Vehicle sales
-
వాహన జోరుకు యూవీల తోడు
తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.‘2024 జనవరితో పోలిస్తే హోల్సేల్గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్సేల్ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది. ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికిటీవీఎస్ సప్లై చైన్లో మరింత వాటాద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్ సప్లై చైన్లో టీవీఎస్ మోటార్ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది. -
వాహన రిటైల్ అమ్మకాలు 7% పెరిగాయ్
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు జనవరిలో 7% పెరిగాయని డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ఈ ఏడాది తొలి (జనవరి) నెలలో మొత్తం 22,91,621 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో డిమాండ్ ఊపందుకోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగా గతేడాది(2024) జవనరిలో ఈ సంఖ్య 21,49,117 యూనిట్లకు పరిమితమయ్యాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, మెరుగైన ఫైనాన్సింగ్ తదితర కారణాలు కలిసొచ్చాయని డీలర్లు చెప్పుకొచ్చారు. ఈ ఫిబ్రవరిలో అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతుందని 46%, నెమ్మదిస్తుందని 43%, మిగిలిన ఒకశాతం అమ్మకాల్లో క్షీణత ఉండొచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘స్థిరమైన మార్కెట్ రికవరీ కారణంగా టూ వీలర్లు, త్రి చక్ర, ప్యాసింజర్, వాణిజ్య వాహనాలతో పాటు ట్రాక్టర్ల విక్రయాలు పెరిగాయి. మరోవైపు వడ్డీ రేట్ల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్య సవాళ్లు, మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు ఇంకా పరిశ్రమను వెంటాడుతున్నాయి’’ అని ఫాడా చైర్మన్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్: సియామ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన (హోల్సేల్) వాహనాల సంఖ్య 2024లో 11.6 శాతం పెరిగి 2,54,98,763 యూనిట్లకు చేరుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని సియామ్ తెలిపింది.2023లో హోల్సేల్గా అమ్ముడైన మొత్తం వాహనాల సంఖ్య 2,28,39,130 యూనిట్లు. ‘2024 ఆటో పరిశ్రమకు సహేతుకంగా మంచిదే. వినియోగదారుల సానుకూల సెంటిమెంట్, దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం అన్ని వాహన విభాగాలలో వృద్ధిని అందించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వ స్థిర విధాన పర్యావరణ వ్యవస్థ కొన్నేళ్లుగా కొనసాగడం 2024లో పరిశ్రమకు కలిసి వచ్చింది.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ద్వారా సానుకూల సెంటిమెంట్తో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఊపు 2025లో వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.విభాగాలవారీగా ఇలా.. ద్విచక్ర వాహన విభాగం హోల్సేల్లో గత ఏడాది 14.5 శాతం దూసుకెళ్లి 1,95,43,093 యూనిట్లు నమోదైంది. స్కూటర్స్ విక్రయాలు 20 శాతం అధికమై 66,75,231 యూనిట్లు, మోటార్సైకిల్స్ 12 శాతం ఎగసి 1,23,52,712 యూనిట్లకు చేరుకున్నాయి.ప్యాసింజర్ వెహికిల్స్ 4 శాతం ఎగసి 43 లక్షల యూనిట్లు, త్రీవీలర్స్ 7 శాతం పెరిగి 7.3 లక్షల యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్ ఒక ఏడాదిలో ఈ స్థాయిలో హోల్సేల్ అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య వాహనాల విక్రయాలు 3 శాతం క్షీణించి 9.5 లక్షల యూనిట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్సేల్గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పండుగలో 42,88,248 వాహనాలు కొనేశారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్ఏడీఏ కోరింది. -
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుల్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్మెంట్లను కలిగి ఉంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది. -
ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్!
ప్యాసింజర్ వాహనాల విక్రయాల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5–7 శాతం వృద్ధి చెందుతుంని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడవ ఏడాది పరిశ్రమ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా కార్ల విక్రయాలు, వీటి ఎగుమతులకు డిమాండ్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం గరిష్ట వృద్ధిని అంచనా వేసిన నేపథ్యంలో.. 2024–25 అమ్మకాల్లో 5–7 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు క్రిసిల్ తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్యూవీలకు డిమాండ్.. వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయ మార్పు ఎస్యూవీలకు డిమాండ్ను పెంచింది. మహమ్మారి కంటే ముందునాటి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్యూవీల వాటా 28 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రెండింతలై 60 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వేరియంట్లతో సహా వివిధ ధరల శ్రేణిలో కొత్త మోడళ్ల రాక, భవిష్యత్ మోడళ్లు, సెమీకండక్టర్ల సాధారణ లభ్యత కారణంగా ఎస్యూవీలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2024–25లో ఎస్యూవీల విక్రయాల్లో 12 శాతం వృద్ధి ఉండొచ్చు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల విభాగాల్లో పోటీ ధరలో ఫీచర్లతో కూడిన మోడళ్ల రాక ఈ జోరుకు ఆజ్యం పోస్తుంది. కార్ల ధరల్లో పెరుగుదల.. విడిభాగాలు, తయారీ వ్యయం పెరుగుతూ వస్తోంది. భద్రత, ఉద్గారాలపై మరింత కఠిన నిబంధనలను తయారీ సంస్థలు పాటించాల్సి రావడంతో వాహనాల ధర గత 3–4 సంవత్సరాలలో అధికం అయింది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల వాటా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. గత రెండేళ్లలో కీలక ఎగుమతి మార్కెట్లు లాటిన్ అమెరి కా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో ద్రవ్యోల్బణం ఎదు రుగాలులు, పరిమిత విదేశీ మారకపు లభ్యత దీనికి ప్రధాన కారణం. 2024–25లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే స్థిర కమోడిటీ ధరలు, గత ఆర్థిక సంవత్సరంలో అమలైన ధరల పెంపు పూర్తి ప్రయోజనంతోపాటు ఎస్యూవీల వాటా పెరగడంతో తయారీదారుల నిర్వహణ లాభాలు సు మారు 2 శాతం ఎగసి ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి చేరుతుంది. ఎస్యూవీలకు డిమాండ్తో 2024–25లో ఇది 11.5–12.5 శాతంగా ఉండొచ్చు. రూ.44,000 కోట్ల పెట్టుబడి.. ఈ ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం దాదాపు 85 శాతానికి చేరుకోవచ్చు. ఎస్యూవీల కు బలమైన డిమాండ్ కొనసాగుతున్నందున ప్యా సింజర్ వాహన తయారీ సంస్థలు 2023–25 మధ్య సుమారు రూ.44,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పో లిస్తే ఇది దాదాపు రెండింతలు. అయితే ఆరోగ్యక రంగా నగదు చేరడం, మిగులు కారణంగా రుణా లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తయారీదారుల క్రెడిట్ ప్రొఫైల్లను క్రిసిల్ స్థిరంగా ఉంచుతోంది. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో ఆల్టైం రికార్డ్!
ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో కలిపి 2023 మే నెలలో 20,19,414 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, ట్రాక్టర్లకు విపరీత డిమాండ్ ఉండడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 9 శాతం పెరిగి 14,93,234 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7 శాతం అధికమై 77,135 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 79 శాతం ఎగసి 79,433 యూనిట్లు, ట్రాక్టర్లు 10 శాతం దూసుకెళ్లి 70,739 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. -
ఎస్యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్యూవీలకు బలమైన డిమాండ్తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
జోరు తగ్గిన వెహికల్ సేల్స్ - కారణం ఇదే అంటున్న ఫాడా..!
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు ఏప్రిల్లో నాలుగు శాతం తగ్గినట్లు భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్లో మొత్తం 17,24,935 వాహనాలు విక్రయంగా.., గతేడాదిలో ఇదే నెలలో 17,97,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన, ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్లో నీరసించాయి. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 7%, ప్యాసింజర్ వాహనాలు ఒకశాతం పడిపోయినట్లు ఫాడా తెలిపింది. ‘‘ఉద్గార ప్రమాణ నిబంధనలతో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగనన్న వాహనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు మార్చిలోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టారు. అలాగే అధిక బేస్ ఎఫెక్ట్ ఒక కారణంగా నిలిచింది. వెరసి గడిచిన ఎనిమిది నెలల్లో తొలిసారి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి క్షీణత నమోదైంది’’ ఫాడా తెలిపింది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్షిప్ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీ పెరిగాయి. మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే త్రీ–వీలర్స్, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. త్రీ–వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్ విక్రయాలు ఒక శాతం, వాణిజ్య వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ‘‘ గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించింది. ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉంది. ఈ విభాగంపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుంది’’ అని సింఘానియా అన్నారు. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్సేల్లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
2023 ఫిబ్రవరి అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: ఏకంగా..
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గత నెలలో కంపెనీ 79,705 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి మునుపటి కంటే 2.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరి నెలలో 77,733 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత నెల దేశీయ విక్రయాల మొత్తం 78,006 యూనిట్లు కాగా ఇదే నెల గత సమత్సరంలో 73,875 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 6 శాతం పెరిగింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు, ప్యాసింజర్ వాహన విక్రయాలలో కూడా మంచి పురోగతిని సాధించింది. భారతదేశంలో గత నెల మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు (ఎలక్ట్రిక్ వాహాలతో కలిపి) 42,862 యూనిట్లు. 2022 ఇదే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మొత్తం 39,981 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా గతేడాదికంటే 7 శాతం పెరిగాయి. మొత్తం మీద 2023 ప్రారంభం నుంచి టాటా మోటార్స్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
బజాజ్ ఆటో లాభం 16% డౌన్
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది. శుక్రవారం బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు 1% క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి. -
రయ్మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్సేల్ అమ్మకాలు ఆగస్ట్లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్సైకిల్స్ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్తో వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. పరిశ్రమకు సీఎన్జీ ధర సవాల్గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
వాణిజ్య వాహన విక్రయాలు : 4.35 లక్షలు
ముంబై: దేశీయంగా వాణిజ్య వాహనాల (సీవీ) పరిశ్రమ రికవరీ బాట పట్టిందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ (వీఈసీవీ) ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. బస్సుల సెగ్మెంట్ కోలుకోవడం, రిప్లేస్మెంట్కు డిమాండ్ పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 4.35 లక్షల స్థాయి దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018–19లో రికార్డు స్థాయిలో 5.77 లక్షల పైచిలుకు అమ్ముడైన సీవీలు వివిధ కారణల రీత్యా 2020–21లో 2.34 లక్షలకు పడిపోయాయి. 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 3.34 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల అమ్మకాలు 47 శాతం పెరిగి 3.43 లక్షలకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, గత నాలుగు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణమాలను బట్టి చూస్తే సీవీల అమ్మకాలు తిరిగి 2019–20 నాటి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. వచ్చే మూడేళ్లు పరిశ్రమకు మెరుగ్గా ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశాయి. చదవండి👉 ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త! -
రవాణా ఆదాయం రయ్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. కార్ల జోరు.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 57.87 శాతం, గూడ్స్ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో ప్యాసింజర్ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
రయ్మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు జూన్లో 19 శాతం దూసుకెళ్లి 2,75,788 యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగుపడడం ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ద్విచక్ర వాహనాల హోల్సేల్ అమ్మకాలు 10.6 లక్షల నుంచి 13.08 లక్షల యూనిట్లకు చేరింది. త్రిచక్ర వాహనాలు సుమారు మూడురెట్లు ఎగసి 26,701 యూనిట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 13.01 లక్షల నుంచి 16.11 లక్షల యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్–జూన్లో ప్యాసింజర్ వాహనాలు 41 శాతం పెరిగి 9.1 లక్షల యూనిట్లకు ఎగసింది. వాణిజ్య వాహనాలు 1.05 లక్షల నుంచి 2.24 లక్షల యూనిట్లకు చేరింది. ద్విచక్ర వాహనాలు 24.13 లక్షల నుంచి 37.24 లక్షల యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 24,522 నుంచి 76,293 యూనిట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో కలిపి జూన్ త్రైమాసికంలో 31.9 లక్షల నుంచి 49.3 లక్షల యూనిట్లకు పెరిగాయి. రెండింతలైన పోర్ష్ అమ్మకాలు లగ్జరీ కార్ల తయారీలో ఉన్న పోర్ష్ ఈ ఏడాది జనవరి–జూన్లో భారత్లో 378 యూనిట్లు విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా వృద్ధి. ఖరీదైన స్పోర్ట్స్ కార్ల డిమాండ్తో పరిశ్రమ కోలుకుంటోందని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2021లో భారత్లో 474 పోర్ష్ కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. -
వాహన విక్రయాల జోష్
ముంబై: సెమీకండక్టర్ల కొరత ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశీయ వాహన విక్రయాలు జూన్లో వృద్ధి బాటపట్టాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకీతో సహా హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు సమీక్షించిన నెలలో సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయా ల్లో వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఊపందుకోవడంతో బజాజ్ ఆటో మినహా మిగిలిన అన్ని ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. -
వాహన విక్రయాల్లో వృద్ధి
ముంబై: గత ఆర్థిక ఏడాది చివరి నెల మార్చి వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ‘‘2021–22లో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో ఇది కొంత ప్రభావం చూపవచ్చు’’ అని మారుతీ తెలిపింది. ► మారుతీ సుజుకీ మార్చి మొత్తం అమ్మకాలు 1,43,899 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో విక్రయించిన మొత్తం 1,55,417 విక్రయాలతో పోలిస్తే స్వల్పంగా ఆరుశాతం(6.3)గా ఉంది. 2021–22లో ఎగుమతులు 2,38,376 యూనిట్లు నమో దయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి ఎగుమతులు రికార్డు కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. ► కియా మోటర్స్ మార్చి విక్రయాలు 18% పెరిగాయి. ఈ మార్చిలో మొత్తం 22,622 యూనిట్లకు అమ్మింది. ఒక నెలలో ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. సెమికండెక్టర్ల కొరత కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,86,787 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ మార్చిలో 86,718 కార్లను అమ్మగా.. గతేడాది ఇదేనెలలో 42,293 యూనిట్లను అమ్మింది. హీరో మోటో మార్చి అమ్మకాలు 14% క్షీణించాయి. గతే డాది మార్చిలో 5.24 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ మార్చిలో 4.50 లక్షల యూనిట్లు అమ్మింది. -
పుంజుకున్న వాహన విక్రయాలు
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
AP: చివరి రోజు అమ్మకాల మోత!
సాక్షి, అమరావతి: గత ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగాయి. సాధారణంగా రోజుకు 3,000 నుంచి 3,500 వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. కానీ, ఆ ఒక్క రోజు మాత్రం మొత్తం 13,034 వాహనాలు అమ్ముడయ్యాయి. కొత్త ఏడాది జనవరి 1 నుంచి రవాణేతర వాహనాలపై జీవిత పన్ను పెరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కువమంది ఆ రోజు వాహనాలు కొనుగోలు చేశారని, దీంతో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలోని 738 వాహన డీలర్ల నుంచి ఏకంగా 13,034 వాహన విక్రయాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు 10,529.. 1,742 కార్లు అమ్ముడయ్యాయి. అలాగే, ఆ ఒక్కరోజే త్రైమాసిక పన్ను, జీవిత పన్ను రూపంలో రవాణా శాఖకు రూ.32.53 కోట్ల ఆదాయం వచ్చింది. జీవిత పన్ను పెంపు ఇక జనవరి 1 నుంచి ఐదు లక్షల రూపాయల్లోపు రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. అలాగే, రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల్లోపు ఉన్న రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 14 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు వాహనాలపై 17 శాతం, రూ.20 లక్షలు పైనున్న రవాణేతర వాహనాలపై 18 శాతం మేర జీవిత పన్ను అమల్లోకి వచ్చింది. ఈ కారణంతోనే మొన్న డిసెంబర్ 31న భారీఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు కొనుగోలు చేశారని రవాణా శాఖాధికారులు తెలిపారు. -
వాహన విక్రయాలకు చిప్ సెగ
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి. 7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు.. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. -
ఈ ఏడాది వాహనాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన డీలర్ల వద్ద అమ్మకాల్లో 10–15 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. పండుగల సీజన్, కొత్త మోడళ్లు ఇందుకు కారణమని వివరించింది. అలాగే కొన్నాళ్లుగా వాయిదా వేస్తున్న కస్టమర్లు ఇప్పుడు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారని తెలిపింది. ద్విచక్ర, ప్రయాణికులు, వాణిజ్య వాహనాల విక్రయంలో ఉన్న 123 మంది డీలర్లు సర్వేలో పాలుపంచుకున్నారు. డీలర్ సెంటిమెంట్, అంచనాలను అంచనా వేయడం, గత సంవత్సరం నిర్వహించిన పోల్ ఫలితాలతో పోల్చడం లక్ష్యంగా ఈ సర్వే సాగింది. ‘కోవిడ్ –19 థర్డ్ వేవ్, ఇంధన ధరల పెరుగుదల, పరికరాల తయారీదారుల నుంచి సరఫరా పరిమితులతో ఈ రంగం మందగించే అవకాశం ఉంది. ఆటోమొబైల్ డీలర్ల పనితీరు ప్రాంతాన్నిబట్టి మారుతుంది. ఉత్తర భారతదేశంలో డీలర్షిప్లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 2020–21లో పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుదలను చూసింది. కానీ అది నిలబెట్టుకోలేదు. ద్విచక్ర వాహన డీలర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెగ్మెంట్లలో అమ్మకాలు ఇంకా మహమ్మారికి ముందు స్థాయికి చేరుకోలేదు’ అని క్రిసిల్ వివరించింది. రాబోయే పండగ సీజన్లో.. వినియోగదార్లు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. డీలర్లలో సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ రాబోయే పండగ సీజన్లో మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తోందని క్రిసిల్ డైరెక్టర్ భూషణ్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ‘గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రాంతీయ పనితీరు వైవిధ్యాన్ని చూపుతుందని సర్వే వెల్లడించింది. ప్రయాణికులు, వాణిజ్య వాహన డీలర్లు అన్ని ప్రాంతాలలో అమ్మకాలు మెరుగుపడతాయని ఆశిస్తుండగా.. ఉత్తరాదిలో 44 శాతం ప్రయాణికుల వాహన డీలర్లు, దక్షిణాదిలో 40 శాతం వాణిజ్య వాహన డీలర్లు క్షీణత ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో సర్వే చేసిన వాణిజ్య వాహన డీలర్లలో ఉత్తరాదిలో 45 శాతం, పశ్చిమ ప్రాంతంలో 67 శాతం మంది విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ద్విచక్ర వాహన డీలర్లు ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకాలపై ఆశాజనకంగా ఉన్నారు. 2020–21లో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో సర్వే చేసిన దాదాపు 60 శాతం ద్విచక్ర వాహన డీలర్లలో 20 శాతం పైగా అమ్మకాలు క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన సిబ్బంది హేతుబద్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు డీలర్ల ఆర్థికాలపై ప్రభావాన్ని తగ్గించాయి. 2021–22లో డీలర్షిప్లను తీసివేయడంగానీ, సిబ్బంది కొరత వంటివి ఉండకపోవచ్చని అత్యధిక మంది డీలర్లు అభిప్రాయపడ్డారు’ అని వివరించారు. -
టాప్గేర్లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
దూసుకెళ్తున్న వాహన విక్రయాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వాహన విక్రయాలు దూసుకెళ్తున్నాయి. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాహన విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 1.60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇదే గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో చూస్తే 1.09 లక్షల ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. అంటే 47.09 శాతం వృద్ధి నమోదైంది. కార్ల కొనుగోళ్లలో గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో 303.20 శాతం వృద్ధి నమోదైంది. అలాగే గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, ఆటోల కొనుగోళ్లు కూడా గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీ వృద్ది నమోదైంది. ఈ ఏడాది మెరుగు గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ లాక్డౌన్తో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయింది. అయితే, ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రవాణా రంగం ఆదాయంలో 77.50 శాతం వృద్ధి నమోదైందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తొలిపారు. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా కేవలం రూ.367.13 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.651.68 కోట్లు ఆదాయం వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పడితే మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయన్నారు. -
మారుతీ గ్రామీణ విక్రయాలు @ 50 లక్షలు
ముంబై: భారతీయ గ్రామీణ మార్కెట్లో 50 లక్షల వాహన అమ్మకాల మైలురాయిని అధిగమించామని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 17,00కు పైగా అవుట్లెట్లను కలిగి ఉన్నామని, దాదాపు 40% వాహనాలు ఈ ప్రాంతంలోనే అమ్ముడవుతాయని కంపెనీ పేర్కొంది. కస్టమర్లు, స్థానిక డీలర్ల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైనట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కంపెనీ వ్యాపారంలో గ్రామీణ మార్కెట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ప్రాంత అవసరాలకు సరిపోయే నాణ్యమైన ఉత్పత్తులను, మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. ‘‘వాహన ఎంపికలో ఇక్కడి కస్టమర్ల ఆకాంక్షలు మెట్రో నగరవాసులకు అభిరుచులకు దగ్గరగా ఉంటాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న 12,500 మంది రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డీలర్ల సలహా, సూచనలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అనువైన మోడళ్లను రూపొందిస్తున్నాం. వాహనాల పట్ల వీరు అధిక సంరక్షణ, శ్రద్ధను కోరుకుంటారు’’ అని శ్రీవాస్తవ వివరించారు. ఈ జూన్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ మొత్తం 3,53,614 యూనిట్లను విక్రయించింది. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు!
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన వాహన రంగం జూన్ మాసంలో కోలుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ఈ నెలలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, హోండా వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జూన్లో మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది. మే నెలలో కేవలం 46,555 యూనిట్లతో పోలిస్తే 217% పెరిగింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 54,474 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు మే నెలలో 30,703 వాహనాలను అమ్మింది. మే నెలలో 15,181 యూనిట్లు అమ్మిన టాటా మోటర్స్.., జూన్లో 59% వృద్ధిని సాధించి 24,110 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 32,964 వాహనాలను అమ్మగా, ప్యాసింజర్ వాహనాలు 16,913 యూనిట్లతో రెట్టింపు వృద్ధి నమోదు చేసింది. కియా మోటార్ ఇండియా 36% వృద్ధిని సాధించి మొత్తం 15,015 యూనిట్లను అమ్మింది. మేలో మొత్తం విక్రయాలు 11,050 యూనిట్లుగా ఉన్నాయి. లాక్డౌన్ సడలింపు కారణంగా యుటిలిటీ వాహన విభాగంలో బలమైన వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడం, సెమికండెక్టర్ల కొరతతో ప్యాసింజర్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే డిమాండ్ దృష్ట్యా మెరుగైన రికవరీ కనిపిస్తుంది’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం ప్రెసిడెంట్ శైలేజ్ చంద్ర తెలిపారు. -
ఏపీ: వాహన విక్రయాల్లో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య, వ్యవసాయ వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున వాహనాల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య అవసరాల నిమిత్తం ఈ ఏడాది మార్చిలో 1,366 ట్రాక్టర్లు, ప్రైవేట్ వినియోగానికి మరో 1,891 ట్రాక్టర్లను ప్రజలు కొనుగోలు చేశారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం ఈ ఏడాది మార్చిలో 430 ట్రిల్లర్లు, వాణిజ్య అవసరాల కోసం మరో 960 ట్రిల్లర్లను కొన్నారు. ఆటోల విక్రయాలు అయితే ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో కేవలం 158 ఆటోల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 1,842 ఆటోలను విక్రయించారు. అలాగే మోటారు సైకిళ్లు, కార్ల అమ్మకాలు కూడా గతేడాది మార్చితో పోల్చితే.. ఈ ఏడాది మార్చిలో పెరిగాయి. మొత్తం మీద గతేడాది మార్చిలో 32,814 వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 84,509 వాహనాలను విక్రయించారు. చదవండి: విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం' -
మార్చిలో తగ్గిన వాహన విక్రయాల స్పీడు
ముంబై: వాహన విక్రయాలు మార్చిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్యాసింజర్, ట్రాక్టర్ల అమ్మకాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో క్షీణత నమోదైంది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ ఆసోసియేషన్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు వ్యక్తిగత రవాణాకు ప్రాధ్యానతనివ్వడంతో ప్యాసింజర్ వాహన విక్రయాలు మార్చి నెలలో దూసుకెళ్లాయి. ఈ మార్చిలో 28 శాతం వృద్ధిని సాధించి మొత్తం 2,79,745 యూనిట్లుగా నమోదైనట్లు ఎఫ్ఏడీఏ ప్రకటించింది. గతేడాది ఇదే నెలలో 2,17,879 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 2021 మార్చిలో 35 శాతం క్షీణించి 11,95,445 నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 42.2 శాతం క్షీణించాయి. గత సంవత్సరం 1,16,559 అమ్ముడవ్వగా 2021 మార్చిలో 67,372 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మూడు చక్రాల వాహన విక్రయాలు సైతం భారీగా(52 శాతం) పడిపోయాయి. 77,173 నుంచి 38,034 కు తగ్గాయి. ఇక ట్రాక్టర్ల అమ్మకాలు 29 శాతం పెరిగి 69,082 యూనిట్లు నమోదయ్యాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా వాహన విక్రయాలు 29 శాతం క్షీణించాయి. ‘‘కరోనా 3.2 కోట్ల మధ్య తరగతి కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ఆదాయాలు భారీగా పడిపోవడంతో ప్రజలు వాహన కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేదు. డీజిల్, పెట్రోల్ ధరలు నిరంతర పెరుగుదల వారిని మరింత నిరుత్సాహపరిచింది’’ అని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటీ తెలిపారు. అయితే లో బేస్ కారణంగా ప్యాసింజర్, ట్రాక్టర్ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. -
కారు మళ్లీ టాప్గేరు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 నేపథ్యంలో వ్యక్తిగత రవాణా వాహనాలకు నెలకొన్న డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆటో కంపెనీలు ఫిబ్రవరి వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్లు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా కంపెనీలు కూడా డీలర్లకు పెద్ద ఎత్తున వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ ఫిబ్రవరిలో మొత్తం 1.52 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 1.36 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. కాంపాక్ట్, యుటిలిటీ వాహన విభాగాల్లో అధికంగా విక్రయాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే నెలలో దేశీయ వాహన అమ్మకాల్లో 29 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. టాటా మోటార్స్ కంపెనీ ప్యాసింజర్ విభాగంలో మొత్తం 27,225 యూనిట్లను విక్రయించి రెండు రెట్ల వృద్ధిని సాధించింది. -
టాప్గేర్లో వాహన విక్రయాలు
వాహన విక్రయాలు డిసెంబర్లో దుమ్ము రేపాయి. డిమాండ్ జోరుగా ఉండటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీల వాహన అమ్మకాలు(హోల్సేల్) రెండంకెల మేర వృద్ధి చెందాయి. హ్యుందాయ్, సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీలు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను డిసెంబర్లోనే సాధించాయి. వినియోగదారుల ఆర్డర్లు చెప్పుకోదగ్గ స్థాయిల్లో పెరుగుతున్నాయని, రిటైల్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వాహన కంపెనీలు వెల్లడించాయి. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా అమ్మకాలు జోరుగానే ఉన్నాయని వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. మార్కెట్ వేగంగా రికవరీ అయిందని, వ్యక్తిగత రవాణాకు డిమాండ్ పెరుగుతుండటం కలసివచ్చిందని పేర్కొన్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడి, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న ఆశాభావం వాహన పరిశ్రమలో నెలకొన్నది. మరిన్ని విశేషాలు... ► హ్యుందాయ్ కంపెనీకి అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను గత నెలలోనే సాధించింది. క్రెటా, వెర్నా, టూసన్, ఐ20 మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించడం, క్లిక్టుబై వంటి వినూత్నమైన సేవలందించడం కారణంగా అమ్మకాలు జోరుగా పెరిగాయని ఈ కంపెనీ పేర్కొంది. ► మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగినా, మొత్తం అమ్మకాలు 10 శాతం తగ్గాయి. ► వీఈ కమర్షియల్ వెహికల్స్ దేశీయ అమ్మకాలు 8 శాతం తగ్గినా, ఎగుమతులు 24 శాతం ఎగిశాయి. మొత్తం అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ► అమ్మకాలు గత ఆరు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయని యమహా తెలిపింది. -
2021కి...లాభాలతో స్వాగతం...
ముంబై: స్టాక్ మార్కెట్ 2021 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికింది. ఐటీ, ఆటో, ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించడంతో కొత్త ఏడాది తొలిరోజున రికార్డుల పర్వం కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారమూ లాభాలతో ముగిశాయి. జీఎస్టీ అమలు తర్వాత ఈ డిసెంబర్లో ఒక నెలలో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు వసూళ్లను సాధించడంతో పాటు ఆటో కంపెనీలు వెల్లడించిన వాహన విక్రయ గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అలాగే భారత్లో ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్కు అనుమతులు లభించవచ్చనే వార్తలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 47,869 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,018 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 229 పాయింట్లు లాభపడి 47,980 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,050 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు నూతన గరిష్టాలను తాకిన తరుణంలోనూ ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 269 పాయింట్లను ఆర్జించింది. ఆటో షేర్ల లాభాల పరుగులు... డిసెంబర్లో అంచనాలకు తగ్గట్టుగానే వాహన విక్రయాలు జరిగాయని ఆటో కంపెనీలు ప్రకటించాయి. దీనికి తోడు ఇటీవల పలు ఆటో కంపెనీలు తమ వాహనాలపై పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు 4 నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ లిస్టింగ్ విజయవంతం... గతేడాదిలో చివరిగా ఐపీఓను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు ఎక్ఛ్సేంజీల్లో లాభాలతో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 36% ప్రీమియం ధరతో రూ. 436 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఒక దశలో 55 శాతానికి పైగా లాభపడి రూ.489.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరకు 29 శాతం లాభంతో రూ.407 వద్ద స్థిరపడ్డాయి. మునిసిపల్ సోలిడ్ వేస్ట్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి. -
కారు.. పల్లె‘టూరు’!
కరోనా వైరస్ వాహన విక్రయాలను కాటేసింది. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. కరోనా కల్లోలం, ఆర్థిక మందగమనం సెగ పెద్దగా తాకని గ్రామీణ మార్కెట్లు తమను గట్టెక్కిస్తాయని వాహన కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆ ఆశలను గ్రామీణ మార్కెట్లు నెరవేర్చాయి. భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. పల్లె మార్కెట్ల దన్నుతో వాహన రంగం పుంజుకుంది. గ్రామీణ మార్కెట్లలో మరింత పుంజుకోవడానికి కంపెనీలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలపై ‘సాక్షి బిజినెస్’ స్పెషల్ స్టోరీ.... కరోనా మహమ్మారి వాహన రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. లాక్డౌన్ కారణంగా టూ వీలర్లు, కార్ల అమ్మకాలు అసలే జరగలేదు. మే నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. గత పదేళ్లలో వాహన విక్రయాలకు సంబంధించి అత్యంత అధ్వానమైన నెల ఇదే. లాక్డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించిన తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా కల్లోలం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా కల్లోలం ప్రభావం స్వల్పంగానే ఉండటంతో వాహన కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణులను ఆకర్షించడానికి మొబైల్ షోరూమ్స్ ఏర్పాటు చేశాయి. రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకున్నాయి. ఫలించిన ప్రయత్నాలు... ఆరు నెలల కాలంలో ఈ ప్రయత్నాలు ఫలించాయి. వాహన విక్రయాలు మెల్లమెల్లగా రికవరీ అయ్యాయి. పండుగల సీజన్లో బాగా పుంజుకున్నాయి. గ్రామీణ మార్కెట్ల దన్నుతోనే వాహన విక్రయాలు కళకళలాడాయి. వాహన కంపెనీలకు భవిష్యత్తుపై భరోసాను కూడా గ్రామీణ మార్కెట్లే ఇచ్చాయి. ఇక ఇప్పుడు పట్టణ మార్కెట్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. వెయ్యి కొత్త షోరూమ్లు... ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో దాదాపు 300కు పైగా వాహన షోరూమ్లు మూతపడ్డాయి. పులి మీద పుట్రలా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కల్లోలం కూడా జత అయింది. దీనికి లాక్డౌన్ ఆంక్షలు తోడయ్యాయి. ఫలితంగా పరిస్థితులు మరింత అస్తవ్యస్తం కావాలి. అంటే మరిన్ని షోరూమ్లు మూతపడాల్సి ఉంది. కానీ లాక్డౌన్ ఆంక్షలు సడలిన తర్వాత వాహన కంపెనీలు కొత్తగా వెయ్యికి పైగా రిటైల్ అవుట్లెట్స్ను ప్రారంభించాయి. వీటిల్లో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది. టాటా మోటార్స్ కంపెనీ తన ఇతర గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. వీటన్నిటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ వాటా 5% పెరిగి 43 శాతానికి, మహీంద్రా వాటా 6% పెరిగి 53 శాతానికి చేరాయి. మొబైల్, చిన్న షోరూమ్లు... టాటా మోటార్స్ కంపెనీ మొబైల్ షోరూమ్స్ను ఏర్పాటు చేసింది. తక్కువ వ్యయాలతోనే వీటిని ఏర్పాటు చేసి, గ్రామీణులకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు వేగంగా విక్రయానంతర సేవలందించే నిమిత్తం వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ ఒకడుగు ముందుకు వేసి జిప్ సర్వీస్ పేరుతో బైక్ల ద్వారా ఈ సేవలందిస్తోంది. పట్టణాల్లోని షోరూమ్ల్లో నాలుగో వంతు ఉండేలా చిన్న చిన్న షోరూమ్స్ను వాహన కంపెనీలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పుంజుకోవడానికి ఇవి బాగానే తోడ్పడ్డాయి. వాహన కంపెనీలు స్టూడియో స్టోర్స్, షోరూమ్ లైట్, ఎమర్జింగ్ మార్కెట్ అవుట్లెట్స్, స్మార్ట్ షోరూమ్ పేర్లతో చిన్న షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కియా కంపెనీ స్మార్ట్ అవుట్లెట్ పేరుతో చిన్ని చిన్న కార్ల షోరూమ్లను ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ జోరు... కరోనా కల్లోలం కారణంగా ప్రజలు బయటకు రావడం తగ్గింది. దీంతో కార్ల కంపెనీల షోరూమ్స్ వెలవెలపోతున్నాయి. దీనిని అధిగమించడానికి హ్యుందాయ్ కంపెనీ ‘క్లిక్ టు బై’ పేరుతో డిజిటల్ షోరూమ్ను ఏర్పాటు చేసింది. కారు కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారుడు షోరూమ్కు వెళ్లకుండానే క్లిక్ టు బై డిజిటల్ షోరూమ్లో నచ్చిన కారును ఎంచుకొని హోమ్ డెలివరీ పొందవచ్చు. కొత్తగా మన మార్కెట్లోకి వచ్చిన కియా మోటార్స్, ఎమ్జీ మోటార్ కంపెనీలు డిజిటల్ షోరూమ్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. వినూత్నమైన స్కీమ్లు... ఆర్థిక మందగమనం, కరోనా కల్లోలం కారణంగా పట్టణాల్లో వాహన విక్రయాలు కుదేలయ్యాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడంతో అమ్మకాల కోసం వాహన కంపెనీలు కొత్త దారులు వెదుకుతున్నాయి. ఆదాయాలు పడిపోవడంతో చాలామంది వాహనాలు కొనలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి సబ్స్క్రిప్షన్, లేదా లీజు ద్వారా వాహన వాడకం తదితర ఆకర్షణీయ స్కీమ్లను వాహన కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగం పోయిన పక్షంలో ఈఎమ్ఐల చెల్లింపుల్లో వెసులుబాటును ఇవ్వడం వంటి వినూత్నమైన స్కీమ్లను వాహన కంపెనీలు అందిస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాట ఇలా ► మహీంద్రా: ఫార్మ్ ఎక్విప్మెంట్ డివిజన్తో కలసి 475 కొత్త అవుట్లెట్స్ ఏర్పాటు. ► టాటా మోటార్స్: గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ వ్యూహం అమలు. ► మారుతీ సుజుకీ: 12,500 రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల నియామకం. ► హ్యుందాయ్: కొత్త విధానంలో షోరూమ్ల ఏర్పాటు, బైక్ల ద్వారా విక్రయానంతర సేవలు అందిస్తోంది. ► కియా మోటార్స్, ఎమ్జీ మోటార్: డిజిటల్ షోరూమ్ల ఏర్పాటు, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత. ► టయోటా కిర్లోస్కర్: కొత్తగా వంద సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు. కొత్త ఏడాదిలో ధరలకు రెక్కలు..! ముంబై: కొత్త ఏడాదిలో కారు కొనడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఏడాది ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. పలు కార్ల కంపెనీలు జనవరి 1 నుంచి తమ మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ఇందుకు కారణం. ఆటో రంగంలో తలెత్తిన సంక్షోభంతో పాటు కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్తో 2020లో కార్ల అమ్మకాలు, ఎగుమతులు భారీగా తగ్గిపోవడంతో వాహన కంపెనీలు తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతీ సుజుకీ...: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది’’ అని కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయం మోడల్ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. అదే దారిలో ఫోర్డ్ ఇండియా కూడా... మారుతీ సుజుకీ దారిలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కూడా వచ్చే జనవరి 1 నుంచి తన అన్ని రకాల మోడళ్లపై ధరలను ఒకశాతం నుంచి 3% వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయా మోడళ్లను బట్టి ఈ పెంపు రూ.5వేల నుంచి రూ. 35 వేలు దాకా ఉండొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏడాది ముగిసే లోపు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధరల సెగలు తగలవని వినయ్ వివరించారు. -
మహీంద్రా లాభం 88 శాతం డౌన్
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) రెండో త్రైమాసిక కాలంలో 88 శాతం మేర తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,355 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.162 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి రూ.1,149 కోట్ల ఇంపెయిర్మెంట్ కేటాయింపుల కారణంగా ఈ క్యూ2లో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.10,935 కోట్ల నుంచి రూ.11,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అమ్మకాలు 21 శాతం డౌన్.... గత క్యూ2లో 1.10 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ2లో 21 శాతం తగ్గి 87,332కు పరిమితమయ్యాయని కంపెనీ తెలిపింది. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం 68,359 నుంచి 31 శాతం ఎగసి 89,597కు చేరాయని పేర్కొంది. అమ్మకాలు పుంజుకుంటాయ్...! ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రికవరీ అవుతుండటం సానుకూలాంశాలని కంపెనీ పేర్కొంది. దేశీయ ఆర్థిక స్థితిగతులను సరిదిద్దడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు, ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేవని, తమ అమ్మకాలు రానున్న క్వార్టర్లలో పుంజుకోగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాలో గిప్స్ ఏరో పేరుతో ఉన్న విమానాల తయారీ వ్యాపారాన్ని మూసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 0.5 శాతం లాభంతో రూ.620 వద్ద ముగిసింది. -
అక్టోబర్లో తగ్గిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు
ముంబై: సప్లై సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు మందగించడంతో అక్టోబర్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ తెలిపింది. మొత్తం 1,464 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో(ఆర్టీఓ)1,257 ఆఫీసుల నుంచి సేకరించిన వెహకిల్ రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఎఫ్ఏడీఏ రిటైల్ వాహన అమ్మకాల డేటాను విడుదల చేసింది. సమీకరించిన గణాంకాల ప్రకారం ఈ అక్టోబర్లో మొత్తం 2,49,860 పాసింజర్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,73,980 యూనిట్లతో పోలిస్తే ఇవి 9 శాతం తక్కువ. ఇదే అక్టోబర్లో టూ–వీలర్స్ అమ్మకాలు 27 శాతం క్షీణించి 10,41,682 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఈ విక్రయాలు 14,23,394 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలు 30 శాతం పతనమై 44,480 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 64.5 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 55శాతం క్షీణించాయి. మొత్తం అన్ని విభాగపు అమ్మకాలు 24శాతం క్షీణించి 14,13,549 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే అక్టోబర్లో మొత్తం అమ్మకాలు 18,59,709గా ఉన్నాయి. పండుగ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నప్పటికీ., వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. ‘‘కరోనా ప్రభావంతో డీలర్లు డిమాండ్కు తగ్గట్లు కొత్త వేరియంట్ల కొనుగోళ్లకు, అధిక నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపలేకపోయారు. అలాగే గత సీజన్తో పోలిస్తే ఈసారి తక్కువ డిస్కౌంట్ల ప్రకటన అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది’’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. -
ఆటో కంపెనీలకు దసరా పండగ..
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్ కార్లు, ఎస్–క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్లో హ్యుందాయ్ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్ సెంటిమెంట్కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. నవరాత్రుల్లో అమ్మకాలు.. అక్టోబర్ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
సెప్టెంబర్లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్డవున్ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్ను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ ఆటో జూమ్ గత నెలలో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్కు సైతం డిమాండ్ను పెంచాయి. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత టీవీఎస్ మోటార్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు భళా సెప్టెంబర్లో బజాజ్ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. -
వాహనాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలు జోరుగా సాగింది. వాణిజ్య వాహనాలు కొనుగోళ్లలో 7.71 శాతం వృద్ధి నమోదైంది. వ్యక్తిగత వాహనాల అమ్మకాల్లోనూ 9.50 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో 11,12,758 కొత్త వాహనాలు కొనుగోలు అయినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య 1,31,05,442కు చేరినట్టు పేర్కొంది. వీటిలో 1.02 కోట్లు వ్యక్తిగత (రవాణేతర) మోటారు సైకిళ్లు ఉండగా.. 8.28 లక్షల వ్యక్తిగత (రవాణేతర) కార్లు ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మొత్తం 16.25 లక్షల వాణిజ్య (రవాణా) వాహనాలు ఉండగా.. వాటిలో 6.20 లక్షల ఆటోలు, 3.97 లక్షల గూడ్స్ వాహనాలు, 3.29 లక్షలు ట్రాక్టర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల కొనుగోళ్లలో 9.28 శాతం వృద్ధి నమోదైంది. -
వాహన రంగానికి... బీఎస్–4 గుదిబండ
న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్న కారణంగా పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఇన్వెంటరీలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మొన్నటివరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తి వేగంగా ఉన్నందువల్ల షారూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విజృంభిస్తోన్న వైరస్ పరంగా చూస్తే.. గడువు తేదీలోపు బీఎస్–4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. మరోవైపు పాత వాహనాల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావాలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. 30–రోజులకు పెరిగిన నిల్వలు పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు. వీటి ఇన్వెంటరీ 20–30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
డిసెంబర్ వాహన విక్రయాలు అటు ఇటుగానే..
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన అమ్మకాలు.. పండుగల సీజన్ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్లో మారుతీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధిని నమోదుచేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ కాలంలో మారుతీ విక్రయాలు 17% తగ్గగా.. గత నెల్లో మాత్రం 2.4% వృద్ధిని ప్రదర్శించాయి. మహీంద్రా అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైంది. కొత్త ఏడాదిలో బీఎస్–6 వాహనాల విడుదలపై దృష్టిసారించామని, అధునాతన వాహనాల విడుదలతో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం లిమిటెడ్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను విడుదలచేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోనున్నామని, ఇన్వెంటరీని తగ్గించే చర్యలను ఇప్పటికే కొనసాగిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ వెల్లడించారు. ఇక గతనెల అమ్మకాలు తాము ఆశించిన స్థాయిలోనే ఉన్నట్లు హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ అన్నారు. నెమ్మదించిన ఆటో రంగంలో కనీసం గతేడాది చివర్లో అయినా అమ్మకాలు మెరుగుపడడం ఆశాజనకంగా ఉందని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని వ్యాఖ్యానించారు. -
వాహనం విక్రయిస్తున్నారా.. జాగ్రత్త సుమా!
పాతపట్నం, హిరమండలం: బైక్ వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్నారు. కొత్త వాహనాలతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే బండి అమ్మేటప్పుడు గానీ, పాత బండి కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు విక్రయించినట్లు సేల్ అగ్రిమెంట్ ఇతర పత్రాలన్నీ సరిగా చూసుకోకుంటే ఆ తర్వాత లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల పోలీసులు ఈ–చలానా విధిస్తుండటంతో కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్న బాండ్ పేపర్తో విక్రయం గురించి ఒప్పందాలు చేసుకుని విక్రయిస్తారు. వాహనాన్ని కొన్న వ్యక్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగే నడిపిస్తే అమ్మిన వ్యక్తి పేరున ఉన్న చలానాల భారం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో సేల్ డీడ్ అగ్రిమెంట్ కాగితాలు ఉండడం మంచిది. సరైన అవగాహన లేకపోవడంతో ఇలాంటి వ్యవహారా ల్లో చాలా మంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అమ్మిన వారితో పాటు కొన్నవారు కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జోరుగా మారు బేరాలు నగరాలు, పట్టణాలతో పాటు ఇటీవల మండల స్థాయిలో కూడా వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఇష్టం వచ్చినట్లు క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల్లో దాదాపు 20 శాతానికి పైగా వాహన యజమానులు గాక ఇతరులే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన వారు వారం, పది రోజుల్లోపు యాజమాన్య హక్కులను మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆలస్యం చేస్తే అధికారులు జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. 29, 30 ఫారాలే ముఖ్యం.. వాహనాలు కొన్న వెంటనే ఆర్సీ, ఇన్స్యూరెన్సు, కాలు ష్యం, చిరునా మా లాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకోవడం చాలా ముఖ్యమని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. వాటితో పాటు ఫారం 29 రెండు కాపీలు, ఫారం 30పై విక్రయించిన వారి సంతకాలు తీసుకుంటే యాజమాన్య హక్కుల బదిలీ సులభమవుతుంది. పాత వాహనం అమ్మేశాక యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోకపోతే కష్టాలు తప్పవు. కొత్తగా మరో వాహనం కొంటే పన్నుల రూపంలో అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. సాధారణంగా ద్విచక్ర వాహనాలకు 9శాతం, కారుకు 12 శాతం జీవిత కాలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు ద్విచక్రవాహనానికి 14 శాతం, కారుకు 14 శాతం చెల్లించాలి. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పలువురు ఎక్కువ పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు. వాహనాన్ని అమ్మిన వెంటనే ఇరువైపుల యాజమాన్య హక్కులను స్పష్టంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. పాత వాహనాలు కొన్న వెంటనే ఆర్సీ, ఇన్సూ్యరెన్సు, కాలుష్యం, చిరునామా లాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకుని పేరు, చిరునామా మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. తప్పనిసరిగా కోనుగోలు దారుడు చూసుకోవాలి. –కే.వి.ప్రకాశరావు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ , పలాస పత్రాలు లేకుంటే కొనవద్దు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ట్రాఫిక్ చలానాలు లేకుండా ఉండే వాహనాలను కోనుగోలు చేసుకోవాలి. సరైన పత్రాలు లేకుంటే కేసులు నమోదవుతాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. – రొక్కం రవిప్రసాద్, సీఐ, పాతపట్నం -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
బండి.. జోరు తగ్గిందండి!
సాక్షి, అమరావతి: ఆర్థిక మందగమనంతో దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు భారీగా పడిపోయినా రాష్ట్రంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద వాహనాల విక్రయాలు తగ్గడంతో ఆ ప్రభావం రవాణా రంగం రాబడిపై పడింది. తొలి అర్థ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రవాణా రంగం ఆదాయం భారీగా తగ్గింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్)లో సమకూరిన రాబడి గత ఏడాదితో పోల్చి చూస్తే 11.81 శాతం మేర తగ్గింది. రెండో త్రైమాసికం (జూలై – సెప్టెంబర్)లో రాబడి గత ఏడాదితో పోలిస్తే 12.42 శాతం తగ్గింది. అక్టోబర్లో కొంత పుంజుకున్నా గత ఏడాదితో పోల్చి చూస్తే మాత్రం 6.83 శాతం తగ్గింది. ‘వాహనమిత్ర’తో జోరుగా ఆటోల విక్రయాలు! ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రంలో ఆటోల విక్రయాలు పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విక్రయాలను పోల్చి చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో ఆటోల అమ్మకాలు 19.32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 6.37 శాతం మేర తగ్గాయి. సొంతంగా ఆటో నడుపుకొనే వారికి ఏటా రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం ద్వారా ఆర్థ్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. స్వయం ఉపాధి కోసం రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వారు ఎక్కువ మంది ఆటోలను కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మందగమనమే కారణం గత ఆరేడు నెలలుగా ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఆర్థిక మంద గమనమే. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈసారి అక్టోబర్లో పండగ సీజన్లో కూడా కార్ల అమ్మకాలు పెరగలేదు. డిసెంబర్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండవచ్చని భావిస్తున్నాం. ఇక ఆశలన్నీ కొత్త ఏడాదిపైనే. ఆటోల విక్రయాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒక వలయం మాదిరిగా ఉంటాయి. మావద్ద బజాజ్ ఆటోల విక్రయాలు వంద శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండటం కూడా విక్రయాలు పెరగడానికి కారణం. డౌన్ పేమెంట్ కింద రూ.25 వేలు చెల్లించాల్సి ఉండగా వాహన మిత్ర ద్వారా ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుండటంతో స్వయం ఉపాధి కోసం ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు – సత్యనారాయణ (డైరెక్టర్, వరుణ్ మోటార్స్) -
వాహన అమ్మకాల రికవరీ సిగ్నల్!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఆటో రంగం అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా వంటి సంస్థలు అమ్మకాల్లో పురోగతిని చూపాయి. దాదాపు 7 నెలల అనంతరం మారుతీ 4.5 శాతం వృద్ధి రేటుతో సానుకూల సంకేతాలను ఇచి్చంది. ప్యాసింజర్, వాణిజ్య విక్రయాలు గతంతో పోలి్చతే అక్టోబర్లో మెరుగ్గా ఉన్నాయని ఎం అండ్ ఎం చీఫ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్) విజయ్ రామ్ నక్రా అన్నారు. పండుగల సీజన్ అమ్మకాల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించినట్లు టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వెల్లడించారు. నెమ్మదించిన ఆటో రంగంలో ఆశాజనక వాతావరణం అలముకుందని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ వెల్లడించారు. క్యూ5, క్యూ7 ధరలను తగ్గించిన ఆడీ జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తన పాపులర్ ఎస్యూవీలైన ‘క్యూ5, క్యూ7’ ధరలను తగ్గించింది. గతంలో రూ. 55.8 లక్షలుగా ఉన్న క్యూ5 ధరను రూ. 49.99 లక్షలకు తగ్గించింది. క్యూ7 పెట్రోల్ వెర్షన్ ధరను రూ. 68.99 లక్షలకు, డీజిల్ వెర్షన్ ధరను రూ. 71.99 లక్షలకు తగ్గించినట్లు ప్రకటించింది. -
హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయి
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయిని దాటింది. హరిద్వార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే వాహన అమ్మకాలు 2.5 కోట్ల మార్కును అధిగమించినట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9,500 యూనిట్లు కాగా, ప్రారంభించిన 11 ఏళ్లలోనే ఈస్థాయి రికార్డును నెలకొల్పడం విశేషమని కంపెనీ వివరించింది. 2008లో ఉత్పత్తిని మొదలుపెట్టి.. తాజాగా సాధించిన ఘనత కేవలం ఈ ఒక్క ప్లాంట్కే కాకుండా, మొత్తం కంపెనీ విజయంగా భావిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విక్రమ్ కస్బేకర్ చెప్పారు. -
మారుతీకి మందగమనం దెబ్బ
న్యూఢిల్లీ: వాహన విక్రయాల మందగమనం దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 39% తగ్గింది. గత క్యూ2లో రూ.2,280 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,391 కోట్లకు తగ్గింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత భారీ తగ్గుదల. ఆదాయం రూ.21,554 కోట్ల నుంచి 25% తగ్గి రూ.16,123 కోట్లకు చేరింది. క్యూ2లో వాహన విక్రయాలు 30% తగ్గి 3,38,317కు చేరాయని కంపెనీ చైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కారు ఇప్పుడే కాదు... : ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం తయారీ దశలో ఉందని, విక్రయాల నిమిత్తం ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తెచ్చే అవకాశాల్లేవని భార్గవ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ తోడ్పాటు కూడా తగిన విధంగా లేదన్నారు. -
కారు.. బైకు.. రివర్స్గేర్లోనే!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. సెప్టెంబర్లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ కంపెనీగా కొనసాగుతోన్న మారుతీ సుజుకీ అమ్మకాలు గతనెల్లో 26.7 శాతం పడిపోయాయి. తాజా అమ్మకాల గణాంకాలపై హ్యుందాయ్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడకపోవడం వల్ల సెప్టెంబర్లో కూడా అమ్మకాలు క్షీణించాయి. ఈ అంశమే తాజా గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది’ అని అన్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో అమ్మకాలు గాడిన పడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్(ఆటోమోటివ్) వీజయ్ రామ్ నక్రా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి వర్షాలు అనుకున్నస్థాయిని మించి నమోదుకావడం, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోత విధించి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలను వెల్లడించడం వంటి సానుకూలతతో త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. పండుగల సీజన్లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. పెరిగిన డాట్సన్ గో, గో ప్లస్ ధరలు ‘డాట్సన్ గో, గో ప్లస్’ ధరలను 5 శాతం మేర పెంచినట్లు జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని నిస్సాన్ ఇండియా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా పెంపు అనంతరం ఈ మోడల్ కార్ల ధరల శ్రేణి రూ. 3.32 లక్షలు నుంచి రూ. 3.86 లక్షలుగా ఉన్నట్లు వివరించారు. వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ధరల్లో పెరుగుదల ఉంటుందని వెల్లడించారు. -
ఆటో రయ్.. రయ్..
సాక్షి, అమరావతి : కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా ఆటో మొబైల్ అమ్మకాలు భారీగా క్షీణిస్తున్న దశలో రాష్ట్రంలో మాత్రం ఆటోల అమ్మకాలు పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాలు 15.89 శాతం మేర క్షీణించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో మన రాష్ట్రంలో ఈ క్షీణత కేవలం 9.4 శాతానికి మాత్రమే పరిమితమైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఐదు నెలల కాలానికి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు దేశ వ్యాప్తంగా అమ్మకాలు 1.15 కోట్ల నుంచి 97.31 లక్షలకు పడిపోయాయి. కానీ ఇదే సమయంలో రాష్ట్రంలో అమ్మకాలు 5.10 లక్షల నుంచి 4.62 లక్షలకు మాత్రమే తగ్గాయి. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి ఆర్థిక మాంద్యంతో ఒకపక్క వాహనాల విక్రయాలు తగ్గుతుంటే రాష్ట్రంలో ఆటో అమ్మకాలు 17.18 శాతం పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన ఐదు నెలల్లో రాష్ట్రంలో 20,139 ఆటోలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైంది 17,187 మాత్రమే. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 2,33,865 నుంచి 2,16,907కు పడిపోవడంతో 7.25 క్షీణత నమోదైంది. మందగమనం నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారు ఆటోలు నడుపుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, విజయవాడలో సీఎన్జీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కార్లు, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కార్ల అమ్మకాలు 21 శాతం, సరుకు రవాణా వాహనాలు 24 శాతం, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు 14.64 శాతం మేర క్షీణించాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగ పనులు మందగించడం వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడానికి కారణమని డీలర్లు పేర్కొంటున్నారు. దసరా, దీపావళిపై ఆశలు గత నాలుగు నెలల నుంచి అమ్మకాలు తగ్గుతుండటంతో వచ్చే దసరా, దీపావళి పండుగలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్ పండుగల సమయంలో కృష్ణా జిల్లాలో 4,000 ద్విచక్ర వాహనాలు విక్రయిస్తే సెప్టెంబర్ ముగుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 700 మాత్రమే విక్రయించామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రస్తుతం పండగల సీజన్కు తోడు కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ను భారీగా తగ్గించడంతో భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఆయా సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకాలం పన్నులు తగ్గుతాయని కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు లేదనే స్పష్టత రావడంతో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినా.. పెట్రోలు, డీజిల్ వాహనాలను రద్దుచేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల తర్వాత పరిశ్రమ కోలుకుంటుందన్న ఉద్దేశంతో గత నాలుగు నెలలుగా అమ్మకాలు లేకపోయినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగిస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. పండగల తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోతే అప్పుడు ఉద్యోగుల తొలగింపు గురించి ఆలోచించాల్సి వస్తుందన్నారు. సంక్షోభంలో విస్తరిస్తాం... ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం సంక్షోభం వల్ల చిన్న డీలర్లు భారీగా దెబ్బ తింటున్నారు. దేశ వ్యాప్తంగా 15,000 మందికి పైగా డీలర్లు ఉంటే ఇప్పటి వరకు 300 మంది వరకు డీలర్షిప్లు వదులుకున్నారు. అమ్మకాలు లేక, బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ అందక చిన్న డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణ్ మోటార్స్ ఎప్పుడూ ఇటువంటి సంక్షోభాల సమయంలోనే భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టేది. ఈ సమయంలో తయారీ సంస్థల నుంచి ఆఫర్లు బాగుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకటి రెండు నెలల్లో పరిస్థితులను గమనించాకే విస్తరణపై ఒక స్పష్టత వస్తుంది. – ప్రభుకిషోర్, చైర్మన్, వరుణ్ గ్రూపు -
ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?
దేశంలోని వాహనాల అమ్మకాల పతనానికి, నగర ప్రాంత యువత ఓలా, ఉబెర్ వంటి సంస్థల సేవల వైపు మొగ్గుచూపడమేననీ... వారు కార్లు కొని వాటికి నెలవారీ ఇన్ స్టాల్మెంట్లు కట్టడానికి ఆసక్తి చూపడంలేదనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. అంటే, దేశంలో ఎటువంటి ఆర్థిక దిగజారుడు, మాంద్య స్థితులు లేవని చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ వాదన వాస్తవ పరిస్థితితో సరిపోలదు. దేశంలో కార్ల అమ్మకాలు (ఆగస్టు 2019లో 41.09% మేరకు) పతనం అవడానికి కారణం యువతరం వాటిని కొనకపోవడమే. మరి వాణిజ్య, రవాణా వాహనాల అమ్మకాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో, పతనం ఎందుకు జరిగినట్లు? కార్లకు లాగా ఈ వాణిజ్య, రవాణా వాహనాలకు ఓలా, ఉబెర్ల వంటి ప్రత్యామ్నాయాలు లేవన్నది గమనార్హం. మార్కెట్లో డిమాండ్ లేక కార్ల తయారీ కంపెనీ మారుతి సంస్థ లాగానే, వాణిజ్య రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ సంస్థ తన 5 ప్లాంట్లలో సెప్టెంబర్ నెలకుగాను, 5 నుంచి 18 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఆరోగ్యానికి కొలబద్ధలైన ట్రాక్టర్లు, బైక్ల అమ్మకాల పతనం దేనికి సూచిక? వాటికి కూడా వాణిజ్య వాహనాలలో లాగానే ఇతర రవాణా ప్రత్యామ్నాయాలు లేవు. అలాగే, 2019లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10% మేరన పెరుగుతాయని అంచనా. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వారు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకొంటున్నారన్నమాట. నిజానికి నేడు మార్కెట్లోని అన్ని రంగాలలోనూ, అన్ని రకాల వస్తువులు, సరుకుల అమ్మకాలలోనూ పతనం ఉంది. ఉదా‘‘కు, మిగతా వాటితో పోలిస్తే చాలా వేగంగా, కాస్త తక్కువ ధరకు అమ్ముడుపోయే అమ్మకాలు (బిస్కెట్లు, తల నూనెలు, సబ్బుల వంటివి) జరిపే హిందుస్తాన్ లీవర్ అమ్మకాలు 2018 ఏప్రిల్ జూ¯Œ లో 12% మేరన పెరగ్గా, 2019లో అదే కాలంలో అవి కేవలం 5% పెరిగాయి. అలాగే, అదే కాలానికి గానూ డాబర్ ఇండియా అమ్మకాల వృద్ధి 2018 లో 21% నుంచి, 2019లో 6%కి పడిపోయింది. అలాగే, అదే కాలానికి బ్రిటానియా సంస్థ అమ్మకాల వృద్ధి 2018లో 13% నుంచి 2019లో 6%కి దిగజారింది. నిజానికి ఆగస్టు, 2019 నాటి గోల్డ్మన్ శాక్స్ సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో వినియోగ పతనం వాహన రంగంలో 17% మేర ఉండగా, దీర్ఘకాల వస్తువులు, ఇతర సరుకులు తదితరాల అమ్మకం 36% మేరన ఉంది. అంటే, వాహనాల అమ్మకాలలో కంటే దేశంలోని ఇతర అమ్మకాలలో పతనం మరింత అధికంగా ఉంది. ఇది ఆర్థిక మాంద్యస్థితి తాలూకు సూచికే! కాబట్టి ఓలా, ఉబెర్లు మాత్రమే యువజనులలో కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం కాదు. అంతకు మించిన కారణాలు మన ఆర్థిక రంగంలో ఉన్నాయి. నేడు ఆర్థిక మాంద్య స్థితి మన దేశంలో అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థితే. మన ప్రభుత్వ గణాంకాల ప్రకారమే భారతదేశంలో నిరుద్యోగం, నేడు 45 సం‘‘ల గరిష్ఠ స్థాయిలో ఉంది. ఈ కారణం చేతనే మన దేశంలో కూడా యువజనులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్థితిలో పడిపోయారు. దేశీయంగా కార్ల అమ్మకాల పతనానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇక చివరిగా, నిన్నగాక మొన్న ‘మింట్ మిలీనియన్ సర్వే’ అధ్యయనం ప్రకారంగా, నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావిస్తోన్న నగర ప్రాంతాలలోని ‘మిలీనియల్స్’లో (కొత్తతరం యువజనులు) 80% మంది నిజానికి తమకు సొంత వాహనం కావాలనే కలను కంటున్నారు. నిజానికి, తమకంటూ సొంత వాహనం కావాలనే ఆకాంక్షలో యువజనులకూ, మధ్య వయస్సూ ఆ పైబడిన వారికీ ఎటువంటి తేడా లేదని ఈ సర్వే తేల్చింది. మరోవైపున ధనవంతుల బిడ్డలు కొనే లగ్జరీ బైక్ల డిమాండ్ 130% పెరిగింది. 2019 ఏప్రిల్ లోనే సాధారణ బైక్ల అమ్మకాలు 16% పడిపోయాయి. అంటే, ఇది కేవలం ఓలా, ఊబ ర్లు యువ జనుల కథే కాదు... ఈ దేశంలోని ధనిక పేద అంతరాల కథ.. ఒకవైపు ధనికుల ఇండియా... మరోవైపున వెలవెలబోతోన్న పేదల, మధ్య తరగతి భారతం కథ ఇది..! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
క్షీణతకు ఓలా, ఉబెర్ కూడా కారణమే..
చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్్కఫోర్స్.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని చెప్పారు. ఇప్పటికే 100 లక్షల కోట్లను మౌలిక రంగంపై ఖర్చు చేయనున్నట్టు తాము ప్రకటించామని, దాన్ని వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులను వేగంగా గుర్తించేందుకు టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేశామని, దాంతో నిధులు వెచ్చించడం వీలు పడుతుందని వివరించారు. ‘‘ఇప్పటికే టాస్్కఫోర్స్ పని ఆరంభించింది. ప్రాజెక్టులను గుర్తించే పనిలో ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. నీతిఆయోగ్ సీఈవోతోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో ప్రభుత్వం ఈ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికే రెండు భారీ నిర్ణయాలను (ప్రోత్సాహకాలు) ప్రకటించిందని, మరో ఒకటి రెండు నిర్ణయాలు ఉంటాయని హామీనిచ్చారు. 5 ట్రిలియన్ డాలర్లు సాధ్యమే... 5 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా భారత్ను తీసుకెళ్లేందుకు... మౌలిక రంగంపై నిధులు ఖర్చు చేయడంతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ని ర్ణయాలు భాగమేనని మంత్రి తెలిపారు. దేశ జీడీపీ 5 శాతానికి జూన్ క్వార్టర్లో పడిపోయిన నేపథ్యంలో, 5 ట్రిలియన్ డాలర్లకు జీడీపీని తీసుకెళ్లడం సాధ్యమేనా? అన్న మీడియా ప్రశ్నకు.. జీడీపీ పెరగడం, తగ్గడం మామూలేనని.. యూపీఏ హయాంలో 2012–15లోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వాహన అమ్మకాల క్షీణతకు ఓలా, ఉబెర్ కూడా కారణమే.. వాహన అమ్మకాలు పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మిలినీయల్స్ (యువత) మనస్తత్వం మారిందని, వారు సొంత కారు కంటే, ఓలా, ఊబర్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె చెప్పారు. బీఎస్–6 నిబంధనలకు మారడం, రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలు, వినియోగదారుల ఆలోచనల్లో మార్పు రావడం గడ్డు పరిస్థితులకు కారణాలుగా పేర్కొన్నారు. ‘మిలీనియల్స్ ఆటోమొబైల్ వాహనం కోసం ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించడానికి ఇష్టపడడం లేదు. బదులు ఓలా, ఊబర్ లేదా మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ అంశాలన్నీ వాహన పరిశ్రమపై ప్రభావం చూపించాయి. వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు. -
వాహన విక్రయాలు.. క్రాష్!
న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్ 1997–98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55% తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు. 10వ నెల్లోనూ పీవీ సేల్స్ డౌన్..: ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు దిగజారుతూనే ఉన్నాయి. మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత పీవీ విక్రయాల్లో మార్కెట్ లీడర్గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్ సేల్స్ 16.58 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 22 శాతం డౌన్ ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24% తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన వాహనాలు 19,47,304. -
రివర్స్గేర్లోనే కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ (సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. -
కారు.. కుదేలు..!
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ మందగించడం ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది. గడిచిన రెండు–మూడు నెలల్లో సుమారు 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వివిధ రకాల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలు ఈ ఏడాది జూలైలో మొత్తం 18,25,148 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో వాహనాల అమ్మకాలు 22,45,223 యూనిట్లు. దేశీయంగా గతంలో 2000 డిసెంబర్లో చివరిసారిగా ఆటోమొబైల్ విక్రయాలు ఏకంగా 21.81 శాతం మేర పడిపోయాయి. ఆ తర్వాత ఇంత భారీ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వం తక్షణం ప్యాకేజీ ప్రకటించాలి.. ‘ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు పరిశ్రమ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా తన వంతుగా ఎంతో కొంత తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. సుమారు 15,000 మంది ఉద్యోగాలు (తాత్కాలిక, క్యాజువర్ వర్కర్లు) కోల్పోయారని ఆయన చెప్పారు. ఆటోమోటివ్ పరికరాల తయారీ రంగంలో మరో పది లక్షల మంది దాకా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. అమ్మకాలు పడిపోవడంతో సుమారు 300 డీలర్షిప్లు మూతబడ్డాయని మాథుర్ చెప్పారు. తయారీ జీడీపీలో ఆటోమొబైల్ పరిశ్రమ వాటా దాదాపు సగం ఉంటుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3.7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని మాథుర్ వివరించారు. ఈ పరిశ్రమ గానీ పతనమైతే జీడీపీ వృద్ధి కూడా మందగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలు వ్యయాన్ని తగ్గేలా, అమ్మకాలకు ఊతం లభించేలా కేంద్రం జీఎస్టీని తాత్కాలికంగానైనా తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నట్లు మాథుర్ చెప్పారు. వాహనాల స్క్రాపేజీ పాలసీ ప్రవేశపెట్టడం, రుణ లభ్యత పెంపు, వాహన రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదన వాయిదా తదితర విజ్ఞప్తులను ప్రభుత్వం ముందుంచినట్లు ఆయన వివరించారు. పాసింజర్ వాహన విక్రయాలు 31% డౌన్.. n గతేడాది జూలైలో పాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు 2,90,031 యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది జూలైలో ఏకంగా 30% పడిపోయి 2,00,790 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది కూడా 19 ఏళ్లలో భారీ క్షీణత. వరుసగా 9 నెలల పాటు పీవీల అమ్మకాలు తగ్గినట్లయింది. చివరిసారిగా 2000 డిసెంబర్లో పీవీ అమ్మకాలు 35.22% పడిపోయాయి. n ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే గత జూలైలో 1,91,979 కార్లు అమ్ముడవగా.. ఈ ఏడాది జూలైలో 36% క్షీణించి 1,22,956 యూనిట్లకు తగ్గాయి. 2000 డిసెంబర్లో ఈ క్షీణత 39.86 శాతం. n ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 22.9 శాతం క్షీణించి 5,11,374 యూనిట్లకు తగ్గాయి. అటు పోటీ సంస్థ హోండా మోటార్సైకిల్ విక్రయాలు కూడా సుమారు 11% తగ్గి 4,55,036 యూనిట్లకు, టీవీఎస్ మోటార్ అమ్మకాలు 16% క్షీణించి 2,08,489 యూనిట్లకు పరిమితమయ్యాయి. n పీవీ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ అమ్మకాలు జూలైలో సుమారు 37% క్షీణించి 96,478 యూనిట్లకు తగ్గాయి. హ్యుందాయ్ ఇండియా (హెచ్ఎంఐఎల్) 10 శాతం క్షీణతతో 39,010 యూనిట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా సుమారు 15% క్షీణతతో 16,830 యూనిట్లే విక్రయించగలిగాయి. -
ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 2% క్షీణత
న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ విక్రయాలు 2,42,457 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన పీవీ అమ్మకాలతో పోల్చితే 2 శాతం క్షీణత ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 9% తగ్గి 12,85,470 యూనిట్లుగా నమోదుకాగా.. వాణిజ్య వాహనాల సేల్స్ 16 శాతం క్షీణించి 63,360 యూనిట్లుగా నిలిచాయి. గతనెల్లో త్రిచక్ర వాహనాల విక్రయాలు 13% తగ్గి 47,183 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,38,470 యూనిట్లుగా తెలిపింది. గతేడాదిలో నమోదైన 17,86,994 యూనిట్లతో పోల్చితే 8% తగ్గుదల చోటుచేసుకుంది. ఈ అంశంపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘గతేడాది ఏప్రిల్లో హైబేస్ కారణంగా ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేశాయి. సమీపకాలంలో సానుకూల అంశాలు లేనందున.. వచ్చే 8–12 వారాల్లో ప్రతికూలతకే అవకాశం ఉంది. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, ఆశాజ నకంగా వర్షాలు పడే అవకాశాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఆదుకోవచ్చు. పేరుకుపోయిన నిల్వలు మాత్రం డీలర్లకు భారమనే చెప్పాలి’ అని అన్నారు. -
వాహన రంగానికి పంక్చర్..!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేక విలవిల్లాడుతోంది. విక్రయాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్తో కలుపుకుని వరుసగా 10వ నెల్లోనూ వాహన విక్రయాలు తగ్గుదలనే నమోదుచేశాయి. భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 26%, మహీంద్రా అండ్ మహీంద్ర పీవీ సేల్స్ 9% పడిపోయాయి. ఇక మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 18.7%, ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్ 15 శాతం, రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 17% తగ్గిపోయిన విషయం ఇప్పటికే వెల్లడయింది. ఈ అంశంపై మాట్లాడిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్.. ‘వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిందనే విషయం డిమాండ్లో స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావం మా సంస్థ అమ్మకాలపై కనిపించింది’ అన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఏప్రిల్లో కొనుగోళ్లు నెమ్మదించాయని మహీంద్రా ప్రెసిడెంట్ ఆటోమోటివ్ విభాగ రాజన్ వాదేరా చెప్పారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్య, అధిక భీమా, పెరిగిన వ్యయాలు ఈ రంగానికి పెనుసవాళ్లుగా నిలవగా.. బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల అమలు అన్నింటి కంటే అతిపెద్ద సవాలుగా మారిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి. -
వాహన విక్రయాలకు స్పీడు బ్రేకర్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు గతేడాదిలో గట్టిగానే స్పీడు బ్రేకర్లు తగిలాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు కేవలం 2.7 శాతం వృద్ధితోనే సరిపెట్టుకున్నాయి. గతేడాది విక్రయాలు 33,77,436 యూనిట్లు కాగా, 2017–18 అమ్మకాలు 32,88,581 యూనిట్లుగా నమోదయ్యాయి. నూతన వాహనాల విడుదల ఉన్నప్పటికీ.. గతేడాది ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గిన అమ్మకాల కారణంగా కనీసం అంచనాలకు దగ్గరగా కూడా విక్రయాలు చేరుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ప్రారంభంలో 8 నుంచి 10 శాతం వరకు విక్రయాల్లో వృద్ధి ఉంచవచ్చని సియామ్ అంచనా వేయగా.. మారిన పరిస్థితుల రీత్యా ఈ అంచనాను 6 శాతానికి సవరించింది. అయితే, ఈకాలంలో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం, అధిక వాహన ధరలు, సాధారణ ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పూర్తిఏడాది అమ్మకాలు 2.7 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. ఈ అంశంపై సియామ్ అధ్యక్షుడు రాజన్ వదేరా మాట్లాడుతూ.. ‘సానుకూల అంశం వైపు నుంచి చూస్తే.. వృద్ధిరేటు ఒక అంకెకే పరిమితం అయ్యిందా, లేదంటే రెండెంకల వృద్ధిరేటా అనే విషయాన్ని పక్కన పెడితే.. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగింది. అధిక ముడివస్తువుల ధరల కారణంగా పరిశ్రమ గతేడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక బీఎస్ సిక్స్ పరివర్తన మరో కీలక అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఏడాది అమ్మకాలు 3 నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని అంచనావేస్తున్నాం. దేశ అర్థిక అభివృద్ధిపై పాజిటివ్గా ఉన్నాం. ప్రభుత్వం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఇన్ఫ్రా అభివృద్ధి కొనసాగిస్తోంది. బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల పరివర్తన ముందు కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి! దేశీ కార్ల విక్రయాల్లో గతేడాది స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2018–19లో 22,18,549 కార్లు అమ్ముడు కాగా, అంతక్రితం ఏడాదిలో 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలు (యూవీ) విక్రయాలు 2.08 శాతం వృద్ధితో 9,41,461 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 9.64 శాతం క్షీణత నమోదైంది. -
వాహన విక్రయాలకు డిమాండ్ దెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018–19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2017–18లో మారుతీ 17,79,574 వాహనాలు విక్రయించింది. దీంతో సవరించుకున్న అంచనాలను కూడా సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేసినప్పటికీ గతేడాది డిసెంబర్లో మారుతీ సుజుకీ దీన్ని 8%కి కుదించింది. దేశీయంగా విక్రయాలు చూస్తే.. 6.1% వృద్ధితో 16,53,500 యూనిట్స్ నుంచి 17,53,700 యూనిట్స్కు పెరిగాయి. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 6,90,184 వాహనాల నుంచి 7,07,348 వాహనాలకు పెరిగాయి. అయితే, దేశీయంగా మాత్రం అమ్మకాలు కేవలం 1.7 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. 5,36,241 నుంచి 5,45,243 వాహనాలకు పెరిగాయి. ‘గత ఆర్థిక సంవత్సరం 1.7 శాతం వృద్ధితో సానుకూలంగా ముగిసింది. దేశీయంగా అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. అటు మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 2 శాతం వృద్ధితో 2,49,505 యూనిట్స్ నుంచి 2,54,701 యూనిట్స్కు పెరిగాయి. దేశీయంగా ఆటోమొబైల్ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. అన్ని విభాగాలు కలిపి చూస్తే దేశీ విక్రయాల్లో 11 శాతం వృద్ధి సాధించగలిగామని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు ఉత్పత్తులు ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు. టాటా మోటార్స్ 16 శాతం.. టాటా మోటార్స్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 16 శాతం వృద్ధితో 5,86,507 యూనిట్స్ నుంచి 6,78,486కి చేరాయి. గత నెల మార్చిలో మాత్రం 1 శాతం క్షీణించి 69,409 యూనిట్స్ నుంచి 68,709 యూనిట్స్కు తగ్గాయి. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 1,70,026 యూనిట్స్ నుంచి 1,83,787 యూనిట్స్కు చేరాయి. మార్కెట్లో కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం సానుకూలాంశమని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు 7 శాతం వృద్ధితో 1,40,645 వాహనాల నుంచి 1,50,525 యూనిట్స్కు చేరింది. హీరో అమ్మకాలు 78 లక్షలు.. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 78,20,745 వాహనాలు విక్రయించింది. 2017–18లో అమ్మకాలు 75,87,130గా నమోదయ్యాయి. అటు సుజుకీ మోటార్సైకిల్ ఇండియా విక్రయాలు సుమారు 30 శాతం వృద్ధితో 5,74,711 యూనిట్స్ నుంచి 7,47,506కి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 12 శాతం వృద్ధితో 37.57 లక్షలకు పెరిగాయి. పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్’ (హెచ్ఎస్ఆర్పీ)ను వాహనాలకు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ ప్లేట్స్ వ్యయాన్ని కస్టమర్లపై మోపుతున్నట్లు వివరించింది. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధిక భద్రతా ప్లేట్ ధర రూ.689 వరకు ఉన్నందున ఈ మొత్తానికి ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఆల్టో 800 నుంచి ఎస్క్లాస్ వరకు అనేక కార్లను సంస్థ విక్రయిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ.2.67 లక్షలు–11.48 లక్షల వరకు ఉన్నాయి. -
అటూఇటుగా బైక్ల విక్రయాలు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి. ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్ 2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది. సోనాలికా ట్రాక్టర్ విక్రయాలు 12% పెరిగాయి గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్తో పోల్చితే 11.9% పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14% వృద్ధి చెందాయి. జీఎస్టీని తగ్గించాలి.. ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28% జీఎస్టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలూ ఉన్నాయని పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్టీ రేటును 18%కి తగ్గించాలని కోరారు. -
వాహన విక్రయాలు తగ్గాయి!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చిందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. డిసెంబర్లో హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ అమ్మకాలు కేవలం ఒక శాతం వృద్ది రేటుకే పరిమితం కాగా.. మహీంద్రా అండ్ మహీంద్ర, మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు ఏకంగా తగ్గుదలను నమోదుచేశాయి. ఎం అండ్ ఎం: పీవీ సేల్స్ 4% డౌన్ డిసెంబర్లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 15,091 యూనిట్లుగా నమోదైనట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రకటించింది. 2017లో ఇదే కాలానికి విక్రయించిన 15,543 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహన అమ్మకాల్లో సైతం 4 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. టాటా మోటార్స్: పీవీ విక్రయాలు 1 శాతం అప్ దేశీ విక్రయాల్లో 8%క్షీణత చోటుచేసుకుంది. 2018 డిసెంబర్లో 50,440 యూనిట్లు విక్రయించగా.. 2017 డిసెంబర్లో 54,627 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ప్యాసింజర్ వాహన విక్రయాలు డిసెంబర్లో 14,260 యూనిట్లు కాగా, 2017 డిసెంబర్లో ఈ సంఖ్య 14,180. హ్యుందాయ్: 4.6 శాతం వృద్ధి 2018 డిసెంబర్లో 42,093 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40,158 యూనిట్లతో పోలిస్తే 4.6 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రకటించింది. మారుతీ సుజుకీ: 1.3 శాతం తగ్గిన పీవీ సేల్స్ గతనెల ప్యాసింజర్ వాహన అమ్మకాలు 1,28,338 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 1.3 శాతం తగ్గుదల నమోదయింది. దేశీ అమ్మకాలు మాత్రం 1,21,479 యూనిట్లకు చేరుకుని 1.8 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ తెలిపింది. మిని కార్ విభాగంలో ఆల్టో 27,661 యూనిట్లు, వ్యాగన్ఆర్ 27,661 యూనిట్లు అమ్ముడవగా.. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, డిజైర్ అమ్మకాలు 3.8 శాతం తగ్గినట్లు తెలిపింది. -
మారుతీ విక్రయ అంచనాల్లో కోత
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10–12 శాతం రేంజ్లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా ఉండే విభాగంలో కొత్త మోడళ్లను అందించలేకపోవడం కూడా విక్రయాలపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరంలో వాహన విక్రయాలు తగ్గుతాయని, ఎన్నికల సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని చరిత్ర చెబుతోందని వివరించారు. ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు... డీలర్ల వద్ద నిల్వలను తగ్గించే క్రమంలో భాగం గా ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని భార్గవ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో కొత్త మోడల్ను మార్కె ట్లోకి తేనున్నామని, ఫలితంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ప్యాసింజర్ వాహన అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు ఈ ఏడాది నవంబర్లో నెమ్మదించాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో మొత్తం వాహన అమ్మకాలు 2,66,000 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 2,75,440 యూనిట్లుగా నమోద య్యాయి. ఏడాది ప్రాతిపదికన 3.43 శాతం తగ్గుదల చోటుచేసింది. జూలై తరువాత ఆగస్టులో మాత్రమే 1.55% అమ్మకాలు పెరుగగా.. ఆ తరువాత నుంచి మళ్లీ వరుసగా తగ్గుదలను నమోదుచేస్తూ వచ్చాయి. ఈ కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని డైరెక్టర్ జనరల్ మాథుర్ వ్యాఖ్యానించారు. అయితే, క్రూడ్ ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. పీవీ అమ్మకాల్లో నెమ్మది ఉన్నప్పటికీ.. మొత్తం వాహన అమ్మకాల్లో మాత్రం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అన్ని విభాగాల వాహన అమ్మకాలు 5.03 శాతం వృద్ధి చెంది 20,38,015 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 19,40,462 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఏప్రిల్–నవంబర్ కాలంలో కూడా పీవీ అమ్మకాలు 5 శాతం తగ్గగా.. వాణిజ్య వాహనాలు 31 శాతం, త్రిచక్ర వాహనాలు 21 శాతం, ద్విచక్ర వాహనాలు 10 శాతం వృద్ధి చెందాయి. మొత్తం వృద్ధి 11 శాతంగా ఉంది. నవంబర్ పీవీ అమ్మకాల గణాంకాలను కంపెనీల వారీగా పరిశీలిస్తే.. మహీంద్ర అండ్ మహీంద్రా 1.26 శాతం వృద్దితో 16,191 యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్ 3.26 క్షీణతతో 18,226 యూనిట్లను విక్రయించింది. తగ్గిన కార్లు.. పెరిగిన బైక్లు గతనెలలో మొత్తం కార్ల అమ్మకాలు 1,79,783 యూనిట్లు కాగా, అంతకుముందు ఇదే ఏడాదిలో 1,81,435 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మరోవైపు ద్విచక్ర వాహనాలు 7.15 శాతం పెరిగి 16,45,791 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం 15,36,015 యూనిట్లుగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 4.98 శాతం వృద్ధితో 5,36,193 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో 4.98 శాతం వృద్ధితో 2,05,259 యూనిట్లను విక్రయించింది. హోండా మోటార్ సైకిల్స్ అమ్మకాలు 14.97 శాతం తగ్గి 1,27,896 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో మొత్తం 5,21,542 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. -
విదేశీ ఆటోమొబైల్ కంపెనీలకు గడ్డుకాలం
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగం ఆటోమొబైల్ సంస్థలకు సంతోషాన్నివ్వలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం కోసం పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 17 ఆటోమొబైల్ సంస్థల్లో సగానికి పైగా కంపెనీల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు ఏప్రిల్–అక్టోబర్ కాలంలో తగ్గిపోవడం గమనార్హం. సియామ్ గణాంకాల ప్రకారం... అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వోక్స్వ్యాగన్, రెనో, నిస్సాన్, స్కోడాల విక్రయాలు తగ్గిన వాటిల్లో ఉన్నాయి. వోక్స్వ్యాగన్ విక్రయాలు ఏప్రిల్–అక్టోబర్ కాలంలో 24 శాతం తగ్గి 21,367 యూనిట్లుగా ఉన్నాయి. రెనో విక్రయాలు 27 శాతం క్షీణించి 47,064 యూనిట్లుగా ఉన్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా 22,905 వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది ఇదే కాలంతో చూస్తే 27 శాతం తక్కువ. స్కోడా ఆటో ఇండియా అమ్మకాలు 9,919 యూనిట్లుగా ఉండగా, ఇది 18 శాతం తక్కువ. ఫియట్ ఇండియా అమ్మకాలు సైతం 70 శాతం తగ్గి 481 యూనిట్లకు పరిమితం అయ్యాయి. భారత కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడంతో జనరల్ మోటార్స్ గతేడాది ఇక్కడ అమ్మకాలకు స్వస్తి చెప్పడం తెలిసిందే. ఇక దేశీయ సంస్థల్లో ఫోర్స్ మోటార్స్ అమ్మకాలు 17 శాతం, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ అమ్మకాలు 32 శాతం తగ్గాయి. మారుతి సుజుకీ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం 9 శాతం, హ్యుందాయ్ మోటార్స్ 4 శాతం, టాటా మోటార్స్ 26 శాతం, హోండా కార్స్ 3 శాతం చొప్పున అమ్మకాలు పెంచుకున్నాయి. -
హీరో మోటో లాభం 976 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఫలితాల పరంగా మెప్పించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.38 శాతం తగ్గి రూ.976.28 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. అమ్మకాల ఆదాయం మాత్రం రూ.9,091 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,010 కోట్లు, ఆదాయం రూ.8,371 కోట్లుగా ఉండటం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వ్యయాలు రూ.7,053 కోట్లుగా ఉంటే, తాజా సమీక్షా త్రైమాసికంలో అవి రూ.7,866 కోట్లకు ఎగశాయి. వాహన విక్రయాలు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 21,34,051 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 20,22,805 యూనిట్లతో పోలిస్తే వృద్ధి చెందాయి. పనితీరుపై హీరోమోటో చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ... హీరో మోటారు సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్ నిలకడగా ఉన్నట్టు చెప్పారు. దీంతో రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదు చేశామన్నారు. ఎక్స్ట్రీమ్ 200ఆర్ విడుదల ద్వారా ఖరీదైన మోటారు సైకిళ్ల విభాగంలోకి తిరిగి అడుగుపెట్టినట్టు చెప్పారు. రానున్న పండుగల సందర్భంగా ఎక్స్ట్రీమ్ 200ఆర్ తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘హీరో మోటోకార్ప్లో గట్టి ఆర్థిక నిర్మాణం, మా ఐకానిక్ బ్రాండ్లకు బలమైన డిమాండ్ నెలకొల్పాం. దీంతో ప్రతీ క్వార్టర్లోనూ వృద్ధి నమోదు చేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇది కొనసాగుతుంది. ధరల పరమైన సవాళ్లను అధిగమించి లాభదాయకమైన, స్థిరమైన వృద్ధి కొనసాగిస్తాం’’ అని పవన్ ముంజాల్ చెప్పారు. -
వాహన అమ్మకాలకు పెట్రో సెగ!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబరులో నెమ్మదించాయి. పలు దిగ్గజ ఆటో కంపెనీల ప్యాసింజర్ వాహన అమ్మకాలు క్షీణతను నమోదుచేయగా.. మరికొన్ని కంపెనీల విక్రయాలు కేవలం ఒక్క అంకె వృద్ధి రేటుకే పరిమితమైపోయాయి. ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇదే సమయంలో పలు చోట్ల లోటు వర్షపాతం నమోదుకావడం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఉండడం వల్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే కొనసాగాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ‘సెప్టెంబరు విక్రయాలు స్తబ్ధుగా ఉన్నాయి. క్రూడ్ ధరలు పెరగడం, వర్షపాతం తగ్గడం వంటి ప్రతికూల అంశాలతో వినియోగదారులు వెనక్కు తగ్గారు.’ అని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వాడెరా అన్నారు. అయితే రానున్నది పండుగ సీజన్ కావడం వల్ల అమ్మకాలు ఊపందుకోనున్నాయని భావిస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. -
మిశ్రమంగా ఆటో అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థల వాహనాల విక్రయాలు ఆగస్టులో మిశ్రమంగా నమోదయ్యాయి. దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ అమ్మకాలు తగ్గగా.. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల విక్రయాలు పెరిగాయి. కేరళలో వరదల పరిస్థితి వాహనాల డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆగస్టులో దేశీయంగా మారుతీ ప్యాసింజర్ వాహనాల (పీవీ) 2.8 శాతం క్షీణించి 1,52,000 నుంచి 1,47,700 యూనిట్లకు తగ్గాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా దాదాపు 2.8% 47,103 యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఆగస్టులో హ్యుందాయ్ 45,801 కార్లను విక్రయించింది. టాటా మోటార్స్ వాహనాల అమ్మకాలు మాత్రం 28 శాతం పెరిగి 14,340 యూనిట్ల నుంచి 18,420 యూనిట్లకు, మహీంద్రా అండ్ మహీంద్రా ఎంఅండ్ఎం విక్రయాలు 15 శాతం వృద్ధితో 39,615 నుంచి 45,373 యూనిట్లకు చేరాయి. ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 7,777 యూనిట్ల నుంచి 8,042 పెరగ్గా, హోండా కార్స్ ఇండియా ఆగస్టులో 17,020 కార్లను విక్రయించింది. ద్విచక్ర వాహనాల విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2,70,544 నుంచి 2,75,688కి చేరాయి. హీరో మోటోకార్ప్ విక్రయాలు 0.92 శాతం పెరిగాయి. మొత్తం 6,85,047 మోటార్సైకిళ్లు, స్కూటర్లు విక్రయించింది. గతేడాది ఆగస్టులో సంస్థ మొత్తం 6,78,797 యూనిట్లు విక్రయించింది. అశోక్లేలాండ్ అమ్మకాలు 27 % అప్ హిందూజా గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ వాహన అమ్మకాలు 27% పెరిగాయి. ఆగస్టులో 17,386 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 13,637 యూనిట్లను విక్రయించి ంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో 24 శాతం వృద్ధిరేటును సాధించింది. -
జూలైలో వాహనాలకు బ్రేకులు
న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో అమ్మకాలు క్షీణించాయి. గతేడాది జూలైలో జీఎస్టీ అమలు కారణంగా భారీ విక్రయాలు నమోదు కావటంతో ఈ సారి అప్పటితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం జూలైలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 2,90,960 యూనిట్లకు తగ్గాయి. గతేడాది జూలైలో అమ్మకాలు 2,99,066 యూనిట్లు. దేశీయంగా కార్ల అమ్మకాలు కూడా గత నెల స్వల్పంగా క్షీణించాయి. 2017 జూలైలో 1,92,845 కార్లు అమ్ముడవగా గత నెల 1,91,979కి తగ్గాయి. ‘జీఎస్టీ అమలు కారణంగా గతేడాది జూలైలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఒక్కసారిగా ఎగిశాయి. దానితో పోలిస్తే గత నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ అన్ని విభాగాలు పుంజుకోవడంతో పరిశ్రమ సంతృప్తిగానే ఉంది‘ అని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. ఏప్రిల్–జూలై మధ్య కాలంలో దేశీయంగా కోటి వాహనాల ఉత్పత్తి జరిగిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 93 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 17% అధికమని వివరించారు. చాలా సంవత్సరాల తర్వాత పరిశ్రమలోని విభాగాలన్నీ వృద్ధి కనపరుస్తున్నాయని, మరో రెండేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగగలదని ఆశిస్తున్నట్లు సేన్ చెప్పారు. జీఎస్టీ కారణంగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో ఎగిసిన అమ్మకాలతో పోలిస్తే రాబోయే రెండు నెలల్లో విక్రయాలు మందగించినట్లు కనిపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అగ్రస్థానంలో మారుతీ సుజుకీ... విక్రయాలు స్వల్పంగా తగ్గినప్పటికీ 1,52,427 వాహనాల అమ్మకాలతో జూలైలో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ అగ్రస్థానంలో నిల్చింది. హ్యుందాయ్ అమ్మకాలు 1.1% పెరిగి 43,481 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా కార్స్ ఇండియా 17% వృద్ధితో (19,970 వాహనాలు) మూడో స్థానానికి చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు ఆరు శాతం క్షీణించి 19,739 యూనిట్లకు పరిమితమయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 16% పెరిగి 19,410 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు జూలైలో 8% పెరిగి 18,17,077 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఈ సంఖ్య 16,79,876 యూనిట్లు. హీరో మోటోకార్ప్ అమ్మ కాలు 12% పెరిగి 6,10,197 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ విక్రయాలు 1,62,987 నుంచి 1,68,075 యూనిట్లకు చేరాయి. బజాజ్ ఆటో సంస్థ మోటార్ సైకిల్ అమ్మకాలు 22% వృద్ధితో 2,01,433 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్ మోటార్స్ 1,12,238 వాహనాలను (25% వృద్ధి) విక్రయించింది. -
మిశ్రమంగా జూలై వాహన విక్రయాలు
వాహన విక్రయాలు ఈ ఏడాది జూలైలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీల విక్రయాలు స్వల్పంగానే పెరిగాయి. గత ఏడాది జూలైలో హై బేస్ (అమ్మకాలు అధికంగా ఉండటం) కారణంగా ఈ ఏడాది జూలైలో పలు కంపెనీల వాహన విక్రయాలు అంతంతమాత్రం వృద్ధినే నమోదు చేశాయని నిపుణులంటున్నారు. గత నెలలో ట్రాన్స్పోర్టర్ల సమ్మె కారణంగా ఫోర్డ్, మహీంద్రా కంపెనీల ప్రయాణీకుల వాహనాలు తగ్గాయి. కొత్త అమేజ్ మోడల్ కారణంగా హోండా కార్స్ అమ్మకాలు పుంజుకున్నాయి. వాహన దారుల సమ్మె, రిటైల్ అమ్మకాలు మందగించడం వంటి సమస్యలున్నప్పటికీ, వాణిజ్య వాహనాలకు డిమాండ్ కొనసాగుతోందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వధేరా చెప్పారు. పండుగల సీజన్లోకి ప్రవేశించామని, కొనుగోలు సెంటిమెంట్ మరింతగా పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహీంద్రా మారజో వాహనాన్ని వచ్చే నెలలో మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. వివరాలు.... మారుతీ కార్ల ధరలు పెంపు... మారుతీ సుజుకీ కంపెనీ తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. కమోడిటీల ధరలు పెరగడం, కరెన్సీ ఒడిదుడుకులు, ఇంధనాల ధరలు పెరుగుతుండటం రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయని, దీంతో ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఏ మోడళ్ల ధరలను ఎంత మేర పెంచాలనే విషయమై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇవే కారణాలతో ధరలు పెంచనున్నామని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రోడ్లపై కార్ల జోరు!
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ♦ దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి. ♦ ‘జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియా మ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. ♦ యుటిలిటీ వెహికల్స్, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి. ♦ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి. ♦ మోటార్ సైకిల్ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి. ♦ స్కూటర్ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్సైకిల్ దేశీ స్కూటర్ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్ మోటార్స్ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి. ♦ వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి. -
మారుతీ, మహీంద్రా, టాటా జోరు
న్యూఢిల్లీ: మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, హోండా కార్స్ కంపెనీలు జూన్ నెల వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధించాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ మొత్తం వాహన విక్రయాల్లో 36.3 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 1,44,981 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 1,06,394 యూనిట్లుగా ఉన్నాయి. దేశీ విక్రయాలు ఏకంగా 45.5% వృద్ధితో 93,263 యూనిట్ల నుంచి 1,35,662 యూనిట్లకు ఎగశాయి.కంపెనీ ఎగుమతులు మాత్రం 29% క్షీణించాయి. ఇవి 13,131 యూనిట్ల నుంచి 9,319 యూనిట్లకు తగ్గాయి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం వాహన అమ్మకాల్లో 26% వృద్ధి కనపర్చింది. ఇవి 35,759 యూనిట్ల నుంచి 45,155 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ వాహన విక్రయాలు 23% వృద్ధితో 33,904 యూనిట్ల నుంచి 41, 689 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతుల్లోనూ 87% వృద్ధి కనిపించింది. ఇవి 1,855 యూనిట్ల నుంచి 3,466 యూనిట్లకు చేరాయి. ఇక టాటా మోటార్స్ దేశీ వాహన విక్రయాలు 54% వృద్ధితో 36,836 యూనిట్ల నుంచి 56,773 యూనిట్లకు పెరిగాయి. దేశీ వాణిజ్య వాహన అమ్మకాలు 50 శాతం వృద్ధి చెందాయి. ఇవి 25,660 యూనిట్ల నుంచి 38,560 యూనిట్లకు ఎగశాయి. దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 63% వృద్ధితో 18,213 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు కూడా 50% వృద్ధితో 3,504 యూనిట్ల నుంచి 5,246 యూనిట్లకు చేరాయి. హోండా కార్స్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 37.5% వృద్ధి తో 12,804 యూనిట్ల నుంచి 17,602 యూనిట్లకు పెరిగాయి. ఐషర్ మోటార్స్కు చెందిన టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం వాహన విక్రయాల్లో 18% వృద్ధి కనిపించింది. ఇవి 63,160 యూనిట్ల నుంచి 74,477 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 21% వృద్ధితో 37,562 యూనిట్ల నుంచి 45,371 యూనిట్లకు చేరాయి. -
ప్యాసింజర్ జోరు..
న్యూఢిల్లీ: భారత్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో 7.5 శాతంమేర పెరిగాయి. యుటిలిటీ వెహికల్స్, కార్లు, వ్యాన్ల అమ్మకాల్లో బలమైన డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ఇండియన్ ఆటోమొబైల్ తయారీ సంఘం (సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. ►ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు గత నెలలో 7.5 శాతం వృద్ధితో 2,98,504 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,77,683 యూనిట్లుగా ఉన్నాయి. ►దేశీ కార్ల అమ్మకాల్లో 4.89 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 1,90,854 యూనిట్ల నుంచి 2,00,183 యూనిట్లకు ఎగశాయి. ►యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు 11.92 శాతం పెరుగుదలతో 79,136 యూనిట్లకు, వ్యాన్ల అమ్మకాలు 18.99 శాతం వృద్ధితో 19,185 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు డీలా.. ప్యాసింజర్ వాహన విభాగంలోని కార్లు, యుటిలిటీ వెహికల్స్, వ్యాన్లు అన్ని విభాగాల విక్రయాల్లోనూ జోరు కనిపించిందని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం శుభారంభానిచ్చింది. మిగిలి ఉన్న నెలల్లోనూ ఇదే ట్రెండ్ను అంచనా వేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే ఎగుమతుల్లో మాత్రం క్షీణత నమోదయ్యిందని తెలిపారు. గతేడాది ఏప్రిల్లో 60,538 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్ వాహన ఎగుమతులు ఈ ఏప్రిల్లో 15.89 శాతం క్షీణతతో 50,921 యూనిట్లకు తగ్గాయని వివరించారు. మారుతీ అమ్మకాలు@ 1,63,434 యూనిట్లు మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 13.43 శాతం పెరుగుదలతో 1,63,434 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 4.42 శాతం వృద్ధితో 46,735 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 12.94 శాతం వృద్ధితో 21,826 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ విక్రయాలు 36.19 శాతం వృద్ధితో 19,157 యూనిట్లకు ఎగశాయి. టూవీలర్ స్పీడ్.. టూవీలర్ అమ్మకాలు 16.92 శాతం వృద్ధితో 19,58,241 యూనిట్లకు చేరాయి. మోటార్సైకిల్ విక్రయాల్లో 19.38 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 12,29,526 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ దేశీ మోటార్సైకిల్ అమ్మకాలు 16.44 శాతం వృద్ధితో 6,07,720 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్సైకిల్ విక్రయాలు 2,12,292 యూనిట్లుగా, బజాజ్ ఆటో మోటార్సైకిల్ విక్రయాలు 2,00,742 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విభాగానికి వస్తే.. మార్కెట్ లీడర్ హోండా దేశీ స్కూటర్ల అమ్మకాలు 12.98 శాతం వృద్ధితో 4,23,532 యూనిట్లకు పెరిగాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు ఏకంగా 75.95 శాతం వృద్ధితో 72,993 యూనిట్లకు ఎగశాయి. -
వాహన రంగం బోణీ.. భేష్!
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం వాహన పరిశ్రమకు శుభారంభాన్నిచ్చింది. ఆటోమొబైల్ కంపెనీలు వాటి ఏప్రిల్ నెల విక్రయాల్లో మంచి వృద్ధిని నమోదుచేశాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ఏకంగా రెండంకెల వృద్ధి సాధించాయి. హ్యుందాయ్ అమ్మకాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా... ఫోర్డ్ ఇండియా విక్రయాల్లో మాత్రం క్షీణత కనిపించింది. ♦ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) దేశీ వాహన అమ్మకాలు ఏప్రిల్ నెలలో 1,64,978 యూనిట్లు. గతేడాది ఇదే నెలలోని 1,44,492 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 14.2 శాతం వృద్ధి నమోదయ్యింది. కాంపాక్ట్ విభాగం కార్ల బలమైన అమ్మకాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) దేశీ వాహన విక్రయాలు ఏప్రిల్లో 19.34 శాతం వృద్ధితో 37,889 యూనిట్ల నుంచి 45,217 యూనిట్లకు ఎగశాయి. ‘2017–18 ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని సాధించాం. ఇప్పుడు 2018–19 ఆర్థిక సంవత్సరాన్ని కూడా బలమైన విక్రయాలతో ప్రారంభించాం. అటు ప్యాసింజర్, ఇటు కమర్షియల్ రెండు వాహన విభాగాల్లోనూ అమ్మకాలు బాగున్నాయి’ అని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వదేరా తెలిపారు. ♦ టాటా మోటార్స్ దేశీ వాహన విక్రయాలు ఏకంగా 86 శాతం పెరిగాయి. ఇవి 28,844 యూనిట్ల నుంచి 53,511 యూనిట్లకు ఎగశాయి. అలాగే కంపెనీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 34 శాతం పెరిగాయి. ఇవి 12,827 యూనిట్ల నుంచి 17,235 యూనిట్లకు చేరాయి. మార్కెట్లో సవాళ్లున్నప్పటికీ టియాగో, టిగోర్, నెక్సాన్, హెక్సా వంటి మోడళ్లకున్న బలమైన డిమాండ్ కారణంగా ఏప్రిల్లో ఈ అమ్మకాలు సాధించగలిగామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీఖ్ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ వాహన విక్రయాల్లో 4.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 44,758 యూనిట్ల నుంచి 46,735 యూనిట్లకు పెరిగాయి. ♦ ఫోర్డ్ ఇండియా దేశీ వాహన అమ్మకాలు మాత్రం 2.49 శాతం క్షీణతతో 7,618 యూనిట్ల నుంచి 7,428 యూనిట్లకు తగ్గాయి. ♦ టూవీలర్ల విభాగంలో టీవీఎస్ మోటార్ తన మొత్తం వాహన అమ్మకాల్లో 24 శాతం వృద్ధిని ప్రకటించింది. ఇవి 3,04,795 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ దేశీ టూవీలర్ల విక్రయాలు 17.6 శాతం వృద్ధితో 2,05,522 యూనిట్ల నుంచి 2,41,604 యూనిట్లకు చేరాయి. -
ప్యాసింజర్ వాహన విక్రయాల రికార్డ్..
న్యూఢిల్లీ: భారత్లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 7.89 శాతం వృద్ధితో 33 లక్షల యూనిట్ల మార్క్ దగ్గరకు చేరాయి. చిన్న చిన్న పట్టణాల నుంచి డిమాండ్ పెరగడం, యుటిలిటీ వాహనాల పాపులారిటీ దీనికి ప్రధాన కారణం. ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య ‘సియామ్’ తాజా గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు రికార్డ్ స్థాయిలో 32,87,965 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 30,47,582 యూనిట్లుగా ఉన్నాయి. ♦ దేశీ కార్ల విక్రయాలు 3.33 శాతం వృద్ధితో 21,03,847 యూనిట్ల నుంచి 21,73,950 యూనిట్లకు పెరిగాయి. ♦ యుటిలిటీ వెహికల్స్ అమ్మకాల్లో 20.97 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 7,61,998 యూనిట్ల నుంచి 9,21,780 యూనిట్లకు ఎగశాయి. ♦ అయితే ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు మాత్రం 1.51 శాతం క్షీణతతో 7,47,287 యూనిట్లకు తగ్గాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇవి 7,58,727 యూనిట్లుగా ఉన్నాయి. మంచి పనితీరుతో ముగింపు గత ఆర్థిక సంవత్సరాన్ని మంచి పనితీరుతోనే ముగించామని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. ప్యాసింజర్ బస్సుల విభాగం మినహా దాదాపు ప్రతి విభాగంలోనూ సానుకూల వృద్ధి నమోదు అయ్యిందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమకు డీమోనిటైజేషన్, బీఎస్–3 నుంచి బీఎస్–4 ప్రమాణాలకు మారడం, జీఎస్టీ అమలు రూపంలో సవాళ్లు ఎదురయ్యాయని వివరించారు. గత 3–4 ఏళ్ల నుంచి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో దాదాపు 50 శాతం వాటాను ఆక్రమిస్తున్న టాప్–20 పట్టణాల్లో వృద్ధి నెమ్మదించిందని గుర్తుచేశారు. మారుతీ విక్రయాలు... 16,43,467 మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 16,43,467 యూనిట్లుగా నమోదయ్యాయి. 13.84 శాతం వృద్ధి కనిపించింది. మారుతీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 5.21 శాతం వృద్ధితో 5,36,241 యూనిట్లకు పెరిగాయి. -
కారు, బైక్ రయ్.. ట్రాక్టర్ స్పీడ్
ముంబై: వాహన విక్రయాల్లో మార్చి నెలలో మొత్తంగా చూస్తే మంచి గణాంకాలే నమోదయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్ అమ్మకాలు దూసుకెళ్లగా... హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. అయితే టయోటా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. ద్విచక్ర వాహన కంపెనీలైన టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి. హ్యుందాయ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం విక్రయాలు 8.8 శాతం వృద్ధితో 60,507 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ గతేడాది మార్చిలో 55,614 యూనిట్లను విక్రయించింది. ఇక దేశీ విక్రయాలు 7.3 శాతం పెరిగాయి. ఇవి 44,757 యూనిట్ల నుంచి 48,009 యూనిట్లకు ఎగిశాయి. టయోటా: టయోటా కిర్లోస్కర్ దేశీ విక్రయాలు 9.11% క్షీణతతో 12,539 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13,796 యూనిట్లుగా ఉన్నాయి. ఫోర్డ్ ఇండియా: ఫోర్డ్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 11.06% వృద్ధి చెందాయి. 24,832 యూనిట్ల నుంచి 27,580 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ దేశీ అమ్మకాలు 9,016 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలోని 8,700 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 3.63 శాతం వృద్ధి కనిపించింది. హోండా కార్స్: హోండా కార్స్ ఇండియా దేశీ విక్రయాల్లో ఏకంగా 28.36 శాతం క్షీణత నమోదయ్యింది. 13,574 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 18,950 యూనిట్లు రికార్డయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా: మొత్తం విక్రయాలు 10% వృద్ధి చెందాయి. ఇవి 56,202 యూనిట్ల నుంచి 62,077 యూనిట్లకు పెరిగాయి. దేశీ విక్రయాలు కూడా 10% వృద్ధితో 53,493 యూనిట్ల నుంచి 58,653 యూనిట్లకు చేరాయి. మహీంద్రా ట్రాక్టర్: మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు 46.23% వృద్ధితో 28,277 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో 19,337 యూనిట్లను విక్రయించింది. దేశీ అమ్మకాలు 50% వృద్ధితో 17,973 యూనిట్ల నుంచి 26,958 యూనిట్లకు పెరిగాయి. 2017–18లో మొత్తం విక్రయాలు 20.68% పెరుగుదలతో 3,17,383 యూనిట్లకు చేరాయి. అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధితో 15,277 యూనిట్ల నుంచి 17,057 యూనిట్లకు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విక్రయాలు 21 శాతం వృద్ధితో 1,74,873 యూనిట్లకు చేరాయి. 2016–17లో అమ్మకాలు 1,45,085 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహన కంపెనీలు... టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాలు 27 శాతం వృద్ధితో 3,26,659 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 2,56,341 యూనిట్లను విక్రయించింది. మొత్తం టూవీలర్ అమ్మకాలు 25.8 శాతం ఎగిశాయి. ఇవి 2,50,979 యూనిట్ల నుంచి 3,15,765 యూనిట్లకు చేరాయి. సుజుకీ మోటార్సైకిల్: సుజుకీ మోటార్సైకిల్ ఇండియా విక్రయాలు 23.2% వృద్ధితో 51,858 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో: బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 23 శాతం వృద్ధితో 2,72,197 యూనిట్ల నుంచి 3,34,348 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,69,279 యూనిట్ల నుంచి 2,03,600 యూనిట్లకు పెరిగాయి. హెచ్ఎంఎస్ఐ: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విక్రయాలు 20.3 శాతం వృద్ధితో 4,40,499 యూనిట్లకు పెరిగాయి. సొనాలికా లక్ష ట్రాక్టర్ల విక్రయం సొనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ట్రాక్టర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 ఆర్థిక సంవత్సరంలో 50,853 ట్రాక్టర్లను విక్రయించామని.. 2018 క్యూ4లో 56 శాతం వృద్ధిని నమోదు చేశామని ఐటీఎల్ ఈడీ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. -
8 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు!
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఫిబ్రవరి నెలలో 7.77 శాతం వృద్ధి నమోదయ్యింది. యుటిలిటీ వాహనాల బలమైన డిమాండ్ దీనికి ప్రధాన కారణం. సియామ్ గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 2,55,470 యూనిట్ల నుంచి 2,75,329 యూనిట్లకు పెరిగాయి. అలాగే దేశీ కార్ల అమ్మకాలు 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,72,737 యూనిట్ల నుంచి 1,79,122 యూనిట్లకు ఎగశాయి. ఇక యుటిలిటీ వాహన అమ్మకాలు 21.82 శాతం వృద్ధితో 65,877 యూనిట్ల నుంచి 80,254 యూనిట్లకు పెరిగాయి. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో పీవీ విక్రయాలు 8.04 శాతం, వాణిజ్య వాహన అమ్మకాలు 19.3 శాతం, త్రీవీలర్స్ విక్రయాలు 19.11 శాతం, టూవీలర్స్ అమ్మకాలు 14.47 శాతం ఎగశాయి. ♦ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ అమ్మకాలు 13.31 శాతం వృద్ధితో 1,36,648 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 5.15 శాతం వృద్ధితో 44,505 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 8.43 శాతం వృద్ధితో 22,339 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 43.45 శాతం వృద్ధితో 20,022 యూనిట్లకు ఎగశాయి. ♦ మొత్తం టూవీలర్ విక్రయాలు 23.77 శాతం వృద్ధి చెందాయి. ఇవి 13,62,043 యూనిట్ల నుంచి 16,85,814 యూనిట్లకు చేరాయి. ♦ మోటార్సైకిల్ అమ్మకాలు 26.48 శాతం పెరిగాయి. ఇవి 10,53,230 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 5,35,232 యూనిట్లకు ఎగశాయి. ♦ స్కూటర్ విభాగానికి వస్తే.. మార్కెట్ లీడర్ హోండా స్కూటర్ అండ్ మోటార్సైకిల్ ఇండియా దేశీ విక్రయాలు 30.1 శాతం వృద్ధి చెందాయి. ఇవి 3,25,204 యూనిట్లుగా నమోదయ్యాయి. ♦ వాణిజ్య వాహన అమ్మకాలు 31.13 శాతం వృద్ధితో 87,777 యూనిట్లకు ఎగశాయి. ‘ప్యాసింజర్ వెహికల్స్, టూవీలర్స్ సహా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు పెరుగుతున్నాయి. అయితే కేవలం హెవీ బస్సుల విభాగం దీనికి మినహాయింపు. దీని గురించే మేం ఆందోళన చెందుతున్నాం’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ వినోద్ మాథూర్ తెలిపారు. టూవీలర్ విభాగంలో మోటార్సైకిల్స్ కేటగిరీ మంచి పనితీరు కనబరుస్తోందని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విక్రయాలు తొలిసారి 2 కోట్ల యూనిట్లను అధిగమించొచ్చని అంచనా వేశారు. -
ఫిబ్రవరిలో కారు జోరు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వాటి ఫిబ్రవరి నెల దేశీ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని ప్రకటించాయి. బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్ వంటి టూవీలర్ కంపెనీల వాహన అమ్మకాల్లోనూ బలమైన వృద్ధి కనిపించింది. ►మారుతీ దేశీ వాహన అమ్మకాలు 14.2 శాతం వృద్ధితో 1,37,900 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ మొత్తం వాహన అమ్మకాలు 15 శాతం వృద్ధితో 1,30,280 యూనిట్ల నుంచి 1,49,824 యూనిట్లకు చేరాయి. ►మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ విక్రయాలు 20 శాతం పెరుగుదలతో 40,526 యూనిట్ల నుంచి 48,473 యూనిట్లకు చేరాయి. ►వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాల్లోని బలమైన విక్రయాల కారణంగా టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 38 శాతం వృద్ధి చెందాయి. ఇవి 58,993 యూనిట్లుగా నమోదయ్యాయి. టియాగో, టిగోర్, నెక్సాన్, హెక్జా వంటి కొత్త ప్రొడక్టుల డిమాండ్ వల్ల 45 శాతం వృద్ధిని సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 45 శాతం వృద్ధితో 12,272 యూనిట్ల నుంచి 17,771 యూనిట్లకు పెరిగాయి. ►ఫోర్డ్ ఇండియా మొత్తం విక్రయాలు స్వల్పంగా తగ్గి 23,965 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అయితే దేశీ విక్రయాలు మాత్రం 8.43 శాతం వృద్ధితో 8,338 యూనిట్ల నుంచి 9,041 యూనిట్లకు పెరిగాయి. ►టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ఇవి 11,864 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాల జోరు వాణిజ్య వాహన విక్రయాలకు వస్తే.. హిందూజా గ్రూప్ అశోక లేలాండ్ మొత్తం విక్రయాలు 29 శాతం పెరిగాయి. ఇవి 18,181 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే మహీంద్రా వాణిజ్య వాహన అమ్మకాలు 28 శాతం వృద్ధితో 16,383 యూనిట్ల నుంచి 20,946 యూనిట్లకు పెరిగాయి. ‘స్థిరమైన డిమాండ్ కారణంగా అటు పర్సనల్, ఇటు కమర్షియల్ రెండు వాహన విభాగాల్లోనూ మంచి విక్రయాలను సాధించగలిగాం. ఇదే ట్రెండ్ మార్చిలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా తెలిపారు. టాటా మోటార్స్ దేశీ వాణిజ్య వాహన విక్రయాలు 36 % వృద్ధితో 30,407 యూనిట్ల నుంచి 41,222 యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ రయ్..రయ్.. టూవీలర్ వాహన విభాగంలోనూ బలమైన వృద్ధి నమోదయ్యింది. బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 31 శాతం వృద్ధితో 2,73,513 యూనిట్ల నుంచి 3,57,883 యూనిట్లకు పెరిగాయి. దేశీ అమ్మకాలు 35 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,59,109 యూనిట్ల నుంచి 2,14,023 యూనిట్లకు పెరిగాయి. ఐషర్ మోటార్స్కు చెందిన టూవీలర్ విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 25 శాతం వృద్ధితో 73,077 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 58,439 యూనిట్లను విక్రయించింది. రెనో డస్టర్ ధర తగ్గింది.. ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ఎస్యూవీ ‘డస్టర్’ ధరను తగ్గించింది. ధర తగ్గింపు రూ.29,746– రూ.1,00,761 శ్రేణిలో ఉంటుందని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో ఇప్పుడు డస్టర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.95 లక్షలు నుంచి ప్రారంభమౌతోంది. ఇక దీని గరిష్ట ధర రూ.9.95 లక్షలుగా ఉంది. కాగా ఇదివరకు పెట్రోల్ వేరియంట్ ధర శ్రేణి రూ.8.5 లక్షలు– రూ.10.24 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని ప్రస్తుత ధర రూ.8.95 లక్షలు– 12.79 లక్షల మధ్యలో ఉంది. ఇదివరకు ఈ వేరియంట్ ధర శ్రేణి రూ.9.45 లక్షలు–13.79 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్షోరూమ్వి. -
జనవరిలో ప్యాసింజర్ స్పీడ్..
గ్రేటర్ నోయిడా: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన జనవరి నెలలో 7.57 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 2,65,389 యూనిట్ల నుంచి 2,85,477 యూనిట్లకు పెరిగాయి. దీనికి యుటిలిటీ వాహనాల బలమైన డిమాండ్ ప్రధాన కారణం. అయితే కార్ల విక్రయాల్లో 1.25 శాతం క్షీణత కనిపించింది. ఇవి 1,86,596 యూనిట్ల నుంచి 1,84,264 యూనిట్లకు తగ్గాయి. యుటిలిటీ వాహన (యూవీ) అమ్మకాలు ఏకంగా 37.88 శాతం వృద్ధితో 62,263 యూనిట్ల నుంచి 85,850 యూనిట్లకు ఎగిశాయి. నెలవారీ విక్రయాల పరంగా చూస్తే ఇది రెండో గరిష్ట స్థాయి. గతేడాది జూలైలో యుటిలిటీ వాహన విక్రయాలు అత్యధికంగా 86,874 యూనిట్లుగా నమోదయ్యాయి. సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి అంచనాలకు అనుగుణంగానే ఉందని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. యుటిలిటీ విభాగపు జోరు కొనసాగుతోందన్నారు. అయితే కారు సెగ్మెంట్లో విక్రయాలు స్థిరంగా ఉన్నాయని, దీనికి ఎంట్రీ లెవెల్ విభాగంలో కొత్త ఆవిష్కరణలు లేకపోవడం, కస్టమర్లు క్రాస్ఓవర్స్, కాంపాక్ట్ ఎస్యూవీల వైపు మళ్లడం వంటివి కారణంగా పేర్కొన్నారు. మోటార్సైకిల్స్, స్కూటర్లకు గ్రామీణ, పట్టణ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉందని తెలిపారు. మారుతీ విక్రయాలు 4 శాతం అప్ దేశీ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 4.05 శాతం వృద్ధితో 1,39,189 యూనిట్లకు పెరిగాయి. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాల్లో 8.31 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 45,508 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ అమ్మకాలు వరుసగా 17.73% వృద్ధితో 23,656 యూనిట్లకు, 48.58% వృద్ధితో 21,872 యూనిట్లకు ఎగశాయి. టూవీలర్ జోరు: జనవరిలో మొత్తం టూవీలర్ విక్రయాలు 33.43 శాతం వృద్ధితో 12,62,140 యూనిట్ల నుంచి 16,84,066 యూనిట్లకు పెరిగాయి. మోటార్సైకిల్ అమ్మకాల్లో 28.64 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 10,54,062 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ దేశీ మోటార్సైకిల్ అమ్మకాలు 24.39 శాతం వృద్ధితో 4,36,771 యూనిట్ల నుంచి 5,43,325 యూనిట్లకు పెరిగాయి. ఇక హోండా స్కూటర్ అండ్ మోటార్సైకిల్ (హెచ్ఎంఎస్ఐ) విక్రయాల్లో 21.82 శాతం వృద్ధి, బజాజ్ ఆటో విక్రయాల్లో 36.14 శాతం వృద్ధి కనిపించింది. ఇక టీవీఎస్ మోటార్స్ అమ్మకాల్లో 25.91 శాతం వృద్ది, హీరో మోటొకార్ప్ విక్రయాల్లో 117.63 శాతం వృద్ధి కనిపించింది. ఇక వాణిజ్య వాహన అమ్మకాలు 39.73 శాతం వృద్ధితో 85,660 యూనిట్లకు పెరిగాయి. వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) జర్నీకి వేగంగా సిద్ధమౌతోందని సియామ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సవాళ్ల పరిష్కారానికి ఒక దీర్ఘకాలిక పాలసీని ఆవిష్కరించాలని కోరింది. అలాగే ఈవీలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేసింది. దీనివల్ల అందుబాటు ధరలో ఈవీలు కస్టమర్లకు లభ్యమౌతాయని పేర్కొంది. ‘ఆటో ఎక్స్పోలో వివిధ కంపెనీలు పలు విభాగాల్లో కాన్సెప్ట్ వెహికల్స్ను మాత్రమే కాకుండా 28 వరకు మార్కెట్–రెడీ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఆవిష్కరించాయి. ఇందులో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేలాండ్, లోహియా, జేబీఎం వంటి పలు కంపెనీల వెహికల్స్ ఉన్నాయి. వాహన పరిశ్రమ ఈవీలపై ఏ స్థాయిలో దృష్టి కేంద్రీకరించిందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు’ అని విష్ణు మాథూర్ పేర్కొన్నారు. -
కొన్నింటికే విక్రయాల పండుగ
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు డిసెంబర్లో మిశ్రమంగా నమోదయ్యాయి. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సహా హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) వాహన అమ్మకాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఇవి రెండంకెల వృద్ధితో 2017కి బై బై చెప్పాయి. మరొకవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదు కాగా, మహీంద్రా(ఎంఅండ్ ఎం) ప్యాసింజర్ అమ్మకాల్లో క్షీణత కనిపించింది. మారుతీ దేశీ విక్రయాలు 12.1% వృద్ధితో 1,06,414 యూనిట్ల నుంచి 1,19,286 యూనిట్లకు ఎగశాయి. స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి కార్లకు అధిక డిమాండ్ దీనికి కారణం. హెచ్సీఐఎల్ దేశీ అమ్మకాలు 26% మేర పెరిగాయి. 10,071 యూనిట్ల నుంచి 12,642 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ అమ్మకాలు 40,057 యూనిట్ల నుంచి 40,158 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. ఏడాది మొత్తంగా చూస్తే కంపెనీ దేశీ విక్రయాల్లో 5.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 5,00,539 యూనిట్ల నుంచి 5,27,320 యూనిట్లకు ఎగశాయి. స్కార్పియో, ఎక్స్యూవీ 500, బొలెరో, వెరిటో, జైలో సహా మహీంద్రా ప్యాసింజర్ వాహన విక్రయాలు 7% క్షీణించాయి. 16,799 యూనిట్ల నుంచి 15,543 యూనిట్లకు తగ్గాయి. అయితే దేశీ విక్రయాలు 7% వృద్ధితో 34,411 యూనిట్లతో 36,979 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ దేశీ వాహన విక్రయాలు వృ/క్షీ 2017 2016 మారుతీ సుజుకీ 1,19,286 1,06,414 12 హోండా కార్స్ 12,642 10,071 26 హ్యుందాయ్ 40,158 40,057 –– మహీంద్రా 36,979 34,411 7 -
అన్ని కార్లూ... రయ్ రయ్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ తర్వాత కూడా వాహన అమ్మకాల్లో స్పీడ్ తగ్గలేదు. కార్ల కంపెనీల నవంబర్ నెల విక్రయాల్లో ఏకంగా రెండంకెల వృద్ధి నమోదయింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా, హోండా వంటి పలు కంపెనీలు చక్కని గణాంకాలు ప్రకటించాయి. రానున్న నెలల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని కంపెనీలు ధీమా వ్యక్తం చేశాయి. వాహన కంపెనీల దేశీ విక్రయాలను ఒకసారి పరిశీలిస్తే.. ♦ దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీ విక్రయాలు 15% ఎగిశాయి. ఇవి 1,26,325 యూనిట్ల నుంచి 1,45,300 యూనిట్లకు పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన అమ్మకాలు 10 శాతం వృద్ధితో 44,008 యూనిట్లకు పెరిగాయి. నెక్స్ట్జెనరేషన్ వెర్నా, గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20, క్రెటా వంటి మోడళ్లకు అధిక డిమాండ్తో ఈ వృద్ధి సాధ్యమైందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ♦ హోండా కార్స్ ఇండియా విక్రయాలు 47 శాతం వృద్ధితో 11,819 యూనిట్లకు పెరిగాయి. ‘గతేడాది నవంబర్లో కంపెనీ విక్రయాలపై డీమోనిటైజేషన్ ప్రభావం అధికంగా పడింది. తాజాగా వాహన అమ్మకాలు మెరుగుపడ్డాయి. జీఎస్టీ ప్రభావం నుంచి మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది’ అని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో యుచిరో యుయెనో తెలిపారు. ♦ టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 13% వృద్ధితో 12,734 యూనిట్లకు పెరిగాయి. ♦ ‘నవంబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదుచేశాం. పూర్తిస్థాయి సామర్థ్య వినియోగంతో ఇన్నోవా, ఫార్చునర్ కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా చెప్పారు. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన అమ్మకాలు 29,869 యూనిట్ల నుంచి 36,039 యూనిట్లకు ఎగశాయి. అంటే 21 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాలు 51% వృద్ధితో 9,574 యూనిట్ల నుంచి 14,460 యూనిట్లకు పెరిగాయి. ఆడి ఆఫర్.. రూ.8.85 లక్షల డిస్కౌంట్ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా పరిమిత కాల ధరల తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది. సంవత్సర ముగింపు విక్రయాల కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8.85 లక్షల వరకూ డిస్కౌంట్ను అందిస్తోంది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ప్రత్యేకమైన ధరతో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ను అందుబాటులో ఉంచింది. ఆఫర్లో భాగంగా ఆడి ఏ3ని రూ.26.99 లక్షలకు పొందొచ్చు. దీని అసలు ధర రూ.31.99 లక్షలు. క్రిస్మస్, న్యూ ఇయర్లను నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ తెచ్చింది. పెరిగిన ‘ఇసుజు’ వాహన ధరలు ఇసుజు మోటార్స్ ఇండియా వాహన ధరలను రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వివిధ మోడళ్లపై ధరల పెంపు 3–4% శ్రేణిలో ఉంటుందని ఇసుజు మోటార్ ఇండియా తెలిపింది. కాగా గత నెలలో స్కోడా ఆటో ఇండియా కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి 2–3% శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది. -
బ్రేకులు పడుతూ... ముందుకు!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అయినప్పటికీ దేశీ వాహన విక్రయాలు అక్టోబర్లో మిశ్రమంగా నమోదయ్యాయి. జీఎస్టీ అమలు తర్వాత ధరలు పెరుగుతాయనే అంచనాలతో కస్టమర్లు ముందుగానే వాహన కొనుగోళ్లు జరపడం దీనికి కారణం. మారుతీ సుజుకీ, టయోటా కార్ల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యింది. మహీంద్రా, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఇక ఫోర్డ్, హోండా కార్స్, హ్యుందాయ్ విక్రయాలు మాత్రం క్షీణించాయి. ►మారుతీ దేశీ వాహన విక్రయాలు 9.9 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,23,764 యూనిట్ల నుంచి 1,36,000 యూనిట్లకు ఎగశాయి. ► ‘పండుగ సీజన్ కారణంగా విక్రయాల్లో జోష్ కనిపించింది. కస్టమర్ డిమాండ్ పెరిగింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ అమ్మకాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది’ అని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్.రాజా తెలిపారు. ► ‘ధంతేరాస్, దీపావళి వరకు విక్రయాల్లో వృద్ధి కనిపిస్తే.. తర్వాతి నుంచి డిమాండ్ క్రమంగా తగ్గింది’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్) రాజన్ వదేరా తెలిపారు. ►కొత్త ఆవిష్కరణల్లో జాప్యం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. నవంబర్ 9న అప్డేటెడ్ ఎకోస్పోర్ట్ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. -
కార్.. టాప్గేర్!!
ఆగస్ట్లో దూసుకెళ్లిన దేశీ వాహన విక్రయాలు ► మారుతీదే ఆధిపత్యం; 26.7 శాతం అప్ ► హ్యుందాయ్, టాటా, మహీంద్రా, హోండా అమ్మకాల్లో జోష్ ► ఫోర్డ్, టయోటా విక్రయాలు మాత్రం డౌన్ న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఆగస్ట్ నెలలో జోరు చూపించాయి. పలు కంపెనీలు బలమైన వృద్ధిని నమోదుచేశాయి. మరీ ముఖ్యంగా మార్కెట్ దిగ్గజం మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పండుగ సీజన్, కన్సూమర్ సెంటిమెంట్ బలంగా ఉండటం వంటి పలు కారణాలతో అమ్మకాలు బాగా పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కంపెనీల ప్యాసెంజర్ వాహన విక్రయాలు పెరిగాయి. ఫోర్డ్, టయోటా వాహన అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ దుమ్ము దులిపేసింది... మారుతీ సుజుకీ ఇండియా దేశీ విక్రయాలు ఏకంగా 26.7 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,19,931 యూనిట్ల నుంచి 1,52,000 యూనిట్లకు ఎగశాయి. దీని ప్రధాన ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 43,201 యూనిట్ల నుంచి 47,103 యూనిట్లకు పెరిగాయి. విక్రయాల పెరుగుదలకు కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన వెర్నా ప్రధాన కారణమని హెచ్ఎంఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. దేశీ యుటిలిటీ వాహన దిగ్గజమైన మహీంద్రా దేశీ విక్రయాలు 7.01 శాతం వృద్ధి చెంది 36,944 యూనిట్ల నుంచి 39,534 యూనిట్లకు ఎగశాయి. సానుకూల రుతుపవనాలు, గ్రామీణ డిమాండ్ వంటి అంశాలు అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వాడెరా తెలిపారు. టాటా మోటార్స్ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10.29 శాతం వృద్ధితో 13,002 యూనిట్ల నుంచి 14,340 యూనిట్లకు పెరిగాయి. టియాగో, టిగోర్, హెక్సా వంటి కొత్త జనరేషన్ కార్లకున్న డిమాండ్ కారణంగా విక్రయాలు పెరిగినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు. ‘గణేశ్ చతుర్థితో పండుగ సీజన్లోకి ప్రవేశించాం. భవిష్యత్లోనూ ఇదే ట్రెండ్ను కొనసాగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) దేశీ అమ్మకాలు 24.5 శాతం పెరిగాయి. ఇవి 13,941 యూనిట్ల నుంచి 17,365 యూనిట్లను ఎగశాయి. ‘దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగ కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పండుగ సీజన్ వల్ల వచ్చే రెండు నెలల్లో విక్రయాలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నాం’ అని హెచ్సీఐఎల్ యుచిరో యెనో తెలిపారు. రివర్స్ గేర్లో ఫోర్డ్, టయోటా ఫోర్డ్ ఇండియా దేశీ విక్రయాలు 9% తగ్గాయి. ఇవి 8,548 యూనిట్ల నుంచి 7,777 యూనిట్లకు క్షీణించాయి. సరఫరా వ్యవస్థలోని పలు సమస్యలు ఎగుమతులతోపాటు దేశీ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) దేశీ అమ్మకాలు 6.12% తగ్గుదలతో 12,801 యూనిట్ల నుంచి 12,017 యూనిట్లకు పడ్డాయి. ఉత్పత్తికి సంబంధించిన పరిమితుల కారణంగా ఆగస్ట్ నెలలోని డిమాండ్ అందుకోలేకపోయామని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా తెలిపారు. టూవీలర్ జోష్..: టూవీలర్ విభాగంలోనూ విక్రయాలు బాగానే పెరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 21.99% వృద్ధితో 67,977 యూనిట్లకు ఎగశాయి. బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు 2.98 శాతం వృద్ధి చెందాయి. ఇవి 3,25,347 యూనిట్ల నుంచి 3,35,031 యూనిట్లకు పెరిగాయి. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా విక్రయాలు 54.25 శాతం వృద్ధితో 56,745 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటార్ మొత్తం అమ్మకాలు 15.7 శాతం వృద్ధితో 2,74,303 యూనిట్ల నుంచి 3,17,563 యూనిట్లకు పెరిగాయి. -
వాహన విక్రయాలు వెలవెల
జూన్లో 11 శాతం డౌన్ న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు జూన్ నెలలో 11 శాతం తగ్గాయి. గత ఆరు నెలల కాలంలో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. జీఎస్టీ అమలుకు ముందు డీలర్లు.. కంపెనీల నుంచి కొత్త స్టాక్ను తీసుకోకపోవడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ట్రాన్సిషనల్ నష్టాలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో డీలర్లు కొత్త స్టాక్కు దూరంగా ఉన్నారు. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు జూన్లో 11.21 శాతం క్షీణతతో 1,98,399 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వాహన అమ్మకాలు 2,23,454 యూనిట్లుగా ఉన్నాయి. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ నుంచి కోలుకొని జనవరి నుంచి పెరుగుతూ వస్తున్న ప్యాసింజర్ వాహన విక్రయాలు తాజా నెలలో ఒక్కసారిగా తగ్గాయి. 2013 మార్చి (–13.01 శాతం) నుంచి ఇదే అతిపెద్ద క్షీణత. ⇔ కార్ల విక్రయాలు 11.24 శాతం క్షీణించాయి. ఇవి 1,54,237 యూనిట్ల నుంచి 1,36,895 యూనిట్లకు తగ్గాయి. 2013 మే తరువాత ఇదే అతిపెద్ద క్షీణత. ⇔ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1 శాతం వృద్ధితో 93,057 యూనిట్లకు పెరిగాయి. ⇔ హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 5.64 శాతం క్షీణతతో 37,562 యూనిట్లకు, మహీంద్రా విక్రయాలు 5.27 శాతం క్షీణతతో 16,169 యూనిట్లకు తగ్గాయి. ⇔ టాటా మోటార్స్ అమ్మకాలు 12.19 శాతం క్షీణతతో 13,148 యూనిట్లకు పరిమితమయ్యాయి. -
వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.63 శాతం వృద్ధితో 2,31,640 యూనిట్ల నుంచి 2,51,642 యూనిట్లకు పెరిగాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక దేశీ కార్ల విక్రయాలు కూడా 4.8 శాతం వృద్ధితో 1,58,996 యూనిట్ల నుంచి 1,66,630 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 69,845 యూనిట్లకు ఎగశాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం.. ⇔ మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 1,30,238 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ హ్యుందాయ్ అమ్మకాలు 1.59 శాతం వృద్ధితో 42,007 యూనిట్లకు పెరిగాయి. ⇔ మహీంద్రా వాహన విక్రయాలు 3.23 శాతం వృద్ధి చెందాయి. ఇవి 20,270 యూనిట్లుగా నమోదయ్యాయి. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించండి కేంద్రానికి వాహన కంపెనీల విజ్ఞప్తి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించాలని వాహన కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. వీటికి 18% జీఎస్టీ పన్ను రేటు వర్తింపజేయాలని అభ్యర్థించాయి. పర్యావరణ వాహనాలను, లగ్జరీ మోడళ్లలను ఒకే విధంగా పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదని తెలియజేశాయి. జులై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను జీఎస్టీలో హైబ్రిడ్ వాహనాలపై కూడా 28% పన్ను విధించారు. దీనికి 15% సెస్సు అదనం. ప్రస్తుతం హైబ్రిడ్ వాహనాలపై పన్ను రేటు 30.3%. -
వాహన విక్రయాలు రయ్ రయ్
మారుతీ, హోండా, మహీంద్రా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి న్యూఢిల్లీ: దేశీ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదైంది. మరీ ముఖ్యంగా మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా, ఫోర్డ్ కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ వృద్ధికి కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వెహికల్స్ డిమాండ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే టయోటా వాహన విక్రయాలు మాత్రం క్షీణించాయి. టూవీలర్ల విభాగానికి వస్తే.. హీరో మోటొకార్ప్ విక్రయాలు 8.7 శాతం వృద్ధితో 6,33,884 యూనిట్లకు చేరాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 24.87 శాతం వృద్ధితో 60,696 యూనిట్లకు పెరిగాయి. ఇండియా యమహా అమ్మకాలు 10.65 శాతం వృద్ధితో 69,429 యూనిట్లకు ఎగశాయి. -
బోణీ అదిరింది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో (ఏప్రిల్) వాహన విక్రయాలు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ,, టయోట, హోండా, నిస్సాన్ ఇండియా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మారుతీ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు సాధించింది. అంతేకాకుండా ఈ కం పెనీ మినీ, యుటిలిటి ఇలా ప్రతి సెగ్మెంట్ రెండంకెల వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ దేశీ విక్రయాలు 21% క్షీణించాయి. అయితే ప్రయాణికుల వాహన విక్రయాలు 23% వృద్ధి చెందాయి. హీరో వాహన ధరలు పెరిగాయ్.. న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.500–రూ.2,200 శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని, ఈ తాజా నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. బీఎస్3 దెబ్బ రూ.600 కోట్లు: భారత్ స్టేజ్(బీఎస్)–3 వాహన విక్రయాలపై నిషేధం వల్ల టూవీలర్ కంపెనీలపై రూ.600 కోట్ల భారం పడిందని రేటింగ్ కంపెనీ ఇక్రా తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్3 వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై సుప్రీం కోర్ట్ నిషేధం విధించింది. 8 లక్షల బీఎస్3 వాహనాలు ఉండగా, వీటిల్లో 6.71 లక్షలు టూవీలర్లు. వీటి విక్రయానికి మార్చి చివరి 3 రోజుల్లో కంపెనీలు భారీ డిస్కౌంట్లిచ్చాయి. -
టాప్గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి పలు వాహన కంపెనీల వార్షిక వాహన విక్రయాలు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జోరుగా నమోదయ్యాయి. మారుతీ మొత్తం వాహన విక్రయాలు 9.8 శాతం వృద్ధితో 15,68,603 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 10.7 శాతం వృద్ధితో14,44,541 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ వాహన విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైంది. నిస్సాన్ వాహన అమ్మకాలు ఏకంగా 45 శాతం వృద్ధితో 57,315 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. రెనో వాహన అమ్మకాలు ఏకంగా 88.4 శాతం వృద్ధితో 1,35,123 యూనిట్లకు పెరిగాయి. కాగా కేవలం మార్చి నెలలో మారుతీ దేశీ వాహన అమ్మకాలు 7.7 శాతం వృద్ధితో 1,27,999 యూనిట్లకు పెరిగాయి. ఇదే నెలలో హోండా కార్స్ దేశీ వాహన విక్రయాల్లో 8.7 శాతం వృద్ధి నమోదైంది. ఫోర్డ్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 15 శాతం వృద్ధితో 8,700 యూనిట్లకు చేరుకున్నాయి. -
జోరుగా వాహన విక్రయాలు
⇒ డిమాండ్ పుంజుకుంటోంది.. ⇒ రానున్న నెలల్లో మరింతగా అమ్మకాలు: కంపెనీలు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఇబ్బందుల నుంచి వాహన కంపెనీలు గట్టెక్కినట్లే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉండటమే దీనికి కారణం. ప్రధాన వాహన కంపెనీలు–మారుతీ సుజుకీ, ఫోర్డ్ ఇండియా, టయోటా, టాటా మోటార్స్ దేశీయ విక్రయాలు జోరుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి వాహన రంగం కోలుకుంటోందని నిపుణులంటున్నారు. కార్ల అమ్మకాలు బాగా ఉండగా, టూవీలర్ల విక్రయాలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి పరిశ్రమ కోలుకుంటోందని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) అనురాగ్ మెహరోత్ర చెప్పారు. బిజినెస్ సెంటిమెంట్స్కు సానుకూలంగా ఈ ఏడాది బడ్జెట్ ఉందని, దీంతో వినియోగదారుల విశ్వాసం మెరుగుపడిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గత రెండు నెలల్లో వాహన పరిశ్రమలో సానుకూల పోకడలు చోటు చేసుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(వాహన విభాగం) ప్రవీణ్ షా పేర్కొన్నారు. గ్రామీణ సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో డిమాండ్ మరింతగా పుంజుకోగలదని ఆయన అంచనా వేస్తున్నారు. గత నెలలో సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో తమ అమ్మకాలు పెరిగాయని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునో చెప్పారు. టాటా టియాగోకు డిమాండ్ బాగా ఉండటంతో మంచి అమ్మకాలు సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. స్విఫ్ట్, ఎస్టిలో, డిజైన్, బాలెనో కార్ల అమ్మకాలు బాగా ఉండటంతో మారుతీ సుజుకీ 12% వృద్ది సాధించింది. జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్–క్రాస్లతో కూడిన యుటిలిటీ, ఎస్యూవీ విటారా బ్రెజా కార్ల విక్రయాలు 111% పెరిగాయి. ఆల్టో, వేగన్ ఆర్వంటి చిన్న కార్ల అమ్మకాలు 7% తగ్గాయి. -
కార్ల అమ్మకాలు పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోందని, కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని సియామ్ తెలిపింది. గత నెలలో ప్రయాణికుల వాహన విక్రయాలు 14 శాతం పుంజుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)పేర్కొంది. వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలదన్న అంచనాలు పెరిగాయని వివరించింది. అయితే టూ–వీలర్ల అమ్మకాలు తగ్గడం కొనసాగుతోందని పేర్కొంది. 2015, జనవరిలో 1,68,303గా ఉన్న దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో 11 శాతం వృద్ధితో 1,86,523కు పెరిగాయని తెలిపింది. -
ఫ్యాన్సీ..నో క్రేజీ!
లక్కీ నెంబర్లపై తగ్గిన మోజు 40 శాతం తగ్గిన ఆర్టీఏ ఆదాయం ఆల్ నైన్స్ నెంబర్కు..గతేడాది రూ.10 లక్షలు..ఈసారి రూ.2.35 లక్షలే.. ‘అదృష్టానికి’ అడ్డంకిగా పెద్ద నోట్ల రద్దు తగ్గిన హై ఎండ్ వాహనాల అమ్మకాలు సిటీబ్యూరో : 9, 1, 999, 9999, 786, 6,666, 1111 ..... ఇలాంటి ఫ్యాన్సీ, లక్కీ నెంబర్లపై వాహనదారులకు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. పెద్దఎత్తున పోటీకి దిగుతారు. వేలంలో రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవుతారు. ఆ సీరీస్లో కోరుకున్న నెంబర్ రాలేదంటే మరో సీరీస్ కోసం ఎదురు చూస్తారు. ఏడాదైనా సరే నచ్చిన నెంబర్ చేతికి వచ్చేదాకా ఆగుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత రెండు నెలలుగా ఫ్యాన్సీ నెంబర్లపై ఆసక్తి తగ్గింది. రూ.లక్షలు వెచ్చించేందుకు వాహన యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. నెంబర్లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు సాహసించడం లేదు. దీంతో రవాణాశాఖ ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల నెంబర్లపైన వచ్చే ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు అంచనా. సంపన్న వర్గాలు ఎక్కువ కొనుగోలు చేసే హై ఎండ్ వాహనాల అమ్మకాలు కూడా తగ్గడం ఇందుకు మరో కారణం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా... ∙గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ అనే నెంబర్ కోసం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.10.50 లక్షలు. సోమవారం నిర్వహించిన వేలం పాటల్లో అదే నెంబర్ ‘టీఎస్ 09 ఈఆర్ 9999’ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వేలంలో చెల్లించిన మొత్తం కేవలం రూ.2.35 లక్షలు. ► ఒక్క ఖైరతాబాద్లోనే కాదు. అత్తాపూర్, మలక్పేట్, సికింద్రాబాద్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో గతేడాది ఇలాంటి నెంబర్ల కోసం వాహనదారులు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించారు. కానీ ఇప్పుడు డిమాండ్ బాగా పడిపోయింది. గత సంవత్సరం రూ.15 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే నెంబర్ల సీరీస్పై రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చేది. తాజాగా నిర్వహించిన వేలం పాటల్లో రూ.11.66 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. మొత్తంగా ఈ ఏడాది కాలంలో వాహనాల ఫ్యాన్సీ నెంబర్లపైన ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లపై ఇష్టం ఉన్నా...వేలంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ‘హైఎండ్’ అమ్మకాలు కూడా తగ్గుముఖం... ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విక్రయాలు జరిగే బీఎండబ్ల్యూ, ల్యాండ్రోవర్, ల్యాండ్క్రూజర్, ఆడి వంటి ఖరీదైన కార్ల అమ్మకాలు ఈసారి సగానికి సగం పడిపోయాయి. స్పోర్ట్స్ బైక్లు కూడా తగ్గాయి. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు ఏడాది చివరి రోజులు కావడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హై ఎండ్ మాత్రమే కాకుండా మధ్యతరగతి, వేతన జీవులు కొనుగోలు చేసే స్విఫ్ట్ డిజైర్ వంటి వాహనాల అమ్మకాలు కూడా తగ్గాయి. నగరంలోని అన్ని ఆటోమోబైల్ షోరూమ్లలో ప్రతి నెలా సుమారు 25 వేల నుంచి 27 వేల వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. నోట్ల రద్దు కారణంగా ఈ సంఖ్య ఏకంగా 15 వేలకు పడిపోయింది. వీటిలో హై ఎండ్, మధ్యతరగతి వర్గాలు విరివిగా కొనుగోలు చేసే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే బైక్ల అమ్మకాలు మాత్రం పెద్దగా తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. ఇలా వాహన విక్రయాలు తగ్గడం కూడా ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపైన ప్రతికూల ప్రభావం చూపింది. హోదా కోసం... అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే, సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ► ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరీస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. గతంలో ఒక నెంబర్ కోసం సగటున 10 మంది పోటీ పడితే ఇప్పుడు ఆ సంఖ్య 6 కు పడిపోయింది. సోమవారం నిర్వహించిన వేలంలో పలికిన ధరలు ఇలా... ► టీఎస్ 09 ఈఆర్ 9999 – రూ.2.35 లక్షలు ► టీఎస్ 09 ఈఎస్ 0007 – రూ.1.47 లక్షలు ► టీఎస్09 ఈఎస్ 005 – రూ.1.35 లక్షలు -
జనవరిలో పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కష్టాల నుంచి వాహన కంపెనీలు తేరుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, , టయోట, నిస్సాన్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు 9 శాతం చొప్పున పతనం కాగా, టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 21 శాతం ఎగిశాయి. -
వాహన విక్రయాలు ఢమాల్...
• 16 ఏళ్ల కనిష్టానికి పతనం • డీమోనిటైజేషన్ దెబ్బతో విలవిల • సియామ్ గణాంకాలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్ డిమాండ్ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్ తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్ స్థాయికి పడిపోయాయి. ⇔ 2015 డిసెంబర్లో 15,02,315 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2016 డిసెంబర్లో 12,21,929 యూనిట్లకు క్షీణించాయి. 2000 డిసెంబర్నుంచి ఈ స్థాయిలో సేల్స్ తగ్గడం ఇదే తొలిసారి. ⇔ 2015 డిసెంబర్లో 1,72,671 యూనిట్లుగా ఉన్న దేశీ కార్ల విక్రయాలు 2016 డిసెంబర్ నెలలో 8.14 శాతం క్షీణతతో 1,58,617 యూనిట్లకు పతనమయ్యాయి. 2014 ఏప్రిల్ నుంచి చూస్తే విక్రయాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ⇔ మొత్తం టూవీలర్ అమ్మకాలు 22.04% క్షీణతతో 11,67,621 యూనిట్ల నుంచి 9,10,235 యూనిట్లకు తగ్గాయి. సియామ్ గణాంకాలను నమోదుచేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి (1997) చూస్తే ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గడం ఇదే ప్రధమం. పాత కార్ల విక్రయాలదీ అదే తీరు పెద్ద నోట్ల రద్దు... పాత కార్ల విక్రయాల మార్కెట్నూ పడకేసేలా చేసింది. గతేడాది నవంబర్లో నోట్ల రద్దు తర్వాత వినియోగదార్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో పాత కార్ల విక్రయాలు 42 శాతం క్షీణించాయి. -
వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
• స్వల్పంగా పెరిగిన ప్యాసెంజర్ వాహన అమ్మకాలు • ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట వృద్ధి • సియామ్ గణాంకాలు న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వాహన విక్రయాలకు కరెన్సీ నోట్ల రద్దు సెగ తగిలింది. ఇవి నవంబర్ నెలలో స్వల్పంగా పెరిగి, 1.82 శాతం వృద్ధితో 2,40,979 యూనిట్లకు ఎగశారుు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థారుు వృద్ధి. గతేడాది ఇదే నెలలో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 2,36,664 యూని ట్లుగా నమోదయ్యారుు. ఇక టూవీలర్ విక్రయాలు దాదాపు 6% క్షీణించారుు. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ దేశీ కార్ల విక్రయాలు 1,73,111 యూనిట్ల నుంచి 1,73,606 యూనిట్లకు పెరిగారుు. వాణిజ్య వాహన అమ్మకాలు 12 శాతం క్షీణతతో 45,773 యూనిట్లకు తగ్గారుు. ఇక మొత్తం వాహన విక్రయాలు 5.48 శాతం క్షీణతతో 16,54,407 యూనిట్ల నుంచి 15,63,665 యూనిట్లకు పడ్డారుు. గత 43 నెలల నుంచి చూస్తే ఈ స్థారుులో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరగా 2013 మార్చిలో మొత్తం వాహన విక్రయాల్లో 8 శాతం క్షీణత నమోదరుు్యంది. ⇔ మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 8 శాతం వృద్ధితో 89,479 యూనిట్ల నుంచి 96,767 యూనిట్లకు పెరిగారుు. ⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ కార్ల అమ్మకాలు 13 శాతం క్షీణతతో 37,771 యూనిట్ల నుంచి 32,923 యూనిట్లకు తగ్గారుు. ⇔ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 34 శాతం క్షీణతతో 12,410 యూనిట్లకు పడ్డారుు. ⇔ మొత్తం టూవీలర్ అమ్మకాలు 6 శాతం తగ్గుదలతో 13,20,552 యూనిట్ల నుంచి 12,43,251 యూనిట్లకు క్షీణించారుు. ⇔ మోటార్సైకిల్ విక్రయాలు 10 శాతం క్షీణతతో 8,66,696 యూనిట్ల నుంచి 7,78,178 యూనిట్లకు పడ్డారుు. హీరో మోటోకార్ప్ విక్రయాలు 12 శాతంమేర, బజాజ్ అమ్మకాలు 8 శాతం మేర, హోండా విక్రయాలు 7% మేర క్షీణించారుు. ⇔ స్కూటర్ అమ్మకాలు 2 శాతం క్షీణతతో 3,96,024 యూనిట్ల నుంచి 3,88,692 యూనిట్లకు తగ్గారుు. హోండా విక్రయాలు 2 శాతంమేర, హీరో అమ్మకాలు 19 శాతంమేర, టీవీఎస్ విక్రయాలు 3 శాతంమేర క్షీణించారుు. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
• మారుతీ, టయోటా, రెనో అమ్మకాల్లో రెండంకెల వృద్ధి • మహీంద్రా, ఫోర్డ్, హోండా విక్రయాల్లో క్షీణత • రెండు రెట్లు పెరిగిన ఫోక్స్వ్యాగన్ అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీ వాహన విక్రయాలు నవంబర్ నెలలో మిశ్రమంగా ఉన్నారుు. మారుతీ సుజుకీ, టయోటా, రెనో కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదరుు్యంది. ఇక మహీంద్రా, ఫోర్డ్, హోండా కంపెనీల విక్రయాలు తగ్గారుు. వాహన విక్రయాల తగ్గుదలపై డీమానిటైజేషన్ ప్రభావం చూపింది. కాగా ఫోక్స్వ్యాగన్ వాహన అమ్మకాలు ఏకంగా రెండు రెట్లు పెరిగారుు. ⇔ మారుతీ సుజుకీ విక్రయాలు 14.2% వృద్ధితో 1,10,599 యూనిట్ల నుంచి 1,26,325 యూనిట్లకు పెరిగారుు. ⇔ టయోటా కిర్లోస్కర్ వాహన అమ్మకాల్లో 10.03% వృద్ధి నమోదయ్యింది. ఇవి 10,278 యూనిట్ల నుంచి 11,309 యూనిట్లకు ఎగశారుు. హా టాటా మోటార్స్ దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 22% వృద్ధితో 10,470 యూనిట్ల నుంచి 12,736 యూనిట్లకు పెరిగారుు. ⇔ ఫోక్స్వ్యాగన్ ఇండియా వాహన అమ్మకాల్లో రెండు రెట్ల వృద్ధి నమోదరుు్యంది. ఇవి 1,942 యూనిట్ల నుంచి 4,014 యూనిట్లకు ఎగశారుు. ⇔ రెనో వాహన విక్రయాలు 23% వృద్ధితో 7,819 యూనిట్ల నుంచి 9,604 యూనిట్లకు చేరారుు. ⇔ మహీంద్రా వాహన విక్రయాలు 24% క్షీణించారుు. ఇవి 39,383 యూనిట్ల నుంచి 29,814 యూనిట్లకు పడ్డారుు. ⇔ ఫోర్డ్ ఇండియా వాహన అమ్మకాలు కూడా 22% క్షీణతతో 8,773 యూనిట్ల నుంచి 6,876 యూనిట్లకు తగ్గారుు. ⇔ హోండా కార్స్ ఇండియా విక్రయాలు 45% పడ్డారుు. -
వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!
ఆటోమొబైల్ డీలర్లకు కరెన్సీ షాక్ పెద్ద నోట్ల రద్దుతో సగానికి పడిపోరుున అమ్మకాలు ద్విచక్రవాహనాలు, కార్లపై తీవ్ర ప్రభావం దాదాపు రూ.350 కోట్ల మేర స్తంభించిన లావాదేవీలు సిటీబ్యూరో : పెద్ద నోట్ల రద్దు కొత్త వాహన విక్రయాలకు కళ్లెం వేసింది. గత వారం, పది రోజులు గా గ్రేటర్లో వాహనాల అమ్మకాలు సగానికి సగం పడిపోయారుు. వ్యక్తిగత వాహనాలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. పెద్ద మొత్తంలో డ్రా చేసేందుకు అవకాశం లేకపోవడం, పాత నోట్లను తీసుకొనేందుకు ఆటోమొబైల్ డీలర్లు నిరాకరిస్తుండడంతో వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, బహదూర్పురా, ఉప్పల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టారుు. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు నవంబర్, డిసెంబర్ ఏడాది చివరి నెలలు కావడంతో ఆటోమొబైల్ రంగంలో స్తబ్ధత నెలకొంది. నోట్ల రద్దు ప్రభావమే ఎక్కువగా ఉందని, ఏడాది చివరి ప్రభావం డిసెంబర్లో మాత్రమే కనిపిస్తుందని పలువురు ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ నెలలో నోట్ల రద్దు కారణంగా సుమారు రూ.350 కోట్లకు పైగా ఆటోమొబైల్ వ్యాపారం స్తంభించినట్లు డీలర్లు చెబుతున్నారు. 50 శాతం తగ్గిన అమ్మకాలు... గ్రేటర్ హైదరాబాద్లో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తదితర రవాణా రంగానికి చెందిన వాహనాలను విక్రరుుంచే ప్రధాన ఆటోమొబైల్ డీలర్లు సుమారు 150 మంది ఉంటారు. సబ్డీలర్లు, షోరూమ్లు అన్నీ కలిపి 500 లకు పైగా వాహన విక్రయ కేంద్రాలు ఉన్నారుు. ప్రతి ఆర్టీఏ పరిధిలో రోజుకు 150 నుంచి 250 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఖైరతాబాద్ ఆర్టీఏలో సగటున 250 నుంచి 300 వాహనాలు నమోదవుతుండగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏల్లో సగటున 150 నుంచి 170 వరకు కొత్త వాహనాలు నమోదవుతున్నారుు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో మొత్తంగా ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఆటోమొబైల్ డీలర్లు, రవాణా అధికారుల అంచనాల మేరకు ప్రతి నెలా సుమారు 25000 ద్విచక్ర వాహనాలు, 70ఁఊ00 వరకు కార్ల విక్రయాలు జరుగుతారుు. కానీ ఈ నెలలో ఇప్పటి వరకు కేవలం 6 వేల ద్విచక్ర వాహనాలు, మరో 1500 కార్లు మాత్రమే విక్రరుుంచినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఏకంగా 407 వాహనాలు నమోదు కాగా, ఈ నెల 15వ తేదీన 209 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. సికింద్రాబాద్ ఆర్టీఓలో ఈ నెల 10వ తేదీన కేవలం 75 వాహనాలు నమోదయ్యారుు. బహదూర్పురా ఆర్టీఏలో ఈ నెల 11న 47 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. అలాగే నగర శివార్లలోని మేడ్చల్ ఆర్టీఏలో ఈ నెల 6న 354 వాహనాలు నమోదు కాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం 11వ తేదీన 145 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. నగదు చెల్లింపులకు అవకాశం లేకపోవడమే.. కార్లు, ఇతర మోటారు వాహనాల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలే ఎక్కువగా ఉంటారుు. 80 శాతం వినియోగదారులు బ్యాంకు రుణాలపైనే వాహనాలను కొనుగోలు చేస్తారు. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నగదు రూపంలో డౌన్పేమెంట్ చెల్లించి మిగతా మొత్తానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. కానీ పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు లావాదేవీల్లో స్తబ్దత నెలకొనడం, పాతనోట్లు చెల్లకపోవడం, పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభించకపోవడంతో వాహనాల కొనుగోళ్లు మందగించారుు. అలాగే కార్ల కొనుగోళ్లపైన కూడా ఇదేవిధమైన ప్రభావం కనిపిస్తుంది. పాతనోట్లతో పన్ను చెల్లింపులతో ఊరట... ఇలా ఉండగా, ఈ నెల 24వ తేదీ వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో జీవితకాల పన్నులు, త్రైమాసిక పన్నులు చెల్లించేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించడంతో కొంత మేరకు ఊరట లభించిందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. వాహనదారులు ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ పన్నులు చెల్లించవచ్చు. అలాగే షోరూమ్ల నుంచి కూడా జీవితకాల పన్ను చెల్లింపునకు అనుమతి లభించింది. -
కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి
• ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 4% అప్ • సియామ్ గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ: దేశీ కార్ల విక్రయాలు అక్టోబర్ నెలలో స్వల్ప వృద్ధితో 1,94,158 యూనిట్ల నుంచి 1,95,036 యూనిట్లకు పెరిగారుు. దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 4 శాతం పెరిగారుు. సియామ్ గణాంకాల ప్రకారం.. ప్యాసెంజర్ వాహన అమ్మకాలు గత నెలలో 2,80,766 యూనిట్లుగా నమోదయ్యారుు. గతేడాది ఇదే నెలలో వీటి విక్రయాలు 2,68,630 యూనిట్లుగా ఉన్నారుు. ‘పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో కార్ల కంపెనీలు వినియోగదారుల కోసం అధిక స్టాక్ను అందుబాటులో ఉంచారుు. అక్టోబర్లో ఇలాంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత నెలలో కంపెనీల వద్ద ఉన్న స్టాక్ను సర్దుబాటు చేశారుు. దీని ఫలితం తాజా విక్రయాలపై కనిపించింది’ అని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. ⇔ మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 5 శాతం క్షీణతతో 97,951 యూనిట్ల నుంచి 92,886 యూనిట్లకు తగ్గారుు. ⇔ హ్యుందాయ్ దేశీ కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధి నమోదరుు్యంది. ఇవి 39,709 యూనిట్ల నుంచి 41,126 యూనిట్లకు పెరిగారుు. ⇔ మహీంద్రా అమ్మకాలు 3 శాతం వృద్ధితో 22,664 యూనిట్ల నుంచి 23,399 యూనిట్లకు ఎగశారుు. ⇔ మొత్తం టూవీలర్ విక్రయాలు 18,00,672 యూనిట్లుగా నమోదయ్యారుు. వార్షిక ప్రాతిపదికన చూస్తే 9 శాతం వృద్ధి నమోదరుు్యంది. ⇔ హీరో మోటొకార్ప్ బైక్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 5,21,118 యూనిట్ల నుంచి 5,61,427 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 88,790 యూనిట్లుగా ఉన్నారుు. ⇔ బజాజ్ ఆటో మోటార్సైకిల్ అమ్మకాలు 5 శాతం ఎగశారుు. ఇవి 2,02,042 యూనిట్ల నుంచి 2,12,997 యూనిట్లకు చేరారుు. ⇔ హోండా బైక్స్ విక్రయాలు 4 శాతం వృద్ధితో 1,67,496 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 3,02,862 యూనిట్లుగా ఉన్నారుు. ⇔ వాణిజ్య వాహన విక్రయాలు 11 శాతం వృద్ధితో 65,569 యూనిట్లకు చేరారుు. -
వాహన విక్రయాలకు పండుగ శోభ
• ప్రధాన కంపెనీల దేశీ విక్రయాలు జూమ్ • కలిసొచ్చిన దసరా, దీపావళి సీజన్ • టయోటా విక్రయాల్లో మాత్రం క్షీణత న్యూఢిల్లీ: పండుగ సీజన్ నేపథ్యంలో వాహన విక్రయాలు అక్టోబర్ నెలలో టాప్ గేర్లో పరిగెత్తాయి. ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహన అమ్మకాల్లో మంచి వృద్ధినే ప్రకటిస్తే.. ఇక నిస్సాన్ మోటార్ ఇండియా, ఫోక్స్వ్యాగన్ కంపెనీల వాహన విక్రయాలు జోరు మీద ఉన్నాయి. అయితే ఒక్క టయోటా విక్రయాలు మాత్రం తగ్గాయి. ⇔ మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాలు 2.2 శాతం వృద్ధితో 1,23,764 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులతో సహా కంపెనీ మొత్తం వాహన విక్రయాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇవి 1,34,209 యూనిట్ల నుంచి 1,33,793 యూనిట్లకు క్షీణించాయి. ⇔ హ్యుందాయ్ వాహన విక్రయాలు 4.3 శాతం వృద్ధితో 61,701 యూనిట్ల నుంచి 64,372 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ దేశీ విక్రయాలు కూడా 6.4 శాతం వృద్ధితో 47,015 యూనిట్ల నుంచి 50,016 యూనిట్లకు చేరాయి. నెలవారి విక్రయాల పరంగా చూస్తే కంపెనీకి ఇవే ఉత్తమ అమ్మకాలు. ⇔ టాటా మోటార్స్ కార్ల విక్రయాల్లో 28 శాతం వృద్ధి నమోదయ్యింది. గత నాలుగేళ్లలో కంపెనీకి ఇవే అత్యుత్తమ అమ్మకాలు. ఎగుమతులతో కలుపుకొని మొత్తం వాహన విక్రయాలు (ప్యాసెంజర్, కమర్షియల్) 21 శాతం వృద్ధితో 52,813 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 43,486 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం దేశీ విక్రయాలు 19 శాతం వృద్ధితో 46,480 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు కూడా 15% వృద్ధితో 30,169 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి ఈ విభాగానికి సంబంధించి ఏడాదిలోనే గరిష్ట అమ్మకాలు. ⇔ నిస్సాన్ మోటార్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 88% వృద్ధితో 6,108 యూనిట్లుగా ఉన్నా యి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన అమ్మకాలు 3,246 యూనిట్లుగా నమోదయ్యాయి. ⇔ ఫోక్స్వ్యాగన్ దేశీ వాహన విక్రయాలు 70 శాతం వృద్ధితో 5,534 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన అమ్మకాలు 3,255 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీ వాహన విక్రయాలు మాత్రం 6% క్షీణతతో 11,651 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 12,403 యూనిట్లను విక్రయించింది. ⇔ మారుతీ, హ్యుందాయ్ వాహన ఎగుమతులు తగ్గితే.. టాటా మోటార్స్ ఎగుమతులు మాత్రం పెరిగాయి. ⇔ హిందూజా గ్రూప్కు చెందిన అశోక్ లేలాండ్ మొత్తం వాహన అమ్మకాలు 28 శాతం వృద్ధితో 9,803 యూనిట్ల నుంచి 12,533 యూనిట్లకు పెరిగాయి. హెవీ, మీడియం వాణిజ్య వాహన విక్రయాలు 33 శాతం వృద్ధితో 9,574 యూనిట్లకు, తేలికపాటి వాణిజ్య వాహన అమ్మకాలు 13% వృద్ధితో 2,959 యూనిట్లకు ఎగశాయి. ⇔ ఐషర్ మోటార్స్కు చెందిన టూవీలర్ విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం వాహన విక్రయాలు 33 శాతం వృద్ధితో 59,127 యూనిట్లకు ఎగశాయి. కంపెనీ గతేడాది అమ్మకాలు 44,522 యూని ట్లుగా ఉన్నాయి. ఇక దేశీ విక్రయాలు 44,138 యూనిట్ల నుంచి 58,369 యూనిట్లకు పెరిగాయి. -
జోరుగా వాహన విక్రయాలు..
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు సెప్టెంబర్లో 20 శాతం మేర ఎగశాయి. గత నాలుగున్నరేళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీనికి యుటిలిటీ వాహన విక్రయాల పెరుగుదల, కొత్త మోడళ్లు, పండుగ సీజన్ వంటి అంశాలు బాగా అనుకూలించాయి. సియామ్ గణాంకాల ప్రకా రం.. పీవీ విక్రయాలు సెప్టెంబర్లో 2,78,428 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో పీవీ అమ్మకాలు 2,32,170 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2012 మార్చిలో పీవీ విక్రయా లు 2,95,403 యూనిట్లుగా నమోద య్యాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు సెప్టెంబర్లో 48,467 యూనిట్ల నుంచి 38 శాతం వృద్ధితో 66,851 యూనిట్లకు ఎగశాయి. కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 1,69,590 యూనిట్ల నుంచి 1,95,259 యూనిట్లకు చేరాయి. -
వాహన విక్రయాల పరుగు
న్యూఢిల్లీ: దేశంలో కార్ల విక్రయాలు జూలైలో 10 శాతం మేర పెరిగాయి. ఇక మొత్తంగా ప్యాసెంజర్ వాహన విక్రయాలు 17 శాతం మేర ఎగశాయి. మారుతీ సుజుకీ విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటా సహా పలు ఇతర కంపెనీల యుటిలిటీ వాహన అమ్మకాల వృద్ధి, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ ప్రతిపాదనల అమలు వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. ఈ విషయాలను ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ వెల్లడించింది. దీని ప్రకారం.. దేశీ ప్యాసెంజర్ వాహనాల విక్రయాలు జూలైలో 2,59,685 యూనిట్లుగా ఉన్నాయి. వీటి విక్రయాలు గతేడాది ఇదే నెలలో 2,22,368 యూనిట్లుగా నమోదయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 42 శాతం వృద్ధితో 45,191 యూనిట్ల నుంచి 64,105 యూనిట్లకు పెరిగాయి. కార్ల విక్రయాలు 1,62,022 యూనిట్ల నుంచి 1,77,604 యూనిట్లకు ఎగశాయి. రెండు నెలల తర్వాత కార్ల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యింది. ⇔ మారుతీ సుజుకీ దేశీ కార్ల విక్రయాలు 2 శాతం వృద్ధితో 91,602 యూనిట్ల నుంచి 93,634 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వాహన (యూవీ) విక్రయాలు 151 శాతం వృద్ధితో 17,382 యూనిట్లకు ఎగశాయి. ⇔ హ్యుందాయ్ కార్ల అమ్మకాలు 12 శాతం వృద్ధితో 29,599 యూనిట్ల నుంచి 33,197 యూనిట్లకు పెరిగాయి. యూవీ విక్రయాలు 16 శాతం వృద్ధితో 8,004 యూనిట్లకు చేరాయి. ⇔ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం వృద్ధితో 15,962 యూనిట్లకు పెరిగాయి. ⇔ టాటా మోటార్స్ కార్ల విక్రయాలు 43% వృద్ధితో 12,209 యూనిట్లకు చేరాయి. కానీ యూవీ విక్రయాలు మాత్రం 1,338 యూనిట్లకు తగ్గాయి. ⇔ టయోటా యూవీ అమ్మకాలు 8,356 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ జూలైలో మొత్తం టూవీలర్ వాహన విక్రయాలు 14 శాతం వృద్ధితో 14,76,340 యూనిట్లుగా నమోదయ్యాయి. -
జోరుగా వాహన విక్రయాలు
మారుతీ, హోండా కార్స్ మినహా అన్ని కంపెనీల విక్రయాలు వృద్ధిలోనే ♦ జూన్ నెల వాహన అమ్మకాల తీరు.. ♦ ‘వేతన సిఫారసు’లతో మరిన్ని విక్రయాలు ♦ భవిష్యత్పై కంపెనీల ఆశాభావం న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జూన్లో జోరుగా ఉన్నాయి. వర్షాలు బాగానే కురుస్తుండడం, కొత్త మోడళ్ల కారణంగా జూన్ నెలలో వాహన అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే సుబ్రోస్ సంస్థలో అగ్నిప్రమాదం కారణంగా మారుతీ అమ్మకాలు మాత్రం 14 శాతం పడిపోయాయి. అయితే జిప్సి, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్-క్రాస్, కాంపాక్ట ఎస్యూవీ విటారా బ్రెజ్జాలతో కూడిన యుటిలిటి వాహన విక్రయాలు 76 శాతం పెరగడం విశేషం. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు కూడా క్షీణించాయి. మిగిలిన అన్ని కార్ల కంపెనీలు-టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, రెనో, మహీంద్రా అన్ని కంపెనీలు విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహన కంపెనీలు కూడా మంచి అమ్మకాలనే సాధించాయి. హీరో మోటొకార్ప్ ఒక శాతం వృద్ధిని సాధించగా, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వర్షాలు మంచిగా కురుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయని, దీంతో సెంటిమెంట్, డిమాండ్ మెరుగుపడతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ నెల విక్రయానికి సంబంధించి వివరాలు... మారుతీ సుజుకీ: దేశీయ విక్రయాలు 10 శాతం క్షీణించాయి. చిన్నకార్ల విక్రయాలు 19 శాతం, కాంపాక్ట్ కార్ల విక్రయాలు 13 శాతం, వ్యాన్ల విక్రయాలు 6 శాతం చొప్పున తగ్గాయి. ఎగుమతులు 45 శాతం పడిపోయాయి హ్యుందాయ్: గ్రాండ్ ఐ10, ఇలీట్ ఐ20, క్రెటా కార్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్షాలు మంచిగా కురుస్తుండటం, ఏడవ వేతన సంఘం సిఫారసుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా అమ్మకాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ⇔ మహీంద్రా ఎగుమతులు 41 శాతం, ఫోర్డ్ ఇండియా ఎగుమతులు మూడు రెట్లు, టాటా మోటార్స్ ఎగుమతులు 11 శాతం చొప్పున పెరిగాయి. ⇔ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మోటార్ బైక్ల అమ్మకాలు 27 శాతం, స్కూటర్ల అమ్మకాలు 21 శాతం, ఎగుమతులు 13 శాతం చొప్పున పెరిగాయి. ⇔ పూర్తిగా స్వదేశీ ఆర్ అండ్ డీ టీమ్ అభివృద్ధి చేసిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్బైక్ను త్వరలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
జోరుగానే వాహన విక్రయాలు
♦ మారుతీ, రెనో ఇండియాల జోరు ♦ రేట్ల కోతపై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చి నెలలో జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్, అశోక్ లేలాండ్ కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, హీరో మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఆఫ్ ఇండియాల వాహన అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలున్నాయని, దీంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్(ప్రవీణ్ షా) వ్యాఖ్యానించారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ పనితీరు మిశ్రమంగా ఉందని హీరో మోటొకార్ప్ పేర్కొంది. వర్షాలు మంచిగా కురిస్తే, సకాలంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు బాగా ఉంటాయని వివరించింది. అన్ని మోడళ్లను బీఎస్-4 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తామని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపింది. మరింతగా గ్రామీణ మార్కెట్లలోకి విస్తరిస్తామని పేర్కొంది. గత నెలలో 50వేలకు పైగా బైక్లు విక్రయించామని, ఒక్క నెలలో 50వేల బైక్లు విక్రయించడం చెప్పుకోదగ్గ మైలురాయని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. మారుతీ, హ్యుందాయ్ రికార్డ్ వార్షిక అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, హోండా కార్స్ కూడా మంచి అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 14.2 లక్షలకు, హ్యుందాయ్ అమ్మకాలు 15 శాతం వృద్ధితో 4.8 లక్షలకు చేరాయి. దేశీయంగా వాహన పరిశ్రమ 7 శాతం వృద్ధి సాధిస్తే తమ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయని మారుతీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 13,05,351 దేశీయంగా అమ్మకాలు సాధించామని, గత ఆర్థిక సంవత్సరంలో తమ అమ్మకాలు 2 శాతం పెరిగాయని హోండా కార్స్ పేర్కొంది. -
కార్ల విక్రయాలకు పండుగ కళ..
రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్ న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు.., కొత్త మోడళ్లు, కొత్త వేరియంట్లతో మంచి అమ్మకాలు సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది. పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు బావుంటాయనే ఉద్దేశంతో తమ నెట్వర్క్ను సిద్ధం చేశామని, తమ కంపెనీ చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అక్టోబర్లో అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రాండ్ ఐ10 కూడా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించిందని వివరించారు. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రీమియం బ్రాండ్స్ క్రెటా, ఇలీట్ ఐ20/యాక్టివ్ కార్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన టీయూవీ300 ఎస్యూవీకి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. వడ్డీరేట్లు తగ్గడం, ఇంధన ధరలు కూడా తక్కువ స్థాయిల్లోనే కొనసాగడం కలసివచ్చాయని వివరించారు.రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
జోరుగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్కు ముందు సెప్టెంబర్ నెలలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ అమ్మకాలు పెరిగాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించడంతో వడ్డీరేట్లు దిగొస్తాయని దీంతో అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యక్తం చేశారు. మారుతీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎస్-క్రాస్ కార్లు 3,600 అమ్ముడయ్యాయి. హుందాయ్ కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ అమ్మకాలు(42,505) సాధించింది. క్రెటా, ఇలీట్ ఐ20, ఐ20 యాక్టివ్, గ్రాండ్ కార్ల కారణంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ పేర్కొంది. కొత్త ఫిగో, యాస్పైర్ల కారణంగా ఈ పండుగల సీజన్లో తమ అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనురాగ్ మెహరోత్ర గణాంకాల విడుదల సందర్భంగా చెప్పారు. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
- వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలతో కొనుగోళ్లు వాయిదా..! న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఆగస్టు నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, టయోటా, ఫోక్స్వ్యాగన్ కంపెనీ అమ్మకాలు వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్గా ఉన్నాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా విక్రయాలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నెల... హ్యుందాయ్ కంపెనీకి అత్యధిక అమ్మకాలు సాధించిన నెలగా నిలిచింది. ఇక టూవీలర్ల విక్రయాల్లో హోండా, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్లు వృద్ధి సాధించాయి. కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వివరాలు.., - కొత్త ఎస్యూవీ క్రెటా, ఎలీట్ ఐ20, ఐ20 యాక్టివ్ కార్ల జోరుతో హ్యుందాయ్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికం. - కొత్త మోడళ్ల కారణంగానే అమ్మకాలు పుంజుకున్నాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోగలవని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. -
వాహన విక్రయాల్లో ఫోక్స్వ్యాగన్ నంబర్వన్
{పథమార్ధంలో 50.4 లక్షల వాహనాల విక్రయం రెండో స్థానానికి టయోటా టోక్యో : అంతర్జాతీయంగా అత్యధికంగా వాహనాల విక్రయాల్లో టయోటాను వెనక్కి తోసి ఫోక్స్వ్యాగన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యలో జపాన్ సంస్థ టయోటా 50.2 లక్షల వాహనాలు అమ్మగా, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్ 50.4 లక్షల వాహనాలు విక్రయించింది. 48.6 లక్షల విక్రయాలతో జనరల్ మోటార్స్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దాదాపు దశాబ్ద కాలం అగ్రస్థానంలో కొనసాగిన జనరల్ మోటార్స్ను తోసిరాజని 2008లో టయోటా నంబర్ వన్ ప్లేస్ను దక్కించుకుంది. కానీ 2011లో జపాన్లో భూకంపం, సునామీల తాకి డికి ఉత్పత్తి పడిపోవడం తదితర పరిణామాల కారణంగా స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఏడాది నుంచి మళ్లీ నంబర్వన్గా నిలుస్తూ వస్తోంది. అయితే, ప్రస్తుతం వాహనాల్లో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వివాదాలు చుట్టుముట్టడం, జపాన్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేకపోవడం తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చని టయోటా అంచనా వేస్తోంది. 2014లో 1.02 కోట్ల వాహనాలు విక్రయించిన టయోటా ఈ ఏడాది 1.01 కోట్లకు పరిమితం కావొచ్చని భావిస్తోంది. -
మారుతి సుజుకీ లాభం 56% అప్
క్యూ1లో రూ. 1,193 కోట్లు న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఏకంగా 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు పెరగడం, విదేశీ మారక విలువలు సానుకూలంగా ఉండటంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు సత్పలితాలిస్తుండటం దీనికి దోహదపడినట్లు సంస్థ తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 762 కోట్లే. ఇక, తాజా క్యూ1లో అమ్మకాలు 18 శాతం వృద్ధి చెంది రూ. 11,074 కోట్ల నుంచి రూ. 13,078 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మారుతి సుజుకీ ఇండియా వాహన విక్రయాలు సుమారు 14 శాతం పెరిగి 3,41,329 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 2,99,894 వాహనాలను సంస్థ విక్రయించింది. దేశీయంగా అమ్మకాలు 13 శాతం వృద్ధి చెందాయి. 2,70,643 యూనిట్ల నుంచి 3,05,694 యూనిట్లకు పెరిగాయి. బీఎస్ఈలో మంగళవారం సంస్థ షేరు సుమారు అర శాతం పెరిగి రూ. 4,196 వద్ద ముగిసింది. -
వాహన అమ్మకాలు అటూఇటూ!
మారుతీ, టాటా మోటార్స్ జోరు * ప్రభావం చూపుతున్న గ్రామీణ మార్కెట్ మందగమనం న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మేలో మిశ్రమంగా నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఫోక్స్వ్యాగన్ మినహా మిగిలిన కంపెనీల వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు మాత్రం దేశీయ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. హ్యుందాయ్, హోండాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, టయోటా కంపెనీల అమ్మకాలు తగ్గాయి. ఇక టూ వీలర్ల విషయానికొస్తే హీరోమోటొకార్ప్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు 3 శాతం పెరిగాయి. సెప్టెంబర్ వరకూ ఇంతే... వరుసగా రెండో నెలలోనూ మారుతీ సుజుకీ రెండంకెల వృద్ధిని సాధించింది. ఇదే జోరు రానున్న నెలల్లో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంత, డీజిల్ వాహన విక్రయాలు తగ్గాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వాహన మార్కెట్ ఇంకా రికవరీ బాటలోనే ఉందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదావేస్తూనే ఉన్నారని వివరించారు. వడ్డీరేట్లు తగ్గుతాయనే వారు వెనకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ వరకూ వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉంటాయని, వర్షాలు, ఆర్థిక వ్యవస్థ కుదుటపడడం వంటి కారణాల వల్ల ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. హీరో అమ్మకాలు 5 శాతం డౌన్ వాహన పరిశ్రమ రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. సెంటిమెంట్లు మరింతగా మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. హిందూజా గ్రూప్కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ 40 శాతం వృద్ధిని సాధించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వల్ల తమ అమ్మకాలు 5% తగ్గాయని హీరోమోటొకార్ప్ తెలిపింది. అయినప్పటికీ నెలకు 5 లక్షల చొప్పున టూవీలర్లను విక్రయించగలుగుతున్నామని వివరించింది. ఈ ఏడాది మంచి వృద్ధే ! కంపెనీలు కొత్త మోడళ్లను అందించనుండడం, పట్టణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగుపడడం, కమోడిడీ ధరలు తక్కువగా ఉండడం, వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, జోరుగా ఉన్న మౌలిక సదుపాయాల కల్పన కోసం జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు తదితర కారణాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు సంతృప్తికరమైన వృద్ధినే సాధించగలవని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఏప్రిల్లో షి‘కారు’..!
⇒ పుంజుకున్న వాహన విక్రయాలు ⇒ గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గింది... ⇒ టాప్గేర్లో మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్ న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం వాహన రంగానికి శుభారంభం పలికింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కంపెనీల ఏప్రిల్ నెల అమ్మకాలు జోరుగా పెరిగాయి. కొత్త మోడళ్ల కారణంగా విక్రయాల స్పీడ్ పెరిగిందని పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల ప్రమోషన్ స్కీమ్లు, డీలర్ల డిస్కౌంట్లు. పెళ్లిళ్ల సీజన్, పట్టణ మార్కెట్లో నిలకడగా ఉన్న డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోకపోయినా, వడ్డీరేట్లు దిగిరాకపోయినా ఏప్రిల్లో కొన్ని కంపెనీల అమ్మకాలు జోరందుకోవడం విశేషం. మహీంద్రా అండ్ మహీంద్రా వాహన అమ్మకాలు 1 శాతమే పెరగ్గా, జనరల్ మోటార్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. టూ వీలర్ దిగ్గజం హీరో మోటో కార్ప్ విక్రయాలు 7 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. మొత్తం మీద గత నెలలో ప్రయాణికుల కార్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. గత ఏప్రిల్లో ఈ కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతంగానే ఉంది. భవిష్యత్తు ఆశావహమే... ఈ ఆర్థిక సంవత్సరం ఆశావహంగా ఉండగలదన్న అంచనాలను మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా ప్రభుత్వం సంస్కరణలను, విధానాలను తీసుకొస్తుండడమే దీనికి కారణమని వివరించారు. సెంటిమెంట్స్ సానుకూలంగా ఉన్నాయని, త్వరలో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని, ఫలితంగా తమ అమ్మకాలు మరింత మెరుగుపడగలవని పేర్కొన్నారు. అంచనా వేసిన స్థాయిలకు వినియోగదారుల సెంటిమెంట్ పెరగలేదని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. గ్రామీణ మార్కెట్లో కూడా సమస్యలున్నాయని అందుకే తమ అమ్మకాలు కుదేలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం డిమాండ్పై ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు. వడ్డీరేట్లు దిగివస్తాయని, ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు దశలవారీగా అమల్లోకి వస్తాయని, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయని, అమ్మకాలు పుంజుకోవచ్చని వివరించారు. అకాల వర్షాలు, పంట దిగుబడులు ఆశించినంతగా లేకపోవడం, గ్రామీణ వేతనాల్లో మందగమనం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలయ్యాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇటియోస్ సిరీస్ కార్ల జోరు కారణంగా టయోటా అమ్మకాలు 63 శాతం పెరిగాయి. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
వృద్ధి బాటలో మారుతీ, హ్యుందాయ్ తగ్గిన ఫోర్డ్, మహీంద్రా అమ్మకాలు... న్యూఢిల్లీ : వాహన విక్రయాలు మార్చి నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్ కంపెనీల దేశీయ విక్రయాలు వృద్ధిని సాధించగా, ఫోర్డ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రికార్డ్ స్థాయి అమ్మకాలను మారుతీ సుజుకీ, హోండా కార్స్ ఇండియా, హోండా మోటొకార్ప్లు సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కంపెనీ రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 11,55,041గా ఉన్న మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధితో 12,92,415కు పెరిగాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం మారుతీకి ఇదే మొదటిసారి. భారత వాహన పరిశ్రమ 4 శాతం వృద్ధి సాధిస్తే తాము 11 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అమేజ్, సిటీ కార్లు మంచి అమ్మకాలు సాధిస్తుండటంతో హోండా కార్స్ ఇండియా 23 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి నెలవారీ అమ్మకాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి వార్షిక అమ్మకాలు సాధించింది. 2014-15లో ఈ కంపెనీ వాహన విక్రయాలు 41% వృద్ధితో 1,89,062కు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటొకార్ప్ రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించింది. 2014-15లో వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 62,45,960కు చేరాయని వివరించింది. ఈ ఏడాదీ సవాళ్లే..: ఈ ఏడాది వాహన పరిశ్రమకు సవాళ్లు తప్పవని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మందకొడి ఆర్థిక రికవరీ, అధిక వడ్డీరేట్లు తదితర అంశాల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారని ఫోర్డ్ ఇండియా ఈడీ అనురాగ్ మెహోత్ర చెప్పారు. సమీప భవిష్యత్తులో అమ్మకాలు పుంజుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ పేర్కొన్నారు. -
వాహన విక్రయాలకు ఎక్సైజ్ దెబ్బ
* జనవరి గణాంకాలు విడుదల... * బడ్జెట్పై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది జనవరిలో మిశ్రమంగా ఉన్నాయి. కంపెనీలు ధరలను పెంచడం, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడం వంటి అంశాలు మొత్తం విక్రయాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు)పై ప్రభావం చూపాయి. అయితే ధరలు పెరిగినప్పటికీ, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించినప్పటికీ దేశీయ విక్రయాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హోండా కార్స్, అశోక్ లేలాండ్, యమహా, టీవీఎస్, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, జనరల్ మోటార్స్, ఫోర్డ్, బజాజ్ ఆటో విక్రయాలు మాత్రం తగ్గాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఎక్సైజ్ సుంకం రాయితీల తొలగింపు డిమాండ్పై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా అమ్మకాలపై ప్రభావం చూపాయని ఆ వర్గాలు వెల్లడించాయి. వడ్డీరేట్లు మరింత తగ్గించాలని, పన్నులను హేతుబద్ధీకరించాలని, ఇలా చేస్తే మొదటిసారిగా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని హ్యుందాయ్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. రానున్న బడ్జెట్లో వినియోగదారులకు ప్రయోజనకరమైన, పరిశ్రమకు అనుకూలమైన సంస్కరణలు ప్రభుత్వం తెస్తుందన్న ఆశాభావాన్ని ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మెహరోత్ర చెప్పారు. -
ఆటోమొబైల్ జోరు..
డిసెంబర్లో పెరిగిన వాహన విక్రయాలు సంస్కరణలు కావాలంటున్న కంపెనీలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గత ఏడాది డిసెంబర్లో దుమ్ము దులిపాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియనుండడం, ఏడాది చివరలో నిల్వలు తగ్గించుకోవడానికి కంపెనీలు/డీలర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితుల తదితర అంశాల కారణంగా పలు కంపెనీల వాహన విక్రయాలు పెరిగాయి. దేశీయ అమ్మకాలతో పాటు మొత్తం అమ్మకాలు(దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) కూడా పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ కంపెనీల విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు తగ్గాయి. బడ్జెట్పై ఆశలు అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాహనాలకు డిమాండ్ తక్కువగానే ఉందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ సుంకం రాయితీలను ఉపసంహరించడం వాహన పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుందని ఆయన అబిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం భారీ స్థాయి నజరానాలు ప్రకటించకపోతే, వాహన పరిశ్రమ స్వల్పకాలంలో కోలుకునే సూచనలేమీ లేవని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో వాహన రంగం కీలకమైనదని, అందుకని ఈ రంగానికి సంబంధించి సంస్కరణలు రానున్న బడ్జెట్లో ఉండగలవన్న ఆశాభావాన్ని టయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్. రాజ వ్యక్తం చేశారు. హ్యుందాయ్ రికార్డ్ అమ్మకాలు గత ఏడాది వాహన పరిశ్రమకు గడ్డుకాలమని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. అయినప్పటికీ, గత ఏడాది 4.11 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించామని, ఇది తమ కంపెనీ చరిత్రలో రికార్డని పేర్కొన్నారు. ప్రయాణికుల కార్ల విభాగంలో 22% మార్కెట్ వాటా సాధించామని వివరించారు. దేశీయ అమ్మకాలు 15%, ఎగుమతులు 30% చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ అమ్మకాలకు సంబంధించి వివిధ కంపెనీల విశేషాలు.. ⇒మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 13%, ఎగుమతులు 3 రెట్లు చొప్పున పెరిగాయి. ⇒మహీంద్రా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. అయితే స్కార్పియో, ఎక్స్యూవీ 500, జైలో, బొలెరో, వెరిటో మోడళ్లతో కూడిన ప్రయాణికుల వాహన విభాగం విక్రయాలు 5 శాతం వృద్ధిని సాధించాయి. ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల విక్రయాలు 15 శాతం, ఎగుమతులు 32% చొప్పున తగ్గాయి. ఈ ఏడాది కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తామని, అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ⇒ టయోటా దేశీయ విక్రయాలు 10% పెరిగాయి. ⇒మహీంద్రా ట్రాక్టర్స్ దేశీయ అమ్మకాలు 31% పడిపోయాయి. ఎగుమతులు 52% పెరిగాయి. ⇒రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ విక్రయాలు 48 శాతం, ఎగుమతులు 86 శాతం చొప్పున పెరిగాయి ⇒టీవీఎస్ మోటార్ మొత్తం టూవీలర్ల దేశీయ విక్రయాలు 19% పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 25 శాతం, బైక్ల అమ్మకాలు 22%, మొత్తం టూవీలర్ల అమ్మకాలు 19% చొప్పున పెరిగాయి. ⇒2013లో 61,83,849గా ఉన్న హీరో వాహన విక్రయాలు 2014లో 66,45,787కు పెరిగాయి. -
కార్ల విక్రయాలు జూమ్
పుంజుకున్న నవంబర్ అమ్మకాలు.. రానున్న నెలల్లో మరింత పెరగవచ్చు ముడి చమురు ధరలు తగ్గడం ప్రయోజనకరమే ఎక్సైజ్ సుంకం రాయితీలు మరికొంతకాలం పొడిగించాలి: కార్ల కంపెనీల అభ్యర్థన న్యూఢిల్లీ: వాహన విక్రయాలు నవంబర్లో పుంజుకున్నాయి. పండుగల సీజన్లో పెరిగి, ఏడాది చివరలో వాహన విక్రయాలు తగ్గడం రివాజు. కానీ ఈసారి అనూహ్యంగా నవంబర్లో వాహనాల అమ్మకాలు పెరిగాయి. వాహన పరిశ్రమలో రికవరీకి ఇది సంకేతమని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా కంపెనీల వాహన విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియాలు విక్రయాలు తగ్గాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్గా ఉన్నాయి. వినియోగదారుల సెంటిమెంట్ కనిష్ట స్థాయిలో ఉండడం, అధికంగా ఉన్న వడ్డీరేట్లు కారణంగా డిమాండ్ తక్కువగా ఉంటోందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వల్ల ఇంధన ధరలు కూడా తగ్గుతున్నాయని, దీంతో వాహన అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకుంటాయని చెప్పారు. వాహన పరిశ్రమ మరింతగా కోలుకోవాలంటే కార్లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు రాయితీలు మరికొంత కాలం పొడిగించాలని, అలాగే జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడంతో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతోందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. ఏడాది కాలంలో నాలుగు కొత్త మోడళ్లను అందించడం వల్ల అమ్మకాలు బావున్నాయని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్)రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 41 శాతం, స్కూటర్ల అమ్మకాలు 62 శాతం చొప్పున పెరిగాయని టీవీఎస్మోటార్ పేర్కొంది. కాగా మారుతీ సుజుకీ ఎగుమతులు 53 శాతం పెరిగాయి. నవంబర్లో ఐదు లక్షలకు పైగా టూవీలర్లను విక్రయించామని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఏడాది కాలంలో కొత్తగా 150 డీలర్ల అవుట్లెట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇటీవలే కొలంబియాలో ఆరు హీరో మోడళ్లను అందిస్తున్నామని,120 అవుట్లెట్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నామని వివరించింది. ఈ నవంబర్ నెలలోనే 150 సీసీ మోడల్ ఎక్స్ట్రీమ్లో స్పోర్టీయర్ వెర్షన్ను విడుదలచేశామని పేర్కొంది. -
రికవరీ బాటలో వాహన మార్కెట్
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్లో జోరుగా ఉన్నాయి. వాహన మార్కెట్ రికవరీ బాట పట్టిందని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోట, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల దేశీయ విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో కూడిన మొత్తం అమ్మకాలు కొన్ని కంపెనీలవి మినహా పుంజుకున్నాయి. కొత్త మోడళ్లు, పండుగల సీజన్ ప్రారంభం కావడం, తదితర అంశాలు దీనికి కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి రికవరీకి ఇంకా సమయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సెంటిమెంట్ పాజిటివ్గా ఉందని, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకోగలవని నిపుణులంటున్నారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసేవాళ్లు, ఎక్స్ఛేంజ్ విధానంలో కార్లను కొనుగోలు చేసేవాళ్లు పెరుగుతున్నారని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 10 శాతం పెరగ్గా, ఎగుమతులు 28 శాతం చొప్పున తగ్గాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 15 శాతం పెరగ్గా, ఎగుమతులు 21 శాతం తగ్గాయి. జనరల్ మోటార్స్ అమ్మకాలు 37 శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్లో టయోట అమ్మకాలు 4 శాతం పెరిగాయి. నిస్సాన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తమ అమ్మకాలు 107 శాతం పెరిగాయని పేర్కొంది. ఫోర్డ్ ఇండియా ఎగుమతులు రెట్టింపయ్యాయి. టాటా మెటార్స్ ఎగుమతులు 18 శాతం పెరిగాయి. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా బైక్ల అమ్మకాలు 19 శాతం, స్కూటర్ల అమ్మకాలు 50 శాతం చొప్పున పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ టూ-వీలర్ల అమ్మకాలు 29 శాతం, స్కూటర్ల అమ్మకాలు 63 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 18 శాతం, ఎగుమతులు 15 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఆటో ఎగుమతులు 19 శాతం పెరిగాయి. -
టాప్ గేర్లో మారుతీ..
- ఆగస్టులో జోరుగా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు - పండుగల సీజన్పై ఆశలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయి. సెంటిమెంట్ మెరుగుపడడంతో మారుతీ సుజుకి, హోండా కార్స్, హ్యుందాయ్, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో మంచి వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్, తదితర కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ కార్లు(స్విఫ్ట్, ఎస్టిలో, సెలెరియో, రిట్జ్, డిజైర్ కార్ల) అమ్మకాలు 53 శాతం పెరగడం విశేషం. మొత్తం మీద మారుతీ దేశీయ అమ్మకాలు 27 శాతం పెరిగాయి. గత నెలలో కూడా మారుతీ అమ్మకాలు మెరుగుపడ్డాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు మాత్రం 19 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి) విషయంలో ఆగస్టు నెల వివిధ కంపెనీలకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక టూవీలర్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలన్నీ విక్రయాల్లో 20 శాతానికి మించి వృద్ధి సాధించాయి. పండుగ సీజన్లో మరింత జోరుగా ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని, ఈ ప్రభావం వాహనాల కొనుగోళ్లపై ఉంటోందని నిపుణులంటున్నారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఉండే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) డిమాండ్ పెరిగి వాహన విక్రయాలు జోరుగా ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం, కొత్త మోడళ్లు, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర అంశాల కారణంగా పండుగల సీజన్ సందర్భంగా అమ్మకాలు బాగుంటాయనే ఆశాభావాన్ని వివిధ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని దీంతో వాహన మార్కెట్లో వ్యాపార విశ్వాసం మెరుగైందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోగలవని పేర్కొన్నారు. పండుగల సీజన్ సందర్భంగా కొత్త మోడళ్లను, అప్గ్రేడ్ వేరియంట్లను మొత్తం 10 కొత్త ఉత్పత్తులను అందించనున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలు... • ఐషర్ మోటార్స్ దేశీయ అమ్మకాలు 66% పెరి గాయి. ఎగుమతులు 47% వృద్ధి చెందాయి. • మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 27 శాతం, ఎగుమతులు 10 శాతం చొప్పున పెరిగాయి. • హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 19% పెరగ్గా, ఎగుమతులు 40% తగ్గాయి. ఎలైట్ ఐ20, ఎక్సెంట్, గ్రాండ్ వంటి కొత్త కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. • మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గాయి. • టయోటా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. • నెలా నెలా తమ అమ్మకాలు పెరుగుతున్నాయని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. రానున్న నెలల్లో అమ్మకాల్లో మరింత వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. -
వాహన అమ్మకాలు ఓకే..
* జూలైలో మారుతీ, హ్యుందాయ్, హోండా, టయోటా దేశీ విక్రయాలు అప్ * వరుసగా మూడో నెలలోనూ పెరిగిన దేశీ సేల్స్... * పరిశ్రమ పుంజుకుంటున్న సంకేతాలు... పండుగల సీజన్పై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది జూలైలో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల దేశీయ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా కంపెనీల సేల్స్ పుంజుకున్నాయి. కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు పెరగడం వరుసగా ఇది మూడో నెల. దీర్ఘకాలంగా మందగమనంలో ఉన్న వాహన మార్కెట్ పుంజుకుంటోందన్నడానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ అమ్మకాలకు సంబంధించి మారుతీ 20 శాతం, హ్యుందాయ్ 13 శాతం, హోండా కార్స్ ఇండియా 40 శాతం, టయోటా 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. సెంటిమెంట్ మెరుగు ఆర్థిక వృద్ధి మందకొడిగా ఉండటంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. ఈ రంగానికి ఊపునివ్వడానికి గత ప్రభుత్వం ఫిబ్రవరిలో తన మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ సుంకాల తగ్గింపును కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ వరకూ పొడిగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, డిమాండ్ పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ముందుంది మంచి కాలం: వర్షాలు ఓ మోస్తరుగా ఉండడం, స్థూల ఆర్థిక అంశాలు నిలకడగా ఉండడం వంటి కారణాల వల్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్త కొత్త మోడళ్లను అందించడం వల్ల డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. వినియోగదారుల సెంటిమెంట్ గత కొన్ని నెలలుగా క్రమక్రమంగా పుంజుకుంటోందనడానికి చాలా సూచనలున్నాయని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా చెప్పారు. స్టాక్ మార్కెట్లు పెరగడం, తయారీ రంగం పుంజుకోవడం వంటి అంశాలు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటానికి దోహద పడ్డాయని వివరించారు.సెంటిమెంట్ కొద్దిగా మెరుగుపడినప్పటికీ, అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం రేట్లు వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండటంతో రానున్న నెలల్లో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. కాగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నందున రానున్న నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని కొన్ని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
పుంజుకున్న వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: అంతంత మాత్రం అమ్మకాలతో అతలాకుతలం అవుతున్న వాహన పరిశ్రమకు జూన్లో ఊరట లభించింది. ఈ జూన్లో కార్లు, ఇతర వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు జూన్30తో ముగుస్తుందని, ఆ తర్వాత వాహనాల ధరలు పెరుగుతాయనే అంచనాలతో అమ్మకాలు పెరిగాయని నిపుణులంటున్నారు. ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పలువురు వాహన కొనుగోళ్లను వాయిదా వేశారని, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం కూడా అమ్మకాల వృద్ధికి కారణమని వారంటున్నారు. గత రెండేళ్లుగా అమ్మకాల్లేక పెరిగిపోయిన నిల్వలను తగ్గించుకోవడానికి కార్ల కంపెనీలు భారీగానే డిస్కౌంట్లను, వివిధ ఆఫర్లను ఇస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడంతో అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం రాయితీ కొనసాగింపు కొనుగోలుదారుల సెంటిమెంట్స్ను మెరుగుపరచిందని, రానున్నది పండుగల సీజన్ అని అమ్మకాలకు ఢోకా లేదని ఈ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ కంపెనీలు అమ్మ కాలు వృద్ధి బాటన దూసుకుపోయాయి. జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. మారుతీ సుజుకికి చెందిన ఎం800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్లతో కూడిన మినీ సెగ్మెంట్ అమ్మకాలు 52% పెరిగాయి. ఎక్సెంట్, గ్రాండ్, శాంటాఫే కార్ల కారణంగా అమ్మకాల్లో 10 శాతం వృద్ధి సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.