TS Assembly Greater Hyderabad
-
ఎస్ బాస్.. మేమూ మీ వాళ్లమే!
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. దాదాపు పదేళ్లకు తర్వాత తొలిసారిగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభావం ఇతర విభాగాల కంటే పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంలో కొందరు అధికారుల్లో మోదం.. మరికొందరిలో ఖేదానికి కారణమైంది. ఒకప్పుడు కొందరు నాయకుల కనుసన్నల్లో పని చేసిన అధికారులు ప్రస్తుతం పవర్లోకి వచ్చిన నాయకులను, వారి సన్నిహితులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో భారీ స్థాయిలో జరగనుండటంతోనూ ఇవి ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మరకలు తుడిచేసుకోవడానికి.. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారని, ప్రతిపక్షాలను ప్రత్యేకించి రేవంత్రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, అనుచరులను ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు రేవంత్రెడ్డే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారుల్లో కొందరు పదవీ విరమణ చేయడం, పొడగింపులో ఉన్న ఇంకొందరు రాజీనామాలు సమర్పించడం జరిగాయి. ఇక మిగిలిన వారితో పాటు అవకాశాన్ని బట్టి ఎటైనా మారగల వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం రేవంత్రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, కీలక అనుచరులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని కలవడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా తమపై ఉన్న అభిప్రాయం బలపడటంతో పాటు మరింత దూరం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. సాంకేతిక కారణాలు, ఈసీ నిబంధనల నేపథ్యంలో సోమవారం వరకు కాస్త నెమ్మదించారు. కోడ్ ముగియడంతో.. ఎన్నిలక నేపథ్యంలో షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కోడ్ అమలులోకి వచ్చింది. పోలింగ్, కౌంటింగ్ ముగిసినప్పటికీ సోమవారం వరకు అమలులో ఉంది. దీన్ని పట్టించుకోకుండా రేవంత్రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు సంజయ్ కుమార్ జైన్, మహేష్ మురళీధర్ భగవత్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆయా అధికారులు రెండు రోజుల పాటు మిన్నకుండిపోయారు. బయటపడకుండా ఫోన్ల ద్వారానే ప్రసన్నానికి ప్రయత్నాలు చేశారు. సోమవారంతో ఎన్నికల కోడ్ ముగిసిపోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అభినందనలు చెప్పే సాకుతో వారిని కలుస్తూ, పుష్పగుచ్ఛాలు అందిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఎన్నికల్లో మీ పార్టీ గెలవడానికి, అభ్యర్థుల కోసం రిస్క్ తీసుకుని, బయటపడకుండా అనేక సహాయసహకారాలు అందించినట్లు చెప్పుకుంటున్నారు. ► అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు పెద్ద ఎత్తున పదోన్నతుల నేపథ్యంలో కొందరు కమిషనరేట్లు, జిల్లాలు దాటాల్సి వచ్చింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ బదిలీలు అనివార్యమైనప్పటికీ ఈసారి ఇవి గతంకంటే భారీగా జరగనున్నాయి. దీంతో సుదీర్ఘకాలంలో అప్రాధాన్య పోస్టి ంగ్స్లో ఉన్న వారితో పాటు ఆశావహులు సైతం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టారు. ► ఇలా వారిని కలుస్తున్న ప్రతి అధికారీ నేను మీ వాడినేనని, ఇన్నాళ్లూ బయటపడలేకపోయానని, ఉన్నతాధికారుల ఒత్తిడితో మిన్నకుండిపోయానని.. ఇలా అనేక రకాలుగా సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. కొందరైతే తాము పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించే బ్యూరోక్రాట్లమని, ఎవరి ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుందని నేతల వద్ద వాపోతున్నారు. ఇలా బయటకు రాలేని, వచ్చినా అధికార పార్టీ వారు పట్టించుకోరని భావిస్తున్న కొందరు అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దో? అనే భావనలో వారు ఉన్నారు. -
వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ హవా
హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ మేరకు 2009లో ఖైరతాబాద్లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్రెడ్డి, సనత్నగర్లో మర్రి శశిధర్రెడ్డి, గోషామహల్లో ముఖేశ్గౌడ్, సికింద్రాబాద్లో జయసుధ, కంటోన్మెంట్లో శంకర్రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్లో బండారి రాజిరెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. -
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
అక్బరుద్దీన్ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి
చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు. ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఒబేద్ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
పాతబస్తీలో పతంగ్ జోరేనా...!
చార్మినార్: పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, యాకుత్పురా నియోజకవర్గాలు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో లాగే మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ బలం–అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే. చార్మినార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సరళి మారి మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఏర్పడింది. యథేచ్ఛగా బోగస్ ఓట్లు పోలయ్యాయి. ఎక్కడా గుర్తింపు కార్డుల కోసం సంబంధిత అధికారులు విచారణ (అడగకపోవడం) చేయకపోవడంతో ఎవరు పడితే వారు స్లిప్లతో బోగస్ ఓట్లు వేశారు. యాకుత్పురాలో మజ్లిస్ పారీ్టకి ఎంబీటీ గట్టి పోటీనిచి్చంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే.. ► యాకుత్పురా నియోజకవర్గం నుంచి ఎంబీటీ అభ్యరి్థగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్, మజ్లిస్ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ మేరాజ్కి గట్టి పోటీ నిచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు మార్పును కోరుతుండటంతో మజ్లిస్ పార్టీకి కాకుండా ఎంబీటీకి అధిక సంఖ్యలో ఓట్లు పోలైనట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి ఈసారి యాకుత్పురా నుంచి టికెట్ దక్క లేదు. ఆయన స్థానంలో నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మేరాజ్కు టికెట్ లభించడం.. ఆయన స్థానికేతరుడు కావడంతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► అయితే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మజ్లీసేతర పారీ్టలైన బీఆర్ఎస్ అభ్యర్థి సామా సుందర్రెడ్డి కేవలం ఐఎస్ సదన్ డివిజన్, గౌలిపురా డివిజన్లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి.. మిగిలిన డివిజన్లలోని ఓటర్లకు అతని ముఖం ఎలా ఉంటుందో చూపించ లేదు. ► ఇక బీజేపీ అభ్యర్థి వీరేందర్ యాదవ్ సైతం గౌలిపురా, కుర్మగూడ డివిజన్లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఐఎస్సదన్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ► యాకుత్పురా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవిరాజ్ అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించ లేదు. కేవలం ఒకటి రెండు చోట్ల పాదయాత్రలు నిర్వహించిన ఆయన ఒక దశలో ఎన్నికల కార్యాలయానికి తాళాలు వేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ► ఇలా యాకుత్పురాలో మజ్లీసేతర పారీ్టలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే. చారి్మనార్లో మజ్లిస్కు గట్టి పోటీనిచి్చన కాంగ్రెస్, బీజేపీ.. ► చార్మినార్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్తో పాటు బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్ పోటాపోటీగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ..మజ్లిస్ పార్టీ అభ్యర్థి మీర్ జులీ్ఫకర్ అలీ విజయం సాధించనున్నారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ నామమాత్రమే. చాంద్రాయణగుట్టలో మజ్లిస్కు పోటీ నిచ్చిన బీజేపీ.. ► చాంద్రాయణగుట్టలో ఈసారి కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించనున్నారు. ► బీజేపీ తరఫున భాగ్యనగర్ గణేష్ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్ ఎన్నికల బరిలో ఉండి ప్రచారంలో దూసుకు పోయారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వీరిరువురి ముఖాలు సైతం నియోజకవర్గం ఓటర్లకు తెలియకుండా పోయింది. బహదూర్పురాలో కనిపించని బీఆర్ఎస్.. ► బహదూర్పురా నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ జెండాపై ఎవరూ పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొజంఖాన్కు ఈసారి టికెట్ లభించ లేదు. ఈయన స్థానంలో మోబిన్ ఎన్నికల బరిలో దిగగా.. భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. ► ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్కుమార్ గట్టిగా పోటీనిచ్చారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీతో పాటు బీజేపీ అభ్యర్థి వై.నరేష్ల పోటీ నామమాత్రమే. -
మలక్పేటలో మళ్లీ మజ్లిస్ ?
దిల్సుఖ్నగర్/చంచల్గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. మలక్పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం. బీజేపీ మేకపోతు గాంభీర్యం... ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్ ఆశిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్రెడ్డిని వరించడంతో రవీందర్రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎన్నికల మెనేజ్మెంట్లో దిట్ట అయిన రవీందర్రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు. మలక్పేటలో చాలా మంది సీనియర్ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో బీజేపీ క్యాడర్ గందరగోళానికి గురైంది. మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్.. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రియల్టర్ వ్యాపారి షేక్ అక్బర్ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. డిసెంబర్ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్లో ఓటు వేయనున్నారు. -
చార్మినార్ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్పై.. ఎలాంటి కఠిన చర్యలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మేఘా రాణి అగర్వాల్తో పాటు పవన్ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లో సీఆర్పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. హైదరాబాద్ హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్లో తమపై దాఖలైన కేసులో అరెస్టు సహా ఇతర చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మేఘా రాణి అగర్వాల్తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది అంజలి అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన మేఘా రాణి అగర్వాల్ చార్మినార్ నుంచి పోటీ చేస్తున్నారని, ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కొంత గందరగోళం చోటుచేసుకుందన్నారు. ర్యాలీలో గందరగోళంపై ఎండీ.జాఫర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిటిషనర్లపై కేసు నమోదైంది. 22న పిటిషనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ, పిటిషన్లో వాదనలను ముగించారు. -
అత్యంత అప్రమత్తంగా నగర పోలీసు విభాగం
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండనున్నారు. ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బయటకు వెళ్లి మళ్లీ స్ట్రాంగ్ రూమ్స్కు చేరే వరకు ఎక్కడిక్కడ ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మంగళవారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. నగర వ్యాప్తంగా 144వ సెక్షన్, నిషేధాజ్ఞలు విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని 15 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి వీటి వద్ద ఈవీఎంల పంపిణీ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఈవీఎం బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరతాయి. ఆపై గురువారం రాత్రి పోలింగ్ ముగిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్కు ఈవీఎంలను తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు సిబ్బంది, అధికారులు నిర్విరామంగా విధుల్లో ఉండనున్నారు. కీలక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి మాత్రం రిలీవర్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రకారం నిర్ణీత సమయం తర్వాత ఆ ప్రాంతంలో కొత్త వాళ్ళు వస్తూ రోటేషన్ విధానంలో పని చేస్తారు. నగదు, మద్యం సహా ఇతర వస్తువులు పంపిణీ, ఓటర్ల తరలింపు పైనా నిఘా వేసి ఉంచుతున్నారు. నగర కమిషనరేట్లో ఉన్న 7 జోన్లలోనూ అధికారులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్మార్చ్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాలను 200 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. వీటికి తోడు నగర వ్యాప్తంగా నిషేధాజ్జలు విధించారు. వీటి ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటం, జెండాలతో సహా ఎలాంటి కర్రలు తదితరాలు కలిగి ఉండటం నిషేధం. -
కష్టాలు తీరాలంటే.. కాంగ్రెస్ జెండా ఎగరాలి
కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం ప్రజల కష్టాలు తీరాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఈసీఐఎల్లో రేవంత్రెడ్డి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉప్పల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్రెడ్డిని గెలిపిస్తే ప్రజల వెన్నంటే ఉంటూ కష్టాలు తీరుస్తారన్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రానివారికి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మల్కాజిగిరి ఎంపీగా తనను ఆశీర్వదించి పార్లమెంట్కు పంపినట్లే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుండి మందముల పరమేశ్వర్రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను చూసి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉంటుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని, తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్ పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఓటు వేశాక సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్లో పోస్టు
హైదరాబాద్: గ్రీన్ చాలెంజ్, బకెట్ చాలెంజ్ తరహాలోనే ఓటు చాలెంజ్కు కాలనీ సంఘాలు తెరలేపాయి. గ్రేటర్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు, యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు యునైటెడ్ ఫెడరేషన్న్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్న్ (యూ–ఎఫ్ఈఆర్డబ్ల్యూఏఎస్) పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రౌడ్ ఓటరు, ఫ్యామిలీతో సెల్ఫీ..అనే కార్యక్రమాలను చేపడుతున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి బీటీ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబంతో కలిసి ఉదయమే ఓటు వేసి, సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగాలని, ఆయా ఫొటోలను కాలనీ సంఘాల వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయాలని సూచించారు. కాలనీలో ఇతరులకు ఓటు వేయాలని చాలెంజ్ చేయాలని తెలిపారు. డివిజన్్ స్థాయిలో వాట్సాప్ గ్రూప్లు.. నగరంలోని 4,800 కాలనీల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని డివిజన్ స్థాయిలో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్లో 800–900 మంది సభ్యులున్నారు. ఈనెల 30న పోలింగ్ రోజు ఉదయమే ఓటేశాక కుటుంబ సభ్యులంతా కలిసి వేలిపై సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగి కాలనీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాలని అసోసియేషన్న్ ప్రతినిధులు సూచించారు. ఆ రోజు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోవాలని, వేడుకలకు హాజరవ్వాల్సి ఉంటే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్కు ముందురోజు కాలనీ వాసులంతా సమూహంగా బూత్ వరకు ఈవినింగ్ వాక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 40–55 శాతం మాత్రమే పోలింగ్ నమోదైన కాలనీల్లో ఈసారి 60 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. -
‘కొడంగల్’ సింహం ఎవరో?
కొడంగల్: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడీ నాయకులకు అంతుపట్టడం లేదు. ఓటరును ప్రసస్నం చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అయితే కొడంగల్లో ఎవరు గెలిచినా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. అందులో ఒకరు రేవంత్రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన విజయం ఖరారైతే రాజకీయంగా మరింత పట్టు సాధిస్తాడనడంలో ఎలాటి సంషయం లేదు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకుపైగా గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం కొడంగల్ ప్రజల తలరాత మారుస్తుందని హస్తం నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి గెలిస్తే మంత్రి పదవి లభిస్తుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ గెలిస్తే మంత్రి పదవి, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కొడంగల్కు వరిస్తుందని జనం భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని గెలిపించాలనే విషయంపై ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పలు సర్వేల్లో బహిర్గతమవుతోంది. ఈనెల 30న సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్పోల్లో ఈ విషయం బయట పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి కోసం శ్రమిస్తున్న నేతలు..? నరేందర్రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ వస్తుందని బీఆర్ఎస్ అధినేతలు ఏ క్షణంలో ప్రకటించారో కాని అప్పటి నుంచి ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల మనిషిగా పేరుగాంచిన ఆయనకు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అఽభిమానులు ఉన్నారు. ఆయన కోసం గట్టిగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఆయన నామినేషన్ వేస్తే అలవోకగా గెలిచేంతగా పట్టు సాధించారు. అయితే ప్రమోషన్ ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీఆర్ఎస్ జిల్లా నేతలే ఆయన ఓటమి కోసం శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గెలిస్తే తమకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఓడితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు పీఎన్ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గురునాథ్రెడ్డి కేడర్ రేవంత్కే జై కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కీలకంగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేసి నరేందర్రెడ్డిని అసెంబ్లీ మెట్లెక్కించారు. గురునాథ్రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆయన కారు దిగి కాంగ్రెస్కు మద్దతిచ్చారు. గురునాథ్రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని ఆయన కేడర్ మొత్తం రేవంత్ పక్షాన నిలిచింది. హస్తం విజయం కోసం గట్టిగా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులను కాంగ్రెస్లో చేర్పించారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఇబ్బందికర వాతావరణం కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్లో బీఆర్ఎస్ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎవరి తలరాతను మారుస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్స్టేషన్లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్లో ‘ఓట్ నౌ’ కోడ్ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆ 24 సీట్లతోనే అధికార పగ్గాలు?
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రధాన రాజకీయ పక్షాలకు కంచుకోటలుగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరుగులేని శక్తిగా తయారయ్యాయి. ప్రతిసారి పోలింగ్ శాతం సగానికి మించనప్పటికి.. పోలైన ఓటింగ్లో సైతం సగం శాతం దక్కించుకున్న అభ్యర్థులు విజయకేతనంఎగరవేయడం సర్వసాధారణంగా మారింది. కేవలం పార్టీ సంప్రదాయ, సెంటిమెంట్, లబ్ధి పొందిన, ప్రలోభాలకు గురైన, రాజకీయ పార్టీ కార్యకర్తలు, సానుభూతి తదితరులు మాత్రమే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన తటస్థ ఓటర్లు అభ్యర్థుల జయాపజయాలపై పెద్ద ఆసక్తి లేక తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఫలితం వన్ సైడ్గా డిసైడ్ అవుతోంది. వాస్తవంగా ప్రతి ఓటు ప్రాధాన్యం కలిగిందే. ఓటు హక్కు వినియోగించడంలో నిర్లక్ష్యమే ప్రభావం చూపుతోంది. 40 శాతం సీట్లు ఇక్కడే.. రాష్ట్రం మొత్తంమీద 119 అసెంబ్లీ స్థానాలుండగా అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 60 అందులో 40 శాతం సీట్లు మహా నగరంలోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకమే. పాతబస్తీ మినహా ఏకపక్షంగా ఏ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం లేదు. మజ్లిస్ పార్టీకి మాత్రం గ్యారంటీగా ఆరేడు సీట్లు వస్తాయి. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ఉన్నా.. అధికార, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులకే ఫలితం మొగ్గు చూపుతోంది. పాతబస్తీలో సంప్రదాయ ఓట్లే రాష్ట్రంలోనే అతి తక్కువగా పోలయ్యే ఓట్లు హైదరాబాద్ పాతబస్తీలోనే. ఇక్కడ కేవలం సంప్రదాయ ఓటర్లు మాత్రమే తమఓటు హక్కును వినియోగిస్తారు. అది కూడా ముస్లిం– హిందు ఓట్లు మాత్రమే. అందులో సైతం ముస్లిం ఓటర్లలో 35 శాతం వరకు, హిందూ ఓటర్లలో 20 శాతం వరకు శాతం వరకు మాత్రమే తమ హక్కు వినియోగించుకుంటారు. పాతబస్తీల పెద్దగా పోటీ ఉండని కారణంగా రెండు సామజిక వర్గాలు సైతం ఓటింగ్పై పెద్దగా ఆసక్తి కనబర్చరు. గత ఎన్నికల్లో మజ్లిస్ 7 స్థానాల్లో గెలుపొందింది. నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా సిట్టింగ్ స్థానాలను పదిల పర్చుకుంది. మజ్లిస్కు నాంపల్లి మినహ ఎక్కడ గట్టి పోటీ ఎదురుకాలేదు. అయినా ఏడు శాతం ఆధిక్యతతో గట్టెక్కింది. కొత్త ఓటర్లే కీలకం.. గ్రేటర్ పరిధిలో ఈసారి యువ ఓటర్లు అధికంగా పెరిగారు. మొత్తం మీద 2.71,084 కొత్త ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే హైదరాబాద్ 77,5 22, రంగారెడ్డి జిల్లాలో 92,540, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 1,01,022 ఓట్లు పెరిగాయి. పాతబస్తీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగినట్లయింది. ఇందులో తొలి ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. పాతబస్తీతో పాటు మిగతా సెగ్మెంట్లలో సైతం సిట్టింగులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు, జెండాలు మారుతున్న వారి సంప్రదాయ ఓటర్లు సైతం వారి వెంట నడుస్తన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్, అంబర్పేట, ఉప్పల్ మినహా సనత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మహేశ్వరంలో పాతకాపులకే పట్టం లభిస్తూ వస్తోంది. గత పర్యాయం ఇలా.. గ్రేటర్ పరిధిలో గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 14 సీట్లను దక్కించుకుంది. అంతకు ముందు 2014లో 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఎల్బీనగర్, మహేశ్వరంలోనే మాత్రమే నెగ్గింది. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరిపోయారు. అంతకు రెండు పర్యాయాలు ముందు 2009లో గ్రేటర్లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే గెలుపొందింది. 2014లో గోషామహల్తోపాటు ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్లో విజయం సాధించింది. -
బేగంపేట్ ఎయిర్పోర్టు.. బిజీబిజీ
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి వీటి వినియోగం విరివిగా పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. బహిరంగసభలతో పాటు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలు, ర్యాలీలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రమంతటా పర్యటించాల్సివస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరుసగా వివిధ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు రోడ్డు మార్గంలో వెళ్లడం కష్టసాధ్యంగా మారడంతో అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు హెలికాప్టర్లపైనే ఆధారపడి పరుగులు తీస్తున్నారు. ఇంచుమించు నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రోజు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సైతం రోజుకు నాలుగైదు సభలకు హాజరవుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావులు, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి తదితర నాయకులు రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు కూడా హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో రోజుకు 3 నుంచి 4 హెలికాప్టర్లను మాత్రమే వినియోగించగా ఈసారి రోజుకు పది వరకు వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రముఖుల రాకపోకలు మినహా మిగతా రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే బేగంపేట్ ఎయిర్పోర్టు కొద్ది రోజులుగా సందడిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, నాయకుల రాకపోకలతో బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి విమానాలు పరుగులు తీస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షలు ఖర్గే,ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, తదితరుల రాకపోకలతో పాటు వారితో పాటు వచ్చే ఇతర నాయకులు, స్థానిక నేతల ఉరుకులు,పరుగులతో బేగంపేట్ కళకళలాడుతోంది. ఐదుగురి నుంచి ఏడుగురి వరకు.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న హెలికాప్టర్లన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవే. కొన్ని సింగిల్ ఇంజిన్ సామర్థ్యం కలిగినవి కాగా, చాలా వరకు డబుల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాటినే వినియోగిస్తున్నారు. ఒక్కో చాపర్లో ఐదుగురు నుంచి ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. దీంతో వీటి కోసం పార్టీలు చేసే ఖర్చు కూడా రూ.లక్షల్లోనే ఉంది. గతంలో గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఒక్కో హెలికాప్టర్కు గంటకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆయా సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగడం, అన్ని పార్టీలకు చెందిన నాయకులు విరివిగా పర్యటిస్తుండటంతో చార్జీలను భారీగా పెంచాయని ఏవియేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పలు ఏవియేషన్ సంస్థలు హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, చిప్సన్ ఏవియేషన్, ఇండో పసిఫిక్ ఏవియేషన్, గోల్డెన్ ఈగిల్ ఏవియేషన్ తదితర సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ప్రచారంలో పరుగులు తీస్తున్నాయి. ఆగస్టా వెస్ట్ల్యాండ్ (ఏడబ్ల్యూ) 109, ఏడబ్ల్యూ 139, ఏడబ్ల్యూ 169, బెల్ 429,యురోకాప్టర్ 135 తదితర రకాలకు చెందిన హెలికాప్టర్లు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి. ఈ నెల 28 వరకు రాజకీయ పార్టీలు హెలికాప్టర్లను వినియోగించనున్నాయి. -
పాతబస్తీలో వేడెక్కిన రాజకీయం.. యాకుత్పురా చేజారేనా?
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో మజ్లిస్కు ఎంబీటీ కొరకరాని కొయ్యగా మారింది. ఈసారి పాతబస్తీకే పరిమితమై కేవలం తొమ్మిది స్థానాల్లో బరిలో దిగినప్పటికీ.. ఒక సిట్టింగ్ స్థానంలో ఎంబీటీ, మరో రెండు సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు ఆందోళనకరంగా తయారైంది. గతంలో ఏన్నడూ లేని విధంగా మజ్లిస్కు గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పాదయాత్ర, స్థానిక సభలతో పరిస్థితి చక్కదిద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యాకుత్పురా చేజారేనా? ► ఎంబీటీ దూకుడుతో మజ్లిస్కు యాకుత్పురా సిట్టింగ్ స్థానం చేజారే పరిస్థితి నెలకొంది. మజ్లిస్ పక్షాన నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ పక్షాన ఆ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొన్నట్లు కనిపిస్తోంది. యాకుత్పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాకు రిటైర్మెంట్ ప్రకటించిన మజ్లిస్.. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని యాకుత్పురాకు బదిలీ చేసి రంగంలోకి దింపింది. ► రెండు దశాబ్దాలుగా యాకుత్పురా స్థానాన్ని కై వసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంబీటీ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవంగా గతంలో మజ్లిస్ నుంచి చీలిన ఎంబీటీ యాకుత్పురా స్థానాన్ని కై వసం చేసుకుంది. ఆ తర్వాత ఎంబీటీ నుంచి ఎన్నికై న ముంతాజ్ ఖాన్ మజ్లిస్లో చేరి వరసగా గెలుస్తూ వచ్చారు. గత పర్యాయం ముంతాజ్ ఖాన్ చార్మినార్ నుంచి పోటీ చేసి ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎంబీటీ తన పూర్వవైభవం కోసం యాకుత్పురాపై సీరియస్గా దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు పాట్లు పడుతోంది. నాంపల్లి పదిలమేనా? మజ్లిస్ సిట్టింగ్ స్థానమైన నాంపల్లిలో పరిస్థితి నువ్వా.. నేనా? అన్న విధంగా తయారైంది. మజ్లిస్ వ్యూహత్మంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్క సెగ్మెంట్కు పంపించి ఇక్కడి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ను రంగంలోకి దింపింది. ఇదే స్థానం నుంచి మూడు పర్యాయాలుగా పోటీ పడుతున్న ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో తీవ్ర పోటీ తప్పడం లేదు. కాంగ్రెస్ దూకుడు కూడా మజ్లిస్కు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ , మరోవైపు ఫిరోజ్ ఖాన్కు వ్యక్తిగత ప్రాబల్యం మజ్లిస్ ఓట్లకు గండికొట్టే అవకాశాలున్నాయి. మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ బలపడింది. స్థిరాస్తి వ్యాపారి అక్బర్ ప్రచారం ఉద్ధృతం చేయడం మజ్లిస్ను కలవర పెట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకుప్రయత్నిస్తున్నారు. -
పల్లెకే మా ఓటు! ఉంటారా.. ఊరెళ్తారా..
హైదరాబాద్: గ్రేటర్ అభ్యర్థుల గుండెల్లో సరికొత్త గుబులు మొదలైంది. వలస ఓట్లపై ఆందోళన నెలకొంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి స్థిరపడినప్పటికీ చాలామంది నగరవాసులు సొంత ఊళ్లలోనే ఓటింగ్లో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో వేలాది మంది నగరంలోనూ, సొంత ఊళ్లోను ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 30 వేల మందికి పైగా ఓటర్లు రెండు చోట్ల ఓటుహక్కును కలిగి ఉన్నట్లు అంచనా. వివిధ కారణాల దృష్ట్యా వారంతా నగరంలో ఉంటున్నప్పటికీ పుట్టి పెరిగిన ఊళ్లలో తమ అస్తిత్వాన్ని చాటుకొనేందుకు సొంత ఊళ్లలోనే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదొక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లోనూ నగరంలో ఓటు హక్కును కలిగి ఉన్నప్పటికీ చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిణామం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఉన్నత, మధ్యతరగతి వర్గాల కంటే దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాలే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం నగరంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధుల తరఫున ప్రచారంలో పాల్గొనడంతో పాటు, సభలు, సమావేశాల్లోనూ ఈ వర్గాలే భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటుహక్కును ఎక్కడ వినియోగించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అనుచరులతో నిఘా... ► ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అనుచరులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తున్నారు. డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా ఇన్చార్జులను ఏర్పాటు చేసి ప్రతి ఓటరు నగరంలోనే తమ ఓటుహక్కును వినియోగించుకొనేలా ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీ మొదలైన దృష్ట్యా ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లకుండా గట్టి హామీలను తీసుకుంటున్నట్లు తెలిసింది. నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి. మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్థిరపడిన వారు, వలస కూలీలు, అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారు, స్విగ్గి, జొమాటో, ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత వర్కర్లు తదితర వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 30 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ► సొంత ఊళ్లలో స్థిరనివాసం కలిగిన వీరిలో ఎక్కువ మంది నగరంలో అద్దె ఇళ్లల్లోనే నివస్తున్నారు. దీంతో నగరంలో ఓటుహక్కు, రేషన్ కార్డు వంటివి కలిగి ఉన్నప్పటికీ ఎప్పటికై నా సొంత ఊళ్లకు వెళ్లాల్సిన వారిమేననే భావనతో ఉన్నారు. దీంతో సొంత ఊళ్లోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ చాలా మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అలా వెళితే నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది అశనిపాతమే కానుంది. వాహనాలు రెడీ.. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ఓటర్లను తరలించేందుకు వివిధ పార్టీలు పెద్ద సంఖ్యలో వాహనాలను బుక్ చేస్తున్నాయి. ఓటర్లను నగరంలోని తమ ఇంటి నుంచి తీసుకెళ్లి ఓటింగ్ అనంతరం తిరిగి నగరానికి చేరవేసేందుకు ట్రావెల్స్కు చెందిన వాహనాలను బుక్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మినీ బస్సులు, కార్లు, క్రూజర్లు వంటి వాహనాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు. అలా రాలేనివాళ్లకు బస్సుల్లో, రైళ్లలో వచ్చేందుకు చార్జీలు, ఖర్చులు కూడా ముందస్తుగానే అందజేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సొంత ఊళ్లలోఓటు హక్కును వినియోగించుకొనేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలను సేకరించేందుకు ఆయా ఊళ్లకు చెందిన నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎలాంటి ఖర్చులకై నా వెనుకడుగువేయడం లేదు. ఇటు హైదరాబాద్లోని వివిధ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు అందజేసే తాయిలాలు.. అటు జిల్లాల్లోని సొంత నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి వచ్చే ఆహ్వానాలతో ఓటర్లు ఎటూ తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
మజ్లిస్ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ పారీ్టకి చారి్మనార్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ పోటీ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో మజ్లిస్ కార్పొరేటర్లు.. ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు టికెట్ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్గట్టి, మొఘల్పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఘాన్సీబజార్ నుంచి .. నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్ డివిజన్ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్ డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. -
25 నుంచి మరింత ఉద్ధృతంగా..
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ రాజధాని నగరం హైదరాబాద్పై దృష్టి సారించాయి. మూడు జిల్లాల పరిధిలోని 29 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ‘టార్గెట్– హైదరాబాద్’ లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కొందరు ఇప్పటికే నగరానికి వచ్చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సికింద్రాబాద్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ సైతం ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్కు వచ్చారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో, రోడ్షోల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటోన్మెంట్లో పర్యటించారు. పలు సమావేశాల్లో ప్రసంగించారు. తుది దశకు చేరుకోవడంతో.. ► రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదును పెట్టాయి. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వివిధ వర్గాలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. మహిళలు, నిరుద్యోగులు, ఐటీ నిపుణులు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకొని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ సైతం ఎక్కడికక్కడ ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాయి. 25 నుంచి మరింత ఉద్ధృతంగా.. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నిర్వహిస్తోన్న ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ► మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలుచోట్ల జరగనున్న సభలు, ర్యాలీలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లలో ఆయన పాల్గొననున్నారు. 25న మహేశ్వరంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. 27వ తేదీన నగరంలో రోడ్షోలో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచే కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ నగరంలో మకాం వేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తదితర అగ్రనేతలంతా హైదరాబాద్తో పాటు వివిధ చోట్ల జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. -
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్రావు, గోపు రాము, జయేందర్రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
తొమ్మిదిన్నరేళ్లలో నగర రూపురేఖల్నే మార్చాం
యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇప్పటి వరకూ చేసిన పనులేమిటో చెబుతూ, మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల వారెవరన్నది తాను పట్టించుకోనన్నారు. ఏ పనులు చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో సరిగ్గా తెలియని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ కూడబెట్టిన అవినీతి సొమ్మును వెలికితీసి దాంతో తమ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. గాలి మాటలతోనే కాంగ్రెస్ హామీలు ఫేక్ అని వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. మీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేమిటి? వాటినెలా పరిష్కరిస్తారు? సమస్యలనేవి నిరంతరం ఉంటాయి. ఒకటి పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొస్తుంది. సమస్యల్ని క్రమేపీ తగ్గించుకుంటూ, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేస్తున్నాను. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఇస్తోంది. నగరానికి, మీ నియోజకవర్గానికి ఇస్తున్న హామీలు? హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది. దేశంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధిని ఇంకా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలకు 24 గంటల కరెంటుకు ఢోకాలేదు. యాభయ్యేళ్ల వరకు తాగునీటి సమస్యల్లేకుండా చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే అందుతున్నాయి. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నుంచీ నీటిని రప్పించే పనులున్నాయి. ముంపు సమస్యల్లేకుండా ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టాం. పూర్తయిన పనులతో వరద సమస్యలు కొంత తగ్గాయి. అన్నీ పూర్తయితే ఈ సమస్యలిక ఉండవు. వాటికోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేసిన పనుల్లో ముఖ్యమైనవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీఓ 58, 59ల ద్వారా ఇళ్ల పట్టాలు చేతికొచ్చాయి. పేదలకు ఇప్పటికే 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాం. మరో 30వేల ఇళ్లు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. దళితబంధు, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు తదితర పథకాలు అమలవుతున్నాయి. అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు ? డబుల్బెడ్రూం ఇళ్లు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానివారు బాధపడుతున్నారు. వారి బాధ కూడా తీరుస్తాం. మరో లక్ష ఇళ్లు నిర్మిస్తాం. అసలీ పథకాలు తెచ్చింది. అమలు చేస్తున్నదే కేసీఆర్ ప్రభుత్వం. గత పాలకులకు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాలేదు. చేసిన పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. దశల వారీగా అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. మిగతా పార్టీల మాటలు నమ్మొద్దు. అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తగ్గించలేరా ? డబ్బుతో ప్రజలను కొనలేరు. అభ్యర్థులు కూడా వీలైనంత మేరకు ఎన్నికల వ్యయం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పుకోవడం ద్వారా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాంగ్రెస్ హామీలను ఎలా చూడొచ్చు? మాకు పాలనానుభవం ఉంది. వచ్చే రెవెన్యూ ఎంతో, ఎంత ఖర్చు చేయొచ్చో తెలిసిన నాయకుడున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఇంతకుముందే విన్నా. బీఆర్ఎస్ దగ్గరి అవినీతి సొమ్ము వెలికితీసి వారి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట. గాలి మాటలు తప్ప అది సాధ్యమా ? అలాంటి హామీలు ఫేక్ కాక , వాటికి శాంక్టిటీ ఉంటుందా ? కాబట్టి కాంగ్రెస్ను ఎవరూ నమ్మరు కూడా. నగరంలో సీఎం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? ఈనె ల 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. భారీయెత్తున నిర్వహించనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా పార్టీ క్యాడరే కాక నగర ప్రజలకు, చదువుకున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోందనే నమ్మకం ఉంటే అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో, కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ బలం కనిపించడం లేదు ఎందుకంటారు? రాజకీయ నేతలపై, వివిధ రంగాల్లో ప్రముఖులపై కనీస గౌరవం లేకపోవడంతో పాటు సోషల్ మీడియాలో వారిని ఇష్టానుసారం చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్గా, ప్యాషన్గానూ మారింది. ఇంకొందరు సర్వేలపేరిట తోచింది రాస్తున్నారు. సర్వేల నివేదికలంటూ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వాటికెలాంటి శాంక్టిటీ లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరేమిటో గ్రహిస్తున్నారు. చేసిన మంచి పనులు కళ్లముందే ఉన్నాయి. ఉదాహరణకు కరోనా వైరస్ తరుణంలోనూ ప్రభుత్వపరంగా ఏంచేశామో ప్రజలు చూశారు. నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి గురించి ఆలోచించను. నియోజకవర్గంలో నేను చేసిన పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వాలు యాభయ్యేళ్లలో చేయని పనులు తొమ్మిదిన్నరేళ్లలో చేశాం. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటితోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రాత్రుళ్లు ఎల్ఈడీ వీధి దీపాలు, ఇండోర్ స్టేడియాలు, తగినన్ని తాగునీటి రిజర్వాయర్లు తదితరమైన వాటిపైనే నా ఫోకస్. -
ఓటేస్తం.. ఏమిస్తరు.. ఫోన్ పే ఉందా...
హైదరాబాద్: ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లలో మొత్తం 33 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు తరచూ సంప్రదిస్తూనే ఉన్నారు. దీంతో తమ అపార్ట్మెంట్ నిర్వహణ కోసం రూ.4 లక్షలు ఇచ్చే పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పారు. ఒక ప్రధాన పార్టీ అందుకు సిద్ధమైంది. ఆ డబ్బులతో అపార్ట్మెంట్కు పెయింటింగ్ వేయించాలని భావిస్తున్నట్లు అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ఒకరు చెప్పారు. ► హిమాయత్నగర్ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి కాలనీలో ఉన్న ఒక అపార్ట్మెంట్కు ప్రధాన పార్టీ 25 మద్యం సీసాలు, రూ.3 లక్షలు అందజేసినట్లు ఆ అపార్ట్మెంట్ నివాసి ఒకరు తెలిపారు. ఆ 3 లక్షల రూపాయలతో అపార్ట్మెంట్లో ఒక క్రీడా సౌకర్యాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు, మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఎంతో కొంత డిమాండ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇలా ఉప్పల్, హిమాయత్నగర్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లోనే కాదు గ్రేటర్ అంతటా ప్రలోభాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాలనీలుగా, అపార్ట్మెంట్లుగా ఓటర్లను సమావేశపరిచి డిమాండ్లను ఆహ్వానిస్తున్నారు. ► ఈ క్రమంలో ఓటర్ల సంఖ్యకు, అపార్ట్మెంట్ల అవసరాలకు అనుగుణంగా ఒక్కో చోట నుంచి ఒక్కో విధమైన డిమాండ్లు బరిలో నిలిచిన అభ్యర్థుల ముందుకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ డిమాండ్లు తలకు మించిన భారంగా ఉన్నట్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ అభ్యర్థుల వెంట నడిచే అనుచరులు మొదలుకొని అపార్ట్మెంట్ల ప్రతినిధుల వరకు తమ డిమాండ్లను ‘పెద్ద మొత్తం’లో పార్టీల ముందుంచుతున్నారు. ఈ డిమాండ్లను భర్తీ చేసే క్రమంలో అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోందని వివిధ పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు. ఓట్లు ఉత్తగనే ఎందుకేస్తాం.. ‘అధికారం, అక్రమార్జనే లక్ష్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు పోటీపడుతున్నారు. అలాంటప్పుడు ఉచితంగా ఓట్లు ఎందుకు వేయాలి’ జవహర్నగర్ ప్రాంతానికి చెందిన ఓ చోటా నాయకుడి వాదన ఇది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్న వందలాది కాలనీలకు అక్కడికక్కడే చోటా మోటా నాయకులు పుట్టుకొస్తున్నారు. ప్రధాన పార్టీలతో బేరాలుడుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇదో దందాగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన హేమాహేమీలను సైతం ముగ్గులోకి దించేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే ఓటర్ల సంఖ్య మేరకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల అనుచరులుగా చలామణి అయ్యే వ్యక్తులు కూడా కాలనీ సంఘాలకు మద్ధతుగా నిలిచి అనంతరం వాటాల చొప్పున పంచుకుంటున్నట్లు నాగారం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు విస్మయం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ డిమాండ్లు, పంపకాల కార్యక్రమం బాహాటంగానే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు కూడా ఈ నాయకులను తోసిరాజని ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ‘ఎన్నికల సంఘం చెప్పినట్లుగా అభ్యర్థులు రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సివస్తే నాలుగు కాలనీల ఓట్లు కూడా రాలే పరిస్థితి లేదు’ అని సైనిక్పురికి చెందిన ఓ మహిళా సంఘం ప్రతినిధి అభిప్రాయపడ్డారు. మద్యం, నగదు పంపిణీ అన్ని చోట్ల రూ.కోట్లల్లోనే ఉందన్నారు. అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్న బేరసారాలు అపార్ట్మెంట్లు, కాలనీల్లో ప్రలోభాల పంపిణీ ఇలా ఉంటే ఓటర్లకు నేరుగా డబ్బులు వేసేందుకు ఆన్లైన్ యాప్లను విరివిగా వినియోగిస్తున్నారు. గూగుల్పే, ఫోన్పేల ద్వారా జోరుగా నగదు చేరిపోతోంది. అభ్యర్థులకు ఆయా ప్రాంతాల్లో ఉండే బలాబలాలను బట్టి ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు అందజేస్తున్నారు. నలుగురు ఓటర్లు ఉన్న ఇంటికి రూ.12000 నుంచి రూ.18000 వరకు చేరుతున్నట్లు సమాచారం. ‘గత ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఈ ఎన్నికల్లో కూడా ఇవ్వాల్సిందే కదా. ఒకసారి లెక్క డిసైడ్ అయిందంటే ఎప్పుడైనా అదే ఉంటుంది కదా’ అని రామంతాపూర్కు చెందిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నా మొన్నటి వరకు సభలు, సమావేశాలు, ప్రచారంపై ఎక్కువ దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు ప్రలోభాలపై సీరియస్గా దృష్టి పెట్టాయి. మహిళలను, కుల సంఘాలు, కాలనీ సంఘాలను విడివిడిగా ఏర్పాటు చేసి గంపగుత్తగా సంఘాలకే డబ్బులు అందజేస్తున్నారు. -
అక్కా..మీ ఓటు మాకే
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్మెట్ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్ఎస్ కరపత్రం -
Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి. ఇటు కృష్ణ యాదవ్.. అటు పూస రాజు.. ► బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్పేట, ముషీరాబాద్ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్థానిక సెగ్మెంట్ అయిన అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్గా మారింది. ► ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్ మీద పడింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్రెడ్డి, లక్ష్మణ్లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు ► పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్ఎస్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్నగర్లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్లో ఆమెను గెలిపించాలి. ► అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్గా మారింది. కాంగ్రెస్లో ఇలా.. ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ఖేరా భార్య కోటా నీలిమ సనత్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్గా మారింది. -
కౌన్ బనేగా కిస్మత్ వాలా!
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఆశ. ఇందుకోసం గెలుపు కోసం ఓటర్లను, చోటు కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటుంటారు. ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పలువురు తాజా, మాజీ మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ నుంచి బరిలోకి దిగారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా రెండుసార్లు కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకొని రికార్డు సృష్టించారు. ఒకే శాఖకు రెండుసార్లు మంత్రిగా.. 2014లో శాసనసభ ఎన్నికలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ టికెట్తో సనత్నగర్ నుంచి పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్పై గెలుపొందారు. ఆ తర్వాత తలసాని కారెక్కి, కేసీఆర్ కేబినెట్లో చేరిపోయారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్తో బరిలోకి దిగిన తలసాని వరుసగా రెండోసారి గెలుపొంది, మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రెండోసారి కూడా ఇదే శాఖకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తలసాని మరోసారి సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. తొలి మహిళా హోంమంత్రిగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కండువాతో పోటీ చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత సబితా టీఆర్ఎస్ పార్టీలో చేరి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సమైక్య రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు దేశంలోనే తొలి మహిళా హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. సబితా మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీలో చేరి.. కేబినెట్లోకి.. 2014లో టీడీపీ పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి లోకసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలుపొందిన ఏకై క పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 శాసనసభ ఎన్నికలలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్తో పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్లో కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ మేడ్చల్ నుంచి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ నుంచి డిప్యూటీ స్పీకర్.. 1984, 2001లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన పద్మారావు గౌడ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో సనత్నగర్ నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పద్మారావు గెలుపొందారు. తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసి.. డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోనిలిచారు బరిలో మాజీ ‘ఉమ్మడి’ మంత్రులు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన కృష్ణ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, దానం నాగేందర్ ఈసారి శాసనసభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్.. అంబర్పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా.. టూరిజం మంత్రిగా పనిచేసిన మర్రి.. బీజేపీ కండువాతో సనత్నగర్ నుంచి.. గతంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. -
ఎల్బీనగర్, మహేశ్వరంలలో బోణీ కొట్టని బీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ.. నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని ఆ రెండు స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేక పోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ మహేశ్వరం, ఎల్బీనగర్లలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు గెలువలేకపోయారు. ఈసారైనా ఇక్కడ బోణీ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ స్థానాలను కీలకంగా తీసుకుంది. మహేశ్వరంలో గులాబీ గుబాళించేనా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చోటుచేసుకున్న పలు రాజకీయ సమీకరణాలతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందలేదు. ఈ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ బోణీ కొడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్లో జెండా ఎగిరేనా.. అప్పటి వరకు మలక్పేట్ నియోజకవర్గంలో అంతర్భాంగంగా ఉన్న ఎల్బీనగర్ 2009లో కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన దేవిరెడ్డి సుధీర్రెడ్డి, టీడీపీ నుంచి ఎస్వీ కృష్ణ ప్రసాద్లు పోటీ చేశారు. దేవిరెడ్డి సుధీర్రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నిక (2014 ఎన్నిక)ల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్గౌడ్, టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు పోటీ చేశారు. ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్గౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ను వీడి అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్నగర్, హుమాయన్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
గోషామహల్, జూబ్లీహిల్స్ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహదుల్ ముస్లిమీన్న్ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్ –జూబ్లీహిల్స్’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి, భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్ లక్ష్యం గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించడమా? జూబ్లీహిల్స్లో అజహరుద్దీన్ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు. గోషామహల్పై ఆంతర్యమేమిటో? ఈసారి కూడా గోషామహల్ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్ గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్ గంజ్లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్గా రూపాంతరం చెందింది. ► 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి గోషామహల్ సెగ్మెంట్ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ► ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ► ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ ఓటమే లక్ష్యంగా మజ్లిస్ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ► ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్ను ఓడించేందుకు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. -
దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు..!
యాదగిరిగుట్ట రూరల్: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్ట మండలంలోని రాళ్లజనగాం గ్రామంలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా బస్వాపురం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన పలువురు భూ నిర్వాసితులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తాము కోల్పోయిన భూములకు తక్కువ నష్టపరిహారం వచ్చిందని, సరైన న్యాయం జరగలేదని వాపోయారు. దీనిపై సునీత మాట్లాడుతూ.. తాను రాళ్లజనగాం గ్రామం రిజర్వాయర్లో పోకుండా సాధ్యమైన రీతిలో కృషిచేశానని, తాను ఓటును అభ్యర్థించడానికి వచ్చానని, ఇష్టముంటే ఓట్లు వేయండి, లేదంటే లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ప్రచార వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
గ్రేటర్లో కేటీఆర్ విస్తృత ప్రచారం
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దాదాపు రెండు వారాలు మాత్రమే గడువుంది. ఈలోగా విస్తృత ప్రచారానికి అధికార బీఆర్ఎస్ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఏ మాత్రం అవకాశం దొరికినా, ఏ స్వల్ప సమయం లభించినా గ్రేటర్ నగరంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ సంఘాలతో, సమాఖ్యలతో సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలో వివరించి చెబుతున్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తయితే గ్రేటర్ హైదరాబాద్ నగరం మరో ఎత్తు అనే విధంగా నగరానికి ప్రాధాన్యతనిచ్చారు. అదే అంశాన్ని పార్టీ నేతలకూ వివరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ బూత్కమిటీల సమావేశాల్లో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలందరికీ చేరేలా ప్రచారం చేశారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమాఖ్యతోనూ సమావేశమయ్యారు. హ్యాండ్లూం అండ్ టెక్స్టైల్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ నిలోఫర్ కేఫ్లోనూ చాయ్ తాగుతున్న కుటుంబాలతో ముచ్చటించారు. ఏం చేసినా తొమ్మిదిన్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ దానిని కొనసాగించేందుకు తమకే ఓటేయాలని కోరుతున్నారు. వివిధ సమావేశాలతోపాటు విస్తృత రోడ్షోలకూ ప్రణాళిక సిద్ధం చేశారు. రోడ్ షోలు ఇలా.. ► 16వ తేదీ నుంచి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో రోడ్షోల్లో పాల్గొననున్నారు. ప్రస్తుత షెడ్యూల్ మేరకు.. ► 16వ తేదీ: సాయంత్రం 5 గంటలకు కూకట్పల్లిలో, రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్లలో రోడ్షోల్లో పాల్గొంటారు. ► 17వ తేదీ: సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్షోలో భాగంగా శ్రీరాంనగర్, యూసుఫ్గూడ చెక్పోస్టు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాత్రి 7 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జహీర్నగర్, హిమాయత్నగర్లలో రోడ్షోలో పాల్గొననున్నారు. ► 18వ తేదీ: సాయంత్రం 4 గంటలకు నాంపల్లి నియోజకవర్గంలో 5 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ చత్రి, పుత్లిబౌలిల్లో రోడ్షోల్లో పాల్గొంటారు.రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్నియోజకవర్గంలోని శాంతినగర్, ఎస్వీఎస్ ప్రాంతాల్లో రోడ్షోలో పాల్గొంటారు. ► 19వ తేదీ: సాయంత్రం 5 గంటలకు అంబర్పేట నియోజకవర్గంలోని అలీకేఫ్, ఫీవర్ హాస్పిటల్ లేదా చప్పల్ బజార్లలో రోడ్షోలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ చౌరస్తా, భోలక్పూర్, గాంధీనగర్ కొత్తబ్రిడ్జి దగ్గర రోడ్షోల్లో పాల్గొంటారు. ► 20వ తేదీ: ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో రోడ్షోల్లో పాల్గొంటారు. -
గుబులు రేపుతున్న గోర్త రాజేందర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో గోర్త రా జేందర్ గుబులు రేపుతున్నారు. పార్టీ టికెట్టు కోసం ఢిల్లీ స్థా యిలో తుది వరకు గట్టిగా ప్రయత్నాలు చేసి విఫలమైన రాజేందర్ కాంగ్రె స్, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పా ర్టీ పేరిట దాఖలు చే సిన నామినేషన్ మంగళవారం తిరస్కరణకు గురికాగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నామినేషన్ ఫోర్స్లో ఉంది. ఉపసంహరణకు బుధవారం ఆఖరుతేదీ కావడంతో శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్ టికెట్టుతో బరిలో ఉన్న వినయ్రెడ్డి తమను కలుపుకుపోవడం లేదనే అసంతృప్తిని కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేందర్ అంశం మరింత అలజడి కలిగిస్తోంది. రాజేందర్ బీసీ వాదనతో బరిలో ఉంటారా అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. బీసీలకు దక్కని కాంగ్రెస్ టికెట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రతి పార్లమెంట్ ని యోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు సీట్లు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ నడిచింది. అయితే ని జామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థా నాలను బీసీలకు కేటాయిస్తా రని పార్టీ వర్గాలు ముందునుంచే చెబు తూ వచ్చాయి. అ నూహ్య పరిణామాల నేపథ్యంలో బీసీల కు ఒక్క సీటూ దక్కలేదు. ని జామాబాద్ అ ర్బన్తో పాటు ఆర్మూర్ సీట్లు బీసీలకు వచ్చినట్లే వచ్చి చివరి నిముషంలో చేజారాయి. బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన గోర్త రాజేందర్ ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను కలిసి టచ్లో ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మున్నూరుకాపు సామాజిక వర్గానివే ఉన్నాయి. దీంతో తనకు మంచి ఫ్లాట్ఫాం ఏర్పడనుందని రాజేందర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజేందర్ నామినేషన్ ఉపసంహరించుకుంటారా.. లేదా బరిలో ఉంటారా అనే సందిగ్ధత నెలకొంది. నామినేషన్ ఉపసంహరించుకోకుండా కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం జర గడం ఖాయమని సీనియర్లు అంటున్నారు. ఇ ది లా ఉండగా తాను బీసీ వాదన వినిపించేందుకు, బీసీల ఉనికిని చాటేందుకు మాత్రమే నామినేషన్ దాఖలు చేసినట్లు రాజేందర్ చెబుతూ వస్తుండడం గమనార్హం. ఇక పార్టీ కోసం ఏళ్లతరబడి కష్టపడిన తమను కలుపుకుని ముందుకెళ్లే విషయంలో అంతగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కొందరు బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై గళం బలంగా వినిపించడంలో దిట్టగా ఉన్న రాజేందర్ సై తం నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఇ బ్బందులు తప్పవని ఆ పార్టీ సీనియర్లు వాపోతున్నారు. -
వంట గ్యాస్పై సబ్సిడీనా? నగదు బదిలీనా?
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట కలిగిస్తున్నా.. దాని చెల్లింపు మాత్రం ఎప్పటి మాదిరిగానే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా కానుందా? అంటే అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం చమురు సంస్థలు తమ అధీకృత డీలర్ల ద్వారా డోర్డెలివరీ చేస్తున్న 14.5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.955 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ. 40.71కు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమచేస్తోంది. తాజాగా ప్రధాన రాజకీయ పక్షాలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వంట గ్యాస్ ధర సగానికి సగం ధర తగ్గింపు ప్రకటించడం పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నప్పటికీ చెల్లింపు విధానంపై స్పష్టత లేకుండా పోయింది. మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.400కు అందిస్తామని బీఆర్ఎస్, తాము అధికారంలోకి వస్తే సిలిండర్ రూ. 500 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. వంట గ్యాస్ ధర ౖపైపెకి... గత నాలుగేళ్లలో వంట గ్యాస్ ధర ఏకంగా 56 శాతం పెరిగింది. 2019లో రూ.706.50గా ఉండేది. ఆ తర్వాత 2020లో రూ.744కు పెంచారు. 2021లో రూ.809, 2022లో 949.50కి చేరింది. 2023 మార్చి నాటికి సిలిండర్ ధర రూ.1,155కి పెరిగింది. సరిగ్గా పదేళ్ల క్రితం సబ్సిడీపై రూ.414కు వంట గ్యాస్ ధర వచ్చేది. క్రమంగా ధర పై పైకి ఎగబాగింది. వంట గ్యాస్కు నగదు బదిలీ పథకం వర్తింపుచేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్ను మార్కెట్ ధర ప్రకారం రూ.697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65లను నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా... సబ్సిడీ మాత్రం రూ.40.71కు పరిమితమైంది. సబ్సిడీపైనే సరఫరా చేయాలి గత పదేళ్ల క్రితం మాదిరిగా వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధర పై మాత్రమే సరఫరా చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్ధర పై కాకుండా సబ్సిడీ ధర వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిలిండర్ధర తగ్గించి నగదు బదిలీ పద్ధతి వర్తింప జేస్తే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడం తలకు మించిన భారం అవుతుందని పలు పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
207 నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ అనంతరం 332 మంది అభ్యర్థులు అర్హత పొందారు. మొత్తం 435 మంది నామినేషన్లు దాఖలు చేయగా సవ్యంగా లేకపోవడంతో 103 మందిని అనర్హులుగా గుర్తించారు. ముషీరాబాద్నుంచి 33 మంది, మలక్పేట నుంచి 27మంది, అంబర్పేట నుంచి 20 మంది,ఖైరతాబాద్ నుంచి 27 మంది, జూబ్లీహిల్స్ నుంచి 20మంది, సనత్నగర్ నుంచి 18 మంది, కార్వాన్నుంచి 21మంది, గోషామహల్నుంచి 24 మంది,చార్మినార్ నుంచి 14 మంది, చాంద్రాయణగుట్ట నుంచి 17 మంది, యాకుత్పురా నుంచి 27 మంది, బహదూర్పురా నుంచి 12 మంది, సికింద్రాబాద్ నుంచి 27 మంది అభ్యర్థులుగా మిగిలారు. రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 280 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వివరాలు సరిగా లేని 33 నామినేషన్లను తిరస్కరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4, మహేశ్వరంలో 3, షాద్నగర్లో 3, చేవెళ్లలో 4, కల్వకుర్తిలో 1, ఎల్బీనగర్లో 5, శేర్లింగంపల్లిలో 6, రాజేంద్రనగర్లో ఏడుగురి నామినేషన్లు తిరస్కరించారు. మేడ్చల్లో 71 మేడ్చల్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 261 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా స్క్రూటినీలో 71 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు -
బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ఆస్తులు రూ.151 కోట్లు
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ స్థిరచరాస్తుల విలువ అక్షరాల రూ.151 కోట్లకు పైమాటే. అప్పు రూ.44 లక్షలు. రవి కుమార్కు ఉస్మాన్నగర్, వట్టినాగులపల్లిలో రూ.16.54 కోట్ల విలువైన వ్యవసాయ భూములున్నాయి. కొండాపూర్, గోపన్పల్లి ప్రాంతాల్లో రూ.94.84 కోట్ల విలువైన వ్యవసాయేతర స్థలాలున్నాయి. వీటితో పాటు కొండాపూర్, గోపన్పల్లి, ఉస్మాన్నగర్ ప్రాంతాల్లో రూ.40.47 కోట్ల విలువ గల నివాస భవనాలు ఉన్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఖాతాల్లో రూ.15 కోట్ల విలువైన చేసే బ్యాంకు ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, పాలసీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (మార్కెటింగ్) పూర్తి చేసిన రవికుమార్పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో మూడు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. -
కార్డులేని 10 లక్షల కుటుంబాల పరిస్థితేంటి?
హైదరాబాద్: మళ్లీ అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తెల్లరేషన్్ కార్డులకు మరింత ప్రాధాన్యం పెంచినట్లయింది. కేవలం పీడీఎస్ బియ్యానికే పరిమితం కాకుండా రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా తయారు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తే కార్డుదారులకు పీడీఎస్ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం, రైతు బీమా తరహాలో అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా హామీ అమలైతే హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 21.22 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అయితే.. మరో పది లక్షల పేద కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. మూడేళ్లుగా దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ లాగిన్ కూడా నిలిచిపోయింది. అంతకు ముందు దరఖాస్తుల్లో కేవలం 40 శాతం పెండెన్సీ మాత్రమే క్లియర్ అయింది. మరోవైపు కార్డులో కొత్త సభ్యుల చేర్పులు, మార్పుల దరఖాస్తులకు అవకాశం ఉన్నప్పటికీ ఆమోద ప్రక్రియ ఆరేడేళ్ల నుంచి పెండింగ్లో మగ్గుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. బీమాతో ధీమాగా.. అధికార బీఆర్ఎస్ ప్రకటించిన హామీతో పేద కుటుంబాలకు బీమా ధీమాగా మారనుంది. బీమా కోసం తెల్ల రేషన్ (ఆహార భద్రత) కార్డు అర్హత కార్డుగా మారనుంది. అర్హత గల కుటుంబాలకు రైతు బీమా తరహాలోనే.. ఎలాంటి మరణం సంభవించిన ఎల్ఐసీ ద్వారానే ద్వారా రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం వర్తింపజేయనుంది. మరణం సంభవించిన పది రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందనుంది. ప్రభుత్వం అర్హులైన వారి పేరిట ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేసే విధంగా ఎల్ఐసీ ఒప్పందం కుదుర్చుకొనున్నది. ఈ నిబంధనలు పేద కుటుంబ సభ్యులకు బీమా వర్తింపును దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా బీమా నిబంధనల ప్రకారం 60 ఏళ్లలోపు వారే అర్హులు. కార్డులు ఇలా మహానగరంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 22 లక్షలు ఉండగా అందులో ఇతరప్రాంతాల నుంచి వచ్చి రేషన్ పోర్టబిలిటీతో ఇక్కడే రేషన్ సరుకు డ్రా చేస్తున్న కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మొత్తమ్మీద కార్డుల్లో సుమారు 66 లక్షల సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బీమా నిబంధనలు అమలైతే తెల్ల రేషన్న్కార్డుదారుల్లో 60 దాటిన వారంతా బీమాకు అనర్హులే. కార్డు హోల్డర్ పేరిట బీమా వర్తింపజేస్తే.. మొత్తం కార్డు దారుల్లో 20 శాతం మంది పైగా అర్హత కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ వర్తింపు.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ – ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు హామీతో మరింత ఉపశమనం కలుగనుంది. సన్నబియ్యం పంపిణీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేషన్న్న్కార్డుదారులకు సన్నబియ్యం అందనుంది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ సష్టించి ఆర్థిక సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా ఉచితంగా పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్రం వాటాకు అదనంగా రాష్ట్రం వాటా కలిపి పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ప్రతి కార్డులోని యూనిట్కు ఆరుకిలోల చొప్పున కోటా ఉండగా కోవిడ్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కోటాను పెంచారు. -
మంత్రి జగదీష్రెడ్డి ఆస్తుల విలువ రూ.4.26 కోట్లు
సూర్యాపేట : బీఆర్ఎస్ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గురువారం వేసిన నామినేషన్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రూ.1.58 కోట్ల స్థిర ఆస్తులు, రూ.2.68 కోట్ల చరాస్తులు మొత్తం కలిపి రూ.4.26 కోట్లు ఉన్నాయని.. రూ.2.60 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.2.86 లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణి సునీత చేతిలో రూ.9.8 లక్షలు ఉండగా.. ఆమె పేరున రూ.5.94 కోట్ల స్థిరాస్తులు, రూ.4.66 కోట్ల చరాస్తులు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. రూ.3.27 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన పేరున ఒక కారు, తన సతీమణి పేరున రెండు కార్లు, ఒక బైక్, ట్రాక్టర్ ఉన్నట్లు చూపారు. తనపై ఒక కేసు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. సంకినేని కుటుంబ ఆస్తి రూ.రూ.22.63 కోట్లు సూర్యాపేట : బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్రావు ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను రూ.22.63 కోట్లుగా చూపారు. వెంకటేశ్వర్రావు పేరున రూ.1.51 కోట్ల చరాస్తులు, రూ.40 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.1.50 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి లక్ష్మి చేతిలో రూ.13.75 లక్షలు ఉండగా.. 730 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25.32 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. తనపై నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. దామోదర్రెడ్డిపై నాలుగు కేసులు.. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్రెడ్డి రూ.13.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.88 కోట్ల స్థిరాస్తులు తన చేతిలో రూ.25 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఆస్తులు రూ.44 కోట్లు.. అప్పులు రూ.96 లక్షలు
హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి. నామినేషన్తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వీటికి అదనంగా గాంధీ భార్య శ్యామలదేవికి రూ.31,65,38,000 ఆస్తులు ఉండగా అప్పులు రూ.86,34,167 ఉన్నాయి. 2014లో మాదాపూర్ ఠాణా పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఆరోపణలతో గాంధీపై ఓ కేసు నమోదైంది. గత ఎన్నికల (2018) అఫిడవిట్లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు పరిష్కారం కావడంతో ప్రస్తుతం గాం«దీకి ఎలాంటి నేర చరిత్ర లేదు. -
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
ఆస్తులు రూ.2.71కోట్లు.. అప్పులు రూ.1.44కోట్లు
ఇబ్రహీంపట్నం: 2.71 కోట్ల విలువైన ఆస్తులు, వివిధ పోలీస్ స్టేషన్లలో ఎనిమిది కేసులున్నట్లు బీజేపీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆస్తులు చేతిలో రూ.35వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష, రూ.36లక్షలు విలువ చేసే ఫార్ూచ్యనర్, రూ.30లక్షల విలువైన బెంజ్ కార్లు, 12 తులాల బంగారం, ఇంజాపూర్లో రెండు ప్లాట్లు, తుమ్మలూరు పరిధిలో రూ.2కోట్ల విలువ చేసే 6570 చదరపు అడుగుల్లో రెసిడెన్షియల్ విల్లాతో కలిపి రూ.2,71,40,000 ఆస్తులను చూపగా రూ.1,44,22,308 అప్పులున్నట్లు పేర్కొన్నారు. సతీమణి జయలక్ష్మి పేరిట చేతిలో రూ.21 నగదు, బ్యాంకు ఖాతాలో రూ.5వేలు, 21 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ.15,06,122 పెద్ద కుమారుడు కార్తీక్ కుమార్ పేరిట పెద్ద కుమారుడు కార్తీక్కుమార్ చేతిలో నగదు రూ.8వేలు, బ్యాంకు ఖాతాలో రూ.30వేలు, ఒక బైక్, 5 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ.4,45,810 చిన్న కుమారుడు భరత్కుమార్ పేరుతో.. చిన్న కుమారుడు భరత్కుమార్ చేతిలో రూ.8 వేలు, బ్యాంకు ఖాతాలో రూ.20 వేలు, రూ.20లక్షలు విలువచేసే 2011 మోడల్ ఆడి, రూ.14 లక్షలు విలువచేసే 2012 మోడల్ ఇన్నోవా కార్లు, 4 తులాల బంగారం, మొత్తం ఆస్తులు రూ. 37,09,928 ఉన్నాయి. వాహనాల లోన్స్తోపాటు ఇతర అప్పులు మొత్తం రూ.60,34,964 ఉన్నట్లు చూపారు. -
భాంజా ఒవైసీ.. మూము కేసీఆర్!
మేరే భారే మే జల్దీ మాముకు బోల్ దేరేం.. కుచ్ బీ నహీ హువా తోబీ మాముకు బోల్ రేం..(నేను ఏది చేసినా.. ఏది చేయకపోయినా.. కొంత మంది వెంటనే మామకు చెప్పేస్తున్నారు) అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. ఆయన అంటున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలను మామా అల్లుళ్లు అంటూ సంబోధిస్తున్నారు. నాంపల్లి బహిరంగ సభలో రాజేంద్ర నగర్ అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అబ్ దేఖో మాముకు బీ గుస్సా ఆతా (మామకు కూడా కోపం వస్తుంది) అంటూ నవ్వుతూ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఇక మలక్పేట్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముజఫర్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ముస్లింలందరినీ భాంజా ఒవైసీ (అల్లుడు.. ఒవైసీ) మూము (కేసీఆర్)కు దేదియే క్యా అంటూ మామా అల్లుళ్ల బంధాన్ని వివరించారు. – చార్మినార్ -
ఆ రెండింటిపై వ్యూహమేంటి?
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్ పార్టీ ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? గెలుపు కోసమా? మిత్ర పక్షమైన బీఆర్ఎస్కు లాభం చేకూర్చేందుకా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో ఎన్నికల బరిలో దిగింది. జూబ్లీహిల్స్ స్థానానికి షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్, రాజేంద్రనగర్ స్థానానికి లంగర్హౌజ్ మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత మజ్లిస్ వ్యూహంపై ముస్లిం మేధావి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పక్షాన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ అభ్యర్థి రంగంలోకి దింపిన కారణంగా మైనారిటీ ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పరోక్షంగా అధికార బీఆర్ఎస్ కాని బీజేపీ కాని లాభపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
నామినేషన్లకు ఇంకా కొన్ని గంటలే...
హైదరాబాద్: నామినేషన్ల ఘట్టం ముగియడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. దీంతో ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిథుల రీత్యానూ గురు, శుక్రవారాలు శుభ దినాలుగా భావిస్తుండటంతో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టెన్షన్.. టెన్షన్ ఆయా పార్టీల నుంచి టికెట్లు లభించిన వారు ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, అభ్యర్థులను ప్రకటించని నియోజక వర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చార్మినార్ సీటును ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ చార్మినార్ సీటును దానికి కేటాయించనుందనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదని చెబుతున్నారు. బీజేపీలో జనసేన కిరికిరి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గ్రేటర్ పరిధిలోని సీట్లపైనా ఆ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ స్థానాలను అది ఆశించగా కుత్బుల్లాపూర్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు ఇచ్చారు. కూకట్పల్లిని జనసేనకు కేటాయించడంతో అది తన అభ్యర్థిగా ప్రేమ్కుమార్ను ప్రకటించింది. ఇటీవలి కాలం వరకు బీజేపీలో ఉన్న ప్రేమ్కుమార్ జనసేనలో చేరి వెంటనే టికెట్ దక్కించుకున్నారు. శేరిలింగంపల్లిని జనసేనకు కేటాయించకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపుల్లో ఆ మేరకు సఫలమైనట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్కాజిగిరి, మేడ్చల్, నాంపల్లి, కంటోన్మెంట్ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు ఎవరికి దక్కనున్నాయనేది సస్పెన్స్గా మారింది. -
ప్రధాన పార్టీలోల్లో క్షణ క్షణం.. నిరీక్షణం
హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయడానికి ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. బీఫాం చేతికొచ్చేంత వరకు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాలుగు ప్రధాన పారీ్టల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికార బీఆర్ఎస్ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్లో ఉంచింది. నేటికీ వాటికి అభ్యర్థులనే ప్రకటించలేదు. టికెట్లు ప్రకటించిన వారిలో బీఫాంల పంపిణీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ, పాతబస్తీ పరిధిలోని చారి్మనార్, చాంద్రాయణగుట్ట, మలక్పేట, బహదూర్పురా, యాకుత్పురా, కార్వాన్ అభ్యర్థులకు ఇంతవరకు బీఫారాలను జారీ చేయలేదు. దాంతో బీఫాం చేతికందేంత వరకు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. ఇక గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం తేల్చకపోవడంతో ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి. ఎంఐఎంలో మూడు పెండింగ్ నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, బహదూర్పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్లోనూ రెండు కాంగ్రెస్ పార్టీ సైతం పాతబస్తీలోని చార్మినార్తో పాటు గ్రేటర్ పరిధిలో కలిసి ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి అభ్యర్థని వెల్లడించలేదు. బీజేపీకి జనసేనతో కిరికిరి ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సైతం నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆపార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో దానికి ఏయే సీట్లు కేటాయిస్తారోనన్న టెన్షన్తో బీజేపీ ఆశావహులున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్తోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ∙జనసేన శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలను కోరుతున్నట్లు తెలిసి బీజేపీ శ్రేణులు గందరగోళంలో మునిగాయి. ఎట్టకేలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్ను జనసేనకు వెళ్లకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపులు ఫలించినట్లు సమాచారం. వివిధ కారణాలతో నగరంలోని నాలుగు ప్రధాన పారీ్టలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయోననే చర్చ జరుగుతోంది. -
జూబ్లీహిల్స్ బరిలో కరాటే క్వీన్?
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని జాతీయ కరాటే చాంపియన్ను సాధించిన సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. మూడేళ్ల క్రితమే సయ్యదా ఫలక్ మజ్లిస్ పారీ్టలో చేరారు. పార్లమెంట్లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడు’ అంటూ కొనియాడి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్తో దేవబంద్, ఢిల్లీ, షాహీన్న్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఫలక్ అభ్యరి్థత్వం వైపు మజ్లిస్ మొగ్గు చూపి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
అధ్యక్షా.. అనాలనే ఆరాటంతో..
బంజారాహిల్స్: ఎప్పటికై నా అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అనాలనే కోరికతో పట్టువదలని విక్రమార్కుడిలా ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంతంలో నివసించే వ్యాపారి షాబాద్ రమేష్ ఈ ఎన్నికల్లో కూడా పోటీకి సై అన్నారు. తెలంగాణలోనే మొట్ట మొదటి నామినేషన్ తానే వేయాలని ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు జ్యోతిష్యులను సంప్రదించి శుక్రవారం ఉదయం 11.06 గంటల సమయంలో ఖైరతాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తారీయన. 1994 నుంచి ఇప్పటి వరకు 7సార్లు నామినేషన్లు వేశారు.అయిదేళ్ల పాటు ఇంట్లో ఏర్పాటు చేసే గల్లాపెట్టెలో చిల్లర డబ్బులు వేస్తూ నామినేషన్ వేసే రోజున ఆ మొత్తాన్ని లెక్కపెట్టి అందులో నామినేషన్ పత్రాల డాక్యుమెంటేషన్ ఖర్చులు, డిపాజిట్ రూ.10 వేలు చెల్లిస్తారు. భార్య కస్తూరి హారతి ఇచ్చి నామినేషన్కు పంపించగా ఆయన ఖైరతాబాద్లోని ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని నామినేషన్ల అనంతరం తెలిపారు. ఆయన మొదటిసారి నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఇద్దరు కొడుకులకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు అఖిల్, అక్షయ్ ఇద్దరికీ ఓటు హక్కు రావడంతో తన ఓటు బ్యాంకు మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో షాబాద్ రమేష్కు 387 ఓట్లు రాగా, 2018లో జరిగిన ఎన్నికల్లో 384 ఓట్లు వచ్చాయి. ఎప్పటికై నా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని పెద్ద గణేష్ సాక్షిగా ఆయన శపథం చేశారు. -
మజ్లిస్ పార్టీ కంచు కోటను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ స్థానాలపై దృష్టి సారించింది. ఆ పార్టీ కంచు కోట అయిన పాతబస్తీలో దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. అధికార బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మైనారిటీ ఓట్లను గండికొట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హలత్–ఏ–హజరా పేరుతో మజ్లిస్ సభలకు శ్రీకారం చుట్డడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే మజ్లిస్ తీరుపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహానికి సిద్ధమైంది. మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో గట్టి పోటీతో ఉక్కిరిబిక్కిరి చేసి అగ్రనేతలు పాతబస్తీ దాటకుండా కట్టడి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అన్ని స్థానాలపై కాకుండా కొన్నింటిపై మాత్రమే దృష్టి సారించింది. వాస్తవంగా పాతబస్తీలో తలపడేందుకు అధికార పక్షంతో పాటు మిగతా పక్షాలు సైతం మొక్కుబడిగా అభ్యర్థులను బరిలో దింపడం ఆనవాయితీ. అయితే.. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చార్మినార్ మినహా అభ్యర్థులను ప్రకటించింది. మూడింటిపైనే ఆశలు.. కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో పూర్వ వైభవం కోసం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను దింపుతోంది. ఇప్పటికే నాంపల్లి, మలక్పేట స్థానాలకు అభ్యర్ధులకు ప్రకటించగా. చార్మినార్ సెగ్మెంట్కు ప్రకటించాల్సి ఉంది. నాంపల్లి స్థానం నుంచి వరుసగా మూడుసార్లు మజ్లిస్ అభ్యర్థులతో నువ్వా నేనా అనే విధంగా తలపడి పరాజయం పాలైన ఫిరోజ్ ఖాన్ను ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది. కాంగ్రెస్కు ఓటు బ్యాంకుతో పాటు సానుభూతి కూడా కలిసి వచ్చి బయటపడే అవకాశం ఉందని భావిస్తోంది. మజ్లిస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను యాకుత్పురా స్థానానికి మార్చి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ను బరిలో దింపాలని యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిత్వం ప్రకటించలేదు. పాతబస్తీలో ముస్లిం సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న అలీ మస్కతి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చార్మినార్ స్థానం నుంచి అలీ మస్కతిని పోటీ చేయాలని కోరామని వెల్లడించారు. మరోవైపు మజ్లిస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్కు తిరిగి సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో ఆయనతో సంప్రదింపులు ప్రారంభించింది. అవసరమైతే కాంగ్రెస్ పక్షాన ఆయనను బరిలో దింపాలని ఒక ఆప్షన్గా పెట్టుకొని వేచి చూస్తోంది. మలక్పేట స్థానంపై సైతం గట్టి పోటీకి సిద్ధమైంది. అక్కడి నుంచి స్థిరాస్తి వ్యాపారి షేక్ అక్బర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు అక్కడి నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి మజ్లిస్కు గట్టి పోటి ఇచి్చన మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీ ఖాన్ని పారీ్టలో చేర్చుకుంది. కాంగ్రెస్ పక్షాన ఒకసారి పోటీ చేసి పారీ్టకి దూరమైన మందడి విజయ సింహారెడ్డిని సైతం పార్టీ కండువా కప్పింది. చాప కింద నీరులా పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి పార్టీ జాతీయ మైనారిటీ నేతలను సైతం రంగంలో దింపాలని యోచిస్తోంది. -
బీజేపీలో జనసేన కుంపటి
హైదరాబాద్: కాషాయ పార్టీలో జనసేనతో పొత్తు చిచ్చు రేపుతోంది. నగరంలో మూడు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కమలం పార్టీ నేతలు మాత్రం అవి వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. చివరకు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిని మూడో జాబితాలో అయినా ప్రకటిస్తారా? మరికొన్ని రోజులు పెండింగ్లోనే ఉంచుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. కూకట్పల్లి సీటుపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్ కేడర్ ఒత్తిడికి అధినాయకత్వం తలోగ్గుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తదితరులు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా సీట్లపై క్లారిటీ? హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలపై మూడో జాబితాలో క్లారిటీ రానుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ మూడో జాబితాకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సీఈసీ ఆమోదించిన అభ్యర్థులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ముషీరాబాద్కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి, అంబర్పేటకు గౌతమ్ రావు పేర్లు ఖరారైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కీర్తి రెడ్డి, విక్రమ్ గౌడ్, దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్కు బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్కు మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత పేర్లను వివేక్ ప్రతిపాదించారు. వివేక్ పార్టీ వీడటంతో కంటోన్మెంట్ స్థానానికి తులసీ విజయ రాం పేరు తెర మీదకు వచి్చంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఎల్బీనగర్ సీటు తనకే ఇవ్వాలని సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు మూడో జాబితాలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Politics & Election Updates: 2nd Nov 2023, 07:20PM రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేటీఆర్ ►తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ ►వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారు ►మహా ఇంజనీర్లు వీళ్ళు.. బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు ►ఎక్స్పానషన్ లెవల్ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన ►జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీలోని ఈ చిల్లర గాళ్ళు ►రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ 2nd Nov 2023, 07:00PM ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్.. ►అనేక మంది యువకుల బలిదానం ఫలితం తెలంగాణ రాష్ట్రం ►తెలంగాణా ఆత్మ గౌరవం కాపాడాలని రాష్ట్రం కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.. ►గారడీ మాటలతో అనేక మాటలు చెప్పి రెండు సార్లు కేసీఆర్ పరిపాలించారు. ►పది సంవత్సరాలో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేశాడు. ► టీఎస్పీఎస్సీ ద్వారా రెండు సార్లు పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని యువకులను బలి తీసుకుంది కల్వకుంట్ల కుటుంబం. ►కాళేశ్వరంలో రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు 150 మీటర్లు కుంగి పోయింది. ►కాళేశ్వరం ప్రాజెక్టు ను ఏటీఎం వాడుకుందన్న బీజేపీ ఒక్కసారి కూడా ప్రశ్నిచలేదు..ఇక్కడే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ తెలుస్తుంది. ►హస్తం గుర్తు పై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను గెలిపించండి.. 2nd Nov 2023, 5:40PM తెలుగుదేశం మీకో దండం.. ►చంద్రబాబు, లోకేష్ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ►రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ►గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ►తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2nd Nov 2023, 4:30PM జనసేన, బీజేపీ పొత్తు అంశంపై రచ్చ ►నిరసనలతో అట్టుడికిన బీజేపీ రాష్ట్ర కార్యాలయం ►నాగర్ కర్నూల్ టికెట్ .జనసేనకు కేటాయిస్తారని ప్రచారం ►నిరసనకు దిగిన నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి దిలీపాచారి, ఆయన అనుచరులు ►జనసేన వద్దు.. బీజేపీ ముద్దు అంటూ నినాదాలు ► జనసేన అసలు తెలంగాణలోనే లేదని అలాంటప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం 2nd Nov 2023, 4:00PM ►కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న సీపీఎం ►తెలంగాణలో 17 స్ధానాల్లో పోటీ చేయనున్న సీపీఎం ►తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి సీపీఎం ►పోటీ చేయనున్న స్ధానాల పేర్లు ప్రకటించిన సీపీఎం ►భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర సత్తుపల్లి, ఖమ్మం, వైరా, మిర్యాలగూడ, నల్గొండలో సీపీఎం పోటీ 2nd Nov 2023, 2:53PM ►బీజేపీ మూడో జాబితాలో దత్తాత్రేయ కుమార్తెకు మొండిచేయి ►ముషీరాబాద్ టికెట్ను పూస రాజుకు కేటాయించిన బీజేపీ 2nd Nov 2023, 2:30PM 35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల 1. నిజామాబాద్ రూరల్ దినేష్ 2. రాజేంద్రనగర్-శ్రీనివాస్ రెడ్డి, 3. ఆందోల్- బాబూమోహన్ 4. జహీరాబాద్- రామచంద్ర రాజనర్సింహా 5. చేవేళ్ల-కేఎస్ రత్నం 6. బోథన్- మోహన్రెడ్డి 7.బాన్సువాడ- యెండల లక్ష్మీనారాయణ 8. పరిగి- మారుతి కిరణ్ 9.ముషీరాబాద్-పూస రాజు 10. జడ్చర్ల- చిత్తరంజన్ దాస్ 11.మక్తల్ - జలంధర్ రెడ్డి 12. రాజేంద్ర నగర్- తోకల శ్రీనివాసరెడ్డి 13.సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి 14.మంథని- చందుపట్ల సునీల్ రెడ్డి 15. ఉప్పల్- ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్, 16. లాల్బహదూర్ నగర్- సామరంగారెడ్డి 17.దేవరకొండ- లాలూ నాయక్ 18. చల్లా శ్రీలతా రెడ్డి 19. నారాయణ్పేట-రతన్ పాండురంగారెడ్డి 20. మలక్పేట- శ్యామ్రెడ్డి సురేందర్ రెడ్డి 21. అంబర్పేట్-కృష్ణ యాదవ్ 22. షాద్నగర్- అందె బాబయ్య, 23. వనపర్తి- అశ్వద్ధామరెడ్డి, 24. అచ్చంపేట్- దేవని సతీష్ మాదిగ 25.సత్తుపల్లి(ఎస్సీ)-రామలింగేశ్వరరావు 26.సికింద్రాబాద్- మేకల సారంగపాణి 27. నారాయణపేట్- కేఆర్. పాండురెడ్డి 28. మెదక్- పంజా విజయ్ కుమార్ 29.నారాయణఖేడ్ -సంగప్ప 30. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్ 31. అసిఫాబాద్(ఎస్టీ) అజ్మీరా ఆత్మరాం నాయక్ 32. జూబ్లీహిల్స్: లంకల దీపక్ రెడ్డి 33. ఆలేరు- పడాల శ్రీనివాస్ 34.నల్గొండ- మడగాని శ్రీనివాస్ గౌడ్ 35 పరకాల్- కాలి ప్రసాద్రావు 2nd Nov 2023, 2.10 pm తెలంగాణకు భారీగా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ► తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ► ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న ఎమ్మెల్యేలు ► మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు ► అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు 2nd Nov 2023, 1.55 pm ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మందా:కేటీఆర్ ► హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం లేదు ► కిషన్ రెడ్డి ఫోటో పోజులకు తప్ప చేసిన పని ఏమి లేదు ► వర్షాలు వరదల వచ్చిన కనీసం జనాల ఇబ్బందులు కిషన్ రెడ్డి కి పట్టవు ► ఉప్పల్ ఫ్లై ఓవర్ కట్టడానికి కూడా బీజేపీకి కనీసం చేతకావటం లేదు ► బిజెపి, కాంగ్రెస్ పహిల్వాన్ లు తెలంగాణ లో దిగుతున్నారు ► బక్క పల్చని కేసిఆర్ ను కొట్టడానికి ఇంత మంది వస్తున్నారు ►డిక్కీ బలిసిన కోడి తొడ కొట్టినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది 2nd Nov 2023, 1.40 pm తెలంగాణ బీజేపీకి పక్కరాష్ట్రాల ఎమ్మెల్యేలు ►నేటినుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ►ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న ఎమ్మెల్యేలు ►మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు ►అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు 2nd Nov 2023, 1.20 pm మాటలు vs ముఠాల మధ్య పోరు: హరీష్ రావు ►మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు ►ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి, మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ ►మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం. ►కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా? ►9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. సీఎం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నడు. ►అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారింది. ►మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం గారు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నరు. ►28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి. నేను దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా. ►కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలి. ►కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంది. 2nd Nov 2023, 1.20 pm కౌశిక్ ప్రచారం అంటే డాన్సే డాన్స్ ►కరీంనగర్ జిల్లా :వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ►కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులు ఇంటింటికి వచ్చి ఇచ్చా. ►కనపర్తిలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.కోటి రూపాయలు మంజూరు చేపించాం. ►గ్రామంలో రూ.కోటి 14లక్షలతో రోడ్లు వేసాం. ►తెలంగాణలో రూ.19వేల కోట్లు రుణమాఫీ చేసాం. ►మరో రూ.5వేల కోట్లు కూడా త్వరలో మాఫీ చేయబోతున్నాం. ►మీ దయ, దండం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి. ►బిసి బంధు చెక్కులు కూడా వచ్చాయి. ►అందువల్లే బిసి బంధు చెక్కులు MRO హాండవర్ చేసుకున్నారు ఈ రోజు హుజురాబాద్ మండలం ధర్మరాజపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో భాగంగా కెసిఆర్ గారు మొట్ట మొదట రైతు బంధు ఈ గ్రామానికి ఇచ్చారు వారి ఋణం తీసుకునే అవకాశం మనకు వచ్చింది రైతు బంధు ఇచ్చిన కెసిఆర్ గారికి మా ఓటు కార్ గుర్తుకు @BRSparty @KTRBRS pic.twitter.com/i7sUwLSm0b — Padi Kaushik Reddy (@KaushikReddyBRS) November 1, 2023 2nd Nov 2023, 1.15 pm స్మార్ట్ లేదంటే రిజైన్ : అరవింద్ రూటులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి ► పెద్దపెల్లి జిల్లా:గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఆభ్యర్థి కందుల సంధ్యారాణి ►BRS, కాంగ్రెస్ అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెడుతున్నారు ►చర్రితలో 33 శాతం మహిళలకు రిజ్వరేషన్ ఇచ్చిన ఘనత బీజేపీదే. ►నన్ను గెలిపిస్తే రామగుండంను స్మార్ట్ సిటీ చేస్తా ►నాకు అధికారం ఇవ్వండి.. స్మార్ట్ సిటీ విషయంలోఇచ్చిన మాట తప్పితే 6 నెలల్లో రాజీనామా చేస్తా ►బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నా 2nd Nov 2023, 12.50 pm ఎన్నికల వేళ మళ్లీ తెర మీదికి రూ.2వేల నోటు ► రిజర్వ్ బ్యాంకు వద్ద పెరిగిన రద్దీ ► ఆర్బీఐ శాఖల వద్దకు క్యూ కడుతున్న ప్రజలు ► రూ.2000 నోట్లు మార్చుకునేందుకు వస్తోన్న ప్రజలు ► అక్టోబర్ 7 నాటికి బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి ముగిసిన గడువు ► ఇప్పుడు కేవలం రిజర్వ్బ్యాంకు శాఖల వద్దే మార్చుకునేందుకు వీలు 2nd Nov 2023, 12.50 pm కోమటిరెడ్డి బంధువు ఇంట్లో తనిఖీలు ► భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ► హైద్రాబాద్ కోకాపెట్ హిడెన్ గార్డెన్ లోని గిరిధర్ రెడ్డి నివాసంలో అధికారుల సోదాలు ► ఉదయం నుండి హైద్రాబాద్ నగరంలో పలువురిర ఇళ్లలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు 2nd Nov 2023, 12.45 pm నాగార్జునసాగర్లో బీజేపీకి షాక్ ► నల్లగొండ జిల్లా : నాగార్జునా సాగర్ లో బీజేపీకి షాక్ ► పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవికి రాజీనామా చేసిన రిక్కల ఇంద్రసేనారెడ్డి ► నాగార్జున సాగర్ టికెట్ ఆశించి రాకపోవడంతో నిరసగా పార్టీకి రాజీనామా ► సాగర్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించడంతో ఆగ్రహంతో ఉన్న రిక్కల ► నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రిక్కల ► గతంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి కుడిభుజంగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి 2nd Nov 2023, 12.25 pm బీజేపీ మూడో జాబితాలో ఉండేది వీరేనా? 01 ఆసిఫాబాద్ తుకారాం 02 చెన్నూరు అందుగుల శ్రీనివాస్ 03 మంచిర్యాల రఘునాథబాబు 04 బాన్సువాడ మాల్యాద్రి రెడ్డి 05 బోధన్ మేడపాటి ప్రకాశ్ రెడ్డి/వడ్డి మోహన్ రెడ్డి 06 నిజామాబాద్ రూరల్ దినేష్ 07 ఎల్లారెడ్డి పైళ్ల కృష్ణారెడ్డి 08 మంథని చందుపట్ల సునీల్ రెడ్డి 09 పెద్దపల్లి గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి/ దుగ్యాల ప్రదీప్ రావు/ గుజ్జుల రామకృష్ణారెడ్డి 10 వేములవాడ తుల ఉమ/వికాస్ రావు 11 జహీరాబాద్ ఢిల్లీ వసంత్/దామోదర రామచంద్ర 12 సంగారెడ్డి దేశ్ పాండే/ పులిమామిడి రాజు 13 నారాయణ ఖేడ్ విజయపాల్ రెడ్డి/సంగప్ప 14 ఆందోల్ 15 మెదక్ 16 హుస్నాబాద్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి/ జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి 17 సిద్దిపేట దూది శ్రీకాంత్ రెడ్డి 18 షాద్ నగర్ విష్ణు వర్ధన్ రెడ్డి/ అందె బాబయ్య 19 ఎల్బీనగర్ సామ రంగారెడ్డి/ మధుసూదన్ 20 రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్ రెడ్డి 21 శేరిలింగంపల్లి రవి యాదవ్ 22 చేవెళ్ల కేఎస్ రత్నం 23 వికారాబాద్ 24 తాండూరు రమేష్ 25 కొడంగల్ చికోటి ప్రవీణ్ / కొస్గి రమేష్ 26 మేడ్చల్ విక్రమ్ రెడ్డి 27 మల్కాజ్ గిరి ఆకుల రాజేందర్/ భాను ప్రకాశ్ 28 కూకట్ పల్లి జనసేన?? 29 ఉప్పల్ వీరేందర్ గౌడ్/ NVS ప్రభాకర్ 30 ముషీరాబాద్ బండారు విజయలక్ష్మి 31 మలక్ పేట కొత్తకాపు రవీందర్ రెడ్డి 32 అంబర్ పేట గౌతమ్ రావు 33 జూబ్లీహిల్స్ జూటూరి కీర్తిరెడ్డి 34 సనత్ నగర్ మర్రిశశిధర్ రెడ్డి 35 నాంపల్లి విక్రమ్ గౌడ్ 36 సికింద్రాబాద్ బండ కార్తీక రెడ్డి 37 కంటోన్మెంట్ సుష్మిత 38 జడ్చర్ల చిత్తరంజన్ దాస్ 39 దేవరకద్ర పవన్ కుమార్ రెడ్డి 40 నాగర్ కర్నూల్ జనసేన ? 41 అచ్చంపేట సతీశ్ మాదిగ 42 వనపర్తి అశ్వద్ధామ రెడ్డి 43 గద్వాల వీరబాబు 44 అలంపూర్ 45 నకిరేకల్ పాల్వాయి రజిని 46 నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ 47 మునుగోడు బూర నర్సయ్య గౌడ్ 48 దేవరకొండ లాలు నాయక్ 49 మిర్యాల గూడ సాదినేని శ్రీనివాస్ 50 హుజూర్ నగర్ చల్ల శ్రీలత రెడ్డి 51 కోదాడ జనసేన 52 తుంగతుర్తి కడియం రామచంద్రయ్య 53 ఆలేరు కాసం వెంకటేశ్వర్లు 54 నర్సంపేట పుల్లారావు చౌదరి 55 పరకాల కాళీ ప్రసాద్ 56 పినపాక 57 కొత్తగూడెం జనసేన 58 అశ్వరావు పేట జనసేన 59 ఖమ్మం జనసేన 60 పాలేరు కొండపల్లి శ్రీధర్ రెడ్డి 61 మధిర అజయ్ రాజ్ 62 వైరా జనసేన 63 సత్తుపల్లి శ్యామ్ నాయక్ 64 ములుగు అజ్మీరా ప్రహ్లాద్/కృష్ణ 65 మక్తల్ జలంధర్ రెడ్డి 66 నారాయణపేట రతన్ పాండురంగారెడ్డి 2nd Nov 2023, 12.15 pm తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సంబంధం లేదు ► ఢిల్లీ: డాక్టర్ లక్ష్మణ్, బిజెపి ఎంపీ ► ఈ నెల 7న హైదరాబాద్ లో బిసి ఆత్మ గౌరవ సభ ఏర్పాటు ► తెలుగుదేశం మా భాగస్వామి కాదు ► తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టిడిపి చెప్పాలి ► టిడిపి ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదు ► ఎవరో చెప్పినంత మాత్రాన ప్రజలు వినే పరిస్థితి లేదు ► తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది ► కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదు ► ప్రజలు... ప్రజల ఓట్లు మాతో ఉన్నాయి ► నేతలు బయటకి వెళ్లినంత మాత్రాన వారి ఓట్లన్నీ వెళ్లిపోవు 2nd Nov 2023, 12.12 pm ఎన్నికల వేళ నగరాన్ని అస్తవ్యస్తం చేస్తారా? ► చంద్రబాబు పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ► నిన్న హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ► చంద్రబాబు పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ► అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో బాబు పై కేసు నమోదు ► ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన చంద్రబాబు, తెలుగుదేశం ► నగరం రోడ్లపై నానా న్యూసెన్స్ ► క్రైం నెంబర్ 531/2023 IPC 341,290,341 and 21r/w76CP act ► హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరల్ సెక్రెటరీ GVG నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు ► సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పేర్కొన్న పోలీసులు 2nd Nov 2023, 12.10 pm నారాయణ.. నారాయణ ► పొత్తుల పై సీపీఐ నారాయణ సెటైర్లు ► ఢిల్లీ : పొత్తుల పై కాంగ్రెస్ తీరు పై నారాయణ విమర్శలు ► నిశ్చితార్థమయ్యాక ఇంకా అందమైన వాళ్లు దొరికితే లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయి ► పొత్తులు, సీట్ల సర్దుబాటు పై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడం పై సీపీఐ నారాయణ అసహనం నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc — Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023 2nd Nov 2023, 12.10 pm చేయిస్తారా? చేయి కలుపుతారా? ► కాంగ్రెస్ కు సీపీఎం డెడ్లైన్ ► వైరా, మిర్యాలగూడ కేటాయించాలంటున్న సీపీఐ ► నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్ లైన్ #Telangana Assembly polls: CPI(M) insists on Wyra and Miryalaguda seats Read: https://t.co/rNgueqJCsK pic.twitter.com/zGTivKs7qC — IANS (@ians_india) October 29, 2023 2nd Nov 2023, 12.00 pm జనసేనతో పొత్తు వద్దంండి ప్లీజ్ ► ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ► తాండూరు, శేరిలింగంపల్లి సీట్లను జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోన్న కొండా ► బీజేపీ హైకమాండ్ కు తన అభిప్రాయాన్ని చెప్పనున్న విశ్వేశ్వర్ రెడ్డి Konda Vishveshwar Reddy & Dharmapuri Arvind strongly lobbying for Ravi Kumar Yadav for Serilingampally seat. BJP is feeling that they gonna loose this seat in alliance? Janasena @PawanKalyan lobbied hard for this seat with Amit Shah ? #TelanganaElections2023 pic.twitter.com/jFwYLLm4cx — Telangana (@TelanganaRT) October 29, 2023 2nd Nov 2023, 12.00 pm కమలం మూడో జాబితా రెడీ ► తెలంగాణలో మూడో జాబితాను సిద్ధం చేసిన బీజేపీ ► ఢిల్లీ : నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ► 40-45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ► జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మరికొన్ని పెండింగ్ ► ఇప్పటి వరకు 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 2nd Nov 2023, 11.30am ఎన్నికల వేళ గెలుపు కోసం రాజశ్యామల యాగం ► సిద్దిపేట : ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండో రోజు కొనసాగుతున్న రాజశ్యామల యాగం ► ఈరోజు యాగంలో రాజశ్యామల యంత్ర పూజ ► పూజలో సీఎం కేసీఆర్ దంపతులు ► యాగ క్రతువును పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 2nd Nov 2023, 11.30am ఇందూరులో సీఎం కెసిఆర్ ► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ ► మధ్యాహ్నం 2 గంటలకు బాల్కొండ నియోజక వర్గంలో సభ ►సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ 2nd Nov 2023, 11.20am బీసీలకు వ్యతిరేకం కాంగ్రెస్ : డాక్టర్ లక్ష్మణ్ ► ఢిల్లీ: బిసి సీఎం చేస్తామన్న బిజెపి ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారు ► బిసి వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు ► పెత్తందార్ల మనస్తత్వం తో బి అర్ ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు ► బిఆర్ఎస్, కాంగ్రెస్ ను తెలంగాణ బిసిలు ఓటుతో తిప్పికొట్టాలి ► బిసి సీఎం అయ్యేందుకు బిసిలు ఏకం కావాలి, తమ సత్తా చాటాలి ► పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3 కు పరిమితం ► తరతరాలుగా బిసిలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ People of Telangana will never forget how the Congress delayed the demand for Telangana, and how because of Congress, over 1200 people had to sacrifice their lives. They will never forget how BRS betrayed their dreams, while KCR looted the state. Congress Killed, KCR Looted. — BJP Telangana (@BJP4Telangana) November 2, 2023 2nd Nov 2023, 11.00am మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాహుల్గాంధీ ► భూపాలపల్లి జిల్లా :మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలించిన రాహుల్ గాంధీ ► ఏరియల్ సర్వే ద్వారా ద్వారా బ్యారేజ్ ని పరిశీలించిన రాహుల్ గాంధీ ► బ్యారెజ్ పరిశీలనకు ముందు అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ. ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం : రాహుల్ గాంధీ ► లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు. ► ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి ► ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. ► కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని పది రోజులు కాకముందే కుంగివడం బాధాకరం. ► చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ► కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. ► చిన్నపాటి ఇంటి నిర్మాణం కోసం ఇంజనీర్ తో డిజైన్ చేసుకుంటాం. ► లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ► ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ► సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు కు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది. Kaleshwaram Project = KCR Family ATM I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana. Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are… pic.twitter.com/BWe8Td9mCq — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2023 సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ► బ్యారేజ్ డ్యామేజ్ కి ప్రభుత్వం భాద్యత వహించాలి ► నాణ్యత లోపంతోనే బ్యారేజ్ కి సంబంధించిన పది పిల్లర్లు కుంగాయి. ► డ్యామేజ్ ని స్వయంగా పరిశీలించాం. ► బ్యారేజ్ తో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. ► కేసిఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారింది. ► ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై బిజెపి బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ► రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు. ► కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ► కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం 2nd Nov 2023, 10.55am కాంగ్రెస్ పొత్తు యూటర్న్పై నారాయణ ట్వీట్ ► పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ► ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 2nd Nov 2023, 10.35am ఇండిపెండెంట్గా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి! ► హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ పొన్నంకు ఖరారు కావడంతో టికెట్ ఆశించి భంగపడిన ప్రవీణ్రెడ్డి ► ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం 2nd Nov 2023, 10.20am బెదిరింపు రాజకీయాలు ► కాంగ్రెస్ పార్టీలో చేరుతావని అని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపీనాథ్ గుండల్ని పంపించి నాపై దాడి చేశారు: రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య 2nd Nov 2023, 10.05am ఐటీ అధికారుల సోదాలు ► మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు ► తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం ► ప్రస్తుతం పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ► మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసం లో కొనసాగుతున్న ఐటీ సోదలు ► తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు 2nd Nov 2023, 9.45am కేసీఆర్ పర్యటన ► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ ► మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజక వర్గం తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ ► ధర్మపురి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాదం సభలో ప్రసంగించనున్న కేసీఆర్ 2nd Nov 2023, 9.30am చాయ్ చేసి.. ఓట్లు అడిగి.. ► ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజలు చేసే పనుల్లో భాగస్వాములవుతున్నారు నాయకులు ► అల్లాదుర్గంలో బుధవారం అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం 2nd Nov 2023, 9am జయభేరి విన్నాకే.. కాళ్లకు జోళ్లు ► ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ భారాస అభ్యర్థి అనిల్ జాదవ్ ఎన్నికల ప్రచారం ► ఎన్నికల ప్రచారంలో చెప్పులు లేకుండా ఎన్నికల ప్రచారం.. ► ఎన్నికల్లో గెలిచాకే చెప్పులు ధరిస్తా -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Updates: 06:48 PM, నవంబర్ 1, 2023 తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు ►తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ►తెలంగాణలో కాంగ్రెస్పై ప్రజలకు విశ్వాసం లేదు ►బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి ►ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ►చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని ►తెలంగాణలో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ 04:50 PM, నవంబర్ 1, 2023 మాజీ ఎంపీ వివేక్ దారిలో మరో బీజేపీ నేత? ►శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పంచాయితీ ►శేరిలింగంపల్లి సీటును రవి యాదవ్కు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టు ►శేరిలింగంపల్లి జనసేనకు కేటాయిస్తే బీజేపీకి రాజీనామా చేస్తానంటోన్న కొండా 03:30 PM, నవంబర్ 1, 2023 ►న్యూఢిల్లీ: బీజేపీలోకి ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ►సాయంత్రం బిజెపిలో చేరనున్న సుభాష్ రెడ్డి ►గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం ►అధిష్టానానికి తన నిర్ణయం తెలిపిన డీకే అరుణ ►ఇప్పటికే పోటీ నుంచి తప్పుకున్న డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డి ►రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామంటున్న బడా నేతలు ►లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న అరుణ ►బీజేపీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ►కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక 02:50pm, నవంబర్ 1, 2023 డీ రాజా సీపీఐ జాతీయ కార్యదర్శి ►తెలంగాణ లో కాంగ్రెస్ తో పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయి. ►మేం అడిగిన సీట్లు ఇస్తారన్న మాకు నమ్మకం ఉంది. ►జాతీయ స్థాయిలో బీజేపీ ని ఓడించడమే లక్ష్యం. ►ఇండియా కూటమిలో మా పాత్ర కీలకం గా ఉంటుంది. ►బీజేపీ ని ఓడించేందుకు కలిసి వచ్చిన వారితో పొత్తులు పెట్టుకుంటాం నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి ►కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరాం. ►బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నరు. ►సిపిఎం సీట్లపై చర్చ జరుగుతుంది. ►ఇంకా సిపిఎం సీట్లపై స్పష్టత రాలేదు. ►రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుంది. ►ఇండియా కూటమి బలపడటం వల్ల భాజపాను నిలవరించవచ్చు. ►ఊహాగానాలను తాము నమ్మము. ►వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామం. ►చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారు. ►పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తాం. ►అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేము. 02:00pm, నవంబర్ 1, 2023 ప్రకాష్ జవదేకర్, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి ► కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో లక్ష కోట్ల రూపాయలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. ►మేడిగడ్డ తరహాలోనే, అన్నారం బ్యారేజ్ కు ప్రమాదం పొంచి ఉంది. ►ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమాధానం చెప్పాలి. ►వచ్చే ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ కి గుణపాఠం చెప్తారు. ►కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం. 01:00pm, నవంబర్ 1, 2023 జనతా కా మూడ్ సర్వేలో BRSకు ఎడ్జ్ ► తెలంగాణ 2023 - జనతా కా మూడ్ సర్వే ►బీఆర్ఎస్దే మళ్లీ అధికారం ►72-75 సీట్లు గెలుచుకోనున్న బీఆర్ఎస్ పార్టీ ►31-36 సీట్లకు పరిమితం కానున్న కాంగ్రెస్ పార్టీ ►బండి సంజయ్ తొలగింపు, కర్ణాటకలో ఓటమి బీజేపీపై ప్రభావం చూపిందన్న జనతా కా మూడ్ పార్టీ ఓటు షేర్ సీట్లు బిఆర్ఎస్ 41% 72-75 కాంగ్రెస్ 34%. 31-36 బిజెపి 14%. 4-6 ఎం ఐ ఎం 3% 6-7 ఇతరులు 8% 0 ►గత నెల కిందట సర్వే చేశాం. ►లక్ష 20 వేల శాంపిల్స్ సేకరించాము. ప్రతి నియోజకవర్గంలో 1100 మంది శాంపిల్స్ తీసుకున్నాం ►విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ►గత 30 ఏళ్ల లో చూడని మంచి ఫలితాలు కాంగ్రెస్ సాధిస్తుంది. ► 👆భాస్కర్ సింగ్, జనతా కా మూడ్ 12:40pm, నవంబర్ 1, 2023 ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వీరేశం ► నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం బాబాసాహెబ్ గూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు 12:34pm, నవంబర్ 1, 2023 సవాల్కు సవాల్ ►నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బిజెపి అబద్దాలను ప్రచారం చేస్తుందన్నారు బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ► మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. తనపై అవినీతి అరోపణలు చేసిన బిజెపి అభ్యర్థి రామరావు పటేల్తో బహిరంగ చర్చకు సిద్దమన్నారు ఎమ్మెల్యే 12:25pm, నవంబర్ 1, 2023 ఎన్నికల వేళ పూజలు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు ► హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గోపాల్ పూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 12:05pm, నవంబర్ 1, 2023 ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ► యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం సభ నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య. ► ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం 11:45pm, నవంబర్ 1, 2023 భర్తలకు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భార్యలు ► సూర్యాపేట: ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత ► కరీంనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన కుటుంబ సభ్యులు ► మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంజయ్ సతీమణి అపర్ణ, ఇతర కుటుంబీకులు. 11:05pm, నవంబర్ 1, 2023 కిం కర్తవ్యం.! అనుచరులతో వైఎస్ షర్మిల భేటీ ► ఎన్నికల్లో పోటీ చేసే అంశం పై అభిప్రాయాలు తీసుకోనున్న షర్మిల ► నామినేషన్లకు ఇంకా రెండ్రోజుల గడువు ఉండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న షర్మిల ► ఇప్పటికే పలుమార్లు పోటీ అంశం పై అంతర్గత సమావేశాలు నిర్మహించిన షర్మిల 10:45pm, నవంబర్ 1, 2023 కెటిఆర్ స్పీడ్మోటార్ ► కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ► భిక్కనూర్, దోమకొండ మండల కేంద్రాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్. ► కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్ 10:30pm, నవంబర్ 1, 2023 తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు? ► పొత్తులో భాగంగా జనసేనకు 10 సీట్లు ఇచ్చే అవకాశం ► శేరిలింగంపల్లి, అంబర్ పేట, కూకట్పల్లి, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు సీట్లు ఇచ్చే అవకాశం ► మరికొన్ని సీట్లు అడుగుతోన్న జనసేన 10:00pm, నవంబర్ 1, 2023 బీ అలర్ట్ ► తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ► ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమీక్షించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ► సీఎస్, డీజీపీతో సమీక్షించనున్న ఈసీ బృందం -
సేవా తత్పరుడు.. సీతయ్య గుప్తా..
హైదరాబాద్: ఒక సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన సీతయ్య గుప్తా నగర అభివృద్ధికి అసామాన్య కృషి చేశారు. రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఆయన సేవలు అజరామరం. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్రోద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరోవైపు వర్తక రంగంలో వ్యాపారుల సంక్షేమానికి పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా, అంచనాల సంఘాల సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడకు చెందిన సీతయ్య గుప్తా తన 16వ ఏట ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఉస్మాన్గంజ్లోని ఒక వ్యాపారి వద్ద ఉద్యోగంలో చేరారు. క్రమంగా వ్యాపారంపై పట్టు పెంచుకున్నారు. ఈ సమయంలో మాడపాటి హనుమంతరావుతో కలిసి ఉస్మాన్గంజ్ ధర్మశాల నిర్మాణానికి కృషి చేశారు. 1938 ఏప్రిల్ 16న ధూల్పేట మత ఘర్షణలకు వ్యతిరేకంగా ‘ఆర్యసమాజ్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1957లో జరిగిన సాధారణ ఎన్నికలు ఆయన ప్రస్థానంలో మైలురాయి. అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి సలహాపై ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో బేగంబజార్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1963లో సీఎల్పీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంచనాల సంఘం సభ్యుడిగా పనిచేశారు. ఆయన జీవితంలో రాజకీయం ఒక భాగమైతే సేవ అసలు లక్ష్యం. అనేక ధార్మిక సంస్థలు స్థాపించి తర్వాత తరాలకు సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి సంస్థల స్థాపనతో పాటు, వాసవి సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. వైశ్యుల సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ఆయన జులై, 1939లో పీల్ఖానాలో వైశ్య హాస్టల్ ప్రారంభించారు. కాచిగూడలో నిర్మించిన అతిపెద్ద వైశ్య హాస్టల్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. 1997లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ నగర రాజకీయ, సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసిన సీతయ్య గుప్తా.. నగర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. -
మామ కోసం కోడళ్లొచ్చారు!
చిలకలగూడ: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో వరుసగా మూడుసార్లు విజయం సాధించినవారు లేరు. ఇక్కడి నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకుని ‘సికింద్రాబాద్ సెంటిమెంట్’కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘కుటుంబ సభ్యుల సెంటిమెంట్’ను ప్రవేశపెట్టారు. ఆయనకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. కుమారులు కిషోర్కుమార్, కిరణ్కుమార్, రామేశ్వర్, త్రినేత్ర, కోడళ్లు శ్వేత, రోజా, శిల్ప, తేజశ్విని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి పద్మారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. నలుగురు కుమారులతో పాటు కోడళ్ల ఎన్నికల ప్రచారం సెంటర్ ఆఫ్ ఎంట్రాక్షన్గా నిలుస్తోంది. పద్మారావు హ్యాట్రిక్ గెలుపు ఖాయమని కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
Sanath Nagar: మంత్రి తలసానికి హ్యాట్రిక్ రికార్డు దక్కేనా?
హైదరాబాద్: సనత్నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థీ ఇంతవరకు హ్యాట్రిక్ రికార్డును కైవసం చేసుకున్న చరిత్ర లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వరుసగా ఆ విజయాలను నమోదు చేసుకున్న పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 1978లో సనత్నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1992, 1994లో వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి మర్రి శశిధర్రెడ్డి గెలుపొందగా 1999 ఎన్నికల్లో శ్రీపతిరాజేశ్వర్ గెలుపొందడంతో శశిధర్రెడ్డికి హ్యాట్రిక్ దూరమైంది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో సైతం మర్రి శశిధర్రెడ్డి రెండుసార్లు వరుస విజయాలను నమోదు చేసుకోగా 2014లో ఆయన పరాజయం పాలవడంతో మరోసారి హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తలసాని శ్రీనివాస్యాదవ్ గెలుపొంది మరోసారి బీఆర్ఎస్ అభ్యర్ధిగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల ప్రచారంలో బైక్ ర్యాలీలకు యూత్‘ఫుల్’ డిమాండ్
హైదరాబాద్: యూత్లో ఎన్నికల జోష్ వచ్చేసింది. బండి చేతిలో ఉంటే చాలు ‘జెండా’ ఎత్తుకుంటున్నారు. కండువాలు కప్పేసుకుంటున్నారు. జైకొట్టి హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో యువత ముందంజలో ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసిపెట్టేందుకు యువకులకు భారీ డిమాండ్ వచ్చింది. సాధారణంగా ఎన్నికలు రాగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు చేతినిండా పని ఉంటుంది. రాత్రింబవళ్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో, ప్రచార ఎత్తుగడల్లో తలమునకలై ఉంటారు. మరోవైపు ప్రచారంలో తమ ఆధిక్యతను ప్రదర్శించేందుకు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంఖ్యాబలాన్ని చాటుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి సహకరించే యువతకు అనూహ్యమైన డిమాండ్ వచ్చేసింది. గల్లీలు, బస్తీల్లో ఉండే యువకులే కాకుండా డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులను కూడా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వీలైన సమయంలో అప్పటికప్పుడు పార్టీల కండువాలు ధరించి బైక్ ర్యాలీలతో హడలెత్తించేందుకు కుర్రకారు సైతం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ ట్రెండ్ బలంగా కొనసాగుతోంది. మెజారిటీని ప్రదర్శించేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఇదో ‘పార్టీ’టైమ్ జాబ్ ... సాధారణంగా డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న కుర్రాళ్లకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే ఆఫర్లు పార్ట్టైమ్ జాబ్గా మారాయి. ప్రతి రోజు ప్రచారానికి వచ్చే వారికి రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ, వీలైతే సాయంత్రం బీరు సంగతి సరేసరి. గల్లీబాయ్స్ మాత్రమే కాదు. ప్రైవేట్ హాస్టళ్లల్లో ఉండే బ్యాచిలర్స్, నిరుద్యోగయువతకు ఇదో ఉపాధిగా మారింది. ‘ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఖాళీగా ఉంటే ఖర్చులు తప్పవు కదా. అందుకే ప్రచారానికి వెళ్తున్నాను’ అని దిల్సుఖ్నగర్కు చెందిన శ్రీకాంత్ చెప్పాడు. ఇంటి కిరాయి, రోజువారి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, సదరు పార్టీవాళ్లు ఇచ్చే డబ్బులతో కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నాడు. సాధారణంగా ఎన్నికలు రాగానే కళాకారులకు, సోషల్మీడియా సైనికులకు డిమాండ్ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో అడ్డాకూలీల సేవలను కూడా రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యువకులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ‘రాత్రింబవళ్లు జెండాలు పట్టుకొని తిరగవలసిన అవసరం లేదు కదా. ఉదయం, సాయంత్రం రెండు, మూడు గంటలు ర్యాలీలకు వెళితే చాలు. సరదాగా ఉంటుంది. పైగా ఖర్చులకు డబ్బులొచ్చేస్తాయి.’ అని సికింద్రాబాద్కు చెందిన యువకుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీల ప్రచారానికి తరలి వచ్చే యువకులతో పెట్రోల్ బంకులకు, హోటళ్లకు సైతం గిరాకీ పెరిగింది. అందరూ ఇప్పుడు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. బైక్ ట్యాక్సీ వాలాలకూ ఆఫర్... ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో పని చేసే ట్యాక్సీ బైక్ డ్రైవర్లు, యాప్ ఆధారిత సేవలను అందజేసే డెలివరీబాయ్స్ కూడా శ్రీజస్ట్ ఫర్ ఛేంజ్శ్రీను కోరుకుంటున్నట్లు ఒక పార్టీకి చెందిన నాయకుడొకరు చెప్పారు. ఒకవైపు ఆయా సంస్థల్లో పని చేస్తూనే వీలైన వేళల్లో ర్యాలీలకు, ప్రదర్శనలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రొటీన్ విధులకు భిన్నంగా పార్టీ ప్రచారానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. -
పాతబస్తీలో హ్యాట్రిక్ వీరుడు
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అంటే మజ్లిస్కు అడ్డా. ఇక్కడ రాజకీయాలను శాసించే స్థాయి మజ్లిస్ది మాత్రమే. పాతబస్తీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ముస్లిం అభ్యర్థి తప్ప మరెవరూ గెలవలేరని ఒక నానుడి కూడా ఉంది. కానీ ఒక్క కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం భారతీయ జనతాపార్టీ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించింది. కార్వాన్ టైగర్గా పేరొందిన బద్దం బాల్రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండు దశాబ్దాల పాటు బీజేపీకి ఇక్కడ ఎదురే లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్వాన్ స్థానం నుంచి మజ్లిస్ పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బాకర్ ఆగా గెలిచారు. ఆ తర్వాత 1985, 1989, 1994లలో వరుసగా బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్రెడ్డి మజ్లిస్పై విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ లోక్సభ స్థానానికి 1991, 1998, 1999లో బీజేపీ తరఫున బరిలో దిగి మజ్లిస్కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానికి పరిమితమయ్యారు. కాగా, కార్వాన్న్ అసెంబ్లీ స్థానానికి 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పక్షాన బరిలో దిగిన కిషన్రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పట్లో మజ్లిస్ నుంచి ఎన్నికై న సయ్యద్ సజ్జాద్ మృతి చెందడంతో 2003 ఉప ఎన్నికతోపాటు 2004, 2014 ఎన్నికల్లో మరోసారి బద్దం బాల్రెడ్డి బరిలో దిగినప్పటికీ పరాజయం తప్పలేదు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆయన మృతి చెందారు. -
‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’
మేడ్చల్ రూరల్: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్, నాయకులు రమణారెడ్డి, మహేశ్గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఏమాయే ?
హైదరాబాద్: చార్మినార్ శాసన సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించ లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా లిస్టులు వెలువడినప్పటికీ.. రెండింట్లో చార్మినార్ అభ్యర్థి పేరు లేదు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. చార్మినార్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పేరు ప్రకటించ లేదు. అయితే ఊహించని విధంగా అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం చార్మినార్ నియోజకవర్గం నుంచి అలీ మస్కతి ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. అప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎక్కడ ఏ ఒక్క అభ్యర్థని ప్రకటించ లేదు. అయినప్పటికీ.. చార్మినార్ నుంచి అలీ మస్కతి పేరును విలేకర్ల ముందు ప్రకటించారు. చార్మినార్ నుంచి పోటీ చేయడానికి అలీ మస్కతి కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గతంలో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చార్మినార్ కాకుండా మరో ఇతర స్థానం నుంచి పోటీ చేస్తే బావుంటుదనే ఆలోచనలో అలీ మస్కతి కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో అలీ మస్కతి ఎటూ తేల్చుకోలేని సందిగ్దంలో ఉన్నట్లు ఆయన అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. టికెట్ ఆశిస్తూ రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసిన నాయకులు.. అప్పటి వరకు చార్మినార్ నియోజకవర్గం నుంచి తమకే టికెట్ కేటాయించాలని గాంధీభవన్లో రూ.50 వేలు కట్టి దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కొంత నిరాశకు గురయ్యారు. మొన్నటి వరకు టీడీపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన అలీ మస్కతి గతంలో జరిగిన ఎన్నికల్లో చారి్మనార్ నుంచి టీడీపీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేశాడని.. సడెన్గా పార్టీ మారడంతోనే చార్మినార్ టికెట్ ఎలా ఇస్తారని దరఖాస్తులు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఇప్పటికే కె.వెంకటేష్, అస్ఘర్ అలీ బేగ్, షాబాజ్ ఖాన్, ముజీబుల్లా షరీఫ్, వంశీకృష్ణ తదితరులు తమకు టికెట్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. రేవంత్రెడ్డి ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆశావహులు.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటనల మేరకు దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ.. అలీ మస్కతి పేరును ఢిల్లీలో రేవంత్రెడ్డి ప్రకటించడంతో వీరంతా తమ పోటీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇందులో ఏ ఒక్కరూ అలీ మస్కతి ప్రకటనను వ్యతిరేకించ లేదు. అయినప్పటికీ.. పాతబస్తీలోని యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా తదితర నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించగా.. చారి్మనార్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తిరిగి ఆశావహులు ఎంతో ఆశతో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ ఆశించిన చారి్మనార్ నాయకులంతా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నియోజకవర్గంలో సీనియర్లమైన తమకు మాత్రమే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్న వారు కొందరైతే.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో క్రీయాశీలక కార్యకర్తలుగా, నాయకులుగా పని చేస్తున్న తమకు కాకుండా ఇటీవల పార్టీ మారిన నాయకునికి టికెట్ కేటాయించడం సరైంది కాదని మరికొందరంటున్నారు. అలీ మస్కతిని గెలిపిస్తాం..ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసి మజ్లిస్ పారీ్టకి గట్టి పోటీనిచి్చన అలీ మస్కతికి చార్మినార్ నుంచి టికెట్ కేటాయిస్తే.. భారీ మెజారీ్టతో గెలిపిస్తామని మరికొంత మంది నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్ను ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆశించిన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామంటున్నారు. ఎలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా నియోజకవర్గంలోని అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ జెండాపై పోటీ చేసి విజయం సాధిస్తామంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పని చేస్తామంటున్నారు. -
మరోసారి.. మంచిరెడ్డి వర్సెస్ మల్రెడ్డి
హయత్నగర్: మంచిరెడ్డి కిషన్రెడ్డి, మల్రెడ్డి సోదరులు 20 ఏళ్లుగా రాజకీయంగా పోటీ పడుతూ వస్తున్నారు. ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా పోటీ మాత్రం వారి మధ్యే ఉంటోంది. ఇద్దరిలో ఒక్కసారి మల్రెడ్డి గెలవగా మూడుసార్లు మంచిరెడ్డి విజయం సాధించారు. మలక్పేట్ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది. గతంలో నాలుగు పర్యాయాలు పోటీ పడిన వారు తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం బరిలో నిలిచారు. 2004లో మలక్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేయగా టీడీపీ తరఫున మంచిరెడ్డి కిషన్రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీరి పోటీ ఇబ్రహీంపట్నానికి మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్రెడ్డి పోటీ చేయగా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి మల్రెడ్డిపై పైచేయి సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్రెడ్డి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఆయన మహేశ్వరం నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు రాంరెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్గా మంచిరెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుపొందగా మల్రెడ్డి రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 2018లో వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. మిత్రపక్షమైన టీడీపీని కాదని కాంగ్రెస్ శ్రేణులు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి సుమారు 376 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తాజాగా మంచిరెడ్డి, మల్రెడ్డి మధ్య ఐదోసారి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సొంత బలంతో పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ తరఫున పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది... -
ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు డౌటే!!
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గుబులు పట్టుకుంది. ఈసారి ముగ్గురు సిట్టింగులకు ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా మరో ఎమ్మెల్యేకు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరో ఎమ్మెల్యేకు మాత్రం సీటు మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా మజ్లిస్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం ఏడు సిట్టింగ్ స్థానాల్లో రెండు మినహా మిగతా స్థానాల అభ్యర్థిత్వాలపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగడం సర్వసాధారణమే. పార్టీ నిర్ణయం రాజకీయ పరిశీలకులకే అంతుపట్టని విధంగా ఉంటోంది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయమే ఫైనల్. పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈసారి సీనియర్ ఎమ్మెల్యేల వయోభారం దృష్ట్యా మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. వారి స్థానంలో కొత్తగా యువతరానికి అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ బాటలో.. ఎన్నికల రిటైర్మెంట్ బాటలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. పాత బస్తీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్, మౌజం ఖాన్లకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. యాకుత్పురా నుంచి ఐదు పర్యాయాలు, చార్మినార్ నుంచి ఒక పర్యాయం ఎన్నికయ్యారు. అహ్మద్ పాషా ఖాద్రీ నాలుగుసార్లు చార్మినార్ నుంచి, ఒకసారి యాకుత్పురా నుంచి ఎన్నికయ్యారు. బహదూర్పురా నుంచి మౌజం ఖాన్ నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వారికి చాన్స్.. మజ్లిస్ పార్టీలో ఈసారి కొత్తవారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్కు ఈసారి స్థాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని యాకుత్పురా స్థానానికి మార్చి నాంపల్లి స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ లేదా కుమార్తె ఫాతిమా అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బహదూర్పురా సిట్టింగ్ ఎమ్మెల్యేకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అక్కడి నుంచి మరో మాజీ మేయర్ జుల్పేఖార్ అలీ లేదా మరో యువనేత అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అడ్డగోలుగా ప్రచారాలు.. జోరుగా వ్యక్తిగత ఆరోపణలు
మేడ్చల్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారాలు అడ్డగోలుగా చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తాము సమర్థంచే పార్టీలు, అభ్యర్థుల కోసం ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాను ఫాలో చేసే వారికి చిర్రెత్తిస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా తమ ప్రచారం తాము చేసుకోవాలని నిబంధనలు ఉన్నా అడ్డూ అదుపు లేని సోషల్ మీడియాలో పోస్టింగ్ల జోరుగా కనిపిస్తోంది. ప్రత్యేక గ్రూపులు.. ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల్లో మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాను నేటి రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రధానంగా వాట్సాప్, ఫేస్బుక్లను ఎక్కువగా వాడుతున్నారు. యూట్యూబ్కు కొంతవరకు నియంత్రణ ఉంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో ఉండే ఓటర్ల నంబర్లు సేకరించి గ్రూపులుగా తయారు చేస్తున్నారు. మా ఊరు, మన వార్డు, మన కాంగ్రెస్, మన బీజేపీ, మన బీఆర్ఎస్, జంగయ్య సైన్యం, మల్లారెడ్డి సైన్యం, మున్సిపాలిటీ, మండలం, నియోజకవర్గం ఇలా వార్డు స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారు పెట్టే పోస్టింగ్లు నిజమో కాదో ఎవరికీ తెలియదు.. కానీ చక్కర్లు మాత్రం జోరుగా కొట్టిస్తున్నారు. ఓ ప్రముఖ సర్వేలో మా అభ్యరి్థకి 70శాతం మంది ఓటర్లు మొగ్గుచూపారని, గెలుపుమాదే అని ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. ఆ సర్వే ఎవరూ చేశారు, ఏ సంస్థ చేసింది పోస్ట్ పెట్టిన వాడికే తెలియదు. అభిమానం కట్టలు తెంచుకుని ఉండటంతో వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం ఫేస్బుక్లో షేర్ చేయడమే వారి పని. సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉండటంతో ప్రచారంలో నాయకులు దానిపై ఆధారపడుతున్నారు. వీటీ కోసం స్థానికంగా ప్రత్యేక వ్యస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫొటోలు పెట్టి అందంగా మేకప్ చేసి సందేశాలను విడుదల చేస్తున్నారు. ఒక్కో మెసేజ్కు రూ.30, వీడియోకు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. చాలామందికి ఇదో రకం ఉపాధిగా మారింది. ఫొటోలు పెట్టుకొని గ్రూపుల్లో ప్రచారాలు చేయడం, వాట్సాప్లలో పెట్టడం, స్టేటస్ పెట్టుకోవాలని సూచించడం వంటి మెసేజ్లు ఎన్నో కనిపిస్తున్నాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్నా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అంటున్నారు. -
ముగ్గురూ.. ముగ్గురే..!
రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర. బంజారాహిల్స్: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వీరికి తోడు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ►హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్కు ఇప్పుడామె సవాల్గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మతోనే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్ఎస్ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. పీజేఆర్ బొమ్మతో... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్... పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే. అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా... అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే అ్రస్తాలుగా మలుచుకోనున్నారు. -
ఒక పార్టీనుంచి గెలిచి.. మరో పార్టీ నుంచి పోటీ చేయొచ్చు
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టికెట్లు లభించాయి. వీరిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి చాలాకాలం క్రితమే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లుచింది. పోటీ చేసేందుకు వీరు తమ కార్పొరేటర్ల పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచే టికెట్ పొందిన జీహెచ్ఎంసీని ఆనుకునే ఉన్న మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ సైతం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పనిలేదు. ఆయన పార్టీ కూడా మారలేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినా, మారకపోయినా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యే వంటి ఇతర పదవులకు పోటీ చేయడానికి ముందే తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ యాక్ట్, నియమ నిబంధనల మేరకు స్థానిక సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న వారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే, ఇతరత్రా పదవులకు పోటీ చేయవచ్చని మున్సిపల్ చట్టాల నిపుణులు తెలిపారు. పోటీ చేసి, గెలిచాక మాత్రం పాత పదవిని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ఏకకాలంలో రెండు పదవుల్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఓడిపోతే పాత పదవిలోనే యథాతథంగా కొనసాగవచ్చు. కార్పొరేటర్లకు వర్తించదు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే ఎమ్మెల్యేల విషయంలోనే సవ్యంగా అమలు కావడం లేదు. ఆ చట్టం ఉన్నప్పటికీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇక ఎలాంటి చట్టమూ లేని కార్పొరేటర్లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. పార్టీలు మారితే ఆమేరకు పాత పారీ్టకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. – పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక్క పదవిలోనే ఉండాలి జీహెచ్ఎంసీ యాక్ట్లోని సెక్షన్ 5–డి మేరకు కార్పొరేటర్ కంటే ఉన్నతమైన పదవిని పొందినవారు పదిహేను రోజుల్లోగా తాను కొత్త పదవిలో చేరనున్నట్లు కమిషనర్కు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయనకు కార్పొరేటర్ పదవి రద్దవుతుంది. ఎమ్మెల్యే పదవనే కాదు.. మరే ఇతర పదవైనా సరే రెండో పదవిలో ఉండటం చెల్లదు. ఏకకాలంలో ఒకే పదవిలో మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీచేసేవారు గెలవని పక్షంలో యథావిధిగా తమ కార్పొరేటర్ పదవిలో కొనసాగవచ్చు. సాంకేతికంగానూ ఎలాంటి విధివిధానాలంటూ లేవు. – జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారి మారిన వారెందరో.. జీహెచ్ఎంసీలో ఇప్పటికే పలువురు పారీ్టలు మారారు. ఆమేరకు వారు సాంకేతికంగా ఆచరించాల్సిన విధానాలంటూ ఏమీ లేకపోవడంతో సర్వసభ్య సమావేశాలప్పుడు మాత్రం మారిన పార్టీ సభ్యులతో కలిసి కూర్చుంటున్నారు. అంతకుమించి పాటించిన విధానాలేమీ లేవు. -
చిన్నబోయిన సుజాతనగర్ !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు పెద్ద నియోజకవర్గంగా వెలిగిన సుజాతనగర్ నియోజకవర్గం రాజకీయ చిత్రపటం నుంచి పూర్తిగా కనుమరుగైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా.. 2009లో చేపట్టిన పునర్విభజనలో తెరమరుగైంది. నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి మండలాలు పూర్తిగా, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కారేపల్లి, కొత్తగూడెం, టేకులపల్లి, గార్ల మండలాలు పాక్షికంగా ఉండేవి. ఇక్కడ మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు(ఒక ఉప ఎన్నిక కలిపి) జరగగా నాలుగేసి సార్లు సీపీఐ, కాంగ్రెస్ విజయకేతనం సీపీఐ వరుస విజయాలు ఎగరవేశాయి సుజాతనగర్ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి మహమ్మద్ రజబ్ అలీ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఆయన విజయం సాధించడం విశేషం. ముప్పై ఏళ్ల పాలన క్రమంలో కేవలం ముగ్గురు అభ్యర్థులే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో చేపట్టిన పునర్విభజనలో ఈ నియోజకవర్గంలోని ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాలతో పాటు, మధిర నియోజకవర్గంలో కొనసాగిన వైరా మండలాన్ని కలిపి కొత్తగా వైరా నియోజకవర్గం ఆవిర్భవించింది. దీంతో 30 ఏళ్లపాటు నియోజకవర్గంగా కొనసాగిన సుజాతనగర్ గ్రామపంచాయతీ కేంద్రంగా మిగిలిపోయింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో భద్రాద్రి కొత్తగూడెంలో కలిసింది. ఇప్పుడు మండల కేంద్రంగా కొనసాగుతుండగా... నాటి గురుతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తొలి ఎమ్మెల్యే సీతారామయ్య 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుజాతనగర్ తొలి ఎమ్మెల్యేగా బొగ్గారపు సీతారామయ్య కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసి సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుపై విజయం సాధించారు. బొగ్గారపు సీతారామయ్య, పువ్వాడ నాగేశ్వరరావులు ఇరువురు కలిసి న్యాయవిద్యను అభ్యసించినా రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, నిజాం హైదరాబాద్ సంస్థానం పాలన విముక్తి కోసం జరిగిన పోరాాటంలో పాల్గొన్న వ్యక్తిగా సీతారామయ్య గుర్తింపు పొందారు. ప్రముఖ న్యాయవాదిగా, శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షునిగా, ప్యానెల్ స్పీకర్గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం బలపర్చిన జనతా పార్టీ అభ్యర్ధి గోగినేని సత్యనారాయణ మధ్యే పోటీ ఉంటుందని అప్పట్లో అంతా భావించారు. రాజకీయ అంచనాలకు అందని విధంగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన సీతారామయ్య అందరినీ ఆశ్చర్యపరిచారు. హైకోర్టు న్యాయవాదిగా సైతం పనిచేసిన సీతారామయ్య కరోనాతో మృతి చెందారు. రజబ్ అలీది చెరగని ముద్ర సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ సుజాతనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తొలిసారి 1983లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్పై గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయం సాధించినా ఆ పార్టీ అభ్యర్థి సామినేని రాఘవులుకు ఇక్కడ కేవలం 12 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, సీపీఎం మద్దతుతో వరుసగా సీపీఐ అభ్యర్ధి రజబ్ అలీ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. ఒకమారు కాంగ్రెస్ అధిష్టానం చేకూరి కాశయ్యకు టిక్కెట్ ఇవ్వగా...రాంరెడ్డి వెంకటరెడ్డి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో చేకూరికి కేవలం 10 వేల ఓట్లే వచ్చాయి. రాంరెడ్డి ప్రస్థానం రజబ్ అలీ మరణాంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. సీపీఎం, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన రాంరెడ్డి సీపీఐ అభ్యర్థి టీ.వీ.చౌదరిని ఓడించారు. 1999 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. టీడీపీ నుంచి పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలవగా.. రాంరెడ్డి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోట్ల మాధవి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి పోటీ చేయగా.. రాంరెడ్డి మళ్లీ గెలుపొందారు. 1996, 1999, 2004లలో వరుసగా మూడుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి హ్యాట్రిక్ సృష్టించారు. 2009లో పునర్విభజనలో సుజాతనగర్ నియోజకవర్గం కనుమరుగు కావడంతో 2009, 2014లో రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తద్వారా ఆయన రెండు నియోజకవర్గాల్లో కలిపి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నట్లయింది. సుజాతనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు వీరే సంవత్సరం విజేత పార్టీ 1978 బొగ్గారపు సీతారామయ్య కాంగ్రెస్ (ఐ) 1983 ఎండీ రజబ్ అలీ సీపీఐ 1985 ఎండీ రజబ్ అలీ సీపీఐ 1989 ఎండీ రజబ్ అలీ సీపీఐ 1994 ఎండీ రజబ్ అలీ సీపీఐ 1996 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ 1999 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ 2004 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ -
కరెన్సీ కట్టలు..
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపుపై సిటీ పోలీసులు డేగకన్ను వేశారు. కేవలం రాజకీయ సంబంధిత సొమ్మే కాదు.. భారీ మొత్తంలో తీసుకువెళ్తున్న వారినీ విడిచిపెట్టడం లేదు. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్లో తనిఖీలు చేసిన ఆసిఫ్నగర్ అధికారులు రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.1,78,30,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తీసుకువెళ్తున్న ఇరువురూ ప్రవాస భారతీయులుగా (ఎన్నారై) గుర్తించామని శుక్రవారం సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బి.బాలస్వామి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ► షేక్పేట్లోని గుల్షన్ కాలనీకి చెందిన అన్నదమ్ములు మహ్మద్ షానవాజుద్దీన్, మహ్మద్ షాబుద్దీన్ కొన్నేళ్లుగా సౌదీలో వ్యాపారం చేస్తున్నారు. ఎన్నారైలు అయిన వీరు ఇటీవల నగరానికి వచ్చారు. శివార్లలో ఉన్న ఓ భూమి కొనుగోలు చేయడానికి బేరసారాలు పూర్తి చేశారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత కొంత మొత్తం అడ్వాన్స్గా చెల్లించారు. శుక్రవారం మిగిలిన రూ.1.78 కోట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. దీనికోసం గురువారం తమ ఖాతాలు ఉన్న బ్యాంక్కు వెళ్లారు. బ్యాంక్ మేనేజర్ వారించినా.. ► సాధారణ సమయాల్లోనే అంత మొత్తం నగదు రూపంలో ఇవ్వడం కష్టసాధ్యమని, ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటంలో ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా పోలీసుల తనిఖీల్లో చిక్కితే స్వాధీనం చేసుకుంటారని బ్యాంకు మేనేజర్ వారించారు. తమ డబ్బు తాము డ్రా చేసుకుంటామని, ఇచ్చి తీరాలంటూ వాగ్వాదానికి దిగిన ఇరువురూ ఆ మొత్తం బ్యాంకు నుంచి తీసుకున్నారు. ఇలా డ్రా చేసిన నగదును ఇరువురూ తమ కార్లలో పెట్టుకుని బయలుదేరారు. కార్లలో తనిఖీ చేయగా.. ► ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఆసిఫ్నగర్ ఏసీపీ ఎల్.రాజావెంకట్రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అనేక చోట్ల వాహన తనిఖీలు చేస్తోంది. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్లోని సాయిబాబా దేవాలయం వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఇన్నోవా, ఆమ్నీ కార్లను ఆపి తనిఖీ చేశారు. రెండింటిలోనూ కలిపి రూ.1,78,30,000 కనిపించడంతో ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ఆదాయపు పన్ను శాఖకు పంపారు. వీరిద్దరూ తమ వద్ద ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ సేల్, బ్యాంకు డ్రా పత్రాలు చూపించారు. ► నిబంధనల ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదు. దీనికి తోడు ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఇంత మొత్తం తరలించకూడదు. ఈ నగదును వీరు ప్రలోభాలకు వాడకపోయినా... వీరికి భూమిని అమ్మిన వ్యక్తో లేక అతడి నుంచి తీసుకున్న మరొకరో ఇలా దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. రసీదు ఉన్నప్పటికీ.. స్వాధీనం చేసుకున్న భారీ మొత్తాలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తాం అని ఓ అధికారి వివరించారు. -
మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు రాజేస్తోంది. మరోమారు పార్టీ అంతర్గత సంక్షోభం పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను వయోభారం దృష్ట్యా ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తగా యువతకు అవకాశం కల్పించాలన్న నిర్ణయం మజ్లిస్కు తలనొప్పిగా తయారైంది. అధిష్టానం ప్రతిపాదనల మేరకు ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అందులో ఒకరు మాత్రం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న మెలిక పెట్టడం పార్టీని చిక్కుల్లో పడేసినట్లయింది. అవకాశం ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్న అల్టిమేటం తిరుగుబాటు సంకేతాన్ని సూచించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాల క్రితం మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడిన విభేదాలతో సీనియర్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఏకంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి మజ్లిస్ బచావో తెహరిక్ను స్థాపించారు. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ను ఓడించి కేవలం చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేసి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి అమానుల్లాఖాన్ సహచరుడైన సీనియర్ ఎమ్మెల్యే తాజాగా చార్మినార్కి అల్టిమేటం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సంప్రదింపుల్లో కాంగ్రెస్ .. మజ్లిస్ పార్టీని పాతబస్తీలో దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మజ్లిస్ తమను ప్రధాన శత్రువు పక్షంగా పరిగణించి వ్యతిరేక ప్రచారం చేయడం కాంగ్రెస్కు మింగుడు పడని అంశంగా తయారైంది. ఇప్పటికే చార్మినార్ నుంచి బలమైన ముస్లిం అఅభ్యర్థని రంగంలోని దింపేందుకు అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్తో సంప్రదింపుల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కాంగ్రెస్ పక్షాన చార్మినార్తో పాటు యాకుత్పురా అసెంబ్లీ స్థానాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూడాలనే యోచనలో ముంతాజ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమెరుగని ముంతాజ్ ఖాన్కు చార్మినార్తో పాటు యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. దానిని అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల మార్పు, వయోభారం దృష్ట్యా సీనియర్ ఎమ్మెల్యేను పోటీ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న మజ్లిస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్పురా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీలకు బదులుగా కొత్తవారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి స్థానంలో రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాన్ని ఈసారి యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్కు మార్చు చేసి, నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ను బరిలో దింపాలని యోచిస్తోంది. చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ లేదా కూతురు ఫాతిమాను రాజకీయ అరంగ్రేటం చేయించాలని మజ్లిస్ భావిస్తోంది. రంగంలోకి అక్బరుద్దీన్ ► అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ ప్రతిపాదనలపై వారితో చర్చించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్తో అక్బరుద్దీన్ ఓవైసీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపినా ఫలప్రదం కానట్లు తెలుస్తోంది. ►వయోభారం దృష్ట్యా యువతకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా, స్వచ్ఛందంగానే తప్పుకునేందుకు ముంతాజ్ ఖాన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే గత ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్కు అవకాశం కల్పించాలని విజ్ఙప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఎంబీటీ నుంచి ఎంఐఎంలోకి తిరిగి వచ్చేందుకు ‘జీవితకాలం సీటు ఖాయం’ అన్న అప్పటి పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీ ఇచ్చిన నోటి మాట కూడా ఈ సందర్భంగా ముంతాజ్ అహ్మద్ ఖాన్.. అక్బరుద్దీన్ ఒవైసీకి గుర్తు చేసినట్లు సమాచారం. ఒకవేళ కుమారుడికి సీటు ఇవ్వకుంటే చార్మినార్, యాకుత్పురాల నుంచి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ అల్టిమేటం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా తయారైంది. -
Ranga Reddy District: ఇద్దరు సీఎంలు, ముగ్గురు హోంమినిస్టర్లు మనవారే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేకమంది ఉద్ధండులకు నిలయంగా ఈ జిల్లా నిలిచింది. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్నగర్ (ఒకప్పడు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగం) నియోజకవర్గం నుంచే గెలుపొందారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కూడా ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్ నుంచి ఒకసారి, మేడ్చల్ నుంచి మరోసారి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పనిచేసిన దివంగత నేత సూదిని జైపాల్రెడ్డి కూడా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలుపొందారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తొలిసారిగా ఓటమిని చవిచూసింది ఇక్కడే. ఆయనపై గెలుపొందిన చిత్తరంజన్దాస్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గం.. మేడ్చల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా పది మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా.. మరో ఐదుగురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో సుమిత్రాదేవి (1967–72) జిల్లా నుంచి తొలి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి 1978లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వికారాబాద్, తాండూరు నుంచి రెండేసి సార్లు, సనత్నగర్ నుంచి ఒకసారి, మేడ్చల్ నుంచి ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఉమా వెంకట్రామిరెడ్డి(1983, 1989) కాంగ్రెస్ నుంచి, సురేందర్రెడ్డి(1985) టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందడమే కాకుండా ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 1994 నుంచి 2004 వరకు టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు తూళ్ల దేవేందర్గౌడ్ గెలుపొందారు. ఆయన హోం, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి సైతం మే డ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చేవెళ్ల నియోజకవర్గం.. చేవెళ్ల నియోజకవర్గానికి 1962 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1985 నుంచి వరుసగా నాలుగు సార్లు (టీడీపీ నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి ఒకసారి) గెలుపొందిన పి.ఇంద్రారెడ్డి ఉమ్మడి ఏపీలోని ఎన్టీఆర్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన అకాల మరణం తర్వాత ఆ స్థానానికి (2000) నిర్వహించిన ఉపఎన్నికల్లో ఆయన సతీమణి సబితారెడ్డి గెలుపొందారు. ఆమె 2004లో కాంగ్రెస్ నుంచి మళ్లీ విజయం సాధించి తొలి మహిళా హోంమంత్రి(దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి)గా పనిచేశారు. దంపతులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొండమే కాకుండా ఒకే శాఖకు మంత్రిగా పనిచేయడం విశేషం. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహే శ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సబితారెడ్డి గనులు భూగర్భవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో అదేస్థానంలో కాంగ్రెస్ అభ్య ర్థిగా విజయం సాధించి.. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పరిగి నియోజకవర్గం.. పరిగి నియోజకవర్గానికి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగగా.. 12 మంది రెడ్డి సామాజికవర్గం వారే విజయం సాధించారు. మూడుసార్లు మైనార్టీ(ముస్లిం) అభ్యర్థులు గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా కమతం రామిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1972, 1989లో ఆయనే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. జలగం వెంగళ్రావు, నేదురుమల్లి జనార్ధన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి కేబినెట్లో.. కమతం రాంరెడ్డి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1978, 1983లో పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఎ.షరీ్ఫ్ చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఐదుసార్లు(1985, 1994, 1999, 2004, 2009) గెలుపొందిన హరీశ్వర్రెడ్డి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కొడుకు కొప్పుల మహేశ్రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వికారాబాద్, తాండూర్లో.. వికారాబాద్లో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఎనిమిది మంది ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రశేఖర్ కొంతకాలం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేయగా, గడ్డం ప్రసాద్ కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. ఇక్కడ నుంచి గెలుపొందిన రామస్వామి కూడా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. తాండూరుకి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో మాణిక్య రావు, మర్రి చెన్నారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పైలెట్ రోహిత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గం.. షాద్నగర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్గా పనిచేశారు. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ పి.శంకర్రావు గతంలో కోట్ల విజయ భాస్కర్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.అలాగే 2009లో కంటోన్మెంట్ నుంచి గెలుపొందికిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి అలాగే చేవెళ్ల నుంచి గెలుపొందిన పటోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి దంపతులిద్దరూ ఉమ్మడి ఏపీలో హోంమంత్రులుగా పనిచేశారు. అయితే దివంగత నేత, మాజీ సీఎం డా.వైఎస్సార్ కేబినేట్లో దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి రికార్డులకెక్కారు. ఇదే జిల్లాకు చెందిన తూళ్ల దేవేందర్గౌడ్ సైతం ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితారెడ్డి విద్యాశాఖ మంత్రిగా, మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 10 స్థానాల్లోని అభ్యర్థులకు ఇప్పటివరకు ఆయా మంత్రివర్గాల్లో అవకాశం లభించింది. అయితే రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలోనూ చోటు లభించకపోవడం గమనార్హం. కల్వకుర్తి నియోజకవర్గం.. కల్వకుర్తి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఈ నియోజకవర్గమే. 1969, 1972లో కాంగ్రెస్ నుంచి, 1978,1983లో జనతా పార్టీ నుంచి జైపాల్రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహబూబ్నగర్ నుంచి రెండుసార్లు, మిర్యాలగూడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రిగా పనిచేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. 1989లో ఇక్కడి నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్టీఆర్ను ఓడించిన చిత్తరంజన్దాస్కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1957–67 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఎంఎన్ లక్ష్మీనర్సయ్య సహా 1978లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సుమిత్రాదేవి, 1999లో టీడీపీ నుంచి గెలుపొందిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ మంచిరెడ్డి కిషన్రెడ్డి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
‘కోడ్’ పేరుతో అత్యుత్సాహం!
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది. బుధవారం రామాయంపేట చెక్పోస్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించడం కోసమే అన్నట్లు ఈ పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు కామారెడ్డిలో లాజిస్టిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన వీళ్లు బుధవారం కారులో తిరిగి వస్తున్నారు. అందులో ఉన్న బ్యాగులో రూ.50 వేలు (రూ.500 నోట్ల కట్ట) ఉంది. రామాయంపేట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారు ఆపారు. బ్యాగ్ తనిఖీ చేసిన ఎస్ఐ నేతృత్వంలోని పోలీసులు అందులో రూ.50 వేలు ఉండటం గమనించారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేల వరకు నగదు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ చెక్పోస్టులోని పోలీసులు యువకులను ఆ నగదుకు లెక్కలు చెప్పమని గద్దించారు. అవి తమ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్తున్నా వినిపించుకోలేదు. రూ.50 వేలు సీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పోలీసులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేచారు. ఆ యువకుల జేబుల్లో, పర్సులు తనిఖీ చేశారు. ఒకరి పర్సులో రూ.200 ఉండటంతో ఆ మొత్తంతో కలిపి తాము రూ.50,200 సీజ్ చేసినట్లు, అవి ఒకరి వద్దే లభించినట్లు పంచనామా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా ఒకరి పేరు రాసి ఆ మొత్తం స్వాదీనం చేసుకున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఒకరి వద్ద ఉంటే సీజ్ చేస్తారా? లేక ఒక వాహనంలో ఉంటే సీజ్ చేస్తారా? దానికి సంబంధించి ఈసీ ఆదేశాలు చూపాలంటూ యువకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వులు చూపాలంటే ముందు పేరు చెప్పాలంటూ తెలుసుకుని పంచనామాపై రాశారు. రామాయంపేట పోలీసుల తీరుపై యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ లెక్కల కోసం ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమనిప్రశ్నిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. కోడ్ పేరుతో పోలీసుల చూపిస్తున్న అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు తెచి్చపెడుతోంది. కోడ్ అమలులోకి వచి్చన నాటి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. హైదరాబాద్లోనే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకు ఉంది. బోయిన్పల్లి పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్న రూ.55,900 నగదుతో మాత్రమే ఎన్నికల లింకులు ప్రాథమికంగా బయటపడ్డాయి. ఈ నగదు తరలిస్తున్న న్యూ బోయిన్పల్లి వాసి ఎం.భాస్కర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో ఆ కోణంలో ‘ఎలక్షన్ డబ్బు’గా అనుమానిస్తూ స్వాదీనం చేసుకున్నారు. ఇది మినహా మరే ఇతర ఉదంతంలోనూ నగదు స్వాధీనంలో రాజకీయ కోణం బయటపడకపోవడం గమనార్హం. -
ఈసారైనా వ్యూహం ఫలించేనా?
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్–బచావో –తహరిక్ (ఎంబీటీ) పార్టీ వ్యూహత్మకంగా అడుగులేస్తోంది. మూడు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీ(ఏఐఎంఐఎం)ను మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డుతోంది. మజ్లిస్ తరహాలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనా ఎన్నికలలో ఆ పారీ్టకి పరాభవం తప్పడం లేదు. ఎప్పటి మాదిరిగా పార్టీ సీనియర్ బాధ్యులను కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు పెద్ద పీట వేసి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనైనా పాగా వేయాలని యోచిస్తోంది. ప్రధానంగా మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబసీలో అక్షరాస్యత, అభివృద్దిపై ఫోకస్ పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంబీటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గంలో మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేందుకు విద్యావంతులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్ రంగాలకు చెందిన యువత ముందుకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వరకు వ్యవస్థను సరిదిద్దలేమని పేర్కొంటోంది. పోటీకి ఆసక్తిగల అభ్యర్థులు పాతబస్తీ చంచల్గూడలోని ఎంబీటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తోంది. పట్టు వదలకుండా.. పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్పురా అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేందుకు వరుసగా ఎన్నికల్లో ప్రయతి్నస్తూ విఫలమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఎఐఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లాఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్–బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేసింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. మరోవైపు ముంతాజ్ అహ్మద్ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రమంగా అమానుల్లాఖా¯న్ పెద్ద కుమారుడు ఖయ్యూంఖాన్, యాకుత్పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్పై ఆశలు వదలుకొని యాకుత్పురాపై దృష్టి సారించినా..అక్కడా పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో విద్యావంతులైన యువతను రంగంలోని దింపాలని మరోమారు ఎంబీటీ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
కూకట్పల్లి బరిలో హరివర్ధన్రెడ్డి..?
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. హరివర్ధన్రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి నుంచి బరిలోకి.. అసమ్మతితో రగులుతున్న హరివర్ధన్రెడ్డికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను జిల్లాలోని కూకట్పల్లి నుంచి బరిలోకి దించాలని రెండవ లిస్ట్లో పేరు చేర్చినట్లు సమాచారం. హరివర్ధన్రెడ్డి నివాసముండే బోయిన్పల్లి ప్రాంతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఆయనకు గతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉండటం, కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనను అక్కడి నుంచి రంగంలోకి దించాలని రేవంత్రెడ్డి దూతలు మల్లు రవి యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెకండ్ లిస్ట్లో ఆయన పేరు ఖరారు చేసి జాబితాలో నమోదైందని హరివర్ధన్రెడ్డి అనుచరులు జాబితాను చూపిస్తున్నారు. హరివర్ధన్రెడ్డి మాత్రం తాను పోటీ చేసేది.. లేనిదీ.. దసరా పండగ తర్వాత ప్రకటిస్తానని చెబుతున్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై వీడని ఉత్కంఠ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మొహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. తమకే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఇదివరకే వారు నియోజకవర్గంలో తమ ప్రచారాలను చేసేసుకుంటున్నారు. ఎవరికివారే తమకే టికెట్ ఖారారు అయిందని, డివిజన్ల నేతలతో మీటింగ్లు, బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి జాబితాలో తన పేరు వస్తుందని ఆశించిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరో రెండు రోజుల్లో తమకే టికెట్ అని నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే గురువారం కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అధిష్టానం అజహరుద్దీన్ సీటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి మరకతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తాయనే ఆందోళన.. ఆలోచనలో పడింది. దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని, సెటిలర్లు సైతం తమకే మొగ్గు అనే సంబరాల్లో ఉన్న అజహరుద్దీన్ టీం ఇప్పుడు ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్కు తెరలేపింది. ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవీన్యాదవ్కు ఢిల్లీకి పిలిపించింది. యువనేతగా బలమైన పోటీనిచ్చే వ్యక్తిగా బలాన్ని తెలుసుకొని పిలిపించారని సమాచారం. అయితే టికెట్ ఇస్తేనే కాంగ్రెస్లో ఉంటానని, లేకుండా ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి తమకు మద్దతు ఇవ్వాలని, ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారట. ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వాలని కోరారట. కాంగ్రెస్ అధిష్టానం విష్ణు వైపు మొగ్గు చూపుతుందా... మైనార్టీల బలంతో అజహరుద్దీన్కే టికెట్ ఇస్తారా.. లేక.. పోటీలో ఉన్న ఇద్దరినీ కాదని.. కొత్త వ్యక్తి ప్రత్యర్థితో బలంగా నిలబడే నవీన్యాదవ్ లాంటి వ్యక్తికి చాన్స్ ఇస్తుందా అనే విషయంలో త్వరలో తేలిపోతుంది. -
అన్నల ఇలాఖాలో.. ఎన్నికల సందడి
కాజీపేట: ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి. తుపాకుల నీడన ఎన్నికలు.. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్కు అండగా నిలిచేవారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ కైలాసం స్వగ్రామం టేకులగూడంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. నక్సల్స్కు షెల్టర్ జోన్లుగా పిలిచే ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడమంటే పోలీసులు, అధికారులకు సాహసమనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద గ్రామ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరింపజేసి ఎన్నికలను నిర్వహించిన సందర్భాలు అనేకం. కొన్ని సమయాల్లో సాయుధ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలీంగ్ కేంద్రాలకు తరలించేవారంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో.. అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాల్లో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించేవి కావు. పోలీసులు ఎన్నికలకు నెలరోజుల ముందుగా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో భారీగా కూంబింగ్ నిర్వహించి ఒకే.. అన్న తర్వాతే ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ పడేది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఎన్నికల ఏజెంట్గా ఉండేందుకు పలాన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేందుకు సాహసించేవారు కాదంటే అతిశయోక్తికాదు. -
‘హస్తం’ నేతల్లో ఉత్కంఠ
హైదరాబాద్: నగర కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. మరో రెండు రోజుల్లో తుది జాబితా విడుదలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యూహాత్మంగా ముందుకు సాగుతోంది. నగరంలోని పాతబస్తీ మినహ అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇక్కడ మరో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటంతో ఆశావహులు ఢిల్లీకి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొందరు ఏకంగా దేశ రాజధానిలో మకాం వేసి అగ్రనేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. గెలుపు గుర్రాలు అధికారమే లక్ష్యంగా అడుగులు వేసున్న కాంగ్రెస్ కోర్ సిటీతో పాటు శివార్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమైంది. అభ్యర్థుల బలాబలాలపై సర్వే చేయిస్తూ అంచనా వేస్తోంది. ఇతర పార్టీల అసమ్మతివాదులను సైతం తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సెగ్మెంట్లలో ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలకు గాలం వేసింది. ముఖ్యంగా ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర సెగ్మెంట్లలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే.. ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయి. -
కూలీ జిందాబాద్!
హైదరాబాద్: వాళ్లు రోజువారీ కూలీలే కానీ రకరకాల రాజకీయ జెండాలు, రంగురంగుల ప్లకార్డులు పట్టుకొని తిరుగుతారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తారు. ఎన్నికల కదనరంగంలో మోహరించిన అభ్యర్థులకు వందిమాగధులు, మందీమార్బలం, కార్యకర్తల బలం లేకపోయినా అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. అభ్యర్థుల ‘బలాన్ని’ చాటుతారు. వాళ్లే రాజకీయ పారీ్టల ప్రచారానికి ర్యాలీలు నిర్వహించే అడ్డా కూలీలు. ఇటీవల వరకు భవన నిర్మాణాలు, రోడ్డు పనులు చేసేందుకు అడ్డాలపై పడిగాపులు కాసిన వలస కూలీలకు అకస్మాత్తుగా డిమాండ్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు గ్రేటర్లో ఏ అడ్డాకు వెళ్లినా కూలీలు కనిపించడం లేదు. అంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కొంతమంది నెలరోజుల పాటు ఏదో ఒక పార్టీ దగ్గర కూలీ మాట్లాడుకొని జై కొడుతుండగా, మరికొందరు మాత్రం ఏ రోజు ఏ పార్టీ ప్రచారానికి పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు.. రాజకీయ పారీ్టలకు ఈ ప్రచార కూలీలను చేరవేసేందుకు మేస్త్రీలు, చిన్నపాటి కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగారు. పారీ్టలతో బేరసారాలు మాట్లాడుకొని కూలీలను సరఫరా చేస్తున్నారు. కేవలం ప్రచారాలు, ర్యాలీలు, ప్రదర్శనలే కాదు. బహిరంగ సభలకు సైతం కూలీలను సరఫరా చేసే టీమ్లు ఇప్పుడు గట్టిగానే పని చేస్తున్నాయి. ఇటు ఉప్పల్ నుంచి అటు టోలీచౌకీ, లంగర్హౌస్ వరకు, కర్మన్ఘాట్ నుంచి మేడ్చల్ వరకు వందలాది అడ్డాల్లో పని కోసం ఎదురు చూసే వేలాది మంది రాజకీయ పార్టీలకు కూలీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు. అందుబాటులో అన్ని సదుపాయాలు.. ప్రచారంలో పరుగులు పెట్టే కూలీలకు రోజువారీ వేతనంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సదుపాయాలు లభిస్తుండటంతో ఏ పార్టీ వెనుక చూసినా గుంపులకొద్దీ కనిపిస్తున్నారు. ప్రతి రోజు రూ.500 చొప్పున వేతనంతో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మందు బాటిల్ కూడా ఇవ్వడంతో కూలీలు పోటీ పడుతున్నారు. ‘రోజంతా రెక్కలు కొట్టుకున్నా కూలీ దొరకడం లేదు. జెండా పట్టుకొని తిరిగితే చాలు డబ్బులతో పాటు, భోజనం కూడా లభిస్తుంది, ఇంకేం కావాలి’అని సికింద్రాబాద్లో ఉండే సుదర్శన్ చెప్పారు. ► సికింద్రాబాద్, సీతాఫల్మండి, వారాసిగూడ, గాంధీ హాస్పిటల్ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది అడ్డా కూలీలు ఇప్పుడు పార్టీల ప్రచారంలోనే ఉన్నట్లు చెప్పారు. మహిళలు కూడా ఈ ఎన్నికల ఉపాధి కోసం పోటీ పడుతున్నారు. ఆయా పారీ్టల నాయకులు కొందరు ముందు నడిస్తే జెండాలు పట్టుకొని, కండువాలు ధరించి వాళ్ల వెనుక నినాదాలు ఇస్తూ నడవటమే అడ్డా కూలీల పని. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ► కొద్ది రోజుల క్రితం వరకు కూడళ్లలో మోహరించి ఉండే కూలీలు ఇప్పుడు రాజకీయ పారీ్టల ఎన్నికల శిబిరాల వద్దకు వచ్చి చేరుతున్నారు. దీంతో ఏ పార్టీ ఎన్నికల కార్యాలయం చూసినా సందడిగానే కనిపిస్తోంది. ‘ఏ పార్టీకైనా కనీసం వంద మంది కూలీలను సప్లయ్ చేయడం కూడా కష్టంగా మారింది. రాజకీయ పారీ్టల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కానీ వాళ్లు ఆశించిన స్థాయిలో అందజేయలేకపోతున్నాం’ అని రామంతాపూర్కు చెందిన ఓ కాంట్రాక్టర్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు కూలీలను పోగు చేసి పంపించాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కువగా ఉత్తరాది వారే.. బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణకు చెందిన వలస కూలీలంతా సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. పైగా ఎన్నికల సీజన్ కావడంతో సొంత ఊళ్లల్లో కూడా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో తెలంగాణకు చెందిన కూలీల కొరత ఏర్పడింది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తదితర ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కూలీలు, కొందరు ఉత్తర భారతానికి చెందినవారిని కూడా ప్రచారానికి తీసుకోవాల్సివస్తోందని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చెప్పారు. ‘వాళ్ల భాషతో మనకు ఇబ్బంది లేదు. మేం ఇచ్చే నినాదాలను వల్లె వేస్తే చాలు.‘జిందాబాద్’ అన్నా సరే. కావాల్సిందల్లా పెద్ద ఎత్తున గుంపు కనిపించడమే కదా’ అన్నారు. ఏమైతేనేం పార్టీల ప్రచారం అడ్డా కూలీలకు ‘పండగే’ కదా. -
బీఆర్ఎస్కు గుడ్బై!
హైదరాబాద్: బీ ఫామ్లు అందించిన మరుసటి రోజు శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. మాదాపూర్ కార్పొరేటర్ జంగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి, హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్లు బీఆర్ఎస్ వీడనున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఖండించని జగదీశ్వర్ గౌడ్..ఎట్టకేలకు కాంగ్రెస్లో చేరుతున్నట్లు పార్టీ కేడర్కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రావాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్లో చేరుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్లారనే ఆసక్తి నెలకొంది. జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి మొదటిసారి కార్పొరేటర్గా గెలిచారు. 2016లో మాదాపూర్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ నుంచి రెండోసారి గెలిపొందారు. 2020లో డివిజన్ల పునర్విభజన జరగడంతో మాదాపూర్నుంచి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ నుంచి ఆయన సతీమణి పూజిత గెలుపొందారు. ఈ రెండు డివిజన్లలో ఆయనకు మంచి పట్టు ఉంది. వీరు పార్టీ వీడితే మాదాపూర్, హఫీజ్పేట్ డివిజన్లలో బీఆర్ఎస్కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా జగదీశ్వర్గౌడ్ పార్టీ అధిష్టానానికి అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ మారుతున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా డివిజన్లలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా నాయకులెవరు బీఆర్ఎస్ను వీడవద్దని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమావేశాలు నిర్వహించారు. -
సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా: కేఏ పాల్
హైదరాబాద్: తనకు అవకాశమిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. ఇక్కడి నుంచే ప్రజాశాంతి తరుపున పోటీ చేస్తానని, ప్రజలు తనను ఆదిరించాలని కోరారు. సోమవారం అడ్డగుట్ట డివిజన్లోని తుకారాంగేట్ మరాఠా బస్తీలో ఆయన పర్యటించి స్థానికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క అంశం కూడా నెరవేర్చే విధంగా లేవన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ తరపున బరిలో ఉండాలని కోరుకునే వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా చెప్పారు. -
బీసీలకు పెద్దపీట!
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన 55 మందితో కూడిన మొదటి జాబితాలో నగరంలో 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీ సీట్ల రగడ హాట్టాపిక్గా మారిన నేపథ్యంలో తొలి జాబితాలో మహానగర పరిధిలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట లభించింది. మొత్తం మీద తొమ్మిది మంది బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు, ఐదుగురు ఓసీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఉప కులాల వారీగా పరిశీలిస్తే.. ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి, వెలమ, బ్రాహ్మణ ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరికి అవకాశం లభించింది. అదేవిధంగా బీసీ కేటగిరీలో యాదవ, ముస్లిం సామాజిక వర్గాలకు రెండు స్థానాల్లో, ముదిరాజ్, మున్నూరుకాపు, వాల్మీకి, మేరు, వంజర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్కో స్థానాల్లో అవకాశం కల్పించారు. దసరా తర్వాత ప్రకటించే రెండో జాబితాలో మిగిలిన పది స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖరారైన అభ్యర్థులు వీరే.. అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసేందుకు కాంగ్రెస్ తొలి జాబితాలో మహ్మద్ ఫిరోజ్ఖాన్ (నాంపల్లి), అంజన్కుమార్ యాదవ్ (ముషీరాబాద్), డాక్టర్ కోట నీలిమ (సనత్నగర్), మొగిలి సునీత (గోషామహల్), తోటకూర వజ్రేష్ యాదవ్ (మేడ్చల్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), ఎం. పరమేశ్వర్ రెడ్డి (ఉప్పల్), కొలన్ హన్మంత్ రెడ్డి (కుత్బుల్లాపూర్), ఆదం సంతోష్ కుమార్ (సికింద్రాబాద్), షేక్ అక్బర్ (మలక్పేట), ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ (కార్వాన్ ), బోయ నగేష్ (చాంద్రాయణగుట్ట), కె.రవిరాజు (యాకుత్పురా), పులిపాటి రాజేష్ కుమార్ (బహదూర్పురా) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. -
సగానికిపైగా కొత్త ముఖాలే..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్ధానాలకు ప్రకటించిన తొలి జాబితాలో సగానికి పైగా కొత్తవారికే అవకాశం లభించింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గాను పద్నాలుగింటికి అభ్యర్థులు ఖరారయ్యారు. అందులో 8 స్థానాల నుంచి కొత్త ముఖాలు ఎన్నికల బరిలో దిగుతున్నారు. కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే పాత వారికి అవకాశం ఇచ్చింది. బరిలో తొలిసారిగా .. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోని సుమారు 8 మంది అభ్యర్థులు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. సనత్నగర్ నుంచి డాక్టర్ నీలిమ, గోషామహల్ నుంచి మొగిలి సునీత, ఉప్ప ల్ నుంచి ఎం.పరమేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్ కుమార్, చాంద్రాయణగుట్ట నుంచి బోయ నగేష్ (నరేష్), యాకుత్పురా నుంచి కె.రవి రాజు, బహదూర్పురా రాజేష్ కుమార్, మలక్పేట నుంచి షేక్ అక్బర్లు తొలిసారిగా పోటీ చేస్తున్నారు. పాతకాపులు ఇలా.. ముషీరాబాద్ అసెంబ్లీ స్ధానం నుంచి బరిలో దిగుతున్న అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు పరాజయం పాలయ్యారు. నాంపల్లి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిత్వం ఖారారైన ఫిరోజ్ ఖాన్ వరసగా పీఆర్పీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు గత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగాఎన్నికయ్యారు. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో మల్కాజిగిరి సీటు ఖరారైంది. మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ అభ్యర్ధి కొలన్ హనుమంతరెడ్డి, కార్వాన్ అభ్యర్థి ఒసామా బిన్ మహ్మద్ అలీ హిజ్రీలు గతంలో వివిధ పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పక్షాన బరిలో దిగనున్నారు. -
బీజేపీ టికెట్ దక్కేదెవరికి..?
నర్సాపూర్: నర్సాపూర్ బీజేపీ టికెట్ కోసం పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లిగోపి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఓబీసీ నాయకుడు రమేష్గౌడ్, పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, పార్టీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ మల్లేష్గౌడ్, ఆయా మండల శాఖల పార్టీ అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి ఉన్నారు. అయితే ముఖ్య నాయకుల సూచనల మేరకు మండల శాఖల అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి రేస్ నుంచి తప్పుకున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి విజయం కోసం కృషి చేస్తామని ఒప్పుకున్నట్టు సమాచారం. మిగిలిన వారిలో మల్లేష్గౌడ్, పెద్దరమేష్గౌడ్, చిన్న రమేష్గౌడ్ పేర్లను పార్టీ రాష్ట్ర కమిటీ తొలగించి, మురళీయాదవ్, గోపి, రఘువీరారెడ్డిల పేర్లను కేందర పార్టీకి పంపినట్లు తెలిసింది. ఎవరికి వారు ప్రయత్నాలు రాష్ట్ర కమిటీ స్క్రూటినీ అనంతరం గోపి, మురళీయాదవ్, రఘువీరారెడ్డి ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కొందరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తాము పార్టీకి చేసిన సేవలను, గతంలో తాము నిర్వహించిన పదవుల గురించి వివరిస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి మరి. -
దశాబ్దాలుగా ఆ పార్టీదే హవా
హైదరాబాద్: నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన నగరం హైదరాబాద్. ఇక్కడ హిందూ, ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ పాతనగరం, కొత్త నగరం రాజకీయ పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాలు ఇక్కడ నడవవు. బలమైన ముస్లిం, హిందుత్వ సామాజిక ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్’గా అందరి నోళ్లలో నానే ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్ సైడ్గా ఉంటోంది. దశాబ్దాలుగా ఇక్కడ పట్టు కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతూనే ఉన్నాయి. మజ్లిస్కు కంచుకోటలే.. పాతబస్తీలోని గోషామహల్ మినహా మిగిలిన చార్మినార్, యాకుత్పురా, బహదూర్పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్పేట అసెంబ్లీ నియోజవర్గాలు మజ్లిస్కు కంచు కోటలే. ఇక్కడ దశాబ్దాలుగా మజ్లిస్ తిరుగులేని శక్తిగా రాజకీయాలను శాసిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. మజ్లిస్ నుంచి చీలి సొంత కుంపటి పెట్టుకున్న ఎంబీటీ కూడా ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయినప్పటికీ ప్రతీ ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుడం సర్వసాధారణమైంది. వాస్తవంగా ఈ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికల వేళ స్నేహపూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్కు కలిసివస్తోంది. పదేళ్ల ముందు కాంగ్రెస్తో, ఆ తర్వాత బీఆర్ఎస్తో మజ్లిస్ దోస్తీ కొనసాగిస్తోంది. కార్వాన్లో కౌసర్ మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. మరోసారి కౌసర్ బరిలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్కు గట్టి ఓటు బ్యాంకు ఉన్నా.. హిందుత్వ ఎజెండా కూడా బలంగానే ఉంది.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల మధ్య చీలిపోవడం మజ్లిస్కు కలిసివస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కృష్ణయ్య అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బలమైన బలాల.. మలక్పేట నియోజకవర్గంలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మజ్లిస్ మరోసారి పచ్చ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల తిరిగి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి రంగలోకి దిగితే తప్ప మజ్లిస్ను ఢీ కొట్టడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. బీఆర్ఎస్ తీగల అజితా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. కాంగ్రెస్, బీజీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. డబుల్ ధమాకా కోసం చాంద్రాయణగుట్ట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ డబుల్ హ్యాట్రిక్ లాంఛనమే. ఈ నియోజకవర్గం ఆది నుంచి మజ్లిస్కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించదు. ఎంబీటీ సైతం గతంలో తలపడి ఆశలు వదులుకుంది. రికార్డు స్థాయి మెజార్టీతో వన్సైడ్ ఫలితం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ఇప్పటికే బీఆర్ఎస్ సీతారాం రెడ్డి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి రంగలోకి దింపగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాలేదు. ‘చార్మినార్’ ఆవిర్భావం నుంచీ ఆధిపత్యం.. చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్కు అనుకూలం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి మజ్లిస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం సీనియర్ శాసన సభ్యుడు ముంతాజ్ అహ్మద్ఖాన్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు పర్యాయాలు యాకుత్పురా నుంచి గత పర్యాయం చారి్మనార్ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన పోటీకి దూరంగా ఉంటే ఆయన స్థానంలో మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ను బరిలో దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇబ్రాహీం లోడి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాము లబ్ధి పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. బహదూర్పురాలో దశాబ్దాలుగా.. బహదూర్పురా నియోజకవర్గంలో దశాబ్దాలుగా మజ్లిస్ ప్రాతినిధ్యమే. ఇక్కడ మౌజం ఖాన్ సీనియర్ ఎమ్మెల్యే. వయసు రీత్యా మరోసారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కొత్త అభ్యర్ధి బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ప్రతీసారి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ దిగినా.. ప్రభావం నామమాత్రమే. ఆయా రాజకీయ పక్షాలు సైతం ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపినా.. పోటీ మాత్రం మజ్లిస్కు దరిదాపుల్లో కనిపించదు. భారీ మెజార్టీతో వార్వైన్సైడ్గా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అలీ బక్రీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా పార్టీల నుంచి టికెట కోసం పోటీ తీవ్రంగానే ఉంది. అంతా అనుకూలమే యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం మజ్లిస్కు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో మజ్లిస్ను ఢీకొట్టేందకు ఎంబీటీ శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. కానీ, మజ్లిస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. గత ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెలే అహ్మద్ పాషా ఖాద్రీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈసారి తిరిగి పోటీ చేయడం అనుమానమే. మరో అభ్యర్థి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ సామ సుందర్ రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. నాంపల్లిలో నువ్వా.. నేనా..? నాంపల్లి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొని మజ్లిస్ బయటపడుతూ వస్తోంది. జాఫర్ హుస్సే మేరాజ్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి అభ్యర్థి మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పోటీలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్ చేతిలో మూడు పర్యాయాలు ఓటమి చవి చూసిన ఫిరోజ్ ఖాన్ ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. అధికార బీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం తమ అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. -
హస్తం పార్టీలో ‘పొన్నాల’ ప్రస్థానం ముగిసినట్టేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్రెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తుందని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది. 12 ఏళ్లపాటు మంత్రిగా.. నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనా ర్దన్రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు. ఏడు సార్లు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు. 1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్ఎస్ (బీఆర్ఎస్))పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మొత్తబడి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. టికెట్ రావడం లేదనే సంకేతం... తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, టీపీసీసీ చీఫ్గా ఉమ్మడి వరంగల్లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాప్రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలున్నట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మయ్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చని అంటున్నారు.