Yuki Bhambri
-
యూకీ జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. ప్రపంచ నంబర్వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు. -
యూకీ బాంబ్రీ జంట పరాజయం
పారిస్: మోంట్ పెలియర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీకీ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ బాంబ్రీ–ఇవాన్ డోడిగ్ ద్వయం 4–6, 5–7తో మాన్యుయెల్ గినార్డ్–గ్రెగోరి జాక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఇండో–క్రొయేషియన్ జంట తమ సర్వీస్ ను రెండుసార్లు చేజార్చుకుంది. యూకీ–డోడిగ్ జోడీకి 5,500 యూరోల (రూ. 4 లక్షల 95 వేలు) ప్రైజ్ మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.ముగిసిన భారత్ పోరుబ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
‘అప్పుడు నాపై విష ప్రయోగం జరిగింది’
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడేందుకు వచ్చినపుడు తనపై విష ప్రయోగం జరిగిన మాట నిజమేనని వెల్లడించాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు రాగా తనకు వడ్డించిన ఆహారంలో తీవ్రస్థాయిలో మెర్క్యూరీ, లోహం అవశేషాలున్నట్లు పరీక్షల్లో తెలిందని చెప్పాడు.ఆ మేగజైన్ తిరగేస్తే మీకే తెలుస్తుంది ‘ఈ విషయం జీకే మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్లీ స్పందించకుండా ఉండాలనుకుంటున్నా. అందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన పని వేరు.ఈ స్పందన వేరు. ఇక్కడ నేను టోర్నీ ఆడాలి. ఆ పనేదో చూసుకుంటే మంచిది’ అని జొకోవిచ్ అన్నాడు. ఆసక్తి గలవారికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే తాను ఇంటర్వ్యూ ఇచ్చిన మేగజైన్ను తిరగేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.కాగా... మూడేళ్ల క్రితం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జొకోను టోర్నీ ఆడేందుకు నిరాకరించారు. విమానాశ్రయంలోని హోటల్ గదిలోనే నిర్బంధించారు. ‘ఆ సమయంలో నాకు ఇచ్చిన ఆహరం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ, ఎక్కడ చెప్పనేలేదు. సెర్బియా వెళ్లాక ల్యాబ్ పరీక్షల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురి, లెడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది’ అని 37 ఏళ్ల నొవాక్ గత చేదు అనుభవాన్ని తాజాగా వివరించాడు. ప్రస్తుతం 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్తో ఉన్న ఈ సెర్బియన్ సూపర్స్టార్ 25వ రికార్డు టైటిల్పై దృష్టి పెట్టాడు. మరిన్ని క్రీడా వార్తలుపోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్–ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నికోల్ మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ, ఒలివెట్టి ఒక్క ఏస్ కూడా సంధించకుండానే ఐదు డబుల్ ఫాల్ట్లు చేయడం గమనార్హం.తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయిన యూకీ–ఒలివెట్టి ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. చెరో సెట్ గెలిచాక నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మెక్టిక్–వీనస్ ద్వయం పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జంటకు 11,310 డాలర్ల (రూ. 9 లక్షల 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు డ్రాగన్స్ జోరురూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న డ్రాగన్స్ నాలుగో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 2–1 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్పై విజయం సాధించింది. తమిళనాడు డ్రాగన్స్ తరఫున సెల్వం కార్తీ (16వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (37వ నిమిషంలో) చెరో ఫీల్డ్ గోల్ సాధించారు.బెంగాల్ టైగర్స్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (35వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా... రెండో క్వార్టర్ ఆరంభంలోనే కార్తి గోల్తో తమిళనాడు బోణీ కొట్టింది. మూడో క్వార్టర్లో టైగర్స్ ప్లేయర్ రూపిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో స్కోరు సమం కాగా... మరో రెండు నిమిషాల వ్యవధిలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో డ్రాగన్స్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.చివరి వరకు అదే జోరు కొనసాగించిన తమిళనాడు జట్టు విజయం సాధించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్లాడి నాలుగు విజయాలు సాధించిన డ్రాగన్స్ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానంలో నిలిచింది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగాల్ టైగర్స్ పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్ల్లో హైదరాబాద్ తూఫాన్స్తో సూర్మా హాకీ క్లబ్, ఢిల్లీ ఎస్జీ పైపర్స్తో యూపీ రుద్రాస్ తలపడతాయి. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
ఆక్లాండ్: ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 3–6, 6–4, 12–10తో మూడో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో 9–10తో యూకీ–ఒలివెట్టి ద్వయం ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన యూకీ–ఒలివెట్టి జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో యూకీ–ఒలివెట్టి నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే సెమీఫైనల్లో క్రిస్టియన్ హారిసన్–రాజీవ్ రామ్ (అమెరికా)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. -
పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ
బాసెల్: స్విస్ ఇండోర్స్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోల (రూ. 18 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి రౌండ్లో మొత్తం ఏడు గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. 93 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 14 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్లను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం అపార అనుభవజు్ఞలైన జేమీ ముర్రే–జాన్ పీర్స్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. డబుల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ అయిన 38 ఏళ్ల జేమీ ముర్రే మొత్తం 32 టైటిల్స్ సాధించాడు. ఇందులో రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ (2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. 36 ఏళ్ల జాన్ పీర్స్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్లో స్వర్ణ పతకం సాధించాడు. కెరీర్ మొత్తంలో 28 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జాన్ పీర్స్ 2017లో ఆ్రస్టేలియన్ ఓపెన్లో డబుల్స్ చాంపియన్గా నిలిచాడు. -
సెమీ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ ఏటీపీ టోర్నీ చెంగ్డూ ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ బాంబ్రీ – ఫ్రాన్స్ ప్లేయర్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడి చక్కని పోరాట పటిమతో తమకన్నా మెరుగైనా ర్యాంకింగ్ ప్లేయర్లను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి జంట 5–7, 6–3, 12–10తో ఈక్వెడార్కు చెందిన గాంజాలొ ఎస్కోబార్–డీగో హిదాల్గొ జోడీపై చెటడోడ్చి గెలిచింది. ఆరంభ సెట్లో వెనుకబడిన భారత్–ఫ్రాన్స్ ద్వయం రెండో సెట్లో అసాధారణ ఆటతీరుతో ఈక్వెడార్ జంటకు ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్ను కైవసం చేసుకొంది. కీలకమైన ఆఖరి సెట్ ఊహించని విధంగా సాగింది. ఇరు జోడీలు ధీటుగా ఆడటంతో ప్రతి పాయింట్ కోసం పెద్ద పోరాటం తప్పలేదు. చివరకు 12–10తో యూకీ బాంబ్రి జోడీ సెట్తో పాటు మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో భారత్–ఫ్రాన్స్ జోడీ... రెండో సీడ్ ఇవాండ్ డొడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఎదర్కొంటుంది. -
Wimbledon: బాంబ్రీ జోడీ ముందంజ.. తొలి రౌండ్లో ఘన విజయం
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్తో తలపడనున్నారు.మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు. -
యూకీ బాంబ్రీ జోడీ ఓటమి
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయింది. స్టుట్గార్ట్లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 5–7, 4–6తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం 12 ఏస్లు సంధించింది. తమ సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయింది. -
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టుట్గార్ట్లోబుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో థియో అరిబెజ్–సాదియో (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
స్టుట్గార్ట్లో జరుగుతున్న బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6–4, 6–2తో రెండో సీడ్ నీల్ స్కప్స్కీ (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీని బోల్తా కొట్టించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం ఐదు ఏస్లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
టైటిల్కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం ఏడు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
టైటిల్ పోరుకు యూకీ–అల్బానో జోడీ
మ్యూనిక్: భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్–మెడ్లెర్ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ఏడు ఏస్లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సెమీస్లో యూకీ జోడీ
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–3తో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ జోడీ సంచలనం
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ఇండో–ఫ్రెంచ్ ద్వయం మూడో సీడ్ సాండర్ జిలె–జొరాన్ వ్లీజెన్ (బెల్జియం) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో యూకీ–ఒలివెట్టి జోడీ 4–6, 7–6 (7/5), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో విజయాన్ని అందుకుంది. 11 ఏస్లతో అదరగొట్టిన యూకీ–ఒలివెట్టి నిర్ణాయక టైబ్రేక్లో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
యూకీ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 6–7 (2/7)తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–డోడిగ్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. యూకీ–హాస్లకు 48,760 డాలర్ల (రూ. 40 లక్షలు) ప్రైజ్మనీ దక్కింది. -
యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్లోనే నిష్క్రమణ
Brisbane International Semifinals: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో లాయిడ్ గ్లాస్పూల్(ఇంగ్లండ్)- జీన్ జులెన్ రోజర్(నెదర్లాండ్స్) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ యూకీ- రాబిన్ జోడీ... సెకండ్ సీడ్ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఏ దశలోనూ లాయిడ్- జీన్ జంటపై యూకీ- రాబిన్ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్లోనే వీరు ఇంటిబాట పట్టారు. క్వార్టర్ ఫైనల్లో అలా గెలుపొంది ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ –రాబిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్ లామోన్స్–జేక్సన్ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సర్వీస్లను కాపాడుకున్నాయి. ఈ క్రమంలో టైబ్రేక్లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్షిప్స్ డబుల్స్ కాంపిటీషన్లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హ్యారిస్తో కలిసి విజేతగా నిలిచాడు. చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్గా రషీద్.. కెప్టెన్? -
బోపన్న... విజయంతో వీడ్కోలు
లక్నో: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్లో బోపన్న–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6–2, 6–1తో బెన్చెట్రిట్–యూనెస్ లారూసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరఫున మొత్తం 50 మ్యాచ్లు ఆడాడు. డబుల్స్లో 13 మ్యాచ్ల్లో నెగ్గి, 10 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. సింగిల్స్లో 10 మ్యాచ్ల్లో గెలిచి, 17 మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాడు. డేవిస్ కప్ నుంచి రిటైరయిన్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో బోపన్న టెన్నిస్ కెరీర్ను కొనసాగిస్తాడు. డబుల్స్ మ్యాచ్ తర్వాత జరిగిన సింగిల్స్లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్ దిల్మీపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్ను ఓడించడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. అమెరికాలోని న్యూపోర్ట్లో జరిగిన ఈ టోరీ్నలో సాకేత్–యూకీ ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో పోరాడి ఓడింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సాకేత్–యూకీ జంట 7–6 (7/2), 6–7 (2/7), 9–11తో టాప్ సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. సాకేత్–యూకీలకు 10,660 డాలర్ల (రూ. 8 లక్షల 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్లో ఉన్నాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సాకేత్, యూకీ రెండు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
రన్నరప్ అనిరుధ్ జోడీ; మూడో సీడ్పై సాకేత్ జోడీ విజయం
సాక్షి, హైదరాబాద్: స్ల్పిట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ ఫైనల్లో ఓడిపోయింది. 70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్ రెబూల్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)–కైచి ఉచిడా (జపాన్) జంటను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించడంతో నేరుగా ఫైనల్ ఆడారు. అనిరుధ్–విజయ్లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మూడో సీడ్పై సాకేత్ జోడీ విజయం బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్షిప్లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్, యూకీ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
క్వార్టర్స్లో సాకేత్–యూకీ జోడీ ఓటమి
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్షిలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్, యూకీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. నాలుగుసార్లు తమ సర్వీస్ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్లో మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సాకేత్–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్కుమార్ (భారత్)–ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీ తొలి రౌండ్లో 4–6, 6–3, 5–10తో సాండెర్ జిలె–విలెజిన్ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Myneni Saketh: సెమీస్లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
Saketh Myneni- Yuki Bhambri: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్–మార్కస్ జిరోన్ (అమెరికా) జోడీపై గెలిచింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–యూకీ మూడు ఏస్లు సంధించారు. క్వార్టర్ ఫైనల్లో జూలియన్ క్యాష్–హెన్రీ ప్యాటర్న్ (బ్రిటన్)లతో సాకేత్–యూకీ ఆడతారు. చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం -
Davis Cup 2023: తొలి సింగిల్స్లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
బ్యాంకాక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాకేత్-బాంబ్రీ జోడీ
నొంతాబురి (థాయ్లాండ్): గత ఏడాది ఏకంగా ఆరు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ సాధించి అదరగొట్టిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ కొత్త ఏడాదిలో ఆడిన రెండో టోర్నీలోనే టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ ఢిల్లీకి చెందిన తన సహచరుడు యూకీ బాంబ్రీతో కలిసి విజేతగా నిలిచాడు. గంటా 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్–యూకీ జోడీ 2–6, 7–6 (9/7), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టోఫర్ రుంగ్కాట్ (ఇండోనేసియా)–అకీరా సాంటిలాన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచింది. చాంపియన్గా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 4,645 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షల 77 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా టైటిల్తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో సాకేత్ తొమ్మిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 74వ ర్యాంక్కు, యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 90వ ర్యాంక్కు చేరుకుంటారు. తదుపరి సాకేత్–యూకీ జోడీ సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో బరిలోకి దిగనుంది. -
Tata Open Maharashtra: రామ్కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్కుమార్ రామనాథన్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకున్నారు. -
Guangzhou Open 2022: గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో రన్నరప్ సాకేత్ జోడీ
ఈ ఏడాది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాలని ఆశించిన భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. కొరియాలో జరిగిన గ్వాంగ్జు ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ జోడీ 6–2, 3–6, 6–10తో టాప్ సీడ్ బారియెంటోస్ (కొలంబియా)–రెయస్ వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. సాకేత్–యూకీ జోడీకి 1,800 డాలర్ల (రూ. లక్షా 48 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Korea Open 2022: సెమీఫైనల్లో సాకేత్–యూకీ జోడీ
కొరియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని పురుషుల డబుల్స్లో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రి జోడీ 6–3, 6–4తో రోడ్రిగ్వెజ్ (కొలంబియా)–డీగో హిడాల్గొ (ఈక్వెడార్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీఫైనల్లో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)– నాథనిల్ లమన్స్ (అమెరికా) జోడీతో భారత ద్వయం పోటీపడుతుంది. మరో వైపు ఇజ్రాయెల్లో జరుగుతున్న టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్లో బోపన్న–మిడిల్కూప్ జంట 4–6, 7–6(7/5), 10–5తో ఫ్రాంకో స్కుగొర్ (క్రొయేషియా)–డెనిస్ మొల్చనొవ్ (ఉక్రెయిన్) ద్వయంపై గెలిచింది. సెమీస్లో బోపన్న జోడీ... ఫ్రాన్స్కు చెందిన ఫాబియన్ రిబొల్–సాడియో డంబియా జంటతో తలపడుతుంది. చదవండి: Sachin Tendulkar: బ్రెట్ లీ బౌలింగ్లో ట్రేడ్మార్క్ షాట్.. ఎన్నాళ్లయిందో -
US Open Qualifiers: యూకీ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 552వ ర్యాంకర్ యూకీ 7–6 (7/4), 6–4తో తొమ్మిదో సీడ్, ప్రపంచ 107వ ర్యాంకర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నాడు. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. అయితే భారత నంబర్వన్, ప్రపంచ 241వ ర్యాంకర్ రామ్కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ప్రపంచ 762వ ర్యాంకర్ బ్రూనో కుజుహారా (అమెరికా) 6–3, 7–5తో రామ్కుమార్ను ఓడించాడు. చదవండి: BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం -
Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
షికాగో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట నాలుగు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. ఈ సీజన్లో సాకేత్–యూకీ జంట అద్భుతమైన ఫామ్లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్ టైటిల్స్ను, రెండు ఐటీఎఫ్ టోర్నీ టైటిల్స్ను సాధించారు. -
సాకేత్–యూకీ జోడీ ఖాతాలో నాలుగో టైటిల్
అమెరికాలో జరిగిన లెక్సింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ 3–6, 6–4, 10–8తోబ్రువెర్ (నెదర్లాండ్స్)–మెకగ్ (బ్రిటన్)లపై నెగ్గారు. ఈ ఏడాది సాకేత్–యూకీకిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 46 వేలు) లభించింది. -
తొలి రౌండ్లోనే ఓడిన రామ్కుమార్, యూకీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రామ్కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో రామ్కుమార్ 5–7, 4–6తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) చేతిలో... యూకీ బాంబ్రీ 5–7, 1–6తో జపాటా మిరాలెస్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 128 మంది పోటీపడుతుండగా... 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ప్రధాన టోర్నీ ఈనెల 27న మొదలవుతుంది. చదవండి: ఫార్ములావన్ టెస్టుకు భారత రేసర్ జెహాన్ -
సాకేత్ జంటకు టైటిల్.. ప్రైజ్మనీ ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 11వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్ను గెల్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్లోని ప్రోస్తెజోవ్ పట్టణంలో శుక్రవారం జరిగిన చెక్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 6–3, 7–5తో రెండో సీడ్ రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–ఆంద్రెజ్ మార్టిన్ (స్లొవేకియా) జంటపై నెగ్గింది. సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 6–4తో టాప్ సీడ్ ఎర్లెర్–మెడ్లెర్ (ఆస్ట్రియా) జంటను... క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/4), 3–6, 13–11తో మూడో సీడ్ మొల్చ నోవ్ (ఉక్రెయిన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయే షియా) జోడీని ఓడించడం విశేషం. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 5,250 యూరో ల (రూ. 4 లక్షల 37 వేలు) ప్రైజ్మనీ తోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
సెమీస్లో ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. మెక్సికోలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 3–6, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ మిజా–రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జంటకు 1,080 డాలర్ల (రూ.82 వేలు) ప్రైజ్మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
యూకీ బాంబ్రీకి నిరాశ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్లో యూకీ 3–6, 4–6తో ఒనీల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో యూకీ ఐదు ఏస్లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. -
యూకీ బాంబ్రీ శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్కు చేరగా... రామ్కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో యూకీ బాంబ్రీ 6–4, 6–2తో జావో డొమింగెస్ (పోర్చుగల్)పై నెగ్గగా... రామ్కుమార్ 3–6, 5–7తో మార్కోమొరోని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకిత రైనా 0–6, 1–6తో సురెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. -
యూకీ పరాజయం
యాంట్వర్ప్ (బెల్జియం): యూరోపియన్ ఓపెన్ ఏటీ పీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ యూకీ 6–7 (6/8), 7–5, 1–6తో ప్రపంచ 167వ ర్యాంకర్ సాల్వటోర్ కరూసో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన యూకీకి 6,200 (రూ. 5 లక్షల 20 వేలు) యూరోలు ప్రైజ్మనీగా లభించాయి. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–5, 6–4తో లియాండర్ పేస్ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) ద్వయంపై గెలిచింది. -
తొలి రౌండ్లోనే యూకీ బాంబ్రీ పరాజయం
ఫీవర్–ట్రీ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్షిప్ నుంచి భారత నంబర్వన్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ మిలోస్ రావ్నిచ్ (కెనడా)తో లండన్లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 1–6, 1–3తో వెనుకబడి ఉన్న దశలో గాయం కారణంగా తప్పుకున్నాడు. క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన యూకీకి తొలి రౌండ్లోనే వైదొలిగినప్పటికీ 14,690 యూరోల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
మెయిన్ ‘డ్రా’కు యూకీ బాంబ్రీ అర్హత
లండన్: భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఏటీపీ–500 ఫీవర్ ట్రీ చాంపియన్షిప్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. లండన్లో జరుగుతున్న ఈ టోర్నీలో అతను క్వాలిఫయింగ్ విభాగంలో ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో యూకీ 6–4, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన యూకీ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ మిలోస్ రావ్నిచ్ (కెనడా)తో ఆడతాడు. -
చైనాతో డేవిస్ కప్ పోటీకి యూకీ దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో చైనాతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్కు భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఉదర సంబంధిత గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని యూకీ తెలిపాడు. యూకీ స్థానంలో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వచ్చాడు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తియాన్జిన్ వేదికగా చైనాతో భారత్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో భారత్ 3–0తో ఆధిక్యంలో ఉంది. గత రెండు వారాల్లో జరిగిన ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’లో ఆడిన యూకీ గైర్హాజరీ భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశముంది. -
యూకీ ముందంజ
ఫ్లోరిడా (అమెరికా): మయామి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ యూకీ 7–5, 6–3తో మీర్జా బేసిక్ (బోస్నియా)పై విజయం సాధించాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ జాక్ సోక్ (అమెరికా)తో యూకీ తలపడతాడు. -
మెయిన్ ‘డ్రా’కు యూకీ బాంబ్రీ
ఫ్లోరిడా (అమెరికా): భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ వరుసగా రెండో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. గతవారం ఇండియన్ వెల్స్ టోర్నీలో క్వాలిఫయర్గా పాల్గొని మూడో రౌండ్కు చేరిన ఈ ఢిల్లీ ప్లేయర్... తాజాగా మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ యూకీ 7–5, 6–2తో ప్రపంచ 133వ ర్యాంకర్ ఇలియాస్ వైమెర్ (స్వీడన్)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో బేసిక్ మీర్జా (బోస్నియా)తో యూకీ ఆడతాడు. ఈ మ్యాచ్లో అతను నెగ్గితే రెండో రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) ప్రత్యర్థిగా ఉంటాడు. -
పోరాడి ఓడిన యూకీ
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో భారత యువ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ సంచలన ప్రదర్శన ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో 25 ఏళ్ల ఈ ఢిల్లీ ఆటగాడికి ప్రపంచ 21వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ప్రపంచ 110వ ర్యాంకర్ అయిన యూకీ బాంబ్రీ 7–6 (7/4), 4–6, 4–6తో క్వెరీ చేతిలో తుదికంటా పోరాడి ఓడాడు. మూడో రౌండ్లో నిష్క్రమించిన యూకీకి 47,170 డాలర్ల (రూ. 30 లక్షల 66 వేలు) ప్రైజ్మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వెరీతో రెండు గంటల 20 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత ఆటగాడు తొలి సెట్ను అలుపెరగని పోరాటంతో గెలిచాడు. కానీ తర్వాత రెండు సెట్లలో ప్రత్యర్థి పైచేయి సాధించడంతో ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో యూకీ తనకన్నా మెరుగైన ర్యాంకర్ మహుత్ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై సంచలన విజయాలు సాధించాడు. మేటి ప్రత్యర్థులను ఓడించిన తనకు సామ్ క్వెరీ చేతిలో క్లిష్టమైన పోటీ ఎదురైందని యూకీ చెప్పాడు. ఈ టోర్నీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తనలో ఎవరినైనా ఓడించగలనన్న ధీమా వచ్చిందన్నాడు. -
యూకీ సంచలనం
కాలిఫోర్నియా (అమెరికా): భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో 25 ఏళ్ల ఈ ఢిల్లీ ప్లేయర్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 110వ ర్యాంకర్ యూకీ 6–4, 6–4తో ప్రపంచ 12వ ర్యాంకర్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మూడో రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా)తో యూకీ తలపడతాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 7–5, 2–6, 4–10తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)–సామ్ క్వెరీ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఫెడరర్ ముందుకు... జొకోవిచ్ ఇంటికి మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లగా... ఐదుసార్లు మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. రెండో రౌండ్లో ఫెడరర్ 6–3, 7–6 (8/6)తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గగా... క్వాలిఫయర్ టారో డానియల్ (జపాన్) 7–6 (7/3), 4–6, 6–1తో పదో సీడ్ జొకోవిచ్ను ఓడించాడు. -
కెరీర్లో మరిచిపోలేని విజయం...
కాలిఫోర్నియా : ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లోనే మరిచిపోలేని అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టెన్నిస్లో ప్రపంచ నంబర్ 12 ఫ్రెంచ్ క్రీడాకారుడు లూకాస్ పౌల్లెను ఓడించి చరిత్ర సృష్టించాడు. 110వ ర్యాంక్లో ఉన్న యూకీ ఈ విజయంతో టెన్నిస్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు. సోమవారం జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సెకండ్ రౌండ్లో 6-4, 6-4 తేడాతో లూకాస్ పౌల్లెపై విజయ దుందుభి మోగించాడు. ఈ విజయంతో బాంబ్రీకి 40 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు 47 వేల డాలర్ల నజరానా లభించనుంది. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన పొడగరి, ప్రపంచ 21 ర్యాంకర్ శామ్ క్వెర్రితో బాంబ్రీ తలపడనున్నాడు. 2017లో జరిగిన సిటీ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ షిప్లో ప్రపంచ 22 ర్యాంకర్ గేల్ మాన్లిస్ను ఓడించి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన చెన్నై ఓపెన్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫాబియో ఫోగ్నిని ఓడించి సత్తా చాటాడు. -
మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో...
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ మరో విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం మెల్బోర్న్లో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 6–0, 6–2తో కార్లోస్ తబెర్నర్ (స్పెయిన్)పై అలవోకగా గెలిచాడు. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. పీటర్ పొలాన్స్కీ (కెనడా)తో జరిగే మూడో రౌండ్లో యూకీ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతాడు. 2015, 2016లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన యూకీ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
బెంగళూరు ఓపెన్ క్వార్టర్స్లో యూకీ బాంబ్రీ
స్వదేశంలో వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ బెంగళూరు ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 6–2, 7–6 (7/0)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో సుమీత్ నాగల్ (భారత్) 6–4, 4–6, 7–5తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–2, 6–7 (1/7), 6–1తో మార్క్ పాల్మన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్కు చేరారు.అయితే రామ్కుమార్ రామనాథన్ 7–6 (7/3), 2–6, 4–6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిన యూకీ
సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. వాషింగ్టన్లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ 4–6, 6–4, 3–6తో 45వ ర్యాంకర్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయాడు. యూకీకి 44,595 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 28 లక్షల 38 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఇదే టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా (భారత్)–మోనికా (రొమేనియా) ద్వయం 6–1, 5–7, 8–10తో బుచార్డ్ (కెనడా)–స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీ 5–7, 4–6తో మైక్ బ్రయాన్–బాబ్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
యూకీ బాంబ్రీ సంచలనం
ఏటీపీ సిటీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సంచలనం సృష్టించాడు. క్వాలిఫయర్గా బరిలోకి దిగి ప్రపంచ 22వ ర్యాంకర్ గేయల్ మోన్ఫిల్స్ను మట్టికరిపించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో ఈ ఢిల్లీ కుర్రాడు 6–3, 4–6, 7–5తో ఆరో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. గంటా 51 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. బాంబ్రీ కెరీర్లో ఇది రెండో అతిపెద్ద సింగిల్స్ విజయం. 2014 చెన్నై ఓపెన్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫాబియో ఫొగిని ఫిట్నెస్ సమస్యతో మ్యాచ్ మధ్యలో వైదొలగడంతో బాంబ్రీ గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్లో బాంబ్రీ అర్జెంటీనాకు చెందిన గైడో పెల్లాతో తలపడతాడు. -
డేవిస్కప్ మ్యాచ్కు యూకీ బాంబ్రీ దూరం
మోకాలి గాయం కారణంగా భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఉజ్బెకిస్తాన్తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈనెల 7 నుంచి 9 వరకు బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ కీలక పోరు కోసం ఆదివారం సన్నాహక శిబిరం ప్రారంభమైన రోజే యూకీ నిష్క్రమించడంతో భారత్కు గట్టి దెబ్బ తగిలింది. యూకీ గైర్హాజరు కారణంగా రిజర్వ్ ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బోపన్నలలో ఒకరు ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. అయితే ఎవరు ఆడతారనే దానిపై వ్యాఖ్యానించేందుకు భారత నాన్ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నిరాకరించారు. మరోవైపు జట్టులో ఏడో ఆటగాడిగా ప్రాక్టీస్ కోసం ఎంపికైన విష్ణువర్ధన్ కూడా ఆదివారం గాయపడ్డాడు. -
సెమీస్లో యూకీ ఓటమి
న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యూకీ 3–6, 5–7తో టాప్ సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ రెండు డబుల్ ఫాల్ట్లు చేయడంతోపాటు తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయాడు. -
మెయిన్ డ్రాకు చేరువలో యుకీ
మెల్బోర్న్: భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ముందంజ వేశాడు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో యూకీ 6–3, 6–4తో పెడ్జా క్రిస్టిన్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 68 నిమిషాల్లో మ్యాచ్ను ముగించిన యూకీ, మెయిన్ డ్రాకు అర్హత పొందడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. చివరిదైన మూడో రౌండ్ పోరులో 21వ సీడ్ ఎర్నెస్టో ఎస్కోబెడో (అమెరికా)తో యూకీ తలపడతాడు. -
యూకీ శుభారంభం
తొలి రౌండ్లోనే సాకేత్ ఓటమి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మాజీ నంబర్వన్ యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించగా... ప్రస్తుత భారత నంబర్వన్ సాకేత్ మైనేని మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్లో యూకీ 6–1, 6–4తో ఏడో సీడ్, ప్రపంచ 116వ ర్యాంకర్ స్టీఫెన్ కొజ్లోవ్ (అమెరికా)పై గెలుపొందాడు. మరోవైపు సాకేత్ 0–6, 2–6తో 189వ ర్యాంకర్ పీటర్ గొజోవిక్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మోచేతి గాయం కారణంగా గత ఏడాది ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉండటంతో యూకీ 534వ ర్యాంక్కు చేరుకున్నాడు. దాంతో గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ఈ ఢిల్లీ క్రీడాకారుడు ఈసారి మాత్రం క్వాలిఫయింగ్లో పోటీపడుతున్నాడు. రెండో రౌండ్లో పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)తో యూకీ ఆడతాడు. 71 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో యూకీ నెట్ వద్ద 28 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ‘పరిస్థితికి తగ్గట్టు ఆడతాను. గాయం నుంచి కోలుకున్నాక ఆటను ఆస్వాదిస్తున్నాను. రెండో రౌండ్ మ్యాచ్లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాను’ అని యూకీ వ్యాఖ్యానించాడు. మరోవైపు పాదానికి గాయం కావడంతో కోర్టులో చురుకుగా కదల్లేకపోయానని, స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని సాకేత్ వివరించాడు. -
యూకీ శుభారంభం
చెన్నై: టెన్నిస్ సీజన్ తొలి టోర్నమెంట్ చెన్నై ఓపెన్లో భారత యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 7–5, 6–1తో మార్కో సెసిహినాతో (ఇటలీ)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)తో యూకీ తలపడతాడు. మరోవైపు భారత నంబర్వన్ సాకేత్ మైనేనికి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ల్లో తొలి రౌండ్లో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో సాకేత్ ఆడనున్నాడు. -
తొలి రౌండ్లోనే యుకీ భాంబ్రీ అవుట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యుకీ 7-5, 6-1, 6-2 స్కోరుతో ప్రపంచ ఆరో ర్యాంకర్ థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో యుకీ వరుస సెట్లలో మ్యాచ్ను కోల్పోయాడు. తొలిసెట్లో హోరాహోరీగా తలపడిన యుకీ ఆ తర్వాత థామస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. -
సింగిల్స్ ఫైనల్లో యూకీ
పుణే: భారత పురుషుల టెన్నిస్ నంబర్వన్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ యూకీ 7-6 (8/6), 6-3తో నాలుగో సీడ్ జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)తో యూకీ తలపడతాడు. ఈ సీజన్లో ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో ఫైనల్కు చేరుకోవడం యూకీకిది ఐదోసారి. షాంఘై టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ఢిల్లీ ఆటగాడు ఢిల్లీ, సమర్కండ్, తైవాన్ టోర్నీలలో రన్నరప్గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్ (భారత్)-మాక్సిమిలన్ న్యూక్రైస్ట్ (ఆస్ట్రియా) జోడీ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో దివిజ్-న్యూక్రైస్ట్ జంట 6-1, 3-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో మెనెన్డెజ్-గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సెమీస్లో సాకేత్, యూకీ
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 1-6, 6-1తో బ్రిటన్ ఆటగాడు బ్రిడెన్ క్లీన్పై నెగ్గాడు. యూకీ బాంబ్రి 6-4, 6-4తో ఆడ్రియన్ (స్పెయిన్)పై గెలిచాడు. -
క్వార్టర్స్లో సాకేత్, యూకీ
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు భారత అగ్రశ్రేణి ఆట గాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ మైనేని 6-3, 6-2తో ల్యూక్ బామ్బ్రిడ్జి (బ్రిటన్)పై అలవోకగా గెలుపొందగా... ఏడో సీడ్ యూకీ 1-6, 7-5, 7-6 (7/1)తో లాస్లో జెరె (సెర్బియా)పై చెమటోడ్చి విజయం సాధించాడు. తొలి రౌండ్లో రెండో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై సంచలన విజయం సాధించిన ల్యూక్ రెండో రౌండ్లో సాకేత్ ముందు తేలిపోయాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ -దివిజ్ (భారత్) జోడీ 4-6, 6-7 (4/7)తో లాస్లో జెరె-పెజా (సెర్బియా) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్లో యూకీ
న్యూఢిల్లీ : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో గురువారం జరి గిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 6-3, 6-1తో ఎనిమిదో సీడ్ జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ)పై అలవోక విజయం సాధించాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ గో సొయెదా (జపాన్)తో యూకీ ఆడతాడు. -
యుకీ, సోమ్దేశ్ శుభారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యుకీ 7-5 7-6(2)తో అలెగ్జాండర్ కుడ్రెవ్సెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో సోమ్దేవ్ 4-6, 2-0 స్కోరుతో ఉన్న దశలో ప్రత్యర్థి అంటోనియో వీక్ (క్రొయేషియా) గాయం కారణంగా వైదొలిగాడు. భారత ఆటగాళ్లు సనమ్ సింగ్, రామ్కుమార్ రామనాథన్ కూడా టోర్నీలో ముందంజ వేశారు. -
పోరాడి ఓడిన యూకీ
మెల్బోర్న్: సింగిల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన భారత యువతార యూకీ బాంబ్రీ ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ ఢిల్లీ ఆటగాడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ప్రత్యర్థి, ఆరో సీడ్ ఆండీ ముర్రేకు విజయం దక్కడానికి కష్టపడేలా చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 317వ ర్యాంకర్ యూకీ 3-6, 4-6, 6-7 (3/7)తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశాడు. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ రెండుసార్లు ముర్రే సర్వీస్ను బ్రేక్ చేయడం విశేషం. ఐదు ఏస్లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్లు చేసిన యూకీ నెట్వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు సాధించాడు. మూడో సెట్లో ఒకదశలో యూకీ 4-1తో ఆధిక్యంలోకి కూడా వెళ్లాడు. అయితే ఇప్పటికే 35 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవమున్న ముర్రే వెంటనే తేరుకున్నాడు. వరుసగా మూడు గేమ్లు నెగ్గి స్కోరును 4-4 వద్ద సమం చేశాడు. ఆఖరికి టైబ్రేక్లో సెట్ను నెగ్గి విజయాన్ని దక్కించుకున్నాడు. అనంతరం యూకీ ఆటతీరును ఈ బ్రిటన్ ప్లేయర్ మెచ్చుకున్నాడు. ‘యూకీ చాలా దూకుడుగా ఆడాడు. అతనిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. అతని ఆటతీరును చూస్తే ర్యాంకింగ్స్లో 300కు సమీపంలో ఉండకూడదు. ఈ ఏడాది ముగిసేలోపు అతని ర్యాంక్లో చాలా పురోగతి కనిపిస్తుంది’ అని ముర్రే వ్యాఖ్యానించాడు. మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా శుభారంభం చేయగా... 11వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఫెడరర్ 6-4, 6-2, 7-5తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)పై, నాదల్ 6-3, 6-2, 6-2తో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై, బెర్డిచ్ 6-3, 7-6 (7/1), 6-3తో అలెజాంద్రో ఫలా (కొలంబియా)పై, దిమిత్రోవ్ 6-2, 6-3, 6-2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై గెలిచారు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా యువ ఆశాకిరణం థనాసి కొకినాకిస్ 5-7, 6-0, 1-6, 7-6 (7/2), 8-6తో గుల్బిస్ను బోల్తా కొట్టించాడు. షరపోవా, హలెప్ ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్-10 లో ఉన్న ఐదో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), తొమ్మిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఇద్దరితోపాటు 16వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్), 23వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా), 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా), 28వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ), 32వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. మరోవైపు రెండో సీడ్ షరపోవా (రష్యా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) శుభారంభం చేశారు. లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) 1-6, 6-3, 6-2తో ఇవనోవిచ్పై, ఇరీనా బెగూ (రుమేనియా) 6-4, 0-6, 6-1తో కెర్బర్పై సంచలన విజయాలు సాధించారు. షరపోవా 6-4, 6-1తో పెట్రా మార్టిక్ (చెక్ రిపబ్లిక్)పై, హలెప్ 6-3, 6-2తో కరీన్ నాప్ (ఇటలీ)పై, బౌచర్డ్ 6-2, 6-4తో ఫ్రయిడ్సామ్ (జర్మనీ)పై, మకరోవా 6-2, 6-2తో మెస్టాచ్ (బెల్జియం)పై నెగ్గారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో యూకీ
మెల్బోర్న్: మరో మ్యాచ్ గెలిస్తే భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 7-6 (10/8), 6-3తో యోషిహిటో నిషిఓకా (జపాన్)పై గెలిచాడు. శనివారం జరిగే క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో చేజ్ బుకానన్ (అమెరికా)తో యూకీ తలపడతాడు. -
సోమ్దేవ్, యుకీ శుభారంభం
పుణె: ఏటీపీ పుణె చాలెంజర్లో భారత ఆటగాళ్లు సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీ భాంబ్రీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్దేవ్, యుకీ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. కాగా వర్ధమాన ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓటమి చవిచూశాడు. సోమ్దేవ్ తొలిరౌండ్లో 6-1, 6-3 స్కోరుతో అర్జున్ ఖడేపై గెలుపొందాడు. మరో మ్యాచ్లో యుకీ 6-3 6-0 స్కోరుతో చైనీస్ తైపీ ఆటగాడు లియంగ్-చి హాంగ్ను నెగ్గాడు. ఇతర మ్యాచ్ల్లో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ గెలుపొందారు. -
టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు
ఇంచియాన్:ఆసియా క్రీడల్లో దుమ్ములేపుతూ క్వార్టర్స్ కు వెళ్లిన భారత టెన్నిస్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి చవిచూసింది. దీంతో సింగిల్స్ విభాగంలో భారత్ పెట్టకున్న ఆశలు ఆవిరైపోయాయి. భారత పురుషుల విభాగంలో సనమ్ సింగ్ పై 6-7, 6-7 తేడాతో కజికిస్తాన్ ఆటగాడు నిడోవోసావ్ విజయం సాధించాడు. అనంతరం యూకీ బాంబ్రీ కూడా ఇదే బాటలో పయనించాడు. యూకే బాంబ్రీ 2-6, 7-6, 1-6 తేడాతో మిఖైల్ కుకుష్ కిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చినా భారత్ 1-2 తేడాతో వెనుకబడటంతో ఈ ఈవెంట్ లో పతకం ఆశలు కూడా ఆవిరయ్యాయి. -
ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే...
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు దుమ్ము రేపారు. ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషులు సింగిల్స్ విభాగంలో జరిగిన మ్యాచ్ లో నేపాల్ ఆటగాడు జితేంద్ర పరియార్ పై భారత్ ఆటగాడు యూకీ బాంబ్రీ 6-0 6-0 తో విజయం సాధించాడు. ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేశాడు. మరో మ్యాచ్ లో అభిషేక్ బస్టోలా(నేపాల్)పై భారత్ టెన్నిస్ ప్లేయర్ సనమ్ సింగ్ 6-0 6-1తో గెలిచాడు. డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్-సాకేత్ మైనేని(భారత్) జోడీ సంతోష్ ఖాత్రి-సోనమ్ దావాపై 6-0 6-0తో ఘన విజయం సాధించింది. -
డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
బెంగళూర్: వరల్డ్ గ్రూప్కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్ కు తన తొలి మ్యాచ్ లో చుక్కెదురైంది. డేవిస్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసింది. సెర్బియా స్టార్ ఆటగాడు దుసాన్ లాజోవిచ్ 6-3,6-2,7-5 తేడాతో భారత క్రీడాకారుడు యుకీ బాంబ్రీని మట్టికరిపించాడు. దీంతో డేవిస్ కప్ లో సెర్బియా తొలి విజయాన్ని నమోద చేసింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శుక్రవారం ఆరంభమైన ఈ పోరులో యుకీ బాంబ్రీ తీవ్ర ఒత్తిడితో ఆటను కొనసాగించాడు. వరుస సెట్లను కోల్పోయి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమై ఓటమి చవిచూసింది. 2010లో వరల్డ్ గ్రూప్కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది. -
సోమ్ దేవ్ కు షాకిచ్చిన యూకీ బాంబ్రీ
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సోమ్ దేవ్ వర్మన్ కు యూకీ బాంబ్రీ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ 6-2, 6-4 తేడాతో సోమ్ దేవ్ పై అలవోకగా విజయం సాధించాడు. ఫైనల్లో యూకీ బాంబ్రీ, రష్యాకు చెందిన అన్ సీడెడ్ అలెగ్జాండర్ కుద్రయవ్త్సేవ్ తో తలపడనున్నాడు. సింగిల్స్ లో చెలరేగిన యూకీ, డబుల్స్ కూడా చెలరేగిపోయాడు. మైఖేల్ వీనస్ తో కలిసి ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. యూకీ-మైఖేల్ జోడి 6-2, 6-1 తేడాతో రూబెన్-ఆర్టెన్ లపై విజయం సాధించారు. -
భారత్ శుభారంభం
ఇండోర్: కాలి కండరాలు పట్టేసినా... పట్టుదలతో పోరాడిన యూకీ బాంబ్రీ భారత జట్టుకు శుభారంభం అందించాడు. దీంతో చైనీస్ తైపీతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోటీలో తొలి రోజు భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్లో యూకీ బాంబ్రీ 6-2, 6-4, 6-7 (1/7), 6-3తో సుంగ్ హువా యాంగ్ను ఓడించాడు. మూడో సెట్లో యూకీ కాలికి గాయం కావడంతో భారత శిబిరంలో ఆందోళన కలిగింది. కానీ ఈ యువ ఆటగాడు పోరాడి గెలిచాడు. సోమ్దేవ్ దేవ్వర్మన్, టీ చెన్ల మధ్య రెండో మ్యాచ్ 6-7 (4/7), 7-6 (7/3), 1-6, 6-2, 7-7 స్కోరు వద్ద వెలుతురులేమి కారణంగా శనివారానికి వాయిదా పడింది. చివరి సెట్లో స్కోరు 5-3తో ఉన్నపుడు సోమ్దేవ్ తన సర్వీస్ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. టీ చెన్ మూడు మ్యాచ్ పాయింట్లు కాచుకొని సోమ్దేవ్ సర్వీస్ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్నూ నిలబెట్టుకొని స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాతి గేముల్లో ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకున్నారు. మైదానంలో ఫ్లడ్లైట్లు లేకపోవడం... వెలుతురు మందగించడంతో మ్యాచ్ను శనివారానికి వాయిదా వేశారు. సింగిల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత సాకేత్ మైనేని-బోపన్న (భారత్) జోడి యిన్ పెంగ్-హాన్ లీ (చైనీస్ తైపీ) జంటతో డబుల్స్ ఆడుతుంది. -
యూకీ బాంబ్రీ పరాజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత యువతార యూకీ బాంబ్రీకి తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21 ఏళ్ల యూకీ 3-6, 6-1, 2-6తో పొటిటో స్టారెస్ (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే డబుల్స్ విభాగంలో మాత్రం యూకీ నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నాడు. చైనాలో ఇటీవల జరిగిన ‘వైల్డ్ కార్డు’ ప్లే ఆఫ్ టోర్నీలో యూకీ-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడి విజేతగా నిలువడంతో ఈ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే అవకాశం లభించింది. -
సాకేత్ జోడి పరాజయం
చెన్నై: భారత్లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. డబుల్స్లో ఆంధ్రప్రదేశ్ యువతార సాకేత్ మైనేని జోడి సెమీఫైనల్లో... రామ్కుమార్-శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. సింగిల్స్లో యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో ‘వైల్డ్ కార్డు’ జోడి సాకేత్-కరెన్ ఖచనోవ్ (రష్యా) 4-6, 3-6తో నాలుగో సీడ్ బ్రన్స్ట్రోమ్ (స్వీడన్)-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. గురువారం ఆలస్యంగా ముగిసిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడిని 7-5, 2-6, 12-10తో బోల్తా కొట్టించిన సాకేత్-ఖచనోవ్ సెమీఫైనల్లో అదే జోరును కనబర్చలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రామ్కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 3-6తో ద్రగంజా-మేట్ పావిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో ఓడింది. వావ్రింకా 300వ విజయం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ యూకీ బాంబ్రీ 3-6, 3-6తో ప్రపంచ 32వ ర్యాంకర్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడాడు. 69 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్లో యూకీకి ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 6-1తో బెదెన్ (స్లొవేకియా)ను ఓడించి సెమీఫైనల్కు చేరుకోవడంతోపాటు కెరీర్లో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో వాసెలిన్ (ఫ్రాన్స్) 7-5, 6-7 (6/8), 6-0తో సెలా (ఇజ్రాయెల్)పై, గ్రానోలెర్స్ (స్పెయిన్) 6-2, 3-6, 7-6 (7/5)తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గి సెమీస్కు చేరారు. -
యూకీ సంచలన విజయం
చెన్నై: ఏటీపీ టోర్నీ చెన్నై ఓపెన్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సంచలన విజయం సాధించాడు. వైల్డ్కార్డ్ ద్వారా బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 64వ ర్యాంకర్ పాబ్లో బస్టా (స్పెయిన్)ను ఓడించాడు. 76 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో బాంబ్రీ 6-4, 6-3 స్కోరుతో నెగ్గాడు. సోమ్దేవ్కు రామ్కుమార్ షాక్ భారత నంబర్వన్ ఆటగాడు సోమ్దేవ్ దేవ్వర్మన్కు సహచరుడు రామ్కుమార్ రామ్నాథన్ షాక్ ఇచ్చాడు. క్వాలిఫయర్గా బరిలోకి దిగిన రామ్కుమార్ తొలి రౌండ్ మ్యాచ్లో 4-6, 6-3, 6-4 స్కోరుతో సోమ్దేవ్పై సంచలన విజయం సాధించాడు. దాదాపు 2 గంటల 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ ఓడినా...చక్కటి పోరాట పటిమతో రామ్ గెలిచాడు. -
డబుల్స్లో యూకీ అర్హత
షెన్జెన్ (చైనా): ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో పోటీపడేందుకు భారత రైజింగ్ స్టార్ యూకీ బాంబ్రీ అర్హత సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ‘వైల్డ్ కార్డు’ ప్లే ఆఫ్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ తన భాగస్వామి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో యూకీ-వీనస్ జంట 7-6 (7/3), 1-6, 10-5తో మావో జిన్ గోంగ్-జీ లీ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఈ ఇండో-కివీస్ జోడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ ఖాయమైంది. అయితే సింగిల్స్ విభాగంలో మాత్రం యూకీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో యూకీ 6-7 (6/8), 4-6తో దీ వూ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
యూకీ బాంబ్రికి టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రి ఈ సీజన్లో తొలి ఏటీపీ చాలెంజర్ లెవల్ సింగిల్స్ టైటిల్ను సాధించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్రారల్గాన్ చాలెంజర్ ఈవెంట్లో 21 ఏళ్ల ఈ ఢిల్లీ ఆటగాడు ఫైనల్లో తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ కలిగిన బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)ను 6-7 (13), 6-3, 6-4 తేడాతో మట్టికరిపించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ చివరి సెట్లో 4-2తో బాంబ్రి ఆధిక్యంలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో సోమవారానికి వాయిదా వేశారు. సీజన్లో రెండో చాలెంజర్ ఫైనల్ ఆడిన 277వ ర్యాంకర్ యూకీ.. 149వ ర్యాంకర్ బ్రాడ్లీపై పూర్తి ఆధిపత్యం వహించి వరుస సెట్లలో నెగ్గాడు. గత జూలైలో ఇదే ప్రత్యర్థిపై ఓడిన యూకీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. గతేడాది తొలి చాలెంజర్ టోర్నీ నెగ్గిన ఈ యువ ఆటగాడు ఈ టైటిల్తో 80 ర్యాంకింగ్ పాయింట్లు, 7200 డాలర్ల ప్రైజ్మనీని సొంతం చేసుకున్నాడు.