను కట్ చేసి సమ్మెటలతో కొడుతూ భవనాన్ని కూల్చసాగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు జేసీబీని పిలిపించి శిథిలాలను తొలగించి కూలీలను బయటికి తీశారు. అయితే లక్ష్మయ్య అక్కడికక్కడే మర ణించగా.. వెంకటేశం, ముత్యాలునాయుడు చికిత్స పొందుతూ మరణించారు. రాములు, విఠల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా వలస పక్షులే.. ఇక్కడ పనిచేస్తున్న కూలీలంతా వలస పక్షులే. పొట్టకూటి కోసం సొంత ఊరిని వదిలి గుండ్లపోచంపల్లికి వలస వచ్చినవారే. మెదక్ జిల్లా బండపోచారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య 25 ఏళ్ళ క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరనారాయణ గ్రామానికి చెందిన ముత్యాలునాయుడు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలసి కొన్నేళ్ల క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వెంకటేశం భార్య పార్వతి, కుమారుడు రాజు, కూతురు రత్నంతో కలసి ఇటీవలే గుండ్లపోచంపల్లికి వచ్చాడు. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భవనం కూలిన ఘటనలో లక్ష్మయ్య, ముత్యాలునాయుడు, వెంకటేశం మరణించడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. తీవ్ర గాయాలకు గురైన విఠల్, రాములు సైతం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామం నుండి వలస వచ్చినవారే. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్ భవనం కూల్చివేతలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఘటనాస్థలికి వచ్చి ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. మృతుల భార్యలకు వితంతు పింఛన్ మం జూరు చేయాలని అధికారులను ఆదేశించా రు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కాగా, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండా కూలీలతో పనులు చేయించి న భవన యజమాని శ్రీనివాస్గుప్తా, కాంట్రాక్టర్ రామయ్యపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
నాగారం: వేర్వేరుమ రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. పర్సాయపల్లి గ్రామానికి చెందిన బైరబోయిన జానయ్య (60) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం పర్సాయపల్లి గ్రామం నుంచి సైకిల్పై డికొత్తపల్లి గ్రామానికి పని నిమిత్తం వెళుతున్నాడు. ఈ క్రమంలో జనగాం రోడ్డువైపు నుంచి సూర్యాపేటకు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలాన్ని ఎస్ఐ మోహన్రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. వల్లభాపురం(చివ్వెంల) :మండల పరిధిలోని పాశ్యా నాయక్తండా ఆవాసం బద్యాతండాకు చెందిన భానోతు మోతిరాం(28) వల్లభాపురం గ్రామ శివారులోని అమరావతి హోటల్లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో రోజు మాదిరగానే పనులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోరుుంది. తీవ్రంగా గాయడిన మోతి రాంను స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు హతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. మృతుడు అవివాతుడు. బైక్పై నుంచి పడి రైతు.. సంస్థాన్ నారాయణపురం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మర్ల శ్రీరాములు(36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరిమళ్లను సిద్ధం చేసేందుకు గానూ దున్నకాల కోసం ట్రాక్టర్ తీసుకురావడానికి ఆదివారం సాయంత్రం జనగాం గ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలో బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టూరిస్టు బస్సు కారు ఢీ ముగ్గురు మృతి
- బస్సును ఢీకొన్నకారు - ముగ్గురు యువకుల మృతి - మేట్టూరుపాళయంలో ఘటన టీనగర్: మేట్టుపాళయం శనివారం రాత్రి టూరిస్టు బస్సుపై కారు ఢీకొన్న ప్రమాదంలో కోయంబత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. కేరళ రాష్ట్రం మూనార్లోగల అడిమాలిలో ఫాతిమా మాతా బాలికల మహోన్నత పాఠశాల వుంది. ఈ పాఠశాల నుంచి గత 24వ తేదీ రాత్రి రెండు బస్సులలో మైసూరుకు విహారయాత్రగా బయలుదేరారు. టీచర్లు జెస్సిజోసెఫ్ (38), రెజిమోల్ మేథ్యూ (30), అంబాలిజోస్ (50), సింధుసినో (40) ఆధ్వర్యంలో 100 విద్యార్థినులు వెళ్లారు. మైసూరు, ఊటి ప్రాంతాలలో పర్యటించి శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఊటీ నుంచి మూనార్కు తిరిగివస్తున్నారు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో మేట్టుపాళయం, అన్నూరు రోడ్డులో ముందు వెళుతున్న బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కోవైకు చె ందిన ముత్తు (21), వినీత్ (21), కరణ్ (21) అనే ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వినయ్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న మేట్టుపాళయం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మేట్టుపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.రైలు ఢీకొని విద్యార్థి మృతి: పెరంబూరులో రైలు ఢీకొనడంతో విద్యార్థి మృతిచెందాడు. చెన్నై, ఐనావరం చెల్లియమ్మన్ కోవిల్ వీథికి చెందిన వ్యక్తి రవి. ఇతని కుమారుడు అరవింద్ (18). ఇతను ముగప్పేర్లోగల ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్సి రెండవ ఏడాది చదువుతూ వచ్చాడు. శనివారం సాయింత్రం పెరంబూర్ క్యారేజ్ రైల్వేస్టేషన్- వర్కుషాపు మధ్య గల పట్టాలను దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆవడి నుంచి సెంట్రల్ వైపుగా వస్తున్న విద్యుత్ రైలు అతన్ని ఢీకొంది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిగురించి సమాచారం అందగానే పెరంబూర్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. అరవింద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపారు. దీనిగురించి పెరంబూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బైక్ను ఢీకొట్టిన బొలేరో, ముగ్గురి మృతి
రంగారెడ్డి: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొత్తూరుగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కందుకూరు మండలవాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురి దుర్మరణం
పినపాక(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక మండలం దుగునేపల్లి పంచాయతి పరిధిలోని చేగర్సల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కోట్లపల్లి పంచాయతి గడ్డంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్పై (మణుగూరు-ఏటూరునాగారం జాతీయరహదారిపై) వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఇసుక లారీకి ప్రమాదవశాత్తు ఢీకొన్నారు. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు జిల్లాలో భూ వివాదం : ముగ్గురి మృతి
-
నెల్లూరు జిల్లాలో భూ వివాదం : ముగ్గురి మృతి
కలిగిరి : నెల్లూరు జిల్లాలో తలెత్తిన ఓ భూ వివాదంలో ముగ్గురు మృతి చెందారు. కలిగిరి మండలం పాపనముసిలిపాలెంలో పొలం కొనుగోలు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలాన్ని తామే సాగుచేసుకుంటున్నామంటూ శ్రీనివాసులురెడ్డి, గణేశం వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు పొలం కొనడానికి వచ్చిన వారిపై కళ్లలో కారం చల్లి దాడి చేశారు. ఈ గొడవలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతులను నెల్లూరుకు చెందిన తానం సుబ్బారెడ్డి, తానం మహేందర్ రెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిగా గుర్తించారు. నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్రస్థాయిలో భూ వివాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ముగ్గురి మృతి
ఒంగోలు: ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఆటో, ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఆ సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. -
లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
మనుబోలు(నెల్లూరు): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపిన ట్రాలీ ఆటోను, ఆ పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పక్కన నిల్చున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకయ్య, భాస్కర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ గొర్రెలను తీసుకుని చిలుకూరులో జరుగుతున్న సంతకు ఆటోలో వెళ్తున్నారు. కొమ్మలపుడి వద్దకు రాగానే డీజిల్ అయిపోవడంతో వారు దిగి ఆటోను పక్కకు నెడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఆటోతో పాటు ముగ్గురి పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో ఉన్న పది గొర్రెలు కూడా మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
► మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ► భద్రాద్రికి వెళ్లివస్తూ మృత్యువాత ► అతివేగమే ప్రమాదానికి కారణం కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారు చెర్వుఅన్నారం బస్టాప్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆరుగురు పూర్వ విద్యార్థులు (ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) దైవదర్శనం కోసం శుక్రవారం భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పాల్వంచలోని స్నేహితుని ఇంటివద్ద సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో చెర్వుఅన్నా రం బస్స్టాప్ సమీపంలోకి కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పింది. కల్వర్టును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లి నీటిలో మునిగింది. అందులో ముగ్గురు అతికష్టంమీద డోరు తీసుకొని బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారుకు తాడు కట్టి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కానీ, కారులోనే ఉన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడుకు చెందిన చర్లపల్లి శృతిరెడ్డి(23), ఇదే జిల్లా జిల్లేడకి చెందిన హాసాన్పల్లి రత్నమాల(24) నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్లోని సనత్నగర్కు చెందిన ప్రశాంత్ (23) కారు నడుపుతూ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి 108 లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెం దాడు. శృతిరెడ్డి హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కాగా, రత్నమాల ఎంటెక్ ఫస్టియర్ చదువుతోంది. ప్రశాంత్ బీటెక్ పూర్తిచేసి వ్యాపారం చేస్తున్నాడు. ముగ్గురు మృత్యుంజయులు.. ఈ ప్రమాదంలో వరంగల్కు చెందిన ఐలేన్ వినోద్రెడ్డి, హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన గోపిరెడ్డి దిలీప్ కుమార్రెడ్డి, సిద్దిపేటకు చెందిన జెట్టి శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
బైక్, బస్సు ఢీ: ముగ్గురి మృతి
మాగనూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మాగనూరు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులను మహబూబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం కప్పెట వాసులుగా గుర్తించారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురిని మింగిన చెరువు
వెంకటాపురం: చెల్లిని కాపాడబోయి అక్క.. నీట మునిగిపోతున్న ఇద్దరు బిడ్డలను రక్షించే క్రమంలో తల్లిసహా ముగ్గురు చెరువులో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో సోమవారం జరిగింది. విజయపురి కాలనీకి చెందిన ఉయిక కోమలి(35) భర్త రామారావు, ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకొని సోమవారం మిరపతోటకు వెళ్లింది. అనంతరం దుస్తులు ఉతికేందుకు కుమార్తెలను తీసుకొని చెరువు వద్దకు వెళ్లింది. ఆమె దుస్తులు ఉతుకుతుండగా పక్క నే ఆటలాడుకుంటున్న మూడో కుమార్తె శృతి(6) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. పెద్ద కుమార్తె లహరి(15) గమనించి చెల్లిని పట్టుకునేందుకు చెరువులోకి దిగింది. ఆమె కూడా మునిగిపోతూ కేకలు వేసింది. బిడ్డలను కాపాడేందుకు తల్లి కూడా చెరువులో దిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటమునిగి మృతి చెందారు. ఎంతకూ భార్యాపిల్లలు తిరిగి రాకపోవడం తో రామారావు వెళ్లి చెరువులో వెతకగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యూయి. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో సోమవారం ఈత కోసం వెళ్లి నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మండలంలోని ఎత్తోండ క్యాంపునకు చెందిన బసప్ప కుమారుడు రమేశ్(14), పండరి కుమారుడు రంజిత్ (14) స్థానిక జడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్నారు. సోమవారం క్యాంపు సమీపంలోని గుంతలోని నీటి లో ఈత కోసం వెళ్లారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో సమీపంలోని కూలీలు గమనించి వచ్చి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే రమేశ్ మృతి చెందాడు. రంజిత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో బసప్ప దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. పండరికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు రంజిత్. -
రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి
-
రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి
– రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి –నలుగురికి గాయాలు – ఒకరి పరిస్థితి విషమం – రాక్గార్డెన్ సమీపాన ఘటన –ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆకె రవికృష్ణ ఓర్వకల్లు : ఆదివారం సెలవుదినం.. దైవదర్శనానికి వెళ్లిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో కారు టైరు పేలి..మరో కారును ఢీకొనడంతో భార్యాభర్తలతో పాటు డ్రై వర్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకొంది. కర్నూలు నగరం గణేశ్ నగర్లో నివాసముంటున్న మహేశ్వరరావు (50), భార్య ఉన్నూరమ్మ (45), వీరి బంధువులు బాలాజీనగర్కు చెందిన అశోక్కుమార్, భార్య సౌమ్య, చిన్న కుమారుడు సన్ని, పార్థులు పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్బరాయుడు (సుబ్రమణేశ్వర స్వామి)ని దర్శించుకునేందుకు వెళ్లాలనుకున్నారు. ఇందుకు ఏపీ 21 జీ 9459 నంబరు గల అద్దె కారును మాట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి.. స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాక్గార్డెన్కు పూడిచెర్ల బస్సు స్టేజికి మధ్య వీరు ప్రయాణిస్తున్న కారు ముందు టైరు పగలడంతో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఏపీ 21 బీసీ 0854 నంబరు గల కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రై వర్ రాంప్రసాద్రెడ్డి(45), మహేశ్వరరావు (50), ఉన్నూరమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్కుమార్, ఆయన భార్య సౌమ్య, వీరి కుమారుడు సన్నికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. వీరితో పాటు ఎదుటి వాహనం యజమాని ఎస్జే హాస్పిటల్ అధినేత జావిద్ హుసేన్కు రెండు కాళ్లు విరిగాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ చంద్రబాబు నాయుడు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్షత్రగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలియగానే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతుడు పెయింటర్.. మృతుడు మహేశ్వరరావు ఆర్ట్ అండ్ పెయింటర్గా పనిచేస్తూ జీవనం కొనసాగించే వారు. వీరికి అరున్రావు, నిరంజన్కుమార్ సంతానం ఉన్నారు. గాయపడిన అశోక్కుమార్ నగరంలోని బంగారుపేట సమీపంలో గల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచి మేనేజర్గా పని చేస్తున్నట్లు బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు కేసు నమోదు చేసుకొని మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద మూలంగా అరగంట పాటు రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
బస్సు, బైక్ ఢీ..ముగ్గురు మృతి
చిలమత్తూరు : అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిలమత్తూరు మండలం ముదిరెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం వేగంగా వెళ్తున్న బైక్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తమ్మయ్యగారిపల్లికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవమ్మ దంపతులు, గోరంట్ల మండలం బూదిలి గ్రామానికి చెందిన తలారి వెంకట్రామప్ప బైక్పై హిందూపురం వైపు వెళ్తున్నారు. ముదిరెడ్డిపల్లి సమీపంలో వీరి బైక్ హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను హిందూపురం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.