troll
-
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్ప్రెన్యూర్షిప్పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్
ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు, బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజమాయిషీ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మీమర్స్ తమ జోకులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు.శుక్రవారం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య భేటీ తొలుత మర్యాదపూర్వకంగా, తుదకు అమర్యాదపూర్వకంగా, పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధంతరంగా ముగిసిన విషయం తెల్సిందే. అమెరికాసహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాసా వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వెల్లువెత్తుతున్నాయి. తారాస్థాయిలో వాగ్వాదం ఓవల్ ఆఫీస్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్, జెలెన్స్కీ భేటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకుని జెలెన్స్కీపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడం, అందుకు ట్రంప్ వంతపాడటం, దీనికి దీటైన బదులిస్తూ జెలెన్స్కీ మాట్లాడం చూసిన వారెవరికైనా ట్రంప్, జెలెన్స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యంకాని వాళ్ల పిడిగుద్దులు, డిష్యుండిష్యుం ఫైట్ సీన్ను కృత్రిమ మేథ సాధ్యం చేసింది. ఒరిజినల్ వీడియోతో ట్రంప్, జెలెన్స్కీ ఫైట్సీన్ను ఏఐలో సృష్టించి ఆన్లైన్లో షేర్చేశారు. ఆ వీడియో ఎడిటింగ్ మొదటి మూడు, నాలుగు సెకన్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడీ వీడియో అన్ని సోషల్మీడియా యాప్స్లో వైరల్గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు.Who made this video? 😂AI 😂 pic.twitter.com/r9UuE3Qr1g— War Intel (@warintel4u) March 1, 2025వాస్తవంలో ట్రంప్, జేడీ వాన్స్తో జెలెన్స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్లిద్దరినీ జెలెన్స్కీ చేతులు పట్టుకుని మరీ బతిమాలుతూ ‘మా దేశాన్ని కాపాడండి’’అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ‘ఇప్పటికి చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో’అని ట్రంప్, వాన్స్లు జెలెన్స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్చేశారు. ఇది కూడా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అత్యంత విలువైన ఖనిజాలపై ఆధిపత్యం సంపాదించి అమెరికన్ పెత్తందార్లు వాటితో వేల కోట్లు గడించాలని భావించి, ఇప్పుడు భంగపడ్డారని తెలిపేలా ఒక వెయిటర్ ‘ఖనిజాల డీల్ రద్దయింది. సారీ. మీకు భోజనాలు లేవు’అంటూ బడా పారిశ్రామికవేత్తలకు చూపిస్తున్నట్లు పాతకాలంనాటి ‘ఫాల్టీ టవర్స్’సీరియల్ ఎపిసోడ్ను మీమ్స్లో వాడారు. భారతీయ ‘ట్రీట్మెంట్’ భారత్లో సాధారణ నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చినట్లు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. వైట్హౌజ్లో ట్రంప్, జేడీ వాన్స్ సైతం జెలెన్స్కీని దాదాపు అలాగే మీడియాకు చూపేందుకు ప్రయత్నించారని నెటిజన్లు మరో మీమ్ సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. రష్యాతో యుద్ధంలో ఇంత సాయపడిన మాకు శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో అగ్రరాజ్య అధ్యక్షునికి కనీసం గౌరవం ఇవ్వరా?. ఒక్కసారైనా మా ప్రెసిడెంట్కు థాంక్యూ అని చెప్పారా? అని జెలెన్స్కీని వాన్స్ నిలదీస్తూ హెచ్చరించడం తెల్సిందే. ఈ సందర్భంలో వాన్స్, ట్రంప్ సగటు భారతీయ తల్లిదండ్రుల్లా అద్భుతమైన పాత్ర పోషించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్లు పెట్టారు.Trump throws Zelensky out of the White House(meme collab with @drefanzor) pic.twitter.com/Mfu85ZHhAf— NautPoso memes 🇮🇪☘️ (@NautPoso) February 28, 2025 పొగుడుతూ పోస్ట్లు మరోవైపు జెలెన్స్కీని మీడియా ఎదుటే చక్రబంధంలో ఇరికించే ప్రయత్నంలో వాన్స్, ట్రంప్ దాదాపు సఫలమయ్యారని వీళ్లను పొగిడే వారి సంఖ్యా పెరిగింది. యుద్ధంలో వందల కోట్ల డాలర్లు ఇచ్చిన మాపై మీరు చూపించే మర్యాద ఇదేనా?. మీరు ఇదే ధోరణి కనబరిస్తే దౌత్యబంధం తెగిపోతుందని వాన్స్ హెచ్చరించి జెలెన్స్కీని ఒకింత సందిగ్ధంలో పడేశారని అమెరికన్ మీడియా ఆయనను పొగడ్తల్లో ముంచెత్తింది. అయితే జెలెన్స్కీని పొడిగే వారి సంఖ్యా అమాంతం పెరిగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు దేశాధినేతలు ఉన్నారు.Always with the drama…Collab with @drefanzor pic.twitter.com/OwMNImIWpU— Lauren3ve (@Lauren3veMemes) March 1, 2025 యూరప్దేశాల అధినేతలు ఆయనకు ఫోన్చేసిమరీ తమ మద్దతు పలికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మిత్రదేశానికి ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే ఆ సాయానికి అర్థమే ఉండదని, సహజ సంపదను కాజేసేందుకు కుట్ర పన్నిన అమెరికాను జెలెన్స్కీ సాక్షాత్తూ శ్వేతసౌధంలోనే కడిగిపారేశారని ఆయనను పొగుడుతూ పోస్ట్లు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దురాక్రమణకు దిగితే మాకు ఉండే రక్షణ ఏర్పాట్లు ఏమిటి?. ఆ విషయంలో మీరెలా మాకు సాయపడగలరు? అని జెలెన్స్కీ అడిగిన సూటి ప్రశ్నకు ట్రంప్, జేడీ వాన్స్ సరైన సమాధానం చెప్పలేకపోవడం తెల్సిందే. ఇద్దరు అగ్రనేతలు రెచ్చగొట్టినా జెలెన్స్కీ సంయమనం కోల్పోలేదంటూ మరో మీమ్ సందడిచేస్తోంది.Trump tossed Zelensky out 😂(w/@Fuknutz ) pic.twitter.com/1ES3d5l5zq— drefanzor memes (@drefanzor) February 28, 2025ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ఎయిర్ఫోర్స్ సినిమా సీన్లో పైఅధికారి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా టామ్ క్రూజ్ పట్టరాని ఆవేశంతో ఉన్నాసరే సంయమనం పాటించినట్లు జెలెన్స్కీ కూడా నిగ్రహంతో ఉన్నారని మీమ్ క్రియేట్ చేశారు. వైట్హౌజ్లో ముగ్గురు నేతల వాగ్వాదాన్ని ప్రత్యక్షంగా చూసి హుతాశురాలైన ఉక్రెయిన్ మహిళా రాయబారి ఒక్సానా మార్కరోవా తలపట్టుకోవడంపైనా ఒక మీమ్ బయటికొచి్చంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం) నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కీలక నేతగా జెలెన్స్కీ ఎదిగారంటూ, భేటీలో ఎడముఖం పెడముఖంగా కూర్చున్న ట్రంప్, జెలెన్స్కీ ఫొటోను మరొకరు పోస్ట్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
జగన్ అంటే ఒక ఎమోషన్.. దేవికాపై ట్రోల్స్.. ఐటీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
చిన్న పిల్లల్ని కూడా వదలని ఐటీడీపీ జీతగాళ్ళు
-
ఎవరిని వదలను.. సోషల్ మీడియా ట్రోల్ పై వంశీ భార్య వార్నింగ్
-
రోహిత్ శర్మపై నటి పోస్ట్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
బాలీవుడ్ భామ విద్యా బాలన్(vidya Balan) గతేడాది భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ హారర్-కామెడీ చిత్రంలో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నటి విద్యాబాలన్ చేసిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ నెట్టింట విమర్శలకు దారితీసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్లో ఐదో టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) నిర్ణయాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఈ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ బదులుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మకు మద్దతుగా విద్యాబాలన్ స్పందించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన పీఆర్ టీమ్ సూచనల మేరకే ఇలా రియాక్షన్ ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఫేమ్ కోసమే రోహిత్ శర్మ పేరును వాడుకుందని విద్యా బాలన్పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నటి విద్యాబాలన్ టీమ్ స్పందించింది.స్పందించిన విద్యాబాలన్ టీమ్..విద్యాబాలన్ పోస్ట్పై పీఆర్ టీమ్ స్పందించింది. తమ సూచనల మేరకు ఆమె అలా చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యా బాలన్ తన ఇష్టపూర్వకంగా అలాంటి పోస్ట్ను చేసింది. ఇందులో పీఆర్ టీమ్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. విద్యాబాలన్ మొదటి నుంచి క్రీడాభిమాని కాదు.. కానీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవారిని ఆమె మెచ్చుకుంటుందని పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. టరోహిత్ను ప్రశంసిస్తూ విద్యాబాలన్ చేసిన ట్వీట్పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అసలు ఆమె ట్విటర్లో రోహిత్ను ఫాలో కావడం లేదని.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్లో భాగమేనని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రోహిత్ను ప్రశంసిస్తూ వచ్చిన స్క్రీన్ షాట్ను విద్యాబాలన్ మొదట షేర్ చేసి వెంటనే దాన్ని తొలగించారన్నారు. ఈ పోస్ట్ కాస్తా పెద్ద చర్చకు దారితీయడంతో దీనిపై విద్యా బాలన్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇది చదవండి: సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్గా మారిన బ్యూటీ)2014లో పద్మశ్రీ అవార్డు..కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సిరీస్ కోల్పోయిన్ భారత్..ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ని ట్రోఫిని టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్ట్లో ఓటమి పాలవడంతో 3-1తో సిరీస్ను కంగారూలకు అప్పగించింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్తో ఆసీస్ తలపడనుంది. (ఇది చదవండి: అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్) Rohit Sharma, what a SUPERSTAR 🤩!! To take a pause & catch your breath requires courage … More power to you … Respect 🙌 !! @ImRo45— vidya balan (@vidya_balan) January 4, 2025 -
అల్లు అర్జున్ అరెస్ట్ పై పొలిటికల్ ఫైట్?
-
Prabhakar: ట్రోలర్స్ కి దొరికితే ఏసుకుంటారు..
-
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు. -
సమంత చిట్చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్కి చిరు గ్రేస్తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
కేటీఆర్పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె. తనపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్ విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. .. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మీద మాజీ మంత్రి హరీశ్రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
నేనూ ట్రోల్స్కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
సలార్ హిట్ దెబ్బ...పవన్ కళ్యాణ్ ని ఆడుకుంటున్న నెటిజన్లు
-
ఉర్లగడ్డ ట్రోల్స్ పై మంత్రి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
నోరు జారిన రాహుల్.. బీజేపీ సెటైర్లు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్కి సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు కురిపించింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. బీజేపీ ధనవంతులకు సేవ చేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావిస్తూ కేంద్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. అదే క్రమంలో అదానీ కోసం పనిచేయాలని భూపేష్ భగేల్కు కూడా సూచించారు. "బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా" అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్గఢ్లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అటు.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్గఢ్ సీఎం అదానీ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన
యాంకర్గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్) బిగ్ బాస్ హౌస్కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. కానీ ఆమె కొన్నిరోజులపాటు స్క్రీన్కు దూరంగా ఉండటం జరిగింది. దీంతో ఆమె కొంచెం బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో ఆమె ఫోటో షేర్ చేసినా.. వీడియో షేర్ చేసినా ట్రోలర్స్ దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే అరియానా పట్ల బాడీ షేమింగ్ కూడా చేశారు. అలాంటి వారికి ఆమె స్టైల్ల్లో సమాధానం ఇచ్చిపడేసింది. పనికి మాలిన వేస్ట్ ఫెల్లోస్ కోసం ఇది చెబుతున్నా.. నేను సన్నగా ఉంటే..? సన్నగా ఉన్నావ్ అన్నారు. సర్లే అని లావు అయితే.. ఏంటి ఇంత లావుగా ఉన్నావు. ఆంటీలా అయ్యావ్ అని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే మేం కూడా చూస్తాం కదా..? నీకు నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి..? సన్నగా ఉంటే నీకేంటి..? లావుగా ఉంటే నీకేంటి..? నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయ్.. నేను ఎలా ఉంటే నీకేంటి..? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఏదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తారు. పనీ పాట లేకపోతే ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా అని ట్రోలర్స్పై అరియానా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by starmaa__shows (@starmaa__shows) -
'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు మహిళ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచింది. అయితే బిగ్బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు.. హౌస్లోని కంటెస్టెంట్స్ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్ను చూపిస్తున్నాడు. అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్కు సపోర్ట్కు మాట్లాడుతున్న బిగ్బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ సార్థక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ను చూపించాలంటూ ఫైరయ్యాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్లో ఉన్నప్పుడే చాలా చూశానని చెప్పుకొచ్చాడు. అయితే హౌస్లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అఖిల్ మాట్లాడుతూ..' నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్గా నిలిచినా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండుసార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్లోకి వెళ్లి గేమ్ క్లియర్గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం అఖిల్ సార్థక్కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by 𝔸𝕜𝕙𝕚𝕝 𝕊𝕒𝕣𝕥𝕙𝕒𝕜 ℕ𝕒𝕚𝕕𝕦 (@akhilsarthak_official) -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్లో భాగ్పత్లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై మొదటిసారి స్పందించిన రుపాలీ
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు. ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది. (ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ) ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు. జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది. కోల్కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
చంద్రముఖి 2 ట్రైలర్ పై దారుణమైన ట్రోల్స్
-
మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్నే: మంచు విష్ణు
సినిమా రంగానికి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ పలువురు ట్రోల్స్ చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైనవి అయితే పర్వాలేదు.. కానీ ఒక్కోసారి అవి శ్రుతిమించి వారిని బాధకు గురిచేస్తాయి కూడా.. ఈ ట్రోల్స్ వల్ల సినిమా రంగంలోని చాలామంది ప్రముఖులు ఇబ్బందులకు గురైనవారే ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగ ఈ విషయంపై ఆయన స్పందించారు. (ఇదీ చదవండి: మామయ్య కోసం పొలిటికల్ వేడుకకు వెళ్తున్న అల్లు అర్జున్) తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది.. చేస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని ఆయన అన్నారు. అదొక 'స్నేక్' బ్యాచ్ చేస్తున్న పనే అని విష్ణు అన్నారు. కానీ అలాంటి ట్రోలింగ్ను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అందరికీ ట్రోల్స్ నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసినప్పుడు తాము కూడా ఎంజాయ్ చేస్తామని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) కొంతమంది పనికట్టుకుని డబ్బులిచ్చిమరీ ట్రోల్ చేయిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పని విష్ణు ఇలా తెలిపారు. 'మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయో అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’ అని ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు. కానీ ఆ స్నేక్ బ్యాచ్ ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనేది ఆయన తెలియచేయలేదు. 'కన్నప్ప'కు శ్రీకారం చుట్టిన మంచు విష్ణు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తాజాగ వెల్లడించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు.. శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. -
శివ జ్యోతిని అక్కా.. అంటూనే ఇలాంటి కామెంట్లా?
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. (ఇదీ చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) అయితే తాజాగా బోనాల పండుగ సందర్భంగా ఆమె ఓ వీడియోను యూట్యూబ్లో పోస్టు చేసింది. అందులో తన కోసం భర్త గంగూలీ కొన్న బంగారు నగలను చూపించింది. దీంతో జ్యోతి భర్త గంగూలీపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేశారు. అక్క మీ భర్త ఏం జాబ్ చేస్తారని ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు ఏ జాబ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్ చేశారు. అంతటితో ఆగని కొందరు ఇంతకూ మీరెప్పుడు పిల్లల్ని కంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారి మాటలను పట్టించుకోకూడదని శివజ్యోతికి సపోర్ట్గా నిలుస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన జ్యోతి.. ప్రేమించి గంగూలీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తన జీవితం ప్రారంభంలో గంగూలీ జాబ్ చేసేవాడని కూడా చెప్పింది. కానీ ఒక న్యూస్ యాంకర్గా జర్నీ ప్రారంభించిన శివజ్యోతికి బిగ్బాస్ తర్వాత పలు టీవీ షోలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఆపై వారు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తనకు ఇంతగా గుర్తింపు రావడానికి కారణం తన భర్తేనని, మొదట్లో ఈ కెరీర్ను ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ప్రోత్సహం ఎక్కువ ఉందని గతంలో జ్యోతి చెప్పింది. బిగ్బాస్ షో తర్వాత వీరిద్దరి జంట బాగా పాపులర్ అయింది. తర్వాత ఇద్దరూ కలిసే పలు షోలు కూడా చేశారు. దీంతో అతను జాబ్ మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జ్యోతితో పాటు అటూ టీవీ షోలు, తన సొంత యూట్యూబ్ ఛానల్ వీడియోలకు సంబంధించి ఎడిటింగ్ పనులను తనే చూసుకుంటున్నట్లు కూడా తెలిసిందే. తన ప్రెగ్నెన్సీ గురించి గతంలో జ్యోతి ఇలా చెప్పింది 'మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇది ఎమోషనల్గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. నాపై పర్సనల్గా, ప్రొఫెషనల్గా తప్పుగా ప్రచారం చేయకండి. అది నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.' అని ఆమె చెప్పింది. బిగ్బాస్లో చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అయ్యే శివజ్యోతికి తనకూ తల్లి కావాలనే ఎమోషన్ ఉండదా. అందులో వారి తప్పేముంది..? రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కానీ సంతానం కలగలేదా అంటూ తనకు సపోర్టుగా పలువురు సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
'ఖుషి' కొత్త సాంగ్.. సమంతకి కొత్త తలనొప్పి!
Samantha Trolling: 'ఖుషి' సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. 'ఆరాధ్య' పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పిక్చరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్, ట్యూన్ వరకు ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికే 'నా రోజా నువ్వే' పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తుండగా, దానికి ఇది కాంపిటీషన్ లా కనిపిస్తుంది. అదే టైంలో ఈ సాంగ్ లోని ఓ సీన్ వల్ల సమంతకు కొత్త తలనొప్పి వచ్చినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) కొన్నాళ్ల పాటు బ్రేక్ సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయిపోయాయి. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం దృష్ట్యా ఓ ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని సామ్ భావించిందని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. సరే అది పక్కనబెడితే 'ఖుషి' సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది. పాటలు అవి చూస్తుంటే హిట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఆ ట్వీట్ వల్ల 'ఆరాధ్య' అని వచ్చిన ఈ పాటలో ఓ చోట.. సమంత కుడి చేతిపై విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేస్తున్నట్లు ఓ స్టిల్ ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్ ని బయటకు తీశారు. అందులో.. 'ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి' అని రాసుకొచ్చింది. అయితే అది 'వన్ నేనొక్కడినే' పోస్టర్ అని చాలామంది అన్నారు. ఇప్పుడు ఆ ఫొటోని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన బెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. No Hate But Sorry #Samantha Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8 — Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023 (ఇదీ చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
మీమర్స్కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్
మార్కెట్లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు? (ఇదీ చదవండి: రామ్చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఎవరితడు.. బ్యాక్గ్రౌండ్? షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా లాక్డౌన్లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?) విచిత్రమైన ప్రవర్తన! నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఆ యాంకర్తో ఎక్కువగా తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి. Vurey vid evad ra ila unadu 😂🤣🤣 Koru mawoo jagrathaa 🤣#Devara #NTR30 pic.twitter.com/XKRBTAqEk9 — Gsv VamsiTarak (@GsvVamsi) June 28, 2023 Tom bayya swag bolthe 😎 pic.twitter.com/ZRpEgYK6Me — Rishi (@Telugu_abbayii) June 28, 2023 Tweets are crazy on Actor #ShineTomChacko especially in Telugu audience on his off screen mannerisms..#Devarapic.twitter.com/wx76dF3Cc9 — Arjun 🪓 (@ArjunVcOnline) June 29, 2023 (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్
సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్కు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు. ట్రోల్స్పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అన్నారు. ట్రోల్స్ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) -
నాకు ఫ్యామిలీ ఉంది...వద్దు ప్లీజ్
-
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
ట్రోల్స్పై ఎమోషనల్ అయిన తమన్ భార్య
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్పై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది. (ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ) -
పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్) బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్తో స్వర భాస్కర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్లు స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. स्वरा भास्कर ने विवाह के 4.5 महीने बाद ही बालक को जन्म देकर समय से पहले काम पूर्ण करने वाले गडकरी जी को दिखाया आईना !! — Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) May 31, 2023 -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
కేఎల్ రాహుల్పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో సునీల్ శెట్టి ఫామ్హౌస్లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే ప్రస్తుతం ఈ జంట లండన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. లండన్లోని ఓ క్లబ్లో కేఎల్ రాహుల్ తన స్నేహితులతో సరదాగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ కేఎల్పై ట్రోల్స్ చేశారు. గాయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు దూరమైనా బాధ లేకుండా.. క్లబ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించడాన్ని తప్పుబడుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి దీనిపై కాస్తా గట్టిగానే ఇచ్చి పడేసింది. (ఇది చదవండి: సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. నేను సాధారణంగా చాలా వరకు మౌనంగానే ఉండాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మన కోసం నిలబడటం చాలా ముఖ్యం. నేను, రాహుల్, మా ఫ్రెండ్స్తో సాధారణంగా ఓ ప్రదేశానికి వెళ్లాం. దయచేసి సంబంధం లేని విషయాలతో ముడిపెట్టకండి. అనేముందు ఒకసారి అలోచించుకోండి.' అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అతియాశెట్టి. తన భర్తను ట్రోల్ చేయడంపై కాస్త ఘాటుగానే స్పందించింది. #KLRahul Spotted In Strip Club In UK During His Recovery pic.twitter.com/jMPzhraJqV — Stroke0Genius🇮🇳 (@Stroke0Genius18) May 26, 2023 -
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్
ఇతర హీరోయిన్లకు నటి కాజల్ అగర్వాల్కు కాస్త వ్యత్యాసం ఉంది. నటనను విపరీతంగా ప్రేమించే నటి ఈ బ్యూటీ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు ఆ తరువాత కోలీవుడ్కు పరిచయం అయిన కాజల్ ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టి స్టార్డమ్ను తెచ్చుకుంది. అయితే అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే ఎలాంటి హంగామా లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్తో కలిసి ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన కాజల్ అగర్వాల్ ఒక భేటీలో పేర్కొంటూ తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను పట్టించుకోలేదని పేర్కొంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: నేను కూడా యూత్ అనిపించింది: హీరో నాని -
'చెత్తగా ఆడాలని ఎవరనుకోరు.. ట్రోల్స్ బాధించాయి'
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీనిని చాలా వరకూ పట్టించుకోకపోయినా.. ఏదో ఒక సమయంలో ట్రోలింగ్ తనపై ప్రభావం చూపుతుందని తానే స్వయంగా పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం గాయపడిన కేఎల్ రాహుల్ టోర్నీకి దూరమయ్యాడు. లండన్లో రాహుల్కు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం కేఎల్ రాహుల్ ''ది రణ్వీర్ షో''లో మాట్లాడాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు. "సోషల్ మీడియా ట్రోలింగ్ నాతోపాటు మరికొందరు ప్లేయర్స్ ను అప్పుడప్పుడూ ఆవేదనకు గురి చేస్తుంది. మాకు మద్దతు అవసరమైన సమయంలో అభిమానులు తాము ఏది కావాలంటే అనే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. మేమెవరమూ చెత్తగా ఆడాలని కోరుకోము. ఇదే మా జీవితం. మేము చేసేది ఇదే. నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు. నేను చేసేది క్రికెట్ ఆడటమే. నేను నా గేమ్ పై సీరియస్ గా లేనని లేదా కఠినంగా శ్రమించడం లేదని ఎవరైనా ఎలా అంటారు? కానీ స్పోర్ట్స్ లో అలా కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉండదు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం నాకు అనుకూలంగా రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి" అని రాహుల్ పేర్కొన్నాడు. ఇక చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రెండు టెస్టులు ఆడిన రాహుల్.. వాటిలో విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్లో బాగానే ఆడినా.. అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. గాయంతో ఐపీఎల్కు దూరమైన రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడడం లేదు. చదవండి: 'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్ను కాదు' -
అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ ఫ్యాన్స్
-
కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్గా ఉంటుంది అంటూ అమల తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్ View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్గా మారింది. అయితే ఈ టీజర్పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
ఫోటో తీసెయ్.. కమెడియన్ అవినాష్కి బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఇది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియోతో పాటు బన్నీ లుక్ని రివీల్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్ని ఇమిటేట్ చేస్తూ అరకొర ఎడిటింగ్తో పుష్పరాజ్లా మారిపోయాడు కమెడియన్ అవినాష్. జబర్దస్త్ స్కిట్స్, బిగ్బాస్ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్ని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్పై ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అర్జెంట్గా ఫోటో డిలీట్ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
డ్రెస్తో జాన్వీ కపూర్ తిప్పలు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్తో అదరగొట్టింది. ఈ ఫంక్షన్లో వెరైటీ డ్రెస్లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్ డ్రెస్పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. (ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి) కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్తో కలిసి బవాల్లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్లో తమ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కదు. టి20లంటే వేగానికి మారుపేరు అన్న సంగతి పక్కనబెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్ఆర్హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే అంతకముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న ఒక్క కారణంతో హ్యారీ బ్రూక్కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లోనే హిట్టింగ్ చేశాడంటే టి20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీ ఎస్ఆర్హెచ్ను నవ్వుల పాలయ్యేలా చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరే ఫస్ట్ మ్యాచులో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచులో ఇంకా దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచులో 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసిన హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు. అయితే, నిజానికి బ్రూక్కు టెస్టు క్రికెట్లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లండ్ తరఫున 20 టి20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేసి.. మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. చదవండి: Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి? -
కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ అన్నా!
''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్ఆర్హెచ్ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో కొత్త జోష్ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్) కమింగ్.. బి కేర్ఫుల్ అపోజిట్ టీం మెంబర్స్''.. మార్క్రమ్ ఎరా మొదలైంది.. ఇక ఎవరు ఆపలేరు''.. ఇదంతా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు ఎయిడెన్ మార్క్రమ్ ఎంట్రీ గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియలో ఇలా ఊదరగొట్టారు. కట్చేస్తే.. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నోతో మ్యాచ్లో కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలమైన మార్క్రమ్ పేలవ రీతిలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ వచ్చాడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా గోల్డెన్ డకౌట్ అవ్వడం ఏంటని ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడ్డారు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ ఇచ్చావ్ అన్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే మార్క్రమ్ వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పరుగులు చేయాల్సిన బ్యాటర్లు పోటీ పడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. పార్ట్టైం బౌలర్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారంటే ఎస్ఆర్హెచ్ ఎంత బాగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. Headline for tomorrow's 𝐓𝐡𝐞 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰 𝐓𝐢𝐦𝐞𝐬 📰 𝘏𝘶𝘮𝘢𝘢𝘳 𝘗𝘢𝘯𝘥𝘺𝘢 𝘣𝘩𝘢𝘪𝘺𝘢, 𝘮𝘢𝘴𝘵 𝘣𝘢𝘢#LSGvSRH #TATAIPL #IPLonJioCinema | @krunalpandya24 pic.twitter.com/mQ7dui048U — JioCinema (@JioCinema) April 7, 2023 Golden duck for Aiden Markram on captaincy debut. Krunal Pandya on fire! pic.twitter.com/mfv0bPn3Zk — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023 Golden Duck on debut match as a captain in IPL 🔥🔥 Aiden Markram era starts from here they said, well said😍😍 #LSGvSRH pic.twitter.com/Gg69nUxQGG — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2023 Search: Markram Era 😂😂🤣🤣🤣🤣🤣 — Dileep (@dileeptweetsz) April 7, 2023 చదవండి: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా' ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్ను ఏలేవారేమో! -
'రంజీ మ్యాచ్లనుకున్నావా.. ఇలా ఆడితే కష్టం'
సర్ఫరాజ్ ఖాన్.. ఇటీవలీ కాలంలో బాగా మారుమోగిన పేరు. దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ సహా ఇతర క్రికెట్ లీగ్స్లో వరుస శతకాలతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోరని అభిమానులు ప్రశ్నించారు. చెత్త రాజకీయాలతో టాలెంటెడ్ ఆటగాడిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. Photo: IPL Twitter అయితే ఐపీఎల్కు వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ టాలెంట్ను పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నాయి. అందుకు అతను బాగా ఆడలేకపోతున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విమర్శించేది అతని చేస్తున్న స్లో బ్యాటింగ్పై. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్కు దూరమవ్వడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. ఇక బుధవారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 34 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ స్లో బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ రన్రేట్ మధ్యలో దారుణంగా పడిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సర్ఫరాజ్ ఖాన్ను ట్రోల్ చేశారు. ''ఇలా అయితే ఐపీఎల్కు పనికిరావు.. రంజీలనుకుంటున్నావా కాస్త వేగం పెంచు.. సర్పరాజ్ కేవలం రెడ్బాల్ క్రికెట్కు మాత్రమే పనికొస్తాడు.'' అంటూ కామెంట్ చేశారు. He played this in a T20 match 🙂#DCvGT #IPL pic.twitter.com/5KUSnDwdqz — Om 🇮🇳 (@chadxomm) April 4, 2023 చదవండి: 'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు' 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్గా అనిపిస్తోంది' -
మోడల్ నడుముపై చేతులేసిన బోని కపూర్.. నెటిజన్స్ ట్రోల్
సినీ ప్రముఖులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏం చేసినా..అది వార్తే అవుతుంది. వారు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తారు. మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. తప్పు చేస్తే అంతే దారుణంగా ట్రోల్ చేస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగిన తప్పుకు, అసలు వాళ్ల దృష్టిలో అది తప్పే కాకపోయినా.. నెటిజన్స్ సదరు సినీ ప్రముఖులను ట్రోల్ చేస్తుంటారు. అలాంటి ట్రోలింగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత బోని కపూర్కు ఎదురైంది. ఓ బాలీవుడ్ మోడల్ నడుముపై చేతులు వేశాడంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే... రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC)’ ప్రారంభోత్సవం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్ కూడా హాజరయ్యాడు. అలాగే హాలీవుడ్కు చెందిన ప్రముఖ మోడల్ జిగి హడిద్ కూడా ఈ లాంచింగ్ ఈవెంట్కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అదే ఇప్పుడు ట్రోలింగ్కు కారణమైంది. ఫోటో దిగే క్రమంలో బోని కపూర్ జిగి హడిద్ నడుముపై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్ తీసుకుంది. కానీ నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసూ బోనీ కపూర్ని దూషిస్తున్నారు. Patli kamariya tori haaye haaye haaye pic.twitter.com/u0DBdwZfE8 — SwatKat💃 (@swatic12) April 3, 2023 The way #BoneyKapoor Holds Gigi Hadid's Thin Waist in this pic, Is it real or just my Hallucination 😂 pic.twitter.com/ucQn46vEGv — 💫 Arthur (@irrk_k) April 3, 2023 Arey boney ji 😭 pic.twitter.com/WJnbWJ9eJL — celina ❦ (@bollyvfx1) April 3, 2023 Gigi ji, aapko tairna aata hai? pic.twitter.com/MlVV2KKUoG — Robin (@Bisleri_maymer) April 3, 2023 Close enough#BoneyKapoor #GigiHadid #NMACC pic.twitter.com/B9W0VSl8It — Himalaya Kankariya (@himalayahere) April 4, 2023 -
ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్తో నిత్యం టచ్లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది. -
డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని విమర్శించారు : ఉపాసన
టాలీవుడ్ స్టార్ దంపతులు రామ్చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీళ్లు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఉపాసన పెళ్లైన కొత్తలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'చరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉండేవారు. సమాజంలో చాలామంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. నేను బాగా లావుగా ఉన్నానని, అందంగా లేనని కామెంట్స్ చేశారు. ఇంకొంతమంది అయితే చరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా విమర్శించారు. కానీ నేను ఆ సమయంలో కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించా. ఆరోజు నన్ను ట్రోల్ చేసినవాళ్లే నేడు ప్రశంసిస్తున్నారు' అంటూ ఉపాసన పేర్కొంది. -
ఎక్కడైనా అంతే.. కేఎల్ రాహుల్ను తిట్టడం ఆపండి!
టీమిండియా స్టార్... లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాహుల్ కథ మొదటికే వచ్చింది. అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపుతాడని అభిమానులు ట్రోల్ చేసేవారు. అయితే ఇకపై రాహుల్ను ట్రోల్ చేయడం ఆపేయాల్సిందే. ఐపీఎల్కు మాత్రమే పనికొస్తాడనే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేఎల్ రాహుల్ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చాడు. అంతే రాహుల్ కథ ముగిసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా ఉన్న రాహుల్ ఇక్కడ మాత్రం ఓపెనర్గా వచ్చేశాడు. తనకు ఓపెనింగ్ కంటే ఐదో స్థానం కరెక్ట్ అని రాహుల్ భావించి వచ్చే మ్యాచ్ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది. ఇక రాహుల్ తక్కువ స్కోరుకే వెనుతిరగడంపై అభిమానులు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ఎక్కడైనా రాహుల్ ఆటతీరు ఇంతే.. అతన్ని తిట్టడం, ట్రోల్ చేయడం ఆపండి.. 12 బంతుల్లో 8 పరుగులు... పొరపాటున టెస్టు మ్యాచ్ అనుకోలేదు కదా రాహుల్.. ఓపెనర్ వద్దు.. ఐదో స్థానమే నీకు ముద్దు.. అంటూ కామెంట్ చేశారు. -
అనసూయ షాకింగ్ ట్వీట్.. అయినా ఆగని ట్రోల్స్
యాంకర్, నటి అనసూయ ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టిన అది చర్చనీయాంశమవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు ప్రశంసించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. అందుకే అనసూయ పెట్టే ప్రతి పోస్ట్ వార్తల్లో నిలుస్తుంది. ఇక నెట్టింట అనసూయ చేసే సందడి గురించి తెలిసిందే. ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ‘పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ?’ అంటూ అనసూయ పోస్ట్స్పై నెటిజన్లు ట్రోల్స్కు దిగుతారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్పై నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం! దీంతో వారి కామెంట్స్కి ఆమె స్పందిస్తూ గట్టి కౌంటరిస్తుంది. ఆయనప్పటికీ ట్రోలర్స్ మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన దానిపై అభ్యంతకరంగా కామెంట్స్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో అనసూయ షేర్ చేసిన తాజా పోస్ట్ చూసి ట్రోలర్స్ కంగుతిన్నారు. తనని ట్రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా అనసూయ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాదఁఖ పోలీసులు సామాజీక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన న్యూస్ను అనసూయ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. చదవండి: శ్రీరామ నవమి సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం ఇక దీనిపై కూడా ట్రోలర్స్ తమదైన శైలిలో స్పందిస్తూ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి ఆంటీ అంటూ అభ్యంతకర కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్గా మారింది. కాగా మహిళలపై వేధింపులు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ట్రోలర్స్ ఆటలు కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్లో ట్రోలింగ్ చేసినా, ఫొటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి కేసులు ఏం వచ్చిన వదలకుండ వాటిపై క్రైం పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. 🫡 pic.twitter.com/aJhE0yKYM0 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023 -
ఆమిర్ను ట్రోల్ చేసిన టీమిండియా క్రికెటర్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ను ట్రోల్ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన త్రీ ఇడియట్స్(3 Idiots) సినిమా గుర్తుందిగా. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్షణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇండియన్ బ్లాక్బాస్టర్గా నిలిచిన 'త్రీ ఇడియట్స్' సినిమా అప్పట్లో ఒక సంచలనం. 2016లో ఆమిర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్ ఉంటుందని.. రాజ్కుమార్ హిరానీ నాకు చిన్న హింట్ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్కు సీక్వెల్ ఉంటుందని చెప్పడానికే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్ ఆడబోతున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్ చేశారు. తాము క్రికెట్లోకి ఎంటర్ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్(అడ్వర్టైజ్మెంట్)లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటూ ఆమిర్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్కు సంబంధించి ఒక ప్రమోషన్ వీడియోను షూట్ చేశాడు. డ్రీమ్ ఎలెవెన్, ఐపీఎల్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. మేం యాక్టింగ్లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం అని ఆమిర్, మాధవన్, శర్మన్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోనూ చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు''.. ''ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్మ్యాన్లు అయిపోలేరు'' అంటూ ట్రోల్ చేశాడు. ''మాటలు చెప్పడం ఈజీ.. ఆడడం కష్టం.. ఎప్పుడు తెలుసుకుంటావు ఆమిర్ జీ'' అంటూ అశ్విన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ''ఒక్క బౌన్సర్తో మీ ముగ్గురు గ్రౌండ్లోనే కుప్పకూలడం ఖాయం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. #3Idiots ka Press Conference... Cricket Pe?!?! This #Cricket season, #SabKhelenge! . . .#Dream11 @ImRo45 @hardikpandya7 @ashwinravi99 @TheSharmanJoshi pic.twitter.com/r0NSoz8IOj — Dream11 (@Dream11) March 25, 2023 చదవండి: ఒక్కడికి సీరియస్నెస్ లేదు; థర్డ్ అంపైర్కు మెంటల్ ఎక్కించారు -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
అయ్యో పాపం.. చాలా కష్టపడ్డారు.. స్టార్ హీరోపై కంగనా కామెంట్స్
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే కొందరు తనపై గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ భామ. హీరో అమిర్ ఖాన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పేరును కనీసం ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్టపడలేదని విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో కంగనాను అమిర్ ఖాన్ ప్రశంసించారు. అయినప్పటికీ ఇవేమీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బయోపిక్ తీస్తే ఆ పాత్ర ఎవరు బాగా పోషిస్తారని అమీర్ను శోభా డే అడిగారు. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, అలియా భట్ల పేర్లను అమిర్ ఖాన్ చెప్పారు. అయితే శోభా మాత్రం కంగనా రనౌత్ పేరును గుర్తు చేసింది. ఆ తర్వాత అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. కంగనా ట్వీట్ చేశారు. కంగన తన ట్వీట్లో రాస్తూ.. 'అయ్యో పాపం ఆమిర్.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. కాకపోతే అది వీలు కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇదే నిదర్శనం' అంటూ పోస్ట్ చేశారు. అయితే కంగనా ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్ మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మీ గొప్పల కోసం ఇతరులను కించపరచడం సరైన పద్ధతి కాదు అని కామెంట్లు పెడుతున్నారు. Bechara Aamir Khan … ha ha he tried his best to pretend like he doesn’t know that I am the only three times national award winning actress none of those he mentioned has even one … Thank you @DeShobhaa ji I would love to play you ♥️ https://t.co/o0tS6UYLoC — Kangana Ranaut (@KanganaTeam) February 10, 2023 -
'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్పై శ్రుతి కౌంటర్
అగ్ర కథానాయకుడు కమలహాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి వ్యతిరేకంగా శృతిహాసన్ నట జీవితం సాగుతోందని చెప్పక తప్పదు. కోలీవుడ్లో విజయ్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించినా ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. విశాల్ సరసన నటించిన పూజ చిత్రం కమర్షియల్గా విజయాన్ని సాధించింది. శృతిహాసన్ తమిళంలో చివరిగా నటించిన చిత్రం లాభం. అది నిరాశ పరిచింది. ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు. ఇక తెలుగులో మహేష్ బాబు, రవితేజా వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా మరొకటి బాలకృష్ణకు జంటగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం. మూడోది ప్రభాస్తో సలార్ చిత్రం. విశేషం ఏమిటంటే చిరంజీవి, బాలకృష్ణతో నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ దాదాపు తన తండ్రి వయసు కలిగిన సీనియర్ నటుల సరసన నటించడంపైనే నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. శృతిహాసన్ తనకంటే రెట్టింపు వయసు ఉన్న సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా, డబ్బు కోసమా? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వీటికి శృతిహాసన్ స్ట్రాంగ్గానే బదులిచ్చారు. ఆమె తన ట్విట్టర్లో ట్రోలింగ్లపై స్పందిస్తూ సినిమా రంగంలో వయసు అన్నది నంబర్ మాత్రమేనన్నారు. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చన్నారు. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని పేర్కొన్నారు. -
Zomato: కస్టమర్లకు జొమాటో రిక్వెస్ట్
వైరల్: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్లలో.. ఆర్డర్ చేసేటప్పుడు కొందరు తమ టేస్టులకు తగ్గట్లుగా రెస్టారెంట్లకు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎక్స్ట్రా స్పైసీగా ఉండాలనో, ఉప్పు తక్కువగా ఉండాలనో లేదంటే ఇంకేదైనా సూచనను తమ అవసరాలకు అనుగుణంగా జత చేస్తుంటారు. అందుకే కస్టమర్లకు తగ్గట్లే.. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో కాలమ్స్ను పెడుతుంటాయి ఆయా యాప్లు. అయితే.. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో సర్వసాధారణంగా మారిపోయిన ఓ కుకింగ్ సూచనను దయచేసి చేయొద్దంటూ ట్వీట్ చేసింది. అదే.. ‘‘భయ్యా.. ఫుడ్ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’’ అని. దయచేసి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఈ సందేశాన్ని జత చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది జొమాటో. అయితే జొమాటో రిక్వెస్ట్గా చేసిన ఈ ట్వీట్కు నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ సూచన కాలమ్ ఎందుకని, ఏం రాయాలనే కస్టమర్లకు స్వేచ్ఛ ఉండదా?అని జొమాటోని ఏకిపడేస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కంపెనీలు సేవలు అందించాలే తప్ప.. వాళ్లకు అడ్డు చెప్పడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. guys please stop writing “bhaiya accha banana” as cooking instructions 🤦♂️ — zomato (@zomato) December 22, 2022 -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్లో కనిపించింది. అక్షయ్కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
'యార్..నెంబర్ వన్ బౌలింగ్'.. పాక్ జట్టును ఆడేసుకున్నారు
పాక్, ఇంగ్లండ్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్.. ఆఫ్సైడ్ వేస్తే కొట్టారు.. ఆన్సైడ్ వేస్తే కొట్టారు.. ఫుల్టాస్ వేస్తే కొట్టారు.. ఇలా బంతి ఎక్కడ వేసినా కొడుతూనే ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసింది కాబట్టి కొట్టుడుకు విరామం వచ్చింది లేదంటే ఇంగ్లండ్ ఒక్కరోజులోనే వెయ్యి పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత నాసిరకంగా తయారైంది పాక్ బౌలింగ్. పాపం ఈ విషయంలో పాక్ బౌలర్లను కూడా తప్పుబట్టలేం. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్కు చుక్కలు చూపించాలనుకున్నారు పాక్ ఆటగాళ్లు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. పాక్ బౌలర్లు చెడుగుడు ఆడతారనుకుంటే ఇంగ్లండ్ బ్యాటర్లే వారిని చీల్చి చెండాడారు. ఎందుకంటే అసలు పిచ్పై జీవం ఉందా లేదా అన్న సంశయం మ్యాచ్ మొదలైన కాసేపటికే అర్థమయిపోయింది. ఎంత నాసిరకం పిచ్ అయినా బౌలర్లకు కొంతమేరైనా సహకారం అందిస్తాయి. కానీ ఇంగ్లండ్తో టెస్టులో మాత్రం అలా జరగలేదు. పాక్ బౌలర్లు వరుసబెట్టి బౌలింగ్కు వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చామా అన్నట్లుగా బాధపడినట్లు వారి మొహాలు చూస్తే తెలిసిపోతుంది. బాబర్ ఆజం బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఎక్కడ బంతి వేసినా కొట్టుడే పనిగా పెట్టుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ల దెబ్బకు తలలు పట్టుకున్నారు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఆడిన ఏ జట్టు కూడా 165 రన్స్ కొట్టలేదు. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ వసీం, షాదాబ్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేశారు. కానీ సొంతగడ్డపై పాక్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి బేజారయ్యారు. ఆరుగురు బౌలర్లు వికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. నసీమ్ షా, మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్మద్, అగా సల్మాన్, సౌద్ షకీల్లు వికెట్ల కోసం కాకుండా పరుగులు సమర్పించుకోవడంలో పోటీ పడ్డట్లుగా అనిపించింది. వీరిలో ఏ ఒక్క బౌలర్ ఎకానమీ కూడా 5 కంటే తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒకర్ని మించి ఒకరు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లు అలసిపోయి వికెట్లు ఇచ్చారు తప్ప పాక్ బౌలర్లు పెద్దగా కష్టపడింది లేదు. పాక్ చెత్త బౌలింగ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. యార్ నెంబర్ వన్ బౌలింగ్.. ఇది కదా బౌలింగ్ అంటే.. ఇదేం బౌలింగ్ రా నాయనా.. వెల్డన్ పాక్ బౌలర్స్.. ఒక్కరోజులో 500 పరుగులు కొట్టించుకున్నారు.. మీకు మాత్రమే సాధ్యమైంది అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఫన్నీ మీమ్స్తో పాక్ జట్టను ఆడేసుకున్నారు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 101 అజేయ శతకంతో ఆడుతుండా.. బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓలీ పోప్, జాక్ క్రాలీ, బెన్ డకెట్లు శతకాలతో రెచ్చిపోయారు. ఒక టెస్టు మ్యాచ్లో నలుగురు శతకాలు బాదడం ఇదే తొలిసారి కాగా.. తొలిరోజే 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. పాక్ బౌలర్లలో జహీద్ మహ్మద్ కు రెండు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్, మహ్మద్ అలీలకు చెరొక వికెట్ దక్కింది. No one trolls Pakistan cricket fans more than the Pakistani players themselves 🤣😂#PAKvENG || #WTC23 #Rawalpindi #PakistanCricket #EngvsPak #PakvsEng2022 #TestCricket #AUSvWI pic.twitter.com/mCrx7AYok5 — Avinash (@Aviinashx) December 1, 2022 T20 in white kits & red ball 😱#PAKvENG | #ENGvsPAK pic.twitter.com/mj4d8Gj4bO — Q A S I M (@Its_Qasimm) December 1, 2022 11 overs 75!!! Test T20 or ODI!!!#PAKvENG — Gulraiz Gulzar (@GulraizGulzar2) December 1, 2022 No DRS, No speed gun, flat pitches .. Historic series👏 #PAKvENG — Hafsa⚡ (@QudratKaNazam) December 1, 2022 Someone please tell English batters that T20WC is over now😂 ENG 75-0 in 11 overs #PAKvENG — Kashif Suleman (@KashifSuleman_) December 1, 2022 Cheating to Pakistani Cricket fans. Unko test match bolke t20 dikha rahe hai 😂😂#PAKvENG #PakvsEng2022 #PAKvsEng #EngvsPak pic.twitter.com/2b0YLNNunU — VIRAT KOHLI ARMY 🇮🇳 (@Asmylemalhotra) December 1, 2022 What a start to ODI series between England and Pakistan in Rawalpindi. 152-0 and counting at home for Pakistan. 🤣🤣#PAKvsEng #PAKvENG pic.twitter.com/WMg9anrjhE — Akshat (@AkshatOM10) December 1, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
రిషబ్ పంత్ పై నెటిజన్ల ఆగ్రహం
-
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్టాప్లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఒక్క మ్యాచ్కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష
టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఆదివారం కివీస్తో మొదలైన రెండో వన్డేలో శాంసన్ను ఎంపిక చేయలేదు. దీంతో శాంసన్ను కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితం చేశారా అంటూ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్ ప్లేయర్ అనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంసన్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడన్న మాటే కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టులో శాంసన్కు చోటు దక్కలేదు. మరి ఆ విమర్శలకు భయపడ్డారేమో తెలియదు కానీ ఉన్నపళంగా కివీస్తో జరిగిన తొలి వన్డేకు సంజూకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికి మరి తీసిపారేసేంత చెత్తగా మత్రం ఆడలేదు. దారుణంగా విఫలమవుతున్న పంత్తో పోలిస్తే సంజూ శాంసన్ చాలా బెటర్గా కనిపించాడు. పంత్ 15 పరుగులు చేసి ఔటవ్వగా.. సంజూ శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సుందర్(37 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్తోనే ఆ మ్యాచ్లో టీమిండియా 300 పరుగులు మార్క్ను దాటింది. అయితే పేలవమైన బౌలింగ్ కారణంగా టీమిండియా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇదిలా ఉంటే రెండో వన్డేలో సంజూ శాంసన్పై మరోసారి వేటు పడింది . తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా.. సంజూ శాంసన్ను మాత్రం పక్కనబెట్టేసింది. సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడంపై ధావన్ సహా జట్టు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్తో రెచ్చిపోయారు అభిమానులు. ''సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు.. శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!''.. ''సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే'' అంటూ ధ్వజమెత్తారు. ''సంజూ ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవ్వడం ఖాయం''..''ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని'' కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. Cricket craze gonna end here. Thanks to BCCI. from viru, yuvi to msd to sanju samson. Sanju is a victim of favourism running in bcci. Until it is stopped, I won't be watching any matches of team india. Replacing inform batsman is ridiculous. No more tweets🤐🤐🤐 #SanjuSamson pic.twitter.com/cCfxMz8uMX — ADARSH J S (@never_give_u_p_) November 27, 2022 Doesn't make any sense. SKY has a poor ODI record, Pant hasn't performed in white ball cricket, Samson played a good knock in last match. But you*****ing drop samson! Wow BCCI. #justiceforsamson #SanjuSamson https://t.co/jER4ZulT8o — Karthikeyan (@IamKarthi1818) November 27, 2022 Once Again #justiceforsanjusamson Sanju fans please Show your Power.#SanjuSamson #ShameOnYou #BCCI 😑 pic.twitter.com/BdV4s3LaRK — Sachin Gandhi (@SachinG25184819) November 27, 2022 చదవండి: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి! -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్కు నోటీసులు జారీ చేసింది. -
ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. ఒకవేళ పుంజుకుంటే!
టి20 ప్రపంచకప్ 2022 ఆరంభమైన తొలిరోజునే సంచలనం నమోదైంది. శ్రీలంక క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడుతున్నప్పటికి ఫేవరెట్గానే బరిలోకి దిగింది. అలాంటి లంక జట్టుకు పసికూన నమీబియా షాక్ ఇచ్చింది. ఫేలవ బ్యాటింగ్తో నిరాశపరిచిన లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది. దీంతో లంక జట్టును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆసియా ఛాంపియన్లుగా అవతరించిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే చెత్త ఆట తీరుతో మళ్లీ మొదటికే వచ్చిందంటూ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ లో లంకేయులు చేసిన 'నాగిని'డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. 'ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు' అంటూ వాటికి కామెంట్స్ పెట్టారు. మరికొందరు లంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫోటోను పెట్టి.. 'ఇవాళ రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటది మీరు రండ్రా..'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మీమ్స్ చేశారు. 'ఆసియా చాంపియన్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడారు. ఆ జట్టు తర్వాత నెదర్లాండ్స్, యూఏఈతో మ్యాచ్ లు ఆడాలి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా ఇక అంతే సంగతులు' అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ లంక జట్టును ట్రోల్ చేయడంపై క్రీడా పండితులు తప్పుబట్టారు. ''ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రానా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మ్యాచ్ ఓటమి పాలైనప్పటికి తర్వాతి మ్యాచ్ల్లో ఫుంజుకుంటే మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా.. ఎప్పుడు ఒక జట్టును తక్కువ అంచనా వేయకూడదు.. రెండు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోతే అప్పుడు ట్రోల్ చేసినా ఒక అర్థముంటుంది. అంతేకానీ కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు ఇలా అవమానించడం తగదు'' అంటూ పేర్కొన్నారు. నమీబియా చేతిలో లంక ఓడిపోయాక సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ.. ''ఈరోజు క్రికెట్ ప్రపంచానికి నమీబియా తన పేరును ఘనంగా చాటింది'' అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉండగా అనామక జట్టుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న టీమ్ ను ఓడించిన సందర్భాలలో నమీబియా కూడా చేరింది. ఇదివరకు ఈ జాబితాలో జింబాబ్వే (2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది), నెదర్లాండ్స్ (2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై గెలిచింది), హాంకాంగ్ (2014 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై), అఫ్గానిస్తాన్ (2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పై) ఉన్నాయి. తాజాగా నమీబియా కూడా లంకను ఓడించి ఆ జాబితాలో చేరింది. -
‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!
‘జనం కమెడియన్లను సీరియస్గా, పొలిటీషియన్లను కామెడీగా తీసుకుంటున్నారని’... ఓ అమెరికా పెద్దమనిషి చెప్పి దాదాపు వందేళ్ల య్యింది. ఇంకా అదే ట్రెండ్ కొసాగుతున్న ట్టుంది.. ఇది చూడండి.. ముందస్తు అరెస్ట్లు, హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందోబస్తు.. 100 మంది అదుపులోకి.. 3 గంటలపాటు ఉద్రిక్తత.. 1,500 మంది పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... కామెడీ షో ప్రశాంతంగా పూర్తయింది.. – ఇదీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన మునావర్ స్టాండప్ కామెడీ షో తీరు. 5వ తారీఖున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన గురించి ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ట్రంప్, పుతిన్, కిమ్లాంటి వాళ్లు కేసీఆర్ బ్యాచ్తో టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ‘ప్రపంచ రాష్ట్ర సమితి’ (పీఆర్ఎస్) పార్టీ పెడితే మన పరిస్థితి ఏమిటీ అని పలువురు దేశాధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.. పీఆర్ఎస్లో ఉండడమా, స్వతంత్రంగా ఉండడమా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. – ఇదీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్. ఇట్లా.. కామెడీ సీరియస్గా.. పాలిటిక్స్ కామెడీగా! ‘మన వాళ్లు వట్టి వెధవాయిలు..’ ఇందిరమ్మ సృష్టించిన ఎమర్జెన్సీ చీకట్లలో ఉదయించిన ‘జనతా’లాగా.. పంచమ స్వరాన్ని దళిత శంఖారావంలా దేశ వ్యాప్తం చేయ ప్రయత్నించిన కాన్షీరాం బీఎస్పీ లాగా... చాలా కాలం తర్వాత అలా దేశవ్యాప్త సంచలనం.. మోదీ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి విజయ దశమి నాడు గాండీవం ఎత్తిన కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మన తెలుగు ఎన్టీయార్ కల ‘భారతదేశం’ పార్టీ భావనను ఆయన వీరాభిమాని కేసీఆర్ దేశవ్యాప్తం చేసే అద్భుత సన్నివేశం.. దీన్ని కొంతమంది.. అదీ తెలుగు వాళ్లు.. మరీ తెలంగాణ తల్లి బిడ్దలు.. ఇలా ట్రోల్ చేయడం ఆశ్చర్యమే మరి! జాతీయ పార్టీలు చిన్న మునుగోడు పైనే పడుతుంటే.. జాతీయవాదాన్ని ఎత్తుకున్న తెలు గోడిని మరో తెలుగోడు ప్రశంసించడం మాని.. పరిహసించడమా! ‘ముందుకు పోతానంటే ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో మందురు..’ అని శ్రీశ్రీ.. ‘మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్..’.. అని గురజాడ గిరీశం ఊరికే అన్నారా పునర్భూదోషం... జ్యోతిష్యులు కూడా దీన్ని వదలక పోవడం మరింత చిత్రం.. తెలుగు నేలపై ఆధ్యాత్మిక వైభవానికి కేసీఆర్ ఎంత చేస్తున్నారో మనకు తెలుసుగా.. శుభం పలకవచ్చుగా! ధనుర్లగ్నంలోనే పార్టీ ప్రకటన జరిగిందట... ఇది అచ్చంగా రాజులు మరో సామ్రాజ్యంపై దాడిచేసేటప్పుడు పెట్టే ముహూర్తం... యుద్ధానికి ప్రతీక, విజయానికి సూచిక.. తిరుగులేదు అంటూనే.. కాస్త లో–వాయిస్లో కొర్రీలు చూపుతున్నారు. దుర్ముహూర్త స్పర్శా దోషం ఉంది., పునర్భూదోషం ఉంది. పలుమార్లు శ్రమించాల్సిందే, నల్లేరుపై నడక కాదు కష్టపడాల్సిందే.. అంటున్నారు. ఠాఠ్.. అదేమీ లేదు వ్యక్తిగత జాతకం అద్భుతం అని కాస్త హై–వాయిస్లో దబాయిస్తున్న ప్రో– జ్యోస్యులూ ఉన్నారనుకోండి! ఇదో ‘స్టార్టప్’ తరహా... ఇక సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేసిన విశ్లేషకుల ముచ్చట్లు రకరకాలు..మచ్చుకు ఒకటి.. – మన దగ్గర ఒక్క పార్లమెంట్ ఎన్నికకయ్యే ఖర్చులో బయటి రాష్ట్రాల్లో నాలుగైదు పార్లమెంట్ నియోజక వర్గాలు లాగించవచ్చు. బాగా వనరు లున్న పార్టీ కనుక చిన్నా చితకా పార్టీలను ఆకర్షించవచ్చు. వారికి ఆర్థిక సాయం చేయవచ్చు. ఇదో స్టార్టప్ తరహా వ్యవహారం.. ఇది స్టార్టప్ల కాలంకదా.. చూద్దాం ఇది సక్సెస్ అవుతుందో లేదో.. అని విశ్లేషణ బాల ‘పిట్టకథ’ ఇంకాస్త కరడు గట్టిన తెలంగాణ వాదులు ఓ పిట్టకథ చెబుతున్నారు. ఓ పిల్లాడిని తల్లి పిలిచి సీసా మూత తియ్యరా అంది పలుమార్లు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అన్న దాన్ని తీసుకుని ఓ రెండు మార్లు ప్రయత్నించి మూత తీసి హీరోలా తమ్ముడి వైపు చూసి వెళ్లాడు. తమ్ముడు తల్లిని అడిగాడు అన్న ఎలా తీయగలిగాడు అని.. నువ్వు చాలా చాలా సార్లు ప్రయత్నించినప్పుడే అది లూజయింది. మరోమారు నువ్వు ప్రయత్నించినా వచ్చేది అని నవ్విందట! కేసీఆర్దీ ఇదే తంతు. ఎన్నో దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం కీలక దశలో జొరబడి పేరు కొట్టేశాడు అంటూ వెటకారం చేస్తూ... ప్రతిసారీ అన్ని సీసాల మూత తియ్యడం సాధ్యం కాదు... అని నర్మగర్భంగా, కాస్త వ్యంగ్యంగా.. పక్కోడి ప్రయత్నాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాలు లేకుండా అస్సలు సాధ్యంకాదని సీరియస్గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. నామ్కే వాస్తే.. ఈ సీసాల గొడవ ఇలా ఉండగా.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు పేరు మార్పుపై. ‘..సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరి సిరి మువ్వా..’ శ్రీశ్రీ పాటేసుకుంటున్నారు.. గొర్రెలెలా? కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఇలా డౌటేస్తున్నారు... ఫర్ సపోజ్...మన బీఆర్ఎస్ ఢిల్లీ పీఠం ఎక్కిందనుకుందాం... రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటాం. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కార్పొరేట్లకు రుణ మాఫీ రద్దు చేసి..దానికి బదులు దేశమంతటా దళిత బంధు, రైతు బంధు ఇచ్చుకుందాం. రాష్ట్రానికో కాళేశ్వరం కట్టుకుందాం.. ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం.. ..కానీ, మన గొర్రెల పథకం ఉందిగా.. దేశమంతా గొర్రెలెలా పంచడం? ఇక్కడ మనకు సరిపోకే పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నామాయే! (క్లిక్ చేయండి: రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!) -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో'
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు,. ఈ మెగా ఈవెంట్ అఖరి సూపర్-4 మ్యాచ్లోనూ బాబర్ అదే ఆట తీరును కొనసాగించాడు. ఈ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న ఆజాం 30 పరుగుల చేసి పెవిలియన్కు చేరాడు. ఆది నుంచే లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ బాబర్.. అఖరికి హాసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన బాబర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్లో భారత్పై కేవలం 10 పరుగులు చేసి ఔటైన ఆజం..తర్వాతి మ్యాచ్లో పసికూన హాంగ్కాంగ్పై కూడా 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత్తో జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఏకంగా డకౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆజం తన టీ20 నెం1 ర్యాంక్ను కోల్పోయాడు. Babar azam aj apni taraf se Virat kohli ban'na chah raha tha lkn usy aj Rohit sharma ki trha rest krni chahye thi. #PAKvsSL — Huzaifa (@huzaifadotcom) September 9, 2022 ఈ క్రమంలో దారుణంగా విఫలమవుతున్న ఆజాంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పసికూనలపైనే బాబర్ సెంచరీలు సాధిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్పై ఆడుకో' అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. NO TOSS NO PARTY.😂#teampakistan #BabarAzam #AsiaCup2022 #AsiaCup2022Final #SLvPAK — Shraddha 💖 (@Shraddha__queen) September 9, 2022 చదవండి: Asia Cup 2022: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
పాకిస్తాన్ నటికి టీమిండియా మాజీ క్రికెటర్ దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మిశ్రాను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన యువతి.. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లయింది. విషయంలోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం అఫ్గనిస్తాన్.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్ర్కమించినట్లయింది. ఆఫ్గన్ గెలిచి ఉంటే భారత్కు ఎంతో కొంత ఫైనల్ అవకాశాలు మిగిలి ఉండేవి. కానీ ఆఖర్లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్ మ్యాచ్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారు. అలా కోరుకున్నవారిలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఒకవేళ అఫ్గనిస్తాన్ పాక్పై గెలిస్తే మాత్రం.. ఈ వారం మొత్తం ''అఫ్గన్ చాప్''ను తింటానని ట్వీట్ చేశాడు. అయితే అఫ్గనిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన నటి సెహర్ షిన్వరీ అమిత్ మిశ్రాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ''అఫ్గనిస్తాన్ ఓడిపోయింది.. పూర్ మిశ్రా.. ఈ వారం మొత్తం ఆవు పేడ తినాల్సిందే'' అంటూ కామెంట్ చేసింది. కాగా సెహర్ ట్వీట్కు వెంటనే బదులిచ్చిన అమిత్ మిశ్రా.. అయ్యో నాకు పాకిస్తాన్ వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చుసింది. అయితే బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినప్పటికి ఆఫ్గన్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతీసారి టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు పాక్ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్ను ప్రశంసించారు. 119కే 9 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నసీమ్ షా చివరి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. ఇక విజయంతో పాక్ ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది. ఈ ఆదివారం(సెప్టెంబర్ 11న) పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. Will eat Afghani chaap whole week if Afganistan defeats Pakistan today. Fingers crossed. #AFGvsPAK — Amit Mishra (@MishiAmit) September 7, 2022 No, I have no plans of coming to Pakistan. 👍 https://t.co/HbFWeZSjij — Amit Mishra (@MishiAmit) September 8, 2022 చదవండి: Naseem Shah: మ్యాచ్ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్ను అప్పుగా.. ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి మహాలక్ష్మీ పెళ్లి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలుస్తోంది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో సెప్టెంబర్ 1న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తామిద్దరం ఒక్కటయ్యామంటూ ఇద్దరు పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు వీరిద్దరి వివాహం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! దీనికి కారణం నిర్మాత రవీందర్ భారీ కాయం.. మహాలక్ష్మీ సన్నగా ఉండటమే. అప్పటి నుంచి ఈ జంటను ట్రోల్ చేయడం, రవిందర్పై బాడీ షేమింగ్ చేయడం చేస్తున్నారు నెటిజన్లు. ‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది.. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె పెళ్లి చేసుకుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై స్పందించింది ఈ జంట. ఆయన బరువు తనకు పెద్ద సమస్య కాదని చెప్పి ట్రోలర్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నటి మహాలక్ష్మి. ‘నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పాను. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్డిస్క్లు బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఫారెన్ వెళ్లి ట్రాన్స్ఫాం అవుతా అన్నారు. కానీ అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్టే ఉండండి అని చెప్పాను’ అని మహాలక్ష్మి అన్నారు. ఆ తర్వాత తమ జంటపై కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్ నేల్స్ చూసి ఇద్దరం నవ్వుకున్నామని చెప్పారు. ఇక నిర్మాత రవిందర్ మాట్లాడుతూ.. నెగిటివ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోమన్నారు. ‘మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా మంది మాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మరికొందరు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నాపై బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎదుటివారి లైఫ్ అనేసరికి అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను’ అని ఆయన చెప్పుకొచ్చారు. -
రోహిత్ తప్పు చేశాడా!.. పంత్ను పక్కనబెట్టడంపై విమర్శలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు రిషబ్ పంత్ను పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆసియా కప్ 2022లో భారత్కి ఇదే ఫస్ట్ మ్యాచ్కాగా.. పవర్ హిట్టర్గా పేరొందిన రిషబ్ పంత్ని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ని తుది జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. కాగా రోహిత్ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు కురిపించారు. అయితే జట్టులో ఒకటి నుంచి ఏడో స్థానం వరకు జడేజా మినహా ఒక్క లెఫ్ట్ హ్యాండర్ లేడు. జట్టు సమతుల్యంగా ఉండాలంటే లెఫ్ట్, రైట్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న లాజిక్ రోహిత్ ఎలా మరిచిపోయాడని అభిమానులు పేర్కొన్నారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్కప్ తర్వాత దినేశ్ కార్తీక్ కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా మ్యాచ్లను చక్కగా ఫినిష్ చేస్తూ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా షాట్స్ ఆడేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరీ ముఖ్యంగా.. జట్టు గెలుపు ముంగిట నిలిచిన దశలోనూ అతను తన ఆటతీరుని మార్చుకోవడం లేదు. దాంతో.. అతను తన వికెట్కి విలువ ఇవ్వడం లేదనే అపవాదు ఉంది. పాకిస్థాన్తో ఒకవేళ చివరి నాలుగు ఓవర్లలో క్రీజులో నిలిచిన మ్యాచ్ని ఫినిష్ చేయాల్సి వస్తే? రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్ను ఆడించడమే మంచిదని టీమిండియా భావించి ఉంటుంది. Leaving out Rishabh Pant is a huge call and a sign towards the favoured line-up at the T20 World Cup. It is also an acknowledgement of how India want to play with DK as a power finisher. Don't be surprised to see Jadeja at no 5 today, though. — Harsha Bhogle (@bhogleharsha) August 28, 2022 #AsiaCup2022. I can't belief @RishabhPant17 was replaced by @DineshKarthik. Unfathomable. Who thinks DK is better wicket keeper Batsman than Pant? He can single handedly win manchestar for God's sake. — Chetan Thaker (@ChikooThaker) August 28, 2022 చదవండి: IND Vs PAK Fakhar Zaman: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం.. -
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్ అదే తరహా ఫన్నీ ట్వీట్తో మెరిశాడు. కాగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్ నుంచి సెంట్కిట్స్కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నిలోలస్ పూరన్ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..'' ముందస్తు ప్లాన్ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ''మ్యాచ్ గెలవడానికి.. లగేజీ లేట్ కావడానికి మీరే పక్కా ప్లాన్ చేయలేదు కదా అని రోహిత్ పూరన్ ప్రశ్నించడం జాఫర్ చేసిన క్యాప్షన్కు అర్థం. జాఫర్ ట్వీట్ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్ ఫన్నీ ట్వీట్ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్కు ఎంత కష్టం! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్గా -
నయన్ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తొలి సౌత్ లేడీ సూపర్స్టార్గా ఎదిగింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆమెకు దక్షిణాన విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. అలాంటి నయన్పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో సదరు నిర్మాతపై నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో రీసెంట్గా సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఈ సందర్భంగా సామ్ను ప్రస్తుతం సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. 'సౌత్లో బిగ్గెస్ట్ హీరోయిన్ అయిన నయనతారతో ఇటీవల నేను ఓ సినిమాను చేశాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పరోక్షంగా నయనతార పేరు చెప్పంది సమంత. అయితే దీనికి కరణ్ ‘కానీ.. తను నా జాబితాలో లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కరణ్ కామెంట్స్పై నయన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయన్ను గుర్తించలేదనడం ఇది ఆమెను కించపరిచనట్లే అంటున్నారు. @Samanthaprabhu2 Is such a Sweetheart & Sharing her Lovable bond with #Nayanthara ❤️ @karanjohar She is not far in your list coz Your list is full of Nepo-Products which doesn’t deserve any arguements and discussions. #KoffeeWithKaran #LadySuperStar pic.twitter.com/TDUXGT871Z — A. (@ursavian) July 21, 2022 అంతేకాదు స్టుపిడ్ కాఫీ విత్ కరణ్ షోలో నయనతారు అవమానించే అర్హత ఆయనకు లేదు. తను సాధించిన విజయంలో కనీసం సగం కూడా నువ్వు సాధించేలేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండ తన సొంతగా స్టార్గా ఎదిగారు. మీలా నెపోటిజంతో ఎదగలేదు’, ‘ఇంతకి ఈ కరణ్ జోహార్ ఎవరూ?’ అంటూ కరణ్ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ధర్మ ప్రొడక్ష్న్, కరణ్ జోహార్ను అసలు బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వేదికగా కరణ్పై నయన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్గా మారింది. Karan Johar doesnt have any right to shame #Nayanthara on his stupid Koffee show. You cannot even achieve half of what she has achieved. She is self made not like you Nepo bitch.#Samantha we love you for giving it right back to that Nepo crap and for being so lovely — VISHNU (@VishnuTweets2U) July 22, 2022 #KaranJohar 🤡 list doesn’t determine the number one actress. #nayanthara is lady super star and will always be the queen of South Indian cinema. Her movie and acting proves that. She doesn’t need to be in anyone’s list for that😏 — Funny Humans (@FunnyHumans1) July 21, 2022 Sorry, but karan johar who? #Nayanthara pic.twitter.com/T0NkBXrM8g — 𝐏 𝐫 𝐢 𝐲 𝐚 (@xxgoldenroses) July 21, 2022 🐍 @karanjohar is bullying outsiders to promote his nepo betis. But Thalaivi is sending love and motivating the very same nepo stars ❤️ That's queen for you 🥺 Don't even think about belittling this amazing human ~ #Ladysuperstar #Nayanthara ~#KoffeeWithKaran pic.twitter.com/eHLs5Rgt1b — Theladysuperstarclub (@Nayantharian) July 24, 2022 The way Kjo disrespected #Nayanthara breaks my heart💔 I mean how can someone be this cocky and disrespectful towards such an actor... Never liked him..but now, he's seriously a waste material and nothing else. — Parth (@ParthK_23) July 22, 2022 -
బన్నీ షాకింగ్ లుక్ వైరల్, ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు
Trolls On Allu Arjun New Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సౌత్లో విపరితమైన క్రేజ్ ఉంది. ఆయన స్టైల్కు, మ్యానరిజంకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా పుష్ప మూవీతో నార్త్లో సైతం మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు బన్నీ. ఈ సినిమాలో పుష్పరాజ్గా అతడు సంపాదించుకున్న క్రేజ్అంతా ఇంత కాదు. చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్ రియాక్షన్ చూశారా! తగ్గేదే లే అనే డైలాగ్తో అల్లు అర్జున్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అందుకే పుష్ప డైలాగ్స్ను కేవలం దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఫాలోయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపించింది. ఇక శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ను ప్రతి ఒక్కరు అనుసరించారు. అంతలా పుష్ప మూవీలో తన లుక్, ఆటిట్యూడ్తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్పై నార్త్ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్తో పాటు భారత్లోని పలు లోకేషన్లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ను జరుపుకుంటుంది. ఇటీవల హైదరాబాద్ ఈ మూవీ షూటింగ్ను జరుపుకోగా ఇందుకు సంబంధించిన బన్నీ లుక్ లీకైంది. మానవ్ మంగ్లాని అనే బాలీవుడ్ ఫొట్రోగాఫర్ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో బన్నీ కాస్తా బొద్దుగా.. గుండ్రాలు తిరిగిన హేర్ స్టైల్తో దర్శనం ఇచ్చాడు. ఇక లావుగా తయారైన బన్నీ లుక్పై నార్త్ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ వడా పావ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్ మలింగా లా ఉన్నాడు’, ‘ఓ మై గాడ్ స్టైలిష్ స్టార్కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అల్లు అర్జున్? బాబోయ్ చాలా బరువెక్కాడు’’ అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ ఇక మరికొందరు నెటిజన్లు బన్నీ వస్తున్న ట్రోల్స్ను ఖండిస్తూ ‘పుష్ప: ది రూల్ కోసం ఆయన కాస్తా లావుగా తయారవ్వాల్సి ఉంది. అందుకే ఆయన బరువెక్కారు’ అంటూ వివరణ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప 2లో బన్నీ కాస్తా బోద్దుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర(రష్మిక మందన్నా) చనిపోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్లోపై నిర్మాత వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఓ చానల్తో ముచ్చటించిన ఆయన శ్రీవల్లి పాత్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు పూర్తి కథ తామే వినలేదని, ఇవన్ని వట్టి పుకార్లలేనిన కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్కు ఖరీదైన కారు గిఫ్ట్గా.. ఒక్కదానికే! -
అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్ పిచ్ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ''లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్ కనిపించింది. గతంలో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య అహ్మదాబాద్ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్ పిచ్ను ట్రోల్చేస్తూ.. సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్ కరూన్ తూ సాలా క్యారక్టెర్ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్బాల్ టెస్టు(డే నైట్) ఆడింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు.. ఓవరాల్గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్ తయారు చేశారని.. ఇలాంటి పిచ్పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. అయితే అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers. When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3 — Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022 -
'అదృష్టం అంటే అతడిదే.. సరిగా ఆడకపోయినా.. నుదుటన రాసిపెట్టి ఉంది'
ఐపీఎల్లో అదృష్టవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయ్ శంకర్ మాత్రమే. కాకపోతే చెప్పండి.. వేలంలో విజయ్ శంకర్పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. మల్టీ డైమన్షల్ ప్లేయర్గా ముద్రించుకున్న విజయ్ శంకర్ ఐపీఎల్లో ఏన్నాడు పెద్దగా మెరిసింది లేదు. ఈ సీజన్లోనూ నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన విజయ్ శంకర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. తన ఆటతీరుతో జట్టుకు భారమయ్యాడు తప్ప అతని వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించిన హార్దిక్.. అతన్ని బెంచ్కే పరిమితం చేశాడు. PC: IPL Twitter అయితే నుదుటన అదృష్టం రాసిపెట్టి ఉంటే మ్యాచ్లు ఆడకపోయినా టైటిల్ కొల్లగొట్టిన జట్టులో సభ్యుడిగా ఉండడం విజయ్ శంకర్కు మాత్రమే చెల్లింది. అతని విషయంలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2016లోనూ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులోనూ విజయ్ శంకర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇంకో విచిత్రమేంటంటే ఆ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో వార్నర్ సేన విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. 2016లో ఎస్ఆర్హెచ్ తరపున(PC: IPL Twitter) దీంతో అభిమానులు విజయ్ శంకర్ను తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''అదృష్టమంటే విజయ్ శంకర్దే.. సరిగా ఆడకపోయినా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో భాగస్వామ్యమయ్యాడు.. బహుశా ఇలాంటి రికార్డు విజయ్ శంకర్కు మాత్రమే సాధ్యమైందనుకుంటా'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక ఐపీఎల్ 15వ సీజన్లో ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ కొల్లగొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' -
మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. యూట్యూబ్ వేదికగా తరచూ హోంటూర్స్, ఇంట్లో సెలబ్రెషన్స్కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోకు నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తన షూ కలెక్షన్స్ సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తన ముందుకు 4 నుంచి 5 జతల షూలను ముందు పెట్టి బుగ్గ మూతి పెట్టుకని ఫొటోకి ఫోజ్ ఇచ్చింది. దీనికి ‘ఎప్పడూ సరైన షూ దొరకదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిని కొందరు ఆమె నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట’, ‘నీ దగ్గర అన్ని జతలు ఉంటే.. అందులో కొన్ని పేద వాళ్లకు పంచోచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరూ ‘అంతేకాదు చెప్పులు షాప్ పెట్టారా?’, ‘షూ స్మగ్లర్’ అంటూ తన పోస్ట్పై ఫన్నీగా స్పందిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ పోలీసు ఆఫీసర్ పాత్ర పోషిస్తుందని సమాచారం. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
దేశీ లిక్కర్ తాగారా? అంటే.. అమితాబ్ రిప్లై ఇది!
ముంబై: సెలబ్రిటీలకు విమర్శలు, ఇంటర్నెట్ ట్రోలింగ్ కొత్తేం కాదు. అయితే ట్రోలింగ్కు అంతే దీటుగా బదులివ్వడం బచ్చన్ ఫ్యామిలీ బ్లడ్లోనే ఉంది. తాజాగా సీనియర్ బచ్చన్కు సోషల్ మీడియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ముసలోడు.. తాగుబోతు అంటూ నోటికొచ్చినట్లు ఆయన ఫేస్బుక్ వాల్పై కామెంట్లు చేశారు కొందరు. అయితే పెద్దాయన మాత్రం ఓపికగా ఆ విమర్శలకు చాలా చాలా హుందాగా కౌంటర్లు ఇస్తూ వెళ్లారు. విషయం ఏంటంటే.. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా బిగ్బీ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో(ఫేస్బుక్లో) గుడ్మార్నింగ్ పోస్ట్ చేశారు. కాకపోతే అది కాస్త ఆలస్యం అయ్యింది. ఉదయం 11.26కి ఆయన గుడ్ మార్నింగ్ పోస్ట్ పెట్టారు. ఇదే విమర్శలకు కారణమైంది. దీంతో చాలావరకు కామెంట్లకు అంతే ఓపికగా సమాధానం ఇస్తూ వెళ్లారు ఆయన. బహుశా దేశీ లిక్కర్ తాగి ఉంటాడేమో అందుకే.. ఈ టైంకి గుడ్ మార్నింగ్ పెట్టాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. తాను అసలు తాగనని చెబుతూ.. తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన మధుశాలలోని ఓ లైన్ పోస్ట్ చేశారు. మరి ఈ టైంలో గుడ్ మార్నింగ్ఏంటని మరో వ్యక్తి ప్రశ్నించగా.. లేట్ నైట్ షూటింగ్తో ఆలస్యం అయ్యిందని, అది పూర్తయ్యే సరికి ఉదయం అయ్యిందని, ఆలస్యంగా లేచినందుకే పోస్ట్ చేశానంటూ బదులిచ్చారాయన. ఇక అగౌరవంగా కామెంట్లు చేసిన వాళ్లకు సైతం అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘ఇది మధ్యాహ్నాం రా ముసలోడా..’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘దీర్ఘకాలం నువ్వు జీవించాలంటూ ఆశీర్వదించిన అమితాబ్.. నిన్ను మాత్రం ఎవరూ ముసలోడా అంటూ పిలిచి అవమానించకూడదంటూ కోరుకుంటున్నట్లు’’ కౌంటర్ ఇచ్చారు బిగ్ బీ. ఇలా ఎవరైతే తనపై సెటైర్లు వేసేందుకు ప్రయత్నించారో.. వాళ్లందరిపైనా ఆయన తన వాక్ చాతుర్యం ప్రదర్శించారు. విలువలేని సూపర్స్టార్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. పని వల్ల లేచేసరికి ఆలస్యం అయ్యింది ‘విలువైన మనిషి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా.. చాలావరకు ఓపికగా ట్రోలింగ్కు కౌంటర్లు వేస్తూ వెళ్లారు 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఆయన రణ్బీర్ కపూర్-అలియాభట్ ‘బ్రహ్మస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి అమిర్ ఖాన్ ముందే బికినీలో కేక్ కటింగ్.. ట్రోలింగ్పై కౌంటర్ -
పొట్టు పొట్టు చినిగిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం
పారిస్: అరచేతిలో ఫోన్ ద్వారానే ఆర్డర్లు చేసుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బయటి మార్కెట్ల కన్నా.. ఆన్లైన్లోనే ఇప్పుడు అడ్డగోలు ప్రొడక్టులు దర్శనమిస్తున్నాయి. అదే టైంలో చిత్రవిచిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి. తాజాగా బాగా పేరున్న ఓ కంపెనీ వాళ్లు చేసిన పని.. సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావడం లేదు. అందుకు కారణం.. పొట్టు పొట్టుగా చినిగిన షూస్ను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం. లగ్జరీ బ్రాండ్లకు కేరాఫ్ అయిన ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్ స్నీకర్ కలెక్షన్ పేరుతో లాంచ్ చేసింది. ఈ షూస్ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా పనికి రానంతగా! Balenciaga's New "Fully Destroyed" Shoe Set👟 x R36 000 per pair💵 Would you wear these? pic.twitter.com/oEduoUs1Fj — claztik🕊 (@claztik17) May 11, 2022 కానీ, వాళ్లు ఆ షూస్ను రిలీజ్ చేసింది వేసుకోవడానికేనట. పైగా అదే ఫ్యాషన్ అని ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్ను రిలీజ్ చేయగా.. మినిమమ్ ధర 495 డాలర్లు (మన కరెన్సీలో 38 వేల డాలర్లు) నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు (మన కరెన్సీలో లక్షా 44 వేల రూపాయల) దాకా ఉంది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్ను లిమిటెడ్ ఎడిషన్ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్ చేసిందట. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్ సైతం ఉంచింది బలెన్షియాగా. ఇంత దరిద్రాన్ని చూశాక ట్రోల్ రాజాలు ఊరుకుంటారా?.. ఆ ప్యాషన్ను పేకాట ఆడేసుకుంటున్నారు. Nueva Barbie Balenciaga pic.twitter.com/Wg9RCIvViA — Zorrito Zorrales (@ZorritoZorrales) May 9, 2022 Anyone who buys Balenciaga needs to go see the therapist https://t.co/xHG5N75x9y — Shabib Siddiqui 👨🏻🦯 (@shabibazam) May 10, 2022 -
హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్టాపిక్గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్కు కళ్లు చెదిరే ఆఫర్స్ నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు. చదవండి: లెటెస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారా? అయితే..
Cyberbullying Prevention Tips: కొట్టి చంపడానికి కర్రలు, రాళ్లు అక్కర్లేదు. కొన్ని పదాలు కూడా చంపగలవు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతటా ఉంటోంది. కుటుంబాలు, స్నేహితులు, ప్రకటన దారులు, ప్రముఖులు, సంస్థలు.. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉపయోగిస్తున్నారు. ఓ ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వే సంస్థ ప్రకారం మన ప్రస్తుత ప్రపంచ జనాభా 7.75 బిలియన్లు ఉంటే ఇంటర్నెట్లో 4.54 బిలియన్లు, మొబైల్లో 5.19 బిలియన్లు, సోషల్ మీడియాలో 3.8 బిలియన్ వినియోగదారులు ఉన్నారు. సగటున కనీసం 25% మంది వినియోగదారులు తమ వినియోగ సమయంలో నిస్సందేహంగా ఏదో ఒకరకమైన సోషల్ మీడియా ట్రోల్కు లోనవుతున్నారు. ఇంటర్నెట్లోని దాదాపు ప్రతిమూలలో కనిపించే రుగ్మత ఏకైక ఉద్దేశం వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ట్రోల్ లేదా సోషల్ మీడియా సైట్లలో సంఘర్షణను, సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇది ఒక వ్యక్తి సామాజిక శ్రేయస్సు, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆన్లైన్ ట్రోలింగ్ దుర్వినియోగం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యక్తిగత గుర్తింపు, విశ్వసనీయత, ఆర్థిక, ఇతర పరిణామాలకు దారితీయవచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలతో సాంకేతిక దుర్వినియోగం జరుగుతోంది. అవమానించే చర్యలకు పాల్పడటం, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం, విభేదాలను, వివాదాలను సృష్టించే ఉద్దేశంతోనే ఒక వ్యక్తి ట్రోల్కి పాల్పడతాడు. ట్రోల్కి అడ్డా... ట్రోల్ చేసేవారు నకిలీ ఆన్లైన్ అకౌంట్లను సృష్టిస్తారు. ఇలాంటివారు బ్లాగింగ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, ఇంటర్నెట్ చాట్రూమ్లు, ఇమెయిల్స్/వాట్సప్ గ్రూప్స్, చర్చావేదికలు, బ్లాగులు.. లేదా ఏదైనా ఇతర ఆన్లైన్ ఫార్మాట్లలోనో పొంచి ఉంటారు. గుర్తించే విధం... ట్రోల్ చేసిన వారి బయోడేటా, పేరు, ఫొటో అస్పష్టంగా ఉంటాయి. ఫేక్ ఐడీలను సృష్టిస్తారు. వారు ఎక్కడ నుండి వచ్చారు, పని ఏంటి.. అనే విషయాలన్నీ అస్పష్టంగానే ఉంటాయి. వీరికి తక్కువమంది ఫాలోవర్లు ఉంటారు. వీరి పోస్ట్లు చాలా వరకు ఇతరులతో సంభాషణ, డైలాగ్లు పంచుకున్నట్టు ఏమాత్రం కనిపించవు. చాలా తక్కువమంది వ్యక్తుల పోస్ట్ల రీ ట్వీట్ చేయడం వంటివి గమనింవచ్చు. కోపంగా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారు. ∙అనేక సంస్థలు లేదా ప్రస్తుత సమస్యతో సంబంధం లేని వ్యక్తులను ట్యాగ్ చేస్తారు. అభ్యంతరకరమైన, దూషించే భాషను ఉపయోగిస్తారు. ∙తరచూ వ్యాఖ్యల వరదను పోస్ట్ చేసి, ఆపై టాపిక్ని మారుస్తారు. మీ పనికి సంబంధించిన సమస్యలపై చాలా అరుదుగా పోస్ట్ చేస్తారు. పెస్ట్ కంట్రోల్... పంటను కాపాడుకోవడానికి పురుగు మందులను ఎలా ఉపయోగిస్తామో, అలాగే సామాజికంగా ఉండాలనుకునేవారు ప్రతికూల వ్యాఖ్యలను నివారించడానికి సిద్ధంగా ఉండాలి. మీ వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ప్రతికూల వ్యాఖ్యలను జాగ్రత్తగా నిర్వహించినప్పుడే వాటికి విలువ పెరుగుతుంది. విస్మరిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదో తప్పు జరిగేవరకు వేచి చూడకూడదు. సంస్థాగత దృక్కోణమూ అవసరమే.. ►ఆన్లైన్లో మీ కమ్యూనిటీ హౌస్ రూల్స్ ఏంటో తెలుసుకోండి. ∙సరైన టూల్స్ని ఎంపిక చేసుకోవాలి. ►మీ కాంటాక్ట్స్ జాబితాలో అత్యవసరంలో స్పందించేది ఎవరో గుర్తించండి. ►మీరు నిర్వహిస్తున్న ఛానెల్ చట్టపరమైన, నియంత్రణ, నైతిక అవసరాలనే గుర్తించండి. ►గత అనుభవాలను ఆధారంగా తీసుకొని జాగ్రత్త పడటం మంచిది. వ్యక్తిగత దృక్కోణం... ►ఎలాంటి వ్యాఖ్యలు అనుమతిస్తారో, ఎలాంటివి అనుమతించరో ముందే ఒక విధానాన్ని రూపొందించుకోవచ్చు. ∙మీ సామాజిక ప్రొఫైల్ను తనిఖీ చేసినట్టుగా ఉంటే, ట్రోలర్ గుర్తింపును సులువుగా తెలుసుకోవచ్చు. ►మీ వెబ్సైట్/సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయితే మీరు ‘చెడు’ అనే వ్యాఖ్యలను తొలగించవచ్చు లేదా సభ్యుల జాబితా నుంచి తొలగించవచ్చు. ►మీ సైట్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మోడరేట్ని ఉపయోగించండి. ►మీకు భారీ ఫాలోవర్ జాబితా ఉంటే ఆన్లైన్ టూల్ని కొనుగోలు చేయండి. ►మీ చుట్టూ ఒక అనుచరులను సంఘాన్ని సృష్టించవచ్చు. వీరిలో నిష్ణాతులను ఎంపిక చేసుకోవచ్చు. ►కామెంట్ /వ్యాఖ్యకు వెంటనే రిప్లై ఇవ్వడం మంచిది. దీనివల్ల రాబోయే వివాదానికి ముందే అడ్డుకట్టపడుతుంది. ►మీవల్ల తప్పు జరిగిందని భావిస్తే వెంటనే ‘క్షమించండి’ అని చెప్పండి. దీనివల్ల చాలాసార్లు ట్రోల్కు అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడా. ‘ట్రోల్’... రిపోర్ట్... ఎ) మీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్నే ఒక రిపోర్ట్గా తీసుకోవచ్చు బి) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. సి) ఆన్లైన్లో https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. డి) డిజిటల్ వెల్బీయింగ్, ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూప్లు ఐ ఉఅ, ఇఈఅఇ విభాగం, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ గర్ల్, సైబర్ జాగృతి, CyberPsy, పోలీస్ మహిళా భద్రతా విభాగం, మహిళలు, పిల్లలు, యుక్తవయస్కులు, ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవడానికి వాలంటీర్ల నిర్వహణలో ఉన్న అనేక ఇతర సంస్థల సిబ్బందికి తెలియజేయవచ్చు. ట్రోల్కి ప్రధాన కారణం మానసిక సమస్యలే! మూడేళ్లుగా ట్రోలింగ్ చేసేవారి ప్రవర్తనను అధ్యయం చేశాం. మానసిక సమస్యల కారణంగానే ట్రోలర్స్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అని తెలుసుకున్నాం. ఈ విషయంపై మనస్తత్వవేత్తలు, డిజిటల్ వెల్బీయింగ్ నిపుణులతో చర్చించి నిర్ణయానికి వచ్చాం. ట్రోల్ చేసేవారిలో.. తీవ్రమైన సామాజిక, మానసిక సమస్యలను గుర్తించాం. లైంగిక సమస్యలు ఎదుర్కొనేవారు ముఖ్యంగా.. బాల్యంలో వేధింపులకు లోనైనవారు, మానసిక ఆరోగ్యసమస్యలు ఉన్నవారు, జంతుప్రవృత్తి గలవారిలో, రాజకీయ లేదా వ్యక్తిగత ద్వేషం ఉన్నవారు ట్రోల్కి పాల్పడుతుంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడినవారు ఉన్నారని తెలిసింది. ట్రోలింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్బుల్లీ... వీటన్నింటి మధ్య ‘వేధింపు’ అనే ఒక కత్తి ఉందన్నది వాస్తవం. సైబర్ బెదిరింపు, ట్రోలింగ్ సమస్య అంతం కానప్పటికీ చట్టం అమలు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేసే స్వచ్ఛంద సమూహాల విస్తరణ ప్రజలకు పోరాడటానికి, గెలవడానికి అవకాశం కల్పిస్తోంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి👉🏾 నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు.. -
'మా కెప్టెన్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయలేడు..'
ఐపీఎల్ 2022 సీఎస్కే మరో పరాజయం చవిచూసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆఖరి వరకు పోరాడినప్పటికి 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఇది ఆరో ఓటమి. దీంతో సీఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లినట్లే. ఇక సీఎస్కే కెప్టెన్గా రవీంద్ర జడేజా తేలిపోయాడని అభిమానులు కామెంట్స్ చేశారు. అతను మామూలు ఆటగాడిగా ఉంటేనే ఆడతాడని.. కెప్టెన్సీ భారం అతనిపై స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆల్రౌండర్ అనే ట్యాగ్ ఉన్న మా కెప్టెన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏది చేయలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 88 పరుగులు నాటౌట్గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించగా.. బానుక రాజపక్స 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అంబటి రాయుడు 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు వీరోచిత పోరాటం చేసినప్పటికి లాభం లేకపోయింది. రుతురాజ్ 30, జడేజా 21 పరుగులు నాటౌట్గా నిలిచాడు. చదవండి: IPL 2022: 'ఆ రెండు జట్లు కచ్చితంగా ప్లేఆఫ్స్కు చేరుకుంటాయి' That's that from Match 38.@PunjabKingsIPL win by 11 runs. Scorecard - https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL pic.twitter.com/7tfDgabSuX — IndianPremierLeague (@IPL) April 25, 2022 Well played sir jadeja 🌚🥲 #PBKSvCSK #CSK𓃬 #ChennaiSuperKings #IPL2022 #TATAIPL pic.twitter.com/RoXnfUbeN4 — Falak (@Falak55518) April 25, 2022 CSK and MI outside IPL playoffs #CSKvPBKS #CSKvsPBKS #PBKSvCSK #PBKSvsCSK #IPL2022 . pic.twitter.com/MUv0LSq9iY — Vishwajit Patil (@PatilVishwajit_) April 25, 2022 Ravindra jadeja jaddu to Dwaine Pretorius in today's match 🧐#PBKSvCSK #CSKvsPBKS #CSK𓃬 pic.twitter.com/68Xrsi1oU1 — Ashutosh Srivastava (@kingashu1008) April 25, 2022 -
కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాట్స్మన్గా ఇరగదీస్తాడనుకుంటే పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో కోహ్లి గోల్డన్ డకౌట్గా వెనుదిరిగాడు. దుశ్మంత చమీర బౌలింగ్లో తన ఆఫ్స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టిన కోహ్లి దీపక్ హుడాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు కోహ్లి ఏడు మ్యాచ్లు కలిపి చేసిన పరుగులు 119 మాత్రమే. ఒక టాప్క్లాస్ బ్యాట్స్మన్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ను ఏ అభిమాని కోరుకోడు. అయితే కోహ్లికి దురదృష్టం రూపంలో మరో బ్యాడ్లక్ కూడా ఈ సీజన్లో అదనంగా వచ్చి చేరింది. అవవసర పరుగుకు యత్నించి రెండుసార్లు రనౌట్ కావడం.. ఒకసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వడం జరిగాయి. ఈ లెక్కన కోహ్లికి అదృష్టం ఆమడదూరంలో ఉందని క్లియర్గా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఐపీఎల్ 2022లో కోహ్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని ఒక ఫోటో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ ఫోటోలో నాలుగు సందర్భాలు ఉన్నాయి. తొలి ఫోటోలో పడుకుందామంటే కళ్లకే వెళుతురు కొట్టడం.. రెండో ఫోటోలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బు మెషిన్లో ఇరుక్కొని చిరిగిన నోటు బయటికి రావడం.. ఇక మూడో ఫోటోలో.. ఊరించే కేక్ ముంద్ను తినలేని పరిస్థితి.. ఇక నాలుగో ఫోటో.. కోక్ తాగుదామంటే దాని మూత ఎలా తీయాలో అర్థం కాకపోవడం లాంటివి ఉన్నాయి. దీనర్థం కోహ్లి మంచిగా ఆడదామనుకుంటే ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడడం.. లేదంటే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జాఫర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Virat Kohli's luck these days: #LSGvRCB #IPL2022 pic.twitter.com/DZWKoP5u8n — Wasim Jaffer (@WasimJaffer14) April 19, 2022 -
బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్
Bharti Singh Epic Reply To Trolls: బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన ఆమె సెట్స్లో అడుగుపెట్టిందని, జన్మనిచ్చిన 12 రోజులకే ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోజుల బిడ్డనే అలా వదిలేసి డబ్బు కోసం షూటింగ్లో పాల్గొనడం అసలు బాగోలేదు అంటూ ఆమెను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీ సింగ్ ఈ ట్రోల్స్పై స్పందించింది. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు రీసెంట్గా ఖత్రా ఖత్రా షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న ట్రోల్స్కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘పసిబిడ్డ వదిలేసి అప్పుడే వచ్చావా? అంత తొందర ఏముందని చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు రావడం సాధారణమే. కానీ మనం పాజిటీవిటి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అందరిలా.. కొందరికి విశ్రాంతి తీసుకునే పరిస్థితులు లేకపోవచ్చు. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే వారు తిరిగి పనిలో నిమగ్నమవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు అలాగే తన కొడుకును చూసుకునేందుకు ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారని, బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడని స్పష్టం చేసింది. ‘ఖత్రా ఖత్రా షో మా డ్రీమ్ ప్రాజెక్ట్. మేం దాన్ని వదులుకోలేము. ‘‘అందరు ‘బేబీ చాలా చిన్నది.. అలా ఎలా వదిలేసి వస్తుందంటున్నారు’. అయితే నా బిడ్డ తల్లి పాలనే తాగుతున్నాడు. నా కొడుకు స్యయంగా నా పాలనే పట్టిస్తున్నాను’’ అని భారతీ సింగ్ వివరణ ఇచ్చింది. కాగా భారతీ గర్భవతి సమయంలో కూడా షూటింగ్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. చెప్పాలంటే తను బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు వరకూ కూడా షోను హోస్ట్ చేసింది. -
'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా ఆదివారం సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ లాగేసుకున్న విధానాన్ని జాఫర్ తనదైన శైలిలో వివరించాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక ఫేమస్ మీమ్ను జాఫర్ ఉపయోగించాడు. ఆ మీమ్ ఏంటంటే.. ఒక యువతి స్లీవ్లెస్ డ్రెస్తో రోడ్డుపై నిల్చొని తన బాయ్ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి బుజాన సంచి తగిలించుకొని యువతికి ఎదురుగా వస్తాడు. కాగా ఆ యువతి 40 ఏళ్ల వ్యక్తికి హగ్ ఇచ్చినట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ హగ్ తనకే ఇస్తుందేమోనని భ్రమపడి ఆమెను వాటేసుకుంటాడు.. కానీ ఆమె అతని వెనకాల ఉన్న తన బాయ్ఫ్రెండ్కు హగ్ ఇవ్వడానికి వెళుతుంది.. ఇది చూసిన ఆ 40 ఏళ్ల వ్యక్తి.. ''అరె.. మంచి చాన్స్ మిస్ అయిందే'' అన్నట్లుగా నాలుక కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మీమ్ అప్పట్లో ట్రెండింగ్గా మారింది. తాజాగా ఇదే మీమ్ను సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్కు ఉపయోగించాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో గుజరాత్ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక రెండో గెలుపు ఖాయమని సీఎస్కే భావించింది. కానీ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ను సీఎస్కే నుంచి లాగేసుకున్నాడు. 94* పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్కు.. స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్(40) తోడవ్వడంతో మ్యాచ్ చేజారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్థీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 73, రాయుడు 48, జడేజా 22* పరుగులతో రాణించారు. కాగా సీఎస్కేపై విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలవగా.. సీఎస్కే ఆరు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి.. మిగతా ఐదు ఓడి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: IPL 2022: క్యాచ్ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జడేజా.. వీడియో వైరల్ IPL 2022: కావ్యా మారన్.. ఆ నవ్వు ఇక ఆగేదే లే! This is exactly how Miller stole the win from CSK! #GTvCSK #IPL2022 pic.twitter.com/ASJHhBOytz — Wasim Jaffer (@WasimJaffer14) April 17, 2022 -
'జట్టు మారినా ఆటతీరు మారలేదు.. తీసి పారేయండి!'
ఒకప్పుడు మల్టీ డైమన్షన్ ప్లేయర్గా పిలవబడిన విజయ్ శంకర్ ఐపీఎల్ 2022లో అదే చెత్త ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో విజయ్ శంకర్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. 2 పరుగులు చేసిన విజయ్ శంకర్ కుల్దీప్ సేన్ బౌలింగ్లో ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. Courtesy: IPL Twitter ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి తన బలహీనతను మాత్రం వదల్లేకపోతున్నాడు. అదే రొడ్డకొట్టుడు ఆటతో అభిమానులను విసిగిస్తున్నాడు. గత సీజన్ వరకు ఎస్ఆర్హెచ్కు ఆడిన విజయ్ శంకర్ పెద్దగా ఒరగబెట్టిందేం లేదు. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో విజయ్ శంకర్ను గుజరాత్ టైటాన్స్ రూ. కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్లు ఆడిన విజయ్ శంకర్ 4,13 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తాజాగా అవకాశం ఇచ్చినప్పటికి విజయ్శంకర్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు.''ఎన్ని జట్లు మారినా నీ ఆటతీరు మారదు.. అదే నిర్లక్ష్యం.. విఫలమవుతున్న క్రికెటర్కు ఎందుకు అవకాశాలిస్తున్నారు.. తీసి పారేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Shimron Hetmyer: 'నా టైం వృథా చేస్తున్నావు.. దయచేసి పిజ్జా, బర్గర్ తిననివ్వు' FIFA WC Vs IPL 2022: షాకింగ్.. ఫిఫా వరల్డ్కప్ను దాటేసిన ఐపీఎల్ -
ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా
Rashi Khanna Clarity On Her Comments Over South Industry: ప్రస్తుతం రాశీ ఖన్నా దక్షిణాది ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీనికి కారణంగా ఇటీవల సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే. సౌత్ సినిమాలు రొటిన్గా ఉంటాయని, అక్కడ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రాశీ ఖన్నాపై దక్షిణాది ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీ కెరీర్లో ఎన్నో సక్సెస్లు, స్టార్డమ్ ఇచ్చిన దక్షిణాది పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు ఆమెకు క్లాస్ పీకుతున్నారు. చదవండి: యాక్షన్ ఫిల్మ్స్ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్ సినిమాలే..: వరుణ్ తేజ్ ఇక తనపై వస్తున్న వ్యతిరేకతను చూసి రశీ దిగొచ్చింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. దక్షిణాది పరిశ్రమపై తాను విమర్శ వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘నేను సౌత్ ఇండస్ట్రీని దూషించలేదు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు సమానమే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేనంటే గిట్టని వాళ్లు ఎవరో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఇది ఆపండి. దయ చేసి నాపై వస్తున్న ఈ వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నా’ అంటూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్బాస్ బ్యూటీ కాగా ఇటీవల హిందీలో ఆమె నటించిన రుద్ర వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ‘దక్షిణాది సినిమాలు రొటిన్గా ఉంటాయి. అది నాకు నచ్చకపోయిన చెయాల్సి వచ్చింది. అలా రొటిన్కు అలవాటు పడిపోయాను. అక్కడ హీరోయిన్కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలా కనిపించి ఇలా కనుమరుగైపోతుంది. అంతేకాదు అక్కడ హీరోయిన్లకు మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్లు కూడా ఇస్తారు. ఇది నాకు అసలు నచ్చని విషయం. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఇకపై మీరు ఓ కొత్త రాశీని చూస్తారు’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి. 🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY — Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022 -
'అవకాశమొచ్చినా ఉపయోగించుకోరు.. అదే మన దరిద్రం'
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సొంతజట్టు ఆటతీరుపై మరోసారి విమర్శలు సంధించాడు. మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం వచ్చినప్పటికి దానిని ఉపయోగించుకోలేకపోవడం మనకు మాత్రమే చెల్లిందంటూ తెలిపాడు. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ ఆరంభాన్ని ఘనంగానే ఆరంభించింది. షాహిన్ అఫ్రిది తొలి ఓవర్లోనే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కాగా ఫించ్కు అఫ్రిది బౌలింగ్లో ఇది వరుసగా రెండో గోల్డెన్ డక్ కావడం విశేషం. ఈ గొప్ప ఆరంభాన్ని పాక్ బౌలర్లు వినియోగించుకోలేకపోయారు. ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్, వన్డౌన్లో వచ్చిన బెన్ మెక్డెర్మొట్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వారికి ఏ మాత్రం అవకాశమివ్వని హెడ్, మెక్డెర్మొట్లు బౌండరీల వర్షం కురిపించారు. ఈ దశలోనే హెడ్ 89 పరుగులు చేసి ఔటవ్వగా.. మెక్ డెర్మోట్ 104 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి తర్వాత లబుషేన్ కూడా 59 పరుగులు చేయడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు దిశగా పరుగులు తీసింది. ఈ నేపథ్యంలోనే అక్తర్ మరోసారి బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టును విమర్శించాడు.''ఆట ఎలా ఆడాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోండి. ఆ జట్టు ఆరంభంలోనే ఫించ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ట్రెవిస్ హెడ్, మెక్ డెర్మొట్లు ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్బుతం. ఈ రోజుల్లో ఒక వన్డే మ్యాచ్ ఎలా ఆడాలో వీరిని చూసి నేర్చుకోండి. అవకాశం వచ్చినా ఉపయోగించుకోకపోవడం మనకు అలవాటైపోయింది.. అదే మన దరిద్రం''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంతకముందు కూడా అక్తర్ మూడో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ ఆడిన తీరును తనదైన శైలిలో ఎండగట్టాడు. చదవండి: AUS vs PAK: పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్ డక్ Australia giving us a proper reminder again that this is how ODIs are supposed to be played these days :) — Shoaib Akhtar (@shoaib100mph) March 31, 2022 -
'నీ బౌలింగ్ వల్ల ఒరిగేదేం లేదు'.. హార్దిక్ను ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్
ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఇటీవలే తమ జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జై షా.. జట్టు ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. సమావేశంలో భాగంగా బౌలింగ్ చేస్తారా లేదా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ.. ‘‘సర్.. అది సర్ప్రైజ్.. సర్ప్రైజ్లాగే ఉండనివ్వండి’’ అంటూ సమాధానం దాటవేశాడు. ఇప్పుడు ఈ సమాధానమే పాండ్యా కొంపముంచింది. పాండ్యా బౌలింగ్ చేయాలా వద్దా అన్న దానిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.''పాండ్యా ఏదో గ్రేట్ బౌలర్లా ఫీలవుతున్నాడు. ఆల్రౌండర్ అని చెప్పుకుంటున్న హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ను దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్తో పోల్చుకుంటున్నాడు'' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. ''నువ్వు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్వి మాత్రం కాదు బ్రో.. నీ బౌలింగ్ చూడడం వల్ల మాకు ఒరిగేదేం లేదు''.. ''అందులో సర్ప్రైజ్ ఏముంది.. బౌలింగ్ వేస్తావా.. వేయవా అనేదానికి అవును.. కాదు అనే సమాధానం ఇస్తే సరిపోయేదిగా..'' అంటూ ట్రోల్స్తో రెచ్చిపోయారు. ఇక ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్ వస్తేనే హార్ధిక్ ఐపీఎల్ 2022 సీజన్లో బౌలింగ్ వేసే అవకాశముంది.కాగా గతంలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యాను మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి గుజరాత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా Lewis Hamilton: పేరు మార్చుకోనున్న స్టార్ ఆటగాడు.. కారణం? 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ Hardik 😂😂 pic.twitter.com/805zI9e8ac — Sports Hustle (@SportsHustle3) March 13, 2022 -
ధోనికి అవమానం.. గరం అవుతున్న అభిమానులు!
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి అవమానం జరిగింది. ధోని బాడీ షేప్ గురించి ఆకతాయిలు ట్విటర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2022 సందర్బంగా అందరికంటే ముందే సీఎస్కే సూరత్ వేదికగా క్యాంపెయిన్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించింది. తాజాగా ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలను సీఎస్కే తన ట్విటర్లో పంచుకుంది. ఇది చూసిన ఒక అభిమాని.. ''శరీరం పూర్తిగా మారిపోయింది.. మునుపటిలా ఫిట్గా కనిపించడం లేదు... 40 ఏళ్లు వచ్చాయిగా అందుకే ధోని ఇలా ఉన్నాడు'' అంటూ కామెంట్ చేశాడు. మరొక అభిమాని తలాను చూస్తే ''సీనియర్ రాజనీతిజ్ఞుడిగా'' కనిపిస్తున్నాడు.. అంటూ పేర్కొన్నాడు. ధోని వ్యవహారంలో సీఎస్కే యాజమాన్యం కాస్త సీరియస్ అయినట్లు సమాచారం. కాగా ధోనిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన వ్యక్తులను అభిమానులు ఏకిపారేశారు.''40 ఏళ్ల వయసులోనే ధోని మాకు ఫిట్గా కనిపిస్తున్నాడు.. మీ కళ్లు దొబ్బాయనుకుంటా.. ఒకసారి చెక్ చేసుకోండి'' అంటూ కామెంట్ చేశారు. ఈ విషయం పక్కనబెడితే సూరత్లో అడుగుపెట్టిన ధోని సేన తమ ప్రాక్టీస్లో వేగం పెంచింది. ముఖ్యంగా ధోని ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక బ్యాట్స్మన్గా ధోని ఇప్పటివరకు ఐపీఎల్లో 220 మ్యాచ్ల్లో 4,746 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్థశతకాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో 16 మ్యాచ్లు ఆడిన ధోని 114 పరుగులు మాత్రమే చేశాడు. తలైవా బ్యాటింగ్లో వేడి తగ్గినప్పటికి కెప్టెన్సీలో మాత్రం అవే మెరుపులు కనిపిస్తున్నాయి. గతేడాది అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సీఎస్కే ఫైనల్లో కేకేఆర్ను ఓడించి నాలుగోసారి టైటిల్ను అందుకుంది. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో తొలి మ్యాచ్లో సీఎస్కే, కేకేఆర్ తలపడనున్నాయి. చదవండి: Pak Vs Aus: 'అభిమానులకు ద్రోహం చేశావు.. ఈ వయసులో నువ్వు కూడా' Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు MS Dhoni in the practice session on Day 1 at Surat ahead of IPL 2022. pic.twitter.com/QQNVve0q0g — Johns. (@CricCrazyJohns) March 7, 2022 -
దీపిక డ్రెస్సింగ్పై ట్రోల్స్.. 'రణ్వీర్ డిజైన్ చేసాడేమో'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్లో కనిపించింది. క్యాప్, హ్యాండ్బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అచ్చం జొమాటో డెలివరీ గర్ల్లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా గెహ్రియాన్తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
డేజే టిల్లు హీరోయిన్పై ట్రోల్స్.. స్పందించిన నేహాశెట్టి
డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది హీరోయిన్ నేహాశెట్టి. 2018లో మెహబూబా సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత గల్లీరౌడీ,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది. కానీ డీజే టిల్లు చిత్రంలో మంచి విజయం అందుకుంది. క్యూట్ అండ్ గ్లామరస్ లుక్స్తో ఆకట్టుకుంది. అయితే సినిమాకు ప్రశంసలు దక్కినా నేహాశెట్టిపై బాగానే ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించింది. మనం ప్రతి ఒక్కిరికి నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతాం, మరికొంత మందికి అస్సలు నచ్చకపోవచ్చు. కానీ మెజార్టీ ఆడియెన్స్ రాధిక రోల్ను ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. -
'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు'
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో పాక్పై తమకున్న ఘనమైన రికార్డును టీమిండియా కోల్పోయింది. పాక్తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో షమీ 3.5 ఓవర్లు బౌల్ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓటమికి భారత ప్రధాన పేసర్ మహ్మద్ షమీయే కారణమంటూ కొందరు గిట్టనివాళ్లు అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. షమీ పాక్కు అమ్ముడుపోయాడని.. అతన్ని పాక్కు తరిమికొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షమీపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు ఖండించారు. తాజాగా షమీ తనపై చేసిన విమర్శలపై ఎట్టకేలకు మౌనం వీడాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో జరిగిన ఇంటర్య్వూలో షమీ మాట్లాడాడు. ''మంచి ప్రదర్శన చేస్తే హీరో అంటారు.. ఒక్క మ్యాచ్లో చెత్త ప్రదర్శన వస్తే జీరో అంటారు. ఇలా ఒక ఆటగాడిని హీరోగా పరిగణించి ఆ తర్వాత అదే ఆటగాడిపై దురుసుగా ప్రవర్తిసే.. కచ్చితంగా వాళ్లు భారతీయులు మాత్రం కాదు. వాళ్లు మన దేశానికి చెందినవారే కానప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎన్ని చెప్పినా నా దృష్టిలో అవి పనికిరానివే. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. అంతేకాదు ఎవరైనా నా గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడితే.. అతను నాకు లేదా భారత జట్టుకు అభిమాని కానేకాదు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నాకు తెలుసు. భారతదేశం అంటే ఏమిటో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. దేశం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి ట్రోల్స్ను అస్సలు పట్టించుకోము'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున మహ్మద్ షమీ 57 టెస్టుల్లో 209 వికెట్లు.. 79 వన్డేల్లో 148 వికెట్లు.. టి20ల్లో 18 వికెట్లు తీశాడు. చదవండి: కెప్టెన్గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ Ashton Agar: నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడు.. పాక్ పర్యటనకు ముందు బెదిరింపులు -
దళపతికి ఇన్నాళ్లకు తీరిందా..?
గత ఏడాది అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ముఖ్యంగా కన్నడిగులు అయితే తమను తన నటనతో ఇంతకాలం అలరించిన పవర్ స్టార్ ఒక్కసారిగా మరణించడంతో షాక్కు గురయ్యారు. చాలా రోజుల వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నేటికీ పునీత్ సమాధిని తన అభిమానులు దర్శించుకుంటూనే ఉన్నారు. పునీత్ మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చివరి చూపు కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకుని మరీ పునీత్ అంతిమ సంస్కారాలను నిర్వహించిన సంగతి ప్రతి ఒక్కరికీ తెల్సిందే. అయితే తాజా విషయం ఏంటంటే.. పునీత్ సమాధిని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఘాట్ను సందర్శించి శ్రద్దాంజలి ఘటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్కి సమయం దొరికిందా..? అంటూ కన్నడ మీడియా వర్గాలతో పాటు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి దాకా తనకు తీరిక దొరక లేదా అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ నిజంగానే అంత బిజీగా ఉన్నాడా ఇప్పటికి కానీ ఆయనకు కుదర్లేదా అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్ను సందర్శించేందుకు వచ్చాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్గా విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విజయ్ పర్యటన వివాదాస్పదం అవ్వడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. -
బిల్గేట్స్తో ఫొటో.. బిల్డప్కు పోయి నవ్వులపాలయ్యాడు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్ కొట్టేందుకు బిల్గేట్స్తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా.. అందులోని ఓ పాయింట్తో పాక్ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్గేట్స్.. తాజాగా పాక్లో పర్యటించారు(ఆయన పాక్లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్గేట్స్తో లంచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది. పాక్ న్యూస్ ఏజెన్సీ ది కరెంట్ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్ఐ(Inter-Services Intelligence) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్ సర్వీస్ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్ ఐడెంటిటీని రివీల్ చేయడం ఇష్టం లేని పాక్ ప్రభుత్వం.. మరోపక్క బిల్గేట్స్తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్లో ఐఎస్ఐ చీఫ్ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్ ఇజ్జత్ తీసేస్తున్నారు పాక్ నెటిజన్లు. Prime Minister @ImranKhanPTI's luncheon in honor of @BillGates Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki — Prime Minister's Office, Pakistan (@PakPMO) February 17, 2022 గత అక్టోబర్లో నదీమ్.. ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్ మొదట నదీమ్ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చదవండి: ఇమ్రాన్ఖాన్ ది ఇంటర్నేషనల్ బెగ్గర్ -
కాపీ కొట్టడానికి సిగ్గుండాలి.. పంత్పై ట్రోల్స్ వర్షం
వెస్టిండీస్తో రెండో వన్డేలో ఓపెనర్గా వచ్చి అందరిని ఆశ్యర్యపరిచిన రిషబ్ పంత్ అంతగా ఆకట్టుకోలకపోయాడు. 34 బంతులాడి 3 ఫోర్లు సాయంతో 18 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే మ్యాచ్లో నిరాశపరిచిన పంత్.. సోషల్ మీడియాలో మాత్రం హిట్ అయ్యాడు. ఫ్యాన్స్ ట్రోల్స్కు గురయ్యాడు.. బ్యాటింగ్ విషయంలో ఆ ట్రోల్స్ వచ్చాయి అనుకుంటే పొరపాటే. చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్ విషయంలోకి వెళితే.. పంత్ ఔటై పెవిలియన్ చేరాక కాసేపటికి బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. అక్కడ టీమిండియా ఫిజియో నితిన్ పటేల్, దీపక్ చహర్లతో కాసేపు ముచ్చటించాడు. అయితే పంత్ కూర్చున్న విధానం ఆసక్తిగా మారింది. గతంలో స్పిన్నర్ చహల్ ఒక మ్యాచ్లో బాయ్గా వ్యవహరించినప్పుడు డ్రింక్స్ అందించడానికి బౌండరీ లైన్ వద్ద మోచేతిపై కూర్చొని మ్యాచ్ వీక్షించడం కెమెరాలకు చిక్కింది. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా పంత్ అది కాపీ కొట్టాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందో లేక కావాలనే చేశాడో తెలియదు కానీ పంత్పై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ వర్షం కురిపించారు. పంత్ ఫోటోను.. చహల్ అప్పటి ఫోటోను ఒక దగ్గర పెట్టి షేర్ చేశారు. ''సిగ్గుండాలి పంత్.. చహల్ను కాపీ కొట్టడానికి.. చహల్ది మాస్టర్ పీస్.. నీది(పంత్) కాపీ పీస్.. చహల్ మాస్టర్ పీస్ను దొంగలించావు.. యూ ఆర్ కాపీ క్యాట్.. పంత్ నీ కాపీ చెత్తగా ఉంది..'' అంటూ ఫన్నీ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 49 పరుగులు చేశాడు. దీపక్హుడా 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం #INDvWI Rishabh Pant 🤝Yuzi Chahal pic.twitter.com/iTI5pC5jOe — Sudhanshu Ranjan Singh (@memegineers_) February 9, 2022 Just Rishabh Pant thinks 😂😭#INDvWI #INDvsWI pic.twitter.com/6gMYO5JKph — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 9, 2022 -
ఎయిర్పోర్ట్లో రష్మిక అలా కనిపించేసరికి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ మరీ ఓవర్గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #RashmikaMandanna #DilKoKaraarAaya 💕🤩🔥#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE — team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022 -
డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్పై ట్రోల్స్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్ను సంపాదించుకున్న అనుపమకు తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కాగా హీరోయిన్స్కు లిప్లాక్ సీన్స్ ఎంతో క్రేజ్ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ కానీ ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి అనుపమ ట్రోల్స్ బారిన పడింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో అగ్ర నిర్మాత దిల్ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్గా అనపమ నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించన అనుపమా రౌడీ బాయ్స్లో రెచ్చిపోయి నటించిందట. ఇక బడా నిర్మాత వారసుడి సినిమా కావడంతో ఈ మూవీని దర్శకుడు భారీగానే ప్లాన్ చేశాడు. అతడికి ఎలాగైన సక్సెస్ ఇవ్వాలని దర్శకుడు ఆరాట పడుతున్నాడు. చదవండి: అవును జాకీతో ప్రేమలో ఉన్నా, కానీ అది రూమరే.. నేనే చెప్తా: రకుల్ ఈనేపథ్యంలో రౌడీ బాయ్స్పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు హీరోహీరోయిన్ల మధ్య భారీగానే లిప్లాక్ సీన్లు పెట్టారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో కూడా కిస్ సీన్స్ చూపించి ఆకట్టుకున్నారు మేకర్స్. కానీ ఇదే సీన్పై అనుపమను ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘నీకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదా.. ఎంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్లాక్ ఇచ్చేస్తావా?, కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్ కోసం ఇంతగా దిగజారాలా’ అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి మరికొందరైతే ఏకంగా ‘నీ నెక్ట్ సినిమా మా హీరో చేయాలని, అతడికి కూడా లిప్లాక్ ఇవ్వాల్సిందే’ అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్ అనుపమకు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అనుపమ మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్గా మారింది. ఏకంగా ఈ సినిమాలో 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. -
ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను షేర్ చేసిన ఓ వీడియోపై సదరు నెటిజన్ స్పందించిన తీరుకు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కాగా ‘ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దు. కేసులు పెరుగుతున్నాయి. కానీ మరణాలు మత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసంర లేదు’ అంటూ ఓ వైద్యుడు చెప్పుకొచ్చిన వీడియోను హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. చదవండి: హీరోయిన్కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ.. ఒమిక్రాన్ వెరియంట్ పట్ల ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సదరు వైద్యుడు వీడియో పంచుకున్న హరీశ్ శంకర్పై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరికొందరూ నెటిజన్లు ‘హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వెరియంట్పై ప్రజల్లో ఆందోళన, భయం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లో భయం పోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికొ హరీశ్ శంకర్ తనదైన శైలితె ఘాటుగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ ‘ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా హరీశ్ శంకర్ సోషల్ మీడియాల్లో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెటిజన్లతో పంచుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. దేశలోని రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు. అంతే కాదు వింతలు విశేషాలను పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలను తరచూ తన పేజ్ ద్వారా నెటిజన్లకు, తన ఫాలోవర్స్కు అందిస్తుంటాడు. Am glad that stupids like u disappointed because guys like u never wanna give a hope to people even when an expert says something good and also he insists on precautions repeatedly !! https://t.co/tD5v3m80C5 — Harish Shankar .S (@harish2you) January 8, 2022 -
ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
Karan Johar Trolled By Netizens For His Tweet to Delhi CM Over Theatres Re-Open: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్పై నెటిజన్లు ధ్వజమెతున్నారు. చదవండి: దుబాయ్లో హీరోయిన్తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ. చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe — Karan Johar (@karanjohar) December 30, 2021 -
RRR Trailer: బైక్ సీన్ ట్రోల్స్పై స్పందించిన జూ. ఎన్టీఆర్
తెలుగు ప్రేక్షకులతో పాటు.. యావత్ దేశం ఆర్ఆర్ఆర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఆర్ఆర్ఆర్ టీం మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏ రాష్ట్రంలో ప్రమోషన్కి వెళ్లినా.. అక్కడి భాషలో, తమ యాక్టివ్నెస్తో అక్కడి సినీ అభిమానుల్ని, మీడియాను ఎట్రాక్ట్ చేస్తున్నారు జూ. ఎన్టీఆర్, రామ్చరణ్లు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో జూ ఎన్టీఆర్కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. చదవండి: జెర్సీ ఓటీటీ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ కాగా ఈ మూవీ ట్రైలర్లోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ బైక్ ఎత్తే సన్నివేశం ఎంతగా పాపులర్ అయ్యిందే తెలిసిందే. గూస్బంప్స్ వచ్చేలా ఉన్న ఈ సీన్కు చాలా మంది ఫిదా అయ్యారు. కానీ కొందరూ మాత్రం ఈ సన్నివేశంపై విమర్శలు గుప్పిస్తూ రాజమౌళి, ఎన్టీఆర్లను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ బైక్ చాలా బరువుగా ఉంటుంది, అలాంటి బైక్ను ఎన్టీఆర్ అలవోకగా ఎత్తాడు.. అది అసాధ్యం ఇలాంటి మైండ్ లెస్ సీన్ను ఎలా పెట్టారంటూ నెటిజన్లు విమర్శించారు. దీంతో ఈ సీన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ఆ సమయంలో వచ్చిన ట్రోల్స్పై తాజాగా ఓ రిపోర్ట్ మూవీ ఈవెంట్లో ఎన్టీఆర్ను ప్రశ్నించాడు. దీనిపై తారక్ స్పందిస్తూ.. ఆ సన్నివేశం చేసినప్పుడు తనకు కూడా అదే సందేహం వచ్చిందని, దీంతో రాజమౌళిని వెంటనే దీనిపై ప్రశ్నించానని చెప్పాడు. దీనికి జక్కన్న ‘‘తీవ్రమైన ఆవేశం, అత్యాత్సాహంతో ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేయగలడు. ఆ సమయంలో ఆసాధ్యం అనేది ఉండదు. ఈ సన్నివేశంలో ఇదే జరుగుతుంది’’ అని సమాధానం ఇచ్చినట్లు ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. ఇందులో ఆ సీన్ ఎందుకు వచ్చింది, కోమరం భీం ఆ బైక్ ఎత్తడానికి కారణం ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుందని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. -
'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్
Fans Troll Cheteshwar Pujara After Golden Duck.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. లుంగీ ఎన్గిడి బౌలింగ్లో ఆడిన తొలి బంతికే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం. 2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్లో రనౌట్ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్ రూపంలో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్లోనే అదే సెంచూరియన్లో గోల్డెన్ డక్ కావడం ఆసక్తి కలిగించింది. ఇక పుజారా చెత్త ప్రదర్శనపై నెటిజన్లు ఏకిపారేశారు. ''నిన్ను మరో ద్రవిడ్లా ఊహించుకున్నాం.. మా ఆశలన్నీ వ్యర్థమవుతున్నాయి''.. ''డమ్మీ ద్రవిడ్ గోల్డెన్ డక్ అయ్యాడు''..'' మొన్న రహానే.. ఇవాళ నువ్వు.. మీరిద్దరు జట్టుకు చోకర్స్గా మారారు''.. ''పుజారా స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు అవకాశమిచ్చినా బాగుండేది''.. పుజారా డకౌట్లు అవుతూనే ఉన్నాడు.. ఇంకా ఎన్ని చాన్స్లు ఇస్తారు.. హనుమ విహారి లాంటి ఆటగాళ్లు బెంచ్పై కూర్చొని కోపంతో రగిలపోతున్నారు.. వాళ్లకు అవకాశమివ్వండి'' అంటూ కామెంట్స్ చేశారు. #INDvsSA#pujara#Rahane Dummy Dravid gone on duck. Let us see what dummy Laxman will do.. — Super अण्णा (@Superanna92) December 26, 2021 Golden duck for #Pujara. His nightmare continues. Much more is expected out of no. 3 batsman in Test matches. I am afraid he will not get many more chances now. So sad to him struggle like this for runs. Che Pujara team se "jara"ha lagta hai.#INDvSA #INDvsSA #duck #goldenduck — Raman Gujral (@gujral_raman5) December 26, 2021 Why is Pujara still in the team? Has been struggling for months now. Can't we give Rahane/Vihari a chance at no 3, and play Shreyas a 5? #INDvsSA — FPL Balor ⭐⭐ (@FPLBalor) December 26, 2021 I think Ngidi planned Pujara's wicket in #CSK nets. 😅🤔😉 #SAvsIND #BCCI — Abhijeet Andansare (@ImAbhijeet01) December 26, 2021 -
యూట్యూబ్ ఛానల్స్కి గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్ అనసూయ
Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral: యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్గా మారింది. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్గా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో తనపై చేస్తున్న ట్రోలింగ్పై అనసూయ ఘాటుగా స్పందించిది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన అనసూయ తనపై యూట్యూబ్లో అసభ్యకరంగా థంబ్నెయిల్స పెడుతున్నారంటూ మండిపడింది. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అంటూ పెడుతుంటారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఇక నేను బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది నా ఇష్టం. కానీ మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నా. నేను కూడా మీలా మాట్లాడగలను. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు చురకలంటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
చై నుంచి రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్.. స్పందించిన సామ్
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది. ఈ విషయంపై ఇప్పటివరకు చై-సామ్ పెదవి విప్పలేదు. మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్2న వీరు తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను..'విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం' అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఇలాంటి చెత్త కామెంట్లకు సమంత స్పందించాల్సిన అవసరం లేదని, తామంతా ఆమెకు మద్దతుగా నిలుస్తాం’ అంటూ సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
సార్.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్ వెలిగించు
లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. కాన్పూర్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాజ్ శేఖర్ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్తో ఫోటోని షేర్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) Please wish me Good Luck. Trying my luck in Cooking…😊 Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1 — Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021 ఇక దీనిలో రాజ్ శేఖర్.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్.. వంట బాగా చేశావ్.. స్టవ్ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్ వార్మింగ్ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Cooking without fire while dressed in a suit ...yeah you do need help. Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ — Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021 చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా? -
Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్పై ట్రోల్స్
Samantha Special Song Gets Trolled In Pushpa Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్లో కాలు కదిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ల కాంబినేషన్లో తెరక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో సామ్ స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది. ఇక ఈ పాట నిన్న(డిసెంబర్ 10) విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప ఐటెం సాంగ్ మెనియానే కనిపిస్తోంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ లంగా జాకెట్లో సమంత తన అందచందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. కాగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. గాయని ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ఈ పాటలో సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తయితే.. గాయనీ ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్ పాటను నెక్స్ట్ లెవల్కు తీసుకేళ్లింది. ఇక అంతా బాగానే ఉన్న ఈ పాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందంటూ నెటిజన్లు పట్టేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య-తమన్నా జంటగా నటించిన వీడొక్కడే మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు ఈ మూవీలో కూడా అచ్చం ఇలాగే ఓ స్పెషల్ ఉంది. ‘హానీ.. హానీ..’ అంటూ ఆ పాట సాగుతుంది. ఇప్పుడు సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ అచ్చం ఆ పాటను తలపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లిరిక్స్ బాగున్నా మ్యూజిక్ మాత్రం సేమ్ ఉందని, అంటే సమంత సాంగ్ను కాపీ కొట్టారా? అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరి దీనిపై పుష్ప టీం ఎలా రియాక్ట్ అవుతుంతో చూడాలి. అయితే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సామ్ డేర్ చేసి ఈ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ పాట ఇలా ట్రోల్స్ బారిన పడటంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైందని అందరూ అంటున్నారు. -
విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై
సినీ ఇండస్ట్రీలో తారలు జంటలుగా మారడం, పలు కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో టీవీలో ఇలాంటివి చూసి అయ్యో అనుకునే వాళ్ల అభిమానులు ప్రస్తుత సోషల్మీడియా సమాజంలో ట్వీట్, ట్రోల్స్ రూపంలో తమ బాధని, కోపాన్ని, అభిమానాన్ని బయటపెడుతుంటారు. అయితే ఈ క్రమంలో తారలు ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతుంటారు. ఈ తరహాలోనే ఓ బాలీవుడ్ సీనియర్ నటి ట్రోలింగ్కు గురికాగా తన ట్వీట్తో ఘాటుగానే స్పందించింది. సోషల్మీడియా వాడుకంలోకి వచ్చినప్పటి నుంచి తారలు అభిమానుల మధ్య బంధం మరింత చేరువైందనే చెప్పాలి. దీని వల్ల వాళ్లు నేరుగా మాట్లాడుకునే, చాట్ చేసుకునే వెసలుబాటు కలిగింది. బాలీవుడ్ సీనియర్ నటి కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో యాక్టీవ్గా గడుపుతూ తన అభిమానులతో ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. నువ్వు నీ మొదటి వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నావు. నీకంటూ హద్దులు లేవా? అంటూ ట్రోల్ చేశాడు. ఈ ట్వీట్పై కామ్య కాస్త ఘాటుగా స్పందిస్తూ.. మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది. సమాజంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా నీలాంటి వాళ్లకి సమాధానం చెప్పాలి. నన్ను బలహీనురాలిగా భావించవద్దని బదులిచ్చింది. కాగా గతంలో వ్యాపారవేత్త బంటీ నెగి నుంచి 2013లో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న కామ్య గత ఏడాది శలాబ్ దంగ్ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. #लड़की_हूँ_लड़_सकती_हूँ pic.twitter.com/nCYgUQkB4o — Kamya Shalabh Dang (@iamkamyapunjabi) December 8, 2021 చదవండి: Pushpa Movie: సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! -
Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ
QueensLand Police Troll After Englnad Collapse For 147 Runs 1st Test Ashes.. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ఆటను ప్రదర్శించింది. ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడూ మిగతా ఆసీస్ పేస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే క్వీన్స్లాండ్ పోలీస్ విభాగం.. ఇంగ్లండ్ కుప్పకూలడంపై తమదైన శైలిలో క్రికెటర్ల పేర్లను ఉపయోగిస్తూ పోలీస్ భాషలో ట్వీట్ చేశారు. ఐదు వికెట్లు తీసిన కమిన్స్తో పాటు కామెరాన్ గ్రీన్, నాథన్ లియోన్, వార్నర్ పేర్లు వచ్చేలా ఆ ట్వీట్ ఉండడం ఆసక్తి కలిగించిందది. ''బీఎన్ఈ ట్రాఫిక్ అప్డేట్: ఎ లార్జ్ క్రౌడ్ ఫర్ ది ఫస్ట్ టెస్ట్ సో ప్లాన్ యువర్ ''కమిన్స్'' అండ్ గోయింగ్స్. వీ వుడ్ బీ ''లియోన్'' ఇఫ్ వి సెడ్ దేర్ విల్ బి నథింగ్ బట్ ''గ్రీన్'' లైట్స్ నియర్ ది గాబా. డోంట్ సే వి డిడింట్ ''వార్నర్''.. అంటూ ట్వీట్ చేసింది. ఇక మరొక ట్వీట్లో.. '' గాబా టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై విచారణ ప్రారంభించాలనుకుంటున్నాం'' అంటూ పేర్కొంది. ఇక వెలుతురులేమి కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్ స్టార్క్ BNE traffic update: A large crowd for the first test so plan your Cummins and goings. We'd be Lyon if we said there'll be nothing but Green lights near the Gabba. Don't say we didn't Warner #Ashes — Queensland Police (@QldPolice) December 7, 2021 -
బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు
Fans Troll Babar Azam Getting Half Century Mark But Play Stops.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అర్థశతకం సాధించాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. వాస్తవానికి టి20 ప్రపంచకప్లో టాప్ స్కోరర్గా నిలిచిన బాబర్ అజమ్ ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన టి20 సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బాబర్ అజమ్పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇరు జట్ల మధ్య మొదలైన తొలి టెస్టు మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. దాదాపు రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. మూడోరోజు నుంచి ఆట కొనసాగింది. చదవండి: IND vs SA: రహానే, గిల్కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు కాగా మూడోరోజు ఆటలో పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ అర్థసెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. అయితే అతను ఫిప్టీ మార్క్ చేరిన కాసేపటికే బ్యాడ్లైట్ పేరుతో ఆట ఆగిపోయింది. దీంతో బాబర్ను మరోసారి టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఆడుకున్నారు. ''టి20 ప్రపంచకప్ తర్వాత బాబర్కు ఏది కలిసిరావడం లేదు.. ముందు టి20 సిరీస్లో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్లో బాబర్ అజమ్ ఫిప్టీ సాధించినప్పటికి ప్రకృతి అతనికి సహకరించడం లేదు.'' అంటూ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్లో నాలుగోరోజు లంచ్ విరామం తర్వాత పాకిస్తాన్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం పవాద్ అలమ్ 19, మహ్మద్ రిజ్వాన్ 26 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం Raining.. Match stopped#PakvsBan pic.twitter.com/lGVV583wZg — Ali Hasan (@AaliHasan10) December 4, 2021 -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్పై విమర్శలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్కు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత శశి థరూర్ తన ట్విటర్లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. ‘‘లోక్సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. Who says the Lok Sabha isn’t an attractive place to work? With six of my fellow MPs this morning: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP pic.twitter.com/JNFRC2QIq1 — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్ కామెంట్ చేయడం ఎంత వరకు సబబు. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్’’ అంటూ ఓ రేంజ్లో శశి థరూర్ని ట్రోల్ చేశారు నెటిజనులు. (చదవండి: ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం ) సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. (చదవండి: శశిథరూర్ ఇంగ్లీష్పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్ ఇమ్రాన్ ప్లీజ్!) The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ఈ సెల్ఫీలో శశి థరూర్తో పాటు టీఎంసీకి చెందిన నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్కి చెందిన జోతిమణి, తమిజాచి తంగపాండియా ఉన్నారు. చదవండి: మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్ ఎంపీ ఫన్నీ కౌంటర్ -
అలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని మాత్రం చెప్పుకోకండి: బిగ్బాస్ విన్నర్
Rubina Dilaik Slams Fans Who Harass Her For Gaining Weight: స్క్రీన్పై కనిపించేవాళ్లు ఎప్పుడూ ఫిట్గానే ఉండాలనే ధోరణిలో ఉంటారు కొందరు నెటిజన్లు. ఏమాత్రం లావైనా ట్రోలింగ్ చేస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా హిందీ బిగ్బాస్14 విన్నర్, నటి రుబీనా దిలేక్కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఈ మధ్యకాలంలో బాగా బరువు పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. బరువు పెరగడాన్ని చాలా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తే కొందరు తనపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్పై రుబీనా స్పందించింది. 'నా ఫ్యాన్స్, శ్రేయాభిలాషులం అని చెప్పుకునేవారికి నేను బరువు పెరగడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు అర్థమవుతుంది. అందుకే అసలు కనికరం లేకుండా ద్వేషాన్ని వెల్లగక్కుతూ నాకు మెసేజ్లు, మెయిల్స్ పంపుతున్నారు. నేను లావుగా ఉండటం, మంచి డిజైనర్ బట్టలు దరించకపోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయకపోవడం మిమ్మల్ని నిరాశ పరిచిందని నాకు తెలుసు. మీకు టాలెంట్ కంటే ఫిజికల్గా ఎలా ఉండటం అన్నదే ముఖ్యం. అయితే మీకో శుభవార్త. ఇది నా జీవితం. దాంట్లో ఎన్నో దశలు ఉన్నాయి. అందులో మీరు కూడా ఒకటి. నేను నా అభిమానులను గౌరవిస్తాను. కాబట్టి ప్లీజ్ ఇలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని చెప్పుకోకండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
సన్నీ-కాజల్ రిలేషన్పై నోరు జారిన సుదర్శన్.. వీడియోతో క్లారిటీ
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ మరింత స్పెషల్గా ఉంటాయన్నది తెలిసిందే. సండే(నవంబర్21)ఫండేగా సాగిన ఎపిసోడ్లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ కాసేపు హౌస్మేట్స్తో చిట్చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కాజల్-సన్నీల రిలేషన్ను తప్పుబడుతూ సుదర్శన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి గేమ్పై అప్పటివరకు సరదాగా పంచులేసిన సుదర్శన్..'చివర్లో కాజల్ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్ రొమాన్స్ బాగుంది'.. అంటూ నోరుజారాడు. దీంతో షాక్ అయిన సన్నీ.. మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సన్నీ-కాజల్ల రిలేషన్పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్ సుదర్శన్ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఫ్రెండ్స్లా ఉన్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అయినా సినిమా ప్రమోషన్స్కి వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న సుదర్శన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. 'మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం 5నిమిషాలే చూపించారు. కాజల్-సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్గా అనుకుంటున్నారు. సన్నీ ఫ్యాన్స్, కాజల్ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్ చేశాడు సుదర్శన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా
Fans Troll Team India After Knock Out From T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా పోరాటం అనధికారికంగా ముగిసినట్లే. ఆదివారం అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సోమవారం(నవంబర్ 7న) నమీబియాతో జరిగే మ్యాచ్ టీమిండియాకు నామమాత్రంగా మారింది. అయితే టీమిండియా ఇంటిదారి పట్టడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. దీంతో టీమిండియాపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. చదవండి: AFG Vs NZ: చేతులెత్తేసిన అఫ్గాన్.. టీమిండియా ఇంటికి ''అఫ్గాన్తో మ్యాచ్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్లపై విజయం సాధించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు.. ముందే గెలిస్తే బాగుండేది.. అయిపోయిందిగా.. అఫ్గాన్తో పాటు మీరు ఇంటికి వచ్చేస్తున్నారు.. కోహ్లి టి20 ప్రపంచకప్ కొట్టకుండానే వెనుదిరగడం బాధ కలిగిస్తుంది.. అసలు మ్యాచ్ల్లో చేతులెత్తేసి చిన్న జట్లపై ప్రతాపం చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు.. '' అంటూ విరుచుకుపడ్డారు. ►టీమిండియా టి20 ప్రపంచకప్లో నాకౌట్ దశలో వెనుదిరగడం 2012 తర్వాత ఇదే కావడం విశేషం. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా కనీసం సెమీస్కు చేరుకుంది. ►న్యూజిలాండ్ ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు 14 సార్లు సెమీ ఫైనల్స్కు చేరుకుంది. ఇక టి20 ప్రపంచకప్లో 2007, 2016 తర్వాత మూడోసారి న్యూజిలాండ్ సెమీస్లోకి అడుగుపెట్టింది. -
స్టార్ హీరోపై ట్రోలింగ్: ‘స్విగ్గీ వాళ్లు నా డబ్బులు రిటర్న్ చేయలేదు’
కోల్కతా: ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం, కోవిడ్, ఇంధన ధరల పెంపు, నిరుద్యోగం, వాయు కాలుష్యం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓ వైపు విపక్షాలు.. ఆర్థిక, రాజకీయ రంగ నిపుణులు ఈ సమస్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్హీరో మాత్రం ఫుడ్ డెలివరీ యాప్ల తీరు సరిగా లేదు.. వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ.. ఏకంగా ప్రధాని, సీఎంలకు లేఖ రాశాడు. ఇది వైరలవ్వడమే కాక దేశంలో ఇన్ని సమస్యలుండగా.. నీకు ఇంత చిల్లర విషయం దొరికిందా ఫిర్యాదు చేయడానికి అంటూ సదరు నటుడిపై దుమ్ముత్తెపోస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ సూపర్ స్టార్ ప్రోసెన్జిత్ ఛటర్జీ శనివారం నరేంద్ర మోదీకి రాసిన లేఖ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ లేఖలో స్విగ్గి యాప్పై మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశాడు. లేఖలో ప్రసుత్తం జనాలు ఫుడ్ డెలివరీ యాప్ల మీద బాగా ఆధారపడుతున్నారు. దీన్ని అలుసుగా చేసుకుని వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపాడు ప్రోసెన్జిత్. (చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం: ‘మీ ఫుడ్ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’) ‘‘కొన్ని రోజలు క్రితమే నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాను. కానీ వారు నాకు ఆహారం డెలివరీ చేయకుండానే.. ఫుడ్ డెలివరీ ఇచ్చినట్లు స్టేటస్ పంపించారు. దీని గురించి స్విగ్గి యాప్లో ఫిర్యాదు చేసి.. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాను. కానీ వారు నిరాకరించారు. ప్రస్తుతం దేశంలో ఈ సమస్య బాగా పెరుగుతుంది. కనుక గౌరవ ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ప్రోసెన్జిత్ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి: వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం ) ఈ లెటర్ కాస్త వైరల్ కావడమే కాక ఓ రేంజ్లో ట్రోల్ అవుతుంది. ‘‘నువ్వేం హీరోవు నాయనా.. ఓ వైపు దేశంలో ఎన్నో క్లిష్ట సమస్యలు ఉంటే.. నీ ఈ చెత్త ప్రాబ్లం కోసం ప్రధానికి లేఖ రాస్తావా.. కొంచెం కూడా బుద్ధి లేదా’’ అంటూ ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు నెటిజనుల. చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా' -
సీఎం ట్వీట్పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’
ఇస్లామాబాద్: దీపావళి పండుగ నాడు.. హోలీ శుభాకాంక్షలు తెలిపి.. విమర్శల పాలవుతున్నారు పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి. ఆ వివరాలు.. నవంబర్ 4న ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు, రాజకీయవేత్తలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరి మధ్యలో పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షలు నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. దీపావళి సందర్భంగా సింధ్ ప్రాంత సీఎం మురద్ అలీ షా ట్విటర్లో తన ఫోటోని షేర్ చేశారు. దీని మీద హోలీ శుభాకాంక్షలు అని ప్రింట్ చేయించాడు. ఇది చూసిన నెటిజనులు.. మీకు దీపావళి పండగకి, హోలీకి తేడా తెలియదా అంటూ విమర్శించడం ప్రారంభించారు. పొరపాటు గుర్తించి వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కానీ నెటిజనులు అప్పటికే ఆ ట్వీట్ను స్క్రీన్షాట్ తీసి.. వైరల్ చేశారు. (చదవండి: Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!) పాకిస్తాన్కు చెందిన జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి సీఎం ట్వీట్ స్క్రీన్ షాట్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘‘సింధ్ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే.. సింధ్ సీఎం ఆఫీస్లో పని చేసే సిబ్బందికి దీపావళికి, హోలీకి తేడా తెలియదు. ఇది చాలా విచారకరం’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్కు గిఫ్ట్ ఇస్తాడట Sindh has the largest number of Hindu population in Pakistan with areas where Hindus are in overwhelming majority. One can only be sad at the state of affairs if the staff at the CM House Sindh doesn’t know the difference between Diwali and Holi. Sad indeed. pic.twitter.com/QdpDe6f3Pl — Murtaza Solangi (@murtazasolangi) November 4, 2021 -
బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’
వాషింగ్టన్: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్గేట్స్, జెఫ్ బెజోస్. వీరిద్దరిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల క్రితమే బిల్గేట్స్ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్ హెలికాప్టర్లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు. ఈ బర్త్డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్డైయాక్సైడ్ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్ హెలికాప్టర్ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ వెల్లడయినట్లు తెలిసింది. (చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది) ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిల్గేట్స్నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్) బిల్గేట్స్ బర్త్డే పార్టీ జరిగిన పడవ సూపర్యాచ్ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్కి వెళ్లినట్లు తెలిసింది. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
#NoBindiNoBusiness: మరో వివాదంలో ఫ్యాబ్ఇండియా
సాక్షి, ముంబై: పండుగలు అంటే సాంప్రదాయబద్దంగా జరుపుకుంటాం. ఎవరి మతాచారాలకు తగ్గట్టు వాళ్లు పండగలు చేసుకుంటారు. ఇక హిందూ పర్వదినాల విషయానికి వస్తే.. ముఖ్యంగా మహిళలు.. సాప్రదాయబద్దంగా తయారవడానికి ఇష్టపడతారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగనాడు మాత్రం పట్టుబట్టలు, బొట్టు, పూలు, గాజులతో అందంగా ముస్తాబవుతారు. ఆధునికంగా కనిపిస్తూనే సాంప్రదాయంగా తయారవుతారు. ఇక హిందూ సమాజంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. అలాంటిది దీపావళి వంటి పర్వదినం నాడు ఏ భారతీయ మహిళ కూడా ఇలా తయారవదు అంటూ ఫ్యాబ్ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కారణం ఏంటంటే దీపావళి సందర్భంగా ఫ్యాబ్ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్ యాడ్ ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా సద్దుమణగముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ఫ్యాబ్ఇండియా యాడ్లో మోడల్స్ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: ఫ్యాబ్ ఇండియా యాడ్పై దుమారం, తొలగించిన సంస్థ) Speaking for myself. Not buying anything for #Deepawali from ANY brand that shows models without a bindi. #NoBindiNoBusiness — Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) October 20, 2021 ఈ యాడ్ చూసిన నెటిజనులు ఫ్యాబ్ ఇండియా యాడ్లో మోడల్స్ బొట్టు పెట్టుకోలేదని.. భారతీయ మహిళలు ఎవరూ పండగకి ఇలా తయారవ్వరని మండిపడుతున్నారు. అంతేకాక బిందీ, బొట్టుబిళ్లలు ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #Bindi, #NoBindiNoBusiness అనే హ్యాష్టాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. (చదవండి: ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’) Proudly flaunting my Bindi#NoBindiNoBusiness#BindiTwitter pic.twitter.com/xcrBLG40co — Adv Pragya Bhushan🌐 (@pragya_bhushan) October 21, 2021 రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన తన కలెక్షన్ను జష్న్-ఈ-రివాజ్ పేరిట బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? My bindi (Tilak) is my identity. #BindiTwitter #NoBindiNoBusiness #NOFILTER pic.twitter.com/6jK3kozweD — Raghuram (@Raghura75818432) October 21, 2021 మరికొందరు ఈ హ్యాష్ట్యాగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమి కాదు.. పుట్టుకతోనే ఎవరూ బొట్టుతో జన్మించలేదు. బొట్టు పెట్టుకోవాలో.. లేదో మేం నిర్ణయించుకుంటాం. దీనిలో పురుషుల జోక్యం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Most of the time I don't wear a bindi, and when I do, I wear it because I like it so all those preaching on Twitter that there should be bindi on a woman's forehead as it's mandatory in our religion can go to hell. Not wearing bindi won't make me any less hindu or Indian! — Pooja Kopargaonkar (@thekopargaonkar) October 19, 2021 -
‘95 శాతం మంది భారతీయులకు పెట్రోల్ అవసరమే లేదు’
ఉత్తరప్రదేశ్: ఓ వైపు ప్రతిపక్షాలు, మేధావులు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నాయకులు అడ్డగోలు వ్యాఖ్యలు చేసి జనాలను మరంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటికో బండి అనే విధంగా మారాయి పరిస్థితులు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసే వారు సైతం బండి కొంటున్నారు. గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్, 4 వీలర్ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మినిస్టర్ దేశంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు అసలు పెట్రోల్తో పనే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆవివరాలు.. (చదవండి: గెలిపిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్: బీజేపీ) ఉత్తరప్రదేశ్కు చెందిన మినిస్టర్ ఉపేంద్ర తివారి.. జలౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రశ్నించగా.. ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాలుకు వేరే పనేంలేక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. 2014, అంతకు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు మోదీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగింది’’ అని తెలిపారు. ‘‘మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదు. కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్ ధరల గురించి ఆందోళన. దీనిపై ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల కోవిడ్ టీకాలు పంపిణీ చేసింది. కరోనా బారిన పడ్డ వారికి ఉచిత వైద్యం అందిస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు’’ అన్నారు. (చదవండి: నిరసన గళం: ఎలక్ట్రిక్ స్కూటర్పై సచివాలయానికి దీదీ) మినిస్టర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ‘‘నీ దృష్టిలో కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్ అవసరం ఉంటుందా.. ఇతర వాహనాలు వాడే వారు నీళ్లతో బళ్లు నడుపుతారా ఏంటి’’.. ‘‘వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు -
మెంటార్గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్
Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్గా ఎంఎస్ ధోని ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెంటార్గా ధోని తన పనిని ప్రారంభించాడంటూ ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. ఇంకా టి20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ధోని ఎలా ప్రారంభించాడని సందేహ పడకండి. తాజాగా శార్దూల్ ఠాకూర్ .. అక్షర్ పటేల్ స్థానంలో టి20 ప్రపంచకప్ టీమిండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్ఫిట్.. జట్టులోకి మరో ఆల్రౌండర్! దీనివెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్కే ఈ సీజన్లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే ఆడిన 15 మ్యాచ్ల్లో శార్దూల్ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్కు ప్లస్గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్కే ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్పై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్తో విరుచుకుపడ్డారు. లార్డ్ శార్దూల్ ఈజ్ బ్యాక్.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు.. అతని టాలెంట్తో ఎంపికయ్యాడు.. ధోని మెంటార్గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్తో రెచ్చిపోయారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. 🇮🇳 #T20WorldCup Call up 💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/sf6d9JmS4C — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 13, 2021 Lord Is Here #WorldCup pic.twitter.com/AUHlGEI2OU — Aakash Chopra (@cricketaakash) October 13, 2021 Lord Shardul Thakur replacing Axar Patel in #TeamIndia be like 🙈 pic.twitter.com/I5RSZilRhr — Paapsee Tannu ( Tax chor ) 2.0 🐦 (@tiranga__1) October 13, 2021 -
ఓ ఆంటీ.. పులితో ఆటా.. తేడా కొట్టిందో..!!
దుబాయ్: మన దగ్గర లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ కొన్ని దేశాల్లో ఇది చట్టబద్దం. డెలివరీకి ముందే పుట్టబోయేది ఆడ, మగ అనేది వెల్లడిస్తారు వైద్యులు. ఈ క్రమంలో విదేశాల్లో జెండర్ రీవిలింగ్ పార్టీలు జరుగుతుంటాయి. దీనిలో రెండు రంగులను వాడతారు. పింక్ ఆడపిల్లను సూచిస్తే.. బ్లూ.. మగపిల్లాడిని సూచిస్తుంది. సన్నిహితులు, స్నేహితులు మధ్య ఎంతో సంతోషంగా ఈ పార్టీని జరుపుకుంటారు. జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం) ఇప్పుడు ఈ జెండర్ రివీల్ పార్టీ గురించి ఎందుకంటే.. తాజాగా దుబాయ్లో జరిగిన జెండర్ రివీల్ పార్టీ వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో సదరు కుంటుంబం జెండర్ని వెల్లడించడం కోసం నిజమైన పులిని వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?) జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం) దుబాయ్కు చెందిన ఓ జంట బుర్జ్ అల్ అరబ్ హోటల్లో జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సదరు జంట పార్టీకి పులిని తీసుకువచ్చారు. ఇక దాన్ని బంధించకుండా.. ఉరికే వదిలేశారు. ఇక ఆ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెప్పడం కోసం గాల్లోకి బెలూన్లు ఎగరవేయసాగారు. (చదవండి: పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త) జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం) వీరు బెలూన్లు ఎగరవేస్తుంటే.. పులి గాల్లోకి ఎగిరి వాటిని పగలకొడుతుంది. ఇది చూసి అక్కడ ఉన్న జనాలు సంతోషంగా గోలగోల చేయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ సంగతి ఏమో కానీ నెటిజనులు ముఖ్యంగా జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం) ‘‘ఇది నిజంగా చాలా తప్పు. భూమ్మీద ఉన్న ఇలాంటి అద్భుత జీవులను మీ స్వార్థం కోసం ఇలా హింసించడం తగదు.. ఇది గర్వించదగ్గ విషయం కాదు’’.. ‘‘ఓ ఆంటీ అది ఏమైనా పెంపుడు జంతువు అనుకున్నావా.. పులితో ఆడుతున్నావ్.. దానికి చిర్రెత్తుకొస్తే.. వేటాడేస్తుంది’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. View this post on Instagram A post shared by Lovin Dubai | لوڤن دبي (@lovindubai) చదవండి: వివాదంలో యాడ్ షూటింగ్! అసలు నిజమేంటంటే.. -
‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’
బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు.. ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. (చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’) అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకొండి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ #WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks — ANI (@ANI) October 10, 2021 -
తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు
Virat Kohli Counter To Punjab Kings.. విరాట్ కోహ్లి ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనను ఎవరైనా టార్గెట్ చేస్తే వారికి తిరిగి కౌంటర్ ఇచ్చేవరకు వదలడు. మరి అలాంటి కోహ్లి తన ఆర్సీబీ జట్టును ట్రోల్ చేస్తే ఊరుకుంటాడా? తగ్గేదే లే.. అన్నట్లుగా గుర్తుపెట్టుకొని మరీ పంజాబ్ కింగ్స్కు కౌంటర్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీల్లో ఆర్సీబీతో మ్యాచ్లో విజయం తర్వాత పంజాబ్ కింగ్స్ ఆ జట్టును ట్రోల్ చేస్తూ కామెంట్ చేసింది. ఆర్సీబీ డగౌట్ను షేర్ చేస్తూ.. ''మేము మ్యాచ్ గెలిచాం.. ఇక్కడ అంత ప్రశాంతంగానే ఉందా'' అంటూ హిందీలో ట్వీట్ చేసింది. ఆ తర్వాత పంజాబ్ తమ ట్వీట్ను డిలీట్ చేసింది. Courtesy: RCB Twitter చదవండి: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' తాజాగా ఆదివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ డ్రెస్సింగ్రూమ్లో జరిగిన రూమ్ చాట్ను ట్విట్ర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో కోహ్లి.. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది.. అంటూ కామెంట్ చేశాడు. దీన్నిబట్టి పంజాబ్ కింగ్స్పై విజయాన్ని ఉద్దేశించే కోహ్లి అలా అన్నాడని.. గుర్తుపెట్టుకొని మరి కౌంటర్ ఇచ్చాడని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లోనూ సత్తా చాటిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు.. 4 ఓటములతో మూడో స్థానంలో నిలిచిన ఆర్సీబీ మూడో జట్టుగా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు Virat Kohli took a dig at #PunjabKings ‘dug-out’ tweet which was tweeted earlier this year in #IPL2021 during their match against #RCB. pic.twitter.com/DFzoxAlF4P — Neelabh (@CricNeelabh) October 4, 2021 -
'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'
Sehwag Trolls SRH Batting.. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎస్ఆర్హెచ్ ఆటతీరును వినూత్న రీతిలో ట్రోల్ చేశాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పేలవ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా టెస్టు మ్యాచ్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించింది. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. అందునా చివరి ఐదు ఓవర్లలో వేగంగా ఆడాల్సింది పోయి జిడ్డుగా ఆడి 36 పరుగులు మాత్రమే చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సెహ్వాగ్ ఎస్ఆర్హెచ్ ఆటతీరును ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేశాడు. చదవండి: IPL 2021: సూపర్ త్రో.. విలియమ్సన్ రనౌట్; సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త రికార్డు ''రాయ్, సాహాలతో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. అయితే వారిద్దరు తర్వగానే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన విలియమ్సన్, గార్గ్లు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని భావించా. ఇంతలో విలియమ్సన్ రనౌట్.. 21 పరుగులు చేసి గార్గ్ కూడా ఔటయ్యాడు. ఇక అబ్దుల్ సమద్ వచ్చి రావడంతోనే మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్ కాస్త మజాగా అనిపిస్తుందని అనుకుంటున్న తరుణంలోనే అతను ఔటయ్యాడు. ఇక ఎస్ఆర్హెచ్కు మిగిలింది ఐదు ఓవర్లు. కనీసం ఇప్పుడైనా మెరుపులు మెరిపిస్తారనుకున్నా. ఒక ఓవర్ ముగిసాక ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ నాకు నిద్రమాత్రల్లా కనిపించారు. ఇంకేముందు చివరి నాలుగు ఓవర్లు ఆదమరిచి నిద్రపోయా. లేచి చూసేసరికి ఎస్ఆర్హెచ్ స్కోరు 115/8 గా ఉంది. నాలుగు ఓవర్లు చూడకపోవడమే మంచిదైంది'' అంటూ ఫేస్బుక్ వీడియోలో కామెంట్ చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్లో ఇంటిబాట పట్టింది. ఆడిన 12 మ్యాచ్ల్లో రెండు విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కాగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్బాల్.. డెబ్యూ మ్యాచ్లోనే -
నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!?
Chaysam Divorce- Trolls On Preetham Jukalrkar: సమంత- నాగ చైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఏమాయ చేశావే సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసున్న వీళ్లు భార్యభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తున్నారు.చదవండి:ChaySam: 'ఏ మాయ చేశావే' నుంచి 'మజిలీ' వరకు ఈ క్రమంలో ముఖ్యంగా ఫ్యామిలీ మేన్ 2 చిత్రంలో సమంత బోల్డ్ సీన్లో నటించడం వీరి బ్రేకప్కు ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో సమంత తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తి కాళ్లు పెట్టుకుని ఫోటో దిగడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సమంత- నాగ చైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. దీంతో అతని ఇన్స్టాగ్రామ్కు వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరీ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరికి ప్రీతమ్ ఘాటుగానే బదులిచ్చినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతను జీజీ(అక్క)అని పిలుస్తాడు. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో చేసేదేమి లేక ప్రీతమ్.. తన కామెంట్ సెక్షన్ని డిసేబుల్ చేసేశాడు. చదవండి: హాట్ టాపిక్గా మారిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్టులు -
ఐఫోన్-13ను ఎగతాళి చేసిన గూగుల్ నెక్సస్..!
ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ మంగళవారం రోజున లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లపై కొంతమంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు. నెటిజన్స్తో పాటుగా జోమాటోకూడా ఐఫోన్-13 డిజైన్పై ట్రోల్ చేసింది. తాజాగా ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ కూడా ఐఫోన్-13 దారుణంగా ట్రోల్ చేసింది. చదవండి: ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా.. గూగుల్ తన సొంత ట్విటర్ ఖాతా నుంచి కాకుండా గతంలో గూగుల్ నుంచి వచ్చిన స్మార్ట్ఫోన్స్ గూగుల్ నెక్సస్ ట్విటర్ ఖాతా నుంచి ‘నేను గూగుల్ పిక్సెల్6 వచ్చేదాకా నిరీక్షిస్తానని’ తన ట్విట్లో పేర్కొందని 9టూ5గూగుల్ పేర్కొంది. ఇక్కడ విషయమేమిటంటే గూగుల్ నెక్సస్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసింది. గూగుల్ త్వరలోనే పిక్సెల్ 6 శ్రేణి ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫోటో కర్టసీ: 9టూ5గూగుల్.కామ్ ఐఫోన్-13 సిరీస్లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12తో ఐఫోన్-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్లతో సహా అనేక అప్గ్రేడ్లను కలిగి ఉందని ఆపిల్ తన లాంచ్ ఈవెంట్ పేర్కొంది. చదవండి: బ్యాంక్, ఆధార్ వివరాలపై గూగుల్ పే యాక్సెస్.. యూజర్ల భద్రతకు ముప్పు! -
ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ మంగళవారం రోజున లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ ఈవెంట్లో భాగంగా బాలీవుడ్ క్లాసిక్ దమ్ మారో దమ్ సాంగ్ను ప్లే చేసింది. ఐఫోన్-13 సిరీస్లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...! తాజాగా ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై కొంత మంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐఫోన్-12, ఐఫోన్-13 రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదంటూ ట్విటర్లో నెటిజన్లు మీమ్సీ షేర్ చేస్తున్నారు. నెటిజన్లే కాకుండా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కూడా ట్విటర్లో ఐఫోన్-12, ఐఫోన్-13 మోడళ్లపై తన దైన శైలిలో ట్రోల్ చేసింది. జోమాటో తన ట్విటర్లో ఐఫోన్-13 విషయంలో కెమెరాలను సమాంతరంగా కాకుండా, డయాగోనల్గా ఏర్పాటుచేసిందంటూ ట్విట్ చేసింది. ట్విటర్లో..ఐఫోన్-13 లో కేవలం ఒక చిప్నే మార్చగా... మిగతా హర్డ్వేర్స్కు ‘న్యూ’ జోడించి న్యూ ఎక్స్పీరియన్స్ పేరిట ఆపిల్ లాంచ్ చేసినట్లు ఓ నెటిజన్ తెలిపాడు. మరో నెటిజన్ మీ దగ్గర ఐఫోన్-12 ఉండి ఉంటే ఐఫోన్-13 మీకు కోసం కాదు అంటూ..ఐఫోన్-13 డిజైన్ విషయంలో ఫోటోషాప్ చేసిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. భిన్నంగా కన్పించపోయినా.. ఐఫోన్ 12తో ఐఫోన్-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్లతో సహా అనేక అప్గ్రేడ్లను కలిగి ఉందని ఆపిల్ తన లాంచ్ ఈవెంట్ పేర్కొంది.భారత్లో ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ. 69,900. 256జీబీ మోడల్ రూ .79,900 , 512జీబీ మోడల్ రూ .99,900 లకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .79,900, 256జీబీ ధర రూ .89,900 , 512జీబీ మోడల్ ధర రూ. 109,900 గా ఉండనుంది. iPhone 12 vs iPhone 13 pic.twitter.com/V3hzWb0eSQ — zomato (@zomato) September 14, 2021 Here are some big differences between the iphone 12 and 13. What about "new experience"? 😂 #iPhone13 #AppleEvent pic.twitter.com/MgkLWoSsy6 — Dexignko Studio (@dexignko) September 15, 2021 pic.twitter.com/5ynxAV2fky If you currently have iPhone 12, iPhone 13 isn't for you. Save your money.#iPhone13 #AppleEvent — Ƙɑɾɑղ (@karanverma__) September 15, 2021 చదవండి: iPhone: భారీగా తగ్గిన ధరలు, ఐఫోన్ లవర్స్కు శుభవార్త! -
‘‘అంత్యక్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’
Karanvir Bohra Arriving Sidharth Shukla Home In A Ciaz: బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ‘‘ఇక స్నేహితుడు మృతి చెంది.. బాధలో ఉంటే.. పాపరాజీలు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తాము ఎలాంటి కార్లలో వచ్చాం.. అందంగా ముస్తాబయ్యామా లేదా వంటి అంశాలపై తమని విమర్శిస్తూ వార్తలు రాస్తున్నారని.. వారి నీచ మనస్తత్వానికి జాలి పడుతున్నాను’’ అన్నారు నటుడు కర్ణవీర్ బోహ్రా. విషయం ఏంటంటే సిద్ధార్థ్ శుక్లా మరణం అనంతరం కర్ణవీర్ బోహ్రా అతడిని తల్లిని పరామర్శించేందుకు సిద్ధార్థ్ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో కర్ణవీర్ సియాజ్ కార్లో సిద్ధార్థ్ నివాసానికి వచ్చాడు. ఇది చూసి పాపరాజీలు సియాజ్ కారులో వచ్చాడు.. పేదవాడిగా మారాడు అంటూ కామెంట్ చేయసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోని కర్ణవీర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) దీనిలో అతడు ‘‘కుమారుడిని కోల్పోయి కుంగిపోతున్న తల్లిని చూడటానికి మేం వెళ్లాం. ఇలాంటి విషాద సమయంలో కొందరు పాపరాజీలు చాలా దారుణంగా మాట్లాడారు. ఇంత బాధలో కూడా మేం ఫైవ్స్టార్ అప్పియరెన్స్తో కనిపించాలా.. కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా.. సియాజ్ కారులో వచ్చినందుకు నేను పేదవాడిని అయ్యానా.. ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరు’’ అంటూ ఘాటుగా విమర్శించాడా కర్ణవీర్ బోహ్రా. (చదవండి: సిద్దార్థ్పై జోక్ చేసిన సల్మాన్, పాత వీడియో వైరల్) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) కర్ణవీర్ బోహ్రా తన భార్యతో కలిసి సిద్ధార్థ్ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాక.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్ధార్థ్ మరణంపై స్పందిస్తూ కర్ణవీర్ ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను చాలా షాక్లో ఉన్నాను. ఇది ఎలా జరిగింది. దేవుడు మనతో ఇలాంటి జోక్లు చేయడం దారుణం. అతడి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను’’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. (చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్ పోస్ట్మార్టం నివేదికలో ఏముంది?!) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) -
లార్డ్స్లో టీమిండియా విజయం.. వైరలవుతున్న ట్రోల్స్
లార్డ్స్: ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత్ టాపార్డర్ తడబడినప్పటికి భారత టెయిలెండర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలు అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ ముందు మంచి లక్ష్యాన్నే నిర్ధేశించారు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సిరాజ్ 4, బుమ్రా 3 దెబ్బకు 120 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో 151 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా లార్డ్స్ టెస్టు విజయం అనంతరం క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారత ప్రదర్శనను మెచ్చకుంటూ ఇంగ్లండ్ టీమ్ను ఒక ఆటాడుకున్నారు. '' 8 నెలల కాలంలోనే సిడ్నీ.. గబ్బా.. లార్డ్స్ టెస్టులో ఘన విజయాలు అందుకున్న టీమిండియాకు ఇది బెస్ట్ సీజన్.. ఇలాంటి విజయాలు మున్ముందు మరిన్ని చూడాలి..'' అంటూ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. ఇక ఆసీస్తో టెస్టు సిరీస్ను టీమిండియా గెలుచుకున్న తర్వాత '' టీమిండియాను తక్కువ అంచనా వేయకూడదు.. అంటూ ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ పలికిన వ్యాఖ్యలను నెటిజన్లు మరోసారి గుర్తు చేశారు. తొలి టెస్టులో వర్షం టీమిండియాను కాపాడిందని మైకెల్ వాన్ చేసిన కామెంట్స్ను దృష్టిలో ఉంచుకున్న అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూ.. ''ఇప్పుడేమంటావ్ వాన్.. నీ నోటికి తాళం పడిందా'' అన్నట్లుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటితో పాటు మరికొన్ని మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. మీరు ఒక లుక్కేయండి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Aussies to England :) What a year for Test match Cricket. Sydney, Gabba and Lords within a span of 8 months. Doesn't get better. Still feeling the joy of all these victories. pic.twitter.com/U51K6MyZqO — Virender Sehwag (@virendersehwag) August 17, 2021 Kohli to Siraj : it's your turn to bowl, we want to win this one. Siraj:#IndvsEng #IndianCricketTeam pic.twitter.com/osuvSdIn10 — SaurabhV (@100rab_v) August 16, 2021 Justin Langer be like: I told you “Never mess with the Indians”😌🇮🇳 #IndianCricketTeam pic.twitter.com/jAFvpXlGAX — Muskan Katoch (@_muskankatoch) August 16, 2021 Hello @MichaelVaughan ..........#INDvENG pic.twitter.com/9a1wHYWL7s — Krishna (@Atheist_Krishna) August 16, 2021 -
స్పెల్లింగ్ మిస్టెక్తో బుక్కైన పాక్ క్రికెటర్
ఎన్ని పండుగలున్నా.. జెండా పండుగను కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకుంటుంది. ఆగష్టు 15న భారత దేశం.. జిన్నా ఒత్తిడితో అధికార బదలాయింపు ఒకరోజు ముందు జరగడం, మరికొన్ని కారణాలతో 14వ తేదీనే పాకిస్తాన్లు స్వాతంత్య్ర సంబురాలు జరుపుతాయని తెలిసిందే. కాబట్టి, ఇవాళ పాక్ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భంగా క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేసిన ఓ ట్వీట్.. ట్రోలింగ్కు దారి తీసింది. శనివారం పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్Independence డేకి బదులు.. ఇండిపెన్స్Indepence అంటూ ఇంగ్లీష్లో తప్పు ఫొటో పోస్ట్ చేశాడు కమ్రాన్. మూములుగానే పాక్ క్రికెటర్లను ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతారా? అని ఎదురు చూస్తున్న మన నెటిజన్స్.. ఈ తప్పును గుర్తించారు. pic.twitter.com/ZG397jz3RT — Kamran Akmal (@KamiAkmal23) August 13, 2021 Perfect revenge on Britishers 👏🏻 Proud of you Brother @KamiAkmal23 pic.twitter.com/uYFZq8QifX — Unsocially M’idiotic (@m_idiotic) August 13, 2021 Respect for you brother, you the only person taking revenge from British for what they did to our country by doing same to their language — Scar (@Scar3rd) August 13, 2021 Pakistan waalon ka apna ek alag english dictionary.. respect! — Keh Ke Peheno (@coolfunnytshirt) August 14, 2021 Meet English He/She was really a nice person But now he/She is no more.... pic.twitter.com/jTd1k1HQnk — खडकवासल्याचा कोलंबस🇮🇳 (@aapalacolumbus) August 14, 2021 Carrying on Umar's Legacy 👌 Time to modify the dictionary — YOGESH (@i_yogesh22) August 13, 2021 ఇంకేం సోషల్ మీడియాలో కమ్రాన్ అక్మల్ను ఇలా ట్రోల్ చేసేస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు. కానీ, ఇలా గుర్తించే పెద్ద తప్పు.. అదీ దేశం మీద వేయడంతో పాక్లోనూ కొందరు కమ్రాన్ విమర్శిస్తుండడం విశేషం. -
'నువ్వు చెప్పేది వినొద్దంటా'; కార్తీక్ను ట్రోల్ చేసిన మహిళా క్రికెటర్
లండన్: టీమిండియా వుమెన్స్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ దినేశ్ కార్తీక్ను ట్రోల్ చేసింది. క్రికెటర్గా కొనసాగుతున్న కార్తీక్ ఇటీవలే కామెంటేటర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీన్ లండన్లో కౌంటీ క్రికెట్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక జేమిమా రోడ్రిగ్స్ హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా మంగళవారం ఆమె కామెంటేటర్ అవతారం ఎత్తారు. నాసిర్ హుస్సేన్, రాబ్ కీతో కలిసి కామెంటరీ చేశారు. ఈ సందర్భంగా రోడ్రిగ్స్ను ఉద్దేశించి దినేశ్ కార్తీక్ ట్విటర్లో ఫన్నీగా కామెంట్ చేశాడు. ''ఇంగ్లీష్ కామెంటేటర్లయిన నాసిర్ హుస్సేన్, రాబ్ కీలు ఏం చెప్పినా వినకుండా నీ స్టైల్లో కామెంటరీ చేయ్..'' అంటూ తెలిపాడు. కార్తీక్ ట్వీట్పై స్పందించిన రోడ్రిగ్స్ తనదైన శైలిలో బదులిచ్చింది. '' హహ్హహ.. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో.. వాళ్లు కూడా అదే చెప్పారు.. నువ్వు చెప్పేది ఏది వినకూడదని.. అవన్నీ అబద్దాలేనని'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వుమెన్స్ హండ్రెడ్ 2021 కాంపీటీషన్లో జెమిమా రోడ్రిగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో 92 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ఆమె లండన్ స్పిరిట్, ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్ల్లో అర్థ శతకాలతో మెరిసింది. ఇక ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీమిండియా తరపున 2018లో అరంగేట్రం చేసిన ఆమె 47 టీ20ల్లో 976 పరుగులు.. 21 వన్డేల్లో 394 పరుగులు చేసింది. HAHAHAHAHAHA!! Interestingly enough, that's EXACTLY what they told me about anything you say! 😂😂😂 https://t.co/Z4G4HU5r8B — Jemimah Rodrigues (@JemiRodrigues) August 11, 2021 -
నెంబర్ షేర్ చేసిన సెహ్వాగ్; దీని వెనుక ఇంత కథ ఉందా
ఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. తన డాషింగ్ బ్యాటింగ్తో టీమిండియా తరపున ఎన్నోసార్లు అద్భుతాలు సృష్టించిన సెహ్వాగ్ ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యాడు. తాజాగా సెహ్వాగ్ తన ట్విటర్లో ఒక ఆసక్తికర పోస్టును షేర్ చేశాడు. స్నానం చేస్తుంటే నా ఫోన్ షవర్లో పడిపోయింది. దానిని రిపేర్కు ఇచ్చా.. ఈ నెంబర్కు కాల్ చేయండి అంటూ 9112083319 నెంబర్ను షేర్ చేశాడు. ఇంకేముంది.. సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు దొరకడమే అదృష్టంగా భావించే నెటిజన్లు.. సెహ్వాగ్ లాంటి క్రికెటర్ నెంబర్ ఇస్తే ఊరుకుంటారా.. వెంటనే ఆ నెంబర్కు కాల్ చేశారు. అక్కడే నెటిజన్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ నంబర్కు ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వచ్చింది. దీంతో నెటిజన్లు సెహ్వాగ్ మమ్మల్ని ఫూల్స్ చేశాడని భావించారు. కానీ సెహ్వాగ్ ఆ నెంబర్ పెట్టడం వెనుక ఒక చరిత్ర దాగుంది. అదేంటంటే ఆ నెంబర్ను విడదీసి చూస్తే సెహ్వాగ్ రికార్డులు కనిపిస్తాయి. ముందుగా 91 నెంబర్ను గమనిస్తే.. సెహ్వాగ్ టెస్టుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య... 120 అనేది సెహ్వాగ్కు ఐపీఎల్లో అత్యుత్తమ స్కోరు(122 సెహ్వాగ్ అత్యధిక స్కోరు.. దానికి దగ్గరగా).. ఇక మధ్యలో ఉన్న 83... 2008లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సెహ్వాగ్ చేసిన పరుగులు. మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమైన చోట నాలుగో రోజు ఆఖరి సెషన్లో 68 బంతుల్లో 83 చేసిన వీరేంద్ర సెహ్వాగ్, భారత జట్టుకి అద్వితీయ విజయాన్ని అందించాడు. ఇక చివరగా 319.. అనేది టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక స్కోరుతో పాటు ట్రిపుల్ సెంచరీ. 2007-08లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సెహ్వాగ్ ఈ స్కోరు సాధించాడు. ఇక టీమిండియా తరపున సెహ్వాగ్ 251 వన్డేల్లో 8273 పరుగులు, 104 టెస్టుల్లో 8586 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేసింది. Dropped my phone in the shower, getting it fixed, call me on 9112083319 — Virender Sehwag (@virendersehwag) August 3, 2021 -
IND Vs SL: టీమిండియా సూపర్ విక్టరీ; అభిమానుల ట్రోల్స్ వైరల్
కొలంబో: రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా విక్టరీ తర్వాత అభిమానులు చేసిన మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దీపక్ చహర్, భువనేశ్వర్ల ఇన్నింగ్స్, లంక ఓటమి, భువీ 3093 బంతుల తర్వాత మళ్లీ నో బాల్ సంధించడం లాంటి విషయాలపై ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. దీపక్ చహర్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ను '' ధావన్ కెప్టెన్సీలో ధోని అంటూ.. 3093 బంతుల తర్వాత భువీ నోబాల్ వేయడాన్ని (3093-1).. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అండర్ టేకర్ వ్రెసల్మేనియా విజయాలతో పోల్చుతూ.. కామెంట్లు పెట్టారు. వీలైతే మరు ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. #INDvSL Bhubaneswar Kumar Overstepped After 3093Balls Meanwhile Bumrah:- pic.twitter.com/5LxhjHs5m0 — बिहारी 🖤🥀 (@Shitt_posterr) July 20, 2021 Deepak Chahar under Dhawan's captaincy.#INDvSL pic.twitter.com/7hYRdY66mf — ᵃ (@aqqu___) July 20, 2021 Mickey Arthur In Last 5 Overs :-#INDvSL pic.twitter.com/mqBKZkncfR — Sami.Sajjad (@SamiSajjad15) July 20, 2021 Deepak Chahar entering into dressing room be like 👏 #INDvSL pic.twitter.com/is62dgLlgQ — Prince Pandey🍁🦜 (@princepandey_) July 20, 2021 -
'ఏమయ్యింది.. మరీ ఇంత సన్నగా అయిపోయావేంటి రకుల్'?
“వెంకటాద్రి ఎక్స్ప్రెస్” సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్. అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టింది. కొన్నాళ్లుగా పరాజయాలు పలకరించడంతో ఈ అమ్మడు బాలీవుడ్కి మకాం మార్చింది. ఇక ఫిజికల్ ఫిట్నెస్పై రకుల్కు ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొంతకాలంగా రకుల్ శరీరాకృతిలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం భారీ వర్కవుట్లు చేస్తూ మరీ సన్నగా మారిపోయింది. ఇది వరకు కాస్త బొద్దుగా చాలా అందంగా ఉన్న రకుల్ ఈ మధ్య జీరో సైజ్లోకి మారిపోయింది. దీంతో నెటిజన్లు రకుల్ను ఆడేసుకుంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో చూసి తెగ ట్రోల్ చేసేస్తున్నారు. 'ఏమొచ్చింది మరీ అస్థిపంజరంలా ఇలా అయిపోయావేంటి' అంటూ రకుల్ ఫిజిక్పై కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉండేదానివి..ఎలా అయిపోయావ్ అంటూ మరికొందరు రకుల్ ఫోటోపై చేసిన మీమ్స్ ఇప్పుడు నెట్టింట హల్చేల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
కెన్యా, జింబాబ్వేతో ఆడాల్సింది; పాక్ పరువు తీసిన ఫ్యాన్స్
కార్డిఫ్: క్రికెట్లో పాకిస్తాన్ ఆట అనిశ్చితికి మారుపేరు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు. ఓడిపోతామనుకున్న మ్యాచ్లో గెలవడం.. కచ్చితంగా గెలుస్తామని అనుకున్నవి ఓడిపోవడం ఒక్క పాకిస్తాన్ జట్టుకే చెల్లుతుంది. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ జట్టులో నలుగురు ఆటగాళ్లు సహా మొత్తం ఏడు మంది సిబ్బంది కరోనా బారీన పడ్డారు. దీంతో స్టోక్స్ను కెప్టెన్గా నియమిస్తూ అందుబాటులో ఉన్న సెకండ్ టీమ్ను ఈ సిరీస్ కోసం ఈసీబీ అప్పటికప్పుడు ఎంపిక చేసింది. దీంతో ఈ సిరీస్లో పాకిస్థానే హాట్ ఫేవరెట్ అని అంతా భావించారు. కానీ తొలి వన్డేలోనే ఆ టీమ్కు ఊహించని షాక్ తగిలింది. 36 ఓవర్లలోపే కేవలం 141 పరుగులకే పాక్ బ్యాట్స్మెన్ చాప చుట్టేశారు. ఈ టార్గెట్ను ఇంగ్లండ్ వికెట్ మాత్రమే కోల్పోయి 21.5 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్తోనే ఇంగ్లండ్ టీమ్లో ఏకంగా ఐదుగురు వన్డేల్లో అరంగేట్రం చేయడం విశేషం. బెన్ స్టోక్స్ సిరీస్ కోసం స్టాండిన్ కెప్టెన్గా ఉన్నాడు. అలాంటి టీమ్ పూర్తి బలగంతో ఉన్న పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాక్ టీమ్ పరువు తీశారు. '' కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండని ఒకరు.. ఫుల్ టీమ్తో ఉన్న ఇంగ్లండ్ టీమ్పై శ్రీలంక ఇంతకన్నా బాగా ఆడిందని'' మరొకరు ట్విటర్లో కామెంట్ చేశారు. Woh Poochna yeh tha k Zimbabwe ya Kenya sae next series kab hai Humari? Takay Nail biting Finish dekhne mai to ayen 🤪🤪 @captainmisbahpk @waqyounis99 @Sikanderbakhts @ARazzaqPak @MuhammadWasim77 @aaliaaaliya @DrNaumanNiaz @ImranKhanPTI — Rizwan (@jojisoomro79) July 8, 2021 Pakistan can turn things around after this perpetual bad day that they are having for last 10 years by getting rid of @captainmisbahpk . Please for God`s sake do dismiss this guy and save Pakistan cricket. He changed the character of team from fighters to defenders #ENGvPAK — Haiderium حیدرام (@Haiderium10) July 8, 2021 -
Mansukh Mandaviya: కొత్త ఆరోగ్య మంత్రికి ట్రోల్స్ వెల్కమ్
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్గానే మారుతుంటుంది. అలాంటిది.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్లో అడుగుపెట్టిన మన్షుక్ లక్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్లు దారుణంగా ఉన్నాయి. Tray and tray will be success . — Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2014 Mr. Rahul Ji, great grand son of Mahatma Gandhi already wrote you that RSS was not at all responsible for death of Gandhiji — Mansukh Mandaviya (@mansukhmandviya) March 10, 2014 ఇక అందుకు సంబంధించి స్రీ్కన్ షాట్స్ కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్ అకౌంట్కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుజరాత్కు చెందిన మన్షుక్ మాండవీయ.. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్గా రీట్వీట్లు చేస్తున్నారు. He is our Health of Minister (#MansukhEnglish)🤦🙄#दर्जासमजूनघ्या #mansukhmandaviya @ShivsenaComms #CabinetReshuffle2021 #CabinetExpansion2021 pic.twitter.com/R8tpbEVd4I — 𝐏𝐫𝐚𝐭𝐢𝐤 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐊𝐚𝐥𝐚𝐬𝐤𝐚𝐫 (@PratiKkalaskar_) July 8, 2021 Several yers back i applied for a job They canceled me because of my Vary good ingles accent... Today me is halth Minister of the Entire duniya 😌#CabinetReshuffle#MansukhEnglish#MansukhMandviya#englishfans — Mansukh मंद | वाया Parody (@PranavThe2nd) July 7, 2021 Mansukh Mandaviya is our Health of Minister pic.twitter.com/mpYMEgI0DQ — Joy (@Joydas) July 7, 2021 -
'17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?'
బ్రిస్టల్: టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మకు చిత్రమైన అనుభవం ఎదురైంది. అయితే ఆ అనుభవం బ్యాటింగ్ విషయంలో కాదు.. ఆమె వయస్సు విషయంలో. విషయంలోకి వెళితే.. టీమిండియా మహిళల జట్టు ఆదివారం ఇంగ్లండ్ మహిళల జట్టుతో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్తో షఫాలీ వర్మ టీమిండియా తరపున వన్డే క్రికెట్లో 131వ వుమెన్ క్రికెటర్గా అరంగేట్రంచేసింది. 17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఇంతవరకు బాగానే ఉంది. మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా వుమెన్స్ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందన క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ టెన్ చానెల్ నిర్వహకులు షఫాలీ స్టాట్స్ను తప్పుగా చూపెట్టారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే.. ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా టీవీలో డిస్ప్లే అయింది. ఇంకేముందు ఇది గమనించిన నెటిజన్లు చానెల్ నిర్వాహకులను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకున్నారు. ''షఫాలీ వయస్సు 17 అయితే.. 28 అని చూపించారు.. ఏం తాగి వచ్చారా..? అరంగేట్రం మ్యాచ్లోనే షఫాలీకి వింత అనుభవం.. ఆమెకు తన వయస్సును తప్పుగా చూపించారని తెలిస్తే ఏమవుతుందో పాపం.. చానెల్ నిర్వాహకులు నిద్రపోతూ పనిచేస్తున్నారు''అంటూ కొందరు కామెంట్లు చేశారు. కాగా షఫాలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా షఫాలీ వర్మ టీ20ల్లో దూకుడైన ఆటతీరు కనబరుస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తన దూకుడైన ఆటతీరుతో సెహ్వాగ్ను గుర్తుకుతెస్తున్న షఫాలీ కొంతకాలంగా మంచి ఫామ్లో ఉంది. ఆమె ఫామ్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఆమెకు వన్డేల్లో ఆడే అవకాశం కల్పించింది. కాగా షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేయగా.. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా వుమెన్స్ జట్టు ప్రస్తుతం 36 ఓవర్లు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 41, దీప్తి శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ 15, సృ్మతి మందన 10 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్దే తొలి టీ20 Look at the age of Shafali verma, 28??🤔😒 Google uncle says just 17 years 😐#ENGvIND pic.twitter.com/48RsrPnpXw — Priya💙Addict (@impriyafan) June 27, 2021 Sony people are drunk or what 😭 Showing Shafali's age as 28 — Udit (@udit_buch) June 27, 2021 -
అతడికి 23, ఆమెకు 60.. ‘‘నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు’’!
వాషింగ్టన్: మన సమాజంలో పెళ్లి, ప్రేమ వంటి బంధాల్లో అబ్బాయికి ఎంత వయసున్న పర్వాలేదు కానీ.. అమ్మాయికి మాత్రం తక్కువ వయసే ఉండాలి. అలా కాకుండా పెద్ద వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ముందుగా చెప్పే మాట డబ్బుకు ఆశపడి చేసుకున్నారు అంటారు. సదరు వ్యక్తిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తారు. సేమ్ ఇలాంటి స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన వారంతా సదరు యువకుడిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు.. అమెరికాకు చెందిన 23 ఏళ్ల క్వారన్ అనే యువకుడు 60 ఏళ్ల చెర్లి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వ్యత్యాసం. వయసు తమకు పెద్ద సమస్యే కాదంటున్నారు ఈ జంట. పైగా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసే వీడియోలు, రొమాన్స్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇవి చూసిన నెటిజనులు వీరిని తెగ ట్రోల్ చేస్తుంటారు. ‘‘ఆమె చూడ్డానికి నీకు నానమ్మలా ఉంది.. పోయి పోయి ఈ ముసలామెను ఎలా లవ్ చేశావ్.. అసలు మీ బంధాన్ని మీ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేశారా’’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో చెర్లి మాట్లాడుతూ.. ‘‘కవర్ పేజ్ చేసి బుక్లో ఏముందో ఊహించే ప్రయత్నం చేయకండి. మా బంధం చాలా నిజాయతీతో కూడుకున్నది. పైకి కనిపించే ఆకారం ముఖ్యం కాదు. మేం ఒకరినొకరం ఎలా అర్థం చేసుకుంటున్నామనదే ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యమైనది మేం మనసు చూసి ప్రేమించుకున్నాం’’ అని తెలిపారు. అంతేకాక ‘‘నా కొడుకులు చెర్లి కంటే రెండు మూడు సంవత్సరాలు పెద్దవారు. వారు మా బంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. వారే మాకు కపుల్ గోల్స్ సెట్ చేస్తుంటారు. నేనేం తప్పు చేయడం లేదు. మేం కలిసి డ్యాన్స్ చేస్తుంటాం.. సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేస్తున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో మంచి విషయాలున్నాయి. మమ్మల్ని ద్వేషించే వారి గురించి మేం పట్టించుకోం. మా మనసులో ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది. ఇక వయసు అనేద కేవలం ఒక నంబర్ మాత్రమే. మనల్ని ఎవరు ప్రేమించాలో మనం నిర్ణయించుకోలేం. మా ఏజ్ గురించి కామెంట్ చేసేవారిని మేం అసలే పట్టించుకోం’’ అన్నారు. ఇక వీరిని విమర్శించే వారే కాక ప్రశంసించే వారు కూడా ఉన్నారు. ‘‘ఏవరేమన్నా మీరు పట్టించుకోవద్దు.. మీ మనసుకు నచ్చిన పని మీరు చేయండి. జనాల మాటలు పట్టించుకుని.. మీ సంతోషాలను పాడు చేసుకోకండి.. ప్రతి ఒక్కరు సంతోషాలను పొందడానికి అర్హులు’’ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: వైరల్: పి. మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం... వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు -
వివాహం అవసరమా.. మలాలాపై విమర్శలు
లండన్: తమ ఆంక్షలు లెక్కచేయకుండా చదువుకుంటుందని.. 13 ఏళ్ల వయసులో తాలిబన్ల తూటాలకు బలయ్యింది. అయినా బెదరకుండా ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తూ.. నోబెల్ బహుమతి అందుకుంది పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్. తాజాగా మరోసారి అరుదైన గౌరవం అందుకుంది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్జైన్ వోగ్ తన జూలై ఎడిషన్ కవర్ మీద మలాలా ఫోటో ప్రచురించింది. ఈ సందర్భంగా మలాలా రాజకీయాలు, సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ఈ క్రమంలో వివాహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వివాహం గురించి మలాలా చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలాలా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను పెళ్లికుమార్తెగా చూడాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది తమ సంబంధాల కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Sad to know about Malala;s thoughts.😢#MalalaOnMarriage pic.twitter.com/vLUujigsW5 — S A M R E E N 🍁 (@SamreeenSohail) June 3, 2021 మలాలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్’’.. ‘‘నువ్వు ఇలాంటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలతో యువతను పెడదోవ పట్టిస్తున్నావ్.. ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్’’.. ‘‘నీ వ్యాఖ్యాలు విచారకరం.. ఈ విషయంలో నీకు మద్దతు తెలపడం లేదు’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’