Womens Empowerment
-
పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్తాన్.. ఎందుకంటే?
ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఈ స్పెషల్ జెర్సీని రాజస్తాన్ ఆటగాళ్లు ధరించారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం పింక్ కలర్తో నిండిపోయింది. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తమ జట్టు కొట్టే ఒక్కో సిక్సర్కు.. రాజస్థాన్లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5 — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024 -
మహిళా సాధికారతే మా లక్ష్యం
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలో పర్యటించారు. రాజధాని తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి మోదీ వెంటే’ పేరిట నిర్వహించిన మహిళల బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ‘మోదీ గ్యారంటీ’ల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించామని చెప్పారు. మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. త్రిపుల్ తలాఖ్ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేలి్చచెప్పారు. మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఇప్పుడు చట్టంగా మారిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విపరీతమైన జాప్యం చేశాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేరళలో మంచి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
లండన్ నుంచి పేదోళ్ల ఇంటి వరకు...
బ్రిటీష్–ఇండియన్ మోడల్గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన. భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. మన బాలీవుడ్తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది. ‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన. ఇంగ్లాండ్లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ‘ఇండియాస్ ఫర్గాటెన్ పీపుల్’ (నెట్ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్ఫారమ్లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
మహిళా సాధికారత అంటే ఇదీ..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారు. పార్టీలు, పైరవీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగల్గుతున్నారు. నాటి పాలకులు నమ్మించి మోసం చేస్తే నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2019 ముందు వరకు పట్టాలు తప్పిన ఆ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్న రూ.25,517 కోట్లను అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం ముందుకొ చ్చింది. ఇప్పటికే రెండు విడతలుగా అందులో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో మహిళలకు ఇచ్చే డబ్బును వారు తిరిగి చెల్లించక్కర్లేదు. వాటిని వారు ఏ అవసరానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు 45–60 ఏళ్ల వయస్సు ఉండే 25 లక్షల మంది మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేల చొప్పున అందజేసేందుకు 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పేరుతో మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరికీ రెండు విడతలుగా రూ.9,179.69 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఇక రాష్ట్రంలో 18 ఏళ్లు, ఆ పైబడి వయస్సు ఉండే మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వీరిలో ఈ రెండు పథకాల ద్వారా దాదాపు కోటి మంది మహిళలు రూ.24,938 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారు. రుణాల మంజూరు, చెల్లింపుల్లోనూ మనమే టాప్ రాష్ట్రంలో 80 శాతానికి పైగా మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల పేరుతో వీరికి ప్రభుత్వపరంగా ఒకవైపు ఆర్థిక చేయూత అందుతుండగా.. మరోవైపు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల పేరుతో వారికి పెద్దఎత్తున రుణాలు అందజేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో దాదాపు 9 లక్షల పొదుపు సంఘాలకు 2019 మే తర్వాత 33 నెలల కాలంలో రూ.61,106.38 కోట్ల రుణాలు అందాయి. అలాగే, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2022 జనవరి మధ్య దాదాపు 45 లక్షల మంది మహిళలు రూ.19,095 కోట్లు రుణాలు పొందారు. దీంతో దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరుతో బ్యాంకులిచ్చే రుణాలలో దాదాపు 30 శాతం మన రాష్ట్రంలోని మహిళలకే అందుతున్నాయని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇలా రుణాలను ప్రభుత్వం ఇప్పించడంతోపాటు ఆ రుణాలను మహిళలు ఎప్పటికప్పుడు చెల్లించడంలోనూ మన రాష్ట్రమే దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.2,354 కోట్ల వడ్డీని చెల్లించిన సర్కారు గతంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు 13.50 శాతం వార్షిక వడ్డీకి రుణాలు ఇచ్చేవి. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు వీలైనంత తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఇప్పుడు 9.50 శాతం వడ్డీకే ఇస్తున్నాయి. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే ఏటా ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఇలా గత రెండేళ్లలో రూ.2,354 కోట్లు చెల్లించింది. ఎంఎన్సీ కంపెనీలతో అదనపు తోడ్పాటు ఇదిలా ఉంటే.. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణాల ద్వారా అందజేసిన డబ్బుతో వారికి శాశ్వత జీవనోపాధి కల్పనకూ ప్ర త్యేక ఏర్పాట్లుచేసింది. మహిళలు వారి గ్రామాల్లో కిరాణా షా పులు వంటి చిరువ్యాపారాలను ప్రారంభించుకోవడానికి ముందుకొస్తే, వారికి హోల్సేల్ మార్కెట్లో దొరికే ధర కన్నా తక్కువకే సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు.. పాడి పశువుల పెంపకం చేçపట్టే వారికి అధిక ధర దక్కేలా అమూల్ సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. అలాగే, పొట్టే ళ్లు, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టే వారికి సైతం అధిక ధర దక్కేలా ప్రపంచ స్థాయిలో మాంసం వ్యాపారం చేసే అలానా సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా 4,77,851 కుటుంబాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాయి. నాడు విలవిల.. నేడు మిలమిల తెలుగుదేశం హయాంలో నాటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాటి రుణాలపై అమలులో ఉన్న జీరో వడ్డీ పథకానికీ నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రతినెలా కోట్ల రూపాయలను పొదుపు చేసుకునే మహిళలు ఒకానొక దశలో రూ.ఐదారు లక్షలు కూడా దాచుకోలేని పరిస్థితికి దిగజారాయి. 18.36 శాతం సంఘాలు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. ఫలితంగా ఏ, బీ గ్రేడ్ల్లోని సంఘాలు సీ, డీ గ్రేడ్లోకి పడిపోయాయి. ఈ నేపథ్యంలో.. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి ఎప్పటికప్పుడు నిధుల విడుదలతో పొదుపు సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. ఎంతలా అంటే.. నిరర్థక ఆస్తులుగా ఉన్న 18.36% సంఘాలు 0.73 శాతానికి పరిమితమయ్యాయి. అంతేకాదు.. 99.27 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించేస్తున్నారు. అలాగే, గతంలో 40శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్లలోను, 60శాతం సంఘాలు సీడీ గ్రేడ్లలోనూ ఉండగా.. ప్రస్తుతం 90శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్ల స్థాయికి ఎదిగాయి. ► గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కారుమూరు సుధాకరమ్మ ఆర్నెల్ల క్రితం వరకు వ్యవసాయ కూలీ. చదివించే స్థోమతలేక ఇంటర్ చదివిన ఒక్కగానొక్క కొడుకును పనిలో పెట్టింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుతో పాటు పొదుపు సంఘం పేరిట బ్యాంకు నుంచి వచ్చిన రుణంలో తన వాటాను కలిపి చిల్లరకొట్టు పెట్టుకుంది. దీంతో ఇప్పుడామె రోజూ రూ.రెండు, రెండున్నర వేల వరకు వ్యాపారం చేసుకుంటోంది. తద్వారా నాలుగైదు వందలు ఆదాయం వస్తోంది. అంతకుముందు ఏడాదిలో ఎక్కువ రోజులు డబ్బులకు కటకటలాడే సుధాకరమ్మ ఇప్పుడు మారిన పరిస్థితులతో తన కొడుకును డిగ్రీలో చేర్పించాలనుకుంటోంది. ► ఈమె పేరు ఇప్పిలి కళావతి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామం. ఈమె భర్త మరణించాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు మానసిక దివ్యాంగురాలు. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బే ఈమెకు జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కారు అమలుచేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు ఆమె జీవితాన్ని మార్చాయి. ఆసరా పథకం ద్వారా రూ.37,642లు, వైఎస్సార్ చేయూత ద్వారా రెండు విడతల్లో రూ.37,500 జమకావడంతో ఆమె ఊరిలోనే టైలరింగ్ చేసుకుంటూ కిరాణాషాపు పెట్టుకుని గౌరవంగా జీవిస్తోంది. స్త్రీనిధి ద్వారా అదనంగా మరో రూ.50 వేలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంటోంది. ఇప్పుడు ప్రతినెలా ఖర్చులు పోను రూ.15 వేలు వరకు ఆదాయం వస్తోంది. ► ఈమె పేరు రేష్మ. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. పొదుపు సంఘంలో సభ్యురాలు కావడంతో ఇంట్లోనే చీరల వ్యాపారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో భర్త సలీం సహకారంతో శారీ మ్యాచింగ్ సెంటర్నూ ప్రారంభించారు. పొదుపు సంఘం ద్వారా రూ.50వేల బ్యాంకు రుణం వచ్చింది. అలాగే, సున్నా వడ్డీ కింద రూ.2వేలు మాఫీ అయ్యింది. అంతేకాక.. పొదుపు రుణ మాఫీ ద్వారా రెండేళ్లలో రూ.30 వేలు మాఫీ అయింది. మరోవైపు టైలరింగ్ చేస్తుండడంతో టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కింద రెండేళ్లలో రూ.20వేలు వచ్చింది. ఇలా.. వైఎస్ జగన్ సర్కారు తోడ్పాటుతో రెండేళ్లలో ఈ కుటుంబానికి రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుండడంతో ‘అమ్మఒడి’ కూడా వచ్చింది. -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
Falguni Nayar: నైకా నాయిక
నైకా... సౌందర్య సాధనాల దిగ్గజం.. అందంతో పాటు మహిళా సాధికారత కూడా ఈ కంపెనీ లక్ష్యం... చిన్నస్థాయిలో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించి, కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు నైకా సిఈవో ఫల్గుణీ నాయర్. ‘పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు’ అనే వ్యాపార సూత్రాన్ని ఆచరించి చూపారు నైకా కంపెనీ సిఈవో ఫల్గుణీ నాయర్. బ్యూటీ ప్రాడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు... ఈ మూడు అంశాలు ఒక స్త్రీని ఉన్నత స్థానం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫల్గుణీ నాయర్. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన ఫల్గుణీ, అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ఫల్గుణీ నాయర్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక, 19 సంవత్సరాల పాటు కొటక్ మహీంద్రా గ్రూప్కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. 2005లో ఆ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. యుటీవీకి చెందిన రోనీ స్క్రూవాలా, పీవీఆర్ సినిమాస్కి చెందిన అజయ్ బిజిలీల నుంచి నాయకత్వ లక్షణాలతో పాటు, ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నారు. విజయగాథ... ఎవరు ఏ ఉత్పత్తులు వాడితే మంచిదనే విషయాన్ని వివరిస్తూ 2012లో నైకా స్థాపించారు ఫల్గుణీ నాయర్. ఈ ఆలోచన రావటానికి కారణం... పలురకాల ఉత్పత్తులు తయారుచేస్తున్న సెఫోరా కంపెనీ. ఎన్నడూ సౌందర్య సాధనాలు ఉపయోగించని ఫల్గుణీ, వారి ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు. అప్పుడే తను కూడా ఒక కంపెనీ ప్రారంభించి, భారతదేశ సౌందర్య సాధనాలను ప్రపంచానికి చూపాలనుకున్నారు. అదేవిధంగా భారతీయ మహిళలు ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ‘‘ఉత్తమ సౌందర్య సాధనాలు తయారుచేస్తూ, భారతదేశాన్ని సౌందర్య సాధనాలకు ప్రతిరూపంగా చూపుతూ, వినియోగదారులకు వాటి మీద అవగాహన కలిగించాలనుకున్నాను’’ అంటారు ఫల్గుణీ నాయర్. అందంగా కనిపించాలనే కోరిక ఉన్న మహిళలకు ఈ సాధనాలు ఉపయోగపడాలనుకున్నారు. అలా వారంతా నైకాకి అతి త్వరగా కనెక్ట్ అయ్యారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలి.. అంటారు ఫల్గుణీ నాయర్. నైకా ప్రారంభించినప్పుడు అదొక ఈ కామర్స్ వెబ్సైట్ మాత్రమే. ఇప్పుడు ఈ కంపెనీ మహిళా సాధికారతకు కావలసిన అంశాలను వివరించటం మీద దృష్టి పెట్టింది. ‘బ్యూటీ అండ్ వెల్నెస్’ మీద ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల బ్యూటీ అడ్వైజర్ కావటానికి అవకాశం ఉంటుంది... అంటారు ఫల్గుణీ నాయర్. -
కొత్త అవకాశాలను అందుకున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ పథకాలను ఔత్సాహిక మహిళలకు చేరవేయడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (కోవె) శాయశక్తులా కృషి చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకూ లబ్ధి చేకూర్చేందుకు పలు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీ మెళకువలు, మార్కెటింగ్లో సాయం, బ్యాంకుల నుంచి రుణం మంజూరులో కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకూ వెన్నంటి ఉంటున్నామని కోవె నేషనల్ ప్రెసిడెంట్ సౌదామి ని ప్రొద్దుటూరి తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆసరా లేని వారికీ.. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వడమేగాక తదుపరి స్థాయికి వారు చేరేందుకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 100 మందికిపైగా అంతర్జాతీయంగా ఎదిగారు. ఎటువంటి ఆసరా లేని వారూ కోవె తలుపు తడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కోవె సభ్యులే ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. వ్యాపార రుణం కో సం బ్యాంకుల వద్దకు వెళ్తున్న దరఖాస్తుల్లో 10% మాత్రమే సఫలం అవుతున్నాయి. నిబంధనల పేరుతో తిరస్కరించకుండా మిగిలిన 90% దరఖాస్తుదార్లకూ రుణం అందితేనే మరింత మంది మహిళలు వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారు. అవకాశాలుగా మల్చుకున్నారు.. కోవిడ్–19 మహమ్మారి వేళ చాలా మంది తమ వ్యాపారాలను మూసివేశారు. అయితే వారికి ధైర్యం చెప్పి దారి చూపించాం. నైపుణ్యాన్ని అవకాశాలుగా మల్చుకుని ఆహారోత్పత్తుల తయారీలోకి చాలా మంది ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్లో రసోయి క్వీన్ పేరుతో చేసిన ఓ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. వంటల్లో చేయి తిరిగినవారిని ప్రోత్సహించి ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ ఇచ్చాం. బేకరీ, కర్రీ పాయింట్స్, క్యాటరింగ్, స్నాక్స్ తయారీతోపాటు హోటల్స్ను ప్రారంభించారు. ప్రముఖ హోటళ్లలో చెఫ్లుగా మారిన వారూ ఉన్నారు. రసోయి క్వీన్ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ నిర్వహించనున్నాం. శాశ్వతంగా కోవె మార్ట్.. మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహిళా వ్యాపారులకు అండగా నిలిచేందుకు సిడ్బి సాయంతో కోవె మార్ట్ పేరుతో ఆన్లైన్ వేదికను కొన్ని నెలలపాటు నిర్వహించాం. ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో కోవె మార్ట్ను శాశ్వత ప్రాతిపదికన త్వరలో ప్రారంభించనున్నాం. కోవె ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేశాం. ఇక్కడ 60 కంపెనీలు నెలకొల్పాలన్నది ఆలోచన. అలాగే పలు రాష్ట్రాల్లోనూ కోవె పారిశ్రామిక పార్కులను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ నెల 6–8 తేదీల్లో జరిగే బిజినెస్ వుమెన్ ఎక్స్పోలో వినూత్న ఉత్పత్తులు కొలువుదీరనున్నాయి. 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
ధైర్యము నీవే కదా
భయంలో పిల్లాడు ‘అమ్మా’ అని వెళ్లి అమ్మ పొట్టలో తల దూరుస్తాడు. తండ్రిపులికి సిఫారసు కోసం ‘అక్కా’ అని వెళ్లి అక్కను ఆశ్రయిస్తాడు తమ్ముడు. అధైర్యంలో, అగమ్యంలో.. ఆలోచన కోసం భార్య వైపు చూస్తాడు భర్త. ‘జాబ్ వచ్చాక ఇస్తాలే’ అని గర్ల్ఫ్రెండ్ని చేబదులు అడుగుతాడు నిరుద్యోగి. కష్టాల్లో యావత్ మానవాళి ప్రత్యక్ష దైవం స్త్రీ. ‘ఆ చేత్తోనే మాకూ ఇంత అభయం ప్రసాదించమని’ ఇప్పుడీ కరోనా సంక్షోభంగా పెద్ద పెద్ద కంపెనీలు మహిళల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ‘వర్క్ఫ్రమ్ హోమ్’ ఇస్తున్నాయి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్లలోనూ సగంగా ఉండబోతోంది. ఎత్తులో సన్నటి తాడుపై పడిపోకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం నడుస్తూ ఉండటమే స్త్రీకి ఇల్లూ ఆఫీస్. ఇంటిని చూసుకునేవారు ఎవరైనా ఉంటే, ఇంటిని తను కూడా చూసుకోవాలన్న తపన భర్తకూ ఉంటే ఆమె మరింత మెరుగ్గా తన ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చగలదు. ఈ విషయం లాక్డౌన్ కాలంలో రుజువైంది కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్లో మహిళలు అత్యుత్తమమైన ఫలితాలను తమ కంపెనీలకు సాధించి పెట్టాయి. వారి పని తీరు మెరుగైంది. వేగవంతం అయింది. ఎక్కువ పని కూడా జరిగింది. పురుషులు మాత్రం ఆఫీస్లో ఎంత పని చేశారో ఇంట్లోనూ అంతే పని, లేదంటే అంతకు తక్కువ పని చేసినట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది కూడా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలాన్ని నెగ్గుకు రావడానికి, మునుపటి లాభాల్లోకి త్వరితంగా వెళ్లిపోడానికి మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అదీ వర్క్ ఫ్రమ్ హోమ్లోకి! దీనివల్ల మహిళల శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. మగవాళ్లు ఆఫీస్లో వర్క్ చేస్తుంటే.. వాళ్ల కన్నా మిన్నగా, మెరుగ్గా మహిళలు ఇంటి నుంచి చేస్తున్నారు. ∙∙ ఒక రంగం అని కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్, మెటల్ అండ్ మైనింగ్ మహిళా శక్తిని ఆలంబనగా చేసుకుంటున్నాయి! యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత, ఆర్పీజీ గ్రూప్, దాల్మియా సిమెంట్, టాటా కెమికల్స్ వంటి సంస్థలు మహిళల్ని చేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంతో మహిళలూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు వచ్చే ఏడాది తమ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగాలకు దేశంలోని రెండు వేల క్యాంపస్ల నుంచి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించింది. అందులో 40 శాతం వరకు మహిళా అభ్యర్థులకే కేటాయించింది! ఇక ఇన్ఫోసిన్ కంపెనీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘అప్పుడే కాలేజీ నుంచి బయటపడిన’ (ఫ్రెష్ బ్యాచ్) పట్టభద్రులకు 17 వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. అందులో సగం పూర్తిగా యువతులకే. దాల్మియా సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసమే నియామకాల్ని చేపట్టనుంది. అందుకోసం మహిళా కళాశాలల్లో, మహిళా విశ్వ విద్యాలయాలలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టాటా స్టీల్స్లో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజ్మెంట్ విభాగంలో నలభై శాతం వరకు మహిళలే ఉండబోతున్నారు. పనివేళల్ని సులభతరం చేస్తే మహిళల పని సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీల అనుభవంలోకి వచ్చింది కనుకనే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రముఖ ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేహా బగారియా చెబుతున్నారు. ‘‘అంతేకాదు.. స్త్రీ, పురుషుల నియామకాలలో ప్రస్తుతం ఉన్న అంతరం తగ్గి, జెండర్ డైవర్సిటీ వృద్ధి చెందుతుంది’’ అని కూడా ఆమె అంటున్నారు. నేహా బగారియా, ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ సీఈవో. -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
పల్లె ఆర్థికంగా బలపడితేనే.. మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్కు చెందిన అమూల్తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా సోమవారం మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను సర్కారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయకుండా ఎలాంటి మార్పులను తీసుకురాలేం. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఎలాంటి ఫలితాలు సాధించలేం. – అందుకే మా ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టిపెట్టింది. వారి జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభిస్తున్నాం. – దీని ద్వారా రూ.4,500 కోట్లను మహిళలకు అందజేస్తాం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు ఈ ‘చేయూత’ను అందిస్తున్నాం. – దీనికింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. – చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ‘వైఎస్సార్ ఆసరా’ కూడా వర్తిస్తుంది. – ఏటా దాదాపు రూ.6,700 కోట్లను ‘ఆసరా’ కింద ఇస్తాం. సెప్టెంబరులో దీనిని కూడా అమలుచేస్తాం. – ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్లను దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం. – ఈ సహాయం.. వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి. – ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. – ప్రభుత్వం చేయూతనిస్తుంది.. బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. – మహిళల స్వయం సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. – ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించాలి. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎం అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం మహిళలు సాధికారిత సాధించడం అంటే.. కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్లే. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైనది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరం. మహిళలకు చేయూతనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేయూత పథకం మైలురాయిగా నిలిచిపోతుంది. సమగ్రాభివృద్ధి కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాం. – సంజీవ్ మెహతా, హెచ్యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏడాదిలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ఈ సంస్కరణలు పెనుమార్పులు తీసుకువస్తాయి. మహిళల సాధికారత ద్వారా అభివృద్ధి సాధించాలన్న సీఎం ఆలోచన మంచి మార్పులకు నాంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించడంలో కీలకమైనది. సామాజిక రంగంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మేం కూడా ఆ దిశగా కార్యకలాపాలు చేస్తున్నాం. – సంజీవ్ పూరి, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎం దార్శినికత బాగుంది ముఖ్యమంత్రి దార్శినికత బాగుంది. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు మా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. మేం భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా అనుభవాలను పంచుతాం. మీతో కలిసి ముందుకు సాగుతాం. – మధుసూదన్ గోపాలన్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ సీఎం జగన్ సమక్షంలో ఒప్పందాలు అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్యూఎల్ జీఎస్ఎం చట్ల రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ సంజీవ్ రాంగ్రాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్లో మహ్మద్ అన్సారి, క్లస్టర్ సీఈఓ, ఏపీ–తెలంగాణ.. జెబాఖాన్, వైస్ప్రెసిడెంట్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ పాల్గొన్నారు. -
శ్వేత ఐపీఎస్
‘నాలెడ్జ్ ఈజ్ పవర్.. స్కిల్ ఈజ్ ఎనర్జీ’ అంటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవడం, మహిళల భద్రత, ఉద్యోగాల ప్రయత్నాల్లో యువతకు ప్రోత్సాహం, పోలీసు పాలనలో నూతన ఆవిష్కరణలు.. ఇలా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు శ్వేత. తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా శ్వేత వచ్చారు. కొద్ది కాలంలోనే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో షీ టీం బృందాలను ఏర్పాటు చేశారు. ఆకతాయిలను గుర్తిస్తూ వారికి మహిళలను గౌరవించడం పట్ల కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీసు సిబ్బంది పురుషులతో సమానంగా ఉండాలంటే వారికి అన్ని పనులు తెలిసి ఉండాలని అందరికి డ్రైవింగ్ నేర్పించారు. విధుల్లో మహిళా సిబ్బంది ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనేది శ్వేత ముఖ్యోద్దేశం. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించారు. అంతేకాకుండా మహిళల్లో ఆత్యస్థైర్యాన్ని నింపడం కోసం స్వయంగా వారితో మాట్లాడడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తున్నారు. ఎస్పీ శ్వేత 2017 డిసెంబర్ 31న 13 జిల్లాలకు సంబంధించిన సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్ను కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆమె ఎంతగానో శ్రమించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఫీడ్బ్యాక్ సెంటర్ను డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 10,802 ఫిర్యాదులు, 33,318 ఎఫ్ఐఆర్లు, 27,251 పాస్పోర్టు ఎంక్వైరీలకు సంబంధించిన విచారణ జరిగింది. కామారెడ్డి పట్టణ, దేవునిపల్లి పోలీస్స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దారు. 5 ఎస్ విధానాన్ని (సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండరై్డజ్, సస్టెయిన్) అమలు చేస్తూ రికార్డులను, వసతులను, సౌకర్యాల నిర్వహణను అత్యాధునికంగా మెరుగుపర్చారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక గదులు, సదుపాయాలు కల్పించారు. ఎస్పీ శ్వేత మొదటి నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1342 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నేరాల నియంత్రణ కోసం క్రమం తప్పకుండా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్) విధానం శ్వేత ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. మరోవైపు నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణలను అందించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘యువ నేస్తం’ కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు వెళ్తున్న యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించారు. ఐదు వందల మందికి శిక్షణ ఇప్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ పోలీసు క్యాడెట్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఈ బృందాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోని తొమ్మిది మంది సభ్యులలో శ్వేత కూడా ఒకరు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదువు.. చొరవ.. కాన్ఫిడెన్స్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని దూరం చేసేందుకు ప్రతీ మహిళ ఉన్నత చదువుల వైపు దృష్టి సారించాలి. ఏదైనా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నమ్మకానికి తగినట్లుగా శ్రమించాలి. నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమే. మంచి స్నేహితులు కూడా అవసరమే. తోటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. కుల, మత వివక్షలు ఉండకూడదు. – శ్వేత, ఎస్పీ, కామారెడ్డి -
స్త్రీలోక సంచారం
ఇంత మంచి గుడ్ వరల్డ్లో ఉన్నాం కదా.. ‘కన్యత్వ పరీక్ష’ అనే బ్యాడ్ వర్డ్ ఇంకా వినిపిస్తూనే ఉంది! ఒక ఆడపిల్ల కన్యా, కాదా? అని తెలుసుకోడానికి చేసే అనాగరికమైన పరీక్ష ఇది. ఇందులోనే ఇంకా అనాగరికం.. కొందరు డాక్టర్లు చేసే ‘టూ–ఫింగర్ టెస్ట్’. సాధారణంగా.. ఒక యువతి, లేదా బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజముందా లేదా నిర్థారించడానికి చేసే పరీక్షల్లో టూ–ఫింగర్ టెస్ట్ ఒకటి. బాధితురాలి జననావయవంలోకి రెండు వేళ్లు చొప్పించి, ఆ వేళ్లు సులువుగా లోపలికి ప్రవేశించగలిగితే ఆమె కన్య కాదనీ, వేళ్ల ప్రవేశం కష్టం అయితే ఆమె కన్య అని ఒక కంక్లూజన్కి వస్తారు! ఈ టెస్ట్లోనే వేళ్లకు కన్నెపొర (జననావయవ అంతర్ ముఖద్వారంలో ఉండే పొర) అడ్డుపడితే ఆమె కన్య అయినట్లు, పొర అడ్డుపడకపోతే ఆమె కన్య కానట్లు భావిస్తారు. ఇదొక అర్థం లేని పరీక్ష అని నికార్సైన వైద్య నిపుణులు ఏనాడో తేల్చి పారేసినప్పటికీ.. ఇప్పటికీ చాలాచోట్ల అత్యాచారం కేసులలో అధికారికంగా, నూతన వరుడు సందేహపడిన సందర్భంలో అనధికారికంగా ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ చేస్తున్నారు. కన్నెపొర లేకపోవడానికి, జననాంగ గోడలు వదులుగా ఉండడానికి కన్యత్వాన్ని కోల్పోవడమే కారణమవక్కర్లేదు. పొర, వదులు అన్నవి ఆటల్లో పోవచ్చు. ఇప్పుడీ బ్యాడ్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఓ గుడ్ డాక్టర్ ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వైద్య పాఠ్యాంశాలలోనే లేకుండా తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఆ డాక్టరు గారి పేరు ఇంద్రజిత్ ఖండేకర్. మహారాష్ట్రలోని సేవాగ్రామ్లో ఉన్న ‘మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ లో ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అయినా ‘టూ–ఫింగర్ టెస్ట్’ అనే ఈ పరీక్ష.. వైద్యపుస్తకాల్లో ఎందుకు ఉన్నట్లు? మొదట ఎవరో చేర్చారు. తర్వాత ఎవరూ మార్చలేదు. డాక్టర్ ఖండేకర్ ఆరోగ్య శాఖకు మాత్రమే రాయలేదు. భార త వైద్య మండలికి, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, మహారాష్ట్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్కూ.. ఈ టూ–ఫింగర్ టెస్ట్ ప్రస్తావనను పుస్తకాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తులు పంపారు. ‘ఇదొక బుద్ధిలేని, అసంబద్ధమైన పరీక్ష’ అని ఆయన ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వర్ణించారు. ఆడపిల్లను ఫిజికల్గా బాధ పెట్టి, అవమానించే ఈ పరీక్ష మహిళపై జరిగే హింస కంటే కూడా ఎక్కువే అని అంటారు ఖండేకర్. 2018 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ‘యు.ఎన్. ఉమెన్’ కూడా ఇదే మాట చెప్పింది. అయితే మొత్తం అన్ని రకాలైన కన్యత్వ పరీక్షల గురించి చెప్పింది. ఇలాంటి పరీక్షలకు ముగింపు పలకాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ‘ది క్వింట్’ భారతదేశంలో పేరున్న న్యూస్ వెబ్సైట్. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తోంది. క్వింట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ‘మి, ది ఛేంజ్’ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్న 18–23 ఏళ్ల మధ్య వయసు గల యువతులలోంచి ‘ఉమన్ అచీవర్’ని ఎంపిక చేయడం కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. సైట్లోకి వెళ్లి, నామినేషన్ ఫారమ్లో మీకు తెలిసిన యంగ్ ఉమెన్ అచీవర్ వివరాలను పొందుపరిస్తే చాలు. మీరు నామినేట్ చేస్తున్నప్పుడు మీ పేరును వెల్లడించడం తప్పనిసరేం కాదు. మీ ఇ–మెయిల్, మీ కాంటాక్ట్, మీరు సూచిస్తున్న యువతి పేరు, ఆమె వయసు, ఆమె సాధించిన విజయం, ఆమె వివరాలు ఇస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్, మీ సోదరి.. వారెవరైనా సరే మీరు నామినేట్ చెయ్యొచ్చు. ‘మి, ది ఛేంజ్’ కాంపెయిన్కి ప్రముఖ మలయాళీ నటి పార్వతి తన సహకారం అందిస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
‘ఇప్పుడే వస్తాను బిడ్డను పట్టుకో’ అని చెప్పిన వెళ్లిన తల్లి మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డ ఏడుస్తోంది. బిడ్డను ఎత్తుకున్న ఆ మగ మనిషికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ పాలు పట్టబోయాడు. పాప తాగలేదు. దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పాపను అప్పగించి తనూ వెళ్లిపోయాడు. పాప ఏడుపు ఆపడం లేదు. డ్యూటీలో ఉన్న కాదిస్టేబుల్కు ఏం చేయాలో తోచలేదు. ఇంటికి ఫోన్ చేశాడు. ‘పాల కోసం ఏడుస్తున్నట్లుంది. ఇంటికి తీసుకురండి’ అంది ఆయన భార్య. ‘ఆ పాపను మనమే మన సొంత కూతురిలా పెంచుకుందాం’ అని కూడా చెప్పింది. అప్పటికే ఆ దంపతులకు ఒక మగబిడ్డ. ‘‘అలా చేయలేం’’ అని చెప్పాడు. వెంటనే ఆమె తన బిడ్డను చంకనేసుకుని భర్త పని చేస్తున్న పోలీస్స్టేషన్కు వచ్చింది. చంకలోని బిడ్డను భర్తకు ఇచ్చి, స్టేషన్లో ఉన్న బిడ్డను చంకేసుకుని తన పాలు పట్టించింది. కడుపులో పాలు పడగానే పాప ఏడుపు మానింది. పాలు పట్టిన ఆ తల్లి కూడా కాన్స్టేబులే! పాప తల్లి చిత్తుకాగితాలు ఏరుకునే మనిషి అని పాపను పోలీస్స్టేషన్లో ఇచ్చి వెళ్లినతను చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోషణలేక పాప బలహీనంగా ఉంది. ఆ పసికందుకు ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడా కానిస్టేబుల్ దంపతులు. ఈ సంఘటన ఏడాది చివరి రోజు హైదరాబాద్లో జరిగింది. కేరళ ప్రభుత్వం జనవరి 1 సాయంత్రం తలపెట్టిన 630 కిలోమీటర్ల పొడవైన ‘మహిళాహారం’ (వనితామతిల్) విజయవంతం అయింది. ఉత్తర కేరళలోని కాసర్గడ్ జిల్లా నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకు జాతీయ రహదారి వెంబడి దాదాపు 20 లక్షల మంది మహిళలు చేయీచేయి కలిపి మహిళాహారాన్ని నిర్మించారు. ‘‘లైంగిక సమానత్వ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలంతా మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ నటి, యాక్టివిస్టు మాలా పార్వతి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో జనవరి 1 నుంచి వస్త్రధారణ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రధానంగా మహిళా భక్తుల కోసం ఉద్దేశించిన ఈ నిబంధన ప్రకారం దర్శనానికి, ఆర్జిత సేవలకు వచ్చేవారు చీర, లెహంగా వంటి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించవలసి ఉంటుంది. ఆలయ పవిత్రతను, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాల కార్యనిర్వాహక అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. అయితే ఈ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ ఎ.పి. శాఖ కార్యదర్శి పి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. -
స్త్రీలోక సంచారం
గుజరాత్ పదహారేళ్ల నీలాంశీ పటేల్ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. పశ్చిమ బెంగాల్ మిసెస్ ఎన్.సి.సేన్గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది. న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్లో క్రిస్మస్ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు. పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ లైఫ్’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్లోకి విడుదల అవుతోంది. -
స్త్రీలోక సంచారం
చదువులోను, పరిశుభ్రతను పాటించడంలోనూ ముస్లిం బాలికలు ముందుంటున్నారని ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అన్నారు. అభివృద్ధి ఆర్థికవేత్త, ‘సుధీర్ కమిషన్’ సభ్యుడు అయిన ఖాన్ హైదరాబాద్లో జరిగిన ‘అనాథలకు ఆర్థిక సహాయం’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ఇండియాలో ముస్లిం బాలికలు చదువులో వెనుకబడి ఉంటారన్న ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. దేశంలో చదువు అందుబాటులో ఉన్న 80 శాతం మంది బాలికల్లో 90 శాతం మంది ముస్లిం బాలికలే. ఈ తొంభై శాతం అంతా కూడా జీవించడానికి అత్యవసరమైన ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నవారే. ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ వీళ్లు ముందున్నారు. ‘శుద్ధీకరణ’ (అబ్లూషన్) ఆచారంలో భాగంగా ముస్లిం బాలికలు రోజుకు ఐదుసార్లు చేతులు శుభ్రపరచుకుంటారు’’ అని అమీరుల్లా ఖాన్ వివరించారు. ‘‘చదువుకున్న అమ్మాయిల్ని ముస్లిం సమాజం గౌరవిస్తుంది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఎక్కువమంది బాలికలు ఉన్నతస్థాయి విద్యకు నోచుకోలేకపోతున్నారు’’ అని ఖాన్ అన్నారు. ‘సుధీర్ కమిషన్’ రాష్ట్రంలోని ముస్లింల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేస్తుంటుంది. ఈ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెక్సికో నుంచి యు.ఎస్.కి శరణార్థులుగా వచ్చే వారిని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘వలస శరణార్థుల నియంత్రణ’ బిల్లుకు వ్యతిరేకంగా మహిళా న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్.. ఆసుపత్రి పడక మీద నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులు ఆమె ఎడమ ఊపిరితిత్తిలోని రెండు క్యాన్సర్ కణుతులను తొలగించిన అనంతరం, వైద్య సేవల కోసం ఆమె ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన బిల్లు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐదుగురిలో నలుగురు జడ్జీలు ఓటు వేయగా, మిగిలిన ఒక ఓటు కూడా వ్యతిరేకంగా పడితే ప్రతిపాదన వీగిపోయే కీలకమైన స్థితిలో గిన్స్బర్గ్ తన ఓటును నిరర్థకం చేసుకోదలచుకోలేదు. సన్నిహితులు చుట్టూ ఉండగా, ఆసుపత్రి కుర్చీలో కూర్చుని 85 ఏళ్ల వయసులోఎంతో ఉత్సాహంగా ట్రంప్ కోరుకుంటున్న బిల్లుకు వ్యతిరేకంగా ఆమె ఓటు వేశారు. ప్రస్తుతం గిన్స్బర్గ్ ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి జనవరి ఆరంభంలో మొదలయ్యే కోర్టు వాదోపవాదాలకు హాజరవుతారు. ‘టైమ్’ మ్యాగజీన్ 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో మలాలా యూసఫ్జాయ్ కూడా ఒకరు. ‘కూడా ఒకరు’ కాదు. ఆ జాబితాలో ఒబామాకు 51వ స్థానం వస్తే, మలాలా 15వ స్థానంలో ఉన్నారు! ఆ సంచిక విడుదల అయినప్పుడు మలాలా ఆసుపత్రిలో ఉన్నారు. తాలిబన్ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా తను బడికి వెళ్లడమే కాకుండా, బాలికలకు చదువు ఎంత అవసరమో ఆమె చెప్పడం తప్పయింది. తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బులెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకుంటుండగానే టైమ్ జాబితాలో మలాలా పేరు వచ్చింది. ఆ సంగతిని మలాలా తండ్రి జియావుద్దీన్కి ఆయన డ్రైవర్ ద్వారా తెలిసింది. వెంటనే తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయించుకుని టైమ్ కవర్ పేజీపై ఉన్న మలాలా ముఖచిత్రాన్ని కూతురుకి చూపించాడు. అప్పుడు మలాలా స్పందన ఆయన్ని ఆశ్చర్యపరిచింది. ‘మనుషుల్ని ప్రత్యేకంగా చూపించే ఇలాంటి విభజనలపై నాకు నమ్మకం లేదు నాన్నా’ అని ఆ వయసులోనే మలాలా అన్నారట. ఈ విషయాన్ని తన తాజా పుస్తకం ‘లెట్ హర్ ఫ్లయ్ : ఎ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ’ అనే పుస్తకంలో రాసుకున్నారు జియావుద్దీన్. లండన్లోని ప్రతిష్టాత్మకమైన ‘డబ్లు్య.హెచ్. అలెన్ అండ్ కంపెనీ’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. -
డిగ్నిటీ మార్చ్ ముంబయి టూ ఢిల్లీ!
‘మీ టూ ’ ఉద్యమం ఏమైంది? మగవాళ్ల దాష్టీకాలు ఇలాగే ఉంటాయని సరిపెట్టుకుంటున్నారా ఆడవాళ్లు. కొన్నేళ్ల కిందట బీజం పడిన ఈ ఉద్యమం, ఏడాది కిందట మొలకెత్తింది. హాలీవుడ్ డైరెక్టర్ హార్వీ వైన్స్టీన్ దురాగతాలతో ఒక్కొక్కరుగా బయటకొచ్చారు బాధిత మహిళలు. హార్వీ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వాళ్లు గళమెత్తినప్పుడు ప్రపంచం.. ‘నిజమే కదా పాపం’ అని నిట్టూర్చింది. అదే ‘మీటూ’ ఈ ఏడాది మనదేశాన్ని కూడా కుదిపేసింది. సినిమా, రాజకీయ, మీడియా రంగాల్లో చాలామంది మగవాళ్లు తొడుక్కున్న పెద్ద మనిషి ముసుగును ఆమాంతం లాగి పడేసింది. ఆఫీసుల్లో మగ ఉన్నతాధికారులు గుండెల్లో పరుగెత్తుతున్న రైళ్ల మోత బయటకు వినిపించకుండా ఛాతీని చిక్కబట్టుకున్నారు. అంత ఉధృతంగా విస్తరించిన ఈ లైంగిక వేధింపు నివారణోద్యమం కొద్ది రోజులుగా ఒక రూపుదిద్దుకున్నట్లే, ఒక మలుపు తిరుగుతున్నట్లే కనిపించింది. నిజానికి ఏమైంది? ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు అనేక మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. ‘మీటూ’కి మద్దతు పలికిన మహిళలకు తెర వెనుక వేధింపులు మొదలయ్యాయా? అందుకే వాళ్లు తెరమరుగయ్యారా... అనే సందేహాలూ వచ్చాయి. మహిళా ఉద్యమకారులూ మిన్నకుండి పోయారేంటని అనేక నుదుళ్లు ముడివడ్డాయి. వాళ్ల మగవాళ్లు కూడా ఈ పంకిలంలో ఉన్నారా అనే సందేహాలూ పురుడుపోసుకున్నాయి. వీటన్నింటì పై ఆలోచన రేకెత్తించేందుకు ‘డిగ్నిటీ మార్చ్ ముంబయి టూ ఢిల్లీ’ అంటూ కదం తొక్కనున్నారు భారతీయ మహిళలు. పదివేల కిలోమీటర్లు ఇంతకాలం ఒక నిశ్శబ్ద విప్లవమే నడిచింది. వేధింపులకు గురైన మహిళలు సోషల్ మీడియాలో తమకు ఎదురైన లైంగిక దాడుల గురించి షేర్ చేసుకున్నారు. బాధితులు సంఘటితమయ్యారు. చాప కింద నీరులా ప్రవహించింది ఉద్యమం. పాదం పాదం కలుపుతూ ఒక మహా ప్రస్థానానికి నాంది పలుకుతోందిప్పుడు. ఈ రోజు (డిసెంబర్ 20వ తేదీ) ముంబయిలో మొదలయ్యే ఈ ప్రయాణం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ముంబయిలో మొదలయ్యే ఈ పాదయాత్ర దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. పదివేల కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర... ముంబయి, పుణే, షోలాపూర్, పనాజి, బెంగళూరు, త్రివేండ్రం, వెల్లూరు, నెల్లూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, రాయ్పూర్, భువనేశ్వర్, కోల్కతా, డార్జిలింగ్, పాట్నా, లక్నో, భోపాల్, ఉదయ్పూర్, అహ్మదాబాద్, అజ్మీర్, జైపూర్, శ్రీనగర్, సిమ్లా, చండీగఢ్, డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలు మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొత్తం రెండు వందల జిల్లాల మీదుగా సాగుతుందీ మార్చ్. ‘అడుగడుగునా’ సంఘీభావం అరవై రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర నిర్వహణలో రాష్ట్రీయ గరిమా అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన భూమిక పోషిస్తోంది. రాష్ట్రీయ గరిమా అభియాన్ సంస్థ ఈ డిగ్నిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మూడు వందల చిన్నచిన్న ఎన్జీవోలతో కలిసి నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ప్రధానంగా కొంతమంది బాధిత మహిళలు, నిర్వాహకులు మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతారు. మిగిలిన వాళ్లు పాదయాత్రికులకు సంఘీభావంగా వారి వారి నగరాల్లో వచ్చి కలిసి, సమావేశాలను విజయవంతం చేస్తారు. ట్రాఫికింగ్కి గురై రక్షింపబడిన మహిళలు కూడా మీటూకి కొనసాగింపుగా జరుగుతోన్న డిగ్నిటీ మార్చ్కు మద్దతిస్తున్నారు. ఇకపై సహించం ముంబయిలో మొదలై ఢిల్లీకి చేరే ఈ డిగ్నిటీ మార్చ్లో పాల్గొనే మహిళల మధ్య సామాజిక, ఆర్థిక సరిహద్దులుండవు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వాళ్లతో పాటు, వ్యవస్థీకృతం అయిన రంగాలతోపాటు వ్యవస్థీకృతం కాని రంగాల మహిళలకు కూడా ఇది వేదికే. బాధిత మహిళలు, వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పోలీసులు అందరినీ ఒక వేదిక మీద తీసుకువస్తున్న ప్రయత్నమిది. లైంగిక వేధింపుకు, లైంగిక దోపిడీకి గురైన మహిళలు సంఘటితం కావాలి, తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బిడియ పడకుండా ధైర్యంగా బయటపెట్టాలి. ఇలాంటి దురాగతాలను ‘ఇకపై సహించేది లేద’ని సమాజాన్ని ఎలుగెత్తి చాటాలి. పురుష సమాజంలో పరివర్తన వచ్చే వరకు నినదిస్తూనే ఉండాలి, గళం వినిపిస్తూనే ఉండాలి. మహిళ సెకండ్ సిటిజెన్గా ఉన్న ఈ సమాజంలో ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణం నెలకొనే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి. లైంగికవేధింపులు, బాడీ షేమింగ్కు పాల్పడే ఆలోచనలు చెరిగిపోయేవరకు పోరాడాలనేదే ఈ డిగ్నిటీ మార్చ్ లక్ష్యం. నివారించాలంటే నోరు విప్పాలి వయొలెన్స్ అగైనెస్ట్ ఉమెన్... ఈ అంశం మీద ఎంత ఎక్కువ మాట్లాడితే అంత త్వరగా సమస్య పరిష్కారమవుతుంది. మౌనంగా భరిస్తూ ఉన్నంత కాలం ఈ దురాచారం మరింతగా వేళ్లూనుకుంటుంది. అందుకే వేధింపుకు గురైన ప్రతి ఒక్కరూ ప్రతిచోటా గొంతెత్తాలి. ఈ హింసను నిరసిస్తూ అంతర్జాతీయస్థాయిలో గడచిన నవంబర్ 25 నుంచి డిసెంబర్ పది వరకు పదహారు రోజులు సదస్సులు జరిగాయి. స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ రాబోయే జనవరి 15 నుంచి 25 వరకు జరిగే వన్ బిలియన్ ర్యాలీలో శతకోటి ప్రజాదళం పాల్గొంటుంది. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ గళమెత్తే ఉద్యమాల్లో ‘మీటూ’ ఒకటి. మీటూ ఎంతటి విజయవంతమైన ఉద్యమమంటే.. కేంద్రమంత్రి ఎం.జె అక్బర్, తరుణ్ తేజ్పాల్ వంటి సీనియర్ జర్నలిస్టులను ఎడిటర్స్ గిల్డ్ నుంచి తొలగించే వరకు వెళ్లింది. ఇప్పుడు వార్తల్లో కనిపించడం లేదనే కారణంతో అంతటి పతాకస్థాయికి వెళ్లిన ఉద్యమం చల్లారిపోయిందనుకుంటే పొరపాటే. సమాజంలో లింగ వివక్ష, లైంగిక దోపిడీ ఉన్నంత కాలం ఈ ఉద్యమాలన్నీ ఉంటాయి. ఈ డిగ్నిటీ మార్చ్ కూడా అందులో భాగమే. ఈ రోజు ముంబయిలో మొదలయ్యే మార్చ్ జనవరి ఐదవ తేదీకి హైదరాబాద్కి వస్తుంది. మేము (భూమిక స్వచ్ఛంద సంస్థ, ఇతర భావసారూప్యం కలిగిన సంస్థలు, వ్యక్తులు) పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి, ఇక్కడ సమావేశాలు నిర్వహించిన తర్వాత పోచంపల్లి, సూర్యాపేట వరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్లోకి సాగనంపుతాం. ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలూ పాల్గొంటున్నాయి. – కొండవీటి సత్యవతి, రచయిత్రి, భూమిక స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి -
ప్రియాంక గాంధీ పుస్తకం.. కాంగ్రెస్ పార్టీ హోప్స్!
కష్టాలు, కడగండ్లలో ఉన్న మహిళల విజ్ఞప్తులను స్వీకరించి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు, అవస రమైతే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘స్వాధార్ గృహ్’ షెల్టర్ హోమ్లలో తక్షణం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ఐదు, ఒడిస్సాలో ఎనిమిది, కర్ణాటకలో ఎనిమిది, ఉత్తర ప్రదేశ్లోని ఐదు స్వాధార్ హోమ్లను తనిఖీలు జరిపించిన అనంతరం మేనక ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. స్వాధార్ గృహ్ పథకం కింద ఏర్పాటైన షెల్టర్ హోమ్లలో అసహాయ మహిళల్ని భౌతికంగా వేధిస్తున్నారని, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య సేవలు అందడం లేదని తనిఖీ అధికారులకు ఫిర్యాదు అందడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయంపై ఇప్పటికింకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఆమె రాస్తున్న ఒక పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు లేకుండా పోవని అంతా భావిస్తున్నారు. ‘అగైన్స్ట్ అవుట్రేజ్’ అనే టైటిల్తో రాబోతున్న 300 పేజీల ఆ పుస్తకానికి ప్రచురణకర్తలు ఇప్పటికే కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2019 మార్చి లోపు ప్రియాంక ఆ పుస్తకం స్క్రిప్టును అందజేయవలసి ఉంటుంది. ఇంగ్లిషు, హిందీ, మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు, ఆడియో బుక్గానూ అందుబాటులోకి రానున్న ‘అగైన్స్ట్ అవుట్రేజ్’.. ఎన్నికలకు నెల ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీకి, ఆయన ఆమెరికన్ ప్రియురాలు మేఘన్ మార్కెల్కు ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. అనంతరం మార్కెల్ యు.ఎస్.తో తన భవబంధాలనన్నింటినీ తెంచేసుకుని రాజప్రాసాదంలోకి అడుగు పెట్టారు. అలా ఆమె తెంచుకున్న బంధాలలో ఆమె తండ్రి థామస్ కూడా ఒకరు. ఆయన రాస్తున్న ఉత్తరాలకు ఆమె స్పందించడం లేదు. ఇస్తున్న మెసేజ్లకు రిప్లయ్ ఇవ్వడం లేదు. దీంతో దుఃఖితుడైన థామస్ ‘నా కూతురికి దూరంగా ఉండలేకపోతున్నానని’ ఏకంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్నే ఆశ్రయించారు. ‘కనీసం క్రిస్మస్కైనా నా కూతురు నా దగ్గరకు వచ్చేలా ఒప్పించండి’ అని ఒక అమెరికన్ టీవీ షో లో కన్నీరు మున్నీరవుతూ రాణిగారిని అభ్యర్థించారు. థామస్ గతంలో టీవీ లైటింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రిటైర్మెంట్లో ఉన్నారు. నెత్తిపై అప్పులు ఉన్నాయి. కూతురు మంచి పొజిషన్లో ఉంది కనుక తనకు చెడు కాలం తప్పుతుందని ఆయన ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 2015 జూలై 9న ప్రదర్శన జరుపుతున్న 300 మంది సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులపై చైనా ప్రభుత్వం ‘దేశ విద్రోహులు’గా ముద్ర వేసి వారిపై విరుచుకుపడింది. వారిలో నలుగురిని కారాగారంలో బంధించి ఇప్పటి వరకు వారి ‘నేరం’పై విచారణ జరిపించడం గానీ, శిక్ష విధించడం గానీ చేయలేదు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ నలుగురి భార్యలు శిరోజాలు తీయించుకుని హైకోర్టు ఎదుట ప్రదర్శన జరిపారు. ‘ఇదెక్కడి న్యాయం?’ అని ప్రశ్నించారు. చైనాలో ‘ఊఫా’ అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. న్యాయం ధర్మం లేకపోవడం ఒక అర్థం కాగా, తలపై జుట్టు లేకపోవడం ఇంకో అర్థం. ఈ రెండు అర్థాలనూ సం++గురు మహిళలు ఇలా శిరోజాలు తీయించుకుని న్యాయం కోసం పోరాడుతున్నారు. -
స్త్రీలోక సంచారం
అరవై ఐదేళ్ల ఆమ్రాదేవి నలభై ఏడేళ్ల నిరీక్షణ ఈ ఆదివారం ‘విజయ్ దివస్’ రోజున ఫలించింది. ఆమె నిరీక్షిస్తున్నది తన భర్తను చూడడం కోసం. ఆమ్రాదేవి ఉత్తరకాశీ అమ్మాయి. పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయింది. అప్పటికి ఆమె భర్త వయసు ఇరవై ఏళ్లు. అతడి పేరు సుందర్. పెళ్లయ్యే నాటికి సుందర్ భారత సైన్యంలో ‘బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్’ రెజిమెంట్లో సైనికుడు. పెళ్లయ్యాక ఫొటో దిగడం కోసం దగ్గరలోని దుండా పట్టణానికి పెద్దవాళ్లు ఈ దంపతుల్ని తీసుకెళ్లబోతుండగా సుందర్కి కబురొచ్చింది, తక్షణం వచ్చి యుద్ధంలో చేరమని! భార్య చెయ్యి వదిలి అప్పటికప్పుడు యుద్ధక్షేత్రంలోకి దుమికాడు సుందర్. 1971 ఇండో–పాక్ వార్ అది. అయితే యుద్ధానికి వెళ్లాక అతడు మళ్లీ తిరిగి రాలేదు. అతడి మృతదేహం తూర్పు పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడో గుర్తు తెలియని చోట ఖననం అయింది. ఇన్నేళ్లలోనూ భర్త ఎలా ఉంటాడో మర్చిపోయింది కానీ, భర్తతో తన బంధాన్ని మర్చిపోలేదు ఆమ్రాదేవి. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. సైన్యంలో ఉండగా అతడు తీయించుకున్న ఫొటోనైనా (ఒకవేళ తీయించుకుని ఉంటే) చూడకపోతానా అని ఎదురుచూస్తూ ఉంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. జిల్లా యంత్రాంగంలోని అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 16న.. ఆ యుద్ధంలో పాకిస్తాన్పై ఇండియా గెలిచిన ‘విజయ్ దివస్’ రోజు ఆమ్రాదేవి చేతికి ఆమె భర్త ఫొటో అందింది. సైనికుల గ్రూప్ ఫొటోలోంచి సుందర్ని వేరు చేసి, అతడి ఫొటోను పెద్దదిగా చేసి, దానికి ఫ్రేమ్ కట్టించి జిల్లా అధికారులు ఆమెకు కానుకగా అందజేశారు! లక్కీ కదా! ‘‘అయితే ఆమె కాదు, మేము లక్కీ’’ అంటున్నారు సైనిక్ వెల్ఫేర్ బోర్డు డి.డి.పంత్. ‘‘ఆమ్రాదేవి అభ్యర్థన మేరకు సిపాయి సుందర్ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందా అని మావాళ్లు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక దొరకదని అనుకున్నాక సుందర్ బొమ్మను వేయించి ఆమ్రాదేవికి అందజేశాం. అయితే పోలికలు గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె అన్నారు!. మళ్లీ వెతుకులాట ప్రారంభించాం. చివరికి అతడు పని చేసిన రెజిమెంట్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రికార్డులన్నీ గాలించాం. మొత్తానికి ఓ గ్రూప్ ఫొటోలో సుందర్ దొరికాడు’’ అని పంత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఎలా ఉండేవారో, ఎలా మాట్లాడేవారు మర్చేపోయాను. కానీ ఆయన స్వరూపం లీలగా నేటికీ నా కళ్లలో కదలాడుతూనే ఉంది. యుద్ధంలో శత్రువుతో పోరాడుతూ ఆయన చనిపోయారని తెలుసుకోగానే గర్వంగా అనిపించినప్పటికీ, నా శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినట్లుగా బాధపడ్డాను’’ అన్నారు ఆమ్రాదేవి, ఫొటోలో తన భర్తను కళ్ల నిండా చూసుకుంటూ. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీలు, పార్లమెంటు అధికారులతో పాటు ఒక సాధారణ మహిళ కూడా ఆ ప్రాంగణంలో కనిపిస్తున్నారు! ఆమె పేరు పూర్ణిమా గోవిందరాజులు. వయసు 54. చేతిలో కాగితాల కట్ట పెట్టుకుని, స్పష్టతనిచ్చే ఒక ప్రజాప్రతినిధి కోసం ఆమె వెదుకుతున్నారు. అది ఆమె జీవిత సమస్యకు అవసరమైన స్పష్టత. ఈ ఏడాది అక్టోబర్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఒక ప్రకటన చేశారు. బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా ‘పోక్సో’ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్)– 2012 కింద ఎప్పుడైనా నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చుననీ, అందుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదన్నది ఆ ప్రకటన సారాంశం. పూర్ణిమ ప్రస్తుతం కెనడాలో కన్సర్వేషన్ బయాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు పదేళ్ల వయసులో సమీప సన్నిహితుడొకరు పూర్ణిమను లైంగికంగా వేధించి, కొన్నాళ్లపాటు నరకం చూపించాడు. అతడింకా జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతడిపై పోక్సో చట్టం కింద కేసు వేసేందుకు కెనడా నుంచి ఇండియా వచ్చారు పూర్ణిమ. అయితే పోక్సో చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన సంఘటన కనుక దానిపై పోక్సో చట్టం ప్రకారం కేసు వేయవచ్చా అన్న స్పష్టత వచ్చే వరకు కేసును స్వీకరించడం కుదరక పోవచ్చునని పూర్ణిమ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్పష్టత కోసమే పూర్ణిమ పార్లమెంటు ప్రాంగణంలో మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనకాగాంధీని సంప్రదించే ఆలోచనలోనూ ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులో ఒక ఎంపీ.. ‘బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పష్టతను కోరడంతో పూర్ణిమలో ఆశలు చిగురించాయి. 2019 జనవరి 11న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తన సమస్యకొక పరిష్కారం దొరకొచ్చని ఆమె భావిస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
చెన్నైలోని అంబూర్లో హనీఫా జారా అనే ఏళ్ల బాలిక తన తండ్రి మరుగుదొడ్డి కట్టించడం లేదని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మా నాన్నగారు రెండేళ్ల క్రితమే ఇంట్లో టాయ్లెట్ కట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పటికీ కట్టించలేదు. నేను పెద్దదాన్ని అవుతున్నాను. ఆరు బయటికి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది’’ అని హనీఫా తన ఫిర్యాదులో రాసింది. ప్రస్తుతం ఆ బాలిక రెండో తరగతి చదువుతోంది. ఎల్.కె.జి.లో ఉన్నప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే టాయ్లెట్ కట్టిస్తానని తన తండ్రి మాట ఇచ్చి మోసం చేశాడని, మాట తప్పినందుకు ఆయన్ని అరెస్ట్ చెయ్యడం గానీ, టాయ్లెట్ కట్టిస్తానని లిఖితపూర్వకమైన హామీ ఇప్పించడం గానీ చెయ్యాలని హనీఫా పోలీసులకు కోరింది. అంబూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చెయ్యడం కోసం వెళ్లినప్పుడు హనీఫా తనతోపాటు స్కూల్లోను, ఆటల్లోనూ తనకు వచ్చిన 20 పతకాలను, సర్టిఫికెట్లను తన ప్రతిభకు రుజువుగా తీసుకెళ్లింది. హనీఫా సంకల్పబలానికి ముగ్ధురాలైన ఎస్సై ఎ.వలమర్తి పారిశుద్ధ్య అధికారులతో మాట్లాడి టాయ్లెట్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హనీఫా తండ్రి ఎసానుల్లా (31)కి సోమవారం మధ్యాహ్నం 3.30కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో ఆందోళనగా బయల్దేరి వెళ్లాడు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇది ఊపిరి పీల్చుకునే విషయం కాదని ఎస్సై అతడిని సున్నితంగా మందలించారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలియగానే అంబూరు మున్సిపాలిటీ హనీఫాను ‘స్వచ్ఛ భారత్’ స్కీమ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది! ‘ఫియర్లెస్ గర్ల్’గా ప్రఖ్యాతి చెందిన కాంస్య విగ్రహాన్ని న్యూయార్క్లోని వాల్స్ట్రీట్ నుంచి న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజి భవనం ఆవరణకు తరలించారు. స్త్రీ సాధికారతకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబర్ అడ్వైజర్స్’ సంస్థ 2017 మార్చి 7న మహిళా దినోత్సవానికి ముందు రోజు వాల్స్ట్రీట్లో ‘చార్జింగ్ బుల్’ విగ్రహానికి అభిముఖంగా ఆ బుల్ని సవాల్ చేస్తున్నట్లుగా ప్రతిష్టించింది. స్టాక్ మార్కెట్లో మహిళా భాగస్వామికి, నాయకత్వానికి సూచికగా ఉంచిన ఈ విగ్రహం కింద ఫలకంపై ‘‘స్త్రీల నాయకత్వపు శక్తిని తెలుసుకోండి. తనేమిటో చూపించగలదు’’ అని రాసి ఉంటుంది. విగ్రహాన్ని అక్కడ ఉంచేందుకు మొదట 30 రోజుల వ్యవధిని మాత్రమే అనుమతి ఇచ్చిన నగరపాలక సంస్థ, ఆ తర్వాత ఆ ‘ఫియర్లెస్ గర్ల్’కు విశేష ఆదరణ లభించడంతో ప్రముఖుల అభ్యర్థనపై వ్యవధి గడువును పెంచుతూ వచ్చింది. అది కూడా ముగియడంతో చివరికి అక్కడి నుంచి తొలగించి, స్టాక్ ఎక్చ్సేంజి భవనం దగ్గరికి చేర్చారు. విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో బాలిక పాదాల జాడల్ని మాత్రం అలాగే ఉంచుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ‘స్విఫ్ట్ ఇండియా’ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ‘సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్’ (స్విఫ్ట్)కు ప్రస్తుతం చైర్మన్గా ఉన్న ఎం.వి.నాయర్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావస్తుండడంతో అరుంధతిని బోర్డ్ చైర్మన్గా ఎంపిక చేసుకున్నట్లు స్విఫ్ట్ ఇండియా సీఈవో కిరణ్ శెట్టి తెలిపారు. 62 ఏళ్ల అరుంధతి ఎస్.బి.ఐ. తొలి మహిళా చైర్మన్గా గుర్తింపు పొందారు. 2016 ఫోర్బ్స్ ‘100 మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ది వరల్డ్’జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. -
స్త్రీలోక సంచారం
దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన యు.పి.లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) తొలిసారిగా బాలికల హాకీ టీమ్ని జాతీయ స్థాయి పోటీలకు పంపించబోతోంది! ఇందుకోసం క్యాంపస్ పరిధిలోని పది స్కూళ్ల నుంచి బాలికల్ని ఎంపిక చేసి వారితో హ్యాకీ టీమ్ని సిద్ధం చేస్తోంది. అంతా సవ్యంగా జరిగితే కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్–స్కూల్ కాంపిటిషన్కి ఎ.ఎం.యు. బాలికల తొట్టతొలి హాకీ జట్టు పోటీ పడుతుంది. సర్ సయ్యద్ హాల్ సమీపంలోని యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారత అంతర్జాతీయ హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు అనీస్ ఉర్ రెహ్మాన్ కోచింగ్లో ఈ జట్టు శిక్షణ పొందుతోంది. మైదానంలో వీళ్ల ప్రాక్టీస్ను చూసి సీనియర్ విద్యార్థినులు (డిగ్రీ) కూడా తరగతులు అయ్యాక సరదాగా హాకీ ఆడేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవడంతో క్యాంపస్ మునుపెన్నడూ లేని విధంగా బాలికలు, యువతుల హాకీ ఆటతో కళకళలాడుతోంది. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో ప్రారంభం అయింది. మహిళలకు లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు స్థానాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ రాష్ట్రాలకు లేఖలు పంపారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రిజర్వేషన్లను తీర్మానించి, ఆమోదం పొందాలని ఆయా రాష్ట్రాలను ఆయన కోరారు. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన తీర్మానాలు చేశాయని ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘‘193 దేశాలలోని పార్లమెంట్లలో ఉన్న మహిళల శాతంతో పోలిస్తే మన దేశం 148వ స్థానంలో ఉంది. అసెంబ్లీలలోనైతే ఈ స్థానం ఇంకా తక్కువ. స్థానిక సంస్థల్లో నయం. మహిళలు ఎక్కువమంది కనిపిస్తున్నారు. స్త్రీలకు సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు కూడా వెరవకుండా గ్రామ సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల్లో స్త్రీలకు సముచిత స్థానం లేకుండా ఏప్రజాస్వామ్య దేశమూ పూర్తిగా అభివృద్ధి చెందలేదు’’ అని డిసెంబర్ 6న రాసిన ఆ లేఖలో రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ లోక్సభలో పెండింగులో ఉంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక 15వ లోక్సభ రద్దయి 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చే జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతుర్నని చెప్పుకున్న యువ డ్యాన్సర్ క్యాథరీనా తిఖోనోవా తొలిసారి రష్యా అధికార టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యారు. గత గురువారం ఆ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి ఉక్కు సంకల్పం వెనుక ఉన్న మృదువైన కోణాల్ని ఆవిష్కరించారు. ‘‘పైకి కఠినంగా కనిపిస్తారు. కానీ ఆయన మనసు మెత్తనైనది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాథరీనా ఇలా టీవీలో కనిపించడం, రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో గత ఇరవై ఏళ్లుగా మీడియాపై ఉన్న ఆంక్షలు కొద్దిగానైనా సడలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆంతరంగిక జీవితం గురించి ఆ దేశంలోనే చాలామందికి తెలియదు. ‘పుతిన్ తాతగారు అయ్యారు’ అన్న వార్త మాత్రం గత ఏడాది దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వార్త అయినా ఆయనకై ఆయనే ఏదో సందర్భంలో బహిర్గతం చెయ్యడం వల్లనే బయటికి వచ్చింది. పుతిన్కి ఎందరో భార్యలు, మరెందరో ప్రియురాళ్లు ఉన్నారని ఒక వదంతి. పుతిన్ గతంలో గూఢచారి. తన కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిగూఢంగా ఉంచదలిచారేమో! ఇక క్యాథరీనా ఆయన సొంత కూతురేనా అనే దానిపై ఆ దేశంలో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. -
నిరాపరాధిగా బయటపడ్డ సిద్ధూ భార్య
నవ్జ్యోత్సింగ్ సిద్ధూ భార్య నవ్జ్యోత్ కౌర్.. అమృత్సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్జ్యోత్ కౌర్తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు. అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు. -
స్త్రీలోక సంచారం
భారతీయ సంతతి అమెరికన్ సెనెటర్ కమలాహ్యారిస్ 2020లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తేలిపోనుంది. ఏదైనా తన కుటుంబ నిర్ణయం ప్రకారం జరుగుతుందని ‘మాణింగ్ జో’ అనే టీవీ కార్యక్రమంలో కమల వెల్లడించారు. 54 ఏళ్ల కమలకు డెమొక్రటిక్ పార్టీలో ప్రత్యేకమైన ఇమేజ్తో పాటు, ప్రజాదరణ కూడా ఉంది. కమల కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ చెన్నై నుంచి 1960లో అమెరికా వలస వచ్చారు. కమల తండ్రి జమైకన్ ఆఫ్రికన్. ఒమాబా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సెనెట్లో ఆమెనంతా ‘ఫిమేల్ ఒబామా’ అనేవారు. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు కాలేజ్కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడకూడదని ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వి.ఎస్.ఎస్. యు.టి.) లోని ఐదు గర్ల్స్ హాస్టళ్లలో ఒకటైన ‘రోహిణి హాల్ ఆఫ్ రెసిడెన్స్’ ఆంక్షలు విధించింది! ‘గౌరవనీయులైన వైస్ చాన్స్లర్ సూచనల మేరకు.. రోహిణి హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడ్డం నిషేధించడమైనది కనుక, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోబడుతుంది’ అని డిసెంబర్ 1న హాస్టల్ నోటీస్ జారీ చేసింది. హాస్టల్ వార్డెన్ సంతకం చేసిన ఆ నోటీసును హాస్టల్ బోర్డులో పెట్టడంతో పాటు నోటీస్ కాపీలను స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్కు, వైస్ చాన్స్లర్ పి.ఎ.కు పంపించారు. విద్యార్థినుల రక్షణ కోసమే ఈ విధమైన ఆంక్షలు విధించవలసి వచ్చినట్లు యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఇన్చార్జి ప్రొఫెసర్ సి.సి. స్వెయిన్ వివరణ ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మరో కేంద్ర మంత్రి (కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖలు) ఉమా భారతి వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి బయటికి వచ్చేసి పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడపడంలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని ఉందని కూడా ఆమె అన్నారు. రెండు వారాల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తోందనీ ప్రకటించారు. గర్భంతో ఉన్నప్పుడు తల్లులు వాడే టూత్పేస్ట్లు, మేకప్ క్రీములు, సబ్బులు, ఇతర వ్యక్తిగత సంరక్షణ లేపనాలు, పౌడర్లలోని రసాయనాల వల్ల.. వారికి పుట్టే ఆడ శిశువులు సమయానికన్నా ముందే యవ్వనదశకు (ప్యూబర్టీ) చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఆ రసాయనాలలోని డీథిల్ ఫాలేట్, ట్రైక్లోజన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ల ప్రభావమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల జాతీయ ఫుట్బాల్ టీమ్లోని క్రీడాకారిణులను ఆ దేశ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సహా అధికారులు కొందరు లైంగికంగా వేధించి, వారిని లోబరుచుకున్నట్లు ‘గార్డియన్’ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనంలోని ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదేశించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యున్నతస్థాయి అధికారుల బెదిరింపులకు భయపడి దేశం వదిలి పారిపోయిన నేషనల్ ఫుట్బాల్ టీమ్ మాజీ కెప్టెన్ ఖలీదా పోవల్ను ఉటంకిస్తూ గార్డియన్ ఈ వార్తా కథనాన్ని కొన్ని రోజుల క్రితమే ప్రచురించింది. -
స్త్రీలోక సంచారం
డిసెంబర్ 3 మిథాలీరాజ్ పుట్టినరోజు. అయితే ఈ సంతోషకరమైన రోజు కూడా ఆమెను బాధించే పరిణామమే సంభవించింది. ఇటీవల వెస్టిండీస్లో జరిగిన ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్లోని కీలకమైన మ్యాచ్లలో మిథాలీని ఆడకుండా చేసి, ఆమెను అడుగడుగునా, అనేక విధాలుగా అవమానపరిచినట్లు రమేశ్ పొవార్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తిరిగి అతడినే తమ కోచ్గా కొనసాగించాలని అభ్యర్థిస్తూ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బి.సి.సి.ఐ.కి ఈ–మెయిల్ పంపించారు! ఆమె అభ్యర్థనను బలపరుస్తూ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో ఈ–మెయిల్ పంపారు. కోచ్గా రమేశ్ రెండేళ్ల ఒప్పంద కాలపరిమితి నవంబర్ 30తో ముగిసింది. కొత్త కోచ్ కోసం బి.సి.సి.ఐ. దరఖాస్తులు కోరుతూ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ దశలో ఈ అమ్మాయిలిద్దరూ మళ్లీ రమేశ్నే కోచ్గా తీసుకోవాలని కోరడం వెనుక రమేశ్ ప్రమేయం, ఒత్తిడి ఉన్నాయన్న అనుమానాలుతలెత్తుతున్నాయి. పదీయాభై ఏళ్ల మధ్య వయసులోని మహిళలకు శబరిమల ఆలయ దర్శంనంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పు అనంతరం కేరళలో తలెత్తిన ఆధ్యాత్మిక, రాజకీయ సంక్షోభం మకర సంక్రాంతి వరకో, లేక మధ్యంతర ఎన్నికల్ని పీకమీదికి తెచ్చుకునే వరకో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి! ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మత సంస్థలు ఏకతాటిపైకి వస్తుండగా, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వచ్చే జనవరి 1న.. మానవహారంలా ఓ మహిళాహారాన్ని నిర్మించి, దానికి ఉద్యమరూపం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కసరగోడ్ జిల్లా కేంద్రం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు 600 కి.మీ. దూరం సాగే ఈ మానవహారంలోకి పార్టీలకు, మత సంస్థలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళలకున్న భాగస్వామ్యాన్ని విస్మరించి ముందుకు సాగలేమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును శిరసావహించే బాధ్యతను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వానికి ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మద్దతును ప్రజల నుంచి కూడగట్టుకునే ప్రయత్నంలో భాగమే విజయన్ నిర్మిస్తున్న ఈ మహిళాహారం. -
స్త్రీలోక సంచారం
శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి గత అక్టోబర్లో వార్తల్లోకి వచ్చిన రెహానా ఫాతిమా అనే 32 ఏళ్ల కేరళ మోడల్, సామాజిక కార్యకర్త, బి.ఎస్.ఎన్.ఎల్. కంపెనీలో టెక్నీషియన్గా ఉద్యోగం చేస్తున్న రెహానా ఫాతిమాపై తాజాగా కేసు నమోదైంది. అయ్యప్ప భక్తురాలి వస్త్ర, వేషధారణల్లో నల్లరంగు చొక్కా ధరించి, మెడలోను, చేతికి రుద్రాక్ష మాలలు వేసుకుని, నుదుటిపై విభూది దిద్దుకుని అయ్యప్పస్వామిలా కూర్చొని, తొడభాగం కలిపించేలా తీయించుకున్న ఫొటోను ఆమె తన ఫేస్బుక్లో పెట్టడంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇదే విషయమై బి.ఎస్.ఎన్.ఎల్. కూడా ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. దీనిపై ఫాతిమా భర్త స్పందిస్తూ, ‘‘దిగంబర సన్యాసులు పూజలు అందుకునే ఈ దేశంలో.. ఒక మహిళ తన తొడభాగం కనిపించేలా ఫొటో తీయించుకోవడం ఏ విధంగా మతవ్యతిరేక చర్య అవుతుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10–50 వయసులో ఉన్న మహిళల్ని కూడా అనుమతిస్తూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్లో తీర్పును ఇచ్చాక అక్టోబర్లో తొలిసారి ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు దర్శనం కోసం ప్రయత్నించిన తొలి మహిళగా ఫాతిమా గుర్తింపు పొదారు. శబరిమలకు బయల్దేరడానికి ముందు తీయించుకున్న ఫొటోనే ఆమె ఇప్పుడు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ‘ఆకాశంలో సగం’ స్త్రీ. ఆ ఆకాశంలో యుద్ధనౌకల విమానాల్ని చక్కర్లు కొట్టించే స్త్రీ.. శుభాంగి స్వరూప్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఏళ్లకు భారత నౌకాదళంలోకి పైలెట్గా అడుగుపెట్టిన తొలి మహిళ శుభాంగి. సరిగ్గా ఏడాది క్రితం ఆమె నేవీ పైలెట్గా చార్జి తీసుకున్నారు. మహిళా లోకాన్ని రీచార్జ్ చేశారు. శుభాంగి.. బరేలీ (ఉత్తరప్రదేశ్) అమ్మాయి. కేరళలోని కన్నూర్ దగ్గరి ఎళిమల ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ లో తొలి మహిళా బ్యాచ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. నేవీ పైలెట్ పోస్ట్కు ఎంపికైన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ఇవాళ ఇండియన్ నేవీ డే. మన నౌకాదళానికి, నౌకాదళ విమాన తొలి మహిళా పైలట్ శభాంగికి మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేయవలసిన సందర్భం. నాగాలాండ్లో ఏటా జరిగే ‘హార్న్బిల్ ఫెస్టివల్’ డిసెంబర్ 1న ప్రారంభమైంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. ఈ సందర్భంగా మహిళా టూరిస్టులు, స్థానిక మహిళల కోసం భారత ప్రభుత్వం ‘112 ఇండియా’ అనే మొబైల్ యాప్ని ఆవిష్కరించింది. ఆ యాప్ని స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉంటే, ప్రమాదంలో ఉన్నప్పుడు అందులోని ‘షౌట్’ అనే ఫీచర్ ద్వారా.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కనెక్ట్ అయి తక్షణం పోలీసులు, వలంటీర్ల నుంచి బాధిత మహిళకు ఆపత్కాల సహాయ సహకారాలు లభిస్తాయి. దేశంలో హిమాచల్ ప్రదేశ్ తర్వాత మహిళల భద్రత, రక్షణల కోసం ఇలా సింగిల్ నెంబర్ ఎమర్జెన్సీ మొబైల్ అప్లికేషన్ సదుపాయం ఉన్న రెండో రాష్ట్రం నాగాలాండే కాగా, ఈశాన్యంలో ఇదే మొదటి రాష్ట్రం. -
స్త్రీలోక సంచారం
మహిళల్ని ప్రత్యక్ష యుద్ధ విధుల్లోకి తీసుకునేందుకు భారత సైన్యం పూర్తి సన్నద్ధంగా లేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. శుక్రవారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ‘పాసింగ్ అవుట్ పరేడ్’లో పాల్గొన్న రావత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. సైన్యం మాత్రమే సిద్ధంగా లేకపోవడం కాదు, సైన్యంలో చేరేందుకూ మహిళలు సిద్ధం కావలసిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని దేశాలలో మహిళల్ని యుద్ధ విధుల్లోకి తీసుకున్నారు కదా అన్న ప్రశ్నకు.. ‘‘వారితో పోల్చడం సరికాదు. మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాలి. సైన్యంలోకి వచ్చే మహిళలు కూడా ధీమాగా ఉండాలి. అవి రెండూ జరిగినప్పుడు మన దగ్గర కూడా యుద్ధంలోకి దుమికే మహిళల్ని చూడవచ్చు’’ అని రావత్ అన్నారు. భారత ఆర్మీలో ప్రస్తుతం యుద్ధేతర ఉద్యోగాలకు మాత్రమే మహిళలకు ప్రవేశం ఉంది. ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా విడుదల చేసిన ‘యు.ఎస్.లోని 50 మంది అగ్రస్థాయి మహిళా టెక్ మొఘల్స్’ జాబితాలో భారతీయ సంతతికి చెందిన నలుగురు మహిళలకు చోటు దక్కింది. సిస్కో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీ ‘ఉబర్’కి సీనియర్ డైరెక్టర్గా ఉన్న కోమల్ మంగ్తానీ, డేటా స్ట్రీమింగ్ కంపెనీ ‘కాన్ఫ్లూయెంట్’ సహవ్యవస్థాపకురాలు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నేహా నర్ఖేడ్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ కంపెనీ ‘డ్రాబ్రిడ్జ్’ సీఈవో కామాక్షీ శివరామకృష్ణన్ ఈ జాబితాలో ఉన్నారు. -
స్త్రీలోక సంచారం
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేడు తెలంగాణాకు వచ్చే అవకాశాలున్నాయి. ఆమె పర్యటనలో ఆఖరి నిమిషపు మార్పులేమీ లేకుంటే.. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సయ్యద్ ఇబ్రహీం తరఫున ఎన్నికల ప్రచార సభలో మంగళవారం ఆమె ప్రసంగిస్తారు. మాయావతి 1989తో ఎం.పి. అవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1995లో ముఖ్యమంత్రి అయ్యారు! తిరిగి 1997లో, తర్వాత 2002 నుంచి 2003 వరకు, అనంతరం 2007 నుంచి 2012 వరకు పూర్తి ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అగ్రవర్ణాల ప్రాబల్యం, నిరంతర రాజకీయ అనిశ్చితి ఉన్న ఒక పెద్ద రాష్ట్రానికి ఓ దళిత మహిళ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా అది పెద్ద విశేషమే. మాయావతి దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు ఉత్తరప్రదేశ్ను పాలించారు. దళితులు, ఇతర వెనకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం పాటు పడ్డారు. పార్టీ నాయకత్వానికి వారసురాలిగా 2001లో కాన్షీరామ్ మాయావతిని ప్రకటించినప్పుడు కనుబొమలు ఎగరేసి, పార్టీ నుంచి వెళ్లి పోయిన అగ్రనేతలు సైతం... ఆ తర్వాత్తర్వాత ఆమె నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారంటే కారణం.. మాయావతికి దళితుల్లో ఉన్న ఆదరణ, ప్రజాకర్షణ. ఆమె వాక్పటిమ సాటిలేనిది. ఆలోచనా రచన తిరుగులేనిది. మాయావతి తొలినాళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘మిరకిల్ ఆఫ్ డెమోక్రసీ’గా ప్రధాని పి.వి. నరసింహారావు అభివర్ణించారు. సోనియాగాంధీ కూడా మాయావతి దక్షతను అనేక సందర్భాలలో ప్రస్తుతించారు. మాయావతికి కూడా సోనియా అంటే ప్రత్యేక అభిమానం. ఈ ఏడాది జూలైలో సోనియాను విదేశీయురాలు అని అన్నందుకు మాయావతి తన సొంత పార్టీ నాయకుడినే పార్టీ నుంచి బహిష్కరించారు. మొన్న ఆదివారం ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్’ జరుపుకున్నాం. (మహిళలపై హింసను నిర్మూలించే దినం). అందులో భాగంగానే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు పదహారు రోజుల పాటు భారతదేశంలో మహిళా సంక్షేమ సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు.. గృహహింసకు గురైన మహిళలకు వేతనంతో కూడా సెలవును మంజూరు చెయ్యాలన్న ప్రతిపాదనతో క్యాంపెయిన్ నడుపుతున్నాయి. గృహహింసకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను, విధానాలను రూపొందించడంలో ఇదొక ప్రభావవంతమైన అంశంగా ఉంటుందని ఆ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. న్యూజిలాండ్లో ఇప్పటికే మహిళా ఉద్యోగుల కోసం ఇలాంటి చట్టం అమలులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింసకు గురవుతున్నారు! టెస్టుల్లోను, వన్డే ఇంటర్నేషనల్స్లోనూ మిథాలీనే ఇప్పటికీ భారత మహిళా జట్టుకు కెప్టెన్. ఇటీవలి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్కు మాత్రం హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉన్నారు. ఆ సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్తో ఆడుతున్నప్పుడు హర్మన్ప్రీత్.. జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ని పక్కన పెట్టడం మీద ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇప్పుడిక మిథాలీ తర్వాతి స్టెప్ ఏమిటన్నది ప్రశ్న. టి20 ఇంటర్నేషనల్స్ వ్యూహాలకు మిథాలీ ఫిట్ కారని హర్మన్ప్రీత్ అంటున్నారు. టీమ్కి యువరక్తం ఎక్కించడానికి, స్ట్రయిక్ రేట్ని పెంచడానికి మిథాలీకి ‘విరామం’ ఇవ్వక తప్పలేదన్నది హర్మన్ చెబుతున్న కారణం. త్వరలో 50 ఓవర్ల ఫార్మాట్ ఉంది. టి20 ఇంటర్నేషనల్ సిరీస్ ఉన్నాయి. ఐసీసీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ చాంపియన్షిప్ ఉంది. భవిష్యత్తులో జరగబోయే వన్డే ఇంటర్నేషనల్ కప్పుకు క్వాలిఫై చేసే సిరీస్ కొన్ని ఉన్నాయి. కాబట్టి టి20 ఇంటర్నేషనల్స్లో మిథాలీ (ఒకవేళ) కనిపించకపోయినా.. ఆడేందుకు ఆమెకు మరికొన్ని వన్డే ఇంటర్నేషనల్స్ ఉన్నాయి. వచ్చే వరల్డ్కప్ 2021లో జరుగుతుంది. అంతకన్నా ముందు 2020లో మరో వరల్డ్కప్ (టి20) ఆస్ట్రేలియాలో ఉంది. వాటిల్లో మనం మిథాలీని మిస్సయ్యే చాన్సే లేదు. సో.. బీ హ్యాపీ. -
స్త్రీలోక సంచారం
న్యూయార్క్లోని బుష్విక్ ప్రాంతంలో ఉన్న ‘హౌస్ ఆఫ్ ఎస్’ అనే పబ్కు వెళ్లిన ఓహియోలోని భారతీయ సంతతి అమెరికన్ యువతి అంకితా మిశ్రా.. పబ్లోని టాయ్లెట్స్ గుదుల గోడలపై ఉన్న హిందూ దేవతల చిత్రాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. ‘‘గత నెలలో ఫ్రెండ్స్తో కలిసి ‘హౌస్ ఆఫ్ ఎస్’లో నౌట్ ఔట్కి వెళ్లాను. ఆ పబ్లోని వి.ఐ.పి.ల బాత్రూమ్కి వెళ్లినపుపడు.. లోపలి గోడలపై కాళీ మాత, సరస్వతి, శివుడు, విఘ్నేశ్వరుల బొమ్మలు కనిపించాయి. షాక్ తిన్నాను’’ అని ఆనాటి తన అనుభవాన్ని చెబుతూ.. పబ్ యాజమాన్యానికి హైందవ సంస్కృతి గొప్పతనాన్ని వివరించడంతో పాటు.. ఇతర మతస్థుల మనోభావాలను కించపరచడం నాగరికత అని గానీ, కళ అని గానీ అనిపించుకోదు’’ అంటూ అంకిత పెద్ద మెయిల్ పెట్టారు. ‘స్టాండప్ యువర్సెల్ఫ్’ అనే క్యాంపెయిన్తో మహిళలకు దేశవ్యాప్తంగా ఒక లక్ష ‘స్టాండ్ అండ్ పీ’ (నిలుచుని మూత్రవిసర్జన చేయడానికి అనువైన) సాధనాల ఉచిత పంపిణీ.. వరల్డ్ టాయ్లెట్ డే సందర్భంగా నవంబర్ 19న మొదలైంది. మురికిగా ఉండే పబ్లిక్ టాయ్లెట్లో మూత్రవిసర్జనకు అవస్థలు పడుతూ ‘కూర్చోవడం’ నుంచి విముక్తి కల్పిస్తూ, ఢిల్లీ ఐ.ఐ.టి. విద్యార్థులు కనిపెట్టిన శాన్ఫీ (శానిటేషన్ ఫర్ ఫిమేల్) అనే ఈ అట్టముక్క సాధనంతో మహిళలు నిలుచునే మూత్ర విసర్జన చేయవచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ శాన్ఫీలు ఒక్కోటి పది రూపాయలకే లభ్యం అవుతాయట. -
స్త్రీలోక సంచారం
పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాక భార్యను వదిలించుకుని, ముఖం చాటేసి తిరుగుతున్నారన్న ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలి కొద్ది నెలల్లోనే 25 మంది ఎన్నారై భర్తల పాస్పోర్ట్లను రద్దు చేసి, వారిపై ‘లుకౌట్ సర్క్యులర్’ జారీ చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటుకూ దొరక్కుండా తిరిగే ఇటువంటి భర్తలను వలపన్ని పట్టేందుకు జారీ అయ్యే లుకౌట్ నోటీసు వల్ల నిందితులు దేశాలు దాటేందుకు అవకాశం ఉండదు. ఎక్కడిక్కడ తనిఖీ చేస్తారు కనుక, ఎక్కడివారు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరోవైపు.. తప్పుడు ఎన్నారై భర్తల ఆగడాలను నియంత్రించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఈ ఏడాది జనవరిలో చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఇంతవరకు 578 మంది మహిళలు ముందుకొచ్చి తమ భర్త పెడుతున్న గృహహింసపైన, ఇతర దుశ్చర్యల మీద కమిషన్కు ఫిర్యాదు చేయగలిగారు. దీర్ఘకాలిక వ్యాధులకు నిత్యం మందులు వాడుతుండే మహిళల్లో ఔషధ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు పంజాబ్ ఆరోగ్యశాఖ ‘హార్మ్ రిడక్షన్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మొదట పంజాబ్లోని కపుర్తల జిల్లాలో అమలు చేయబోతున్నారు. ‘హార్మ్ రిడక్షన్ అడ్వొకసీ ఇన్ ఏషియా’, ‘గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మలేరియా’ సంస్థల భాగస్వామ్యంతో పంజాబ్ ఆరోగ్య శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. మందుల దుష్ఫ్రభావాలను తగ్గించడానికి మార్గాలను అన్వేషించడమే కాకుండా, మందుల వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెదికేందుకు పెట్టుబడులు రాబట్టి, పరిశోధనలు, అధ్యయనాలు చేయించడం; వాటి ఫలితాలను అనుసరించి మందులు వాడే మహిళలకు సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ‘ఇండియా హె.ఐ.వి./ఎయిడ్స్’ సంస్థ డైరెక్టర్ (పాలసీ) డాక్టర్ ఉమంగ్ చావ్లా తెలిపారు. -
స్త్రీలోక సంచారం
స్టార్ రైటర్ చేతన్ భగత్ కొన్నాళ్లుగా ‘మీ టూ’ ఆరోపణల్ని మోస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు చేతన్ తమను లైంగికంగా వేధించాడని బహిర్గతం చేశారు. వారిలో ఒకరు ఇరా త్రివేది. ఆమె కూడా ప్రముఖ రచయిత్రి. కాలమిస్టు, యోగా టీచర్ కూడా. చేతన్ తనతో చాటింగ్ చేస్తున్నప్పుడు తన అసలు స్వరూపం ఏమిటో బయటపెట్టుకున్నాడని, అసభ్యకరమైన మెయిల్స్ కూడా తనకు పంపాడని గత అక్టోబర్ 22 ఇరా అతడికి లీగల్ నోటీసు కూడా పంపారు. చేతన్పై ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, ఇతర సైబర్ నేరాలు కూడా ఇరా ఫిర్యాదుపై నమోదు అయ్యాయి. అయితే ఇవన్నీ అబద్ధం అని చేతన్ కొట్టిపడేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే.. ఇరా ‘మీ టూ’ ఆరోపణలు చేతన్ ఎక్కడికి వెళ్లినా అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘సాహిత్య ఆజ్ తక్’ కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం నాడు (నిన్న).. సభలో అతడి ‘లీలల’ ప్రస్తావన వచ్చినప్పుడు చేతన్ తన సచ్చీలతను ప్రదర్శించుకోడానికి ప్రయత్నించారు. ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి చెప్పారు. ‘‘నాపై ఇరా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగానే నిజమేనా? నిజమేనా? అని నా భార్య అనూష నస మొదలు పెట్టింది. ఆ నసను తట్టుకోలేక ‘నన్నొదిలేసి వెళ్లిపో అని పెద్దగా అరిచేశాను. కానీ తను స్ట్రాంగ్ ఉమన్. చాలా కూల్గా ఉంది. ఉండడమే కాదు, ‘నువ్వూ నేను పార్వతీ పరమేశ్వరుల లాంటి వాళ్లం. ఒకర్నుంచి ఒకరం విడిపోవడం కష్టం’ అంది! ఆ మాట నన్ను టచ్ చేసింది. ఆ మాటతో నా భార్య నన్ను మార్చేసింది (అంటే వేధింపులు నిజమేనన్నమాట). నాపై లైంగిక ఆరోపణలు వచ్చాక, మా అత్తగారికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. దక్షిణ భారతదేశపు సంప్రదాయ కుటుంబం ఆమెది. మాదేమో పంజాబ్. ఏది ఏమైనా అనూష వంటి భార్య ఉన్నప్పుడు అపనిందలన్నీ తేలిపోతాయి. భర్తకు ధైర్యంగా ఉంటుంది’’ అని చెప్పాడు చేతన్ భగత్. అయితే అది కట్టు కథా, నిజమా అనేది నిర్థారణ కాలేదు. రైటర్ కదా. ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇరా మాత్రం తన ఆరోపణలపై తను గట్టిగా నిలబడింది. అవసరం వచ్చినప్పుడు మరిన్ని ప్రూఫ్స్ చూపిస్తానంటోంది. టీనేజ్ వివాహాలను నిరోధించడానికి గట్టి చట్టాన్ని తేవాలని ఎన్.హెచ్.ఆర్.సి. (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టీనేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వారి భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకు పంపిన ఈ నివేదికలో.. టీనేజ్లో పెళ్లయిన బాలికలు 13–19 సంవత్సరాల మధ్య వయసుకే తమ తొలి బిడ్డను ప్రసవిస్తున్నారని పేర్కొంది. యూనిసెఫ్ అంచనాల ప్రకారం చూసినా కూడా 18 ఏళ్ల వయసుకు చేరేలోపే భారతదేశంలో 27 శాతం మంది మహిళలకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి! (ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు శాంతాదేవి మేఘ్వాల్. ఆమెది రాజస్థాన్. 11 నెలలకే (ఏళ్లకు కాదు) శాంతాదేవికి పెళ్లైపోయింది! అప్పటికి వరుడి వయసు 9 ఏళ్లు. మూడేళ్ల క్రితం తన 20 ఏళ్ల వయసులో విదేశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె విలపిస్తున్నప్పటి చిత్రమిది.) లేడీ డయానా దుర్మరణం చెందాక కామిల్లా పార్కర్ను రెండో పెళ్లి చేసుకుని, ప్రస్తుతం తన 70 ఏళ్ల వయసులో మనవలు, మనవరాళ్లతో సంతోషంగా ఉంటూ, రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 తర్వాత సింహాసనం అధిష్టించడానికి సిద్ధంగా ఉన్న దశలో ప్రిన్స్ చార్ల్స్ గురించి ఒక పాత విషయమే కొత్తగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ‘ది రాయల్ హౌస్ ఆఫ్ విండ్సర్’ టీవీ సీరీస్లో భాగంగా త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్లో.. 1979తో చార్ల్స్.. అమందా నాచ్బుల్ అనే సామాజిక కార్యకర్తను (ఇప్పుడు ఆమె వయసు 61) ప్రేమించి, ఆమెతో కలిసి తిరిగి, ఆమెతో తన జీవితాన్ని ఊహించుకున్నాడని, చివరికి ఆమె తిరస్కారంతో భంగపడి, ఆ గాయం నుంచి కోలుకునేందుకు డయానాతో డేటింగ్ చేశాడని చూపించే సన్నివేశాలు ఉన్నాయి. -
స్త్రీలోక సంచారం
బర్మా రాజకీయ నాయకురాలు, తిరుగుబాటు యోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్ సూచీకి 2009లో ఇచ్చిన ‘ది అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డు’ను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉపసంహరించుకుంది. మానవహక్కుల కోసం ఒకప్పుడు బర్మా నియంత ప్రభుత్వంతో అలుపెరగక పోరాడిన సూచీ.. బర్మాలో రొహింగ్యా ముస్లింల ఊచకోత జరుగుతుంటే.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయారనీ, ఆ ధోరణి.. ఒకప్పుడు ఆమె పాటించిన విలువలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. అయితే అవార్డును వెనక్కు తీసుకోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని సూచీ తిరుగు సమాధానం ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తొలిసారిగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్లో అందరూ మహిళలే ఉండే ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. స్థానిక భాషలో ‘స్నేహితురాలు’ అనే అర్థం వచ్చే ‘సంఘ్వారీ’ అనే పేరును ఈ ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్లకు పెట్టింది. మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే ఈ బూత్లలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది.. అంతా మహిళలే కావడంతో.. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలైనప్పటికీ మహిళలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి బూత్లనే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. హవాయి రాష్ట్రం నుంచి అమెరికన్ ‘కాంగ్రెస్’కు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ (37) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2020) పోటీ చేయబోతున్నట్లు లాస్ ఏంజెలిస్లో జరిగిన ఒక సదస్సులో ఇండియన్ అమెరికన్ సంపత్ శివాంగి ప్రకటించారు. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో ఏవిధమైన అనువంశిక సంబంధాలూ లేనప్పటికీ ఆమె తల్లి.. హైందవ ధర్మాలను, ఆచారాలను పాటించడంతో తులసి కూడా తన పద్దెనిమిదవ ఏట నుంచీ హిందుత్వానికి ఆకర్షితురాలై, భారతీయురాలిగా పరిగణన పొందుతున్నారు. కాగా, తను అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు డాక్టర్ సంపత్ చేసిన ప్రకటనను తులసి ఖండించడం గానీ, నిర్ధారించడం గానీ చేయలేదు. -
స్త్రీలోక సంచారం
‘స్నేహితులుగా మీకు తగినవారు’ అని సూచించే ‘ఫ్రెండ్ సజెషన్స్’లో టీనేజ్ అమ్మాయిలకు మధ్యవయస్కులైన పురుషులను ఫేస్బుక్ సజెస్ట్ చేస్తోందని ‘బ్రిటన్లోని నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు చిల్డ్రన్’ సంస్థ ఆరోపించింది. టీనేజ్ బాలికలకు స్నేహితులుగా ఫేస్బుక్ సూచిస్తున్న మధ్యవయసు పురుషులలో కొందరు ఛాతీపై ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా కనిపించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఫేస్బుక్ తక్షణం తన బాధ్యతారాహిత్యాన్ని సరిచేసుకోవాలని సూచించింది. బ్రిటన్ మొత్తానికి ర్యాడ్ఫోర్డ్ దంపతులది పెద్ద కుటుంబం. గత మంగళవారం అది మరింత పెద్ద కుటుంబం అయింది. పన్నెండు నిముషాల పురిటి నొప్పుల అనంతరం తమ 21వ బిడ్డ బోనీ రేయ్ని ప్రసవించింది ఆ మాతృమూర్తి స్యూ ర్యాడ్ఫోర్డ్. దీంతో ఆ కుటుంబంలోని సంఖ్య భార్యాభర్తలిద్దరితో కలిపి 23కు చేరుకుంది. ‘‘ఇక చాలనుకుంటున్నాం. బోనీతో మా కుటుంబం సంపూర్ణం అయింది’’ అని స్యూ, ఆమె భర్త నోయల్ ర్యాడ్ఫోర్డ్ చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు. స్యూ తన జీవితకాలంలో ఇప్పటి వరకు 800 మాసాలు గర్భిణిగా ఉన్నారు! మొదటి సంతానానికీ ఇప్పుడు పుట్టిన బిడ్డకు మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది. స్యూ తన ఏడేళ్ల వయసులో నోయల్కి పరిచయం అయింది. పద్నాలుగేళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 43. మొదటైతే ముగ్గురు పిల్లలే చాలని అనుకున్నారు స్యూ, నోయల్. ఆయనైతే తొమ్మిదో బిడ్డ పుట్టాక వేసక్టమీ కూడా చేయించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఎందుకో ఆయన మనసు మళ్లీ బిడ్డల మీదకు మళ్లింది. వేసక్టమీని రివర్స్ చేయించుకున్నాడు. మోర్కాంబిలోని లాంకషైర్ ప్రాంతంలో బేకరీ దుకాణం నడుపుతున్న ర్యాడ్ఫోర్డ్ల ఇల్లు ప్రస్తుతం సందడి సందడిగా ఉంది. అప్పుడే పుట్టిన తమ చిట్టి చెల్లాయిని ఆడించేందుకు మిగతా పిల్లలందరూ పోటీ పడుతున్నారు. అయితే ఆ సంతోషాన్ని కళ్లారా చూస్తున్న స్యూ.. గర్భిణిగా మాతృత్వపు మధురిమల్ని ఇక అనుభూతి చెందలేను కదా అని కొద్దిపాటి బాధతో ఉన్నారు. చెప్పలేం. వీళ్ల çసంతాన ప్రియత్వాన్ని చూస్తుంటే తమ నిర్ణయానికి కట్టుబడేలా కనిపించడం లేదు. ఇంకో సంగతి. వీళ్లకు ముగ్గురు మనవలు కూడా ఉన్నారు. రెండో సంతానం అయిన సోఫీకి పుట్టినవాళ్లు ఆ పిల్లలు. -
స్త్రీలోక సంచారం
కెనడా సంతతి అమెరికన్ స్టార్ నటి, సూపర్ మోడల్ పమేలా ఆండర్సన్ ‘మీటూ’ ఉద్యమాన్ని విమర్శించారు. ‘ఇదొక బోరింగ్ ఫెమినిజం’ అని ఆమె కామెంట్ చేశారు. అంతేకాదు, ‘మీటూ’ వల్ల మగవాళ్లు చేష్టలుడిగిపోతారని పమేలా అన్నారు. వాస్తవానికి పమేలా కూడా స్త్రీవాదే. అయితే ‘మీటూ’ను మాత్రం మనస్ఫూర్తిగా ఆమె సమర్థించలేకపోతున్నారు. ఒక ఆస్ట్రేలియన్ టీవీ చానల్లోని ‘60 మినిట్స్’ ప్రోగ్రామ్లో మాట్లాడుతూ, ‘క్షమించాలి. నేనిలా అంటున్నందుకు బహుశా నాకు తగినశాస్తి జరగొచ్చు. అయినా సరే చెబుతున్నా. మీటూ నాకు టూమచ్ అనిపిస్తోంది’’ అని పమేలా అన్నారు. -
స్త్రీలోక సంచారం
‘మీటూ’ ఉద్యమం ఎక్కడెక్కడి మగ పురుగుల్ని బయటికి ఈడ్చుకొచ్చి పడేస్తోంది. మర్యాదస్తుల ముఖాలను తలకిందులుగా వేలాడదీసి, అసలు స్వరూపం బయటపెడుతోంది. మూవీస్ అయిపోయాయి. మీడియా అయిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్! ముఖేష్ అగర్వాల్ అనే సీనియర్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ లీనా డోలీ అనే అస్సాం మహిళా పోలీసు అధికారి ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్క్ప్లేస్ హెరాస్మెంట్ నుంచి బతికి బట్టకట్టిన స్త్రీగా తనని తను పరిచయం చేసుకుంటూ.. ఆమె బహిర్గత పరిచిన విషయాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. ‘‘అగర్వాల్ ఒక రోజు నాకు కాల్ చేసి, బయటికి ఎక్కడికైనా వెళ్దాం రమ్మని అన్నాడు. అతడు ఏమంటున్నాడో అర్థమైంది! ‘నో’ చెప్పేశాను. వేధించడం మొదలుపెట్టాడు. పై అధికారులకు ఫిర్యాదు చేశాను. అది జరిగిన ఆర్నెల్లకు నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనపై విచారణ జరిపేందుకు మా ఇంటికి వచ్చిన ఎంక్వయిరీ ఆఫీసర్ .. ‘మీరిచ్చిన ఫిర్యాదు వల్ల తనపై వచ్చిన ఒత్తిళ్ల కారణంగా మీ భర్త ఆత్మహత్య చేసుకోలేదని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. నేనేం మాట్లాడలేదు. మళ్లీ ఇంతవరకు దానిపై విచారణే జరగలేదు. చిత్రం ఏంటంటే.. అగర్వాల్ తన తప్పును ఒప్పుకున్నప్పటికీ ‘ఇదొక మిస్అండర్స్టాండింగ్ కంప్లయింట్’ అంటూ.. నా కేసును పై అధికారులు కొట్టేయడం! పైగా అగర్వాల్ భార్య నాపై పరువునష్టం కేసు వేశారు. దీనిపై నేను రివిజన్ పిటిషన్ వేశాను. ఎంత విషాదమో చూడండి. నా భర్తను పోగొట్టుకున్నాను. నా కేసును కోల్పోయాను. ఈ స్ట్రెస్లో పడి నా పిల్లలకు అందించవలసిన ఆదరణను, ప్రేమను ఇవ్వలేకపోయాను. ‘ఓటమికి నేనొక ఉదాహరణ. ఇలాగైతే ప్రభుత్వ ఆఫీసులలో పని చేసే ఏ బాధితురాలైన మహిళ మాత్రం ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తుంది’’ అని లీనా డోలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుణిమ సిన్హా (30) మరో ఘనతను సాధించారు. స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లైడ్ విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం ఆమె డాక్టరేట్ అందుకున్నారు! ఎవరెస్టు ఒక్కటే కాదు, ప్రపంచంలోని ఇంకా అనేక ఎల్తైన శిఖరాలను చేరుకోవడం లక్ష్యంగా అరుణిమ సాగిస్తున్న జైత్రయాత్రకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం లభించింది. అరుణిమ 2013లో ఎవరెస్టుపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 2011లో లక్నో నుంచి ఢిల్లీ వెళుతుండగా రైల్లో దోపిడీ దొంగల్ని ప్రతిఘటిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె తన ఎడమ కాలిని మోకాలి వరకు కోల్పోయారు. -
స్త్రీలోక సంచారం
అన్నిట్లోనూ స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ అన్నట్లు ఉంటుంది మన దేశంలో. అభివృద్ధికి టెక్నాలజీ ఒక మెట్టు అనుకుంటాం కదా. ఆ టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో ఉన్నది కూడా పురుషులకేనట. భారతదేశంలో టెక్నాలజీ వినియోగంపై తాజాగా ‘హార్వర్డ్ కెన్నెడీ స్కూల్’ సర్వే చేసినప్పుడు ఈ అసమానత్వం బైట పడింది. స్మార్ట్ఫోన్ లేని చెయ్యి ఇప్పుడు ఇండియాలో దాదాపుగా కనిపించదు. మరీ స్మార్ట్ఫోన్ కాకున్నా, మామూలు ఫోన్ అయినా ఉండని మనిషి ఉంటారని ఊహించలేం. అయితే.. ఇప్పటికీ భారతదేశంలోని అనేక గ్రామాల్లో, కొన్నిచోట్ల పట్టణాల్లో కూడా మొబైల్ ఫోన్ వాడని మహిళలు ఉన్నారట! దీనికి కారణం.. పూర్తిగా లింగవివక్షేనని అనలేం కానీ.. మహిళలే వాళ్లంతవాళ్లు.. ఫోన్ వినియోగాన్ని ఒక పాపకార్యంలా భావించి, దూరంగా ఉంటున్నట్లు సర్వేలో తేలింది! మరి అత్యవసరంగా ఫోన్ చేయాలన్నా, ఫోన్ రిసీవ్ చేసుకోవాలన్నా ఎలా? ఇంట్లో మగవాళ్లు ఉంటారు కదా. వాళ్ల సహాయం తీసుకుంటారు. ‘ది టఫ్ కాల్ : అండర్స్టాండింగ్ బ్యారియర్స్ టు అండ్ ఇంపాక్ట్ ఆఫ్ విమెన్స్ మొబైల్ ఫోన్ అడాప్షన్ ఇన్ ఇండియా’ అనే పేరుతో హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ విడుదల చేసిన నివేదికలో.. ఈ ‘మొబైల్ అసమానత’ స్త్రీ పురుషుల మధ్య 33 శాతం వరకు ఉన్నట్లు స్పష్టం అయింది. రెండేళ్ల క్రితం ‘హండ్రెడ్ ఇండియన్ టిండర్ టేల్స్’ అనే వంద సచిత్ర కథనాల పుస్తకంతో సంచలనాత్మక భారతీయ చిత్రకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఇందు హరికుమార్ (ముంబై) ఇప్పుడు మరొక ప్రయోగం చేస్తున్నారు. భారతీయ స్త్రీల లైంగిక అనుభవాల చిత్ర లేఖన సంకలనాన్ని బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి ‘టిండర్ టే ల్స్’లో ఇందు చేసింది కూడా దాదాపుగా ఇప్పుడు చేయబోతున్నదే. స్త్రీ, పురుష జాతుల మధ్య సయోధ్యను ఏర్పరిచే భావచిత్రాలను మునుపు గీస్తే, ఇప్పుడు స్త్రీ దైహిక వాంఛల అభివ్యక్తీకరణకు మాత్రమే పరిమితమవుతున్నారు. సమాజంలో నేటికీ కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి. ఆ నిషిద్ధాలనే ఇందు హరికుమార్ తన శుద్ధమైన రేఖల్లో ప్రతిఫలింపజేస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
ఉత్తర కొరియాలో మహిళలపై లైంగిక అకృత్యాలు జరగడమన్నది.. శిక్ష లేని అత్యంత సాధారణమైన సంగతని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడయింది! వివిధ కారణాల వల్ల దేశం వదిలి పారిపోయిన 62 మంది ఉత్తర కొరియన్లను ఇంటర్వ్యూ చేసిన అనంతరం, వారు చెప్పిన అత్యాచార, లైంగిక వేధింపుల రహస్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ సంస్థ.. ఆ దేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కొన్ని నిజ ఘటనలను ఉదహరిస్తూ వివరించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఈ నెలకు నూరేళ్లు అవుతోంది. 1914 జూలై 28న ప్రారంభమైన యుద్ధం 1918 నవంబర్ 11న పరిసమాప్తమైంది. ఆ యుద్ధం వల్ల జరిగిన భారీ నష్టం మాట అటుంచితే.. నాటి యుద్ధ పరిస్థితులు స్త్రీల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చాయి. ఎంత పాశ్చాత్యులైనా, అప్పటి వరకు మగవాళ్ల చాటున ఇళ్లలోనే ఉన్న మహిళలు యుద్ధ కాలపు అత్యవసర విధుల నిర్వహణకు మగవాళ్లతో సమానంగా తమ దేశాల కోసం పని చేయవలసి వచ్చింది. అలా బయటికి వచ్చిన మహిళల పనితీరు సమర్థంగా, విశ్వసనీయంగా ఉండి, స్త్రీ సాధికారతవైపు తొలి అడుగులు పడడానికి దోహదపడింది. ‘స్విమ్వేర్లో మహిళా క్రీడాకారులు స్లిమ్గా కనిపించడం ఎలా?’ అని ఒక ఆర్టికల్ను అప్లోడ్ చేసిన ప్రసిద్ధ ‘స్విమ్ ఇంగ్లండ్’ వెబ్ సైట్.. పాఠకుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ ఆర్టికల్ను తన సైట్ నుంచి తొలగించింది. బికినీ వేసుకోవడం వల్ల మీ ఉదరం నొక్కుకుపోయి, దేహమంతా ఒక ముక్కగా కనిపిస్తూ మీ పొట్ట మరింత పైకి వచ్చినట్లుగా కనిపిస్తుంది తప్ప మీరు స్లిమ్గా కనిపించరు. అందుకే బికినీకి బదులుగా వదులుగా ఉండే ‘టింకిణీ’ (స్విమ్ సూట్) వేసుకోవాలన్న సూచన ఆ వ్యాసంలో ఉంది. నిజానికి 2010లో వచ్చిన ఆ ఆర్టికల్నే ఆ వెబ్ సైట్ మళ్లీ రిపీట్ చేసింది. ‘క్రీడాకారిణులను సెక్స్ సింబల్గా చూస్తారా?’ అంటూ అప్పుడూ విమర్శలు వచ్చాయి కానీ, ఈసారి మాత్రం ఆ వెబ్సైట్ వాళ్లు స్పందించక తప్పలేదు. బికినీ విషయం ఒక్కటే కాదు, మగవాళ్లలా ఉండే ఆడవాళ్లు తమ ఎదను కనిపించేలా స్విమ్సూట్ను ఎలా ధరించాలో కూడా ఆ వివాదాస్పద ఆర్టికల్లో రాసి ఉంది. -
స్త్రీలోక సంచారం
►‘ఆడవాళ్లకు బయటికి వెళ్లి పని చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే వ్యంగ్య, హాస్య కథాంశంతో ‘అఫ్గానిస్తాన్ టీవీ’లో ‘రోయా’ అనే ఒక స్త్రీవాద సీరియల్ ఈ నెలలో మొదలవుతోంది. యు.ఎస్.లో వీక్షకాదరణ పొందిన ‘అగ్లీ బెట్టీ’ సీరీస్లానే ఈ ‘రోయా’ సీరియల్లో.. ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరాన్ని.. ‘ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే సంప్రదాయవాదుల కోణంలో నరుక్కొస్తూ సరదా సన్నివేశాలతో ఆలోచన రేకెత్తించేలా చిత్రీకరిస్తున్నారు. ►ఈరోజు (గురువారం) యు.ఎస్.లోని గూగుల్ కంపెనీలో పని చేస్తున్న 200 మంది మహిళా ఇంజనీర్లు వాకౌట్ చేయబోతున్నారు! గూగుల్ పూర్వపు ఉద్యోగి, ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తన కోరిక తీర్చమని తనను వేధించినట్లు గూగుల్ కంపెనీ మహిళా ఉద్యోగి ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆండీ రూబిన్ను తొలగిస్తూ గూగుల్ అతడికి 90 మిలియన్ డాలర్ల పరిహారాన్ని (665 కోట్ల 75 లక్షల 25 వేల రూపాయలు) ఇచ్చి పంపిందని ‘న్యూయార్క్ టైమ్స్’ గత వారం ప్రచురించిన వార్తకు ఉలిక్కిపడిన గూగుల్ మహిళా సిబ్బంది.. లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వడమేంటని.. వాకౌట్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయదలచుకున్నారు. ►రేపటి తరం పురుషులు స్త్రీల పట్ల మర్యాదస్తులుగా మెసులుకోవాలంటే.. వారిని ఇప్పట్నుంచే (బాలురుగా ఉన్నప్పట్నుంచే) తల్లిదండ్రులు.. స్త్రీలు ఎందులోనూ, ఏ మాత్రం తక్కువ కాదన్న స్పృహతో సహానుభూతితో, సంస్కారవంతులుగా పెంచాలని ‘ది గార్డియన్’ సైట్కు రాసిన తాజా వ్యాసంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు సైమా మిర్ సూచించారు. ►గత ఏడాది ఏప్రిల్లో మరణించిన ప్రసిద్ధ ఇంగ్లండ్ రచయిత్రి, కవయిత్రి, ‘ది లిటరరీ కన్సల్టెన్సీ’ వ్యవస్థాపకురాలు రెబెక్కా స్విఫ్ట్ స్మృత్యర్థం ప్రారంభమైన ‘ఉమెన్ పొయెట్స్ ప్రైజ్’ కు తొలి ఏడాది విజేతలుగా క్లెయిర్ కాలిసన్, నినా మింగ్యా పావెల్స్, అనితా పతి ఎంపికయ్యారు. స్త్రీ సాధికారత అంశాలపై సృజనాత్మకమైన ప్రతిభ కనబరుస్తున్న కవయిత్రులకు ఈ అవార్డు ఇస్తారు. -
స్త్రీలోక సంచారం
అర్చనా సింగ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్వాలి స్టేషన్లో ఆమె డ్యూటీ. కొత్వాలి ఝాన్సీ జిల్లాలో ఉంది. ఝాన్సీ జిల్లా ఉత్తర ప్రదేశ్లో ఉంది. అర్చనకు 30 ఏళ్లు. పెళ్లైంది. పదేళ్ల కూతురు, ఇంకో ఆర్నెల్ల కూతురు ఉన్నారు. భర్తకు హరియాణాలో ఉద్యోగం. ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. అర్చన తల్లిదండ్రులు కాన్పూర్లో ఉంటారు. అర్చన పెద్ద కూతురు కాన్పూర్లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతోంది. భర్తకు, తల్లిదండ్రులకు, పెద్ద కూతురికి దూరంగా అర్చన 2016 నుంచి కొత్వాలీలో డ్యూటీ చేస్తోంది. ఇప్పుడు నెలల బిడ్డ, తను ఉంటున్నారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అర్చనను పిలిపించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత అర్చనను ఆగ్రాకు బదలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు! అర్చన సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. కానైతే మంచే జరిగింది. తను కోరుకుంటున్నదే జరిగింది. ఆగ్రాలో ఉంటే పెద్దకూతురితో, భర్తతో కలిసి ఉండేందుకు వీలవుతుంది. తల్లిదండ్రులూ దగ్గరగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి రావడమంత సంతోషం ఏముంటుంది.. ఈ చిన్ని జీవితానికి! ఆమెకు ఇంతటి ‘మహర్దశ’ను పట్టించింది చిన్న కూతురు. ఎప్పట్లాగే ఆ.. నెలల బిడ్డను తనతో పాటు డ్యూటీకి తెచ్చిన అర్చన ఆ బిడ్డను తన కళ్ల ఎదుటే ఓ బల్ల మీద ఉంచి తన పనిలో తను ఉన్నప్పుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోను చూసిన వెంటనే లక్నోలోని ‘టైమ్స్’ పత్రిక ఆమె గురించి రాసింది. ఆ వార్త చదివిన డీజీపి వెంటనే అర్చనకు ‘వరం’ ఇచ్చారు. అన్నీ వెంట వెంటనే! అర్చనైతే చాలా హ్యాపీగా ఉంది. డీజీపీని, కొత్వాలీలో తనతో కలిసి పని చేసినవారిని, తనను కలుపుకుని పనిచేసినవారిని, పత్రికా ప్రతినిధులను తలచుకుని తలుచుకుని ధన్యవాదాలు తెలుపుతోంది. ఇప్పుడిక అర్చన తన విధులను మరింత ధ్యాసగా నిర్వర్తించడానికి ఆమె కుటుంబం ఆమెకు తోడ్పడుతుంది. అర్చన గురించి డీజీపీ తను చదివిన వార్తను ట్యాగ్ చేస్తూ ఏం ట్వీట్ చేశారో చూడండి. ‘‘21 శతాబ్దపు అచ్చమైన మహిళ. ఏ బాధ్యతనైనా నిబద్ధతతో చేస్తుంది. అందుకు ఒక నిదర్శనం అర్చన.’’ ఆపిల్ కో–ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నలుగురి పిల్లల్లో పెద్దమ్మాయి లీసా బ్రెనన్ రచయిత్రి. ఆమె కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాల్లో తండ్రితో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా రాసుకున్నారు లీసా. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్లో క్యాన్సర్తో చనిపోయారు. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తను ప్రేమించిన యువతితో విడిపోయి పక్కకు వచ్చేశాడు స్టీవ్. ఆ తర్వాతి ఏడాది పుట్టిన అమ్మాయే లీసా. అయితే స్టీవ్ ఆమెను తన కూతురు కాదనేశాడు. వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యాక గానీ లీసాకు తనే తండ్రి అని అంగీకరించలేక పోయాడు. ఇవన్నీ లీసా పెద్దగా మనసులో పెట్టుకున్నట్లు లేదు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రితో కలిసి స్కేటింగ్కి వెళ్లే టప్పుడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేదో తన ‘స్మాల్ ఫ్రై’ పుస్తకంలో ఒక చోట రాశారు లీసా. ‘‘హే, స్మాల్ ఫ్రై, లెట్ అజ్ బ్లాస్ట్. వియ్ ఆర్ లివింగ్ ఆన్ బారోడ్ టైమ్’’ అనేవారట స్టీవ్. ‘అరువు తెచ్చుకున్న సమయాన్ని ఉత్తేజంతో నింపుకుందాం’ అని ఆయన మాటలకు అర్థం. లీసాకు అది అర్థం అయింది కానీ, ‘స్మాల్ ఫ్రై’ అనే మాటను తనకు తెలిసిన అర్థంలోనే తీసుకుని, తను కూడా తండ్రిని.. ‘ఓకే ఫ్యాట్ ఫ్రై, లెటజ్ గో’ అనేదట. ‘స్మాల్ ఫ్రై’ అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ప్రాముఖ్యంలేని మనిషి లేదా వస్తువు అనేది ఒక అర్థం. పిల్ల చేప అనేది ఇంకో అర్థం. ఇవి రెండూ కాకుండా.. లీసా అనుకున్న అర్థం వీటికి భిన్నమైనది. ఫ్రెంచి ఫ్రైస్ ఉంటాయి కదా.. బంగాళ దుంపలతో చేసేవి.. వాటిల్లో తినగా అడుగున మిగిలిపోయిన తునకల్ని స్మాల్ ఫ్రైస్ అంటారని అనుకున్న లీసా.. తనను అంత మాట అన్న తండ్రిపై ప్రతీకారంగా ‘ఫ్యాట్ ఫ్రై’ అనేసిందట. ఆ తర్వాత తెలుసుకుందట.. తండ్రి తనను పిల్ల చేప (ఎదుగుతున్న చేప) అనే అర్థంలో ‘స్మాల్ ఫ్రై’ అని అన్నాడని. చివరికి అదే మాటను ఆమె తన పుస్తకానికి టైటిల్గా పెట్టుకున్నారు. -
దేవుడా.. ఈ మగాళ్లున్నారే...!
బ్రూస్ అలెగ్జాండర్ టెక్సాస్ నుంచి న్యూ మెక్సికోకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడొక సాధారణ ప్రయాణికుడు. అయితే ఫ్లయిట్ ఆల్బుకర్క్లో దిగాక మాత్రం ‘పేరుమోసిన’ ప్రయాణికుడు అయ్యాడు! పోలీసులు అతడి చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడంతో అతడలా పేరు మోశాడు! ప్రయాణంలో బ్రూస్ తన సహ ప్రయాణికురాలిపై కనీసం రెండుసార్లు కావాలని తలవాల్చాడు. ఒకసారి తన వేళ్లతో ఆమె వక్షోజాలను తాకాడు. ఆ మహిళ ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు, కోర్టు అంటూ తిరుగుతున్నాడు. ఇవన్నీ కాదు.. విచారణలో అతడు అన్న మాటలకు ఈ రెండు డిపార్ట్మెంట్లు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ‘‘నచ్చిన స్త్రీల అవయవాలను తాకడం తప్పేం కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు కొనాల్డ్ ట్రంపే అన్నాక.. (2005లో అన్నాడట) నేను చేసిన పని తప్పెలా అవుతుంది?’’ అని బ్రూస్ ప్రశ్నించాడు. దేవుడా.. ఈ మగాళ్లున్నారే...! ‘ది షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్ప్యాక్ అండ్ ది వరల్డ్’ అనే కొత్త పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ ఇది. రచయిత్రి శివ్యానాథ్ ఎప్పటి నుంచో ‘సోలో’ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ అనుభవాలను, అనుభూతులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. శివ్యానాథ్ది డెహ్రాడూన్. ఆమె తొలి జర్నీ సింగపూర్. అక్కడినుంచి ఆగ్నేయాసియా దేశాలన్నీ చుట్టి వచ్చారు. కొంతకాలం సింగపూర్ టూరిజం బోర్డులో పనిచేశారు. మంచి ఉద్యోగమే కానీ, ఎందుకో ఆమెకు ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. 2011లో స్పితీ వ్యాలీకి (హిమాలయాలు) వెళ్లి, నెలపాటు సన్యాసినిగా గడిపినప్పుడు ఆ ఏకాంత ప్రశాంత వాతావరణంలో.. జీవితం అంటే ‘సోలో జర్నీ’ అని అర్థం చేసుకున్నారు శివ్యానాథ్. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ తిరిగొచ్చారు. ఊహల్లోకి, కలల్లోకి, నక్షత్రాల్లోకి, పచ్చటి పర్వతాల్లోకి, ప్రపంచ పచ్చిక బయళ్లలోకి శివ్యా చేసిన తొలి సోలో జర్నీ అది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడల్లో ప్రయాణించారు. రకరకాల మనుషుల్ని కలుసుకున్నారు. మారిషస్ కూడా వెళ్లారు. అక్కడ ఆమెకు స్వర్గం కనిపించింది! స్వర్గమే కానీ కొన్ని భయాలు కూడా వెంటాడాయి. శివ్యా.. మధ్య అమెరికా దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు స్పానిష్ భాష నేర్చుకున్నారు. అక్కడి మన్యన్ తెగలతో కలిసి జీవించే ప్రయత్నం చేశారు. 2014లో దక్షిణ ఆస్ట్రేలియాలోని ద్రాక్షతోటల్లో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ ఆమెకు హిందీ మాట్లాడే గుజరాత్ మూలాలున్న పోలెండ్ దేశస్థుడు పరిచయం అయ్యాడు. టర్కీ, బెహ్రెయిన్, కెనడా.. శివ్యా పర్యటించిన దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో అయితే ఆమె విహరించని ప్రదేశమే లేదు. ఈ అనుభవాలనన్నింటినీ శివ్యానాథ్ ఈ పుస్తకంలో రాశారు. పర్యాటనల అనుభవాలు ఎవరివి వారివే అయినా, శివ్యా అనుభవాలు ఒంటరి ప్రయాణాలకు మహిళల్ని ప్రేరేపించేంత శక్తిమంతంగా ఉన్నాయి. బహుశా ఆ శక్తి ఆమె రచనా శైలిది కావచ్చు. ‘పిచ్చి అభిమానం’ అంటుంటారు. ఈ స్థాయి అభిమానం సాధారణంగా ఫ్యాన్స్కి ఉంటుంది. అయితే అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఇంత పిచ్చి అభిమానం తన ఫ్యాన్స్ మీద ఉంది! వాళ్లకు ఏమైనా కష్టం వస్తే ఆమె తట్టుకోలేరు. తను చేయగలిగింది చేస్తారు. ఈ దయాగుణ సంపన్నురాలు చేయగలిగింది ఏముంటుంది? ఆర్థికంగా ఆదుకుంటారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు’ అనుకుంటారు. తాజాగా శాడీ బార్టెల్ అనే మహిళా అభిమానికి ఆమె 15,000 డాలర్లను విరాళంగా పంపించారు. శాడీ విషయం ఆమె వరకు ఎలా వచ్చిందంటే.. విరాళాల కోసం టేలర్ స్విఫ్ట్ను, ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ట్విట్టర్లో శాడీ ఒక మెసేజ్ పెట్టింది. టేలర్ వెంటనే ఆ మెసేజ్కు స్పందించి డబ్బు పంపారు. ‘‘హేయ్ గయ్స్! ఎంతో ఆవేదనతో ఈ పోస్ట్ పెడుతున్నాను. వీలైతే నాకు, నా కుటుంబానికి సహాయం చెయ్యండి. వెంటనే ఇప్పుడేం చెప్పలేను కానీ.. అకస్మాత్తుగా ఏంటిది అని అనుకోకండి. ఐ లవ్ యు గైస్. నేను మా అమ్మను బతికించుకోవాలి. అందుకే సహాయం అడుగుతున్నా. నా వయసు ఇప్పుడు 19 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో చేతులు చాస్తున్నాను’’ అని శాడీ ట్విట్టర్ పెట్టారు. ఆ అమ్మాయి చెబుతున్నదానిని బట్టి ఆమె తల్లికి అల్సర్ కారణంగా రక్తస్రావం జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందక.. చివరికది ‘బ్రెయిన్ హెమరేజ్’కు దారి తీసింది. ఆమె చికిత్స కోసం టేలర్ డబ్బు పంపగానే శాడీ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆమె దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. టేలర్ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని ఎమోషనల్ అయింది. ఇండియాలో స్థిరపడిన 34 ఏళ్ల ఫ్రెంచి ప్రయోగశీల నటి, రచయిత్రి కల్కీ కేక్లాన్.. దీపపు పురుగులా ఇప్పుడు డిజిటల్ స్పేస్లో తిరుగుతున్నారు. ‘స్మోక్’ అనే వెబ్ సిరీస్తో ఆన్లైన్ వినోదాల ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెడుతున్న కేక్లాన్.. ‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సిరీస్లోని అత్యుత్తమ కథా, సాంకేతిక, నట ప్రమాణాలను చూసి స్ఫూర్తి పొందారు. గోవాలో చిత్రీకరించిన ఈ ‘స్మోక్’ అనే క్రైమ్ డ్రామాలో కేక్లాన్ అసమాన ప్రతిభను కనబరిచినట్లు ‘స్మోక్’ దర్శకుడు నీల్ గుహా ఆమెను ప్రశంసిస్తుండగా.. ‘‘కనీసం ఆ మాత్రమైనా చేయలేకపోతే వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టడం దుస్సాహమే అవుతుంది’’ అని కేక్లాన్ నవ్వుతూ అంటున్నారు. రేపటి నుంచి (అక్టోబర్ 26) ‘ఈరోస్ నౌ’ లో వీక్షకులకు అందుబాటులోకి రానున్న 11 ఎపిసోడ్ల ‘స్మోక్’ ఇప్పటికే ఈ ఏడాది కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం పొందింది. ఒక వెబ్ సిరీస్ కాన్స్ వెళ్లడం ఇదే మొదటిసారి. అన్ని వయసులలోని మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశార్హతను కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన మహిళా ఉద్యమకారులతో గతవారం శబరిమల ఆలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సున్నితమైన అంశంపై వ్యాఖ్యానించడానికి కేంద్రంలో అధికార పక్షం నుంచి ప్రముఖులెవరూ ఇంతవరకు ముందుకు రాని పరిస్థితుల్లో తొలిసారి స్మృతీ ఇరానీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం నా ఉద్దేశం కాదు. కానీ మనసుకు అనిపించిన మాట చెబుతాను. నెలసరి రోజుల్లో రక్తస్రావంతో తడుస్తున్న వస్త్రంతో (ప్యాడ్) మనం మన స్నేహితుల ఇళ్లకు వెళతామా?! వెళ్లము కదా. ఇదీ అంతే అనుకోవాలి. ఆచారశుభ్రత ఎంత ముఖ్యమో, ఆచారాలను పాటించడానికి వ్యక్తిగత శుభ్రతా అంతే అవసరం. నాకు ప్రార్థించే హక్కు ఉండొచ్చు. కానీ అపవిత్రం చేసే హక్కు లేదు’’ అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి అన్నారు. వ్యక్తిగత హోదాలో, ఒక పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు దుమారం రేగుతోంది. -
మగాళ్లు అలా అనుకునే కాలం పోయింది!
‘మీ టూ’–ఇండియా ఉద్యమానికి మద్దతుగా అనేక రంగాలలోని ప్రముఖ మహిళలంతా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక శోభా డే సరేసరి. ఈ ముక్కుసూటి స్త్రీవాద రచయిత్రి వివిధ వేదికలపై విస్తృతంగా లైంగిక వేధింపు ఆరోపణలను ఒక ముఖ్యమైన, చర్చించి తీరవలసిన అంశంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఆంగ్ల దిన పత్రిక ‘డెక్కన్ క్రానికల్’లో ఆమె ‘జమానా ఆఫ్ మేల్ ఎంటైటిల్మెంట్, ప్రివిలేజ్ ఈజ్ ఓవర్’ అనే ఒక వ్యాసం రాశారు. ‘హక్కుదారులం’ అని, ‘ఏం చేసినా చెల్లుతుంది’ అని మగాళ్లు అనుకునే కాలం ముగిసిపోయింది అని శోభా డే ఆ వ్యాసంలో స్పష్టం చేశారు. బయటికి వచ్చిన బాధిత మహిళలకు, అజ్ఞాతంలో ఉండిపోయిన బాధితురాళ్లకు ఆమె తన మద్దతు ప్రకటించారు. ‘‘మౌనంగా ఉండిపోవడం అన్నది ఎన్నటికీ, ఎవరికీ.. ఎంచుకోవలసిన ఒక మార్గం కాకూడదు. నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని ఒక మహిళ నోరు తెరిచి చెప్పినప్పుడు అందరం ఆమె తరఫున నిలబడాలి. మేమున్నాము అని ధైర్యం చెప్పాలి. ‘మీ టూ’ అని ఇప్పుడు వినిపిస్తోంది కానీ, ఎప్పటి నుంచో బాధిత మహిళ తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రమే సమాజం ఆమె చెబుతున్న దానిని వినేందుకు ధ్యాస పెట్టింది. ఎం.జె.అక్బర్ కానీ, సుభాష్ ఘాయ్ కానీ.. అలాంటి మగాళ్లకు ‘మీ కాలం చెల్లిపోయింది’ అని తెలియజెప్పే తరుణం వచ్చేసింది. కొత్త ప్రారంభాలకు ఇది నాందీ సమయం. పురుషులతో సమానంగా స్త్రీలూ ఉన్నప్పుడు.. స్త్రీలను లైంగిక వేధింపులతో, ఇతరత్రా నిందలు, ఆరోపణలతో వెనక్కు నెట్టే వృథా ప్రయత్నాలు మగాళ్లు మానుకోవాలి’’ అని శోభా డే తన వ్యాసంలో హెచ్చరించారు. పెళ్లయ్యాక స్త్రీకి రక్షణ ఉంటుంది. స్వేచ్ఛ పోతుంది. సాధారణంగా జరిగేదిదే. ఎక్కడో కొందరికి రక్షణతో పాటు స్వేచ్ఛా ఉంటుంది. ఈ రెండిటిలో ఏది ఉన్నా లేకున్నా.. స్త్రీ ఏదైతే కోరుకుంటుందో అది ఉంటేనే ఆమెకు సౌకర్యంగా ఉంటుంది. హాలీవుడ్ నటి నికోల్ కిడ్మన్కు రెండుసార్లు పెళ్లయింది. మొదటి భర్త టామ్ క్రూజ్. తన 22 ఏళ్ల వయసులో.. అప్పటికే స్టార్ అయిన క్రూజ్ను చేసుకుంది నికోల్. అతని భార్యగా ఉన్నప్పుడు అతని స్టార్డమ్ కారణంగా తనకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఉండేదని నికోల్ చెప్పారు. ‘‘మీ కెరియర్ ప్రారంభంలో గానీ, తర్వాత గానీ మీకేమైనా లైంగిక వేధింపులు ఎదురయ్యాయా?’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలోని ప్రశ్నకు సమాధానంగా ఆమె తన పూర్వపు భర్త ప్రస్తావన తేవలసి వచ్చింది. ఇప్పుడు ఆమె కీత్ అర్బన్ భార్య. అందుకే.. ‘‘నేనిప్పుడు నా మొదటి భర్త గురించి మాట్లాడ్డం సమంజసం కాదు. మాట్లాడితే నా ప్రస్తుత భర్తను అగౌరవపరచినట్లు ఉంటుంది’’ అని నికోల్ అన్నారు. ఇంకో మాట కూడా ఆమె అన్నారు. ‘‘టామ్ క్రూజ్తో ఉన్నప్పుడు నాకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఉండేది కానీ, స్వేచ్ఛ ఉండేది కాదు. కీత్ అర్బన్ని చేసుకున్నాక రక్షణతో పాటు స్వేచ్ఛా వచ్చింది. స్వేచ్ఛ.. పెళ్లయిన స్త్రీని శక్తిమంతురాలిని చేస్తుంది. అప్పుడిక రక్షణ కోసం ఆమె తన భర్త పైన కూడా ఆధారపడే అవసరం ఉండదు. కీత్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమ నాకు రక్షణను, స్వేచ్ఛను, శక్తినీ ఇచ్చింది’’ అని చెప్పారు నికోల్. ఇంట్లో పేరెంట్స్ మగపిల్లల్ని స్త్రీల పట్ల గౌరవభావంతో పెంచితే కనుక పురుషులలో సంస్కారవంతమైన జనరేషన్లను మున్ముందు మనం చూడగలుగుతామని మలైకా అరోరా అంటున్నారు. పురుషాధిక్య భావనలు తగ్గితేనే.. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆగుతాయని కూడా ఆమె అన్నారు. ‘‘నాకో కొడుకు ఉన్నాడు. వాడిని నేను సక్రమంగా పెంచాలి. మహిళలపై గౌరవ భావంతో పెంచాలి. నాతో పాటు.. అందరు తల్లులు ఇలా పెంచితే.. స్త్రీని ఆటబొమ్మగా చూసే సంస్కృతి క్రమంగా అంతరిస్తుంది. స్త్రీ మీద తనకు హక్కు ఉందనుకునే మైండ్ సెట్ని చిన్న వయసు నుంచీ మార్చాలి. నేనిప్పుడు అదే పని చేస్తున్నా’’ అని మలైకా తెలిపారు. ‘మీ టూ’ పై వ్యాఖ్యానిస్తూ ఈ మాటలు చెప్పిన మలైకా.. ‘‘ఏ స్త్రీ అయినా తన బాధను చెప్పుకుంటున్నప్పుడు సమాజం వినాలి. పెడచెవిన పెట్టకూడదు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడినవారికి తప్పనిసరిగా శిక్ష పడాలి’’ అని మలైకా అన్నారు. ఇండియా వచ్చే విదేశీయులు వీసా కోసం ఇక నుంచీ తమ గురించి మరికొన్ని అదనపు వివరాలను పొందుపరిచే విధంగా దరఖాస్తు ప్రశ్నావళిలో భారత ప్రభుత్వం మార్పులు చేస్తోంది. నేర చరిత్ర ఉందా? గతంలో వీసా తిరస్కరణకు గురయ్యారా? అనే రెండు ప్రశ్నల ద్వారా.. వారు బాలలపై లైంగిక అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉందేమో ముందే గుర్తించేందుకు ఈ విధమైన మార్పులను చేయాలనుకుంటున్నట్లు కేంద్ర శిశు, సంక్షేమ శాఖ ఇప్పటికే హోమ్ శాఖకు సమాచారం అందజేసింది. బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్టన్కి ఒక అలవాటు ఉంది. తొడిగిన బట్టల్నే మళ్లీ మళ్లీ వేసుకుంటూ ఉంటుంది. ఇందులో తప్పేంటి? ఎంత సాధారణ పౌరురాలైనా.. ప్రిన్స్ విలియమ్స్ని పెళ్లి చేసుకున్నాక.. ఆమె ఇక ఇంగ్లండ్ వంశంలోని రాకుమారే కదా! కనుక కొన్నింటిని పాటించాలి. కొన్నేం.. అన్నీ పాటిస్తున్నప్పటికీ వేసుకున్న బట్టల్లోనే మళ్లీ మళ్లీ కనిపించకూడదన్న (అనధికారిక) నియమాన్ని మాత్రం ఆమె పాటించలేకపోతోంది. వర్క్కి వెళ్లినప్పుడు కొన్ని దుస్తుల్లో ఆమెకు సౌకర్యంగా ఉంటుందట. ఆ దుస్తుల్ని గుర్తు పెట్టుకుని మరీ కేట్ రిపీట్ చేస్తుంటారు. అయితే ధరించిన దుస్తుల్నే తరచు ధరించడాన్ని ఉద్యోగం చేసే మహిళలు స్ట్రెస్గా ఫీల్ అవుతారనీ, అందుకే వారు బట్టల్ని స్పల్పకాల వ్యవధిలో రిపీట్ చేయాలని అనుకోరని ‘థైవ్ గ్లోబల్’, ‘ది బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్’ సంస్థలు ఉమ్మడిగా జరిపిన సర్వేలో వెల్లడయింది. పలుమార్లు అవే బట్టల్లో కోలీగ్స్కి కనిపించడానికి తాము ఇష్టపడబోమని సర్వేకు సహకరించిన 2,700 మంది మహిళా ప్రొఫెషనల్స్లో 49 శాతం మంది చెప్పారట. ఈ మిగతా 51 శాతం మంది కేట్ లాంటి వాళ్లన్నమాట. -
ఈ మహిళకు ముస్లింగా ఉండే అర్హత లేదు!
ప్రముఖ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ మత బహిష్కరణ విధించింది! శబరిమలకు అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష భేదం లేకుండా కేరళలోని హిందూ మతస్థులందరూ ఒక వైపు నిరసన ప్రదర్శనలు జరుపుతుండగా.. ఆలయంలోకి ప్రవేశించేందుకు రెహానా ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ముస్లిం కౌన్సిల్ ఆమెపై ఈ విధమైన చర్యను తీసుకుంది. అంతేకాదు, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ‘మహల్లు’ సభ్యత్వం నుంచి తొలగించాలని ‘ఎర్నాకుళం సెంట్రల్ ముస్లిం జమాత్’ ను కూడా కేరళ కౌన్సిల్ను ఆదేశించింది. ‘‘ఆమె చర్య లక్షలాది మంది హైందవ భక్తుల మనసులను బాధించింది. వారి ఆచారాలను అగౌరవపరిచింది. ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనలో పాల్గొని, నీలి చిత్రంలో నటించి, ఇప్పుడు మతవిశ్వాసాలకు భంగకరంగా ప్రవర్తించిన ఈ మనిషికి ముస్లింగా ఉండే అర్హత లేదు’’ అని కేరళ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.పూన్కుంజు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు, రెహానా శుక్రవారం శబరిమలను ఎక్కే ప్రయత్నం చేశారన్న విషయం తెలిసి కోపోద్రిక్తులైన ముస్లింలు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. జమ్మూలోని కఠువాలో ఈ ఏడాది ఆరంభంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో బాలిక తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త తాలిబ్ హుస్సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన కేసును విచారిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆ కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. ‘‘నాకు ఏ విధంగానూ తాలిబ్ హుస్సేన్ వైపు వాదించాలని లేదు. నేనీ నిర్ణయం తీసుకోవడానికి అతడి గురించి నాకు తెలిసిన విషయాలు చాలు’’ అని జైసింగ్ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థినిపై బాట్లా హౌస్ ఏరియాలోని ఆమె అపార్ట్మెంట్లో హుస్సేన్ అత్యాచారం జరిపినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చదివిన అనంతరం జైసింగ్ కేసు నుంచి తప్పుకున్నారు. ఆ వార్తా కథనంలో బాధితురాలు జరిగిన ఘటనలనన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్లో నాపై అత్యాచారం చేసిన హుస్సేన్ అంతకు ముందు నుంచే తనను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధిస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో తను అందరిలాంటి మగాణ్ణి కాదని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ వినకపోవడంతో బలప్రయోగంతో అనుభవించాడు’’ అని ఆమె వివరించారు. ప్రముఖుల్ని వెంటాడి రహస్యంగా వారి ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్లను ‘పాప్పరాజ్జీ’ అంటారు. అలాంటి ఒక పాప్పరాజ్జీ తీసిన తన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పెట్టి.. పాప్పరాజ్జీల అనుచిత ప్రవర్తనతో తనలాంటి వారు ఎంతగా ఇబ్బంది పడతారో తెలియజేస్తూ ఓ పొడవాటి పోస్ట్ పెట్టిన 23 ఏళ్ల అమెరికన్ సూపర్ మోడల్ జిజీ హదీద్పై ఓ ఫొటో ఏజెన్సీ కేసు పెట్టింది. ‘ఫొటోలు తీసుకోవాలనుకునే వాళ్ల కోసం వీలైనంత వరకు మేము ఓపిగ్గానే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. అయితే ప్రతిసారీ అలా కుదరదు. అయినప్పటికీ ఫొటోల కోసం బలవంతం చేస్తుంటారు. ఇవ్వకపోతే.. మేము ఎక్కడికి వెళితే అక్కడికి మమ్మల్ని వెంటాడి, వేటాడి ఫొటోలు తీసుకుని, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. మాలో ఏం స్పెషల్ ఉంటుంది? ఏ సందర్భమూ లేకుండానే ఓ ఆరడుగుల మనిషి కారు ఎక్కడాన్ని, కారు దిగడాన్ని, పని చేస్తున్నచోట ఆఫీస్ బిల్డింగ్లోకి వెళ్లడాన్ని, మళ్లీ బయటికి రావడాన్ని నిరంతరం షూట్ చేస్తూనే ఉంటారు. అందుకోసం వారు మూర్ఖంగా, నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తిస్తుంటారు. అది మమ్మల్నే కాదు, మా పక్కన ఉన్న సాధారణ వ్యక్తులను కూడా ప్రమాదంలో పడేసేలా, ప్రాణాంతక స్థితిలోకి నెట్టేసేలా ఉంటుంది. మరీ వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశిస్తే ఎలా? పాప్పరాజ్జీలు తమ స్వార్థాన్ని, ధనార్జన ధ్యేయాన్ని పక్కన పెట్టి.. కనీస మానవత్వంతో బిహేవ్ చేయాలి’’ అని ఆ పోస్టులో పెట్టిన హదీద్ ఆ తర్వాత కొన్ని గంటలకే దానిని తొలగించారు! ఐదు రోజుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు పూజల అనంతరం సోమవారం మూత పడ్డాయి. అయితే ఆలయంలోకి స్త్రీల ప్రవేశంపై కేరళలో జరుగుతున్న రభస మాత్రం పూర్తి కాలేదు. మరోవైపు.. శబరిమల ఆలయంలోకి స్త్రీలను అనుమతించడం సబబా కాదా అన్నదానిపైనా సోషల్ మీడియాలో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఒక మలయాళీగా, ఒక హిందువుగా ఈ పరిణామాలు నన్నెంతో బాధించాయి. అంతా చదువుకున్న వారే అయిన కేరళలో స్త్రీ, పురుషులు ఎందుకని ఇలా దురుసుగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. శబరిమలను దర్శించుకోవాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ దర్శించుకోవాలని ఆశపడుతున్న మహిళలను నేను వ్యతిరేకించను’’ అని మాయా మీనన్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో మలయాళీ నేపథ్య గాయని అంజూ జోసెఫ్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ‘‘మహిళలకు హక్కులు లేని కాలానికి తిరోగమించడం కోసం పోరాడుతూ ఆ క్రమంలో పురోగమనం కోసం పోరాడిన మన ముందు తరం వారి ప్రయత్నాలను, ప్రయాసను వృథా చేస్తున్నాం. వాళ్లు మనకు ఓటు హక్కు తెచ్చారు. సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం ఏర్పరిచారు. అయినప్పటికీ మనమింకా వెనకే ఉండిపోతాం అంటున్నాం’’ అని అంజు ఆవేదన చెందారు. యు.ఎస్.లోని హోండురాన్ వలస గుంపుల (మైగ్రెంట్ క్యారవాన్స్) నుంచి మహిళలను, చిన్నారులను దేశంలోకి అనుమతించే కార్యక్రమాన్ని మెక్సికో ప్రారంభించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. డెమోక్రాట్లు వలస గుంపుల్ని కోరుకుంటున్నారు. అసలీ వలస గుంపులేంటీ అని అనేకమంది ఆశ్చర్యపోతున్నారు’ అన్నారు. -
స్త్రీలోక సంచారం
హాలీవుడ్ నటి కైరా నైట్లీ.. ‘డిస్నీ’ క్లాసిక్స్లోని కొన్ని సినిమాలు ఇంట్లో తన కూతురు కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆ ‘నిషిద్ధ’ సినిమాల్లో ఒకటి.. 1950లో విడుదలైన ‘సిండ్రెల్లా’. అందులో సిండ్రెల్లా అనే యువతి.. సంపన్నుడైన ఒక యువకుడు వచ్చి తనను రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ‘‘ఇలాంటి సన్నివేశాలున్న సినిమాలను ఆడపిల్లలకు చూపించకూడదు. రక్షణ కోసం ఒకరిపై ఆధార పడడం మంచి విషయం కాదనీ, ఎవర్ని వారే రక్షించుకోవాలని చిన్నప్పట్నుంచీ మనం మన అమ్మాయిలకు చెబుతుండాలి’’ అని ప్రసిద్ధ ‘ఎలెన్’ షోలో కైరా అన్నారు. ‘‘సిండ్రెల్లా నాకు ఇష్టమైన చిత్రమే కానీ, అందులో సిండ్రెల్లా తన రక్షణ కోసం ఒక పురుషుడిపై ఆధారపడడం’ నాకు నచ్చలేదు. ఆ ఒక్క కారణంతో ఆ చిత్రాన్ని నా కూతురికి చూపించలేకపోతున్నాను. అలాంటివే ఇంకొన్ని చిత్రాలను కూడా ఇంట్లో బ్యాన్ చేశాను’’ అని కైరా తెలిపారు. ఇప్పుడు ఆమె కూతురు వయసు మూడేళ్లు. ‘‘తను ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటుంది. అయితే స్వతంత్రంగా ఉండడం లైఫ్లో ముఖ్యం అని మాత్రం తనకు చెప్తాను.. అందుకు తగ్గ వయసు రాగానే’’ అని కైరా అన్నారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కల్.. ఈ ఏడాది మేలో పెళ్లయినప్పట్నుంచీ పూర్తిగా టూర్లలోనే గడుపుతున్నారు. మధ్య మధ్య విరామాలలో సామాజిక కార్యక్రమాలకు కూడా జంటగా, విడివిడిగా తమ సేవలు అందిస్తున్న ఈ దంపతులు.. తాజాగా ఆస్ట్రేలియాలోని శివారు ప్రాంతమైన ‘దుబ్బో’ లో పర్యటిస్తున్నప్పుడు చిన్నపాటి భారీ వర్షం కురిసింది. కరువు పీడిత ప్రాంతమైన దుబ్బోలో వర్షం పడడం అంటే.. అదొక విశ్వాంతరాళ వింత అన్నట్లుగా ఉంటుంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు అడుగుపెట్టడంతోటే వర్షం పడడంతో దుబ్బో మేయర్ బెన్ షీల్డ్స్ ఆనందంతో పరవశమై.. ‘మీ రాకతో నాలుగు చినుకులు పడ్డాయి’ అంటూ వారిపై ధన్యవాదాల వర్షం కురిపించారు. ఇంగ్లండ్లో వాతావరణం ఎప్పుడూ చలిచలిగా, తేమగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలోని దుబ్బోలో, ఆ చుట్టుపక్కల వేడి తాండవిస్తుంటుంది. అందుకే మేయర్ గారు అలా రెండు ప్రాంతాలకూ పోలికలు తెస్తూ ఆ రాజకుటుంబ జంటకు అభివందనాలు తెలియజేశారు. శ్రీలంకలో బికినీలు వేసుకుని బీచ్లో తిరగడంపై అనధికారికంగా నిషేధం ఉంది. ఇప్పుడా అనధికారిక నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉంది. లంక బీచ్లను సమీపించే కూడళ్లలో విదేశీ పర్యాటకులకు ‘నో బికినీస్’ అంటూ పెద్ద ఎర్ర గుర్తుతో సైన్ బోర్డులు కనిపిస్తుంటాయి. నిజానికి అవి పాలనా యంత్రాంగం అనుమతి తీసుకుని పెట్టినవి కావు. సంస్కృతి పరిరక్షణ ప్రియులెవరో వాటిని ఏర్పాటు చేశారు. దీనిపై పర్యాటకులు తరచు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో విషయం పైస్థాయిలోకి వెళ్లింది. బికినీలను విహారానికి కాకుండా సంస్కృతికి ముడిపెట్టి నిషేధించడం ఏంటని పాశ్చాత్య దేశాల పర్యాటకలు చిరచిరలాడితే కనుక శ్రీలంకలో టూరిజం కుంటుపడే ప్రమాదం ఉందని తలపోసిన ప్రభుత్వం తక్షణం స్పందించి.. ‘మీ ఇష్టం వచ్చిన దుస్తులు ధరించండి’ అని బీచ్ అధికారుల చేత అనధికారికంగా చెప్పిస్తోంది. త్వరలోనే అధికారికంగా వెసులుబాటును ఇవ్వబోతోంది. తమిళనాడు, కంచీపురంలోని కిళ్కొట్టయ్యూర్ గ్రామంలో ఒక మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. కొడుకు ఆత్మహత్యకు తనే కారణమన్న అపరాధ భావన ఆమెను అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ తల్లి పేరు ఇంద్రాణి. వయసు 45. నాలుగిళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె కొడుకు గోవిందరాజన్కు 16 ఏళ్లు. ఎప్పటి నుంచో బైక్ కొనిమ్మని అడుగుతున్నాడు. అతడు కోరుకుంటున్న బైక్ ధర లక్షా యాభై వేలు. అంత పెద్దం మొత్త ఇంద్రాణికి తలకు మించిన బరువు. ఆ మాటే చెబుతూ వస్తోంది. చివరికి గోవిందరాజన్.. బైక్ లేకుండా తన జీవితం వేస్ట్ అనుకున్నాడో.. లేక, బైక్ కొనివ్వని తల్లిని చచ్చి సాధిద్దామని అనుకున్నాడో.. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అప్పటి నుండీ తన కొడుకు మరణానికి తనే కారణం అని కుమిలిపోతూ ఉన్న ఇంద్రాణి.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని చనిపోయింది. ఆ ఘటన కిల్కొట్టయ్యూర్ గ్రామాన్ని దిగ్భ్రాంతిపరిచింది. గ్రామంలో విషాదాన్ని నింపింది. తెలియని దెయ్యం కంటే, తెలిసిన దెయ్యం నయం అంటారు. కెరీర్ పీక్లో ఉన్న అమ్మాయిలు పెళ్లిని దెయ్యంలా భావిస్తారని అనుకుంటే కనుక.. అమెరికన్ సింగర్ లేడీ గాగా.. తెలిసిన దెయ్యాన్నే పెళ్లి చేసుకోబోతున్నారు! మ్యూజిక్ ఏజెంట్ క్రిస్టియన్ కారినోను తన ‘ఫియాన్స్’ గా ప్రకటించిన గాగా.. అతడితో తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా లోకానికి వెల్లడించారు. గాగా మంచి నిర్ణయమే తీసుకున్నారని అనుకోడానికి ఒక కారణం ఏంటంటే.. కారినో ప్రొఫెషనల్గా మాత్రమే కాకుండా.. ఎమోషనల్గా కూడా ఆమెకు ఒక మంచి ఏజెంటుగా ఉండడం. -
స్త్రీలోక సంచారం
జార్జి క్లూనీ అమెరికన్ నటుడు. నిర్మాత. బిజినెస్మ్యాన్. మూడుసార్లు గోల్డెన్గ్లోబ్ అవార్డు, రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రతిభావంతుడు. ఇవన్నీ అలా ఉంచితే.. వయసులో పెద్దవాడు. 57 ఏళ్లు. యాభై ఏడేళ్లంటే పెద్ద వయసేం కాదు కానీ, 40 ఏళ్ల వయసుతో పోల్చి చూస్తే పెద్దవాడే. ఆయన భార్య అమల్ క్లూనీ వయసు నలభై ఏళ్లు. జార్జిలా ఆమె సెలబ్రిటీ కాదు. మానవహక్కుల కార్యకర్త. లాయర్. నాలుగేళ్ల క్రితమే వీళ్లకు పెళ్లయింది. జార్జిక్లూనీ మొదటి భార్య తాలియా బల్సామ్ వయసు జార్జి కన్నా రెండేళ్లు ఎక్కువ. 1989లో పెళ్లి చేసుకున్నారు. 1993లో విడిపోయారు. అమల్ క్లూనీకి ఇది మొదటి పెళ్లే. జార్జికీ, అమల్కి మధ్య పదిహేడేళ్ల వయసు దూరం ఉన్నా, ఇద్దరి మనసుల మధ్య మిల్లీమీటరు దూరం కూడా లేదు. మొదటే అమల్ తనకు దొరికితే బాగుండుని చాలాసార్లు అనుకున్నాడు క్లూనీ. ఆయనలోని ఈ ఫీలింగ్ తరచు బయటపడుతుంటుంది. రెండు రోజుల క్రి తం మళ్లీ బయటపడింది. ‘వెరైటీ’ పత్రిక ‘పవర్ ఆఫ్ ఉమెన్’ లాస్ ఏంజెలిస్ ఈవెంట్లో జార్జి క్లూనీ తనని తను పరిచయం చేసుకున్న తీరు అక్కడి వచ్చిన మహిళల్ని ముగ్ధుల్ని చేసి, చెంపకు చెయ్యి ఆన్చుకునేలా చేసింది. ‘‘హాయ్.. అయామ్ జార్జ్. అయామ్ అమల్ క్లూనీస్ హస్బెండ్’ అని స్టేజి మీద జార్జి క్లూని తనని తను పరిచయం చేసుకోగానే చప్పట్లే చప్పట్లు. అంత పెద్దాయన తన భార్యను తనకన్నా ‘పెద్ద’ మనిషినిగా పరిచయం చెయ్యడం ముచ్చటైన సంగతే కదా. ఇంటిపనుల్లో తల్లికి సహాయం చేసే పిల్లలు, భార్యకు చేదోడుగా ఉండే జీవిత భాగస్వామి దాదాపుగా కనిపించరు. పాపం ఆమె ఒక్కటే ఇంటిల్లపాదికీ పనులు చేసి పెడుతూ రోజంతా సతమతం అవుతుంటుంది. ఎవరు చెబితే వింటారు ఈ పిల్లలు, భర్తలు?! అయినా ఒకళ్లు చెప్పే విషయమా ఇది! కళ్ల ముందు సాటి మనిషి రెక్కలు ముక్కలవుతుంటే చూస్తూ ఎలా ఉండగలం? ‘మన మనిషే కదా’ అనే కదా! ఇక ఇప్పుడైతే కళ్లముందు మనకు స్మార్ట్ఫోన్ తప్ప ఏమీ ఉండడం లేదు. సాధ్యం కాక కానీ, బాత్రూమ్కి వెళ్లడం, స్నానం చెయ్యడం కూడా సెల్ఫోన్లోనే చేసేలా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు, వారి తండ్రులు. ఈ స్మార్ట్ఫోన్లు, శోధన సైట్లు వచ్చాక మనుషులు మరీ ఎంతగా మనుషులు కాకుండా పోతున్నారో సునీల్ అగర్వాల్, అజిత్ నైనన్ అనే కార్టూనిస్టులు జంటగా ప్రతిరోజూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కార్టూన్స్ వేస్తుంటారు. సోమవారం ఒక కార్టూన్ వచ్చింది. మదర్స్డే పై వచ్చిన కార్టూన్ అది. అయితే 365 డేస్కీ సరిపోయేలా ఉంది. ఓ తల్లి.. తనకున్న రెండుచేతుల్తోనే ఇంటిపనులన్నీ చేస్తుంటుంది. ఆమె ప్రయాసను అర్థం చేసుకున్న పెంపుడు కుక్క ఆమె వెంటే ఉండి, నోటితో క్లీనింగ్ క్లాత్ పట్టుకుని ఆమెకు అందించడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ ఇంట్లోని తండ్రీ కొడుకులు కూడా ఆమెకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటారు! ఇద్దరూ బీన్ బ్యాగ్లో కూర్చొని ‘ఇంటి పనుల్లో సహాయం చెయ్యడం ఎలా?’ అని ల్యాప్టాప్లో వెదుకుతుంటారు! సామాజిక, కుటుంబ ధోరణుల్ని సుతిమెత్తగా విమర్శించిన ఈ కార్టూన్ను చూస్తే వచ్చే నవ్వు కన్నా, వెంటనే లేచి ఏదైనా హెల్ప్ చెయ్యాలన్న ప్రేరణే ఎక్కవగా కలుగుతుంది. గంగానది సంరక్షణకు ఉద్యమించి, ఈ ఏడాది జూన్ 22 నుంచి ఆమరణ దీక్ష చేస్తూ 112 వ రోజైన అక్టోబర్ 11న (గురువారం) మరణించిన 86 ఏళ్ల కాన్పూర్ ఐ.ఐ.టి. ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్) దీక్షాస్ఫూర్తిని.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీపాల్ అందుకున్నారు. గంగానదిలో అక్రమ తవ్వకాలకు, జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా జ్ఞానస్వరూప్ నిరశనకు కూర్చుంటే.. బచేంద్రీపాల్ 40 మంది వలంటీర్లతో కలిసి ‘మిషన్ గంగ’ పేరిట గంగానది ప్రక్షాⶠన కోసం ముప్పై రోజులపాటు గంగానది ఉపరితల జలాలపై పడవల్లో సాహసయాత్ర (రాఫ్టింగ్ ఎక్స్పెడిషన్) నిర్వహించబోతున్నారు. జలశుద్ధి, నీటి వృథా నివారణలపై భక్తులకు అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న ఈ యాత్ర.. దేశవ్యాప్తంగా గంగానది ప్రవహించే ఎనిమిది ప్రధాన నగరాలను కలుపుకుంటూ సాగుతుంది. ‘‘మొత్తం 1500 కి.మీ.ల రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఆగిన ప్రతి నగరంలోనూ మూడు రోజులు ఉంటాం. అక్కడి యువతీయువకులను, పాఠశాల విద్యార్థులను గంగానదిని కాలుష్యం నుండి కాపాడుకోవలసిన అవసరంపై చైతన్యపరిచి ముందుకు సాగుతాం’’ అని బచేంద్రీపాల్ వివరించారు. 64 ఏళ్ల పాల్ 1954 మే 24న ‘బంపా’లో (ప్రస్తుత ఉత్తరాంచల్) జన్మించారు. తన ముప్పవయ యేట 1984లో సరిగ్గా తన పుట్టిన రోజుకు ముందు రోజు (మే 23) మధ్యాహ్నం 1.7 నిముషాలకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. -
స్త్రీలోక సంచారం
పెప్సీ కంపెనీకి పన్నెండేళ్ల పాటు సేవలు అందించి, ఆ కంపెనీ సీఈవోగా ఈ ఏడాది అక్టోబర్ 2న పదవీ విరమణ పొంది, 2019 జనవరి వరకు ఛైర్మన్గా కొనసాగనున్న ఇంద్రా నూయి (62)ని న్యూయార్క్లోని ‘ఏషియా సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొందరు ‘‘పెప్సీ నుంచి బయటికి వచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ట్రంప్ కేబినెట్లో చేరిపోతారా?’’ అని అడిగిన ఒక ప్రశ్నకు నూయీ పెద్దగా నవ్వుతూ.. ‘‘నేను కనుక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు’’ అని అన్నారు. ‘‘పాలిటిక్స్కి నేను, నాకు పాలిటిక్స్ ఒకరికొకరం పడము. నేను అన్నీ బయటికే మాట్లాడేస్తాను. ఆచితూచి మాటల్ని వదల్లేను. అసలు దౌత్యం అంటే నాకు తెలీదు. నాలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చిందంటే.. నా వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కనుక నేను రాజకీయాల్లోకి రాను’’ అని స్పష్టంగా చెప్పారు. నలభై ఏళ్ల పాటు రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన ఇంద్రా నూయి.. ‘‘ఇప్పుడు కొద్దిగా తీరిక దొరకడంతో.. విముక్తి పొందినట్లుగా ఉంది’’ అని అన్నారు. 1955 అక్టోబర్ 28న మద్రాసులో పుట్టిన ఇంద్రా కృష్ణమూర్తి.. ‘ఆమ్సాఫ్ట్ సిస్టమ్స్’ సంస్థ ప్రెసిడెంట్ రాజ్ కె.నూయిని వివాహం చేసుకున్నాక (1981) ఇంద్రా నూయి అయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఈ కుటుంబం కనెక్టికట్లోని గ్రీన్విచ్లో ఉంటోంది. ఐక్యరాజ్యసమితి యు.ఎస్. రాయబారిగా ఈ ఏడాది చివర్లో తను రాజీనామా చేయబోతున్నట్లు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించి, అందరినీ నివ్వెరపరచిన నిక్కీ హేలీ (46) స్థానంలోకి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు ఇవాంక ట్రంప్ (36) ను తీసుకోవచ్చని వస్తున్న వార్తల్ని స్వయానా ట్రంపే తోసిపుచ్చారు ‘‘డైనమైట్ లాంటి నా కూతురికి అది తగిన స్థానమే అయినప్పటికీ.. ఆమెను కనుక ఐరాస రాయబారిగా నియమిస్తే నాపై బంధుప్రీతి (నెపోటిజం) నింద పడుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘బహుశా నా కూతురికన్నా సమర్థమైన వాళ్లు ఆ స్థానానికి ఎవరూ లేకపోవచ్చు. అయినప్పటికీ నేను ఆమెను ఎంపిక చెయ్యడానికి సంశయిస్తాను. ఎందుకంటే మీరంతా రేపు నన్ను నిందించవచ్చు. నాకు నిజంగా లేని బంధుప్రీతిని మీరు నాకు అంటకట్టవచ్చు’’ అని ట్రంప్ మరికొంత వివరణ ఇచ్చారు. ఇవాంక కూడా.. తనకా పోస్టు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ట్విట్టర్లో తెలిపారు. ఒక్కోసారి ఓటమిని కన్నా గెలుపును తట్టుకోవడం కష్టం అవుతుందేమో. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్లో జరుగుతున్న 50 మీటర్ల ఉమెన్స్ స్విమ్మింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్న అర్జెంటీనా క్రీడాకారిణి దెల్ఫియా నరెల్లా పిగ్నాటియల్లో తన విజయాన్ని తనే తట్టుకోలేక వలవల ఏడ్చేసింది. పతకం అందుకునే సమయంలో పెద్దగా ఏడుస్తూ ఆమె తన ఎడమ అర చేతిపై స్పెయిన్ భాషలో రాసుకున్న ‘గ్రాండ్మదర్’ అనే పదాన్ని, గుండె బొమ్మను అందరికీ చూపించడం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసింది. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల్ని నిరోధించడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ‘ఆత్మహత్యల నివారణ మంత్రి’గా ఒక మహిళను నియమించింది. కొత్తగా సృష్టించిన ఈ శాఖను బ్రిటన్ ప్రధాని థెరిసా.. జాకీ డోయల్ ప్రైస్ అనే పార్లమెంటు సభ్యురాలికి కేటాయించారు. అనంతరం లండన్లో జరిగిన 50 దేశాల ప్రతినిధుల మానసిక ఆరోగ్య సదస్సులో డోయల్ ప్రసంగించారు. బ్రిటన్లో యేటా 4,500 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించడం కోసం తన శాఖ కృషి చేస్తుందని డోయల్ తెలిపారు. -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్ట్యాగ్తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా గాంధీనగర్లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్ట్యాగ్తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా గాంధీనగర్లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
స్త్రీలోక సంచారం
ప్రియాంకా చోప్రా క్షణం తీరిగ్గా ఉండడం లేదు! ఎమ్మీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో తనే. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ తొలి వరుసలో తనే. బాయ్ఫ్రెండ్ నిక్ జోనాస్ బర్త్డేలో ఎలాగూ తనే. బాలీవుడ్లో ఒక మూవీలో నటిస్తోంది.. అక్కడా తనే. ఫారిన్కి, ఇండియాకు మధ్య ఇష్టంగా సతమతమౌతున్నారు ప్రియాంక. ఇప్పుడిక ఒక డేటింగ్ కంపెనీలో డబ్బులు పెట్టి, ఆ పనీపాటా చూసుకోబోతున్నారు. ‘బంబుల్’ అనే ఆ సోషల్మీడియా డేటింగ్ యాప్లో ప్రియాంక కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారని వార్త! ఈ బంబుల్ (‘అయోమయం’ అని అర్థం) వ్యవస్థాపకురాలు విట్నీ ఉల్ఫ్ హెర్డ్ అనే అమెరికన్ మహిళ. ఆమెకు చేదోడుగా ప్రియాంక ఇందులో పెట్టుబడి పెట్టారు. దీనికన్నా ముందు ఒక కోడింగ్ ఎడ్యుకేషన్ ఫర్మ్లో డబ్బులు పెట్టేందుకు శాన్ఫ్రాన్సిస్కో వెళ్లి, అక్కడి హాల్బెర్టన్ స్కూల్ అంతా కలియదిరిగి, ముచ్చటపడి, మనసు పారేసుకుని, వాళ్లక్కొంత డబ్బు ఇచ్చి, సేమ్ అలాంటి స్టార్టప్ కంపెనీనే తను కూడా ప్రారంభించాలని ప్రియాంక ఆశపడుతున్నారు. కోడింగ్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ బేస్డ్. టెక్నాలజీ అంటే ప్రియాంకకు మహా ఇష్టం. టెక్ ఇన్వెస్టర్గా మిస్ అంజుల అచారియా (సౌత్ ఏషియన్)కు మించి పేరును తెచ్చుకోవాలని ప్రియాంక ప్రయత్నమట. మోడల్ జెస్సికా లాల్ను మను శర్మ అనే వ్యక్తి హత్య చేశాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని ప్రియదర్శినీ మట్టూను సంతోష్ సింగ్ అనే అతడు రేప్ చేసి, చంపేశాడు. సుశీల్ శర్మ అనే మనిషి తన భార్యను చంపేసి, ఆమె మృతదేహాన్ని తండూరి పొయ్యిలో పడేశాడు. ఇవన్నీ ఏళ్ల క్రితం జరిగిన హత్యలు. ఈ ముగ్గురూ ప్రస్తుతం తీహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీళ్లు, వీళ్లతో పాటు మరో 86 మంది.. ఇంతకాలం శిక్ష అనుభవించాం కనుక తమను విడుదల చేయాలని పెట్టుకున్న దరఖాస్తులలో 22 మంది అభ్యర్థనను మన్నించిన ‘సెంటెన్స్ రివ్యూ బోర్డు’ (ఎస్.ఆర్.బి.) ఈ ముగ్గురినీ విడుదల చేయకూడదని నిర్ణయించింది. మనుశర్మ, సుశీల్శర్మల విడుదలకు గత జూలైలో వారినుంచి విజ్ఞాపన అందినప్పుడు కూడా బోర్డులోని అధికశాతం సభ్యులు వ్యతిరేకించడంతో వారికి విముక్తి లభించలేదు. 1996లో ప్రియదర్శిని మట్టూపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేసినందుకు సంతోశ్ సింగ్కు 2006లో మరణశిక్ష పడగా, ఆ శిక్షను 2010లో సుప్రీంకోర్టు యావజ్జీవంగా మార్చింది. జస్సికాలాల్ను మనుశర్మ 1999లో హత్య చేయగా అతడికి 2006లో యావజ్జీవం పడింది. నైనా సహానీని అతడి భర్త సుశీల్ శర్మ 1995లో హత్య చేయగా అతడికీ 2006లోనే యావజ్జీవ శిక్ష విధించారు. జపాన్లోని ఒసాకా నగరం.. యు.ఎస్.లోని శాన్ఫ్రాన్సిస్కోతో గత 60 ఏళ్లుగా తనకున్న ‘సిస్టర్ సిటీ’ అనుబంధాన్ని తెంచేసుకుంది. యుద్ధకాలంలో మహిళలను జపాన్కు లైంగిక బానిసలుగా çపంపిన సందర్భాన్ని సంకేతపరుస్తూ గత ఏడాది శాన్ఫ్రాన్సిస్కోలో స్థానిక కొరియన్లు, చైనీయులు, ఫిలిప్పీన్లు కలిసి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఒకాసా మేయర్ హిరోఫ్యూమి యొషిమురా.. గతవారం శాన్ఫ్రాన్సిస్కోకు ఒక లేఖ రాస్తూ.. ‘మన అనుబంధం నుంచి మేము వైదొలగుతున్నాం’ అని స్పష్టం చేశారు. యుద్ధకాలంలో ఆసియాలోని వేలాది మంది మహిళల్ని జపాన్ సైనికుల దేహ అవసరాల కోసం బలవంతంగా సెక్స్ బానిసలుగా మార్చారన్నదాంట్లో నిజం లేదని, అది తమపై ఒక అపవాదు మాత్రమేని మేయర్ వ్యాఖ్యానించారు. -
స్త్రీలోక సంచారం
► సౌదీ అరేబియాలో స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అరేబియా రాజ్యపు నిబంధనలివి. ఈ నిబంధనలను అతిక్రమించి ఒక సంగీతకారుడిని ప్రేమించి, అతడితో పెళ్లికోసం కోర్టుకు వెళ్లిన ఒక మహిళ చివరికి ఆ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో వాద్యాలపై సంగీతం పలికించే వారిని మతపరంగా తక్కువగా చూస్తారు. అలాంటి ‘తక్కువ’ యువకుడిని ఈ యువతి ప్రేమించడం రాజ్య నిబంధనలకు విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. సౌదీ రాజధాని రియాద్కి ఉత్తరాన ఉన్న ఖస్సిమ్ శుద్ధ సంప్రదాయ ప్రాంతం. రెండేళ్ల క్రితం.. అక్కడి ఒక బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న 38 ఏళ్ల యువతిని ప్రేమించిన ‘లూట్’ (గిటార్ను పోలి ఉంటుంది) వాద్యకారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ యువతి కూడా అందుకు ఒప్పుకుంది కానీ, ఆమె తల్లిదండ్రులు సమ్మతించలేదు. ‘‘మతాచారం ప్రకారం అతడు నీకు తగినవాడు కాదు’’ అని పెళ్లికి తిరస్కరించారు. ఆమె కోర్టుకు వెళ్లింది. అతడిని పెళ్లిచేసుకోడానికి న్యాయపరమైన అనుమతిని ఇమ్మని కోరింది. దీనిపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు... ఆమె తల్లిదండ్రుల నిర్ణయాన్నే సమర్థించింది. ‘‘ఆ సంగీతం వాయించేవాడు నీతో పెళ్లికి అనర్హుడు’’ అని తీర్పు చెప్పింది. ఇక ఆమె ప్రియుడు.. తన ‘లూట్’పై విషాద గీతాలను ఆలపించుకుంటూ తిరగడం తప్ప వేరే మార్గం లేక దిగాలు పడిపోయాడు. ఆ యువతి మాత్రం సౌదీ ఫెమినిస్టు సౌఆద్ అల్షమ్మరీ మద్దతు కోసం చూస్తోంది. ► టర్కీలో పదహారేళ్ల బాలుడు తన 13 ఏళ్ల గర్ల్ఫ్రెండ్ను ముద్దు పెట్టుకున్నాడు. దానినెవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఎవరో నెట్లో పోస్ట్ చేశారు. దాన్ని స్కూల్ టీచర్లు చూశారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అభం శుభం తెలియని పిల్లని ముద్దుపెట్టుకుంటాడా అని స్కూలు యాజమాన్యం స్కూలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ బాలుడిపై కేసు నమోదు చేశారు. పదిహేనేళ్ల లోపు బాలికల్ని ముద్దు పెట్టుకోవడం టర్కీలో నేరం కనుక ఆ స్కూలు ఉన్న అంతల్య ప్రావిన్సులోని కోర్టు.. ఆ వీడియోను తెప్పించి.. నేరం జరిగినట్లు రూఢీ చేసుకుని ఆ పిల్లవాడికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు.. ఆ వీడియో తీసిన బాలుడినీ, దానిని షేర్ చేసిన బాలుడినీ, ఇంకా ఆ క్రైమ్లో భాగస్వామ్యం కలిగిన 13–16 ఏళ్ల మధ్య బాలురు ఐదురురిపైన కూడా స్కూలు పోలీసులు కేసు వేశారు కానీ.. వారందరినీ కోర్టు నిర్దోషులుగా వదిలిపెట్టింది. ముద్దు పెట్టుకున్న బాలుడి తరఫున వాదిస్తున్న జుహాల్ మెర్వ్ ఆజ్ఫిదాన్ అనే మహిళా న్యాయవాది ఇప్పుడు పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టర్కీలో ఇటీవలే స్కూల్ పోలీస్ వ్యవస్థ ప్రారంభం అయింది. పాఠశాలల్లో పిల్లల మధ్య జరుగుతున్న లైంగిక చొరవలు, చొరబాట్లను అదుపు చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ► స్టార్టప్ కంపెనీల్లో మూడింట ఒక వంతుకు పైగా మహిళా ఉద్యోగులే ఉంటున్నారని యు.ఎస్. రైడ్–షేర్ కంపెనీ ‘లిఫ్ట్’ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అమెరికా స్టార్టప్ కంపెనీల్లో 40 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండగా, ఇండియా స్టార్టప్ కంపెనీలలో సగటున 25 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని లిఫ్ట్ తెలిపింది. లిఫ్ట్ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం 5000 నుంచి 5200 వరకు స్టార్టప్స్ ఉండగా.. వాటి వ్యవస్థాపకులుగా 2015లో 9 శాతం మంది, 2016లో 10 శాతం మంది, 2017లో 11 శాతం మంది చొప్పున మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇండియాలో అనతికాలంలోనే ఆదరణ పొందిన ఐదు స్టార్టప్ కంపెనీల్లో మహిళల శాతం ఈ విధంగా ఉంది. జొమాటో (ఫుడ్ డెలివరీ కంపెనీ) విలువ 200 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 2,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 48 శాతం పేటీఎం (ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్) విలువ : 1000 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 13,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 35 శాతం. ఓలా (టాక్సీ, ఫుడ్ డెలివరీ) విలువ : 400 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 5,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు 18 శాతం ఇన్మోబీ (మొబైల్ మార్కెటింగ్) విలువ : 100 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 1,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 29 శాతం రజోర్పే (ఆన్లైన్ పేమెంట్స్) విలువ : 10 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 200 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 25 శాతం -
స్త్రీలోక సంచారం
‘అర్హత ఉండదు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కోరుకుంటారు’’ అని మహిళా సైంటిస్టులపై నోరు పారేసుకున్నందుకు ఒక సైంటిస్టు పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం జెనీవాలో సి.ఇ.ఆర్.ఎన్. (యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్) సదస్సు జరుగుతోంది. ఐరోపాకు ఫిజిక్స్ ల్యాబ్ వంటిది సి.ఇ.ఆర్.ఎన్.! సదస్సులో 38 మంది సైంటిస్టులు మాట్లాడారు. వాళ్లలో ఒకరు అలెస్సాండ్రో స్ట్రుమియా. ఇటలీలోని పిసా యూనివర్సిటీ నుంచి సిద్ధాంత పత్రాలు పట్టుకుని వచ్చాడు ఆయన. స్పీచ్ మొదలైంది. ‘‘భౌతికశాస్త్రాన్ని నిర్మించింది మగవాళ్లే’’ అన్నాడు. అంతటితో ఊరుకోలేదు. ‘‘ఈ ఆడవాళ్లకు అర్హతలు ఉండవుగానీ, అందలాలు ఎక్కాలన్న కోరికలు మాత్రం ఉంటాయి’’ అన్నాడు. అకస్మాత్తుగా ఏమీ అతడు ఆడవాళ్ల ప్రస్తావన తేలేదు. ‘రిలేషన్షిప్ బిట్వీన్ హై ఎనర్జీ థియరీ అండ్ జెండర్’ అనే టాపిక్ మీద సెమినార్ అది. హై ఎనర్జీ థియరీ భౌతికశాస్త్రం లోనిదే. అలస్సాండ్రో తన పరిశీలనను వివరించడానికి తనతో పాటు స్లయిడ్స్, చార్టులు, గ్రాఫులు తెచ్చుకున్నాడు. ప్రధానంగా ఆయన పరిశీలన ఏంటంటే.. భౌతికశాస్త్ర రంగంలో మగవాళ్లు వివక్షకు గురవుతున్నారని! ఆ సంగతినే చాలా ఆవేదనగా చెబుతూ స్క్రీన్ మీద స్లయిడ్స్ వేస్తున్నాడు. ఒక స్లయిడ్లో మహిళలు క్యూలు కట్టి మరీ జెండర్ సైన్సెస్ తీసుకుంటున్నారు. తర్వాత వాళ్లంతా తమకు మూలకణ పరిశోధనా రంగంలో, కెమిస్ట్రీలో, ఇంజనీరింగ్లో ఉద్యోగావకాశాలు లేవని నిరసన ప్రదర్శన జరుపుతున్నారు. అంటే.. వ్యంగ్యం అన్నమాట. వీళ్లు చదివిందొకటి, అడుగుతున్నది ఒకటీ అని. అక్కడితో అలస్సాండ్రో ఆగలేదు. మగవాళ్ల గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ఫిజిక్సులోకి రమ్మని మగవాళ్లను ఎవ్వరూ పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే ఫిజిక్సును నిర్మించుకున్నారు’’ అని ఇంకో స్లయిడ్లో చూపించాడు. ఇలా మహిళల్ని తక్కువ చేసి మాట్లాడ్డం సి.ఇ.ఆర్.ఎన్.కు కోపం తెప్పించింది. ఆహ్వానం పంపితే ఇంత అనాలోచితంగా మాట్లాడతాడా.. అని అతడిపై నిషేధం విధించింది. సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. జెనీవా ల్యాబ్లో భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికీ అలెస్సాండ్రోకు పిలుపు ఉండదు. ఇలా అని సోమవారం నాడు సి.ఇ.ఆర్.ఎన్. ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అక్కసు వెళ్లగక్కితే అంతే.. ఉన్న అవకాశం కూడా పోతుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, ఆ తీర్పును శిరసావహించి, మహిళా భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కేరళ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఎన్ని సదుపాయాలను కల్పించగలిగినప్పటికీ.. స్త్రీలకు ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యమయ్యేలా కనిపించడం లేదట! కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన హై–పవర్ కమిటీ ‘మహిళా క్యూ’ల ఏర్పాటు విషయమై ‘ఏమి సేతురా..’ అని ఆలోచనలో పడింది. రద్దీగా ఉండే రోజుల్లో శబరిమల భక్తులు అయ్యప్ప దర్శనం కోసం 8 నుంచి 10 గంటల పాటు పొడవాటి క్యూలలో నిరీక్షించవలసి వస్తుంది. మహిళలు అంతసేపు ఉండగలరా అన్నది హై కమిటీ సందేహం. మీటింగ్ అయ్యేసరికి కూడా ఈ సందేహానికి సమాధానం దొరకలేదు. అలాగని ప్రత్యేక మహిళా క్యూల ఏర్పాటుకు నిర్ణయమూ జరగలేదు. ‘‘ఇదేదో తలకుమించిన పనిలా ఉంది’’ అనుకుంటూ వెళ్లిపోయారు దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్. మనసుంటే మార్గం ఉండదా మంత్రివర్యా! ప్రభుత్వం తలచుకుంటే ఇదొక సంకటమా? మీదొక సందేహమా?! పోర్చుగీసు ప్రొఫెషన్ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (33).. తొమ్మిదేళ్ల క్రితం లాస్ వెగాస్లోని ఒక హోటల్ పెంట్హౌస్లో తనపై అత్యాచారం చేసినట్లు ప్రముఖ మోడల్ క్యాథరీన్ మయోర్గా (34) గత నెలలో నెవాడాలోని జిల్లా కోర్టులో 32 పేజీల కంప్లయింట్ ఇచ్చిన విషయమై సోమవారం ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో రొనాల్డో సమాధానం ఇచ్చాడు. ‘‘వాళ్లు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. అది ఫేక్. ఫేక్ న్యూస్’ అని ఓ అభిమానికి సమాధానం ఇచ్చిన రొనాల్డో ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు! 2009 జూన్ 13న పెంట్హౌస్లో రొనాల్డో తనకు ఇష్టం లేకుండా తనను బలప్రయోగంతో లోబరుచుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణ.. అతడిలా పోస్ట్ను డిలీట్ చెయ్యడంతో నిజమేనని అనుకోవలసి వస్తోంది. -
స్త్రీలోక సంచారం
టెన్నిస్ సూపర్స్టార్ సెరెనా విలియమ్స్ టాప్లెస్గా ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమై ఇంటర్నెట్లో సందేశం ఇచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం సెరెనా తన రెండు వక్షోజాలపై చేతులను అడ్డుగా పెట్టుకుని, ‘ఐ టచ్ మైసెల్ఫ్’ అనే పాటను పాడుతూ తీసుకున్న వీడియోను ఆదివారం నాడు అప్లోడ్ చేసిన మొదటి పది గంటల్లోనే 10 లక్షల 30 వేల ‘వ్యూ’స్ వచ్చాయి! ఆస్ట్రేలియన్ పాప్ బ్యాండ్ ‘డీవైనల్స్’ 1991లో ‘బ్రెస్ట్ క్యాన్సర్ నెట్వర్క్ ఆస్ట్రేలియా’కు కోసం రాసిన హిట్ ‘ఐ టచ్ మైసెల్ఫ్’ నే ఆమె ఆలపించారు. ‘‘క్రమం తప్పకుండా బ్రెస్ట్లను చెక్ చేయించుకోవాలని మహిళలకు చెప్పడానికి నేను ఈ పాటను ఎంపిక చేసుకున్నాను. ఇలా టాప్లెస్గా నేనీ మాట చెప్పడం నాక్కొంత అసౌకర్యం కలిగించే విషయమే. అయితే నేను ఈ విషయంపై మాట్లాడాలనే అనుకున్నాను. శరీరవర్ణంతో నిమిత్తం లేకుండా ప్రపంచ మహిళలంతా ఎదుర్కొనడానికి అవకాశం ఉన్న సమస్య ఇది. తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’’ అని తన వీడియో కింద కామెంట్ పెట్టారు సెరెనా. ‘‘అమేజింగ్ సెరెనా! మీ అందమైన స్వరంతో ఈ సందేశం ఇవ్వడం ఎంతో బాగుంది’’ అని సోషల్ మీడియా ఆమెను ప్రశంసిస్తోంది. అక్టోబర్.. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సదస్సులు, సెమినార్లలో మహిళలు తక్కువగా ప్రశ్నిస్తారట! 10 దేశాల్లో జరిగిన 250 ఈవెంట్లలో పాల్గొన్న వారిపై అధ్యయనం జరిపి యు.కె.లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. ఆ వివరాలను ‘ప్లస్ వన్’ అనే పత్రిక ప్రచురించింది. అసలు సెమినార్లలో పొల్గొనడంలోనే స్త్రీ పురుషుల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందట. సెమినార్లకు వచ్చే ఆ కొద్దిమంది మహిళలు కూడా ప్రశ్నించేందుకు చొరవ చూపడంలేదని తమ అధ్యయనంలో స్పష్టమైందని పరిశోధకుల ప్రతినిధి అలేషియా కార్టర్ తమ నివేదికలో తెలిపారు. అకాడమీలలో జూనియర్ స్కాలర్లకు రోల్ మోడళ్లుగా మహిళలు ఎందుకు ఉండటం లేదని శోధించినప్పుడు అందుకు కారణంగా ఈ సంగతి (సెమినార్లలో మహిళలు తక్కువగా ప్రశ్నించే సంగతి) బయటపడిందట. ఈ పరిశోధకులు.. 20 దేశాలకు చెందిన 600 మంది స్త్రీ, పురుషుల్ని ప్రశ్నించారు. వీరిలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. వీళ్లందరితో మాట్లాడినప్పుడు.. విద్యారంగ సదస్సులు, సెమినార్లలో పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసిందనీ, అయితే అందుకు కారణమేమిటో తెలియరాలేదని అలేషియా తమ గమనింపులకు ముగింపునిచ్చారు. దేశంలోనే తొలిసారిగా అసోమ్ ప్రభుత్వం తేయాకు తోటల్లో పని చేసే గర్భిణులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతేకాదు, ఆరో నెల నిండినప్పటి నుండీ, ప్రసవం అయ్యాక మూడు నెలల వరకు.. మొత్తం ఆరు నెలలు వారు పనికి రానవసరం లేదు. ఈ ఆరు నెలల కాలానికీ నేరుగా వాళ్ల ఇళ్లకే జీత భత్యాలు వెళతాయి. ఇక ప్రభుత్వం.. గర్భిణి ఒకరికి ప్రకటించిన ఆర్థిక సహాయం ఎంతంటే 12 వేలు! ఇదంతా ఆమె ఆరోగ్యం కోసం, బిడ్డ ఎదుగుదల కోసం అవసరమైన పౌష్టికాహారం తీసుకోడానికి, ఇతరత్రా అవసరాలకు. గర్భం దాల్చిన తొలి మూడు నెలల కాలానికి 2 వేలు, తర్వాతి మూడు నెలలకు 4 వేలు, ఆసుపత్రిలో డెలివరీ సమయానికి 3 వేలు, బిడ్డ జననాన్ని నమోదు చేయించేటప్పుడు 3 వేలు.. ఇలా నాలుగు విడతలుగా పై మొత్తాన్ని అందచేస్తారు. ఇది కాకుండా.. ఆ గర్భిణి కనుక ఇద్దరు పిల్లల నియంత్రణ పాటిస్తే, 18 ఏళ్ల తర్వాత మాత్రమే ఆమె తల్లి అయితే, ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో మాత్రమే కాన్పు జరిపించుకుంటే, పని చేస్తున్న తేయాకు తోటల్లోనే నివాసం ఉంటున్నట్లయితే, భారతీయ పౌరురాలైతే.. అదనంగా మరికొన్ని సదుపాయాలను, వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. -
స్త్రీలోక సంచారం
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ (వక్షోజ ఆకృతికి శస్త్ర చికిత్స) చేయించుకున్నందుకు ఆ తర్వాత తానెంతో చింతించానని బ్రెజీలియన్ సూపర్ మోడల్ జిసెల్ బంద్చంద్ ఒక మ్యాగజీన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 38 ఏళ్ల జిసెల్కు బెంజిమన్ అనే 8 ఏళ్ల కొడుకు, వివియన్ అనే 5 ఏళ్ల కూతురు ఉన్నారు. ఫుట్బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ ఆమె భర్త. సూపర్ మోడల్ కాబట్టి జిసెల్ ధ్యాస ఎప్పుడూ తన దేహాకృతుల మీదనే ఉండేది. అలా లేకపోతే, తన అభిమానుల ఆశల్ని, ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేసినట్లవుతుందనే బెంగ కూడా ఆమెకు ఉండేది. అందుకే చక్కగా తినేవారు. బాగా వ్యాయామం చేసేవారు. అయితే పిల్లలు పుట్టాక ఈ ప్రయత్నాలేవీ ఆమెలో వస్తున్న శారీరక మార్పులను ఆపలేకపోయాయి. పైగా పాలు తాగే వయసులో.. కొడుకు, కూతురు కూడా ఏ కారణం చేతనో ఆమె ఎడమ స్తన్యాన్నే ఎక్కువగా ఇష్టపడేవారు. దాంతో కుడి ఎడమలు సమంగా కనిపించేందుకు.. రెండో బిడ్డ పాలు మరిచిన కొన్నాళ్లకు ఎడమ స్తన్యానికి ‘బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ’ చేయించుకున్నారు జిసెల్. ఈ విషయాన్నే ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘‘రోజూ నిద్ర లేవగానే నాకు అనిపిస్తుంది.. నేను చేసిన పనేమిటని! నాది కాని దేహంలో నేను ఉండటం ఏమిటి అని కూడా అనుకుంటాను. ఇదొక జీవిత పాఠం నాకు. నేను అలా చేసి ఉండాల్సింది కాదని బాధపడుతున్న ప్రతిసారీ నా భర్త నన్ను ఓదారుస్తాడు’’ అని తెలిపారు జిసెల్. స్త్రీ, పురుష సమానత్వం (ఈక్వాలిటీ) అనేది పాశ్చాత్య భావనే తప్ప, అది మనది కాదని అంటూ.. మన దేశంలో పురుషుడికన్నా స్త్రీనే అధికం అని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రి ఉమా భారతి అన్నారు. గురువారం నాడు సుప్రీంకోర్టు 158 ఏళ్ల నాటి అడల్టరీ సెక్షన్ను కొట్టివేస్తూ.. వివాహేతర బంధం నేరం కాదనీ, అయితే నైతికంగా అది తప్పు అని ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఉమా భారతి.. ‘‘ప్రతిదానికీ కోర్టుల వరకు ఎందుకు వెళతారో అర్థం కాదు. సెక్షన్లు ఎలా ఉన్నా, ఏం చెబుతున్నా.. మన సమాజంలో స్త్రీ పాత్ర పురుషుడికంటే ఉన్నతమైనది.. పురుషుడికంటే స్త్రీ ఏ విధంగా చూసినా ఎక్కువే తప్ప.. పురుషుడితో సమానం కాదు’’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 21న ప్రారంభం అవుతున్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పాపులర్ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6, ఫస్ట్ ఎపిసోడ్లో ఆలియా భట్, దీపికా పడుకోన్ దర్శనమివ్వబోతున్నారు! ‘దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గర్ల్ పవర్’ అని ఈ తొలి ఎపిసోడ్ గురించి ట్విట్టర్లో కామెంట్ పెట్టిన కరణ్.. రణవీర్సింగ్తో దీపికకు, రణ్బీర్ కపూర్తో ఆలియాకు ఉన్న రిలేషన్షిప్లోని గుట్టుమట్లను ఎలాగైనా బయటికి లాగేస్తాడని.. సోషల్ మీడియాలో ఆ ‘షో’ అభిమానుల ఆకాంక్షల్ని బట్టి తెలుస్తోంది. -
స్త్రీలోక సంచారం
పదహారేళ్ల వయసులో తనపై తన బాయ్ఫ్రెండ్ అత్యాచారం చేసిన సంగతిని ప్రముఖ మోడల్, టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి.. ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ (అప్పుడే ఎందుకు చెప్పలేదంటే) అనే ఒక కొత్త మహిళా ఉద్యమానికి మద్దతుగా బహిర్గతం చేశారు. యు.ఎస్. సుప్రీంకోర్టు ఆటార్నీగా నామినేట్ అయిన జస్టిస్ బ్రెట్ ఎం.కవానా తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘అప్పుడే ఎందుకు చెప్పులేదు?’ అని అనడంతో మొదలైన ఈ ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ ఉద్యమానికి.. ఒక్కో మహిళా ముందుకొచ్చి ‘అప్పుడే ఎందుకు చెప్పలేదంటే..’ అంటూ తన జీవితంలోని లైంగిక అకృత్యపు చేదు అనుభవాన్ని పది మందికీ చెప్తున్న క్రమంలో పద్మాలక్ష్మి బయటికి వచ్చి, తనపై టీనేజ్లో జరిగిన అత్యాచారాన్ని లోకానికి వెల్లడిస్తూ... ‘‘బాధితురాలు తన బాధను పైకి చెప్పుకోడానికి కాలపరిమితి ఉంటుందా!’’ అని ప్రశ్నించారు. బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్లో ‘టైమ్స్ క్రియేషన్స్’ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 3న జరుగనున్న ‘ప్యూరిటీ అండ్ ఎక్స్ప్రెషన్’ సంగీత కార్యక్రమంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రదర్శన ఉండడంపై స్థానిక అతివాద సంస్థలు కొన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో గత ఏడాది డిసెంబర్ 31 నాటి సన్నీ ప్రదర్శనలాగే ఇదీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసభ్యతకు ప్రతీక అయిన సన్నీలియోన్ను ఈ కార్యక్రమానికి అనుమతించేది లేదని ‘కర్ణాటక రక్షణ వేదిక యువ సేన’ అంటుండగా, నిర్వాహకులు మాత్రం.. లియోన్ ప్రదర్శన వల్ల కన్నడ సంస్కృతికి జరిగే చేటు ఏమీ ఉండబోదని, అయినా లియోన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు తప్ప, మిగతా కార్యక్రమమంతా కన్నడ నేపథ్య సంగీతకారుడు రఘు దీక్షత్ మాత్రమే నడిపిస్తారని చెబుతున్నారు. అమృత్సర్లోని షాదజా గ్రామ మాజీ సర్పంచ్ బల్వంత్ సింగ్ను రాజకీయ ప్రేరేపణలపై అరెస్టు చేయడానికి వెళ్లిన పంజాబ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు.. అతడు ఇంట్లో లేకపోవడంతో, అతడి కోడలు జస్వీందర్ కౌర్ను.. ‘‘ఏ కారణంతో మా మామగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు?’’ అని అడిగిందన్న ఆగ్రహంతో ఆమెను జీప్ బోనెట్పై వేసుకుని తీసుకెళుతుండగా.. మూడు కిలోమీటర్లు ఎలాగో పట్టు తప్పకుండా నిలదొక్కుకున్న కౌర్ ఓ మలుపులో రోడ్డుపై పడి.. గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించిన పంజాబ్ హోం శాఖ.. ఆ మహిళపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల వెనుక ఏ పార్టీ నాయకులు ఉన్నారనే దాని పైనా దృష్టి సారించింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో చదువుతున్న కాంగో విద్యార్థిని ముకోకో మిసా ట్రెసార్ పై 2014 సెప్టెంబర్ 26న మూక దాడి జరిపిన కేసులో.. ఆ మూకల్ని రెచ్చకొట్టి, దాడికి పురికొల్పిన నేరారోపణలకు తగిన రుజువులు ఉండడంతో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతిపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత ఖిర్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ, వ్యభిచారం చేస్తున్నారన్న అనుమానంతో అక్కడి కొందరు ఆఫ్రికన్ మహిళలపై దాడి జరిపిన దుండగులు.. విద్యార్థిని అయిన ముకోకో మిసా ట్రెసార్పైన కూడా మూకుమ్మడి దాడికి పాల్పడగా.. ఆ ప్రాంతం ఉన్న మలావియా నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి హస్తం ఈ దాడుల వెనుక ఉందన్న ఆరోపణపై అప్పట్లోనే కేసు నమోదు అయింది. రాఫెల్ డీల్పై ఓ వ్యంగ్యాస్త్రంగా ప్రధాని మోదీ ఫొటోను అనుచితంగా చిత్రీకరించి ట్విట్టర్లో పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్చార్జి, మాజీ ఎం.పి. దివ్య స్పందన అలియాస్ రమ్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. దివ్య స్పందన ట్వీట్ చేసిన ఆ ఫొటో దేశ ప్రధానిని కించపరచడమే కాకుండా, దేశ ప్రతిష్టను సైతం భంగపరిచేలా ఉందని లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన సయీద్ రిజ్వాన్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్య స్పందనపై పోలీసులు సెక్షన్ 67 ఐటీ యాక్ట్, సెక్షన్ 124ఎ (దేశద్రోహం) ఐ.పి.సి. యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఇంగ్లండ్ నవ రాకుమారి, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తన కారు డోరును తనే వేయడం బ్రిటన్ రాజప్రాసాదాన్ని, బ్రిటన్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది! మేఘన్ మంగళవారం నాడు లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లోని ఒక కార్యక్రమానికి హాజరయేందుకు వచ్చినప్పుడు, తానొచ్చిన నల్ల రంగు సెడెన్ కారులోంచి దిగి, అక్కడి భద్రతా సిబ్బంది ఆమె దిగిన వైపు కారు డోరును వేసేలోపే, అసంకల్పితంగా ఆమే కారు డోరు వెయ్యడం.. సోషల్ మీడియాలో ఒక నివ్వెరపరిచే వార్తలా వైరల్ అవుతుండగా... ‘‘రాజకుటుంబ సంప్రదాయాలు తెలియక కాదు, అలవాటు కొద్దీ మేఘన్ అలా చేశారు’’ అని ఆమె ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అమన్దీప్ మాధుర్ అనే 26 ఏళ్ల భారతీయ సంతతి బ్రటిష్ మహిళ తన ప్రేమను కాదన్న మాజీ ప్రియుడిని, అతడి కుటుంబాన్ని గత ఐదేళ్లుగా వేధింపులకు గురి చేస్తూ, మత విశ్వాసాలు గాయపడేలా అతడి ఇంట్లోకి ఆవు మాంసాన్ని విసురుతూ.. అతడి చెల్లెళ్లపై, తల్లిపై అత్యాచారం జరుపుతామని మనుషుల్ని పెట్టి బెదిరిస్తూ, ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తానని భయపెడుతూ.. ఇన్ని రకాలుగా చిత్ర హింసలు పెట్టిన నేరానికి యు.కె. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియాలోనూ అమన్దీప్ పెట్టిన టార్చర్కు బాధితుడు అన్ని విధాలా మానసికంగా కృంగిపోయాడని నిర్థారించుకున్న కోర్టు ఆమె శిక్ష విధించడంతో పాటు, కౌన్సెలింగు కూడా అవసరమని సూచించింది. పరస్త్రీ, పరపురుష సంబంధాలు (అడల్టరీ) తప్పు కాదని గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బాహాటంగా వ్యతిరేకించిన ఢిల్లీ ఉమెన్ పానెల్ చీఫ్ స్వాతీ మలీవాల్పై సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ తీర్పు మన వివాహ వ్యవస్థ పవిత్రతనే పంకిలపరిచింది’’ అనే అర్థంలో ఆమె చేసిన ట్వీట్కు ప్రతి స్పందనగా సోషల్ మీడియాలో ముక్కూమొహం లేని అకౌంట్ల నుండి అమె మనసును గాయపరిచే కామెంట్లు అనేకం వెల్లువెత్తాయి. -
స్త్రీలోక సంచారం
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో.. ముస్లింని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువతిని నలుగురు పోలీసులు వ్యానులోకి ఎక్కించి, ఆమెను కొట్టుకుంటూ తీసుకెళుతున్న వీడియో ఒకటి వైరల్ అవడంతో మీరట్ పోలీసులు ఆ నలుగురినీ సస్పెండ్ చేసి, వారిపై శాఖపరమైన విచారణ చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ సాలెక్ చంద్, కానిస్టేబుల్ నీతూ సింగ్, ఉమన్ కానిస్టేబుల్ ప్రియాంక, హోమ్ గార్డు సైన్సెర్పాల్గా నిందితులను గుర్తించిన మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్.. బాధితురాలైన ఆ యువతికి వి.హెచ్.పి. కార్యకర్తల నుంచి బెదరింపులు వస్తున్నందున ఆమెకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. టి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు నియోజవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో టి.ఆర్.ఎస్.లో చీలికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తన కుమారుడు కె.టి.ఆర్.ను ముఖ్యమంత్రిని చేసేందుకే సీఎం కేసీఆర్.. మంత్రి హారీష్రావుకు సన్నిహితంగా ఉండేవారిని తప్పిస్తున్న క్రమంలో తమనూ పక్కనపెట్టేశారని ఆరోపించిన సురేఖ.. ఆ తర్వాత కొద్ది గంటలకు భర్త కొండా మురళితో కలిసి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో.. కేసీఆర్ ముందస్తు తంత్రం మరిన్ని అసమ్మతి సెగలకు ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య నిత్యం పోరుసాగే జమ్ముకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం నాడు ముగ్గురు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను ఉగ్రమూకలు కాల్చి చంపడంతో చలించిపోయిన రఫీకా అఖ్తర్ అనే 39 ఏళ్ల వింతతు పోలీస్ ఆఫీసర్ ఆ మర్నాడే తన పదవికి రాజీనామా చేశారు. తొలి మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా 15 ఏళ్ల క్రితం డిపార్ట్మెంట్లో చేరిన రఫీకా.. ‘‘నా పిల్లల భద్రత నాకు ముఖ్యం. నా కుటుంబానికి నేనే దిక్కు. ఇన్నేళ్లూ నేను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కోసం, ప్రజల భద్రత కోసం పని చేశాను. ఇక చేసింది చాలనుకున్నాను. డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన రెండు జతల యూనిఫామ్ని కుల్గామ్ పోలీస్ స్టేషన్కి తిరిగి ఇచ్చేశాను’’ అని తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. ప్రపంచాన్ని తాము పుట్టినప్పటి స్థితి నుంచి మరింతగా మెరుగుపరచడానికి ప్రయత్నించిన యువతీ యువకులకు కోసం ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ఏటా ఇచ్చే ‘గ్లోబల్ గోల్కీపర్స్ అవార్డు’ ఈ ఏడాది 18 అమికా జార్జితో పాటు మరో ఇద్దరికి లభించింది. లండన్లోని పేద కుటుంబాల ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందించే లక్ష్యంతో ‘పీరియడ్ పావర్టీ’ పేరిట.. గత డిసెంబరులో అమికా ప్రారంభించిన ఉద్యమానికి స్పందించిన యు.కె.ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు 10 లక్షల 50 వేల పౌండ్లను కేటాయించడం కూడా అమికాకు ఈ గుర్తింపు రావడానికి తోడ్పడింది. -
స్త్రీలోక సంచారం
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37), ఆమె మూడో భర్త, అమెరికన్ పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్(41)ల ముద్దుల కుమార్తె నార్త్ వెస్ట్(5).. లాజ్ ఏంజిల్ సమీపంలోని పసిఫిక్ పాలిసైడ్లో జరిగిన ఫ్యాషన్ షో ర్యాంప్పై మోడల్గా అరంగేట్రం చేసింది. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్ లెదర్ జాకెట్, మ్యాచింగ్ మినీ స్కర్ట్, జిప్–అప్ బ్లాక్ క్రాప్ టాప్, వైట్ సాక్స్, బ్లాక్ షూజ్, బ్లాక్ పర్స్, రెడ్ లిప్స్టిక్ ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్ కర్దేషియాన్ మనసు ఉప్పొంగిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్.లో మొదలైన ‘పింక్ రిబ్బన్ క్యాంపైన్’లో భాగంగా హైదరాబాద్లో సోమవారం 10 ఎడిషన్ క్యాంపైన్ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్ రిబ్బన్ క్యాంపైన్ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సీఈవో, డైరెక్టర్ తమ ప్రసంగంలో తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్, హోమ్శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్ విల్లెన్బ్రింగ్ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్ మర్చంట్తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్ మర్చెంట్పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్, సెల్ఫ్ హార్మ్, బుల్లీయింగ్లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్ పాప్ సింగర్ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్ 21న మళ్లీ డిప్రెషన్ బారిన పడి, ఓవర్డోస్ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టి.ఎం.జడ్. (థర్టీ మైల్ జోన్) వెబ్సైట్ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ మహిళ ఉజ్రా జేయా తన పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. హాలీవుడ్లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
స్త్రీలోక సంచారం
26 ఏళ్ల అమెరికన్ పాప్ గాయని సెలెనా గోమెజ్ ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో చాటింగ్ చేస్తూ.. ‘‘మీ బెస్టీ (బెస్ట్ ఫ్రెండ్) టేలర్ స్విఫ్ట్ ఎలా ఉన్నారు?’’ అన్న ప్రశ్నకు.. ‘‘ఆమె చాలా బాగున్నారు. ఐ లవ్ హర్. షి ఈజ్ అమేజింగ్. ఇవాళే తనతో మాట్లాడాను. ఆమె నాకు పెద్దక్క లాంటిది. ప్రతి విషయాన్నీ తనతో షేర్ చేసుకుంటాను. ఆమె చాలా తెలివైంది. నాకు మంచి సలహాలు ఇస్తారు. ప్రతి మనిషికీ జీవితంలో ఇలాంటి ఒక బెస్టీ ఉండాలి’’ అని రిప్లయ్ ఇచ్చారు. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోబోతున్న నిక్ జోనాస్ (26) కొంత కాలం సెలెనా గోమెజ్ బెస్టీగా ఉండగా, అదే సమయంలో అతడి అన్న నిక్ జోనాస్.. టేలర్ స్విఫ్ట్కి బెస్టీగా ఉండడంతో.. ఈ నలుగురు పాప్ సింగర్లు అరమరికల్లేకుండా ఉండేవారు. ఒక నన్పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కొచ్చిలో ఐదుగురు నన్లు చేపట్టిన ప్రదర్శనకు మద్దతు ఇచ్చిందన్న ఆగ్రహంతో వయనాడు లోని మనంతవాడి డయోసిస్ ఆధ్వర్యంలోని సెయింట్ మేరీస్ చర్చి.. సిస్టర్ నాన్సీపై చర్య తీసుకుంది. అత్యారానికి గురయిన నన్కు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒక న్యూస్ చానల్ డిబేట్లో కూడా పాల్గొన్న సెయింట్ మేరీస్ ప్రావిన్స్ పరిధిలోని ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ సభ్యురాలైన సిస్టర్ లూసీ కలప్పుర.. ఇక నుంచి చర్చికి సంబంధించిన ఏ ఒక్క విధినీ నిర్వహించడానికి వీల్లేకుండా చర్చి యాజమాన్యం ఆంక్షలు విధించింది. ప్రాచీన ఇంగ్లండ్ వివాహ సంప్రదాయంలో భాగంగా వధువు సంథింగ్ ఓల్డ్ (నిరంతరత), సంథింగ్ న్యూ (భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం), సంథింగ్ బారోడ్ (సంతోషం), సంథింగ్ బ్లూ (స్వచ్ఛత, ప్రేమ, విశ్వసనీయత)లను గుర్తుగా ఉంచుకోవలసి ఉండగా.. ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ వీటిల్లో ఒకటైన ‘సంథింగ్ బ్లూ’గా హ్యారీతో తన తొలి డేటింగ్ రోజు వేసుకున్న నీలం రంగు డ్రెస్లోంచి చిన్న దారం ముక్కను తీసి, వెడ్డింగ్ డ్రెస్కు కలిపి కుట్టించుకున్నానని ఒక టీవీ డాక్యుమెంటరీలో చెప్పారు. అయితే ఇంగ్లండ్ రాణిగారిలా పూర్తిస్థాయిలో సంప్రదాయాలను తను పాటించలేకపోవచ్చని, అయినప్పటికీ అందుకు ప్రయత్నిస్తానని ‘క్వీన్ ఆఫ్ ది వరల్డ్’ పేరుతో నేడు (మంగళవారం) బ్రిటన్లో ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీలో మేఘన్ తెలిపారు. సిడ్నీ నుంచి మెల్బోర్న్ వెళుతున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆదివారం నాడు చెక్–ఇన్ సందర్భంగా సిడ్నీ విమానాశ్రయంలో మెల్ అనే ఆస్ట్రేలియన్ మహిళా సిబ్బంది తన పట్ల జాత్యాహంకారంతో ప్రవర్తించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ.. మనిషి రంగును బట్టి మర్యాద ఇవ్వడం హీనాతిహీనమైన స్వభావం అని మెల్పై విరుకుపడ్డారు. శిల్ప ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. తన లగేజ్ బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో తనను చాలాసేపు లోపలికి అనుమతించలేదని, మాన్యువల్గానైనా స్క్రీనింగ్ చెయ్యమని కోరినప్పటికీ.. తనను ఐదు నిముషాలకు పైగా అలాగే నిలబెట్టారని తన ఆవేదనను షేర్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్లోని సెయింట్ గ్యాలన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బహిరంగ ప్రదేశాలలో ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడంపై నిషేధం విధించడం సబబే అని 67 శాతం మంది ఓటు వేశారు. బుర్ఖాను నిషేధిస్తూ స్విట్టర్లాండ్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో విడివిడిగా మళ్లీ రెఫరెండం తీసుకునేందుకు గత ఏడాది ఇదే గ్యాలన్ ప్రాంతంలో ప్రభుత్వం పోలింగ్ జరిపినప్పుడు కూడా.. దేశ ప్రజల భద్రత రీత్యా ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడం క్షేమకరం కాదు అని స్థానికులు తీర్పు ఇచ్చారు. మనోపాజ్ అన్నది పైకి మాట్లాడదగని విషయం కాదనీ, స్త్రీ దేహ పరిణామక్రమంలో సంభవించే ఒక స్థితి అని, స్త్రీ, పురుషులిద్దరికీ మోనోపాజ్పై అవగాహన ఉంటే స్త్రీల దైనందిన ఉద్యోగ జీవితంలో మానసిక ఒత్తిడులను మనం దూరం చేయవచ్చునని తెలియజెప్పేందుకు యు.కె.లోని ‘యూనివర్సిటీ ఆఫ్ లస్టర్’ యాజమాన్యం తన సిబ్బంది కోసం ‘మెనోపాజ్ కే ఫ్’ లను ఏర్పాటు చేసింది. యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ బిజి¯ð స్ మహిళా ప్రొఫెసర్ ఆండ్రియా డేవిస్ చొరవతో మొదలై, నెలకొకసారి జరిగే ఈ మెనోపాజ్ కేఫ్లలో స్త్రీ, పురుష ఉద్యోగులు మెనోపాజ్పై నిర్బిడియంగా తమ ఆలోచనలు పంచుకుంటారు. సౌదీ అరేబియాలో 2016లో జుమనా అల్షమీ అనే మహిళ టీవీలో ఉదయం వార్తలు చదివిన తొలి మహిళగా గుర్తింపు పొందగా.. ఇప్పుడు వియమ్ అల్ దఖీల్ అనే మహిళ సౌదీ అరేబియా అధికారిక టీవీ చానల్ ‘టీవీ 1’లో ఒమన్ అల్ నష్వాన్ అనే యాంకర్తో కలిసి వార్తల్ని చదవడం ద్వారా.. ఈవెనింగ్ న్యూస్ బులెటిన్ను సమర్పించిన తొలి సౌదీ మహిళగా రికార్డు సృష్టించారు. దేశంలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో మహిళలపై ఉన్న ఆంక్షలను ఒకటొకటిగా తొలగించుకుంటూ.. ఇటీవలే మహిళలు డ్రైవింగ్ చెయ్యడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఆదేశాలు జారీ చేసిన సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్.. తాజాగా మహిళలు సాయంకాలపు వార్తలను చదవడానికి అనుమతి ఇచ్చారు. తొలి చిత్రం ‘బేఖుండి’ తో పాటు, దుష్మన్ (1998) కూడా తను నటించిన చిత్రాలతో తనకు ఇష్టమైన సినిమా అని చెబుతూ, దుష్మన్లో రేప్ సీన్ ఉన్నకారణంగా మొదట తను నటించనని చెప్పానని, అయితే దర్శక నిర్మాతలు ‘బాడీ డబుల్’తో (డూప్) ఆ సీన్ని లాగించేస్తామని చెప్పడంతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తాజాగా పి.టి.ఐ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజోల్ వెల్లడించారు. తన పాతికేళ్ల బాలీవుడ్ కెరీర్లో 30 పైగా చిత్రాలలో నటించిన కాజోల్ అక్టోబర్ 12 రిలీజ్ అవబోతున్న ‘హెలికాప్టర్ ఈలా’ చిత్రంలో కనిపించబోతున్నారు. -
స్త్రీలోక సంచారం
►ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) ఇటీవల కాలంలో నియమించిన మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య 2,000 వరకు ఉందని, ఐదేళ్ల క్రితం ఒక శాతంగా ఉన్న ఎ.ఎ.ఐ. మహిళల నియామకాలు నేటికి 10 శాతానికి పెరిగాయని.. ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే – ఇండియా’ (సెప్టెంబర్ 19) సందర్భంగా గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూపేష్ సి.హెచ్.నేగీ తెలిపారు. వాస్కోలోని సెయింట్ ఆండ్రూస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థినులు హాజరైన ఈ కార్యక్రమంలో నేగీ మాట్లాడుతూ.. త్వరలోనే కోల్కతాకు చెందిన ఒక యువతి తొలి ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటర్’గా వైమానిక దళంలో చేరబోతున్నారని, మహిళలకు ఈ రంగంలో ఇప్పుడు తమ సామర్థ్య నిరూపణకు తగిన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ►సమాన వేతనం, సాధికారతల విషయంలో పాశ్చాత్య దేశాలు మహిళలకు సానుకూలంగా తమ ధోరణులను మార్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో కూడా స్త్రీల ఉద్దేశాలను, స్త్రీల ఉద్యమాలను గుర్తించి, గౌరవించి, వారి అభీష్టానికి తగినట్లుగా సామాజిక పరివర్తన తెచ్చుకోవడం అవసరమైన అనివార్య దశలో మనం ఇప్పుడు ఉన్నామని సెప్టెంబర్ 21న విడుదలైన తన తాజా చిత్రం ‘మాంటో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోస్ను సందర్శించిన ఆ చిత్ర కథానాయకుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘‘శతాబ్దాలుగా మహిళల్ని మనం ఎలా అణిచివేస్తూ వస్తున్నామో ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పుడిది మారే దశ. వారి పట్ల మన సంకుచిత, ఆధిక్య దృక్పథాన్ని మార్చుకోవాలి. వారి ఆలోచనలను, కోర్కెలను, మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలి’’ అని సిద్ధిఖీ అన్నారు. ►‘ఆషా’ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్) కార్యకర్తలకు, అంగన్వాడీ కార్మికులకు పారితోషికం పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తొమ్మిది రోజులకు ఢిల్లీ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.. ఆ పారితోషికాన్ని తిరస్కరించింది! ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్స్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యూనియన్ అధ్యక్షురాలు శివానీ కౌల్ మాట్లాడుతూ, ‘‘అంగన్వాడీలను పర్మినెంట్ చెయ్యాలని, వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం.. కంటి తుడుపుగా పారితోషికాన్ని ప్రకటించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ► ఘర్వాల్ ప్రాంతంలోని డెహ్రాడూన్లో ‘గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జి.డి.ఎం.సి.హెచ్.)లో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో ఆరు రోజులుగా హాస్పిటల్ కారిడార్లో నేల పైనే పడుకుని ప్రసవం కోసం ఎదురుచూసిన 27 ఏళ్ల ముస్సోరీ మహిళ.. నొప్పులు రావడంతో చివరికి అక్కడే ప్రసవించి, వైద్య సంరక్షణ అందక, అధిక రక్తస్రావంతో మరణించిన కొద్ది సేపటికే.. ఆమెకు పుట్టిన బిడ్డ (మగశిశువు) కూడా శ్వాస కోసం ఇరవై నిముషాలు కొట్టుకుని కన్నుమూయడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. అయితే.. ఆమె భయంతో ప్రసూతి వార్డు నుంచి పరుగులు తీసిందని, బహుశా ఆ కారణంగానే రక్తస్రావం జరిగి ఉంటుందని వివరణ ఇచ్చిన ఆసుపత్రి మహిళా విభాగం చీఫ్ మెడికల్ సూపర్వైజర్ డాక్టర్ మీనాక్షీ జోషి.. బిడ్డ మరణానికి మాత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ►హరి యాణాలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆ రాష్ట్రంలోని బి.జె.పి. ప్రభుత్వం 2 లక్షల రూపాయలను మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడాన్ని విమర్శిస్తూ.. ‘బీజేపీ నేత ఎవరైనా పదిమంది చేత దాడికి గురైతే తాను 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని’ ఆమ్ ఆద్మీ పార్టీ హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ జైహింద్ అనడాన్ని ఆయన భార్య, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. తన భర్త మాటల్లోని ఉద్దేశాన్ని తను అర్థం చేసుకోగలనని, అయితే ఆయన అలా మాట్లాడ్డం సరికాదని స్వాతి అన్నారు. -
స్త్రీలోక సంచారం
►తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నాలుగేళ్లలో మహిళల సమస్యలను పరిష్కరించలేకపోయిన అధికార టి.ఆర్.ఎస్.పార్టీ వైఫల్యాలను మహిళలే ఎండగట్టాలని మంగళవారం హైదరాబాద్లో జరిగిన బి.జె.పి.మహిళా మోర్చా సమావేశంలో పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. తెలంగాణ తొలి క్యాబినెట్లోనే మహిళలకు చోటు లేకపోవడం సిగ్గు చేటు అని అంటూ, ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రక్షణశాఖ మంత్రిగా, లోక్సభ స్పీకర్గా మహిళల్నే నియమించడాన్ని గుర్తు చేశారు. బి.జె.పి త్వరలోనే హైదరాబాద్లో ‘మహిళా సమ్మేళన్’ని నిర్వహించబోతోందని, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరవుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ►కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ 2017’కు ఎంపికైన తెలంగాణ యువతి బొడ్డపాటి ఐశ్వర్యకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ నావికాదళంలో లెఫ్ట్నెంట్ కమాండర్గా ఉన్న ఐశ్వర్య.. గతంలో నారీ శక్తి అవార్డు, నావ్సేన అవార్డులను కూడా పొందారు. ► చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యాలని మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ హైకోర్టు.. 2013 నాటి లలితా కుమారి కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు విషయమై సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళిని అనుసరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకు సూచించింది. పత్రికా ప్రతినిధుల సమావేశంలో బోడె ప్రసాద్ అసభ్యకరమైన భాషలో తనను దూషించారని రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని రోజా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుకు ఆదేశించింది. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతున్న రెండవ ‘యూరేషియన్ ఉమెన్స్ ఫోరమ్’లో పాల్గొనేందుకు బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోనియా మొదట.. ‘మహిళల భద్రత, నిరంతర అభివృద్ధి’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో పాల్గొని, ఆ తర్వాత.. యువతీ యువకుల నుంచి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు స్వీకరించే చర్చావేదికలో ప్రసంగిస్తారు. ►జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లా, ఖాజీగండ్లో శనివారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో మరణించడానికి ముందు.. రెండేళ్ల క్రితమే తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరిన 16 ఏళ్ల జాహిద్ అహ్మద్ మిర్ అలియాస్ హషీమ్.. ఒక ఇంట్లో దాక్కుని ఉన్న తనను భద్రతాదళాలు చుట్టుముట్టి, ప్రాణాల మీద ఆశ ఉంటే లొంగిపొమ్మని హెచ్చరిస్తుండగా.. ఆ ఆఖరి నిమిషాల్లో అతడు తల్లికి ఫోన్ చేసి.. ‘‘అమ్మా నన్ను లొంగిపొమ్మంటున్నారు. ఏం చెయ్యమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి.. ‘‘వద్దు వద్దు.. తప్పించుకోగలిగితే తప్పించుకో. అంతే తప్ప లొంగిపోవాలన్న ఆలోచనలే రానీయకు’’ అని చెప్పిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల బక్రీద్ రోజు ఫయాజ్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ హత్యతో కూడా సంబంధం ఉన్న జాహిద్ అహ్మద్.. చనిపోయేముందు తన తల్లితో మాట్లాడిన ఫోన్ ఆడియో క్లిప్పును ఇప్పుడు కశ్మీర్లోని వేర్పాటువాదులు.. తల్లిదండ్రుల భావోద్వేగభరితమైన విజ్ఞప్తులకు తలవొగ్గి భద్రతాదళాలకు యువత లొంగిపోకుండా ఉండటం కోసం విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ►తొలిసారి ప్రసవించినవారు ఆన్లైన్లో షేర్ చేసుకుంటున్న తమ భయానకమైన అనుభవాలను చదివి గర్భిణులలో ఎక్కువ శాతం మంది సహజమైన ప్రసవాన్ని కోరుకోవడానికి జంకుతున్నారని ఇంగ్లండ్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హల్’లో సీనియర్ ఫెలో రీసెర్చ్గా పని చేస్తున్న క్యాట్రియోనా జోన్స్.. గతవారం జరిగిన ‘బ్రిటిష్ సైన్స్ ఫెస్టివల్’లో ప్రసంగిస్తున్నప్పుడు వెల్లడించారు. ఈ ‘హారర్ స్టోరీలు’ చదివి ‘టోకోఫోబియా’కు గురవుతున్న ఎందరో గర్భిణులు సిజేరియన్లకు మొగ్గుచూపుతున్నారనీ, అయితే.. ఆన్లైన్లో భయానక అనుభవాలతో పాటు.. అరకొరగా ఉండే అహ్లాదకరమైన అనుభవాలనే తమకు వర్తించుకుని గర్భిణులు భయపడ్డం మానేయాలని, బిడ్డకు జన్మనివ్వడం అనేది మరీ అంత ప్రాణాంతకం ఏమీ కాదని జోన్స్ సలహా ఇస్తున్నారు. ► హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత, రెండు ఆస్కార్ల విజేత సీన్ పెన్ (58).. ‘మీ టూ’ ఉద్యమం.. సమాజంలో స్త్రీ, పురుషులను వేరు చేస్తోందనీ, వారి మధ్య అనుమానాలను, అపార్థాలను శత్రుత్వాన్ని పెంచి పోషిస్తోందనీ విమర్శించారు. అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ‘హులు’ నిర్మించి, ఈ నెల 14న ప్రారంభించిన ఎనిమిది ఎపిసోడ్ల అమెరికన్–బ్రిటిష్ డ్రామా వెబ్ టెలి విజన్ సిరీస్ ‘ది ఫస్ట్’లో తన సహనటి నటాషా మెకెల్హోన్తో పాటు నటిస్తున్న సీన్ పెన్.. ఆ సీరియల్ కథలో అంగారక గ్రహానికి ప్రమాదకరమైన ప్రయాణం చేసే శక్తిమంతమైన మహిళల గురించి తమను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ‘మీ టూ’ ప్రస్తావన వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ►బుధవారం (నిన్న) ఇండియా–పాకిస్తాన్ మధ్య దుబాయ్లోని స్పోర్ట్స్ క్లబ్లో ఆసియా కప్ క్రికెట్ వన్డే మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు భారత టెన్నిస్ స్టార్, ఇప్పుడీ మ్యాచ్లో ఆడుతున్న పాకిస్తానీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ భార్య అయిన సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అయ్యారు! ‘‘ఇక ఈ ఆట మొదలయ్యాక ఆరోగ్యకరంగా ఉండే మనిషి కూడా సిక్ అవుతారు. అలాంటి ఉంటాయి సోషల్ మీడియాలో కామెంట్లు. పైగా ఒక గర్భిణికి అసలే అవసరం లేని కామెంట్స్ అవి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాచ్ మాత్రమే’’ అని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి అదృశ్యం అయిపోయారు సానియా. -
స్త్రీలోక సంచారం
►తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్ బజార్ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్ అత్యంత ఆదరణ పొందడమే కాక.. గ్రూపు సభ్యుల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు తోడ్పడుతున్నాయి. తిరుచ్చి జిల్లా మొత్తంలో సుమారు 10 వేలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలు ఉండగా, ఒక్క తిరుచ్చి పట్టణంలోనే వెయ్యి వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని, ఆ వెయ్యి బృందాలలోని పదిహేడు బృందాలు.. కాస్ట్యూమ్ జ్యుయలరీ, క్లాత్ బ్యాగులు, దుస్తులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకుని వచ్చి, చవక ధరల్లో విక్రయిస్తూ ఆదరణ పొందుతున్నందున.. కొత్తగా ప్రారంభం అయిన ‘కాలేజీ బజార్ గ్రూపు’ను ఒక సంస్థగా రిజిస్టర్ చేయించిన అనంతరం, ఇలాంటివే మరికొన్ని గ్రూపుల ఏర్పాటుకు సహకారం అందించనున్నామని ‘తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్’ ప్రతినిధి ఒకరు తెలిపారు. ► తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక అకృత్యాలపై బాధితుల ఫిర్యాదును స్వీకరించి, వారికి న్యాయం జరిపించేందుకు వీలుగా ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తోందంటూ.. ఏడుగురు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్లోని పెద్ద పెద్ద దర్శకులు, నటులు అవకాశాల పేరుతో తనను వాడుకుని దగా చేశారనీ, తనకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీరెడ్డి అనే యువతి ఈ ఏడాది ఏప్రిల్ 7న ఫిల్మ్ చాంబర్ ఎదుట.. సంచలనాత్మకంగా అర్ధనగ్న నిరసన చేపట్టిన అనంతరం.. తామంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అనేకమార్లు కలిసి.. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి, బాధితులకు న్యాయం జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అడుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టుకు వెళ్లక తప్పలేదని ఈ ఏడుగురు పిటిషనర్లు తెలిపారు. ►బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ల మధ్య ప్రారంభం నుంచీ కెరీర్లో ఉన్న ‘శత్రుత్వం’.. దీపికను ప్రతిదానికీ ప్రియాంకతో పోల్చుకునేలా ప్రేరేపిస్తోందని వదంతులు వినిపిస్తున్న క్రమంలో.. ఇటీవలి నిశ్చితార్థం తర్వాత బాయ్ఫ్రెండ్ నిక్ జోనస్ని ఈ నవంబర్లో గానీ డిసెంబర్లో గానీ ప్రియాంక చేసుకోబోతున్న వివాహానికంటే ఘనంగా, అదే సమయానికి తన బాయ్ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకునేందుకు దీపిక ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల్లో నటించడంలో ప్రియాంక పైచేయిగా ఉండగా, బాలీవుడ్లో దీపికే వెలిగిపోవడం దీపికకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ అయితే.. ప్రియాంకలా దీపికకు విదేశీ బాయ్ఫ్రెండ్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అని కూడా ఏవేవో విశ్లేషణలు జరుగుతున్నాయి. ►డాలర్ ముందు రూపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో బంగారు ఆభరణాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం 2 శాతంగానైనా బంగారంపై దిగుమతి సుంకాన్ని విధించడం ఒక్కటే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గమని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలరీస్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ.) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు. ►భారతదేశంలో మహిళల ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉండడానికి కారణం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసెయ్యడమేనని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలో జరుగుతున్నవేనని ప్రఖ్యాత ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్లో వచ్చిన తాజా సర్వే నివేదిక వెల్లడించింది. చిన్న వయసులోనే తల్లి అవడం, ఆర్థికంగా ఆధారపడి ఉండటం, గృహహింస వంటివి.. మహిళల్లో మానసికంగా ఒత్తిడిని కలిగించి, వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని నివేదిక తెలిపింది. ► 44 ఏళ్ల కేరళ నన్పై పలుమార్లు అత్యాచారం జరిపిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుండీ కొట్టాయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 85 ఏళ్ల జోన్ జోసెఫ్ అనే జాయింట్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, జోసెఫ్ స్టీఫెన్ అనే ఓ రైతుతో పాటు సోమవారం నుంచి బాధితురాలి చెల్లెలు కూడా దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిలు కోసం బిషప్ ములక్కల్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను కేరళ హైకోర్టు సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. ►తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్రాజన్.. చెన్నైలోని ఒక ఆటో డ్రైవర్ ఇంటిని అకస్మాత్తుగా సందర్శించి, ఆ కుటుంబం క్షేమ సమాచారాలు కనుక్కొని, ఒక స్వీట్ బాక్సును ఇచ్చి.. ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని చెప్పివెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో సోమవారం తమిళసై ఏర్పాటు చేసిన సభలో ఆ ఆటో డ్రైవర్.. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటంపై అసహనంతో ఆమెను ప్రశ్నిస్తూ ఉండగానే.. పార్టీ కార్యకర్తలో కొందరు అతడిని తోసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళుతున్న వీడియో వైరల్ కావడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా తమిళసై అతడి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ► బ్రిటన్ రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాక ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తొలిసారి ఒక కొత్త ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. గత ఏడాది లండన్లోని ‘గ్రెన్ఫెల్ టవర్’ ఫైర్లో 70 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు విరాళాలను సేకరించడం కోసం ఆయా కుటుంబాలు సంప్రదాయికంగా వండే 50 రకాల వంటకాలను చేయించి, వాటిల్లో కొన్ని స్వయంగా తను చేసి, వాటన్నిటితో ‘టుగెదర్ : అవర్ కమ్యూనిటీ కుక్ బుక్’ అనే ఓ చక్కటి వంటల పుస్తకాన్ని వేయించి, దానికి ముందుమాట కూడా తనే రాసి, పుస్తకావిష్కరణ జరిపించారు మేఘన్ మార్కెల్. -
స్త్రీలోక సంచారం
►2019 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలంటే ఆ పార్టీ తమను తగినన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవలసి ఉంటుందని స్పష్టం చేసిన బహుజన సమాజ్వాదీ (బీఎస్పీ) పార్టీ అధినేత్రి మాయావతి.. అదే సందర్భంలో, ‘భీమ్ ఆర్మీ’ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ఆజాద్ తనను ‘బువా’గా (ఆంటీ) పేర్కొంటూ.. ‘మా ఇద్దరిదీ ఒకే రక్తం’ అని ప్రచారం చేసుకోవడం సరికాదు అని అన్నారు. దీనిపై స్పందించిన ఆజాద్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంగానీ, పొత్తులు పెట్టుకోవాలన్న ఆకాంక్ష గానీ తమకు లేవు కనుక బీఎస్పీ ఆందోళన చెందనవసరం లేదని, మాయావతిని తన రక్తసంబంధీకురాలిగా చెప్పుకోవడం వెనుక.. తామిద్దరం దళితులమేనన్న భావన తప్ప, మరొకటి లేదని అన్నారు. ►ఇండియా రాకెట్ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేశాడన్న ఆరోపణలపై 1994లో అరెస్ట్ అయి, విచారణ అనంతరం 1998లో నిర్దోషిగా విడుదలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్కు పరువు నష్టపరిహారంగా కేరళ ప్రభుత్వం ఎనిమిది వారాలలోపు 50 లక్షల రూపాయలను చెల్లించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఆనాటి కేసులో కేరళ పోలీసు అధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. రెండు రోజుల అనంతరం ఈ కేసులోనే 1997లో అరెస్ట్ అయి, ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలైన బాధితురాలు మరియం రషీదా.. తను కూడా కేరళ పోలీసులపై కేసు వేసి, పరిహారం కోరనున్నట్లు ఓ రహస్య ప్రదేశం నుంచి మీడియాకు సమాచారం అందించారు. ‘ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెల్’ ఇన్స్పెక్టర్గా ఉన్న విజయన్ అనే వ్యక్తి తనను అక్రమంగా నిర్బంధించి, లైంగిక సుఖం కోసం తనను వేధించి, తను తిరస్కరించడంతో కక్షగట్టి ‘ఇస్రో గూఢచర్యం’ కేసులో ఇరికించినట్లు మాల్దీవుల పౌరురాలైన మరియం రషీదా అప్పట్లోనే మీడియా దృష్టికి తీసుకురాగా.. ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పుతో, దర్యాప్తు కమిటీ నియామకంతో.. రషీదా ధైర్యంగా బయటికి వచ్చారు. ►పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ అధికమౌతున్నాయని, బాధితుల నుండి సిటీ పోలీసులకు నెలకు నలభై వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా వాటిల్లో కనీసం మూడు ఫిర్యాదులు పని చేసే చోట లైంగిక వేధింపులపైనే ఉంటున్నాయని హైదరాబాద్ (రాచకొండ) సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్.హరినాథ్ తెలిపారు. ఈ విషయమై ‘షీ’ టీమ్స్ ఏసీపీ నర్మద మాట్లాడుతూ.. వాస్తవానికి ఏ కొద్ది మంది మహిళలో ఫిర్యాదు వరకు వస్తున్నారని, ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశాలున్నాయని అన్నారు. ► రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను సమీకరించుకోవడం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 12 రోజుల పర్యటనలో భాగంగా ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి హెచ్.కె.ద్వివేది, ప్రధాన కార్యదర్శి మాలేడేలతో కలిసి ఆదివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) బయల్దేరారు. జర్మనీ, ఇటలీ దేశాలలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అక్కడి ప్రభుత్వ అధికారుల ఆహ్వానంపై విదేశీ పర్యటనకు వెళ్లిన మమత తిరిగి ఈ నెల 28న స్వదేశానికి చేరుకుంటారు. ►ఒక కేరళ న¯Œ పై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్.. విచారణకు హాజరయ్యే నిమిత్తం రేపు (సెప్టెంబర్ 18) కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగవలసి ఉండగా.. ప్రజాగ్రహాన్ని, మీడియాను తప్పించుకోడానికి అతడు బెంగళూరు, చెన్నై లేదా మంగళూరు ఎయిర్పోర్ట్లలో ఏదైనా ఒక దానిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొచ్చి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, బిషప్ తనపై అత్యాచారం జరిపిన విషయాన్ని బాధితురాలు 2016 సెప్టెంబర్లో.. రెండు భాగాలుగా విభజించి ఉన్న కన్ఫెషన్ బాక్సులోని ఒక భాగంలో నిలబడి, రెండో భాగంలో ఉన్న మత ప్రబోధకుని ఎదుట చెప్పుకోగా.. ఆమె చెప్పిన వివరాలను వినిన ప్రబోధకుడెవరో గుర్తించడం కోసం 12 మంది ప్రీస్ట్లను ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రేపే విచారించబోతోంది. ►లండన్లో ప్రస్తుతం జరుగుతున్న ‘లండన్ ఫ్యాషన్ వీక్’ ఈవెంట్లో అర్జెంటీనా మోడల్ వలేరియా గార్షియా.. క్యాట్ వాక్ చేస్తూనే ‘బ్రెస్ట్ పంప్’ను ఉపయోగించడం విశేష వార్తాంశం అయింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన వలేరియా.. నలుపురంగు ట్రౌజర్స్ సూటు, బ్రా ధరించి, బ్రా లోపల ఎల్వీ కంపెనీ వారి చప్పుడు చెయ్యని తేలికపాటి బ్రెస్ట్ పంప్ను అమర్చుకుని అక్కడ లేని తన రెండో బిడ్డకు అందించడం కోసం పాలను తీసిపెట్టుకుంటున్న ఆ మాతృమూర్తిని ర్యాంప్ పక్కన వరుసగా కూర్చొని ఉన్న న్యాయనిర్ణేతలు అభినందించకుండా ఉండలేకపోయారు. ►బాలలపై లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ప్రస్తుతం అనేక దేశాల్లోని చర్చిలు తమ ప్రతిష్టను కోల్పోతున్న తరుణంలో.. మహిళలు మతాధికారి పాత్రలను పోషించడం ఎంతైనా అవసరమని కెనడియన్ కార్డినల్ మార్క్ క్వెలెట్ అభిప్రాయపడ్డారు. ఇందు కోసం మహిళలకు శిక్షణ ఇచ్చి మత బోధకులుగా వారికి తర్ఫీదు ఇచ్చేందుకు చర్చి యాజమాన్యాలు ముందుకు రావాలనీ, నిజానికి ‘ప్రీస్ట్హుడ్’ అనే ఉదాత్తమైన బాధ్యత మహిళల నిర్వహణ వల్ల మరింత గౌరవప్రదం అవుతుందని ఆయన అన్నారు. ►28 ఏళ్ల అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు కనీసం రెండేళ్ల పాటు దూరంగా ఉండాలని.. కొన్నాళ్లుగా ఆమెను వెంబడిస్తూ, ఉత్తరాలతో వేధిస్తూ, భయపెడుతూ, ద్వేషిస్తూ, ‘ప్రేమిస్తూ’ ఉన్న ఎరిక్ స్వార్బ్రిక్ అనే సైకో అభిమానిని ఆదేశించిన యు.ఎస్.కోర్టు.. ఆ ఆదేశాలు తక్షణం అమలయ్యేలా ‘రిస్ట్రెయినింగ్ ఆర్డర్’(నిషేధాజ్ఞ)ను జారీ చేసింది. ‘‘నిన్ను రేప్ చేస్తాను. రేప్ చేశాక చంపేస్తాను. నీ లాయర్లు, నీ న్యాయస్థానం నా నుండి నిన్ను కాపాడుకోలేవు. ఎందుకంటే నిన్ను అంతగా నేను ప్రేమిస్తున్నాను’’ అంటూ ఎరిక్ స్వార్బ్రిక్ నుంచి వస్తున్న వరుస ఉత్తరాలకు భీతిల్లిన టేలర్ స్విఫ్ట్ కోర్టును ఆశ్రయించగా.. ఎరిక్ ఇకముందు ఆమెను వెంబడించడంపై, ఉత్తరాలు రాయడంపై కోర్టు నిషేధం విధించింది. -
స్త్రీలోక సంచారం
2014 మే 5 – 2016 సెప్టెంబర్ 23 మధ్య కాలంలో తనపై అనేకసార్లు అత్యాచారం జరిపినట్లు కేరళ నన్ ఒకరు జలంధర్లోని క్యాథలిక్ చర్చి బిషప్ జేమ్స్ ఫ్రాంకో ములక్కల్పై చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, ఇంతవరకు ఆయనను అరెస్టు చెయ్యకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా.. కేరళలోని పూంజర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే పి.సి.జార్జి ఒక ప్రెస్మీట్లో.. బాధితురాలైన ఆ నన్ను ‘వ్యభిచారి’ అని అంటూ.. ‘‘తనపై బిషప్ 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని చెబుతున్న ఆ మనిషి.. పన్నెండుసార్లలో ఒక్కసారైనా ఫిర్యాదు చేయకుండా, పదమూడోసారి మాత్రమే పెదవి విప్పడాన్ని బట్టి చూస్తే ఆమె గుణం లేని మనిషి అని స్పష్టం అవుతోందని’’ అనడంపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 20లోగా కమిషన్ ముందు హాజరుకావాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా స్పందించిన పి.సి.జార్జి, ‘ఎన్నికైన ప్రజా ప్రతినిధినైన నాకు ఎవరి ఎదుటా హాజరు కావలసిన అవసరం లేదు’ అని అనడం మరో వివాదం అయింది. ఢిల్లీలోని తన ఫ్రెండ్తో వాట్సాప్ వీడియోలో చాట్ చేస్తూ, ఆ తర్వాత ‘రష్యన్ రౌలత్’ ఆడుతూ, తన టర్న్ వచ్చినప్పుడు తుపాకీని కణతలకు గురిపెట్టుకుని కాల్చుకోవడంతో కుప్పకూలిపోయిన కరిష్మా యాదవ్ అనే గ్వాలియర్ యువతి, ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది. రివాల్వర్లోని ఆరు చాంబర్స్లో ఐదింటిని ఖాళీగా ఉంచి, ఒక దాంట్లో బులెట్ పెట్టి, చాంబర్ని గిర్రున తిప్పి కణతల దగ్గర పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కే అతి ప్రమాదకరమైన ‘రష్యన్ రౌల™Œ ’ ఆటను ఆడుతుండగా, కర్మిషా తన వంతు రాగానే.. ‘‘దేఖ్తే హై కిస్మత్ మే క్యా లిఖా హై’’ (చూద్దాం ఏం రాసిపెట్టి ఉందో) అని తన ఫ్రెండ్తో అంటూ ట్రిగ్గర్ నొక్కడంతో కణతల్లోకి బులెట్ దిగి మరణించిందని పోలీసులు వెల్లడించారు. 1975లో ఒక స్థల వివాదంలో తన ఆస్తిని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ జప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, సివిల్ కోర్టులో రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి, కేసు గెలిచిన గంగా దేవి అనే 27 ఏళ్ల మహిళ.. విచారణ సమయంలో కోర్టు ఫీజుగా చెల్లించిన 312 రూపాయల రసీదును కోర్టువారు పోగొట్టిన కారణంగా, రెండోసారి చెల్లించడానికి ఆమె నిరాకరించినందుకు వల్ల.. నిబంధనల ప్రకారం గెలుపు ఉత్తర్వుల జారీకి ఫీజు రసీదును జత చేసే పరిస్థితి లేకపోవడంతో.. తీర్పు అలా 41 ఏళ్ల పాటు గాలిలో ఉండి, చివరికి ఈ ఏడాది ఆగస్టు 31న మీర్జాపూర్ సివిల్ జడ్జి లవ్లీ జైస్వాల్ చొరవతో విముక్తి పొంది, గంగాదేవి ‘గెలుపు తీర్పు’ కాపీ బయటికి వచ్చింది! అయితే.. ఇన్నేళ్లలోనూ 11 మంది జడ్జీ్జల చేతులు మారిన ఈ ‘తీర్పు’ ప్రతిని అందుకోడానికి లేకుండా, 2005లోనే గంగాదేవి మరణించిన విషయం ఆలస్యంగా కోర్టు దృష్టికి వచ్చింది. కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతుల వల్ల కళాకారులు మారిపోరని, వారి చుట్టూ ఉన్న ప్రపంచమే వారిని చూసే విధానాన్ని మార్చుకుంటుందని 32 ఏళ్ల అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా అన్నారు. అక్టోబర్ 5న విడుదల అవుతున్న హాలీవుడ్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’తో నటిగా పరిచయం అవుతున్న లేడీ గాగా.. చిత్రం ప్రివ్యూ సందర్భంగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. పేరుప్రతిష్టల వంటి అసహజమైన విషయాలకు దూరంగా ఉండే క్రమంలో.. నిత్య జీవితంలో కళాకారులు చేసే పోరాటాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ‘వారు కూడా మనలా సాధారణమైన వ్యక్తులే’ అన్న విధంగా ఈ ప్రపంచం తనను అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేయడం విశేష ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ మూవీ మొఘల్.. హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపులను సుప్రసిద్ధులైన కొందరు సీనియర్ నటీమణులు ధైర్యంగా బయటపెట్టడంతో ఏడాది క్రితం ఊపిరి పోసుకున్న ‘మీ టూ’ ఉద్యమం తాజాగా మరో ప్రముఖుడి లైంగిక అకృత్యాలను బట్టబయలు చేసింది. అమెరికన్ టెలివిజన్ దిగ్గజం ‘సి.బి.ఎస్. కార్పొరేషన్’ చైర్మన్ లెస్లీ మూన్వెస్ మొత్తం 12 మందితో మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని.. ముఖరతికి బలవంత పెట్టడం, దేహంలో గోప్యమైన ప్రదేశాలను తాకడం, నిరాకరించినవారిపై కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవడం వంటì ఆరోపణలు ఆయనపై ఉన్నాయని ‘న్యూయార్క్ర్’ మ్యాగజీన్ ఆదివారం నాడు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన వెంటనే లెస్లీ మూన్వెస్ను చైర్మన్ పదవి నుంచి సి.బి.ఎస్. తొలగించింది. ఈజిప్టు నుంచి వలస వచ్చిన ఒక హోటల్ ఉద్యోగి.. మక్కాలోని గుర్తు తెలియని ఒక హోటల్లో తన సహోద్యోగి అయిన సౌదీ మహిళతో ఒకే టేబుల్పై కలిసి కూర్చొని ఉదయం అల్పాహారం తీసుకుంటున్న దృశ్యాన్ని.. వైరల్ అవుతున్న ఒక వీడియోలో చూసిన సౌదీ అరేబియా అధికారులు అతడు ఎక్కడున్నదీ కనిపెట్టి అరెస్టు చేశారు. వీడియోలో ఒక చోట ఆ మహిళ అతడికి తినిపించడం, కెమెరా వైపు చూస్తూ చేయి ఊపడం వంటి వాటిని కూడా తీవ్రంగా పరిగణించిన సౌదీ అధికారులు.. వారిపై తామేమి చర్యలు తీసుకుంటున్నదీ మీడియాకు బహిర్గతం చేయలేదు. మిస్ అమెరికా’ నిర్వాహకులు.. స్విమ్ సూట్ రౌండ్ను రద్దు చేశాక తొలిసారి జరిగిన అందాల పోటీలలో.. ‘మిస్ అమెరికా 2019 టైటిల్’ను మిస్ న్యూయార్క్ నియా ఫ్రాంక్లిన్ గెలుచుకున్నారు. నిరుటి అందాల రాణి క్యారా మండ్ తన శిరస్సుకు కిరీటాన్ని తొడుగుతున్నప్పుడు ఉద్వేగానికి లోనైన నియా ఫ్రాంక్లిన్.. ‘స్విమ్సూట్ రౌండ్లో పాల్గొనకుండా తొలిసారి టైటిల్ గెలుచుకున్న సంతోషం తనను నిలవనివ్వడం లేదనీ, ఆ రౌండ్ లేకపోవడం వల్ల తను మరికాస్త ఎక్కువగా ఆహారాన్ని తీసుకునేందుకు వీలుకలిగిందని’ గలగలా నవ్వుతూ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది కూడా దుర్గామాత ఉత్సవాల కోసం ఒక థీమ్ సాంగ్ రాశారు. మంత్రివర్గ సహచరుడైన అరూప్ బిస్వాస్ అభ్యర్థన మేరకు, ఆయన నేతృత్వంలో యేటా ఉత్సవాలను నిర్వహిస్తుండే ‘సురుచి సంఘ్’ కోసం ‘జ దేవి సర్వభూతేశు’ అంటూ మమత రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అయిన ఇంద్రనీల్ సేన్ ఆలపించారు. -
స్త్రీలోక సంచారం
అత్యాచారం వల్ల గర్భం ధరించిన ఓ 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని.. లైంగికదాడి కారణంగా తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా తను గర్భం దాల్చానని, అది కూడా తను మైనరుగా ఉన్నప్పుడు జరిగిందని.. కాబట్టి తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో గర్భస్థ పిండం హక్కులను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడింది. ఎం.టి.పి. చట్టం (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టు) ప్రకారం 20 వారాల వరకు మాత్రమే గర్భవిచ్ఛిత్తికి ఆమోదం ఉన్నందున, ఆ బాధిత విద్యార్థినికి గర్భవిచ్చిత్తి జరిపించవలసిన అత్యవసర స్థితి ఏమైనా ఉందా అని నిర్థారించుకోవడం కోసం వైద్య నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా కోర్టు నియమించింది. ‘‘ఐ యామ్ సారీ. ఇక్కడంతా సెరెనా గెలుపును కోరుకున్నారు. కానీ, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అయితే గెలుపు, ఓటమి కాదు.. సెరెనాతో ఆడడం నా కల. అది ఇవాళ నెరవేరింది’’ అని సెరెనా విలియమ్స్పై యు.ఎస్. ఓపెన్ ఫైనల్స్లో గెలిచిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా.. టెన్నిస్ మైదానంలో ప్రేక్షకులందరికీ క్షమాపణ చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల మనసు దోచుకున్నారు. ఇరవై ఏళ్ల ఒసాకా ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలవడం ఇదే మొదటిసారిగా కాగా.. గెలుపు అనంతర క్షణాలలో ఆమె ఏమాత్రం ఉద్వేగాన్ని ప్రదర్శించక, గ్రాండ్స్లామ్ల యోధురాలు సెరినా ముందు ఒద్దికగా, వినమ్రంగా నిలుచోవడం సెరెనాను సైతం ముగ్ధురాలిని చేసింది. తిరువనంతపురంలోని మార్ ఐవేనియోస్ కాలేజీలో తన గర్ల్ఫ్రెండ్ అయిన చారులతను.. ఇండియన్ క్రికెటర్ సంజు వి.శాంప్సన్ ఈ ఏడాది డిసెంబర్ 22న వివాహమాడబోతున్నాడు. ఐదేళ్లుగా చారులతను తను ప్రేమిస్తున్నానని, తొలిసారిగా ఆమెకు 2013 ఆగస్టు 22న రాత్రి 11 గం. 11 నిముషాలకు ‘హాయ్’ చెప్పానని ఫేస్బుక్లో ఆదివారం శాంప్సన్ బహిర్గతం చేయగా.. ‘‘మా ఆమోదం పొందాకే పెళ్లి సంగతిని ప్రకటించాలని వాళ్లిద్దరూ అనుకున్నారని, తిరువనంతపురంలో జరిగే పెళ్లికి ఇప్పటికే ఫంక్షన్ హాల్ కూడా బుక్ అయిందని’’ శాంప్సన్ తండ్రి విశ్వనాథ్ నిర్థారించారు. సెలవులో ఉన్న ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ను విచారణ నిమిత్తం ఏ క్షణమైనా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పిలిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘న్యూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడైన చందా భర్త.. దీపక్ కొచ్చర్ వ్యాపార లావాదేవీల విషయంలో బ్యాంకు సీఈవోగా కొచ్చర్ ఆయనకు సడలింపులు ఇచ్చేందుకు నిబంధలను ఏమైనా అతిక్రమించి ఉండే అవకాశాలున్నాయా అనే కోణంలో సెబీ ఆమెను ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన మూడేళ్ల ప్రణాళిక (2018–19 నుంచి 2020–21 వరకు) లో భాగంగా త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలలో పబ్లిక్ ప్యానిక్ బటన్లు, ఆల్ ఉమెన్ పోలీస్ పెట్రోలింగ్ టీమ్లు ప్రారంభం కాబోతున్నాయి. హోమ్ శాఖ పర్యవేక్షణలోని ఈ ‘ఉమెన్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్’.. దేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన అన్ని సంస్థలతో సమన్వయం కలిగి ఉండడమే కాక.. మహిళలు, శిశువుల కోసం.. ప్రయాణ విరామ వసతులు (ట్రాన్సిట్ డార్మెటరీస్), శక్తిమంతమైన ఎల్.ఇ.డి. వీధి దీపాలు, ఆపదనుంచి కాపాడే కేంద్రాలు, నేర నిర్థారణ, సైబర్ క్రైమ్ సెల్స్ నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంటుంది. ఎనిమిది దేశాల (శ్రీలంక, ఇండియా, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్) 2021 ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ కప్లో అర్హత కోసం జరుగుతున్న ఐ.సి.సి. ఉమెన్స్ చాంపియన్లోని మూడో రౌండ్లో భాగంగా నేటి నుండి ఈ నెల 16 తేదీ వరకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. శ్రీలంకలోని గాలాలో సెప్టెంబర్ 11న, 13న, కటునాయకేలో 16న శ్రీలంకతో వన్డేలో పోటీ పడనున్న భారత మహిళా జట్టుకు మిథాలీరాజ్ కెప్టెన్ కాగా, జట్టులో తాన్యాభాటియా, ఏక్తా బిష్త్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, దయాళన్ హేమలత, మాన్సీ జోషి, హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి స్మృతి మంథన, శిఖా పాండే, పూనమ్ రనౌత్, జమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ ఉన్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఇండియాకు.. సురక్షితమైన దేశంగా పునఃప్రతిష్ట తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీలోని ఎన్జీవో సంస్థ ‘యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ కలిసి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ కన్నాట్ ప్లేస్లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల ‘ఫియర్లెస్ రన్’ విజయవంతమైంది. 200 మంది మహిళలు పాల్గొన్న ఈ ఫియర్లెస్ రన్ను ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ చౌదరి; సోషల్ ఆక్టివిస్టు, ఆసిడ్ దాడి నుంచి బయటపడిన లక్ష్మీ అగర్వాల్ ప్రారంభించారు. ఈ నెల 14న విడుదల అవుతున్న మలయాళీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ లోని ఒక టీజర్ సన్నివేశంలో కన్ను గీటి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా సోషల్మీడియాలో ప్రసిద్ధురాలైన బి.కాం. విద్యార్థిని ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఎరుపు రంగు దుస్తుల ఫొటో షూట్తో తన అభిమానుల హృదయాలపై పూల జల్లులు కురిపిస్తున్నారు! సరిగ్గా చిత్రం రిలీజ్కు ముందు ఒక స్థానిక మ్యాగజీన్ ప్రచురించిన ప్రియ ఫొటోలు.. ‘మనకు తెలియకుండా ఈ కొత్త నటి సినిమాల్లోకి ఎప్పుడొచ్చారబ్బా!’ అని ఆశ్చర్యంతో పాటు ఆహ్లాదమూ కలిగించేలా ఉన్నాయి. -
స్త్రీలోక సంచారం
హైదరాబాద్లో ప్రతి నెలా కనీసం 10 గృహహింస కేసులు నమోదు అవుతుండగా వాటిల్లో ఎక్కువ భాగం.. భర్త మద్యపాన వ్యసనం కారణంగా జరుగుతున్నవేనని, 2006 నుంచి ఇప్పటి వరకు 3,000 గృహ హింస కేసులు నమోదు కాగా అనధికారిక లెక్కల ప్రకారం ఇటువంటి ఘటనలు ఇంతకు రెట్టింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎన్జీవోలకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ‘భరోసా’ కేంద్రాల అధికారులు వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న ఈ గృహహింసకు మద్యపాన వ్యసనం తర్వాత వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం ఆశించడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. హరియాణలో బాగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటై, అత్యధికంగా ముస్లింలు ఉండే మేవాత్లో బడి మానేస్తున్న బాలికల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాక, ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్న బషీరుద్దీన్ ఖాన్ అనే 54 ఏళ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని టీచర్స్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో ప్రశంసించారు. మేవాత్ జిల్లాలోని పాఠశాలల్లో ఏటా కనీసం 20 శాతం వరకైనా ఉంటున్న బాలికల ‘డ్రాపవుట్స్’ని బషీరుద్దీన్ తగ్గించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. రియో డి జెనీరో లోని నేషనల్ మ్యూజియంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 వేల ఏళ్ల నాటి బ్రెజిల్ మహిళ ‘లూజీయా’ పుర్రెను కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటన అంటూ బ్రెజిల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రెండు కోట్లకు పైగా విలువైన పురావస్తు విశేషాలు భద్రపరిచి ఉన్న ఈ మ్యూజియంలో అన్నిటికన్నా అమూల్యమైనదిగా పరిగణన పొందుతున్న ‘తొలి బ్రెజిల్ మనిషి’.. ‘లూజియా’ 1970లో బ్రెజిల్ పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. యు.ఎస్. సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహిళ తొలిసారిగా వోటు వేసిన రోజు ఇది! వయోమింగ్ రాష్ట్రంలోని లరామీలో ఉంటున్న లుయీజా స్వెయిన్ (1801–1880) అనే మహిళ తన 69 ఏళ్ల వయసులో 1870 సెప్టెంబర్ 6న ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేచి, ఏప్రాన్ కట్టుకుని, తలకు బానెట్ (టోపీ), ఒంటిపై షాల్ ధరించి, పెరుగు కొనేందుకు చేత్తో చిన్న సత్తు బకెట్లాంటి పాత్రను పట్టుకుని బజారులోకి వచ్చినప్పుడు.. అప్పటికింకా పోలింగ్ సెంటర్ను అధికారికంగా తెరవనప్పటికీ, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమెతో ఓటు వేయించగా, ఆ మర్నాడు స్థానిక వార్తా పత్రిక ఒకటి.. ‘క్రైస్తవ విశ్వాసిగా కనిపిస్తున్న వియనశీలత గల ఓ తెల్ల జుట్టు గృహిణి’.. అమెరికన్ చరిత్రలోనే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళగా నేడు నిలిచారు’ అని ఆమెను కీర్తించింది. ప్రపంచంలోనే అత్యధిక వయసు గల దంపతులుగా మసావో మత్సుమోటో (108), ఆయన భార్య మియాకో (100) తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు. 1935 అక్టోబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంటను.. మీ 80 ఏళ్ల అన్యోన్య దాంపత్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని అడిగినప్పుడు.. ‘అది నా సహనమే’ అని సంతోషంతో ఉబికిన కళ్లతో సమాధానం చెప్పిన మియాకో వైపు ఆమె భర్త ‘అవును’ అన్నట్లుగా కృతజ్ఞతతో చూసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు! అమెరికన్ రొమాటిక్ కామెడీ డ్రామా టెలీ సీరియల్ ‘సెక్స్ అండ్ ది సిటీ’ (1998–2008) తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం న్యూయార్క్ గవర్నర్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హాలీవుడ్ నటి సింథియా నిక్సన్ (52).. తను లెస్బియన్ (ఆడ–ఆడ) అని చెప్పుకోడానికి కన్నా, హోమోసెక్సువల్ (మగ–మగ) అని చెప్పుకోడానికే ఇష్టపడతానని అన్నారు. ఆరేళ్ల క్రితం తనను ౖ»ñ సెక్సువల్(ఆడ–మగ)æగా ప్రకటించుకున్న సింథియా ఇప్పుడిలా మనసు మార్చుకోడానికి ప్రత్యేక కారణాలేవీ కనిపించని మాట అటుంచితే, మొదట డ్యానీ మోజెస్ అనే ఉపాధ్యాయుడితో దీర్ఘకాలం కలిసి ఉండి, అతడితో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత 2012లో క్రిస్టీన్ మారినోని అనే అతడిని ప్రేమించి, డ్యానీ నుంచి వేరుపడ్డారు. అతివాద జర్నలిస్టుగా పేరుమోసిన గౌరీ లంకేశ్ గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంట్లో ఉండగా జరిగిన దుండగుల కాల్పుల్లో ఒంట్లోకి నాలుగు బులెట్లు దూసుకుపోయి మరణించిన ఏడాది కాలానికి.. కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు కలిసి నేరస్తుడిని పట్టుకోగలిగారు. పరశురామ్ వాగ్మారే అనే వ్యక్తి ఆమెను అతి సమీపంలోంచి కాల్చిచంపాడని నిర్థారించిన ‘సిట్’.. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది. ఇటీవలే నిశ్చితార్థం అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ నటుడు నిక్ జోనాస్.. యు.ఎస్.ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో సెరెనా విలియమ్స్ ఆట చూసేందు వెళ్లడం, వారి వెంట నిక్ సోదరుడు, ఆ సోదరుడి గర్ల్ ఫ్రెండ్, వారితో పాటు ప్రియాంక తల్లి మధూ చోప్రా ఉండటం ఆహ్లాదకరమైన ఓ విశేష వార్తాంశం అయింది. ప్రియాంక, నిక్ల పెళ్లి ఇప్పుడా అప్పుడా, ఇక్కడా అక్కడా.. అని మీడియా అంచనాలు వేస్తుండగా.. ‘ఎక్కడైనా, ఏ క్షణమైనా’ అని ప్రియాంక తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది -
స్త్రీలోక సంచారం
రెండో పెళ్లి (బిగమీ) కోసం హిందువులలో కొందరు ముస్లిం మతం స్వీకరిస్తున్న ధోరణì కి అడ్డుకట్ట వేసేందుకు చట్టపరమైన గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన ‘లా’ కమిషన్.. ఈ విధమైన పెళ్లిళ్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని 2015లో మహిళా శిశు, అభివృద్ధి శాఖ ఒక నివేదికలో సూచించడాన్ని గుర్తు చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 494 ప్రకారం.. జీవిత భాగస్వామికి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నవారికి ఏడేళ్ల వరకు, సెక్షన్ 495 ప్రకారం.. పెళ్లయిన సంగతిని దాచి పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉండగా, శిక్షను తప్పించుకోవడానికి హిందువులు కొందరు.. ముస్లిం మతంలోకి మారుతున్నారని సామాజిక జీవన విధానాల పరిశీలకులు కొంతకాలంగా చెబుతున్న మాటను కూడా లా కమిషన్ తన సూచనల్లో ప్రస్తావించింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వదిలేయడంతో ప్రస్తుతం స్పెయిన్లోని జర్గోజా ప్రభుత్వ శరణాలయంలో ఉన్న పదమూడేళ్ల బాలికను తక్షణం భారతదేశానికి తెప్పించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జాప్యం లేకుండా పూర్తి చెయ్యాలని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ స్పెయిన్లోని భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా వచ్చిన స్పెయిన్ దంపతులు భోపాల్లోని ‘ఉడాన్’ అనే అడాప్షన్ ఏజెన్సీ నుంచి ఆ బాలికను దత్తత తీసుకునే సమయంలో ఆమె వయసు ఏడేళ్లని అబద్ధం చెప్పి ఏజెన్సీ తమను మోసం చేసిందని స్పెయిన్ తిరిగి వెళ్లాక తెలియడం తో వారు ఆమెను వదిలేశారని పత్రికలో వచ్చిన వార్తతో కలత చెందిన మనేకా.. ‘ఏది ఏమైనా’ ఆ చిన్నారిని మన దేశానికి సురక్షితంగా తెప్పించి, తగిన సంరక్ష కల్పించాలన్న కృతనిశ్చయానికి వచ్చా0తరు. మయన్మార్లోని రొహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన వా లోన్, కా సో ఓ అనే ఇద్దరు జర్నలిస్టులను అధికార రహస్యాలు బట్టబయలు చేశారన్న నేరారోపణలపై అరెస్టు చేసిన అనంతరం, అక్కడి న్యాయస్థానం వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఆ దేశ సమరయోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రస్తుత మయన్మార్ ‘స్టేట్ కౌన్సిలర్’ ఆంగ్ సాన్ సూచీకి హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణిగా ఇంతవరకు ఉన్న పేరు ప్రతిష్టలన్నీ నీరుగారిపోయాయి. జైల్లో ఆ జర్నలిస్టుల పరిస్థితి ఏమిటన్న విషయమై సూచీని తను అడిగినప్పుడు వారిపై ఆమె ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారనీ, వారిని ఆమె దేశ విద్రోహులుగా అభివర్ణించడాన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరి ప్రాణాలూ ప్రమాదంలో ఉన్నట్లు అర్థమౌతోందని మయన్మార్లోని యు.ఎస్. దౌత్య అధికారి బిల్ రిచర్డ్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రిప్ క్లబ్బులలో ‘ల్యాప్ డ్యాన్స్’ నిషేధానికి ఉన్న న్యాయపరమైన అవరోధాలను తొలగించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిపుణులతో కలిసి కూర్చొని చర్చలు జరుపుతోంది. స్ట్రిప్ క్లబ్లో బార్ డ్యాన్సర్లు ఒక్కో వస్త్రాన్నీ తొలగిస్తూ నృత్యం చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఇటీవల ‘స్ట్రిప్’ (బట్టలు తొలగించడం)తో పాటు ‘ల్యాప్’ (ఒడిలో కూర్చోవడం) డ్యాన్స్ కూడా తోడయిన కారణంగా ఆగ్రహించిన ఆ దేశ మహిళలు.. క్లబ్బుల బయట నిరసన ప్రదర్శనలు జరుపుతుండటంతో దిగివచ్చిన ప్రభుత్వం, ‘ల్యాప్ డ్యాన్స్’ను ‘వ్యభిచారం’గా పరిగణిస్తూ శిక్షను విధించే చట్టాన్ని తేవాలన్న ఆలోచనలో ఉంది. భారతీయ రచయిత్రులు రాసిన 13 పుస్తకాలు ఈ నెలలో విడుదల అవుతున్నాయి! ఫెమినిస్ట్ రాణి (శైలీచోప్రా, మేఘనా పంత్), 54 రీజన్స్ వై పేరెంట్స్ సక్ అండ్ ఫ్యూ (డాక్టర్ స్వాతీ లోథా, స్వరా లోథా), బికాజ్ హి ఈజ్ (మేఘనా గుల్జార్), హౌ ఇండియా వర్క్స్ : మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ (ఆర్తి కెల్షికార్), యాంబిగ్యుయిటీ మెషీన్స్, అండ్ అదర్ స్టోరీస్ (వందనా సింగ్), మహుల్దిహా డేస్ (అనితా అగ్నిహోత్రి), ది ఉమెన్స్ కోర్ట్యార్డ్ (ఖదీజా మసూర్), నాట్ క్వైట్ నాట్ వైట్ (షర్మిలా సేన్), ఎ షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్ పెయిన్ అండ్ ది వరల్డ్ (శివ్యానాథ్), ఎంప్రెస్ : ది ఆస్టానిషింగ్ రీన్ ఆఫ్ నూర్జహాన్ (రూబీ లాల్), సెర్చింగ్ ఫర్ హోమ్ : స్టోరీస్ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్ (శిమ్రాన్ చావ్లా), శ్రీదేవి (లలితా అయ్యర్), రెమ్నెంట్ ఆఫ్ ఎ సెపరేషన్ : ఎ హిస్టరీ ఆఫ్ ది పార్టిషన్ త్రూ మెటీరియల్ మెమరీ (ఆంచల్ మల్హోత్రా).. అనే ఈ పుస్తకాలను ప్రచురణకర్తల నుంచే కాకుండా, అమెజాన్ నుంచీ తెప్పించుకోవచ్చు. చెన్నై నుంచి సోమవారం మధ్యాహ్నం తూత్తుకుడి వెళుతున్న విమానంలో ఉన్న లూయిస్ సోఫియా (28) అనే రీసెర్చ్ స్కాలర్.. అదే విమానంలో ఉన్న బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ మీదకు దూసుMðళుతూ బీజేపీ ప్రభుత్వ ‘నియంతృత్వ’ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నేరారోపణపై అరెస్ట్ అయ్యారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్లో చదువుతున్న సోఫియా ఇలా నినాదాలు చేయడాన్ని తేలిగ్గా తీసుకోవాలని పోలీసులు తమిళ్సైకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినకపోవడంతో సోఫియాపై సెక్షన్ 505 (1)బి (భయం కలిగించేలా అరవడం), సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), సెక్షన్ 75(1)సి (ప్రజాప్రతినిధికి అవినమ్రంగా సమాధానం చెప్పడం) కింద కేసులు నమోదు చేసి పుదుక్కొటై్ట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం 12 రోజుల కైలాశ్ మానస సరోవర్ యాత్రలో ఉండగా, ఆయన నియోజకవర్గమైన అమేథీలోని అన్ని గ్రామ పంచాయతీలను 2018 చివరి నాటికి డిజిటలైజ్ చేసే ప్రాజెక్టులో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తలమునకలై ఉన్నారు. 2014లో రాహుల్ గాంధీ మీద అమేథీ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, తరచు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్న స్మృతి.. సెప్టెంబర్ 1న అమేథీలోని పిండారా ఠాకూర్ గ్రామంలో ‘డిజిటల్ గ్రామ్’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా కొంత విరామంతో తిరిగి బరిలోకి వచ్చి, ఉత్సాహంగా తన ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్న టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలిసారిగా తన ఫిట్నెస్పై పెదవి విప్పారు. గర్భం దాల్చాక మునుపటి ఫిట్నెస్ను కాపాడుకోవడం అనుకున్నంత తేలిక కాదని.. ప్రస్తుతం యు.ఎస్. ఓపెన్లో ఆడుతున్న సెరెనా అన్నారు. -
స్త్రీలోక సంచారం
మైసూరు సమీపంలోని కృష్ణరాజనగర్ తాలూకా పరిధిలో గల ఎరెమనుగణహళ్లి గ్రామంలో ఉన్న 450 మంది జనాభాలో నయీమా ఖాన్ (8) అనే ఒక ఒక్క బాలిక ఆ గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలకు గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వెళుతుండగా.. ఆమె పట్టుదలను చూసి.. ఆ ఒక్క విద్యార్థిని కోసం.. ఉర్దూ బోధించడానికి సబియా సుల్తాన్, కన్నడ బోధించడానికి నాగరాజు అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఏనాడూ గైర్హాజరు కాకుండా స్కూలుకు హాజరవుతున్న విషయం వార్తల్లోకి వచ్చింది. దళిత జనాభా అధిక సంఖ్యలో ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 40 ముస్లిం కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాలంతటికీ నయీమా ఖాన్ ఒక్కతే చదువుకుంటూ, ఆమె మూడవ తరగతి వరకు రావడానికి తోడ్పడిన ఈ పాఠశాలను ఉర్దూ భాష వ్యాప్తి కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం స్థాపించింది. మిస్ ఇంగ్లండ్ ఫైనల్స్లో తొలిసారి హిజబ్ ధరించి పాల్గొన్న యువతిగా శారా ఇఫ్తెఖర్ అనే విద్యార్థిని రికార్డు సృష్టించారు. మిస్ ఇంగ్లండ్ పోటీలలో గతంలో క్వాలిఫయింగ్ రౌండ్స్లో హిజబ్ ధరించి పాల్గొన్నవారు ఉన్నప్పటికీ, ఫైనల్స్లో హిజబ్తో పోటీకి నిలబడడం ఇదే మొదటిసారి. ఏలీ ఫ్రేజర్ అనే స్కాట్లాండ్ యువతి.. తన బాయ్ఫ్రెండ్ ఆవు ఒంటి మీద, ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని రాసి, ఆ ఆవును ఆమె దగ్గరికి తోలుకొచ్చి, తను ఆమె ఎదురుగా మోకాలిపై వంగి, ప్రపోజ్ చెయ్యడంతో ఆనందంతో పొంగిపోయి, వెంటనే ‘ఎస్’ చెప్పడం ఒక విశేషం అయింది. ఆమె ఈడు వాడే అయిన క్రిస్ గాస్పెల్ అనే 30 ఏళ్ల యువ రైతు, ఎంతో భిన్నంగా ఆలోచించి, తన మనోభావాలను ప్రియురాలికి వ్యక్తం చేసిన తీరుకు ముచ్చట పడిన ఇరువైపు స్నేహితులు కూడా అబ్బాయికి అమ్మాయి ఓకే చెప్పడంలో తగిన పాత్ర పోషించారు. జీవితంలోని అన్ని దశల్లోనూ స్త్రీజాతి ఎదుర్కొంటున్న వివక్షల్ని, వరకట్న వేధింపుల్ని, లైంగిక హింసల్ని, అసమానతలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి.. స్త్రీ తలచుకుంటే, స్త్రీ తిరగబడితే ఏ శక్తీ ఆమెను ఆపలేదని, ఆమె సహనాన్ని పరీక్షించడం మానవ జాతికే క్షేమకరం కాదనీ.. సందేశం ఇస్తూ.. తెలుగు బిగ్బాస్ 2 కంటెస్టెంట్ రోల్ రైడా (రాహుల్ కుమార్ వేల్పుల) దృశ్యీకరించి ‘అరుపు’ పేరుతో యూట్యూబ్లోకి ఆగస్టు 24 న విడుదల చేసిన వీడియో అమితమైన వీక్షకాదరణ పొందుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల హిట్స్కు చేరుకున్న ఈ 6 ని. 58 సెకన్ల వీడియోకు పాట రాసి, పెర్ఫామ్ చేసింది రైడానే కాగా, మ్యూజిక్ను కమ్రాన్, గాత్రాన్ని మనీషా అందించారు. దగాపడి, పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఓ అమాయకపు పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, వాటిని ఆమె ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొందో చూపించే ‘లవ్ సోనియా’ చిత్రం ఈ నెల 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో చిత్రంలో సోనియా పాత్రను పోషించిన మరాఠీ నటి మృణాళ్ ఠాకూర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. ‘మౌనంగా ఉండమనీ, మౌనంగా భరించమనీ’ అమ్మాయిలకు నూరి పోయడం అంటే.. వారిని చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయడమేనని మృణాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాతిపిత గాంధీజీ హత్యకు గురైనప్పుడు సంబరాలు జరుపుకున్నవారు ఇప్పుడు జాతిని పరిపాలిస్తున్నారని బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబై, రాంచీ, హైదరాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, థాణెలలో కొందరు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయమై న్యూఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియ¯Œ ఉమెన్ ప్రెస్ కోర్’ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యను చేసిన స్వరా భాస్కర్.. చేతలకు శిక్ష విధించాలి కానీ, ఆలోచనలకు కాదు’ అని కూడా అంటూ హక్కుల కార్యకర్తలను సమర్థించడంతో పాటు, ఎన్డీయే ప్రభుత్వం వైఖరి మీద తన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 12న విడుదల అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా మూవీ ‘జలేబీ’ పోస్టర్లో హీరోయిన్ రియా చక్రవర్తిని, కొత్త కుర్రాడైన హీరో వరుణ్ మిత్రా ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికలు, మహిళలపై అసంఖ్యాకంగా లైంగిక అకృత్యాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పోస్టర్లు అబ్బాయిల్లో చెడు తలంపులకు కలిగించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగిళ్లలో పని చేసి, ఏళ్ల పాటు రూపాయి రూపాయి కూడబెట్టుకుని లక్షా 39 వేలు పొదుపు చేసుకుని, నోట్ల రద్దుతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి (41) అనే మహిళ ఆ నోట్లను గడువు లోపల మార్చుకోవడం తెలియక, వాటిని తీసుకెళ్లి హేమావతి నీటిలో కలిపి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా మాటలు రాని, ఏదీ వినిపించని మీనాక్షి.. తనకు బ్యాంకు అకౌంట్ లేకపోవడం, నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియకపోవడం, అంతకన్నా కూడా తను డబ్బు దాచిన విషయం ఎవరికీ తెలియకూడదని అనుకోవడంతో చాలాకాలం పాటు సతమతమై, గడుపు తేదీ అయిన మార్చి 31 (2017) తర్వాత కూడా ఇంట్లో నోట్లుంటే నేరమని తెలుసుకుని, ఆఖరి ప్రయత్నంగా వాటిని మార్చుకునేందుకు మాజీ ప్రధాని దేవెగౌడను, బ్యాంకు అధికారులను కూడా కలిసి, ప్రయోజనం లేక ఈ వ్యవస్థపై కోపంతో తన కష్టార్జితాన్నంతా నీటి పాలు చేసుకుందని ఆమె తల్లి లక్ష్మీదేవి (70) కంట తడి పెట్టుకున్నారు. -
స్త్రీలోక సంచారం
ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు అనుబంధ సంస్థ ‘ఐ.సి.ఐ.సి.ఐ. సెక్యూరిటీస్’ డైరెక్టర్స్ బోర్డులోకి ఆ బ్యాంకు ఎం.డి., సి.ఇ.వో. అయిన చందా కొచ్చర్ను తిరిగి తీసుకోవడం (రీ–అపాయింట్మెంట్) పై విమర్శలు వస్తున్నాయి. వీడియోకాన్ గ్రూపుతో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ ‘ఇచ్చిపుచ్చుకున్న’ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిర్థారించేందుకు ఈ ఏడాది జూన్లో జస్టిస్ బి.ఎన్.కృష్ణను బ్యాంకు నియమించుకున్న నాటి నుంచీ చందా కొచ్చర్ సెలవులో ఉండగా, ఇప్పుడు ఆమెను మళ్లీ బోర్డులోకి తీసుకోవడం వల్ల బి.ఎన్.కృష్ణ విచారణను తనకు అనుకూలంగా ఆమె ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని బోర్డులోనే కొందరు సభ్యులు బహిరంగంగానే ఆమె çపునర్నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రసిద్ధ పౌర విమానయాన సంస్థ ‘గోఎయిర్’లో పైలెట్గా చేరబోతున్న 31 ఏళ్ల ఇమ్రాన్ హబీబ్.. కశ్మీర్లో తొలి ముస్లిం మహిళా పైలెట్గా రికార్డు సృష్టించబోతున్నారు. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన హబీబ్,, డెహ్రాడూన్లో ఫారెస్ట్రీ డిగ్రీ, ఫారెస్ట్రీలోనే శ్రీనగర్లోని షేర్–ఇ–కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. తన చిన్ననాటి కల అయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి, 2016లో యు.ఎస్. ఫ్లయిట్ స్కూల్లో చేరి, అక్కడ ‘260 ఫ్లయింగ్ అవర్స్’ పూర్తి చేసి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో కమర్షియల్ పైలెట్ కోర్సు చేసి పాసై, అక్టోబర్లో విమానం నడపబోతున్నారు. యువతార జెన్నిఫర్ లారెన్స్తో పాటు, కిర్స్టెన్ డన్స్ట్, కేప్ ఆప్టన్ వంటి అనేకమంది హాలీవుడ్ నటీమణుల నగ్నచిత్రాలను సేకరించి, నెట్లో అప్లోడ్ చేసిన సెలబ్రిటీ హాకర్.. జార్జి గెరఫానోకు బ్రిడ్జిపోర్ట్లోని ఫెడరల్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. విడుదల తర్వాత కూడా గెరఫానో మీద మూడేళ్ల నిఘాకు అదేశించిన కోర్టు.. శిక్షకాలం ముగిశాక అతడు కనీసం 60 గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని కూడా ఉత్తర్వు్యలు జారీ చేసింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో 200 మీటర్ల రేస్లో రజిత పతకం సాధించిన స్ప్రింటర్ ద్యుతీ చంద్కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అదనంగా మరో కోటీ యాభై లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. అంతకు ముందు ఈ ఏషియన్ గేమ్స్లోనే 100 మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ రజితం గెలిచినప్పుడు కోటీ యాభై లక్షల నగదు బహుమతిని ప్రకటించిన పట్నాయక్.. ద్యుతీ టోక్యో ఒలింపిక్స్కి సిద్ధమవడానికి అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళీ చిత్రం నటించిన ప్రియా ప్రకాశ్ వారియన్ అందులోని ‘ఒరు అధార్ లవ్’లోని ఒక పాటలో కన్నుగీటడంపై కేసు వేసిన వారిని తప్పు పట్టిన సుప్రీం కోర్టు.. ప్రియ పైన, ఆ చిత్ర నిర్మాతలపైన దాఖలైన కేసును కొట్టి వేసింది. ‘‘సినిమాలో ఎవరో పాట పాడితే, అందుకు ఎవరో నటిస్తే వారిపై కేసు పెట్టడం తప్ప మీకు ఇంకో పని లేదా?’’ అని ఆ ఎఫ్.ఐ.ఆర్. వెనుక ఉన్న వ్యక్తుల్ని కోర్టు మందలించింది కూడా. కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తున్న ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం షూటింగ్ నుంచి సహ నటుడు సోనూ సూద్.. తన తల మీద క్యాప్ని విసిరికొట్టి, సెట్స్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోవడంతో.. అతడికిక ఆ సినిమాలో చోటు లేనట్టేనని తెలుస్తోంది. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ సూద్.. తనను, ఇతర నటులను సెట్స్లో కంగనా రనౌత్. ఆమె మాటలతో, అహంకారంతో, తలబిరుసుతనంతో పెడుతున్న టార్చర్ను భరించలేకపోతున్నాని చెప్పి మరీ వెళ్లిపోవడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు తప్ప, కంగనను తప్పు పట్టే సాహసం చేయలేకపోయారని ముంబై నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటలీలోని లేక్ కామో లో ఈ ఏడాది నవంబరులో తమ పెళ్లిన ప్లాన్ చేసుకున్న దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్.. పెళ్లి కంటే ముందే, పెళ్లి తర్వాత ముంబైలో ఇచ్చే విలాసవంతమైన రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరూ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ.. అంతా దీపిక ఇష్ట ప్రకారమే జరుగుతోందని రణ్వీర్ సింగ్ చెబుతున్నారు. ప్రముఖ రచయిత్రి, మోడల్, వంట కార్యక్రమాల టీవీ షోల వ్యాఖ్యాత పద్మాలక్ష్మి 48వ పుట్టిన రోజు నేడు. 2004లో ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీని వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్న పద్మ.. వెంచర్ క్యాపిటలిస్ట్ ఆడమ్ డెల్తో, ఐ.ఎం.జి. సిఈవో టెడ్డీ ఫోర్ట్స్మన్తో కొంతకాలం సహజీవనం చేశారు. ప్రస్తుతం కూతురు కృష్ట థియా (తండ్రి డెల్) తో కలిసి ఎక్కువ భాగం యు.ఎస్.లోనే గడుపుతూ టీవీ రియాల్టీ షోల నిర్వహణలో భాగంగా ప్రపంచమంతా పర్యటిస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
వచ్చే ఏడాది మార్చిలో ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో, సమాఖ్యేత దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మూడు దేశాల పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. దక్షిణాఫ్రికా పట్టణం కేప్ టౌన్లోని ఏద్ ఎంకిజే హైస్కూల్ను సందర్శించినప్పుడు, ఆ పాఠశాల పిల్లలతో కలిసి చేసిన నృత్యంపై సోషల్ మీడియాలో వెక్కిరింపులు, విపరీత వ్యాఖ్యలు మొదలయ్యాయి. 61 ఏళ్ల థెరిసా మే.. మనిషి మొత్తం బిగదీసుకుపోయి కాళ్లు, చేతులు మాత్రమే కదుపుతూ రోబోలా డ్యాన్స్ చేశారని, ఓ ఆత్మ నిద్రలోంచి లేచి వచ్చినట్లుందనీ, ఆమె అసలు డ్యాన్స్ చేయకుండా ఉండినా బాగుండేదని ఆమెపై విమర్శలే ఎక్కువగా రాగా, అతి కొద్దిమంది మాత్రం.. పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఉత్సాహం రావడం సహజమే కాబట్టి, థెరిసా మే నృత్యాన్ని సహజమైనదిగా, పసి మనసంత అందమైనదిగా చూడాలని కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఈ ఏడాది మే 19న పెళ్లి రోజు ధరించిన వెడ్డింగ్ గౌన్ను అక్టోబర్ 26 నుంచి జనవరి 6 వరకు బెర్క్షైర్లోని విండ్సర్ పట్టణంలో ఉన్న విండ్సర్ క్యాజిల్లో, వచ్చే జూన్ 14 నుంచి అక్టోబర్ 6 వరకు స్కాట్లాండ్లోని హోలీరూడ్ ప్యాలెస్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వజ్రాలు పొదిగిన ఆ తెల్లటి గౌనుతో పాటు.. పెళ్లికి ప్రిన్స్ హ్యారీ ధరించిన దుస్తులను కూడా పౌరవీక్షణకు ఉంచుతున్నారు. ఒక హాస్యభరిత కార్యక్రమంలో (స్కిట్) మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సతీమణి కొరెట్టా స్కాట్ పాత్రను పోషించి, మార్టిన్పై జోకులు వేసినందుకు తను ఎంతగానో చింతిస్తున్నట్లు అమెరికన్ పాప్ గాయని కార్డీ బీ.. మార్టిన్ కుమార్తెకు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘రియల్ హౌస్వైఫ్స్’ అనే నాలుగు నిమిషాల నిడివి గల ఆ స్కిట్లో 24 ఏళ్ల కార్డీ.. పౌరహక్కుల నాయకుడైన మార్టిన్కు అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లు, అణకువ గల భార్యగా కొరెట్టా స్కాట్ ఆయన్ని సహనంగా భరించినట్లు కథ అల్లడంతో విమర్శలు మొదలై, విషయం అపాలజీ వరకు వెళ్లింది. మయన్మార్ సైన్యం ముస్లిం రోహింగ్యాలపై మారణహోమం జరిపిందని ఐక్యరాజ్య సమితి దర్యాప్తు బృందాలు నివేదిక ఇచ్చినందున.. అందుకు ప్రాయశ్చిత్తంగా ప్రస్తుత మయన్మార్ కౌన్సిలర్, విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఆంగ్ సాన్ సూచీకి తాము 1991లో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కు తీసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ ప్రైజ్ అన్నది.. అది ఫిజిక్స్లో గానీ, ‘పీస్’లో గానీ ఒక వ్యక్తి జరిపిన కృషికి ఇచ్చేదే కానీ.. తిరిగి వెనక్కు తీసుకునేది కాదని, కమిటీలో అలాంటి నియమ నిబంధనలు కూడా ఏమీ లేవని నోబెల్ కమిటీ సెక్రెటరీ ఓలవ్ ఎన్జోల్స్టాండ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్లో ‘ఆనంద’ అనే ఓ ప్రైవేటు టీవీ చానెల్లో పనిచేస్తున్న సుబర్ణ అఖ్తర్ నోడీ అనే 32 ఏళ్ల మహిళా జర్నలిస్టును.. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో నరికి చంపేశారు. తొమ్మిదేళ్ల కూతురుతో ఉంటున్న నోడీ, తన భర్త ఉండి విడాకుల కోసం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తూ ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో కాలింగ్ బెల్ నొక్కి, ఆమె తలుపు తియ్యగానే లోనికి ప్రవేశించిన దుండగులు కత్తితో ఆమెను నరికి చంపేయడం వెనుక ఆమె భర్త హస్తం ఉండివుండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో కొత్తగా తెర చిన ఒక బేకరీకి ‘యాన్ అండ్ ఫ్రాంక్’ అనే పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ వెంటనే ఆ పేరును మార్చాలని ఒత్తిడి తేవడంతో.. ఆశ్చర్యానికి లోనైన రోబెర్టో అనే ఆ బేకరీ యజమాని.. ‘‘యాన్ ఫ్రాంక్ నివసించిన ఇంటికి సమీపంలో మా షాపు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. ఇందులో తప్పేమిటో నాకు అర్థం కాలేదు కనుక నా బేకరీ పేరును మార్చాలని నేను అనుకోవడం లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల చేత చిక్కి, నిర్బంధ శిబిరంలో టైఫాయిడ్తో ప్రాణాలు కోల్పోయిన సాహస బాలిక ప్రపంచంలోనే ఎంతోమందికి అభిమాన కథానాయిక.. అలాగే నాక్కూడా’’ అని రోబెర్టో కరాఖండిగా చెప్పేశారు. కరుణానిధి భార్య.. 80 ఏళ్ల దయాళు అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గోపాలపురం నివాసంలో ఉంటున్న అమ్మాళ్కు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. అమె ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయంపై మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. 86 ఏళ్ల వయసులో 2005 అక్టోబర్ 31న మరణించిన నవలా రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ వ్యాసకర్త అయిన అమృతాప్రీతమ్ జయంతి నేడు. 1919 ఆగస్టు 31న ఢిల్లీలో జన్మించి, తొలి పంజాబీ కవయిత్రిగా ప్రసిద్ధురాలైన అమృత.. జ్ఞానపీuŠ‡తో పాటు, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ, పద్మ విభూషణ్, శతాబ్ది సమ్మాన్ అవార్డులను పొందారు. -
స్త్రీలోక సంచారం
ఏషియన్ గేమ్స్లో 50 కేజీల డివిజన్లో బంగారు పతకం గెలిచుకుని ఇండియా తిరిగొచ్చిన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్కు, శనివారం విమానం దిగడంతోనే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమె 24వ జన్మదినోత్సవం నాడే రెండు కుటుంబాల సమక్షంలో చిరకాల స్నేహితుడైన ‘గ్రెకో–రోమన్’ స్టెయిల్ జాతీయ రెజ్లర్ సోమ్వీర్ రాథీతో నిశ్చితార్థం జరిగింది. జావెలీన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో వినేశ్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తున్న వదంతులు ఈ నిశ్చితార్థంతో ఆగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వదంతుల్ని ఆపడం కోసమే ఈ నిశ్చితార్థం జరిగిందన్నా అన్న ప్రశ్నకు వినేశ్ నవ్వుతూ, ‘‘ప్రతి బర్త్డే ముందూ ఏదో ఒక ఈవెంట్లో నేను ఓడిపోవడం జరుగుతోంది. అనేక ఎదురుచూపుల తర్వాత దక్కిన ఈ అపురూపమైన విజయానికి నా జీవితంలోని మరొక అపురూపమైన సందర్భాన్ని జత చేయాలనుకుని నా ఫ్రెండ్ సోమ్వీర్, నేను పెద్దల అంగీకారంతో ఉంగరాలు మార్చుకున్నాం’’ అని చెప్పారు. పెద్దగా హానికరం కానివి అయిన నాలుగు ఇన్ఫెక్షన్లు.. టాక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగాలోవైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్.. గర్భిణుల విషయంలో మాత్రం ప్రాణాంతకంగా పరిణమించి గర్భస్రావాలకు, శిశువులో పుట్టుక లోపాలకు, మృత శిశువులు జన్మించడానికి కారణం అవుతున్నాయని హైదరాబాద్లోని ప్రిన్సెస్ ఎస్రా హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని మైక్రోబయోలజీ విభాగం నుంచి ఒక బృందం, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ లోని ఫార్మాస్యూటికల్ మైక్రోబయోలజీ నుంచి ఒక బృందం కలిసి చేసిన అధ్యయనంలో పై నాలుగు వైరస్ల వల్ల చిన్న ప్రాణానికంటే పెద్ద ప్రాణానికే ఎక్కువగా ముప్పు వాటిల్లుతున్న విషయం బయటపడింది! పదేళ్ల క్రితం 2007 డిసెంబరులో విజయవాడలో జరిగిన 19 ఏళ్ల బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో.. ట్రయల్ కోర్టులో భద్రపరిచిన ఆమె ఒంటి మీది బట్టలు, ఇతర ధారణలు (సంఘటన జరిగిన రోజువి).. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దోషులు పైకోర్టుకు అప్పీల్ చేసుకోడానికి ముందే పాడైపోయాయని ఆయేషా తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నాలుగు వారాల లోపు తమకు సమర్పించాలని ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ని ఆదేశించింది. ట్రయల్ కోర్టు సత్యంబాబు అనే యువకుడిని దోషిగా నిర్ధారించడంలో ఏకపక్షంగా వ్యవహరించిందని అభిప్రాయపడుతూ ఆ తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు, అప్పటికి పదేళ్లుగా జైల్లో ఉన్న సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన అనంతరం ఈ కేసు విచారణ ‘సిట్’ పరిధిలోకి వెళ్లింది. దావూదీ బోరా’ కమ్యూనిటీలో ఉన్న ‘ఫిమేల్ జెనిటల్ సర్కమ్సిషన్’ (బాలికల జననాంగానికి చేసే సున్తీ) ఆచారాన్ని నిషేధించాలని కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యానికి (పిల్) వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మాజీ అటార్నీ జనరల్ దివంగత గూలమ్ ఇ.వాహనవతి భార్య నఫీసా వాహనవతి తన మద్దతు ప్రకటించారు! ఈ విషయమై నఫీసా తరఫు న్యాయవాది మీనాక్షీ అరోరా.. సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. ఫిమేల్ జనిటల్ సర్కమ్సిషన్ అంటే క్లిటారిస్ను కత్తిరించడం అని ‘పిల్’లో పేర్కొన్నారనీ, నిజానికి అది క్లిటారిస్ పైన ఉండే చర్మాన్ని తొలగించడం మాత్రమేనని వివరించారు. మయన్మార్లోని 30 పోలీస్ స్టేషన్ల పైన, ఒక సైనిక స్థావరం మీద ‘అరహన్ రొహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ దాడులు జరిపినందుకు ప్రతీకారంగా గత ఏడాది ‘రోహాన్’ రాష్ట్రంలోని రొహింగ్యాలపై ప్రభుత్వ దళాలు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కాపాడు కోవడం కోసం పారిపోయి.. చెట్టుకొకరు పుట్టకొకరు అయిన 7 లక్షల మంది శరణార్థులలో వేలాదిమంది యువతులు, మహిళలు, బాలికలు.. అత్యాచారాలకు, లైంగిక హింసలకు గురై దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి దర్యాప్తు బృందాలు తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ మారణహోమాన్ని ఉద్దేశపూర్వకంగా నివారించలేకపోయిన మయన్మార్పై ఆంక్షలు విధించడంతో పాటు.. ఆ దేశాన్ని అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి ఈడ్చాలని కూడా యు.ఎన్. దర్యాప్తు నివేదిక.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సూచించింది. స్త్రీల అణచివేత ఉన్న వాతావరణంలో కన్నా.. స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వం ఉన్న చోట్లే ఎక్కువగా మహిళల నుంచి సెక్సీ సెల్ఫీలు ఆన్లైన్లో పోస్ట్ అవుతున్నట్లు ‘నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో వచ్చిన ఒక అధ్యయన వ్యాసం వెల్లడించింది. స్త్రీ సౌందర్యీకరణ ఉన్న చోట స్త్రీ సాధికార త సాధ్యం కాదనే అభిప్రాయానికి భిన్నంగా తమ అధ్యయన ఫలితాలు ఉన్నట్లు చెబుతూ, ఇందుకోసం 113 దేశాలలోని వేలాది సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన మీదట ఒక ఈ విధమైన ముగింపునకు వచ్చామని అధ్యయనానికి సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్స్ ప్రొఫెసర్ ఖండిస్ బ్లేక్ ఆ వ్యాసంలో రాశారు. సుసాన్ అనే కెనడియన్ వధువు, ముందుగా తను కోరినప్పటికీ ఎవరూ తన పెళ్లికి నగదు బహుమతి పంపించనందుకు కలత చెంది, పెళ్లిని రద్దు చేసుకుని, ఆ విషయాన్ని ఫేస్బుక్లో ఎంతో ఎమోషనల్గా పోస్ట్ చేసింది. ‘‘అందరూ వినండి. మీరు తగినన్ని నగదు బహుమతులు ఇవ్వకుంటే మా.. నవ జీవితం ఎలా ప్రారంభం అవుతుంది? అందుకే నేను, నా చిన్ననాటి స్నేహితుడైన వరుడు ఈ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాం. ఇందుకు పూర్తిగా బాధ్యత వహించవలసింది మీరే’’ అంటూ ఆమె ఆ సుదీర్ఘమైన పోస్టును ముగించింది. ‘వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి’ అనే టైటిల్తో ప్రారంభమైన హారర్, కామెడీ తెలుగు చిత్రంలో రాయ్ లక్ష్మి.. సెక్సీ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నారు. లక్కీ లక్కీ రాయ్ (బలుపు), తౌబా తౌబా.. (సర్దార్ గబ్బర్ సింగ్), అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెం. 150) పాటలతో యువతరాన్ని డాన్స్ చేయించిన రాయ్ లక్ష్మి.. ఇప్పుడీ కొత్త సెక్సీ పాత్రలో ఒక అంతర్లీన సందేశాన్ని కూడా యూత్కి ఇవ్వబోతున్నారట. -
స్త్రీలోక సంచారం
ఐర్లండ్లోని ప్రార్థనాస్థల నివాస ప్రాంగణాలలో, అనాధ ఆశ్రమాలలో, మతపరమైన విద్యాలయాలలో దశాబ్దాలుగా జరుగుతున్నట్లు వచ్చిన లైంగిక అకృత్య ఆరోపణలపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్.. డబ్లిన్లో కొందరు బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని.. వారిని, వారి తల్లులను క్షమాపణ వేడుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐర్లండ్ వచ్చిన ఫ్రాన్సిస్.. పర్యటన ముగింపు కార్యక్రమంగా డబ్లిన్లోని ఫీనిక్స్ పార్క్లో కనీసం లక్షమంది హాజరైన బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘క్యాథలిక్ మత విలువలు, విశ్వాసాలు పరిఢవిల్లిన ఒకప్పటి ఐర్లండ్లో ఈ విధమైన క్షీణతను జీర్ణించుకోలేకపోతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆగస్టు 26న జరిగిన ఎనిమిదవ ఫుల్, హాఫ్ మారథాన్లలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనగా, వారిలో జయంతి సంపత్కుమార్ అనే మహిళ.. చీరలో 42 కి.మీ పరుగులు తీసి ప్రత్యేక స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెండు మారథాన్ల కోసం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 3 వేల మంది రన్నర్లతో కలిపి మొత్తం 22 వేల మంది పాల్గొన్న 42,195 కి.మీ ఫుల్ మారథాన్ మహిళల గ్రూపులో కెన్యా యువతి పాస్కలియా చెప్కాచ్, జ్యోతి గౌహతి, సీమ మొదటి మూడు స్థానాల్లో నిలవగా, 21,095 కి.మీ. హాఫ్ మారథాన్లో స్వాతీగద్వే, వర్షాదేవీ, నవ్యా వడ్డె కొన్ని నిమిషాల వ్యత్యాసంతో తొలి మూడు స్థానాలు గెలుచుకున్నారు. ‘టాసా’ (తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా) ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్లోని టాసా ప్రధాన కార్యాలయంలో ‘ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ (అవ్వ) వీక్.. వేడుకలు జరిగాయి. సైన్యంలో పని చేస్తున్న వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న ఇతరుల సంక్షేమం కోసం ఢిల్లీలో 1966 ఆగస్టు 23 న ఈ సంస్థ ఆవిర్భవించిన నాటి నుండీ జరుగుతున్న ఈ ‘అవ్వ’ వీక్.. ఈ ఏడాది థీమ్ (‘ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ సోల్జర్’) కి అనుగుణంగానే తన కార్యక్రమాలు రూపొందించుకుంది. హార్ట్ సర్జరీ కోసం ఫ్రాన్స్కు వెళుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (80) ను ఆమె ఇంటికి వెళ్లి మరీ పరామర్శించిన ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆమె చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ నిమిత్తం వైద్యుల సలహా మేరకు ఫ్రాన్స్లోని లీల్ ప్రాంతంలో ఉన్న ‘యూనివర్సిటీ హాస్పిటల్’లో షీలా దీక్షిత్ అడ్మిట్ అవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చూసుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. స్త్రీశక్తి పాత్రలకు ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్ (59), తన 18 ఏళ్ల కుమార్తె గయా వైజ్ గత ఏడాది లండన్ అండర్గ్రౌండ్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ విధంగా లైంగిక వేధింపునకు గురైందో ‘సన్’ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, ‘‘అంతమంది మధ్యలో ప్రయాణిస్తున్నప్పటికీ, తనపై చేతులు వేసినవాడికి భయపడటం తప్ప, వాడినేమీ అనలేకపోవడమే నా కూతుర్ని చాలాకాలం పాటు బాధించింది’’ అని తెలిపారు. ‘‘వేధింపునకు గురైన స్త్రీకి ఆ వేధింపు కన్నా కూడా, ‘ఎందుకిలా చేస్తున్నావ్?’ అని అడగలేకపోవడం, తిరిగి మాటకు మాట అనలేకపోవడమే పెద్ద అవమానం’’ అని భావించిన తన కూతురు ఆ ఘటనను మర్చిపోవడానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చిందని చెప్పిన ఎమ్మా.. మతపరమైన విశ్వాసాల కారణంగా రక్తమార్పిడికి తిరస్కరించిన ఒక చిన్నారి చుట్టూ అల్లిన కథాంశంతో ‘చిల్డ్రన్ యాక్ట్’ అనే చిత్రంలో త్వరలోనే నటించబోతున్నారు. చైనాలో కార్ పూలింగ్ సర్వీస్కు ప్రఖ్యాతిగాంచిన ‘దీదీ చాషింగ్’.. గతవారం రైడ్–షేరింగ్ సర్వీస్లో ఒక ప్రయాణీకురాలిపై అత్యాచారం, ఆ పై ఆమె హత్య జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణం తమ సేవలన్నీ రద్దు చేయడమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్ను, వైస్ ప్రెసిడెంట్ను ఆ పదవుల నుంచి తొలగించింది. అనంతరం, కార్పూలింVŠ సర్వీసులో మహిళల భద్రతా ప్రమాణాలపై చైనా పోలీస్, రవాణా శాఖలకు వివరణ ఇస్తూ, ఆ శాఖల ఆదేశం మేరకు సెప్టెంబర్ 1 కల్లా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సేవలను పునఃప్రారంభిస్తామని తెలిపింది. దేశద్రోహ నేరారోపణపై రెండేళ్ల క్రితం 2016 ఏప్రిల్ 3న టెహ్రాన్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి, ఐదేళ్ల శిక్ష విధించి, అక్కడి ఎవిన్ జైల్లో పెట్టిన ‘థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ (బ్రిటన్) ప్రతినిధి, బ్రిటన్ సంతతి ఇరాకీ మహిళ.. నజానిన్ జఘారి రాట్క్లిఫ్కు అనూహ్యంగా మూడు రోజుల ‘విముక్తి’ని ప్రసాదించి, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏమాత్రం పొడిగింపు లేకుండా తిరిగి ఆమెను అరెస్టు చేయడంపై ఆమె పేరుతో ట్విట్టర్లో ఉన్న ‘ఫ్రీ నజానిన్’ అకౌంట్లో దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. ప్రభుత్వం ఇచ్చిన విరామ సమయంలో నజానిన్ తన నాలుగేళ్ల కూతురు గాబ్రియేలాను ఎత్తుకుని ఉల్లాసంగా ఉన్న ఫొటోను ట్విట్టర్లో చూసిన వారు భావోద్వేగాలకు లోనై, నజానిన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నట్లు ఆమె భర్త రిచర్డ్ రాట్క్లిఫ్ ట్విట్టర్లో ఆవేదనగా ఒక కామెంట్ను పోస్ట్ చేశారు. గర్భం వచ్చిన తొలి వారాలలో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కోరుకునేవారు ఇక నుంచి ఇంట్లో కూడా ‘అబార్షన్ పిల్’ వేసుకునేందుకు అనుమతించే కొత్త చట్టం ఒకటి ఇంగ్లండ్లో ఈ ఏడాది ఆఖరులో అమలులోకి రానుంది. ప్రస్తుతం పదో వారం లోపు అబార్షన్ చేయించుకునేందుకు చట్టపరమైన ఆమోదం ఉన్న ఇంగ్లండ్లో.. అబార్షన్ను క్లినిక్లో మాత్రమే 24 నుంచి 48 గంటల మధ్య విరామంతో వేసుకోవలసిన రెండు పిల్స్తో చేస్తుండగా, మొదటి పిల్ వేసుకున్న తర్వాత, ఇంటికి వెళ్లిపోయి, రెండో పిల్ కోసం మళ్లీ క్లినిక్కు వెళ్లే సమయంలో దారి మధ్యలో గర్భస్రావం జరిగేందుకు ఉన్న ప్రమాదాన్ని ఈ ‘హోమ్ పిల్’ తో నివారించవచ్చునని కొత్త చట్టాన్ని సమర్థించేవారు అంటున్నారు. -
స్త్రీలోక సంచారం
గర్భిణులలో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని ఇటీవలి ఒక సర్వేలో వెల్లడైన నేపథ్యంలో రక్తహీనతపై గురువారం హైదరాబాద్లో ఏర్పాటైన ఒక సదస్సులో.. పొట్టు తియ్యని ధాన్యంతో చేసిన పల్చటి, మృదువైన ఆహారాన్ని.. చిన్నప్పటి నుంచే (మొదటి ఆరు నెలలు తల్లి పాలు పట్టించాక.. ఆ తర్వాతి నుంచీ) శిశువులకు అలవాటు చేస్తే పెద్దయ్యాక రక్తలేమి ఏర్పడే అవకాశాలు తక్కువవుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పాల్గొన్నవారిలో గైనకాలజిస్టులు, ఆబ్స్టెట్రీషియన్లు, హెమటాలజిస్టులు, పీడియాట్రీషియన్లు, సాధారణ వైద్యులతో పాటు పోషకాహార నిపుణులు కూడా ఉన్నారు. సైమోన్ అనే 93 వృద్ధురాలిని ఆమె పుట్టినరోజు అయ్యీ కాగానే, పోలీసులు ఇంటికొచ్చి మరీ అరెస్టు చేసి తీసుకెళ్లిన ఘటన యు.ఎస్.లోని మేన్ రాష్ట్రంలో జరిగింది. టీవీలో వచ్చే ‘కాప్స్’ సీరియల్కు ఇన్స్పైర్ అయిన తన తల్లి సైమోన్.. అరెస్టు అయితే ఎలా ఉంటుందో అనుభూతి చెందాలని ఉందని, అలాంటి అనుభూతిని తనకు పుట్టిన రోజు కానుకగా ఇవ్వమని అడగడంతో తనే పోలీసులకు చెప్పి, వారి సహృదయ పూర్వకమైన సహాకారంతో ఆమెను అరెస్టు చేయించానని సైమోన్ కూతురు యాన్ డ్యూమంట్ తెలిపారు! ఒరిజినల్ తెలుగు చిత్రం ‘సమ్మోహనం’తో ఈ ఏడాదే టాలీవుడ్లోకి ప్రవేశించిన బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరీ ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో పుట్టి, ఢిల్లీలో చదివి, సినిమాల కోసం ముంబై వచ్చిన ఈ గాయని (మొదట గాయనే) తనకు హైదరాబాద్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ, తనకిక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు హోమ్లీగా ఉంటుందని అన్నారు. -
స్త్రీలోక సంచారం
50 మీటర్ల మహిళల బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్లో ఇప్పటి వరకు ఉన్న 27 సెకన్ల ప్రపంచ రికార్డును.. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఏషియన్ గేమ్స్’లో 26.98 సెకన్లలో బ్రేక్ చేసిన 21 ఏళ్ల ల్యూ జియాంగ్.. చైనా దేశపు కొత్త ‘అందాల దేవత’గా అవతరించారు. ల్యూ జియాంగ్కి ప్రపంచంలోని టాప్ మోడల్స్లో ఒకరైన చైనా అందాల రాశి ల్యూ వెన్తో దగ్గరి పోలికలు ఉండడంతో.. ‘వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కాదు కదా’ అంటూ ఆ దేశపు యువకులు.. ల్యూ జియాంగ్ బంగారు పతకం సాధించిన మరుక్షణం నుంచే ఆమెను ‘స్విమ్మింగ్ గాడెస్’గా ఆరాధించడం మొదలుపెట్టారు! ఏషియన్ గేమ్స్లో గత ఇరవై ఏళ్లుగా మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం కోసం నిరీక్షిస్తూ ఉన్న జపాన్ టీమ్.. 3–1 తేడాతో చైనాపై విజయం సాధించి వరుసగా గత ఐదు ఏషియన్ గేమ్స్లో విజేతగా నిలుస్తూ వస్తున్న చైనా జైత్రయాత్రను బ్రేక్ చేసింది! చైనాను ఆరవ టైటిల్ గెలవనివ్వకుండా చేసిన ఈ టీమ్ గేమ్లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరా కీలక పాత్ర పోషించారు. కెనడా మహిళ ఒకరు.. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వాగ్వాదంలో ప్రవాస భారతీయుడైన రాహుల్ కుమార్ అనే వ్యక్తిని.. ‘‘పెంట మొహమోడా! నీ దేశానికి వెళ్లిపో. వెళ్లిపోరా దౌర్భాగ్యుడా.. పాకీ వాడా’’ (లూజర్, షిట్–కలర్డ్ స్కిన్, పాకీ.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ) అని దూషించడం వివాదం అయింది. దీనిపై అక్కడి సి.టీవీ ప్రతినిధి.. ఆ మహిళతో.. ‘‘ఇవి జాతి, వర్ణ వివక్షలతో కూడిన వ్యాఖ్యలు కదా’’ అన్నప్పుడు.. ‘‘కోపంలో అలా అనేశాను తప్ప, నాకెలాంటి వివక్షలూ లేవు’’అని ఆమె సమాధానమిచ్చారు. గుక్క పట్టి ఏడుస్తున్న ఒక పసిబిడ్డకు చనుబాలిచ్చి ఊరడించిన సెలెస్ట్ జాక్వెలీన్ అయాలా అనే సాధారణ పోలీసుకు అర్జెంటీనా ప్రభుత్వం పోలీసు అధికారిగా పదోన్నతి కల్పించింది. గస్తీ విధుల్లో భాగంగా జాక్వెలీన్.. తన వాహనంలో బెరిసో ప్రాంతంలోని ఆసుపత్రి సమీపానికి వచ్చినప్పుడు పౌష్టికాహార లేమితో ఆకలికి ఏడుస్తున్న బిడ్డ ఏడుపు వినిపించి, అక్కడికి వెళ్లి, ఆ ఏడుస్తున్నది.. తల్లి వదిలేసి వెళ్లిన బిడ్డ అని తెలుసుకుని, ఆసుపత్రి అధికారుల అనుమతితో ఆ బిడ్డకు తన స్థన్యం ఇచ్చి ఆకలి తీర్చడం స్థానికుల అభిమానానికి, పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలకు ఆమెను పాత్రురాలిని చేసింది. నిండు గర్భిణి అయిన న్యూజిలాండ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి జూలీ యాన్ జెంటర్.. గత ఆదివారం పురుటి నొప్పులు వస్తుండగా తనే స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎలాంటి హడావిడీ, అధికార ఆర్భాటమూ లేకుండా, నొప్పులొస్తున్నప్పుడు గర్భిణికి ఉండే సర్వసాధారణమైన భయాన్ని కూడా కనబరచకుండా ఆదర్శంగా నిలిచిన ఒక మంత్రి తనొక్కరే, అదికూడా సైకిల్ మీద పెడలింగ్ చేస్తూ వెళ్లి ఆసుపత్రిలో చేరడం ఆ దేశంలో ఇప్పుడొక విశేషం అయింది. జెన్ సదావర్తె అనే పదేళ్ల బాలిక చూపిన సమయస్ఫూర్తి.. ముంబై దాదర్ ప్రాంతంలోని 17 అంతస్తుల నివాస భవనం ‘క్రిస్టల్ టవర్స్’లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి అనేకమందిని కాపాడగలిగింది. డాన్ బాస్కో స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న జెన్.. మూడో తరగతిలో ఉండగా స్కూలు ప్రాజెక్టులో తను నేర్చుకున్న టిప్స్ కొన్నింటిని (ఉదా: దూది, నీళ్లు, గుడ్డ ముక్కలతో ప్యూరిఫయర్లను తయారు చేసి చుట్టూ ఉన్న వాళ్లకు ఇవ్వడం) గుర్తుపెట్టుకుని తాము ఉంటున్న 16ల అంతస్తులో ఉన్నవారందరికీ అందించడం ద్వారా మృతుల సంఖ్యను నాలుగుకు, గాయపడిన వారి సంఖ్యను పదహారుకు పరిమితం చేయగలిగింది. నాలుగేళ్ల క్రితం.. 86 ఏళ్ల వయసులో జనవరి 13న గుండెపోటుతో మరణించిన తెలుగు సినీ నటీమణి అంజలీదేవి జయంతి నేడు. 1927లో ఇదే రోజు పెద్దాపురంలో ఆమె అంజనీకుమారిగా జన్మించగా, సినిమాల్లోకి వచ్చాక దర్శకులు పి. పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు. సంగీత దర్శకులు, నిర్మాత, గీత రచయిత అయిన పి.ఆదినారాయణ రావు ఆమె భర్త. అంజలీదేవి దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించగా.. అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి.. వంటి చిత్రాలు ఆమెకు అవార్డులను తెచ్చిపెట్టాయి. ూ ఇంట్లో ఒక్కతే ఉన్న గర్ల్ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు.. బయటికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఆకస్మాత్తుగా తిరిగి రావడంతో, తనకు వేరే దారిలేక ఆ గర్ల్ఫ్రెండ్ బట్టల బీరువాలో దాక్కుని తలుపు వేసుకున్నానని, అయితే.. వస్తున్న తుమ్మును తను ఆపుకోలేకపోవడంతో గుట్టు బట్టబయలు అయినప్పటికీ, తన వినయ విధేయతలు వారికి నచ్చడంతో తనను ఏమీ అనలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘స్త్రీ’ (ఇందులో సల్మాన్ నటించలేదు) ప్రమోషన్ షోలో భాగంగా ఆ చిత్రం హీరో హీరోయున్లు రాజ్కుమార్రావ్, శ్రద్ధాకపూర్లతో పై సంఘటనను సల్మాన్ఖాన్ షేర్ చేసుకున్నారు. -
స్త్రీలోక సంచారం
ఇండోనేషియాలోని జకార్తాలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్కి అర్హత పొందినప్పటికీ ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎ.ఎఫ్.ఐ.) తనను ఎంపిక చెయ్యకపోవడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఉత్తరప్రదేశ్ మిడిల్–డిస్టెన్స్ రన్నర్ మోనికా చౌదరికి ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్లో అర్హత కోసం గువాహతిలో జరిగిన ఇంటర్స్టేట్ మీట్లో రజత పతకాన్ని పొందినప్పటికీ మీట్ మధ్యలో జ్వరపడి తేరుకున్న కారణంగా తనను ఏషియాడ్కు పంపే క్రీడాకారుల జాబితా నుంచి తొలగించడంతో ఆవేదన చెందిన మోనికా.. కోర్టు తనకు ట్రయల్గా మళ్లీ ఒక పోటీ పెట్టి తన సామర్థ్యం నిరూపించుకోడానికి బుధవారం నాడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక అవకాశం ఇవ్వాలని ఎ.ఎఫ్.ఐ.కి సూచించడంతో భూటన్లో తనిప్పుడున్న నేషనల్ క్యాంప్ నుంచి హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ కూతురు, ఇరవై ఏళ్ల మోడల్, నటì .. పారిస్ జాక్సన్.. ‘హార్పర్ బజార్’ పత్రిక (సింగపూర్ ఎడిషన్) సెప్టెంబర్ సంచిక ముఖచిత్రంగా ప్రత్యక్షమవడంపై ఆ దేశంలోని ఎల్.జి.బి.టి. హక్కుల ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెనొక ‘కపటి’గా అభివర్ణించడంతో పారిస్ జాక్సన్ క్షమాపణలు చెప్పి, ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన ఆ ముఖచిత్రం ఫొటోలను తొలగించారు. ‘బైసెక్సువల్’ (స్త్రీ,పురుషులిద్దరి ఆకర్షణకూ లోనయ్యే వ్యక్తి) అయిన పారిస్ హిల్టన్.. గే హక్కుల ఉద్యమకారిణి అయి ఉండి కూడా, సేమ్ సెక్స్ ‘భావ’బంధాలను నేరంగా పరిగణించే సింగపూర్ దేశం నుండి వెలువడిన హార్పర్ బజార్ పత్రికకు మోడలింగ్ చెయ్యడంపై విమర్శలు రావడంతో.. తను మరీ అంత లోతుగా అంతగా ఆలోచించలేదని, ఫ్యాషన్పై తనకున్న ఇష్టంతోనే కవర్ పేజీ మోడలింగ్కి అంగీకరించానని వివరణ కూడా ఇచ్చారు. 76 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూసిన ప్రముఖ అమెరికన్ సింగర్, పియానిస్టు అరెథా ఫ్రాంక్లిన్ నివాళి సందర్భంగా ఎం.టి.వి. వీడియో మ్యూజిక్ అవార్డు ఫంక్షన్లో మాట్లాడుతూ పాప్ స్టార్ మడోన్నా.. ఆ పెద్దావిడకన్నా కూడా తన గురించే ఎక్కువగా చెప్పుకున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై మడోన్నా స్పందిస్తూ, ‘‘నిజానికది అరెథా నివాళి కార్యక్రమం కాదని, ‘వీడియో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ప్రకటించే వేడుకలో నిర్వాహకులు తనను అరెథాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకోమని అడగడంతో తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి రెండు నిముషాల్లో ముగించలేకపోయానని’’ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. కేరళ వరద బాధితులను టీవీలో చూసి చలించిన 12 ఏళ్ల తమిళనాడు బాలిక అక్షయ.. రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే తన హార్ట్ సర్జరీ కోసం సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు సేకరించిన 20 వేల రూపాయలలోంచి ఐదు వేల రూపాయలను కేరళకు విరాళంగా అందజేసింది! కరూర్ జిల్లా కుమారపాళ్యంలో తల్లితో పాటు ఉంటున్న అక్షయ.. ఆరేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోగా, ఆమె తల్లి జ్యోతిమణి.. కూతురి గుండె జబ్బుకు వేరే ఆర్థిక ఆసరా లేక.. నవంబరులో జరగవలసిన ఆమె సర్జరీ కోసం తెలిసినవాళ్ల ద్వారా అనేక మార్గాల్లో దాతల్ని ఆశ్రయిస్తోంది. ఉత్తరకాశిలో గతవారం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా స్పందించిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న నేరాలను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాగల 48 గంటల్లో శాశ్వత ప్రాతిపదికపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలాగే ఉత్తరకాశి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణను ప్రభుత్వం తక్షణం ‘సిట్’కు అప్పగించాలని, ‘సిట్’ నాలుగు వారాల్లోపు ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేయాలని ఆదేశించింది. బిహార్. భోజ్పూర్ జిల్లాలో బిమలేశ్ అనే 16 ఏళ్ల దామోదర్పూర్ గ్రామ విద్యార్థి, పన్నెండవ తరగతిలో చేరేందుకు దగ్గర్లోని బిహియా గ్రామానికి వెళ్లి, అక్కడి రెడ్ లైట్ ఏరియాలో.. మర్మావయవాల దగ్గర తీవ్ర గాయాలతో నిర్జీవంగా పడి ఉన్న ఘటనలో అక్కడి ఒక మహిళను అనుమానించి, ఆమెను నగ్నంగా ఊరేగించిన మూక ఘటనలో ఆర్.జె.డి. (రాష్ట్రీయ జనతా దళ్) కార్యకర్త సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతున్నప్పుడు సమయానికి వెళ్లి నిరోధించలేకపోయిన ఆరుగురు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ఆఖరి నిముషంలో ప్రాజెక్టు నుండి తప్పుకున్నందుకు ప్రియాంకా చోప్రాపై ‘భారత్’ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఆగ్రహంతో ఉన్నారని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అలీ నోరు విప్పారు. ‘‘ఆమె నా స్నేహితురాలు. తనపై నాకేం కోపం లేదు. ఆమె చేసిన పనికి బాధా లేదు. ‘భారత్’ సినిమా నుంచి చివరి నిముషంలో ప్రియాంక తప్పుకోవడం వల్ల టీమ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ, తను తప్పుకోడానికి ప్రియాంక చెప్పిన కారణాలన్నీ సబబుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ముఖేష్ ఛబ్రా డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ ‘ట్రాజీకామెడీ’ ఫిల్మ్.. ‘కీజీ అవుర్ మ్యానీ’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోడానికి హీరో సుశాంత్ సింగ్ రాజ్పు™Œ .. ఆ సినిమా హీరోయిన్ (ఫీల్డులోకి కొత్తగా వచ్చిన అమ్మాయి) అయిన సంజనా సంఘీతో మితిమీరిన చనువు ప్రదర్శించడమే కారణం అని తెలుస్తోంది. గత నెలలో జంషెడ్పూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సుశాంత్ ‘ఎక్స్ట్రా–ఫ్రెండ్లీ’ ప్రవర్తనకు అసౌకర్యానికి గురయిన సంజనా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారని, వెంటనే వారు ‘నీకు ఇష్టమైతేనే చెయ్యి’ అనడంతో.. అప్పట్నుంచీ ఆమె షూటింగ్కి అందుబాటులో లేరని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
నటుడిపై నటి లైంగిక దాడి!
ఏడాది క్రితం హాలీవుడ్ దిగ్గజ నిర్మాత హార్వీ వైన్స్టీన్ లైంగిక అకృత్యాలపై తొలిసారి నోరు మెదిపి, ‘మీ టూ’ అనే ఒక మహోద్యమానికి ఆద్యులుగా నిలిచినవారిలో ఒకరైన ఇటాలియన్ నటి, డైరెక్టర్ ఏషియా అర్జెంటో ఇప్పుడు తనే స్వయంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఇంకో రెండు నెలల్లో 17వ పుట్టినరోజు జరుపుకోబోతాడనగా.. నటుడు, టీనేజ్ మ్యుజీషియన్ అయిన జిమ్మీ మెనెట్ను అప్పటికి 37 ఏళ్ల వయసులో ఉన్న ఏషియా అర్జెంటో 2013 మే 9న కాలిఫోర్నియాలోని ఒక హోటల్ గదిలో లైంగికంగా వేధించి, అతడిపై అత్యాచారం జరపడమే కాకుండా, అందుకు ప్రతిఫలంగా అతడికి 3,80,000 డాలర్లను (సుమారు 2 కోట్ల 64 లక్షల76 వేల 500 రూపాయలు) ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై న్యూయార్క్ మీడియాలో అకస్మాత్తుగా ఇప్పుడు వరుస కథనాలు మొదలయ్యాయి. అయితే, నటుడు జిమ్మి బానెట్పై తాను లైంగిక దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఏషియా అర్జెంటో ఖండించారు. బానెట్ ఆర్థిక కష్టాల్లో ఉండటంతో వాటినుంచి గట్టెక్కించేందుకే అతనికి తన భాగస్వామి ఆంటోనీ బౌర్డెయిన్ ఆర్థిక సహకారాన్ని అందజేసినట్టు ఆమె తెలిపారు. ఒంట్లో ఇనుప ధాతువు లోపం వల్ల ఏర్పడే రక్తహీనత (అనీమియా) గర్భిణులలో.. అది కూడా 20–30 ఏళ్ల వయసు గర్భిణులలో బాగా ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్లోని వి.ఆర్.కె. ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ల వైద్యులు కలిసి జంటనగరాలలోని ప్రసూతి ఆసుపత్రులకు వచ్చే గర్భిణులపై నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. కాన్పునకు కాన్పునకు మధ్య తగినంత ఎడం లేకపోవడం, పెద్దగా చదువుకుని ఉండకపోవడం; స్త్రీ, పురుష అసమానతలు, పౌష్టికాహార లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి.. వీటన్నిటి కారణంగా గర్భిణులు రక్తహీనతకు గురవుతున్నారని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీప్రొడక్షన్, కాంట్రాసెప్షన్, ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ’లో ప్రచురితం అయిన ఈ సర్వే వివరాలను బట్టి తెలుస్తోంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ కుమార్తె అనితాబోస్ ఫ్యాఫ్.. తన తండ్రి అస్థికల్ని భారత్కు తెప్పించాలని ఇండియా, జపాన్ దేశాలకు పునర్విజ్ఞప్తి చేశారు. 1945 ఆగస్టు 18న తైవాన్ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం తన తండ్రి అస్థికలు 1945 సెప్టెంబరు నుండీ టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉండిపోయాయని గుర్తు చేస్తూ, స్వాతంత్య్రం వచ్చాకే తిరిగి తన జన్మభూమిలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించిన తన తండ్రి.. ఆ ఆకాంక్ష నెరవేరకుండానే చనిపోయినందున, ఆయన అస్థికలనైనా ఇండియాకు తెప్పించడం ఆయన ఆత్మకు శాంతినిస్తుందని అనితాబోస్ రెండు దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. కేరళ వరదల్లో కడలుండి నదీ తీరంలో ఉన్న ఇళ్లు మునిగిపోయి, ఇంట్లోని సర్వస్వం కోల్పోయి మలప్పురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో పాటు తలదాచుకున్న అంజు అనే 19 ఏళ్ల యువతి, ఎనిమిది నెలల క్రితం చేసుకున్న నిశ్చితార్థానికి ఏమాత్రం విఘాతం కలగకూడదన్న కృతనిశ్చయంతో.. వధువు దుస్తుల్లో ముస్తాబై, ముందనుకున్న ముహూర్తానికే ఆదివారం నాడు అక్కడికి సమీపంలోని త్రిపురాంతకం ఆలయంలో వివాహం చేసుకోవడం రెండు వైపుల వారికీ కన్నుల పండుగే అయింది! ఘనంగా చేయాలనుకున్న వివాహం అనూహ్యంగా సంభవించిన వరదల వల్ల అవాంతరాలకు గురయినప్పటికీ, అంజు చూపిన చొరవ కారణంగా అనుకున్న రోజుకే జరగడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని వరుడు షైజు (27) తల్లిదండ్రులు, బంధువులు వధువును ప్రశంసల జల్లుల్లో ముంచెత్తారు. ఇంకో నెలలో కొత్త మిస్ అమెరికా రానున్న తరుణంలో.. ‘మిస్ అమెరికా ఆర్గనైజేషన్’ చేత గత 11 నెలలుగా తను వేధింపులకు గురవుతున్నట్లు మిస్ అమెరికా 2017 కారా మండ్.. 3000 పదాలతో కూడిన ఒక దీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెజీనా హాపర్ తనను నిరంతరం విమర్శిస్తూ ఉండేవారని, సోషల్ మీడియాలో తనను పోస్టింగ్లు పెట్టుకోనిచ్చేవారు కాదని, ఈవెంట్లలో పాల్గొనడంపైన కూడా అప్రకటిత నిషేధం విధించారని.. అసలు ఈ ఏడాదంతా టైటిల్ గెలిచిన సంతోషమే లేకపోగా.. ఒక బానిసలా, అన్నిటినీ సహిస్తూ తను జీవించానని’’ కారా మండ్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పురిటినొప్పులు పడుతున్న మారియా డెల్ కార్మెన్ వెనెగాస్ (32) అనే కాలిఫోర్నియా మహిళను ఆమె భర్త జోయల్ అరోనా లారా (34) ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అడ్డగించి, అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆ మహిళే అతి కష్టం మీద కారును నడిపించుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. 12 ఏళ్ల క్రితం మెక్సికో నుంచి యు.ఎస్.కి వలస వచ్చిన వెనెగాస్ దంపతులకు, వారి ఐదుగురు పిల్లలకు యు.ఎస్. పౌరసత్వం ఉన్నప్పటికీ అధికారులు అడిగినప్పుడు వెనెగాస్ గుర్తింపు పత్రాలు తప్ప, ఆమె భర్తవి సమయానికి కారులో లేకపోవడంతో ఐ.సి.ఇ. (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు.. పక్కనే నిండు గర్భిణి అయిన భార్య ఉందని కూడా లేకుండా అతడి చేతికి బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు. సెప్టెంబర్ 7న ఇజ్రాయెల్లో జరగబోతున్న ‘మీటియర్స్ ఫెస్టివల్’లో కచేరీ ఇవ్వాలని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ‘లానా డెల్ రే’ గా ప్రసిద్ధురాలైన ప్రముఖ అమెరికన్ గాయని ఎలిజబెత్ ఊల్రిడ్జ్ గ్రాంట్.. తనని తను సమర్థించుకున్నారు. ‘వెలిదేశం’ అయిన ఇజ్రాయెల్లో ప్రదర్శన ఇచ్చేందుకు లానా డెల్ రే వెళ్లడం సరికాదని, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా 2005 నుంచీ ప్రచారోద్యమం చేపట్టిన బి.డి.ఎస్. (బాయ్కాట్, డైవెస్ట్మెంట్, శాంక్షన్ – బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షలు) అనే పాలస్తీనా సంస్థ అభ్యంతరం చెప్పడంతో లానా ఈ విధమైన ప్రకటన చేస్తూ, సంగీతానికి హద్దులు, సరిహద్దులు ఉండవని అన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనెటర్గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి పాకిస్తాన్ సంతతి ముస్లిం మహిళ మెహ్రీన్ ఫరూకీ.. ప్రమాణ స్వీకారం చేసి వారమైనా కాకముందే, ముస్లింల వ్యతిరేకి అయిన క్రాస్బెంచ్ (విపక్ష / స్వతంత్ర) సెనెటర్ ఫ్రేజర్ యానింగ్కి పంచ్ ఇచ్చారు. ఎంత కఠినమైన నిర్ణయమైనా సరే తీసుకుని, ఆస్ట్రేలియాలోకి ముస్లింల వలసలను నివారించాల్సిన అవసరం ఉందని యానింగ్ అన్న మాటకు స్పందిస్తూ.. ‘‘ఏవేళనైనా సరే, ఆయన మా ఇంటి తలుపు తట్టి.. నాతో కొన్ని నిమిషాలు కూర్చోగలిగితే.. బహుళ జాతుల సహజీవనంలోని సౌందర్యం, సుసంపన్నతల గురించి రెండు మూడు విషయాలను ఆయనకు నేర్పి పంపుతాను’’ అని మెహ్రీన్ ఫరూకీ వ్యాఖ్యానించారు. -
స్త్రీలోక సంచారం
చిన్నారులపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను నివారించే విషయమై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో ‘ఇనఫ్ ఈజ్ ఇనఫ్’ (జరిగింది చాలు) అంటూ ఒక వర్క్షాప్ జరిగింది. ప్రభుత్వ టీచర్ల కోసం ‘షీ’ టీమ్స్, భరోసా సెంటర్లు నిర్వహించిన ఈ వర్క్షాపులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) శిఖా గోయెల్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. యు.ఎస్.లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల సోహా నాజ్ అనే మూడో తరగతి బాలిక, ఎవరి సహాయమూ తీసుకోకుండా తనకై తనే తన ఇంటి ముందు కేక్స్, మిల్క్షేక్స్, మింట్ గ్రోన్ (పుదీనా) అమ్మి సంపాదించిన 300 డాలర్లను (సుమారు 21 వేల రూపాయలు) హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురాలో ఉన్న ‘సానీ వెల్ఫేర్ ఫౌండేషన్’కు విరాళంగా అందజేసింది! తినేందుకు తిండే లేని నిరుపేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ధార్మిక సంస్థల వీడియోలను చూసి స్ఫూర్తి పొంది, కష్టపడి డబ్బు సంపాదించి సోహా నాజ్ పంపిన ఈ డబ్బుతో 21 బియ్యం బస్తాలు వచ్చాయని ఫౌండేషన్ ప్రకటించింది. వెనుకా ముందూ చూడకుండా బయోకాన్ కంపెనీ సి.ఎం.డి. కిరణ్ మజుందార్ షా ఆస్తిని జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) ను ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002’ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. కిరణ్కు కనీస వివరణకు కూడా అవకాశం ఇవ్వకుండా.. బెంగళూరు కింగ్ఫిషర్ టవర్స్లో విజయ్ మాల్యా హౌసింగ్ ప్రాజెక్టు కింద కిరణ్ మజుందార్ షా 2012లో కొనుగోలు చేసిన ఫ్లాట్ను ఇ.డి.జప్తు చేయడంపై విస్మయాన్ని వ్యక్తం చేసిన ట్రిబ్యునల్.. ఫ్లాట్ను జప్తు నుంచి విడిపించింది. తలకొరివి పెట్టేందుకు, ఇతర అంత్యక్రియల్ని నిర్వహించేందుకు, కనీసం చితిస్థలికి వచ్చేందుకు మహిళల్ని అనుమతించని హైందవ సంప్రదాయంలో.. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కర్మకాండల సందర్భంగా కాస్త పట్టు విడుపు కనిపించింది. వాజ్పేయి పెంపుడు కూతురు నమితా కౌల్ భట్టాచార్య ఆయన చితికి నిప్పు పెట్టడాన్ని.. మహిళలపై సమాజంలో ఉన్న నిషేధాలు క్రమంగా తొలిగిపోతున్నాయనడానికి ఒక సంకేతంగా సామాజిక పోకడల పరిశీలకులు పరిగణిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్లనే.. కేరళలో జలప్రళయం సంభవించిందని వ్యాఖ్యానించిన ఆర్.బి.ఐ. సలహాదారు, ఆర్.ఎస్.ఎస్. ఆర్థిక విభాగమైన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ కో కన్వీనర్ ఎస్.గురుమూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలోని విమర్శల వరదల్లో చిక్కుకున్నారు. ప్రకృతి విలయాలకు, మానవ నిర్ణయాలకు ముడిపెట్టి ప్రజల్లో లేనిపోని అనుమానాలను కలిగించడం ద్వారా స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం మంచిది కాదని ట్విట్టర్లో కొందరు ఆయనకు హితవు చెప్పారు. యు.ఎస్. ఆరిజోనా రాష్ట్రంలోని మెసా పట్టణంలో ‘బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్’ ఐ.సి.యు.లో సేవలు అందిస్తున్న మొత్తం 16 మంది నర్సులూ గర్భిణులేనన్న విషయం అనుకోకుండా బయటికి వచ్చింది. ఫేస్బుక్ గ్రూపులో ఉన్న ఈ నర్సులందరూ ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు వీళ్లంతా కూడా గర్భిణులేననీ, వచ్చే అక్టోబర్–జనవరి నెలల మధ్య వీరు ప్రసవించబోతున్నారని.. వీరిలోనే ఒకరైన రోషల్ షర్మన్ పట్టలేని ఆనందంతో బహిర్గతం చేయడంతో ఈ ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సరో, లంగ్ క్యాన్సరో వైద్యులు నిర్థారించే క్రమంలోనే క్యాన్సర్కు చికిత్సను పొందుతూ 56 ఏళ్ల వయసులో 1974లో మరణించిన అమెరికన్ రచయిత్రి జాక్వెలీన్ సుసాన్ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 20న ఫిలడెల్ఫియాలో జన్మించిన సుసాన్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’ (1966), ‘ది లవ్ మెషీన్ (1969), ‘వన్స్ ఈజ్ నాట్ ఇనఫ్’ (1973) పుస్తకాలతో విశేష పాఠకాదరణ పొందారు. 21 ఏళ్ల వయసులో జేమ్స్బాండ్ చిత్రం ‘డై అనదర్ డే’ (2002)తో సినీ రంగ ప్రవేశం చేసిన రోసామండ్ పైక్.. ఆ చిత్రంలోని బాండ్ గర్ల్ పాత్ర ఎంపిక కోసం అండర్వేర్ మినహా తన ఒంటి మీద బట్టలన్నీ విప్పమని అడిగారని, అందుకు తను తిర స్కరించినప్పటికీ చివరికి ఆ పాత్ర తననే వరించిందని ఇన్నేళ్ల మౌనం తర్వాత ఇప్పుడు బయటపడ్డారు! రెండు రోజుల క్రితం ‘అమెజాన్స్ ఆడిబుల్ సెషన్స్’కి వెళ్లినప్పుడు ఈ రహస్యోద్ఘాటన చేసిన రోసామండ్.. తన తిరస్కారానికి ముగ్ధులవడం వల్లనే ఆ పాత్రను తనకు ఇచ్చినట్లు ఆ తర్వాత నిర్మాతలు తనతో అన్నారని కూడా చెప్పారు. -
స్త్రీలోక సంచారం
స్కూలు నిబంధనల ప్రకారం నీలం రంగు రిబ్బన్లకు బదులుగా నల్లరంగు రిబ్బన్లు కట్టుకుని వచ్చిన నాల్గవ తరగతి విద్యార్థిని జడను స్కూలు టీచరు కత్తిరించిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలోని సెయింట్ స్టీఫెన్స్ హైస్కూల్లో జరిగింది! ఇటీవల హిమాయత్ నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లోనూ ఇలాగే ఒక టీచరు.. జడ సరిగా వేసుకురాని నాల్గవ తరగతి విద్యార్థినిని బెత్తంతో కొట్టడాన్ని గుర్తు చేస్తూ, ‘‘డ్రెస్ కోడ్ పెట్టడం ఎందుకు, కోడ్ను పాటించడం లేదని పిల్లల్ని దండించడం ఎందుకు అని ఈ సందర్భంగా ‘బాలల హక్కుల సంఘం’ గౌరవాధ్యక్షులు అచ్యుతరావు స్కూలు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్లో ఒక ప్రైవేటు స్కూలు టీచరు స్కూలు వెళుతుండగా ముహమ్మద్ సొహెల్ (26) అనే యువకుడు ఆమెను వెంబడిస్తూ, అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, ఆమె చెయ్యి పట్టుకున్న నేరానికి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై సెక్షన్ 354–డి (స్టాకింగ్.. వెంబడించడం) కేసు పెట్టి, పద్నాలుగు రోజులు రిమాండుకు పంపారు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా గల ఇండోనేషియాలో రెండేళ్ల క్రితం మిలియానా అనే 44 ఏళ్ల చైనా సంతతి మహిళ.. స్థానిక మసీదుల లౌడ్ స్పీకర్ల నుంచి శబ్దకాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదు చేయడం ద్వారా దైవదూషణకు పాల్పడడమే కాకుండా.. బౌద్ధ, ముస్లిం వర్గాల మధ్య హింస చెలరేగడానికి ఆమె కారణం అయ్యారన్న ఆరోపణలపై ఆనాటి నుండీ కోర్టులో నడుస్తున్న వాదోపవాదాలు ఇవాళ (గురువారం) ఒక కొలిక్కి రాబోతున్నాయి. మసీదు లౌడ్ స్పీకర్లను శబ్దకాలుష్య కారకాలు అనడం ద్వారా ‘దైవదూషణ’ నేరానికి పాల్పడిందంటూ అందిన మరొక ఫిర్యాదుపై పోలీసులు ఈ ఏడాది మే 18న మిలియానా అరెస్టు చేయగా, ఆ నేరానికి గాను ఆమెకు కనీసం ఏడాదిన్న జైలుశిక్ష విధించాలని ప్రతి న్యాయవాదులు కోరుతున్నారు. నార్త్ కరొలినా, పైన్విల్లోని ఒక షాపింగ్ మాల్లో పిల్లల స్కూలుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన షిరెల్ బేట్స్ అనే ‘కవలల గర్భిణి’పై అనుమానంతో మాల్ మేనేజర్ పోలీసును పిలిపించి, ఆమె బట్టల కింద ఏముందో చూపించాలని అడిగించడం, అందుకు సమాధానంగా అమె ‘నా బట్టల కింద ఉన్నది ట్విన్స్’ అని నవ్వుతూ చెప్పినా ఆ పోలీసు వినకపోవడంతో ఆమె తన తన షర్టును కొంత భాగం వరకు పొట్ట పైకి లేపి గర్భాన్ని చూపించాల్సి రావడం వివాదాస్పదం అయింది. అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ గర్భిణి, తనను దొంగగా అనుమానించారని కొన్ని నిముషాల తర్వాత ఆలస్యంగా తెలుసుకుని, ఆవేదన చెందడంతో ఆమెకు క్షమాపణ చెప్పిన మాల్ యాజమాన్యం ఆ మేనేజర్ను తొలగించి, ఆమె కొనుగోలు చేసిన సామగ్రి అంతటికీ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసింది. మగవాళ్లది మాత్రమే అనుకుంటున్న క్రికెట్ సామ్రాజ్యంలోకి కొత్తగా ఇప్పుడు ఇద్దరు మహిళలు కొత్త ‘జాబ్’లోకి వచ్చేందుకు.. నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వహించిన ‘పిచ్ మేకింగ్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 16 నుంచి 29 వరకు జరిగిన ఈ పిచ్–మేకింగ్ కోచింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 29 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇద్దరు మహిళలు.. జసింతా కల్యాణ్ (కర్నాటక), శివాంగీ ఘోష్ (ఒడిశా).. ఉండడంపై బి.సి.సి.ఐ. ‘గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీ’ అధికారి ఒకరు హర్షం వ్యక్తం చేశారు. తొలిచిత్రం ‘కేదార్నాథ్’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే స్టార్ స్టేటస్కి చేరుకున్న సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ (సైఫ్ మాజీ భార్య)ల ముద్దుల కుమార్తె సారా అలీఖాన్పై.. సోషల్ మీడియాలో ఆమె సాక్షాత్కారం కోసం.. అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది! సారా పుట్టిన రోజైన ఆగస్టు 12న ఆమె ప్రమేయం లేకుండానే అమె ఫ్యాన్స్ ‘సారా అలీ ఖాన్ ఆన్ సోషల్ మీడియా’ అనే హ్యాష్టాగ్ను సృష్టించి ఆమెకో సామ్రాజ్యాన్ని నిర్మించి ఇవ్వగా.. మరికొందరు, కనీసం తన బర్త్డే కైనా సారా ఇంటర్నెట్లో ఒక అకౌంట్ ఒపెన్ చేసి ఉండే బాగుండేది కదా అని పోస్టుల మీద పోస్టుల పెట్టడంతో ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ప్రవేశించి, అభిమానులను పరవశింపజేశారు. నేపాలీ సంతతి భారతీయ నటి మనీషా కొయిరాల జన్మదినం నేడు. సంజయ్దత్ జీవిత చరిత్రపై ఇటీవల వచ్చిన రాజ్కుమార్ హిరానీ చిత్రం ‘సంజు’లో కనిపించిన మనీషా.. 2012 తర్వాతి నాటి తన క్యాన్సర్ అనుభవాలతో రాస్తున్న ‘ది బుక్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్’ని ‘పెంగ్విన్’ సంస్థ త్వరలో పుస్తకంగా ప్రచురించబోతోంది. భారతదేశంలోని ఉత్తరాది మహిళల్తో పోల్చి చూస్తే దక్షిణాది మహిళల్లో స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉందని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ నిర్వహించిన (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్) తాజా అధ్యయనంలో వెల్లడయింది. అధిక బరువు, లేదా స్థూలకాయం ఉన్న మహిళలు కేరళలో 34 శాతం మంది ఉండగా, తర్వాతి మూడు స్థానాల్లో తమిళనాడు (24.4 శాతం), ఆంధ్రప్రదేశ్ (22.7 శాతం), కర్ణాటక (17.3) రాష్ట్రాలు ఉన్నాయని ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ పేర్కొంది. -
స్త్రీలోక సంచారం
మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గత ఏడాది సెప్టెంబర్లో ఎన్.సి.డబ్లు్య. (నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్) చైర్పర్సన్గా లలితా కుమారమంగళం తన పదవీ బాధ్యతల నుంచి వైదొలగినప్పటి నుంచీ, ఆ స్థానంలో అదనంగా విధులను నిర్వహిస్తూ వస్తున్న మహిళా కమిషన్ సభ్యురాలు రేఖాశర్మ (54) ఇప్పుడు పూర్తిస్థాయి ఎన్.సి.డబ్లు్య. చైర్పర్సన్గా నియమితులయ్యారు. క్రైస్తవ సంఘాలలో కొన్నిచోట్ల ఉండే ‘ఒప్పుకోలు’ (కన్ఫెషన్) సంప్రదాయం మహిళల్ని బెదిరించడానికి ఒక ఉద్వేగ సాధనంగా దుర్వినియోగం అవుతోందని అంటూ, అందుకు ఉదాహరణగా కేరళలో జరిగిన ఒక ఘటనను నిదర్శనంగా చూపి, కన్ఫెషన్ సంప్రదాయాన్ని నిషేధించాలని రేఖాశర్మ వ్యాఖ్యానించడం ఇటీవల వివాదాస్పదం అయింది. ►ముంబైలోని ‘జిన్నా హౌస్’ వారసత్వ హక్కుల కోసం 2007 నుంచీ న్యాయపోరాటం చేస్తున్న ముహమ్మద్ అలీ జిన్నా కుమార్తె, ఆయన ఏకైక సంతానం అయిన డైనా వాడియా 2017 నవంబర్లో తన 98 యేట మరణించిన దాదాపు ఏడాది తర్వాత ఈ కేసును ఆమె తనయుడు నస్లీ వాడియా కొనసాగించడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. దేశ విభజనకు పూర్వం 1936లో జిన్నా కట్టించిన ఈ ‘హౌస్’ను ఆయన స్మృత్యర్థం పాకిస్తాన్ కాన్సులేట్ ఆఫీసుగా మార్చుకునేందుకు అమ్మడం కానీ, లీజ్ ఇవ్వడం గానీ చేయాలని ఒకవైపు పాకిస్తాన్ ఏళ్లుగా అడుగుతుండగా.. హిందూ చట్టం ప్రకారం జిన్నా కూతురిగా జిన్నాహౌస్పై తనకు మాత్రమే హక్కు ఉందని డైనా వాడియా కోర్టును ఆశ్రయించారు. ►అసభ్యతను నియంత్రించే నెపంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో కనీసం ఒక్క డ్యాన్స్ బార్నైనా నడవనివ్వకపోవడం ‘నైతికనిఘా’కు (మోరల్ పోలీసింగ్) పాల్పడటమేనని సుప్రీంకోర్టు విమర్శించింది. ముద్దులకు, మానవ ‘కలయిక’కు సంకేతంగా సినిమాల్లో పూలను, పక్షులను చూపించే కాలం నాటి నుంచి అసభ్యతకు ఒక పరిణామక్రమంగా అర్థం మారిపోతూ వస్తున్నప్పుడు.. డ్యాన్స్ గర్ల్స్ చేసే నృత్యాలన్నిటినీ అసభ్యమైనవని తీర్మానించి, ఏ ఒక్క డ్యాన్స్బార్కూ అనుమతిని ఇవ్వకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ►35 ఏళ్ల కెన్యా–మెక్సికో సంతతి హాలీవుడ్ నటి లుపిటా న్యాంగో తొలిసారి తన జుట్టు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘‘నీ జుట్టు ఇలా ఉంటే నీకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరనీ.. ఇంత అనాగరికంగా, ‘అరణ్యగోచరం’గా నువ్వెక్కడా నెగ్గుకు రాలేవని అంతా అనేవారు. ఇదంతా పడలేక నన్ను నేను దాచుకునే ప్రయత్నం చేసేదాన్ని. అప్పుడు మా అమ్మే నాకు ధైర్యం చెప్పింది. ‘సహజంగా వచ్చిన జుట్టును చూసుకుని గర్వపడాలే కానీ, సిగ్గు పడకూడదు’ అని చెప్పింది. హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపుల గురించి నా అనుభవాలను బయటికి చెప్పుకున్నానంటే ఆ మనోబలం కూడా నాకు మా అమ్మ ఇచ్చిందే’’ అని ‘పోర్టర్’ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాంగో వెల్లడించారు. ►ఇప్పటి వరకు కేవలం అత్యాచారం వల్ల ధరించిన గర్భానికో, లేక ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్ చేయించుకునేందుకు అర్జెంటీనాలో చట్టపరమైన అనుమతి ఉండగా, వాటితో నిమిత్తం లేకుండా గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కి అనుమతి ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గురువారం నాడు అర్జెంటీనా సెనేట్ (ఎగువసభ) అబార్షన్ (చేయించుకునే హక్కు) బిల్లును తిరస్కరించింది. గత నెలలో దిగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఇప్పుడు సెనేట్ కూడా సమ్మతి తెలిపి ఉంటే 14 వ వారం వరకు కూడా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకు లభించి ఉండేది. ►ఐక్యరాజ్య సమితిలోని ‘లైంగిక సమానత్వం’, ‘మహిళా సాధికారత’ల ప్రత్యేక విభాగాల సలహాదారు రవి కర్కారపై కనీసం ఎనిమిది మంది పురుషులు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేయడంతో ఆయన కోసం వేట మొదలైంది! ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం (అప్పటికి ఇతడేనని తెలియదు) గత ఏడాదిగా ‘యు.ఎన్. ఉమెన్ ప్లానెట్ 50–50 చాంపియన్స్’ అధికారులు ప్రయత్నిస్తుండగా.. ప్రస్తుతం సెలవులో ఉన్న రవి కర్కారే నిందితుడని బయపడటంతో పాటు, ఒక హోటల్ గదిలో అతడు తన కింది పురుష ఉద్యోగుల జననాంగాలను తాకడం, గిల్లడం వంటి అసభ్యకరమైన పనులు చేసినట్లు బాధితుల సాక్ష్యం వల్ల బహిర్గతమయింది. ►భారత మహిళా క్రికెట్ జట్టు ‘కోచ్’ పోస్టు కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకోగా పురుష అభ్యర్థులతో పాటు వారిలో మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సుమన్శర్మ (గతంలో పూర్ణిమా రావ్కు అసిస్టెంట్ కోచ్), మరియా ఫాహే (న్యూజిలాండ్ క్రికెటర్, ప్రస్తుతం గుంటూరు అకాడమీలో కోచ్) దరఖాస్తు చేసినవారిలో ఉన్నారు. ►హాలీవుడ్ చిత్రంలో అవకాశం రావడంతో చేతిలోని బాలీవుడ్ చిత్రం ‘భారత్’ను వదిలేసి వెళ్లిన ప్రియాంక చోప్రాకు.. మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలకబోసుకున్నట్లయింది! క్రిస్ ప్రాట్ సరసన ‘కౌబాయ్ నింజా వైకింగ్’ చిత్రంలో నటించడానికి ప్రియాంక సిద్ధమౌతున్న తరుణంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న యూనివర్సల్ పిక్చర్స్.. స్క్రిప్టులో తలెత్తిన సమస్యల వల్ల చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది! -
స్త్రీలోక సంచారం
సమాజంలో బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడి పదవిలోకి వచ్చిన కె.సి.ఆర్., ముఖ్యమంత్రి అయ్యాక తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటివ్వకుండా తిరిగి తనే వివక్షను పాటిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్) స్పందించిన హైదరాబాద్ హైకోర్టు.. మంత్రివర్గంలో తప్పనిసరిగా మహిళలకు స్థానం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కనుక మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్ని కొట్టివేసింది. అధికార టి.ఆర్.ఎస్. పార్టీ మహిళా ఎమ్మెల్యేలలో దాదాపుగా అంతా ఎస్సీలు, ఎస్టీలు కావడం వల్లనే కె.సి.ఆర్. వారిని తన మంత్రివర్గంలోకి రానివ్వలేదని వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన దారా శ్రీశైలం అనే న్యాయవాది వేసిన ‘పిల్’పై కోర్టు ఈ విధంగా స్పందించింది. అమెరికా ప్రతినిధుల సభకు (దిగువ సభకు) నవంబరులో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో 180 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతుండగా, గత జూన్లో ‘సెనెట్’కు (ఎగువ సభకు) జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 42 మంది మహిళలు (24 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు) బరిలో నిలిచారని ‘సెంటర్ ఫర్ అమెరికన్ ఉమెన్ పాలిటిక్స్ (సి.ఎ.డబ్లు్య.పి) వెల్లడించింది. రెండేళ్ల కాలపరిమితితో 435 మంది సభ్యులుండే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువస¿¶ కు, ఆరేళ్ల కాలపరిమితితో 100 మంది సభ్యులుండే ఎగువసభకు ప్రతి ‘సరి సంవత్సరం’లో ఖాళీల భర్తీకి ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతుంటాయి. పన్నెండేళ్లుగా సహజీవనం చేసి, 2014లో పెళ్లి చేసుకుని, 2016లో విడిపోయిన హాలీవుడ్ అందాల జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్.. కోర్టు కేసుల పరిష్కారం కోసం ఇప్పుడు అయిష్టంగా ఒకరిముఖం ఒకరు చూసుకోవలసి వస్తోంది! దత్తత తీసుకున్న పిల్లలు, సొంత పిల్లలు కలిపి మొత్తం ఆరుమందిలో కొందరి పోషణ, సంరక్షణ కోసం ఒప్పందం ప్రకారం బ్రాడ్ పిట్ తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వడం లేదని ఏంజెలీనా కోర్టుకు వెళ్లగా, విడిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఏంజెలీనాకు తను అనేక మిలియన్ డాలర్లను చెల్లించినట్లు బ్రాడ్ పిట్ చెబుతున్నారు. లైంగిక అకృత్యాల రాక్షసుడు హార్వీ వైన్స్టీన్ను తను పూర్తిగా సమర్థించనప్పటికీ, ‘మీటూ’ ఉద్యమానికి మాత్రం మద్దతు ఇవ్వలేకపోతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి ‘లేలో’ (లిండ్సే లోహన్) సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘నేనూ బాధితురాలినే’ అని బయటికి రావడం మహిళల బలాన్ని కాక, బలహీనతను మాత్రమే బయటపెడుతోందని ఆమె అన్నారు. బి.జె.పి మగవాళ్ల పార్టీ మాత్రమేనని, మహిళల్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనీ రాహుల్ ఆరోపించడం బి.జె.పి.లోని మహిళల్ని అవమానించడమేనని అంటూ.. రక్షణమంత్రి మహిళ కాదా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహిళ కాదా, లోక్సభ స్పీకర్ మహిళ కాదా అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. రాహుల్పై విరుచుకుపడ్డారు. ‘మహిళా అధికార్ సమ్మేళన్’లో రాహుల్ చేసిన పై ఆరోపణలను తిప్పికొట్టే సందర్భంలో.. ‘తెలియకుండా మాట్లాడ్డం మానాలని’ కూడా రాహుల్కు ఆమె హితవు చెప్పారు. 37 ఏళ్ల వయసులో హత్యకు గురైన పార్లమెంటు సభ్యురాలు, న్యాయవాది, ‘బందిపోటు రాణి’ అయిన ఫూలన్ దేవి బర్త్ డే ఇవాళ. స్టార్ చెఫ్ పద్మాలక్ష్మి తన ఎనిమిదేళ్ల కూతురు కృష్ణ, ఆ పాప తండ్రి ఆడమ్ డెల్తో కలిసి ప్రస్తుతం ఇటలీలో విహరిస్తున్నారు. అమెరికన్ రియాలిటీ షో ‘టాప్ చెఫ్’ ఫినాలీ ఎపిసోడ్ చిత్రీకరణ నుంచి స్వల్ప విరామం తీసుకోవడంతో దొరికిన వ్యవధిలో పద్మాలక్ష్మి చక్కగా టూర్లు కొడుతూ, ఇష్టమైన ఆహారం తింటూ, కూతురితో, పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న ఆడమ్ డెల్తో కుటుంబ అనుబంధాల్లోని మాధుర్యాన్ని గ్రోలుతున్నట్లు రెండు వారాల క్రితం ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లో పేరు లేని నలభై లక్షల మంది ‘అస్సామీ’లను తరలించే ప్రయత్నాలు మొదలైతే కనుక మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువు అయ్యే ప్రమాదం ఉండొచ్చని అంతర్జాతీయ సామాజిక, పాలనా విధానాల పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతిమ జాబితాను సిద్ధం చేసి, రిజిస్టరులో పేరు లేని పౌరుల తరలింపునకు తొందరపడితే అస్సాంలో కల్లోల పరిస్థితులు తలెత్తవచ్చునని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
ఆకస్మిక గుండె జబ్బులతో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిన మహిళలకు కనుక లేడీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అందినట్లయితే వారు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యు.ఎస్. వైద్య పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది! ఫ్లోరిడాలో గత 19 ఏళ్లుగా 5 లక్షల 82 వేల గుండెపోటు కేసులను అధ్యయనం చేస్తూ వచ్చిన ఈ పరిశోధకులు.. మగవైద్యుడి సేవల కన్నా , స్త్రీ వైద్యుల సేవలకే మహిళలు త్వరగా కోలుకున్నారని, వీరిలో మరణాల శాతం కూడా బాగా తక్కువగా ఉందని గుర్తించారు. మహిళలు రోజుకు 352 నిమిషాల పాటు వేతనం లేని పనిని చేస్తున్నట్లు న్యూఢిల్లీలోని ‘నేషనల్ సర్వే ఆఫీస్’ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ ‘టైమ్–యూజ్’ సర్వే 2020 వరకు కొనసాగుతుందని, ఆ ఏడాది జూన్లో వెలువడే పూర్తిస్థాయి ఫలితాలు గృహిణుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించిన సర్వే ఆఫీస్ డైరెక్టర్ జనరల్ దేవిప్రసాద్ మండల్.. ఆ తర్వాతి నుంచీ ప్రతి మూడేళ్లకొకసారి ఈ విధమైన సర్వే జరుగుతుంటుందని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుప్రీంకోర్టు జడ్జిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిదవ మహిళ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఏకకాలంలో ముగ్గురు మహిళా జడ్జీలు విధి నిర్వహణలో ఉండటం ఒక రికార్డు అయింది. జస్టిస్ ఇందిరకు ముందు ఏడవ జడ్జిగా ఇందు మల్హోత్రా, ఆరవ జడ్జిగా ఆర్.భానుమతి, ఐదవ జడ్జిగా రంజనా ప్రకాశ్ దేశాయ్, నాల్గవ జడ్జిగా జ్ఞానసుధా మిశ్రా, మూడవ జడ్జిగా రుమాపాల్, రెండవ జడ్జిగా సుజాతా మనోహర్, మొట్టమొదటి జడ్జిగా ఫాతిమా బీవీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. దేశంలో ‘లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్’ గా (నిరంతరం, ప్రతిచోటా) మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోబోతున్నదీ కోర్టుకు తెలియబరచాలని జస్టిస్ మదన్ బి.లోకూర్ అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బిహార్లోని ముజఫర్పూర్ శరణాలయంలో లైంగిక అకృత్యాలకు గురైన 34 మంది బాలికలను సుశిక్షితులైన మానసిక వైద్యుల సమక్షంలో మాత్రమే ఎన్.సి.పి.సి.ఆర్. (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) సభ్యులు మాట్లాడించాలని పట్నా పౌరుడొకరు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం ‘సూయి ధాగా’ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే ‘మమత’ అనే యువతి పాత్రలో అనుష్క శర్మ విలక్షణంగా కనిపించబోతున్నారని ట్విట్టర్లో ఆ చిత్రం హీరో వరుణ్ ధావన్ (టైలర్)తో కలిసి ఉన్న ఆమె ఫొటోలను బట్టి తెలుస్తోంది. అయితే చిత్రం లోగోను విడుదల చేసిన వీడియోలో ‘మమత’ పాత్రకు పూర్తి భిన్నమైన ఆధునిక వస్త్రధారణలో అనుష్కను చూసినప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆమెలో చక్కగా ఇమిడిపోతుందేమో అనిపించేలా ఉండటం విశేషం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా గత జూన్లో పదవీ విరమణ పొందిన పి.జె.కురియన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇవాళ జరుగుతున్న ఎన్నికకు ప్రతిపక్ష అభ్యర్థిగా మొదట ఎన్.సి.పి. (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) ఎం.పి. వందనా చవాన్ను అనుకున్న కాంగ్రెస్ చివరి నిముషంలో ఆమెను పక్కన పెట్టింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా వందన పేరును బహుజన్ సమాజ్వాది పార్టీ నేత సతీశ్ చంద్ర మిశ్రా ప్రతిపాదించగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరెక్ ఒబ్రియన్ బలపరిచారు. ప్రసవానంతర కుంగుబాటును (పోస్ట్పార్టమ్ డిప్రెషన్) తట్టుకుని నిలబడకపోతే అది మూడేళ్ల వరకు వెంటాడుతూనే ఉంటుందని పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చదివినట్లు చెబుతూ, కుంగుబాటు కారణంగా బిడ్డకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాం అనే బాధ పడే కొత్త తల్లులందరి తరఫునా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన ట్విట్టర్ అకౌంట్లో సాంత్వన వచనాలను పలికారు. వెనువెంటనే ఆమెను ప్రశంసిస్తూ అనేక మంది తల్లులు తమ అనుభవాలను సెరెనాతో పంచుకోవడంతో పోస్ట్పార్టమ్ డిప్రెషన్పై బహిరంగంగా మాట్లాడుకోవడం అనే ఒక మంచి ఆరోగ్యకరమైన, ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయానికి నాంది పలికినట్లయిందని వైద్య పరిశోధకులు, మనోవైజ్ఞానిక నిపుణులు సైతం సెరెనాను అభినందిస్తున్నారు. ఇస్లామాబాద్లోని యుద్ధవ్యూహ పండితురాలు షిరిన్ మజారీని పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రిగా (ఆ దేశానికి కాబోయే) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్–పాక్ల మధ్య అంతిమయుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్ మొదట ఇండియాలో అత్యధిక జనాభా గల ప్రాంతాలపై న్యూక్లియర్ బాంబులు వేయడం మంచి ఎత్తుగడ అవుతుందని 1999 అక్టోబర్లో ‘ది డిఫెన్స్ జర్నల్’ అనే పత్రికకు రాసిన తన వ్యాసంలో షిరిన్ మజారీ సూచించారు. -
స్త్రీలోక సంచారం
పాక్ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 14న గానీ, అంతకంటే ముందు గానీ ఆ దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఆయన నేతృత్వంలోని పి.టి.ఐ. (పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్) పార్టీలో చేరిన ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా మనేకా కూతురు మెహ్రు హయత్.. మహిళల సమస్యలపై పని చేయాలని తనకు ఆసక్తిగా ఉందని వెల్లడించారు. తన ఆధ్యాత్మిక గురువు, నలుగురు పిల్లల తల్లి అయిన బుష్రాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అతి గోప్యంగా వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్, ఆమెకన్నా ముందు రెహమ్ ఖాన్ను, రెహమ్ ఖాన్కు ముందు జెమీమా గోల్డ్ స్మిత్ను పెళ్లి చేసుకున్నారు. ► బుర్ఖా ధరించిన మహిళలు ఉత్తరాల డబ్బాల్లా (లెటర్ బాక్సెస్) కనిపిస్తారని బ్రిటన్ విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలపై ‘ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్’ మండిపడుతోంది. ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ పత్రికలో క్రమం తప్పకుండా కాలమ్ రాస్తుండే బోరిస్ జాన్సన్ తన తాజా వ్యాసంలో ముస్లిం మహిళల తరఫున మాట్లాడుతూ.. ‘బుర్ఖా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేనూ మీతో కలిసి బుర్ఖాకు వ్యతిరేకంగా పోరాడతాను. ఈ అణచివేత ఏంటి? బుర్ఖాలు వేసుకుని లెటర్ బాక్సుల్లా కనిపించాల్సిన అగత్యం ఏంటి?’ అని రాయడం వివాదాస్పదం అయింది. ► మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి సమర్ బదావీ సహా.. అనేక మంది మహిళా సామాజిక కార్యకర్తలను సౌదీ అరేబియా అరెస్టు చేసి, నిర్బంధించడంపై కెనడా తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం చేయడంతో ఆగ్రహించిన సౌదీ అరేబియా.. కెనడాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవడంతో పాటు ఆ దేశంలోని తమ దౌత్య అధికారిని వెనుక్కు పిలిపించి, ఈ దేశంలోని కెనడా దౌత్య అధికారికి.. ఇరవై నాలుగు గంటలలోపు దేశం విడిచి పోవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏమాత్రం స్పందించని కెనడా.. ‘మానవ హక్కుల్ని, ప్రధానంగా మహిళల హక్కుల్ని పరిరక్షించేందుకు కెనడా దేనికైనా సిద్ధమేనని’ విదేశీ మంత్రిత్వశాఖ మహిళా ప్రతినిధి మేరీ పియర్ బరిల్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది. ► పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అంతకంటే ఎక్కువగా మరణశిక్ష విధించే బిల్లును సోమవారం పార్లమెంటు ఆమోదించింది. జమ్ము కశ్మీర్లోని కతువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో మరొక బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలల్ని రేపడంతో తక్షణ చర్యగా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రకటించిన అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్) స్థానంలో ఇప్పుడీ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. ► టీ షర్టులను, సిగ్గు బిడియాలను విసిరిపారేసి స్వేచ్ఛగా స్పోర్ట్స్ బ్రాతో ఫిట్నెస్ కోసం పరుగులు తీయండని మహిళల్ని ఉద్యమపరిచే ‘స్పోర్ట్స్ బ్రా రన్ స్క్వాడ్’ ఢిల్లీలో వేగం పుంజుకుంటూ, దేశంలోని మిగతా మెట్రోలకూ మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఎన్.సి.ఆర్. (నేషనల్ క్యాపిటర్ రీజియన్) లోని మహిళలు ఎందువల్ల నిర్బిడియంగా స్పోర్ట్ బ్రాను ధరించి రన్నింగ్ చేయలేకపోతున్నారన్న అంశంపై ఢిల్లీ, గోర్గావ్లలోని మహిళా రన్నర్ల మధ్య అనేక సమావేశాలు, చర్చలు జరిగిన అనంతరం ఈ ‘స్పోర్ట్స్ బ్రా రన్ స్క్వాడ్’ ఒక ఉద్యమంలా ఆవిర్భవించింది. ► భారత ప్రధాని దివంగత ఇందిరాగాంధీకి దశాబ్దకాలం పాటు ‘మ్యాన్ ఫ్రైడే’గా (విధేయుడిగా, విశ్వసనీయుడిగా) ఉన్న ఆర్.కె.ధావన్ తన 81వ యేట సోమవారం కన్నుమూసిన అనంతరం.. పాలనా వ్యవహారాల విషయమై ప్రధాని ఇందిర ఆయనపై ఎంతగా ఆధారపడిందీ వెల్లడించే వాస్తవ కథనాలు అనేకం బయటికి వస్తున్నాయి. ఇందిర జీవితంలోనే అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ విధింపు సమయంలో, ఇందిర చిన్న కొడుకు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినప్పుడు హాస్పిటల్ దగ్గర.. ధావన్ తన వెంట నిలిచిన కారణంగానే ఆమె స్థిమితంగా ఉండగలిగారని సీనియర్ మహిళా జర్నలిస్టు, ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ అయిన కూమీ కపూర్ రాశారు. ► చెన్నైలో లివింగ్ స్మైల్ విద్యగా ప్రసిద్ధురాలైన రంగస్థల నటి, ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త, రచయిత్రి, కుల వ్యతిరేక ఉద్యమకారిణి, స్వయంగా తనే ట్రాన్స్జెండర్ అయిన విద్య.. కరడుకట్టిన సంప్రదాయవాదుల నుంచి తన ప్రాణానికి హానీ ఉందనీ, ఇప్పటికే తనపై ఒకసారి హత్యాయత్నం జరిగిందని వివరిస్తూ పంపిన ‘శరణు వేడుకోలు’ను స్విట్జర్లాండ్ తిరస్కరించింది. అక్కడితో ఊరుకోకుండా.. ‘నాలుగువేల ఏళ్ల హిజ్రాల ఘన చరిత్ర కలిగిన భారతదేశాన్ని మించిన సురక్షిత స్థలం హిజ్రాలకు మరెక్కడా ఉండదు. కనుక మీరు అక్కడే ఉండండి. పైగా మీరు చదువుకున్న అమ్మాయి కూడా..’ అని ప్రత్యుత్తరం పంపిందని విద్య తన ఆవేదనను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ► ముంబైలోని జుహు ప్రాంతంలో శినా శివ్ దాసానీ అనే మహిళ తను నివాసం ఉంటున్న చిన్న గదిలోనే 70 పిల్లులతో (క్యాట్స్) సహజీవనం చేస్తున్న విషయం నేడు (ఆగస్టు 8) అంతర్జాతీయ మార్జాల దినోత్సవం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తల్లితో కలిసి ఉంటున్న శివ్దాసానీ తను తెచ్చి పెంచుకుంటున్న అనాథ పిల్లుల కోసమని ఇప్పటి వరకు మ«ద్, ఒషివారా, తలోజా, ఖార్గర్లలో అద్దెకున్న ఇళ్ల యజమానులతో గొడవ పడి జుహు లోని ఇంటికి మారినప్పటికీ, ఇక్కడ కూడా ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినవారు.. ‘పిల్లుల బాధ మరీ ఇంత ఎక్కువగా ఉంటుందని ఊహించలేదు. దయచేసి ఖాళీ చెయ్యండి’ అని పోరు పెట్టడంతో శివ్ దాసాని ఇప్పుడు మరో ఇంటికోసం వెదకులాట మొదలుపెట్టారు.