troll
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
చిన్న పిల్లల్ని కూడా వదలని ఐటీడీపీ జీతగాళ్ళు
-
ఎవరిని వదలను.. సోషల్ మీడియా ట్రోల్ పై వంశీ భార్య వార్నింగ్
-
రోహిత్ శర్మపై నటి పోస్ట్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
బాలీవుడ్ భామ విద్యా బాలన్(vidya Balan) గతేడాది భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ హారర్-కామెడీ చిత్రంలో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నటి విద్యాబాలన్ చేసిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ నెట్టింట విమర్శలకు దారితీసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్లో ఐదో టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) నిర్ణయాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఈ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ బదులుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మకు మద్దతుగా విద్యాబాలన్ స్పందించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన పీఆర్ టీమ్ సూచనల మేరకే ఇలా రియాక్షన్ ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఫేమ్ కోసమే రోహిత్ శర్మ పేరును వాడుకుందని విద్యా బాలన్పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నటి విద్యాబాలన్ టీమ్ స్పందించింది.స్పందించిన విద్యాబాలన్ టీమ్..విద్యాబాలన్ పోస్ట్పై పీఆర్ టీమ్ స్పందించింది. తమ సూచనల మేరకు ఆమె అలా చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యా బాలన్ తన ఇష్టపూర్వకంగా అలాంటి పోస్ట్ను చేసింది. ఇందులో పీఆర్ టీమ్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. విద్యాబాలన్ మొదటి నుంచి క్రీడాభిమాని కాదు.. కానీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవారిని ఆమె మెచ్చుకుంటుందని పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. టరోహిత్ను ప్రశంసిస్తూ విద్యాబాలన్ చేసిన ట్వీట్పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అసలు ఆమె ట్విటర్లో రోహిత్ను ఫాలో కావడం లేదని.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్లో భాగమేనని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రోహిత్ను ప్రశంసిస్తూ వచ్చిన స్క్రీన్ షాట్ను విద్యాబాలన్ మొదట షేర్ చేసి వెంటనే దాన్ని తొలగించారన్నారు. ఈ పోస్ట్ కాస్తా పెద్ద చర్చకు దారితీయడంతో దీనిపై విద్యా బాలన్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇది చదవండి: సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్గా మారిన బ్యూటీ)2014లో పద్మశ్రీ అవార్డు..కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సిరీస్ కోల్పోయిన్ భారత్..ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ని ట్రోఫిని టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్ట్లో ఓటమి పాలవడంతో 3-1తో సిరీస్ను కంగారూలకు అప్పగించింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్తో ఆసీస్ తలపడనుంది. (ఇది చదవండి: అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్) Rohit Sharma, what a SUPERSTAR 🤩!! To take a pause & catch your breath requires courage … More power to you … Respect 🙌 !! @ImRo45— vidya balan (@vidya_balan) January 4, 2025 -
అల్లు అర్జున్ అరెస్ట్ పై పొలిటికల్ ఫైట్?
-
Prabhakar: ట్రోలర్స్ కి దొరికితే ఏసుకుంటారు..
-
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు. -
సమంత చిట్చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్కి చిరు గ్రేస్తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
కేటీఆర్పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె. తనపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్ విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. .. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మీద మాజీ మంత్రి హరీశ్రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
నేనూ ట్రోల్స్కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
సలార్ హిట్ దెబ్బ...పవన్ కళ్యాణ్ ని ఆడుకుంటున్న నెటిజన్లు
-
ఉర్లగడ్డ ట్రోల్స్ పై మంత్రి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
నోరు జారిన రాహుల్.. బీజేపీ సెటైర్లు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్కి సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు కురిపించింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. బీజేపీ ధనవంతులకు సేవ చేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావిస్తూ కేంద్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. అదే క్రమంలో అదానీ కోసం పనిచేయాలని భూపేష్ భగేల్కు కూడా సూచించారు. "బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా" అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్గఢ్లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అటు.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్గఢ్ సీఎం అదానీ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన
యాంకర్గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్) బిగ్ బాస్ హౌస్కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. కానీ ఆమె కొన్నిరోజులపాటు స్క్రీన్కు దూరంగా ఉండటం జరిగింది. దీంతో ఆమె కొంచెం బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో ఆమె ఫోటో షేర్ చేసినా.. వీడియో షేర్ చేసినా ట్రోలర్స్ దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే అరియానా పట్ల బాడీ షేమింగ్ కూడా చేశారు. అలాంటి వారికి ఆమె స్టైల్ల్లో సమాధానం ఇచ్చిపడేసింది. పనికి మాలిన వేస్ట్ ఫెల్లోస్ కోసం ఇది చెబుతున్నా.. నేను సన్నగా ఉంటే..? సన్నగా ఉన్నావ్ అన్నారు. సర్లే అని లావు అయితే.. ఏంటి ఇంత లావుగా ఉన్నావు. ఆంటీలా అయ్యావ్ అని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే మేం కూడా చూస్తాం కదా..? నీకు నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి..? సన్నగా ఉంటే నీకేంటి..? లావుగా ఉంటే నీకేంటి..? నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయ్.. నేను ఎలా ఉంటే నీకేంటి..? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఏదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తారు. పనీ పాట లేకపోతే ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా అని ట్రోలర్స్పై అరియానా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by starmaa__shows (@starmaa__shows) -
'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు మహిళ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచింది. అయితే బిగ్బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు.. హౌస్లోని కంటెస్టెంట్స్ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్ను చూపిస్తున్నాడు. అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్కు సపోర్ట్కు మాట్లాడుతున్న బిగ్బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ సార్థక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ను చూపించాలంటూ ఫైరయ్యాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్లో ఉన్నప్పుడే చాలా చూశానని చెప్పుకొచ్చాడు. అయితే హౌస్లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అఖిల్ మాట్లాడుతూ..' నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్గా నిలిచినా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండుసార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్లోకి వెళ్లి గేమ్ క్లియర్గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం అఖిల్ సార్థక్కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by 𝔸𝕜𝕙𝕚𝕝 𝕊𝕒𝕣𝕥𝕙𝕒𝕜 ℕ𝕒𝕚𝕕𝕦 (@akhilsarthak_official) -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్లో భాగ్పత్లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై మొదటిసారి స్పందించిన రుపాలీ
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు. ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది. (ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ) ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు. జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది. కోల్కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
చంద్రముఖి 2 ట్రైలర్ పై దారుణమైన ట్రోల్స్
-
మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్నే: మంచు విష్ణు
సినిమా రంగానికి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ పలువురు ట్రోల్స్ చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైనవి అయితే పర్వాలేదు.. కానీ ఒక్కోసారి అవి శ్రుతిమించి వారిని బాధకు గురిచేస్తాయి కూడా.. ఈ ట్రోల్స్ వల్ల సినిమా రంగంలోని చాలామంది ప్రముఖులు ఇబ్బందులకు గురైనవారే ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగ ఈ విషయంపై ఆయన స్పందించారు. (ఇదీ చదవండి: మామయ్య కోసం పొలిటికల్ వేడుకకు వెళ్తున్న అల్లు అర్జున్) తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది.. చేస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని ఆయన అన్నారు. అదొక 'స్నేక్' బ్యాచ్ చేస్తున్న పనే అని విష్ణు అన్నారు. కానీ అలాంటి ట్రోలింగ్ను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అందరికీ ట్రోల్స్ నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసినప్పుడు తాము కూడా ఎంజాయ్ చేస్తామని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) కొంతమంది పనికట్టుకుని డబ్బులిచ్చిమరీ ట్రోల్ చేయిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పని విష్ణు ఇలా తెలిపారు. 'మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయో అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’ అని ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు. కానీ ఆ స్నేక్ బ్యాచ్ ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనేది ఆయన తెలియచేయలేదు. 'కన్నప్ప'కు శ్రీకారం చుట్టిన మంచు విష్ణు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తాజాగ వెల్లడించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు.. శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. -
శివ జ్యోతిని అక్కా.. అంటూనే ఇలాంటి కామెంట్లా?
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. (ఇదీ చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) అయితే తాజాగా బోనాల పండుగ సందర్భంగా ఆమె ఓ వీడియోను యూట్యూబ్లో పోస్టు చేసింది. అందులో తన కోసం భర్త గంగూలీ కొన్న బంగారు నగలను చూపించింది. దీంతో జ్యోతి భర్త గంగూలీపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేశారు. అక్క మీ భర్త ఏం జాబ్ చేస్తారని ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు ఏ జాబ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్ చేశారు. అంతటితో ఆగని కొందరు ఇంతకూ మీరెప్పుడు పిల్లల్ని కంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారి మాటలను పట్టించుకోకూడదని శివజ్యోతికి సపోర్ట్గా నిలుస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన జ్యోతి.. ప్రేమించి గంగూలీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తన జీవితం ప్రారంభంలో గంగూలీ జాబ్ చేసేవాడని కూడా చెప్పింది. కానీ ఒక న్యూస్ యాంకర్గా జర్నీ ప్రారంభించిన శివజ్యోతికి బిగ్బాస్ తర్వాత పలు టీవీ షోలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఆపై వారు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తనకు ఇంతగా గుర్తింపు రావడానికి కారణం తన భర్తేనని, మొదట్లో ఈ కెరీర్ను ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ప్రోత్సహం ఎక్కువ ఉందని గతంలో జ్యోతి చెప్పింది. బిగ్బాస్ షో తర్వాత వీరిద్దరి జంట బాగా పాపులర్ అయింది. తర్వాత ఇద్దరూ కలిసే పలు షోలు కూడా చేశారు. దీంతో అతను జాబ్ మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జ్యోతితో పాటు అటూ టీవీ షోలు, తన సొంత యూట్యూబ్ ఛానల్ వీడియోలకు సంబంధించి ఎడిటింగ్ పనులను తనే చూసుకుంటున్నట్లు కూడా తెలిసిందే. తన ప్రెగ్నెన్సీ గురించి గతంలో జ్యోతి ఇలా చెప్పింది 'మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇది ఎమోషనల్గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. నాపై పర్సనల్గా, ప్రొఫెషనల్గా తప్పుగా ప్రచారం చేయకండి. అది నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.' అని ఆమె చెప్పింది. బిగ్బాస్లో చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అయ్యే శివజ్యోతికి తనకూ తల్లి కావాలనే ఎమోషన్ ఉండదా. అందులో వారి తప్పేముంది..? రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కానీ సంతానం కలగలేదా అంటూ తనకు సపోర్టుగా పలువురు సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
'ఖుషి' కొత్త సాంగ్.. సమంతకి కొత్త తలనొప్పి!
Samantha Trolling: 'ఖుషి' సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. 'ఆరాధ్య' పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పిక్చరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్, ట్యూన్ వరకు ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికే 'నా రోజా నువ్వే' పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తుండగా, దానికి ఇది కాంపిటీషన్ లా కనిపిస్తుంది. అదే టైంలో ఈ సాంగ్ లోని ఓ సీన్ వల్ల సమంతకు కొత్త తలనొప్పి వచ్చినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) కొన్నాళ్ల పాటు బ్రేక్ సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయిపోయాయి. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం దృష్ట్యా ఓ ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని సామ్ భావించిందని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. సరే అది పక్కనబెడితే 'ఖుషి' సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది. పాటలు అవి చూస్తుంటే హిట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఆ ట్వీట్ వల్ల 'ఆరాధ్య' అని వచ్చిన ఈ పాటలో ఓ చోట.. సమంత కుడి చేతిపై విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేస్తున్నట్లు ఓ స్టిల్ ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్ ని బయటకు తీశారు. అందులో.. 'ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి' అని రాసుకొచ్చింది. అయితే అది 'వన్ నేనొక్కడినే' పోస్టర్ అని చాలామంది అన్నారు. ఇప్పుడు ఆ ఫొటోని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన బెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. No Hate But Sorry #Samantha Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8 — Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023 (ఇదీ చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
మీమర్స్కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్
మార్కెట్లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు? (ఇదీ చదవండి: రామ్చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఎవరితడు.. బ్యాక్గ్రౌండ్? షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా లాక్డౌన్లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?) విచిత్రమైన ప్రవర్తన! నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఆ యాంకర్తో ఎక్కువగా తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి. Vurey vid evad ra ila unadu 😂🤣🤣 Koru mawoo jagrathaa 🤣#Devara #NTR30 pic.twitter.com/XKRBTAqEk9 — Gsv VamsiTarak (@GsvVamsi) June 28, 2023 Tom bayya swag bolthe 😎 pic.twitter.com/ZRpEgYK6Me — Rishi (@Telugu_abbayii) June 28, 2023 Tweets are crazy on Actor #ShineTomChacko especially in Telugu audience on his off screen mannerisms..#Devarapic.twitter.com/wx76dF3Cc9 — Arjun 🪓 (@ArjunVcOnline) June 29, 2023 (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్
సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్కు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు. ట్రోల్స్పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అన్నారు. ట్రోల్స్ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) -
నాకు ఫ్యామిలీ ఉంది...వద్దు ప్లీజ్
-
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
ట్రోల్స్పై ఎమోషనల్ అయిన తమన్ భార్య
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్పై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది. (ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ) -
పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్) బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్తో స్వర భాస్కర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్లు స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. स्वरा भास्कर ने विवाह के 4.5 महीने बाद ही बालक को जन्म देकर समय से पहले काम पूर्ण करने वाले गडकरी जी को दिखाया आईना !! — Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) May 31, 2023 -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
కేఎల్ రాహుల్పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో సునీల్ శెట్టి ఫామ్హౌస్లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే ప్రస్తుతం ఈ జంట లండన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. లండన్లోని ఓ క్లబ్లో కేఎల్ రాహుల్ తన స్నేహితులతో సరదాగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ కేఎల్పై ట్రోల్స్ చేశారు. గాయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు దూరమైనా బాధ లేకుండా.. క్లబ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించడాన్ని తప్పుబడుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి దీనిపై కాస్తా గట్టిగానే ఇచ్చి పడేసింది. (ఇది చదవండి: సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. నేను సాధారణంగా చాలా వరకు మౌనంగానే ఉండాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మన కోసం నిలబడటం చాలా ముఖ్యం. నేను, రాహుల్, మా ఫ్రెండ్స్తో సాధారణంగా ఓ ప్రదేశానికి వెళ్లాం. దయచేసి సంబంధం లేని విషయాలతో ముడిపెట్టకండి. అనేముందు ఒకసారి అలోచించుకోండి.' అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అతియాశెట్టి. తన భర్తను ట్రోల్ చేయడంపై కాస్త ఘాటుగానే స్పందించింది. #KLRahul Spotted In Strip Club In UK During His Recovery pic.twitter.com/jMPzhraJqV — Stroke0Genius🇮🇳 (@Stroke0Genius18) May 26, 2023 -
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్
ఇతర హీరోయిన్లకు నటి కాజల్ అగర్వాల్కు కాస్త వ్యత్యాసం ఉంది. నటనను విపరీతంగా ప్రేమించే నటి ఈ బ్యూటీ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు ఆ తరువాత కోలీవుడ్కు పరిచయం అయిన కాజల్ ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టి స్టార్డమ్ను తెచ్చుకుంది. అయితే అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే ఎలాంటి హంగామా లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్తో కలిసి ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన కాజల్ అగర్వాల్ ఒక భేటీలో పేర్కొంటూ తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను పట్టించుకోలేదని పేర్కొంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: నేను కూడా యూత్ అనిపించింది: హీరో నాని -
'చెత్తగా ఆడాలని ఎవరనుకోరు.. ట్రోల్స్ బాధించాయి'
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీనిని చాలా వరకూ పట్టించుకోకపోయినా.. ఏదో ఒక సమయంలో ట్రోలింగ్ తనపై ప్రభావం చూపుతుందని తానే స్వయంగా పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం గాయపడిన కేఎల్ రాహుల్ టోర్నీకి దూరమయ్యాడు. లండన్లో రాహుల్కు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం కేఎల్ రాహుల్ ''ది రణ్వీర్ షో''లో మాట్లాడాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు. "సోషల్ మీడియా ట్రోలింగ్ నాతోపాటు మరికొందరు ప్లేయర్స్ ను అప్పుడప్పుడూ ఆవేదనకు గురి చేస్తుంది. మాకు మద్దతు అవసరమైన సమయంలో అభిమానులు తాము ఏది కావాలంటే అనే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. మేమెవరమూ చెత్తగా ఆడాలని కోరుకోము. ఇదే మా జీవితం. మేము చేసేది ఇదే. నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు. నేను చేసేది క్రికెట్ ఆడటమే. నేను నా గేమ్ పై సీరియస్ గా లేనని లేదా కఠినంగా శ్రమించడం లేదని ఎవరైనా ఎలా అంటారు? కానీ స్పోర్ట్స్ లో అలా కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉండదు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం నాకు అనుకూలంగా రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి" అని రాహుల్ పేర్కొన్నాడు. ఇక చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రెండు టెస్టులు ఆడిన రాహుల్.. వాటిలో విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్లో బాగానే ఆడినా.. అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. గాయంతో ఐపీఎల్కు దూరమైన రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడడం లేదు. చదవండి: 'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్ను కాదు' -
అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ ఫ్యాన్స్
-
కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్గా ఉంటుంది అంటూ అమల తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్ View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్గా మారింది. అయితే ఈ టీజర్పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
ఫోటో తీసెయ్.. కమెడియన్ అవినాష్కి బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఇది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియోతో పాటు బన్నీ లుక్ని రివీల్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్ని ఇమిటేట్ చేస్తూ అరకొర ఎడిటింగ్తో పుష్పరాజ్లా మారిపోయాడు కమెడియన్ అవినాష్. జబర్దస్త్ స్కిట్స్, బిగ్బాస్ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్ని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్పై ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అర్జెంట్గా ఫోటో డిలీట్ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
డ్రెస్తో జాన్వీ కపూర్ తిప్పలు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్తో అదరగొట్టింది. ఈ ఫంక్షన్లో వెరైటీ డ్రెస్లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్ డ్రెస్పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. (ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి) కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్తో కలిసి బవాల్లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్లో తమ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కదు. టి20లంటే వేగానికి మారుపేరు అన్న సంగతి పక్కనబెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్ఆర్హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే అంతకముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న ఒక్క కారణంతో హ్యారీ బ్రూక్కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లోనే హిట్టింగ్ చేశాడంటే టి20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీ ఎస్ఆర్హెచ్ను నవ్వుల పాలయ్యేలా చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరే ఫస్ట్ మ్యాచులో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచులో ఇంకా దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచులో 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసిన హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు. అయితే, నిజానికి బ్రూక్కు టెస్టు క్రికెట్లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లండ్ తరఫున 20 టి20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేసి.. మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. చదవండి: Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి? -
కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ అన్నా!
''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్ఆర్హెచ్ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో కొత్త జోష్ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్) కమింగ్.. బి కేర్ఫుల్ అపోజిట్ టీం మెంబర్స్''.. మార్క్రమ్ ఎరా మొదలైంది.. ఇక ఎవరు ఆపలేరు''.. ఇదంతా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు ఎయిడెన్ మార్క్రమ్ ఎంట్రీ గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియలో ఇలా ఊదరగొట్టారు. కట్చేస్తే.. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నోతో మ్యాచ్లో కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలమైన మార్క్రమ్ పేలవ రీతిలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ వచ్చాడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా గోల్డెన్ డకౌట్ అవ్వడం ఏంటని ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడ్డారు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ ఇచ్చావ్ అన్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే మార్క్రమ్ వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పరుగులు చేయాల్సిన బ్యాటర్లు పోటీ పడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. పార్ట్టైం బౌలర్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారంటే ఎస్ఆర్హెచ్ ఎంత బాగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. Headline for tomorrow's 𝐓𝐡𝐞 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰 𝐓𝐢𝐦𝐞𝐬 📰 𝘏𝘶𝘮𝘢𝘢𝘳 𝘗𝘢𝘯𝘥𝘺𝘢 𝘣𝘩𝘢𝘪𝘺𝘢, 𝘮𝘢𝘴𝘵 𝘣𝘢𝘢#LSGvSRH #TATAIPL #IPLonJioCinema | @krunalpandya24 pic.twitter.com/mQ7dui048U — JioCinema (@JioCinema) April 7, 2023 Golden duck for Aiden Markram on captaincy debut. Krunal Pandya on fire! pic.twitter.com/mfv0bPn3Zk — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023 Golden Duck on debut match as a captain in IPL 🔥🔥 Aiden Markram era starts from here they said, well said😍😍 #LSGvSRH pic.twitter.com/Gg69nUxQGG — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2023 Search: Markram Era 😂😂🤣🤣🤣🤣🤣 — Dileep (@dileeptweetsz) April 7, 2023 చదవండి: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా' ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్ను ఏలేవారేమో! -
'రంజీ మ్యాచ్లనుకున్నావా.. ఇలా ఆడితే కష్టం'
సర్ఫరాజ్ ఖాన్.. ఇటీవలీ కాలంలో బాగా మారుమోగిన పేరు. దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ సహా ఇతర క్రికెట్ లీగ్స్లో వరుస శతకాలతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోరని అభిమానులు ప్రశ్నించారు. చెత్త రాజకీయాలతో టాలెంటెడ్ ఆటగాడిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. Photo: IPL Twitter అయితే ఐపీఎల్కు వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ టాలెంట్ను పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నాయి. అందుకు అతను బాగా ఆడలేకపోతున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విమర్శించేది అతని చేస్తున్న స్లో బ్యాటింగ్పై. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్కు దూరమవ్వడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. ఇక బుధవారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 34 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ స్లో బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ రన్రేట్ మధ్యలో దారుణంగా పడిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సర్ఫరాజ్ ఖాన్ను ట్రోల్ చేశారు. ''ఇలా అయితే ఐపీఎల్కు పనికిరావు.. రంజీలనుకుంటున్నావా కాస్త వేగం పెంచు.. సర్పరాజ్ కేవలం రెడ్బాల్ క్రికెట్కు మాత్రమే పనికొస్తాడు.'' అంటూ కామెంట్ చేశారు. He played this in a T20 match 🙂#DCvGT #IPL pic.twitter.com/5KUSnDwdqz — Om 🇮🇳 (@chadxomm) April 4, 2023 చదవండి: 'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు' 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్గా అనిపిస్తోంది' -
మోడల్ నడుముపై చేతులేసిన బోని కపూర్.. నెటిజన్స్ ట్రోల్
సినీ ప్రముఖులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏం చేసినా..అది వార్తే అవుతుంది. వారు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తారు. మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. తప్పు చేస్తే అంతే దారుణంగా ట్రోల్ చేస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగిన తప్పుకు, అసలు వాళ్ల దృష్టిలో అది తప్పే కాకపోయినా.. నెటిజన్స్ సదరు సినీ ప్రముఖులను ట్రోల్ చేస్తుంటారు. అలాంటి ట్రోలింగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత బోని కపూర్కు ఎదురైంది. ఓ బాలీవుడ్ మోడల్ నడుముపై చేతులు వేశాడంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే... రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC)’ ప్రారంభోత్సవం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్ కూడా హాజరయ్యాడు. అలాగే హాలీవుడ్కు చెందిన ప్రముఖ మోడల్ జిగి హడిద్ కూడా ఈ లాంచింగ్ ఈవెంట్కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అదే ఇప్పుడు ట్రోలింగ్కు కారణమైంది. ఫోటో దిగే క్రమంలో బోని కపూర్ జిగి హడిద్ నడుముపై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్ తీసుకుంది. కానీ నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసూ బోనీ కపూర్ని దూషిస్తున్నారు. Patli kamariya tori haaye haaye haaye pic.twitter.com/u0DBdwZfE8 — SwatKat💃 (@swatic12) April 3, 2023 The way #BoneyKapoor Holds Gigi Hadid's Thin Waist in this pic, Is it real or just my Hallucination 😂 pic.twitter.com/ucQn46vEGv — 💫 Arthur (@irrk_k) April 3, 2023 Arey boney ji 😭 pic.twitter.com/WJnbWJ9eJL — celina ❦ (@bollyvfx1) April 3, 2023 Gigi ji, aapko tairna aata hai? pic.twitter.com/MlVV2KKUoG — Robin (@Bisleri_maymer) April 3, 2023 Close enough#BoneyKapoor #GigiHadid #NMACC pic.twitter.com/B9W0VSl8It — Himalaya Kankariya (@himalayahere) April 4, 2023 -
ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్తో నిత్యం టచ్లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది. -
డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని విమర్శించారు : ఉపాసన
టాలీవుడ్ స్టార్ దంపతులు రామ్చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీళ్లు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఉపాసన పెళ్లైన కొత్తలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'చరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉండేవారు. సమాజంలో చాలామంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. నేను బాగా లావుగా ఉన్నానని, అందంగా లేనని కామెంట్స్ చేశారు. ఇంకొంతమంది అయితే చరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా విమర్శించారు. కానీ నేను ఆ సమయంలో కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించా. ఆరోజు నన్ను ట్రోల్ చేసినవాళ్లే నేడు ప్రశంసిస్తున్నారు' అంటూ ఉపాసన పేర్కొంది. -
ఎక్కడైనా అంతే.. కేఎల్ రాహుల్ను తిట్టడం ఆపండి!
టీమిండియా స్టార్... లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాహుల్ కథ మొదటికే వచ్చింది. అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపుతాడని అభిమానులు ట్రోల్ చేసేవారు. అయితే ఇకపై రాహుల్ను ట్రోల్ చేయడం ఆపేయాల్సిందే. ఐపీఎల్కు మాత్రమే పనికొస్తాడనే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేఎల్ రాహుల్ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చాడు. అంతే రాహుల్ కథ ముగిసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా ఉన్న రాహుల్ ఇక్కడ మాత్రం ఓపెనర్గా వచ్చేశాడు. తనకు ఓపెనింగ్ కంటే ఐదో స్థానం కరెక్ట్ అని రాహుల్ భావించి వచ్చే మ్యాచ్ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది. ఇక రాహుల్ తక్కువ స్కోరుకే వెనుతిరగడంపై అభిమానులు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ఎక్కడైనా రాహుల్ ఆటతీరు ఇంతే.. అతన్ని తిట్టడం, ట్రోల్ చేయడం ఆపండి.. 12 బంతుల్లో 8 పరుగులు... పొరపాటున టెస్టు మ్యాచ్ అనుకోలేదు కదా రాహుల్.. ఓపెనర్ వద్దు.. ఐదో స్థానమే నీకు ముద్దు.. అంటూ కామెంట్ చేశారు. -
అనసూయ షాకింగ్ ట్వీట్.. అయినా ఆగని ట్రోల్స్
యాంకర్, నటి అనసూయ ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టిన అది చర్చనీయాంశమవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు ప్రశంసించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. అందుకే అనసూయ పెట్టే ప్రతి పోస్ట్ వార్తల్లో నిలుస్తుంది. ఇక నెట్టింట అనసూయ చేసే సందడి గురించి తెలిసిందే. ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ‘పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ?’ అంటూ అనసూయ పోస్ట్స్పై నెటిజన్లు ట్రోల్స్కు దిగుతారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్పై నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం! దీంతో వారి కామెంట్స్కి ఆమె స్పందిస్తూ గట్టి కౌంటరిస్తుంది. ఆయనప్పటికీ ట్రోలర్స్ మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన దానిపై అభ్యంతకరంగా కామెంట్స్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో అనసూయ షేర్ చేసిన తాజా పోస్ట్ చూసి ట్రోలర్స్ కంగుతిన్నారు. తనని ట్రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా అనసూయ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాదఁఖ పోలీసులు సామాజీక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన న్యూస్ను అనసూయ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. చదవండి: శ్రీరామ నవమి సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం ఇక దీనిపై కూడా ట్రోలర్స్ తమదైన శైలిలో స్పందిస్తూ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి ఆంటీ అంటూ అభ్యంతకర కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్గా మారింది. కాగా మహిళలపై వేధింపులు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ట్రోలర్స్ ఆటలు కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్లో ట్రోలింగ్ చేసినా, ఫొటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి కేసులు ఏం వచ్చిన వదలకుండ వాటిపై క్రైం పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. 🫡 pic.twitter.com/aJhE0yKYM0 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023 -
ఆమిర్ను ట్రోల్ చేసిన టీమిండియా క్రికెటర్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ను ట్రోల్ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన త్రీ ఇడియట్స్(3 Idiots) సినిమా గుర్తుందిగా. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్షణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇండియన్ బ్లాక్బాస్టర్గా నిలిచిన 'త్రీ ఇడియట్స్' సినిమా అప్పట్లో ఒక సంచలనం. 2016లో ఆమిర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్ ఉంటుందని.. రాజ్కుమార్ హిరానీ నాకు చిన్న హింట్ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్కు సీక్వెల్ ఉంటుందని చెప్పడానికే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్ ఆడబోతున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్ చేశారు. తాము క్రికెట్లోకి ఎంటర్ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్(అడ్వర్టైజ్మెంట్)లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటూ ఆమిర్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్కు సంబంధించి ఒక ప్రమోషన్ వీడియోను షూట్ చేశాడు. డ్రీమ్ ఎలెవెన్, ఐపీఎల్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. మేం యాక్టింగ్లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం అని ఆమిర్, మాధవన్, శర్మన్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోనూ చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు''.. ''ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్మ్యాన్లు అయిపోలేరు'' అంటూ ట్రోల్ చేశాడు. ''మాటలు చెప్పడం ఈజీ.. ఆడడం కష్టం.. ఎప్పుడు తెలుసుకుంటావు ఆమిర్ జీ'' అంటూ అశ్విన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ''ఒక్క బౌన్సర్తో మీ ముగ్గురు గ్రౌండ్లోనే కుప్పకూలడం ఖాయం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. #3Idiots ka Press Conference... Cricket Pe?!?! This #Cricket season, #SabKhelenge! . . .#Dream11 @ImRo45 @hardikpandya7 @ashwinravi99 @TheSharmanJoshi pic.twitter.com/r0NSoz8IOj — Dream11 (@Dream11) March 25, 2023 చదవండి: ఒక్కడికి సీరియస్నెస్ లేదు; థర్డ్ అంపైర్కు మెంటల్ ఎక్కించారు -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
అయ్యో పాపం.. చాలా కష్టపడ్డారు.. స్టార్ హీరోపై కంగనా కామెంట్స్
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే కొందరు తనపై గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ భామ. హీరో అమిర్ ఖాన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పేరును కనీసం ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్టపడలేదని విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో కంగనాను అమిర్ ఖాన్ ప్రశంసించారు. అయినప్పటికీ ఇవేమీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బయోపిక్ తీస్తే ఆ పాత్ర ఎవరు బాగా పోషిస్తారని అమీర్ను శోభా డే అడిగారు. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, అలియా భట్ల పేర్లను అమిర్ ఖాన్ చెప్పారు. అయితే శోభా మాత్రం కంగనా రనౌత్ పేరును గుర్తు చేసింది. ఆ తర్వాత అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. కంగనా ట్వీట్ చేశారు. కంగన తన ట్వీట్లో రాస్తూ.. 'అయ్యో పాపం ఆమిర్.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. కాకపోతే అది వీలు కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇదే నిదర్శనం' అంటూ పోస్ట్ చేశారు. అయితే కంగనా ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్ మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మీ గొప్పల కోసం ఇతరులను కించపరచడం సరైన పద్ధతి కాదు అని కామెంట్లు పెడుతున్నారు. Bechara Aamir Khan … ha ha he tried his best to pretend like he doesn’t know that I am the only three times national award winning actress none of those he mentioned has even one … Thank you @DeShobhaa ji I would love to play you ♥️ https://t.co/o0tS6UYLoC — Kangana Ranaut (@KanganaTeam) February 10, 2023 -
'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్పై శ్రుతి కౌంటర్
అగ్ర కథానాయకుడు కమలహాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి వ్యతిరేకంగా శృతిహాసన్ నట జీవితం సాగుతోందని చెప్పక తప్పదు. కోలీవుడ్లో విజయ్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించినా ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. విశాల్ సరసన నటించిన పూజ చిత్రం కమర్షియల్గా విజయాన్ని సాధించింది. శృతిహాసన్ తమిళంలో చివరిగా నటించిన చిత్రం లాభం. అది నిరాశ పరిచింది. ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు. ఇక తెలుగులో మహేష్ బాబు, రవితేజా వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా మరొకటి బాలకృష్ణకు జంటగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం. మూడోది ప్రభాస్తో సలార్ చిత్రం. విశేషం ఏమిటంటే చిరంజీవి, బాలకృష్ణతో నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ దాదాపు తన తండ్రి వయసు కలిగిన సీనియర్ నటుల సరసన నటించడంపైనే నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. శృతిహాసన్ తనకంటే రెట్టింపు వయసు ఉన్న సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా, డబ్బు కోసమా? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వీటికి శృతిహాసన్ స్ట్రాంగ్గానే బదులిచ్చారు. ఆమె తన ట్విట్టర్లో ట్రోలింగ్లపై స్పందిస్తూ సినిమా రంగంలో వయసు అన్నది నంబర్ మాత్రమేనన్నారు. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చన్నారు. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని పేర్కొన్నారు. -
Zomato: కస్టమర్లకు జొమాటో రిక్వెస్ట్
వైరల్: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్లలో.. ఆర్డర్ చేసేటప్పుడు కొందరు తమ టేస్టులకు తగ్గట్లుగా రెస్టారెంట్లకు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎక్స్ట్రా స్పైసీగా ఉండాలనో, ఉప్పు తక్కువగా ఉండాలనో లేదంటే ఇంకేదైనా సూచనను తమ అవసరాలకు అనుగుణంగా జత చేస్తుంటారు. అందుకే కస్టమర్లకు తగ్గట్లే.. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో కాలమ్స్ను పెడుతుంటాయి ఆయా యాప్లు. అయితే.. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో సర్వసాధారణంగా మారిపోయిన ఓ కుకింగ్ సూచనను దయచేసి చేయొద్దంటూ ట్వీట్ చేసింది. అదే.. ‘‘భయ్యా.. ఫుడ్ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’’ అని. దయచేసి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఈ సందేశాన్ని జత చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది జొమాటో. అయితే జొమాటో రిక్వెస్ట్గా చేసిన ఈ ట్వీట్కు నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ సూచన కాలమ్ ఎందుకని, ఏం రాయాలనే కస్టమర్లకు స్వేచ్ఛ ఉండదా?అని జొమాటోని ఏకిపడేస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కంపెనీలు సేవలు అందించాలే తప్ప.. వాళ్లకు అడ్డు చెప్పడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. guys please stop writing “bhaiya accha banana” as cooking instructions 🤦♂️ — zomato (@zomato) December 22, 2022 -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్లో కనిపించింది. అక్షయ్కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
'యార్..నెంబర్ వన్ బౌలింగ్'.. పాక్ జట్టును ఆడేసుకున్నారు
పాక్, ఇంగ్లండ్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్.. ఆఫ్సైడ్ వేస్తే కొట్టారు.. ఆన్సైడ్ వేస్తే కొట్టారు.. ఫుల్టాస్ వేస్తే కొట్టారు.. ఇలా బంతి ఎక్కడ వేసినా కొడుతూనే ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసింది కాబట్టి కొట్టుడుకు విరామం వచ్చింది లేదంటే ఇంగ్లండ్ ఒక్కరోజులోనే వెయ్యి పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత నాసిరకంగా తయారైంది పాక్ బౌలింగ్. పాపం ఈ విషయంలో పాక్ బౌలర్లను కూడా తప్పుబట్టలేం. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్కు చుక్కలు చూపించాలనుకున్నారు పాక్ ఆటగాళ్లు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. పాక్ బౌలర్లు చెడుగుడు ఆడతారనుకుంటే ఇంగ్లండ్ బ్యాటర్లే వారిని చీల్చి చెండాడారు. ఎందుకంటే అసలు పిచ్పై జీవం ఉందా లేదా అన్న సంశయం మ్యాచ్ మొదలైన కాసేపటికే అర్థమయిపోయింది. ఎంత నాసిరకం పిచ్ అయినా బౌలర్లకు కొంతమేరైనా సహకారం అందిస్తాయి. కానీ ఇంగ్లండ్తో టెస్టులో మాత్రం అలా జరగలేదు. పాక్ బౌలర్లు వరుసబెట్టి బౌలింగ్కు వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చామా అన్నట్లుగా బాధపడినట్లు వారి మొహాలు చూస్తే తెలిసిపోతుంది. బాబర్ ఆజం బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఎక్కడ బంతి వేసినా కొట్టుడే పనిగా పెట్టుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ల దెబ్బకు తలలు పట్టుకున్నారు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఆడిన ఏ జట్టు కూడా 165 రన్స్ కొట్టలేదు. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ వసీం, షాదాబ్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేశారు. కానీ సొంతగడ్డపై పాక్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి బేజారయ్యారు. ఆరుగురు బౌలర్లు వికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. నసీమ్ షా, మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్మద్, అగా సల్మాన్, సౌద్ షకీల్లు వికెట్ల కోసం కాకుండా పరుగులు సమర్పించుకోవడంలో పోటీ పడ్డట్లుగా అనిపించింది. వీరిలో ఏ ఒక్క బౌలర్ ఎకానమీ కూడా 5 కంటే తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒకర్ని మించి ఒకరు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లు అలసిపోయి వికెట్లు ఇచ్చారు తప్ప పాక్ బౌలర్లు పెద్దగా కష్టపడింది లేదు. పాక్ చెత్త బౌలింగ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. యార్ నెంబర్ వన్ బౌలింగ్.. ఇది కదా బౌలింగ్ అంటే.. ఇదేం బౌలింగ్ రా నాయనా.. వెల్డన్ పాక్ బౌలర్స్.. ఒక్కరోజులో 500 పరుగులు కొట్టించుకున్నారు.. మీకు మాత్రమే సాధ్యమైంది అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఫన్నీ మీమ్స్తో పాక్ జట్టను ఆడేసుకున్నారు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 101 అజేయ శతకంతో ఆడుతుండా.. బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓలీ పోప్, జాక్ క్రాలీ, బెన్ డకెట్లు శతకాలతో రెచ్చిపోయారు. ఒక టెస్టు మ్యాచ్లో నలుగురు శతకాలు బాదడం ఇదే తొలిసారి కాగా.. తొలిరోజే 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. పాక్ బౌలర్లలో జహీద్ మహ్మద్ కు రెండు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్, మహ్మద్ అలీలకు చెరొక వికెట్ దక్కింది. No one trolls Pakistan cricket fans more than the Pakistani players themselves 🤣😂#PAKvENG || #WTC23 #Rawalpindi #PakistanCricket #EngvsPak #PakvsEng2022 #TestCricket #AUSvWI pic.twitter.com/mCrx7AYok5 — Avinash (@Aviinashx) December 1, 2022 T20 in white kits & red ball 😱#PAKvENG | #ENGvsPAK pic.twitter.com/mj4d8Gj4bO — Q A S I M (@Its_Qasimm) December 1, 2022 11 overs 75!!! Test T20 or ODI!!!#PAKvENG — Gulraiz Gulzar (@GulraizGulzar2) December 1, 2022 No DRS, No speed gun, flat pitches .. Historic series👏 #PAKvENG — Hafsa⚡ (@QudratKaNazam) December 1, 2022 Someone please tell English batters that T20WC is over now😂 ENG 75-0 in 11 overs #PAKvENG — Kashif Suleman (@KashifSuleman_) December 1, 2022 Cheating to Pakistani Cricket fans. Unko test match bolke t20 dikha rahe hai 😂😂#PAKvENG #PakvsEng2022 #PAKvsEng #EngvsPak pic.twitter.com/2b0YLNNunU — VIRAT KOHLI ARMY 🇮🇳 (@Asmylemalhotra) December 1, 2022 What a start to ODI series between England and Pakistan in Rawalpindi. 152-0 and counting at home for Pakistan. 🤣🤣#PAKvsEng #PAKvENG pic.twitter.com/WMg9anrjhE — Akshat (@AkshatOM10) December 1, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
రిషబ్ పంత్ పై నెటిజన్ల ఆగ్రహం
-
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్టాప్లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఒక్క మ్యాచ్కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష
టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఆదివారం కివీస్తో మొదలైన రెండో వన్డేలో శాంసన్ను ఎంపిక చేయలేదు. దీంతో శాంసన్ను కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితం చేశారా అంటూ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్ ప్లేయర్ అనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంసన్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడన్న మాటే కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టులో శాంసన్కు చోటు దక్కలేదు. మరి ఆ విమర్శలకు భయపడ్డారేమో తెలియదు కానీ ఉన్నపళంగా కివీస్తో జరిగిన తొలి వన్డేకు సంజూకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికి మరి తీసిపారేసేంత చెత్తగా మత్రం ఆడలేదు. దారుణంగా విఫలమవుతున్న పంత్తో పోలిస్తే సంజూ శాంసన్ చాలా బెటర్గా కనిపించాడు. పంత్ 15 పరుగులు చేసి ఔటవ్వగా.. సంజూ శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సుందర్(37 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్తోనే ఆ మ్యాచ్లో టీమిండియా 300 పరుగులు మార్క్ను దాటింది. అయితే పేలవమైన బౌలింగ్ కారణంగా టీమిండియా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇదిలా ఉంటే రెండో వన్డేలో సంజూ శాంసన్పై మరోసారి వేటు పడింది . తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా.. సంజూ శాంసన్ను మాత్రం పక్కనబెట్టేసింది. సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడంపై ధావన్ సహా జట్టు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్తో రెచ్చిపోయారు అభిమానులు. ''సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు.. శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!''.. ''సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే'' అంటూ ధ్వజమెత్తారు. ''సంజూ ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవ్వడం ఖాయం''..''ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని'' కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. Cricket craze gonna end here. Thanks to BCCI. from viru, yuvi to msd to sanju samson. Sanju is a victim of favourism running in bcci. Until it is stopped, I won't be watching any matches of team india. Replacing inform batsman is ridiculous. No more tweets🤐🤐🤐 #SanjuSamson pic.twitter.com/cCfxMz8uMX — ADARSH J S (@never_give_u_p_) November 27, 2022 Doesn't make any sense. SKY has a poor ODI record, Pant hasn't performed in white ball cricket, Samson played a good knock in last match. But you*****ing drop samson! Wow BCCI. #justiceforsamson #SanjuSamson https://t.co/jER4ZulT8o — Karthikeyan (@IamKarthi1818) November 27, 2022 Once Again #justiceforsanjusamson Sanju fans please Show your Power.#SanjuSamson #ShameOnYou #BCCI 😑 pic.twitter.com/BdV4s3LaRK — Sachin Gandhi (@SachinG25184819) November 27, 2022 చదవండి: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి! -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్కు నోటీసులు జారీ చేసింది. -
ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. ఒకవేళ పుంజుకుంటే!
టి20 ప్రపంచకప్ 2022 ఆరంభమైన తొలిరోజునే సంచలనం నమోదైంది. శ్రీలంక క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడుతున్నప్పటికి ఫేవరెట్గానే బరిలోకి దిగింది. అలాంటి లంక జట్టుకు పసికూన నమీబియా షాక్ ఇచ్చింది. ఫేలవ బ్యాటింగ్తో నిరాశపరిచిన లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది. దీంతో లంక జట్టును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆసియా ఛాంపియన్లుగా అవతరించిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే చెత్త ఆట తీరుతో మళ్లీ మొదటికే వచ్చిందంటూ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ లో లంకేయులు చేసిన 'నాగిని'డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. 'ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు' అంటూ వాటికి కామెంట్స్ పెట్టారు. మరికొందరు లంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫోటోను పెట్టి.. 'ఇవాళ రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటది మీరు రండ్రా..'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మీమ్స్ చేశారు. 'ఆసియా చాంపియన్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడారు. ఆ జట్టు తర్వాత నెదర్లాండ్స్, యూఏఈతో మ్యాచ్ లు ఆడాలి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా ఇక అంతే సంగతులు' అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ లంక జట్టును ట్రోల్ చేయడంపై క్రీడా పండితులు తప్పుబట్టారు. ''ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రానా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మ్యాచ్ ఓటమి పాలైనప్పటికి తర్వాతి మ్యాచ్ల్లో ఫుంజుకుంటే మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా.. ఎప్పుడు ఒక జట్టును తక్కువ అంచనా వేయకూడదు.. రెండు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోతే అప్పుడు ట్రోల్ చేసినా ఒక అర్థముంటుంది. అంతేకానీ కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు ఇలా అవమానించడం తగదు'' అంటూ పేర్కొన్నారు. నమీబియా చేతిలో లంక ఓడిపోయాక సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ.. ''ఈరోజు క్రికెట్ ప్రపంచానికి నమీబియా తన పేరును ఘనంగా చాటింది'' అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉండగా అనామక జట్టుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న టీమ్ ను ఓడించిన సందర్భాలలో నమీబియా కూడా చేరింది. ఇదివరకు ఈ జాబితాలో జింబాబ్వే (2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది), నెదర్లాండ్స్ (2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై గెలిచింది), హాంకాంగ్ (2014 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై), అఫ్గానిస్తాన్ (2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పై) ఉన్నాయి. తాజాగా నమీబియా కూడా లంకను ఓడించి ఆ జాబితాలో చేరింది. -
‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!
‘జనం కమెడియన్లను సీరియస్గా, పొలిటీషియన్లను కామెడీగా తీసుకుంటున్నారని’... ఓ అమెరికా పెద్దమనిషి చెప్పి దాదాపు వందేళ్ల య్యింది. ఇంకా అదే ట్రెండ్ కొసాగుతున్న ట్టుంది.. ఇది చూడండి.. ముందస్తు అరెస్ట్లు, హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందోబస్తు.. 100 మంది అదుపులోకి.. 3 గంటలపాటు ఉద్రిక్తత.. 1,500 మంది పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... కామెడీ షో ప్రశాంతంగా పూర్తయింది.. – ఇదీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన మునావర్ స్టాండప్ కామెడీ షో తీరు. 5వ తారీఖున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన గురించి ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ట్రంప్, పుతిన్, కిమ్లాంటి వాళ్లు కేసీఆర్ బ్యాచ్తో టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ‘ప్రపంచ రాష్ట్ర సమితి’ (పీఆర్ఎస్) పార్టీ పెడితే మన పరిస్థితి ఏమిటీ అని పలువురు దేశాధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.. పీఆర్ఎస్లో ఉండడమా, స్వతంత్రంగా ఉండడమా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. – ఇదీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్. ఇట్లా.. కామెడీ సీరియస్గా.. పాలిటిక్స్ కామెడీగా! ‘మన వాళ్లు వట్టి వెధవాయిలు..’ ఇందిరమ్మ సృష్టించిన ఎమర్జెన్సీ చీకట్లలో ఉదయించిన ‘జనతా’లాగా.. పంచమ స్వరాన్ని దళిత శంఖారావంలా దేశ వ్యాప్తం చేయ ప్రయత్నించిన కాన్షీరాం బీఎస్పీ లాగా... చాలా కాలం తర్వాత అలా దేశవ్యాప్త సంచలనం.. మోదీ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి విజయ దశమి నాడు గాండీవం ఎత్తిన కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మన తెలుగు ఎన్టీయార్ కల ‘భారతదేశం’ పార్టీ భావనను ఆయన వీరాభిమాని కేసీఆర్ దేశవ్యాప్తం చేసే అద్భుత సన్నివేశం.. దీన్ని కొంతమంది.. అదీ తెలుగు వాళ్లు.. మరీ తెలంగాణ తల్లి బిడ్దలు.. ఇలా ట్రోల్ చేయడం ఆశ్చర్యమే మరి! జాతీయ పార్టీలు చిన్న మునుగోడు పైనే పడుతుంటే.. జాతీయవాదాన్ని ఎత్తుకున్న తెలు గోడిని మరో తెలుగోడు ప్రశంసించడం మాని.. పరిహసించడమా! ‘ముందుకు పోతానంటే ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో మందురు..’ అని శ్రీశ్రీ.. ‘మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్..’.. అని గురజాడ గిరీశం ఊరికే అన్నారా పునర్భూదోషం... జ్యోతిష్యులు కూడా దీన్ని వదలక పోవడం మరింత చిత్రం.. తెలుగు నేలపై ఆధ్యాత్మిక వైభవానికి కేసీఆర్ ఎంత చేస్తున్నారో మనకు తెలుసుగా.. శుభం పలకవచ్చుగా! ధనుర్లగ్నంలోనే పార్టీ ప్రకటన జరిగిందట... ఇది అచ్చంగా రాజులు మరో సామ్రాజ్యంపై దాడిచేసేటప్పుడు పెట్టే ముహూర్తం... యుద్ధానికి ప్రతీక, విజయానికి సూచిక.. తిరుగులేదు అంటూనే.. కాస్త లో–వాయిస్లో కొర్రీలు చూపుతున్నారు. దుర్ముహూర్త స్పర్శా దోషం ఉంది., పునర్భూదోషం ఉంది. పలుమార్లు శ్రమించాల్సిందే, నల్లేరుపై నడక కాదు కష్టపడాల్సిందే.. అంటున్నారు. ఠాఠ్.. అదేమీ లేదు వ్యక్తిగత జాతకం అద్భుతం అని కాస్త హై–వాయిస్లో దబాయిస్తున్న ప్రో– జ్యోస్యులూ ఉన్నారనుకోండి! ఇదో ‘స్టార్టప్’ తరహా... ఇక సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేసిన విశ్లేషకుల ముచ్చట్లు రకరకాలు..మచ్చుకు ఒకటి.. – మన దగ్గర ఒక్క పార్లమెంట్ ఎన్నికకయ్యే ఖర్చులో బయటి రాష్ట్రాల్లో నాలుగైదు పార్లమెంట్ నియోజక వర్గాలు లాగించవచ్చు. బాగా వనరు లున్న పార్టీ కనుక చిన్నా చితకా పార్టీలను ఆకర్షించవచ్చు. వారికి ఆర్థిక సాయం చేయవచ్చు. ఇదో స్టార్టప్ తరహా వ్యవహారం.. ఇది స్టార్టప్ల కాలంకదా.. చూద్దాం ఇది సక్సెస్ అవుతుందో లేదో.. అని విశ్లేషణ బాల ‘పిట్టకథ’ ఇంకాస్త కరడు గట్టిన తెలంగాణ వాదులు ఓ పిట్టకథ చెబుతున్నారు. ఓ పిల్లాడిని తల్లి పిలిచి సీసా మూత తియ్యరా అంది పలుమార్లు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అన్న దాన్ని తీసుకుని ఓ రెండు మార్లు ప్రయత్నించి మూత తీసి హీరోలా తమ్ముడి వైపు చూసి వెళ్లాడు. తమ్ముడు తల్లిని అడిగాడు అన్న ఎలా తీయగలిగాడు అని.. నువ్వు చాలా చాలా సార్లు ప్రయత్నించినప్పుడే అది లూజయింది. మరోమారు నువ్వు ప్రయత్నించినా వచ్చేది అని నవ్విందట! కేసీఆర్దీ ఇదే తంతు. ఎన్నో దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం కీలక దశలో జొరబడి పేరు కొట్టేశాడు అంటూ వెటకారం చేస్తూ... ప్రతిసారీ అన్ని సీసాల మూత తియ్యడం సాధ్యం కాదు... అని నర్మగర్భంగా, కాస్త వ్యంగ్యంగా.. పక్కోడి ప్రయత్నాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాలు లేకుండా అస్సలు సాధ్యంకాదని సీరియస్గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. నామ్కే వాస్తే.. ఈ సీసాల గొడవ ఇలా ఉండగా.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు పేరు మార్పుపై. ‘..సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరి సిరి మువ్వా..’ శ్రీశ్రీ పాటేసుకుంటున్నారు.. గొర్రెలెలా? కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఇలా డౌటేస్తున్నారు... ఫర్ సపోజ్...మన బీఆర్ఎస్ ఢిల్లీ పీఠం ఎక్కిందనుకుందాం... రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటాం. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కార్పొరేట్లకు రుణ మాఫీ రద్దు చేసి..దానికి బదులు దేశమంతటా దళిత బంధు, రైతు బంధు ఇచ్చుకుందాం. రాష్ట్రానికో కాళేశ్వరం కట్టుకుందాం.. ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం.. ..కానీ, మన గొర్రెల పథకం ఉందిగా.. దేశమంతా గొర్రెలెలా పంచడం? ఇక్కడ మనకు సరిపోకే పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నామాయే! (క్లిక్ చేయండి: రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!) -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో'
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు,. ఈ మెగా ఈవెంట్ అఖరి సూపర్-4 మ్యాచ్లోనూ బాబర్ అదే ఆట తీరును కొనసాగించాడు. ఈ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న ఆజాం 30 పరుగుల చేసి పెవిలియన్కు చేరాడు. ఆది నుంచే లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ బాబర్.. అఖరికి హాసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన బాబర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్లో భారత్పై కేవలం 10 పరుగులు చేసి ఔటైన ఆజం..తర్వాతి మ్యాచ్లో పసికూన హాంగ్కాంగ్పై కూడా 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత్తో జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఏకంగా డకౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆజం తన టీ20 నెం1 ర్యాంక్ను కోల్పోయాడు. Babar azam aj apni taraf se Virat kohli ban'na chah raha tha lkn usy aj Rohit sharma ki trha rest krni chahye thi. #PAKvsSL — Huzaifa (@huzaifadotcom) September 9, 2022 ఈ క్రమంలో దారుణంగా విఫలమవుతున్న ఆజాంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పసికూనలపైనే బాబర్ సెంచరీలు సాధిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో' అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. NO TOSS NO PARTY.😂#teampakistan #BabarAzam #AsiaCup2022 #AsiaCup2022Final #SLvPAK — Shraddha 💖 (@Shraddha__queen) September 9, 2022 చదవండి: Asia Cup 2022: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి మహాలక్ష్మీ పెళ్లి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలుస్తోంది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో సెప్టెంబర్ 1న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం ఒక్కటయ్యామంటూ ఇద్దరు పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు వీరిద్దరి వివాహం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! దీనికి కారణం నిర్మాత రవీందర్ భారీ కాయం.. మహాలక్ష్మీ సన్నగా ఉండటమే. అప్పటి నుంచి ఈ జంటను ట్రోల్ చేయడం, రవిందర్పై బాడీ షేమింగ్ చేయడం చేస్తున్నారు నెటిజన్లు. ‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది.. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె పెళ్లి చేసుకుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై స్పందించింది ఈ జంట. ఆయన బరువు తనకు పెద్ద సమస్య కాదని చెప్పి ట్రోలర్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నటి మహాలక్ష్మి. ‘నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పాను. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్డిస్క్లు బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఫారెన్ వెళ్లి ట్రాన్స్ఫాం అవుతా అన్నారు. కానీ అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్టే ఉండండి అని చెప్పాను’ అని మహాలక్ష్మి అన్నారు. ఆ తర్వాత తమ జంటపై కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్ నేల్స్ చూసి ఇద్దరం నవ్వుకున్నామని చెప్పారు. ఇక నిర్మాత రవిందర్ మాట్లాడుతూ.. నెగిటివ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోమన్నారు. ‘మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా మంది మాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మరికొందరు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నాపై బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎదుటివారి లైఫ్ అనేసరికి అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను’ అని ఆయన చెప్పుకొచ్చారు. -
రోహిత్ తప్పు చేశాడా!.. పంత్ను పక్కనబెట్టడంపై విమర్శలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు రిషబ్ పంత్ను పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆసియా కప్ 2022లో భారత్కి ఇదే ఫస్ట్ మ్యాచ్కాగా.. పవర్ హిట్టర్గా పేరొందిన రిషబ్ పంత్ని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ని తుది జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. కాగా రోహిత్ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు కురిపించారు. అయితే జట్టులో ఒకటి నుంచి ఏడో స్థానం వరకు జడేజా మినహా ఒక్క లెఫ్ట్ హ్యాండర్ లేడు. జట్టు సమతుల్యంగా ఉండాలంటే లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న లాజిక్ రోహిత్ ఎలా మరిచిపోయాడని అభిమానులు పేర్కొన్నారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్కప్ తర్వాత దినేశ్ కార్తీక్ కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా మ్యాచ్లను చక్కగా ఫినిష్ చేస్తూ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా షాట్స్ ఆడేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరీ ముఖ్యంగా.. జట్టు గెలుపు ముంగిట నిలిచిన దశలోనూ అతను తన ఆటతీరుని మార్చుకోవడం లేదు. దాంతో.. అతను తన వికెట్కి విలువ ఇవ్వడం లేదనే అపవాదు ఉంది. పాకిస్థాన్తో ఒకవేళ చివరి నాలుగు ఓవర్లలో క్రీజులో నిలిచిన మ్యాచ్ని ఫినిష్ చేయాల్సి వస్తే? రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్ను ఆడించడమే మంచిదని టీమిండియా భావించి ఉంటుంది. Leaving out Rishabh Pant is a huge call and a sign towards the favoured line-up at the T20 World Cup. It is also an acknowledgement of how India want to play with DK as a power finisher. Don't be surprised to see Jadeja at no 5 today, though. — Harsha Bhogle (@bhogleharsha) August 28, 2022 #AsiaCup2022. I can't belief @RishabhPant17 was replaced by @DineshKarthik. Unfathomable. Who thinks DK is better wicket keeper Batsman than Pant? He can single handedly win manchestar for God's sake. — Chetan Thaker (@ChikooThaker) August 28, 2022 చదవండి: IND Vs PAK Fakhar Zaman: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం.. -
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్ అదే తరహా ఫన్నీ ట్వీట్తో మెరిశాడు. కాగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్ నుంచి సెంట్కిట్స్కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నిలోలస్ పూరన్ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..'' ముందస్తు ప్లాన్ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ''మ్యాచ్ గెలవడానికి.. లగేజీ లేట్ కావడానికి మీరే పక్కా ప్లాన్ చేయలేదు కదా అని రోహిత్ పూరన్ ప్రశ్నించడం జాఫర్ చేసిన క్యాప్షన్కు అర్థం. జాఫర్ ట్వీట్ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్ ఫన్నీ ట్వీట్ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్కు ఎంత కష్టం! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్గా -
నయన్ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తొలి సౌత్ లేడీ సూపర్స్టార్గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆమెకు దక్షిణాన విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. అలాంటి నయన్పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో సదరు నిర్మాతపై నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో రీసెంట్గా సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఈ సందర్భంగా సామ్ను ప్రస్తుతం సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. 'సౌత్లో బిగ్గెస్ట్ హీరోయిన్ అయిన నయనతారతో ఇటీవల నేను ఓ సినిమాను చేశాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పరోక్షంగా నయనతార పేరు చెప్పంది సమంత. అయితే దీనికి కరణ్ ‘కానీ.. తను నా జాబితాలో లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కరణ్ కామెంట్స్పై నయన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయన్ను గుర్తించలేదనడం ఇది ఆమెను కించపరిచనట్లే అంటున్నారు. @Samanthaprabhu2 Is such a Sweetheart & Sharing her Lovable bond with #Nayanthara ❤️ @karanjohar She is not far in your list coz Your list is full of Nepo-Products which doesn’t deserve any arguements and discussions. #KoffeeWithKaran #LadySuperStar pic.twitter.com/TDUXGT871Z — A. (@ursavian) July 21, 2022 అంతేకాదు స్టుపిడ్ కాఫీ విత్ కరణ్ షోలో నయనతారు అవమానించే అర్హత ఆయనకు లేదు. తను సాధించిన విజయంలో కనీసం సగం కూడా నువ్వు సాధించేలేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండ తన సొంతగా స్టార్గా ఎదిగారు. మీలా నెపోటిజంతో ఎదగలేదు’, ‘ఇంతకి ఈ కరణ్ జోహార్ ఎవరూ?’ అంటూ కరణ్ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ధర్మ ప్రొడక్ష్న్, కరణ్ జోహార్ను అసలు బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వేదికగా కరణ్పై నయన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్గా మారింది. Karan Johar doesnt have any right to shame #Nayanthara on his stupid Koffee show. You cannot even achieve half of what she has achieved. She is self made not like you Nepo bitch.#Samantha we love you for giving it right back to that Nepo crap and for being so lovely — VISHNU (@VishnuTweets2U) July 22, 2022 #KaranJohar 🤡 list doesn’t determine the number one actress. #nayanthara is lady super star and will always be the queen of South Indian cinema. Her movie and acting proves that. She doesn’t need to be in anyone’s list for that😏 — Funny Humans (@FunnyHumans1) July 21, 2022 Sorry, but karan johar who? #Nayanthara pic.twitter.com/T0NkBXrM8g — 𝐏 𝐫 𝐢 𝐲 𝐚 (@xxgoldenroses) July 21, 2022 🐍 @karanjohar is bullying outsiders to promote his nepo betis. But Thalaivi is sending love and motivating the very same nepo stars ❤️ That's queen for you 🥺 Don't even think about belittling this amazing human ~ #Ladysuperstar #Nayanthara ~#KoffeeWithKaran pic.twitter.com/eHLs5Rgt1b — Theladysuperstarclub (@Nayantharian) July 24, 2022 The way Kjo disrespected #Nayanthara breaks my heart💔 I mean how can someone be this cocky and disrespectful towards such an actor... Never liked him..but now, he's seriously a waste material and nothing else. — Parth (@ParthK_23) July 22, 2022 -
బన్నీ షాకింగ్ లుక్ వైరల్, ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు
Trolls On Allu Arjun New Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సౌత్లో విపరితమైన క్రేజ్ ఉంది. ఆయన స్టైల్కు, మ్యానరిజంకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా పుష్ప మూవీతో నార్త్లో సైతం మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు బన్నీ. ఈ సినిమాలో పుష్పరాజ్గా అతడు సంపాదించుకున్న క్రేజ్అంతా ఇంత కాదు. చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్ రియాక్షన్ చూశారా! తగ్గేదే లే అనే డైలాగ్తో అల్లు అర్జున్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అందుకే పుష్ప డైలాగ్స్ను కేవలం దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఫాలోయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపించింది. ఇక శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ను ప్రతి ఒక్కరు అనుసరించారు. అంతలా పుష్ప మూవీలో తన లుక్, ఆటిట్యూడ్తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్పై నార్త్ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్తో పాటు భారత్లోని పలు లోకేషన్లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ను జరుపుకుంటుంది. ఇటీవల హైదరాబాద్ ఈ మూవీ షూటింగ్ను జరుపుకోగా ఇందుకు సంబంధించిన బన్నీ లుక్ లీకైంది. మానవ్ మంగ్లాని అనే బాలీవుడ్ ఫొట్రోగాఫర్ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో బన్నీ కాస్తా బొద్దుగా.. గుండ్రాలు తిరిగిన హేర్ స్టైల్తో దర్శనం ఇచ్చాడు. ఇక లావుగా తయారైన బన్నీ లుక్పై నార్త్ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ వడా పావ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్ మలింగా లా ఉన్నాడు’, ‘ఓ మై గాడ్ స్టైలిష్ స్టార్కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అల్లు అర్జున్? బాబోయ్ చాలా బరువెక్కాడు’’ అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ ఇక మరికొందరు నెటిజన్లు బన్నీ వస్తున్న ట్రోల్స్ను ఖండిస్తూ ‘పుష్ప: ది రూల్ కోసం ఆయన కాస్తా లావుగా తయారవ్వాల్సి ఉంది. అందుకే ఆయన బరువెక్కారు’ అంటూ వివరణ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప 2లో బన్నీ కాస్తా బోద్దుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర(రష్మిక మందన్నా) చనిపోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్లోపై నిర్మాత వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఓ చానల్తో ముచ్చటించిన ఆయన శ్రీవల్లి పాత్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు పూర్తి కథ తామే వినలేదని, ఇవన్ని వట్టి పుకార్లలేనిన కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్కు ఖరీదైన కారు గిఫ్ట్గా.. ఒక్కదానికే!