Actor
-
కొత్తింట్లో అడుగుపెట్టిన 'మసూద' హీరో (ఫోటోలు)
-
ఆర్థిక ఇబ్బందులు.. ఆగిపోయిన ప్రాజెక్ట్.. అయినా నిలదొక్కుకున్న నటుడు
చిన్నప్పటి నుంచి టీవీల్లో డ్యాన్స్ షోలు చూస్తూ డాన్సర్ కావాలనుకునేవాడు రోహిత్ సరాఫ్. వెండితెరపై కుమారుడిని చూడాలని కలలు కనేవాడు అతడి తండ్రి. అయితే తన కల నెరవేరే భాగ్యాన్ని చూడలేదు. రోహిత్ పన్నెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ‘నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను నటుడిని కావాల్సిందే’ అని బలంగా డిసైడైపోయాడు రోహిత్.టీవీ షోల నుంచి..ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన సరాఫ్ ఒక టీవీ చానల్ యూత్ షోకు హాజరయ్యాడు. కెమెరా ముందుకు రావడం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ‘బాగా కష్టపడితేగానీ ఇక్కడ నెగ్గుకు రాలేం’ అనుకున్నాడు. మొదటి సంవత్సరం రెండు టీవీ షోలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత యాడ్స్లో, ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే... తొలి సినిమా షూట్ చేసిన రెండున్నరేళ్ల తరువాత అది ఆగిపోయిందని తెలుసుకున్నాడు. బాగా నిరాశకు గురయ్యాడు.ఆర్థిక ఇబ్బందులు..ఆడిషన్స్కు కూడా వెళ్లేవాడు కాదు. దీంతో ఎవరి నుంచి పిలుపు వచ్చేది కాదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఆ చీకటి రోజులలో ‘ఇలా అయితే ఎలా?’ అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. మళ్లీ కష్టపడాలని గట్టిగా అనుకున్నాడు. ‘ప్రతిరోజూ కొండంత ధైర్యంతో, కోటి కలలతో నిద్ర లేవాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.డియర్ జిందగీ, హిచ్కీ, ది స్కై ఈజ్ పింక్లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ‘యస్...నాకు భవిష్యత్తు ఉంది’ అనే ఆశాకిరణం ఉజ్వలంగా మెరిసింది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘మిస్మ్యాచ్డ్’ తన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రస్తుతం మణిరత్నం– కమల్హాసన్ సినిమాలో, ధర్మ ప్రొడక్షన్లాంటి పెద్ద సంస్థ సినిమాలో నటిస్తున్నాడు. ‘కలలు అనేవి పిరికి వాళ్ల కోసం కాదు. ధైర్యంగా ఉండే వ్యక్తుల కోసమే’ అంటున్న 28 సంవత్సరాల రోహిత్ సరాఫ్ ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సాధించాడు.చదవండి: ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు
సినిమా సక్సెస్ అయిందంటే ఆర్టిస్టుల పంట పండినట్లే అంటుంటారు. కానీ తన విషయంలో మాత్రం ఇది తలకిందులైంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆది ఇరానీ (Adi Irani). తను నటించిన సినిమాలు సక్సెస్ అయినప్పటికీ కష్టాలు మాత్రం కొనసాగాయని చెప్తున్నాడు. ఈయన 1990వ దశకంలో అనేక సినిమాలు చేశాడు. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇబ్బందులు ఏకరువు పెట్టిన నటుడుసహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆది తాజాగా తన ఇబ్బందులను బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో వచ్చిన బాజీగర్ సినిమా (Baazigar Movie) షారూఖ్ను స్టార్గా మార్చింది. కానీ నాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 1995లో నాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో పాల ధర రూ.5గా ఉండేది. కూతురికి పాలు కొనడానికి నా దగ్గర కనీసం రూ.5 కూడా ఉండేవి కాదు. బాజీగర్ సినిమా స్టిల్పెట్రోల్కు డబ్బుల్లేకపోతే..ప్రతిరోజు నగరానికి వెళ్లి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగేవాడిని. అవకాశాల కోసం అడుక్కునేవాడిని. నా స్నేహితుడి స్కూటర్ తీసుకుని వెళ్లేవాడిని. కొన్నిసార్లు అందులో పెట్రోల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండేదికాదు. అప్పుడు బస్సుల్లో తిరిగేవాడిని. జనాలేమో.. నువ్వేంటి, బస్స్టాప్లో ఉన్నావని ఆశ్చర్యపోతూ అడిగేవారు. ఫ్రెండ్ వస్తానన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నా అని అబద్ధాలు చెప్పేవాడిని. అక్క సాయం వద్దన్నానుబస్సుల్లో తిరుగుతుంటే నీకు బస్ ఎక్కాల్సిన అవసరం ఏంటనేవారు. వారి మాటలు భరించలేక ఒక్కోసారి ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడిని. మా అక్కకు నా విషయం తెలిసి ఎన్నోసార్లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. తమ్ముడినైనంతమాత్రాన జీవితాంతం నన్ను పోషించాలని లేదు కదా.. పైగా తనకంటూ ఓ కుటుంబం ఉంది. అప్పటికే ఆ ఫ్యామిలీని చూసుకుంటోంది. నా బాధలేవో నేను పడ్డా..మళ్లీ నా కుటుంబాన్ని కూడా తనే చూసుకోవడం కరెక్ట్ కాదుకదా.. అందుకే నా బాధలేవో నేను పడ్డాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆది ఇరానీ అక్క అరుణ ఇరానీ అప్పటికే ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆది ఇరానీ.. దిల్, బాజీగర్, బాద్షా, హమ్ ఆప్కే దిల్ మే రెహతా హై, వెల్కమ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 2022లో వచ్చిన ఎ థర్స్డే చిత్రంలో చివరిసారిగా నటించాడు.చదవండి: నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ -
సల్మాన్ వల్ల ముఖానికి గాయమై విలవిల్లాడా.. అతడు సారీ కూడా చెప్పకుండా..!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తనకు గాయం చేసి కనీసం పట్టించుకోలేదంటున్నాడు నటుడు ఆది ఇరానీ (Adi Irani). గాయంతో అల్లాడిపోతుంటే తననలా గాలికి వదిలేసి వెళ్లిపోయాడని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది ఇరానీ.. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.గాజు ముక్కలు గుచ్చుకుని..ఆది మాట్లాడుతూ.. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ నా వైపు గ్లాస్ ఫ్రేమ్ విసిరాడు. అది పగిలి నా ముఖం రక్తసిక్తమైంది. చిన్నచిన్న గాజు ముక్కలు నా ముఖానికి గుచ్చుకున్నాయి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా వల్ల కాదని చేతులెత్తేస్తే కనీసం రెండు నెలలైనా షూటింగ్ ఆగిపోవాల్సిందే! దానివల్ల నిర్మాతలు నష్టపోతారు. వారిని కష్టపెట్టడం ఇష్టం లేక కంటిన్యూ చేశాను.కనీసం సారీ చెప్పలేదుఅయితే నాకు గాయమవగానే సల్మాన్ తనకు సంబంధం లేదన్నట్లుగా అక్కడి నుంచి ఉలుకూ పలుకు లేకుండా వెళ్లిపోయాడు. నా ముఖంపై రక్తం కారుతుంటే కనీసం సారీ కూడా చెప్పకుండా నన్నలాగే వదిలేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. కానీ తర్వాతి రోజు నేను షూటింగ్కు వచ్చినప్పుడు అతడి గదిలోకి పిలిచాడు. ఏంటని వెళ్లగా.. సారీ చెప్పాడు. ఆది, నన్ను క్షమించు.. నీ కళ్లలోకి కూడా చూడలేకపోయాను. అలా చేసినందుకు నా మనసంతా అదోలా ఉంది అంటూ మాట్లాడుతూ పోయాడు. సల్మాన్ది అహంకారమని నేననుకోను, అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని పేర్కొన్నాడు.ఆది సినీ జర్నీ..సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చోరీ చోరీ చుప్కే చుప్కే. అబ్బాస్ ముస్తాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2001లో విడుదలైంది. ఆది విషయానికి వస్తే.. 1978లో వచ్చిన తృష్ణ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. దిల్, బాజీగర్, అనారి నెం.1, ఎ వెడ్నస్డే, వెల్కమ్ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. కసౌటీ జిందగీ కే, సావిత్రి - ఏక్ ప్రేమ్ కహాని, ష్.. ఫిర్ కోయ్ హై, నాగిన్ వంటి సీరియల్స్లోనూ నటించాడు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది? తనదీ అదే పరిస్థితి అంటున్నాడు పంచాయత్ నటుడు దుర్గేశ్ కుమార్ (Durgesh Kumar). పంచాయ్ సిరీస్, లాపతా లేడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి అవకాశాలు రావడం లేదట! తాజాగా దుర్గేశ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను. ఆడిషన్స్కు కూడా పిలవట్లేదుకష్టాలు నాకు చుట్టాలు కాదు, ఇంటిమనుషులైపోయాయి. అందరూ పంచాయత్ సిరీస్ (Panchayat Web Series)తో నేను సక్సెస్ అయ్యాననే చూస్తున్నారు. కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు. ఆడిషన్కు రమ్మని ఎవరూ పిలవలేదు. నా టాలెంట్ గుర్తించిన చిన్న నిర్మాతలతోనే నేను ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడిషన్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాను.పాపులారిటీ ఫుల్.. అవకాశాలు నిల్హైవే, పంచాయత్ ప్రాజెక్టులతో నన్ను నేను నిరూపించుకున్నాక కూడా ఎవరూ పెద్దపాత్రలు ఇవ్వడం లేదు. అందరికీ నేను తెలుసు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. నా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. ఇంకో విషయమేంటంటే.. నేను నటించిన సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయి. పలువురు సినీవిశ్లేషకులు ఆయా సినిమాలను మెచ్చుకుంటున్నారు కానీ అందులో ఎక్కడా నా పేరు ప్రస్తావించడం లేదు. పంచాయత్తో ట్రెండింగ్లో..నాకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడూ రాదు. కనీసం ప్రేక్షకులైనా నా పనిని గుర్తించినందుకు గర్విస్తున్నాను అన్నాడు. సరైన పని దొరక్కపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్గేశ్.. హైవే, సుల్తాన్, సంజు, ధడక్, భక్షక్ వంటి చిత్రాల్లో నటించాడు. పంచాయత్ సిరీస్ నటుడిగా అతడికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.చదవండి: రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్! -
ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
సీరియల్స్, సినిమాల్లో మనం చూసేదంతా నటన అని తెలిసినా కొందరు అందులో లీనమైపోతారు. విలన్లను ద్వేషిస్తారు.. హీరోలను ఆరాధిస్తారు.. హీరోయిన్లను ఇష్టపడతారు. వారికి నచ్చిన పాత్రను ఎవరైనా ఏమైనా అన్నా, హేళన చేసినా అసలు తట్టుకోలేరు. ఇది తనకు అనుభవమైందంటున్నాడు నటుడు నిశాంత్ దహియా. సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్ (Mrs Movie). మలయాళంలో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ (The Great Indian Kitchen)కు ఇది రీమేక్గా తెరకెక్కింది. అంచనాలను మించిపోయిన Mrsజీ5లో రిలీజైన ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా రెస్పాన్స్ గురించి నిశాంత్ (Nishant Dahiya) మాట్లాడుతూ.. ఇంత ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతోమంది జనాలకు మా సినిమా చేరువైంది. ఒకరు సినిమా తెరకెక్కించేటప్పుడు ఇది కచ్చితంగా జనాలకు చేరాలన్న ఆశతోనే తమ పని కొనసాగిస్తారు. మిసెస్ నా అంచనాలను మించిపోయింది. నాకే కాదు ఈ సినిమాకు పనిచేసిన అందరి అభిప్రాయం కూడా బహుశా ఇదే అయి ఉంటుంది.ముందే చెప్పాలిగా!ఎక్కడెక్కడినుంచో నాకు మెసేజ్లు వచ్చేవి, అందుకు నేను చాలా గర్విస్తున్నాను. కేవలం యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు చూసేవారు కూడా నాకు కాల్ చేసి మాట్లాడటంతో ఆశ్చర్యపోయాను. మీ భార్యలతో మాత్రం సినిమా చూడొద్దని ఒక్క ముందుమాట వేయాల్సిందని నా ఫ్రెండ్స్ అన్నారు. నేను పోషించిన దివాకర్ పాత్ర వల్ల ప్రేమ, ద్వేషం అన్నీ పొందాను. ఆడవాళ్లు నా రోల్ను ద్వేషిస్తున్నామంటూనే నా పనితనాన్ని మెచ్చుకున్నారు. కానీ మగవాళ్లు చాలా కోపంగా మెసేజ్లు చేశారు. బండబూతులు తిట్టారుమూర్ఖుడా.. వెళ్లి ఎలుకల మందు తిను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చావలేదా? అని ఆగ్రహించారు. ఇలాంటి అమ్మాయిలు మెసేజ్ చేసుంటే అర్థం చేసుకునేవాడిని. నా పాత్రను ద్వేషించారు.. అది వారి మనసుని బాధపెట్టడం వల్లే ఇలా మాట్లాడుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకరైతే నేను నటుడిగా పనికిరానన్నారు. ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవడం దగ్గరే నా వైఫల్యం కనిపించిందన్నారు. ఎలాంటి రోల్స్ సెలక్ట్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని విమర్శించారు.అదే పెద్ద సమస్యకానీ రియాలిటీకి వస్తే.. మన చుట్టూ ఉన్న సమాజంలో 95% మంది మగవాళ్లు దివాకర్లాగే ఉన్నారు. ఇదే నిజం. చాలామందికి వారేం చేస్తున్నారో కూడా తెలీదు. మిసెస్ సినిమాలో రిచా వెళ్లిపోయాక దివాకర్ రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే దివాకర్కు, అతడి కుటుంబానికి సమస్య ఏంటో అర్థం కాలేదు. అదే అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లమ్. గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసినప్పుడు హీరోయిన్ భర్త పాత్రను ద్వేషించాను. చివరకు అది మిసెస్ రూపంలో మళ్లీ నా దగ్గరకే వచ్చింది. మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు -
ప్రతిరోజు నీ ప్రేమలో.. భార్య గురించి మనోజ్ అలా (ఫొటోలు)
-
సినిమాలు కాపీ కొట్టడం బాలీవుడ్కు వెన్నతో పెట్టిన విద్య: నటుడు
ఒకచోట సినిమా హిట్టయిందంటే దాన్ని వెంటనే మరో భాషలోకి తర్జుమా చేస్తారు. లేదంటే రీమేక్ చేస్తారు. ఇవేవీ కాదని కొందరు సులువుగా కాపీ కొడుతుంటారు. 1980-90 ప్రాంతంలో బాలీవుడ్ ఇదే పని చేసేదన్న విమర్శలున్నాయి. ప్రాంతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్ నుంచి కొన్ని కథలను తస్కరించేదన్న ఆరోపణలున్నాయి. నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) సైతం ఇదే నిజమంటున్నాడు.కాపీ కొట్టేవారుతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ (Bollywood) కాపీ కొట్టడం మొదట్లో నేనూ చూశాను. దర్శకుడి దగ్గరకు వెళ్లి సినిమా తీయాలనుందని చెప్పారనుకో.. మీకో దుమ్ముపట్టిన క్యాసెట్ ఇస్తాడు. నువ్వు ఈ సినిమా చూడు.. నేను ఇంకోటి చూస్తాను. రెండూ మిక్స్ చేద్దాం అంటాడు. కానీ ఒకానొక దశలో ఏం జరిగేదంటే హాలీవుడ్ స్టూడియోలు ఇండియాలోకి ప్రవేశించాయి. హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టాలంటే వారికి డబ్బు చెల్లించాలి. చివరకు సినిమా ఆడకపోతే నష్టాల్లో కూరుకుపోవాలి. ఇదంతా ఎందుకని దర్శకులు సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. లేకపోతే ఇంకా వారి కథల్ని దొంగిలిస్తూనే ఉండేవాళ్లం. ఇడియట్స్కు అప్పుడర్థమైంది!ఎంతైనా మనం మంచి దొంగలం కదా! మనకు ఫారిన్వే నచ్చుతాయి. హాలీవుడ్ (Hollywood).. వారి కార్యాలయాలను ప్రారంభించి మంచి పనే చేసింది. దానివల్లే మనవాళ్లు వెనక్కు తగ్గారు. వీరి కథల్ని తీసుకున్నందుకుగానూ ఎక్కువ మొత్తం వారికే ఇస్తే మనకేం మిగులుతుందని ఆలోచించారు. సొంతంగా కథలు సృష్టించి విజయాలు అందుకున్నాడు. అప్పుడే ఈ తెలివితక్కువవాళ్లకు మన కథల్లోని శక్తి తెలిసొచ్చింది. మన కథలు ఎంత కొత్తగా, బలంగా, నాటకీయంగా ఉంటాయో అర్థం చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. సినిమాఇకపోతే ఆమిర్ దిల్ హై మాంత నహీ సినిమా హాలీవుడ్ క్లాసిక్ ఇట్ హాపెండ్ వన్ నైట్ నుంచే పుట్టిందే! సెవన్ బ్రైడ్స్ ఫర్ సెవన్ బ్రదర్స్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచే అమితాబ్ సత్తే పే సత్తా రూపొందించింది. ఇలా హాలీవుడ్ రీమేక్స్ హిందీలో చాలానే ఉన్నాయి. బాలీవుడ్లో బోలెడన్ని సినిమాలు చేసిన పరేశ్ రావల్ తెలుగులోనూ అనేక చిత్రాల్లో మెరిశాడు. క్షణ క్షణం, మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్దాదా ఎంబీబీఎస్, తీన్మార్ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి! -
అలాంటి మాంసం కూడా తిన్నా.. రుచికరంగా..: టాలీవుడ్ విలన్
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్నెస్తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.హీరోగా ఛాన్సులు..ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్గా సినిమాలు ఎంచుకుంటున్నాను.(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత)చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
ఆప్లో చేరిన పంజాబీ నటి సోనియా మాన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే?
చండీగఢ్: పంజాబ్ నటి సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. సోనియా రాకను ఆప్ పంజాబ్ స్వాగతించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు ఎస్ బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు ఆమ్ ఆద్మీ కుటుంబంలోకి స్వాగతం’’ అంటూ ట్వీట్ చేసింది.మరో వైపు, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలో సోనియా జాయిన్ కావడంపై చర్చ నడుస్తోంది. 1986లో ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన రైతు కిసాన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కూతురే సోనియా మాన్. ఆమె 1986, సెప్టెంబరు 10న ఉత్తర ప్రదేశ్లోని హల్ద్వానీలో జన్మించింది. సోనియా అమృత్సర్ పట్టణంలో పెరిగింది. హోలీ హార్ట్ ప్రెసిడెన్సీ స్కూల్ నుండి స్కూల్ విద్యను, అమృత్సర్లోని బీబీకె డీఏవీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన కళాశాల విద్యను పూర్తి చేసింది.పంజాబీతో పాటు ఇతర భాషాల్లో కూడా నటించి సోనియా మాన్ యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీతో సహా వివిధ భాషలలో బహుళ చిత్రాలలో నటించింది. సోనియా మాన్ తొలి చిత్రం 'హైడ్ ఎన్' సీక్'. 2014లో హిందీలో తొలిసారిగా కహిన్ హై మేరా ప్యార్లో కూడా యాక్ట్ చేసింది. 2020లో వచ్చిన హ్యాపీ హార్డీ, హీర్ చిత్రాల్లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు 2018లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సహా ప్రసిద్ధ సింగర్లతో కలిసి పని చేసిన ఆమె.. నటిగా రాణిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పంజాబ్లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.కాగా, 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం భగంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైంది. మరో రెండేళ్లలో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేజ్రీవాల్ పంజాబ్పై దృష్టి పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2027లో జరగనున్న పంజాబ్లోనైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాల్లో కేజ్రీవాల్ ఉన్నారు. -
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఆల్బమ్ లో నటించి.. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది అందాల బ్యూటీ అంకితా జాదవ్. 2024 లో రిలీజ్ అయినా ఇంద్రాణి మూవీలో నటుడు అజయ్ సరసన నటించి.. యాక్టింగ్ లో మంచి మార్కులు కొట్టేసింది. ఇంద్రాణి సినిమాలో ఛాలెంజింగ్ సాంగ్ చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హిందీలో ఐదు ఆల్బమ్ సాంగ్స్ చేసి.. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన తెలుగు మూవీ 2025 లో రిలీజ్ కానుంది. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆమె నటించిన హిందీ మూవీ కూడా 2025 లో రిలీజ్ కానుంది. తన ఫిట్నెస్ , అందంతో ఒక వైపు నటిగా, డ్యాన్సర్గా అలరిస్తూ.. మరోవైపు ఎన్జీఓతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. విదేశాల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఓ సెలబ్రెటీ పాల్గొనాలంటే రెమ్యూనేరషన్ తో పాటు జర్నీ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ అంకిత మాత్రం స్వచ్ఛధంగా NGO కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.మరిన్ని NRI వార్తలకోసం క్లిక్ చేయండిఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకర్షించింది. అందాల తార శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో.. అంకిత తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టింది. సత్య మాస్టర్, అంకిత జోడిగా సాగిన ఈ డాన్స్ ప్రోగ్రాంకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్ వచ్చింది. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ వద్ద జరిగిన ఈవెంట్ లో దిల్ రాజుతో కలిసి అంకిత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా న్యూయార్క్, చికాగోలో అంకిత మ్యూజిక్ ఆల్బమ్ షూట్ చేసింది. అలాగే స్విట్జర్లాండ్ , వెనిస్ లోని అందమైన లొకేషన్లలో రెండు సాంగ్స్ షూట్ కంప్లిట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకులు, హాలీవుడ్ వీడియోగ్రాఫర్ లతో కలిసి ఆమె వర్క్ చేసింది. అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా త్వరలో రిలీజ్ కానున్నాయి. -
19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు
జుట్టు రాలిపోవడం ఎంత పెద్ద సమస్య అనేది అనుభవించినవారికే తెలుస్తుంది. అందులోనూ చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంటే దాన్ని అరికట్టలేక, కవర్ చేయలేక నానాతంటాలు పడేవారు చాలామంది ఉంటారు. ఈ ఇబ్బందులు తానూ పడ్డానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఛావా సినిమా (Chhaava Movie)లో ఔరంగజేబుగా నటించి విశేష గుర్తింపు సంపాదించుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాడు. ఆ బాధ నాకు తెలుసు'చిన్న వయసులోనే తలపై వెంట్రుకలు ఊడిపోతే (Early Balding) ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా, కష్టంగా ఉండేది. నాకది పెద్ద సమస్యలాగే కనిపించేది. 19 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోతుంటే భరించలేకపోయాను. అది మానసికంగా, వృత్తిపరంగా నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నటుడిగా కొనసాగాలనుకునే వ్యక్తికి జుట్టు చాలా అవసరం. సడన్గా కంటిచూపు మందగిస్తే ఎలా ఉంటుంది?మనకు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్నదాన్ని బట్టే ఎలాంటి ఆఫర్స్ వస్తాయనేవి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జుట్టు రాలడాన్ని మనం తగ్గించలేం అన్న నిజాన్ని జీర్ణించుకునేవరకు తిప్పలు తప్పవు. కానీ చిన్న వయసులో జుట్టు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగేకొద్దీ కంటిచూపు సైతం మందగిస్తుంది. సడన్గా ఒక రోజు ఉదయం పేపర్ తిరగేద్దామంటే అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తున్నాయనుకోండి. ఎలా ఉంటుంది? భయపడ్డా.. ఫోకస్ చేశాఅదేంటి నా కంటిచూపుకేమైంది? ఇకమీదట అద్దాలు పెట్టుకుంటే మాత్రమే కనిపిస్తాయా? అని ఆందోళన చెందుతాం కదా.. ఈ బట్టతల కూడా అలాంటిదే! దీనివల్ల నాకు సినిమా అవకాశాలు ఏమైనా తగ్గిపోతాయేమోనని భయపడ్డాను. కానీ తర్వాత నా లుక్స్ కంటే కూడా యాక్టింగ్ స్కిల్స్పైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అందువల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను' అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.చదవండి: భార్యకు విడాకులిచ్చి హీరోయిన్తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో -
నా భార్య చనిపోయేవరకు వీల్చైర్లోనే.. అదే చివరిమాట.. : చిన్నా భావోద్వేగం
కబలి (కబడ్డీ).. కబలి.. నేను ఆళ్తా.. అంటూ తన డైలాగులతో నవ్వించాడు చిన్నా అలియాస్ జితేంద్ర రెడ్డి. కామెడీ పాత్రలే కాదు ఆ ఇంట్లో వంటి చిత్రాలతో సీరియ్ పాత్రలు కూడా చేశాడు. శివ, పుట్టింటి పట్టుచీర, మనీ మనీ, మధురానగరిలో, పిట్టల దొర, అల్లుడా మజాకా, మురారి, సొంతం, గౌతమ్ ఎస్ఎస్సీ, ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నటుడు చిన్నా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. మాజీ సీఎం మేనల్లుడిని..చిన్నా (Actor Chinna) మాట్లాడుతూ.. మాకు 25 ఎకరాల భూమి.. పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటర్లో ఉంది. కానీ నాకు సినిమాలపై ఆసక్తి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధించాను. తొలిసారి ఆడిషన్స్కు వెళ్లినప్పుడు సీనియర్ డైరెక్టర్ వంశీ హేయ్.. వెళ్లు అంటూ తరిమేశారు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అనిపించింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కష్టపడి అవకాశాలు సాధించాను. ఇక్కడో విషయం చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సోదరే మా అమ్మ. అనారోగ్యం బారిన చిన్నా భార్యనేను నటుడిగా పేరు తెచ్చుకున్నాక కేబినెట్ మీటింగ్కు పిలిచాడు. ఈయనెవరో తెలుసా? నా మేనల్లుడు అంటూ అక్కడున్నవారికి గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఎవరికీ నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకునేవాడిని కాదు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ పెళ్లయిన పదేళ్లకు ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన రోజు ఆమె నడవలేకపోతున్నానంది. మల్టిపుల్ క్లీరోసిస్ వ్యాధి వల్ల వీల్చైర్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. రెడీ చేయడం దగ్గర్నుంచి అన్నీ నేనే..రూ.4 లక్షలు పెట్టి తైవాన్ నుంచి వీల్చైర్ తెప్పించాను. అది మనం కూర్చోవడానికే కాకుండా నిలబడేందుకు సాయపడుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా చాలాసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఐదారేళ్లపాటు వీల్చైర్లోనే ఉంది. చివరి రెండేళ్లయితే తనకు రెడీ చేయడం, డ్రెస్ వేయడం, తినిపించడం.. అన్నీ నేనే చేశాను. అయితే ఎక్కువసేపు మంచానికే పరిమితవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. అది ఎక్కువవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడింది. నా చేయి పట్టుకుని..మా ఆయన్ను చూడాలనుందని అక్కడివారికి చెప్పింది. ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఏదైనా తాగాలనుందంది. గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి మూడు, నాలుగు చెంచాలు తాగిపించాను. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగోలేదు అని చిరాకు పడటంతో స్పెషల్ ఐసీయూకు షిఫ్ట్ చేయిస్తానన్నాను. తనను స్ట్రెచర్పై పడుకోబెట్టగానే నా చేయి పట్టుకుని నేనిక బతకనేమో అంది. అదే తన చివరి మాట. ఏం కాదు అని ధైర్యం చెప్పాను. కానీ 24 గంటల్లో అంతా అయిపోయింది.ఒంటరినయ్యా..ఇద్దరు కూతుర్ల పెళ్లి చూడకుండా 42 ఏళ్ల వయసులోనే తను మాకు దూరమైంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా కూతుర్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇద్దరికీ పెళ్లయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరినయ్యాను. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే శూన్యంలా అనిపిస్తుంది. రోజూ నా భార్య ఫోటోకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు! -
పుష్ప విలన్ జాలిరెడ్డి పెళ్లి పనులు షురూ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (ఫోటోలు)
-
ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
ది ఫ్యామిలీ మ్యాన్-3 విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్ ఇపుడు ట్రెండింగ్లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహం స్మార్ట్ తయారైనాడు. ఐదు నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా 109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు. ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్ లాంటివి కాకుండా 27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్ వెయిట్లాస్ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్ లోక్లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే విలన్గా గాకుండా రొమాంటిక్ మూవీలు చేయాలని ఉందనే కోరికనుకూడా వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్ టాస్ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు. చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం. లాక్డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని, మళ్లీ టోన్డ్ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్స్టాలో తన ఫ్యాన్స్తో షేర్ చేశాడు. 2024లో సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.అహ్లవత్ పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలుబరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు నష్టపోకుండా కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం, ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.హైడ్రేటెడ్గా ఉంటూ, ఎలక్ట్రోలైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది. కనుక శరీరం హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి.నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు ఇలాంటి పారామీటర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు. ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్ ఇన్టేక్ పెంచడం, లేదా ఇంటర్మిటెంట్ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. -
'ప్రయాగ్ రాజ్లో ప్రకాశ్ రాజ్'.. సోషల్ మీడియాలో వైరల్
యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ మేళాలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్నానం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. నదిలో ఆయన స్నానం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇది నకిలీ వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడమే వారి పని. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు' అని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ಸುಳ್ಳು ಸುದ್ದಿ“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ 😊 #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025 -
శ్రీమంతుడు విలన్ రెండో పెళ్లి.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)
-
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నితిన్ భార్య (ఫోటోలు)
-
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
'షో చేస్తున్నావేంటి? నీ కంటికి మా హీరోయిన్ ఎలా కనిపిస్తోంది?'
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈ ఏడాది క్రూ, సింగం అగైన్ వంటి హిట్ చిత్రాలతో అలరించింది. ఓ పక్క స్టార్ హీరోలతో జత కడుతూనే మరోపక్క క్రూ, ద బకింగ్హామ్ మర్డర్స్ వంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు చేస్తోంది. 44 ఏళ్ల వయసులోనూ పడుచు హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అయితే ఓ పాకిస్తాన్ నటుడు మాత్రం ఆమెకు వయసు పెరిగిపోయిందంటున్నాడు. ఆమెకు కుమారుడిగా మాత్రమే నటిస్తాపాక్ నటుడు ఖాఖన్ షానవాజ్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. అందుకతడు.. అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమె కుమారుడిగా మాత్రమే నటించగలను అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా బెబో (కరీనా కపూర్) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడిపై ట్రోలింగ్'నువ్వు ఆమెతో కనీసం స్టేజీ కూడా పంచుకోలేవు. అలాంటిది ఏకంగా తనతో సినిమా చేస్తాననుకుంటున్నావా? ఇంకో విషయం తనకు కేవలం 44 ఏళ్లు మాత్రమే..', 'తనతో నటించే ఛాన్స్ నీకెవరు ఇస్తారు?', 'పెద్ద గొప్పలు పోతున్నావ్ కానీ ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయ్..', 'ఏజ్ షేమింగ్ చేస్తున్నావేంటి? ఒకసారి కరీనా కుమారుడిని చూసి నీ ముఖం అద్దంలో చూసుకోపో.',.' ఫ్లాప్ హీరోయిన్స్ కూడా నీతో కలిసి పని చేయాలనుకోరు' అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.చదవండి: 'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి -
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
ఇతడేమో టాలీవుడ్ విలన్.. భార్య విదేశీ సింగర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
లేడీ లవ్తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్
నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.అది నా మొదటి పెళ్లితాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.కోకిల నా రెండో భార్యకానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. అది లీగల్ మ్యారేజ్ కాదునిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.బాలా- అమృత విడాకులుసింగర్ అమృతా సురేశ్తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.చదవండి: పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున -
'అమరన్'ని సత్కరించిన ఆర్మీ అధికారులు (ఫొటోలు)
-
కొరియన్ డ్రామా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్(39) తన ఇంటిలో కన్నుమూశారు. సాంగ్ జే రిమ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. కే-డ్రామాలు 'ది మూన్ ఎంబ్రేసింగ్ ది సన్', 'క్వీన్ వూ'లో కీలక పాత్రలు పోషించిన జే రిమ్ మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు.సాంగ్ జే రిమ్ మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్కు గురయ్యారు. తమ అభిమాన నటుడు ఇక ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.మీడియాకు అందిన సమచారం ప్రకారం పోలీసులు సాంగ్ జే రిమ్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. జే రిమ్ ఇంటిలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు జే రిమ్ కుటుంబ సభ్యులు లేదా ఇటు సియోల్ పోలీసులు గానీ మీడియాకు నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.సాంగ్ జే రిమ్ అంత్యక్రియలు నవంబర్ 14న జరగనున్నాయి. సాంగ్ జే రిమ్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 2009లో సాంగ్ జే రిమ్ నటనను ప్రారంభించారు. తొలుత 2011లో మూన్ ఎంబ్రేసింగ్ ది సన్లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్కు రూ. 5 కోట్ల టోకరా -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోని ఓ రిసార్ట్లో వివాభ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
నా కుమారుడు చావు అంచులదాకా వెళ్లొచ్చాడు: నటుడు
పిల్లలు జబ్బుపడితే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. అలాంటిది ప్రాణాపాయంలో ఉంటే ఆ పేరెంట్స్ గుండె ఎంత విలవిల్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనక్కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్.ఊపిరాడలేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా పెద్ద కొడుకు జిడాన్కు మూడేళ్ల వయసున్నప్పుడు శ్వాసకోస సమస్యతో బాధపడ్డాడు. ఓసారి లండన్లో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. నాన్న, ఊపిరాడటం లేదు, సాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంతలో నా భార్య అంబులెన్స్కు ఫోన్ చేసింది. 15 నిమిషాల్లో అంబులెన్స్ రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన నర్స్ ఒకరు బతకడం కష్టమన్నారు.దేవుడి దయ వల్ల..నా సంతకం తీసుకున్నాక జిడాన్కు అడ్రినలైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే సిటీలో ఎక్కడెక్కడో ఉన్న నలుగురు డాక్టర్లను ఆస్పత్రికి పిలిపించారు. స్టెరాయిడ్లు పని చేయకపోతే మెడ దగ్గర కోసి సర్జరీ చేస్తామన్నారు. దేవుడి దయ వల్ల కాసేపటికే స్టెరాయిడ్స్ పని చేయడంతో సర్జరీ అవసరం లేదన్నారు. లండన్లోని హెల్త్ కేర్ సిస్టమ్ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే' అన్నాడు. కాగా జాయేద్-మలైకా దంపతులకు 2008లో జిడాన్లో జన్మించాడు. 2011లో ఆరిజ్ అనే మరో కుమారుడు పుట్టాడు. -
హిందూ పద్ధతిలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాం: నటుడు
ప్రేమకు హద్దుల్లేవు, కులమతభాష పట్టింపులు అంతకన్నా లేవని నిరూపించిన జంటలు కోకొల్లలు. బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్- మలైకా పరేఖ్ ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నారు. అయితే దానికంటే ముందు సీక్రెట్గా హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నామంటున్నాడు జాయేద్ ఖాన్.సర్ప్రైజ్ ప్లాన్జాయేద్ దంపతులు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము మా పెళ్లికి దాదాపు రెండువేల మంది అతిథుల్ని పిలవాలనుకున్నాం. కానీ అప్పుడిది పెళ్లికి బదులు సర్కస్గా మారిపోతుందని భావించాం. అందుకే, ఆ గ్రాండ్ వెడ్డింగ్ కంటే ముందు ఇంకేదైనా చేయాలనుకున్నాం. 30 మంది ఫ్రెండ్స్కు ఫోన్ చేశాం.. రహస్య వివాహంగోవాలో తాజ్ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాం. అలా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. పండితుడిని మాట్లాడటం, పెళ్లిలో పాటించే ఆచారాలు వంటివన్నీ మలైకా చూసుకుంది. తను ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను. మేము అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేశాం. ఎంత అందంగా గడిచిందో ఆ రోజు!అన్ని పండగలు సెలబ్రేట్ చేస్తాంఅలా అఫీషియల్ పెళ్లికంటే ముందే మేము భార్యాభర్తలమయ్యాం. మా ఇంట్లో అన్నిరకాల పండగలు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి దేవుడిని పూజిస్తాం అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ ఖాన్ తనయుడే జాయేద్. ఇతడు 2005లో మలైకాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జిడాన్, అరిజ్ అని ఇద్దరు సంతానం.చదవండి: Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు అర్జున్ మాథుర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలి తియా తేజ్పాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈనెల 9న వీరి వివాహ వేడుక జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.కాగా.. అర్జున్ మాథుర్ చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్-2 వెబ్ సిరీస్లో కనిపించారు. ఇందులో కరణ్ మెహ్రా పాత్రను పోషించాడు ఈ సిరీస్లో నటనకు గానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా అర్జున్ మాథుర్.. లక్ బై ఛాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by A r j u n (@arjun__mathur) -
మళ్లీ పెళ్లెప్పుడు? సల్మాన్ సోదరుడి రియాక్షన్ ఇదే!
హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, జై చిరంజీవ ఫేమ్ అర్బాజ్ ఖాన్ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. 21 ఏళ్ల కుమారుడు ఉండగా మరో పెళ్లి చేసుకోవడమేంటని జనాలు ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఇతడికి ఐటం సాంగ్ డ్యాన్సర్ మలైకా అరోరాతో 1997లోనే పెళ్లయింది. వీరి సంతానమే అర్హాన్. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2017లో విడిపోయారు.గతేడాది రెండో పెళ్లితర్వాత జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్లో ఉండి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఆ వెంటనే (గతేడాది డిసెంబర్ 24న) మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను నిఖా చేసుకున్నాడు. అప్పటినుంచి భార్యతో కలిసి పార్టీలు, డిన్నర్లు అంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అతడు ఫ్యాన్స్తో సోషల్ మీడియా వేదికగా చిట్చాట్ చేశాడు. మళ్లీ పెళ్లెప్పుడు?ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉన్నారని ఓ ఫ్యాన్ అడగ్గా.. అది నాకూ తెలియదు, కానీ నా భార్య షురా కూడా ఇదే మాట అంటూ ఉంటుందని రిప్లై ఇచ్చాడు. కుమారుడు అర్హాన్తో మీ బంధం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు వాడికి నేను చాలా క్లోజ్. ఒకరకంగా చెప్పాలంటే అర్హాన్ నా ఫ్రెండ్ అని సమాధానమిచ్చాడు. తర్వాతి పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఆల్రెడీ అయిపోయింది సోదరా.. అంటూ నవ్వుతున్న ఎమోజీలు జత చేశాడు.చదవండి: చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు? -
క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నా: హీరో
సక్సెస్ ఒక్కరోజులో రాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన తర్వాతే విజయం చేతికి అందుతుంది. బాలీవుడ్ నటుడు అభయ్ వర్మ విషయంలోనూ ఇదే నిజమైంది. ముంజ్య సినిమాతో ఇప్పుడితడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్గా నిలిచాడు. తాజాగా అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.సంబంధం లేకుండా మాట్లాడారుఅవకాశాల కోసం ఎదురుచూస్తున్నరోజుల్లో జరిగిందీ ఘటన.. ముంబై నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశాను. తీరా అక్కడికి వెళ్లాక నా టాలెంట్ గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడారు. నా ప్రతిభను చూపించుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్లింకేదో ఆశించారు. నా విలువలను నాశనం చేసుకోలేక నో చెప్పాను. తొలి మీటింగ్లోనే చేదు అనుభవం ఎదురవడంతో నిరాశచెందాను. ముంబై వదిలేసి నా స్వస్థలమైన పానిపట్(హర్యానా)కు తిరిగి వచ్చేశాను. కానీ నటుడవ్వాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. మళ్లీ అడుగుపెట్టా..ఎవరికోసమో భయపడి నేనెందుకు వెనకడుగు వేయాలనుకున్నాను. మరింత క్లారిటీతో మళ్లీ ముంబైలో అడుగుపెట్టాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా నటుడిగా నా కెరీర్ మొదలైంది అని ఎప్పుకొచ్చాడు. కాగా అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ముంజ్య మూవీ జూన్ 7న విడుదలైంది. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లపైనే రాబట్టింది. ఇకపోతే అభయ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మరోసారి హాట్టాపిక్గా మార్లిన్ మన్రో జీవితం..!
పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త సీరియస్గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్ బాల్ స్టార్ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మార్లిన్ మన్రో బర్త్ డే సాంగ్ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్ తాలూకు ప్రైవేట్ ప్రపంచంపై ‘ది ఫిక్సర్’ పుస్తకం దృష్టి సారిస్తుంది. మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్ ఒటాస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ మాత్రమే కాకుండా ‘డెయిలీ మెయిల్’ పత్రికలో వన్స్ అపాన్ ఏ టైమ్ వచ్చిన ‘ఆస్క్ నాట్’ సీరియల్లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్’ రచయితలు జోష్ యంగ్, మాన్ఫ్రెడ్లు వాడుకున్నారు. మార్లిన్ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.(చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?) -
డాక్టర్ టు సినీ యాక్టర్
-
బిగ్బాస్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
అల్టిమేట్ బీచ్ ప్రపోజల్ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవబర్డ్స్ తమ రిలేషన్ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్ ప్రపోజల్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే.. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్ ఆదార్ జైన్. గత కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో నటుడు ‘‘నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్తో సంతోషకర వార్తను పంచుకున్నాడు. ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్ స్పందించింది. కాగా ఆధార్ జైన్ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్నెస్ కమ్యూనిటీ క్రియేటివ్ వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్లైట్లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మై లైఫ్ ఆఫ్ లైట్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
దర్శన్కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్గా మారడంతో జైల్లో దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ సొంతం! (ఫొటోలు)
-
పుష్ప 2 కోసం 8 సినిమాలు వదిలేశా: నటుడు
పుష్ప, ధమాకా, మంగళవారం.. ఇలా విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీతేజ్. ఈయన ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈయన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చేతిదాకా వచ్చిన ఏడెనిమిది ప్రాజెక్టులను పోగొట్టుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.గడ్డం కోసం సినిమాలు వదిలేశాశ్రీతేజ్ మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. పది నెలల్లో ఎనిమిది ప్రాజెక్టుల దాకా వదిలేశాను. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏ క్షణాన పిలిచినా చేసేందుకు రెడీగా ఉండాలి. షెడ్యూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. గడ్డం తీసేస్తే మళ్లీ ఈ స్థాయిలో పెరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది' అని పేర్కొన్నాడు.చదవండి: నటికి సర్జరీ? ట్రాన్స్జెండర్లా ఉందంటూ ట్రోల్స్ -
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ బర్త్డే స్పెషల్.. రేర్ ఫొటోలు
-
అనంత్-రాధిక పెళ్లిపై నటుడి సెటైర్స్.. బంధాలు నిలబడట్లేదంటూ..
అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్గా చేస్తామంటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. వివాహం కోసం స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆరాటపడుతున్నారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే దిగ్గజ పారిశ్రామికవేత్త, వేలకోట్ల సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లంటే ఇంకెలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోదు!సెలబ్రేషన్స్ చేసినన్ని రోజులు కలిసుండట్లేదుఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. జూలై 12న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు లండన్కు వెళ్లి అక్కడ కూడా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారట! ఈ వేడుకలపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.నీకేంటి సమస్య?ఇది చూసిన జనాలు నటుడిని తిట్టిపోస్తున్నారు. 'వాళ్లు సంతోషంగానే ఉన్నారు.. మధ్యలో నీకేంటి సమస్య?', 'వాళ్లను చూసి కుళ్లుకుంటున్నావ్ కదూ..', 'అనంత్-రాధిక చిన్ననాటి స్నేహితులు.. వారి ప్రేమలో నిజాయితీ ఉంది. వారి బంధం తెగిపోయేంత బలహీనమైంది కాదు', 'నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోవడం లేదుగా.. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావ్..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా? -
తెలుగులో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే.. లిస్ట్ ఇదే!
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ తారలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి టాప్ టెన్లో ఉన్న హీరోల జాబితాను వెల్లడించింది. ఈ లిస్ట్లో మొదటిస్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు.మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ పేరిట ఈ జాబితాను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ లిస్ట్లో పవన్ కల్యాణ్, నాని, రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండ టాప్టెన్లో నిలిచారు. ప్రభాస్ తొలిస్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రెబల్ స్టార్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/XNWOfiaDaA— Ormax Media (@OrmaxMedia) July 15, 2024 -
25 రోజులు మిస్సింగ్.. నటుడిని గుర్తుపట్టని తల్లి!
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.చూడగానే గుర్తుపట్టలేదుఇంటికి వెళ్లాక తన పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో ఏడ్చేశాంముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్.. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఫారెన్ ట్రిప్లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్పుల్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
వివాదంలో రాజ్తరుణ్.. ట్రెండింగ్లో హీరోయిన్ (ఫోటోలు)
-
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేశ్ను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్గారి ఫ్రెండ్గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్లో యూఎస్లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి -
ఎన్డీఏకి చుక్కలు చూపిస్తున్న ‘పవర్ స్టార్’
కొంత కాలం క్రితం వరకు బీహార్లోని కరకాట్ లోక్సభ నియోజకవర్గం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్డీఏ తరపున సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పోటీలో ఉన్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఒక సీటు లభించింది. ఆయనకు ప్రత్యర్థిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజారామ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు భోజ్పురి పవర్ స్టార్గా పేరొందిన నటుడు పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, ఎన్డీఏకు చుక్కలు చూపిస్తున్నారు.వివరాల్లోకి వెళితే బీజేపీ గతంలో పవన్సింగ్కు అసన్సోల్ లోక్సభ టిక్కెట్ కేటాయించింది. అయితే తనకు అసన్సోల్ వద్దని, తాను కరకాట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బీజేపీకి స్పష్టం చేశారు. కానీ అప్పటికే బీజేపీ ఆ సీటు టిక్కెట్ను ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించింది. దీంతో భోజ్పురి పవర్ స్టార్ పవన్ సింగ్ బీజేపీపై దండెత్తి, కరకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇది ఎన్డీఏకు పెద్ద సవాల్గా మారింది.16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కరకాట్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 400 రైస్ మిల్లులు ఉన్నాయి. పవన్ సింగ్ రాకతో కరకాట్ రాజకీయ వాతావరణం వేడెక్కిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరకాట్ 2009లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి మొదటి ఎంపీ జేడీయూకి చెందిన మహాబలి సింగ్. 2014లో ఎన్డీఎ భాగస్వామ్య ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. 2019లో మహాకూటమి నుంచి పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహాను జేడీయూకు చెందిన మహాబలి సింగ్ ఓడించారు.పవన్ సింగ్ రాజ్పుత్ వర్గానికి చెందినవాడు కావడమే అతనికున్న బలం. ఇది కుష్వాహా వర్గపు ఆధిపత్య సీటు అయినప్పటికీ, ఇక్కడ కుష్వాహా, రాజ్పుత్, యాదవ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లక్షన్నర మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్కుమార్, నాగబాబు, రణధీర్బాబు, మహ్మద్ అబూబక్కర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
బలగం సినిమాతోనే గుర్తింపు: సంజయ్కృష్ణ
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్లోని కరకట్ లోక్సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం టిక్కెట్ను బీజేపీ పవన్ సింగ్కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్లోని లాహోర్లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్లో కార్ట్రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్తో విడిపోయారు. -
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
-
మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ అనే కుమారుడు, ఇరా ఖాన్ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్ దంపతులు విడాకులు తీసుకున్నారు.విడాకులు2005లో ఆమిర్.. కిరణ్ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఆమిర్ హాజరయ్యాడు.షోలో ఆమిర్ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. రెండు సినిమాలూ వర్కవుట్ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్ కపిల్ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్ వేశాడు.టైం వేస్ట్!ఇంతలో అర్చన పూరన్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్.. సెటిల్ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్ లాహోర్ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Ab hogi comedy ki dangal with one and only Aamir Khan 😁Dekho #TheGreatIndianKapilShow this Saturday 8 pm sirf Netflix par ✨ pic.twitter.com/ukDIKk0U2D— Netflix India (@NetflixIndia) April 24, 2024 చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన దర్శకనటుడు -
ప్రముఖ దర్శకుడి ఇంట పెళ్లి.. స్టార్స్ సందడి
ప్రముఖ దర్శకనటుడు చేరన్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అతడి పెద్ద కూతురు నివేద ప్రియదర్శిని పెళ్లిపీటలెక్కింది. వ్యాపారవేత్త సురేశ్ ఆదిత్యతో ఏడడుగులు వేసింది. ఏప్రిల్ 22న చెన్నైలో ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సముద్రఖని, సీమన్, పాండిరాజ్, కేఎస్ రవికుమార్ తదితర కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.డైరెక్షన్ మీద ఆసక్తితో..తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిథుల ఫోటోలను చేరన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా తమిళనాడులోని మధురైకి చెందిన చేరన్ డైరెక్షన్ మీద ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. మొదట్లో పలు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పని చేశాడు. పురియత పూజం అనే సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. పెద్ద సినిమాలకు సైతం సహాయ దర్శకుడిగా పని చేసిన ఇతడు తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించాడు. అనంతరం 'భారతీ కన్నమ్మ' చిత్రంతో డైరెక్టర్గా మారాడు.తొలి సినిమాతోనే హిట్తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరన్ ఆటోగ్రాఫ్ అనే మూవీకి డైరెక్టర్గా పని చేయడంతోపాటు అందులో నటించడం విశేషం. ఈ చిత్రం అతడికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి తను డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ఆయన పని చేసిన నాలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ మధ్య తమిళ బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం చేరన్.. కిచ్చా సుదీప్తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్లోనే ఈ మూవీ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోంది. திருமணத்தை மனப்பூர்வமான வாழ்த்துடன் நடத்தித்தந்த திரு.ரவிக்குமார் சார், மரியாதைக்குரிய திருமதி ரவிக்குமார் அவர்களுக்கும், எங்கள் பெருமைக்குரிய இயக்குனர் இமயம் திரு.பாரதிராஜா, அன்பு அண்ணன் சீமான், திருமதி சீமான் அவர்களுக்கும் எங்கள் குடும்பத்தினர் சார்பாக மகிழ்ச்சியும் நன்றியும். pic.twitter.com/owMd4lDBkW— Cheran (@directorcheran) April 23, 2024 చదవండి: నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్ -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
రాముడికి ఓ బెంజ్.. 10 కోట్ల ఆస్తులు!
సాక్షి, నేషనల్ డెస్క్ : రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ గురించి! 80వ దశకంలో దూరదర్శన్లో వచ్చిన రామాయణం సీరియల్కు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఆదివారమొస్తే చాలు.. ఉదయాన్నే దేశమంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ’ను వింటూ టీవీలకు అతుక్కుపోయిన రోజలవి. ఇప్పటికీ అరుణ్ గోవిల్ ఎక్కడ కన్పించినా రామున్నే చూసినంత ఆనందంతో కాళ్లకు నమస్కరించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ 72 ఏళ్ల టీవీ రాముడు యూపీలోని మీరట్ నుంచి లోక్సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో గోవిల్ వెల్లడించారు. రూ.14.64 లక్షల కారు రుణముందని చెప్పారు. సీరియల్లో రాక్షససంహారం చేసిన ఈ టీవీ రామునిపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవండోయ్! 17 ఏళ్లకు సొంతూరికి... గోవిల్ పుట్టింది మీరట్లోనే. ముంబైలో స్థిరపడ్డారు. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో అడుగుపెడితే ఈ టీవీ రాముడు 17 ఏళ్ల ‘సిటీ’వాసం తర్వాత సొంతూరికి చేరారు. ఆయన కోసం మీరట్లో 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రాజేంద్ర అగర్వాల్ను బీజేపీ పక్కనబెట్టింది! సమాజ్వాదీ నుంచి అతుల్ ప్రధాన్, బీఎస్పీ తరఫున దేవవ్రత్ త్యాగి గోవిల్ ప్రత్యర్థులు. ‘‘ఈ ఎన్నికలతో నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. రాముడి ఆశీ్వర్వాదం తప్పకుండా ఉంటుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు గోవిల్. అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకల్లో ఆయన సీరియల్ సీత దీపికా చిఖలియా, లక్ష్మణుడు సునీల్ లాహరితో సహా పాల్గొనడం విశేషం. – -
బర్త్డే రోజు కళ్లముందే ఘోరం.. నా కుటుంబమంతా నిర్జీవంగా..
కళ్ల ముందు కుటుంబాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దారుణం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అలాంటి విషాద, భయానక సంఘటన జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత కమల్ సదనాహ్. పీడకలలాంటి రోజును గుర్తు చేసుకుంటూ.. 'అది నా జీవితంలోనే చీకటి రోజు. మా నాన్న(దర్శకనిర్మాత బ్రిజ్ సదనాహ్) అందరినీ తుపాకీతో కాల్చేశాడు. నన్ను కూడా షూట్ చేశాడు. కానీ అది నా మెడ నరంలో నుంచి చొచ్చుకుని వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత ఆయన కూడా తనను తాను షూట్ చేసుకున్నాడు. కళ్లముందే ఘోరం.. తీవ్రంగా గాయపడ్డ అమ్మ (నటి సయూదా ఖాన్), సోదరిని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బెడ్స్ లేకపోవడంతో నన్ను మరో ఆస్పత్రిలో చేర్చారు. వాళ్లిద్దరినీ బతికించమని వైద్యులను వేడుకున్నాను. అలాగే నాన్న ఎలా ఉన్నాడని ఆరా తీశాను.. కానీ ఏ సమాధానమూ రాలేదు. నాకు రక్తస్రావం ఎక్కువ అవుతుండటంతో సర్జరీ చేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాను.. అక్కడ నా కుటుంబమంతా శవాలుగా కిందపడి ఉన్నారు. నా కళ్లముందే ఆ ఘోరాన్ని చూడాల్సి వచ్చింది. అందరూ మరణించినా నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను. అందుకే బర్త్డే సెలబ్రేట్ చేసుకోను ఈ సంఘటన జరిగినంతమాత్రాన మా నాన్న, ఇంట్లోవాళ్లంతా చెడ్డవారని అర్థం కాదు. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటాను. ఇది నా బర్త్డే రోజే జరగడం వల్ల ఎన్నోయేళ్లపాటు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటికీ ఆ సెలబ్రేషన్స్ నాకు నచ్చవు' అని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన జరిగిన రెండేళ్లకు కమల్.. బేఖుడి(1992) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రంగ్, ఫాజ్, రాక్ డ్యాన్సర్, హమ్ సాబ్ చోర్ హై, మొహబ్బత్ ఔర్ జంగ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. 2007 తర్వాత యాక్టింగ్కు దూరంగా ఉన్న అతడు దాదాపు 15 ఏళ్ల తర్వాత సలాం వెంకీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. గతేడాది పిప్పా మూవీలో నటించాడు. చదవండి: మాజీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు.. -
నటుడి సాహసం.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం 'ఆడుజీవితం: ది గోట్ లైఫ్'. బ్లెస్సీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో మరో నటుడు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో హకీమ్ అనే పాత్రలో కేఆర్ గోకుల్ కనిపించారు. అతని శరీరం పూర్తిగా బక్కచిక్కపోయినట్లుగా ఈ సినిమాలో కనిపించారు. తాజాగా తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లాగే గోకుల్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు వెల్లడించారు. గోకుల్ మాట్లాడుతూ..'హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశా. ఆ పాత్రను వాస్తవికంగా పోషించడంలో నాకు సహాయపడింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది. కేవలం నీళ్లు తాగి బతికా. దీంతో బాడీలోని కేలరీలను క్రమంగా తగ్గించుకున్నా. 15 రోజులుగా ఏం తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగాను. దీంతో మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం, స్నేహితులు చాలా బాధపడ్డారు. ఇది నిజంగా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆడుజీవితం సెట్స్లో నేనే అందరికంటే చిన్నవాడిని' అని అన్నారు. పృథ్వీరాజ్తో అనుభవం గురించి మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో అందరూ నన్ను తమ కొడుకులా చూసుకున్నారు. ఆ విధమైన శ్రద్ధ ఎల్లప్పుడూ సెట్స్లో సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడింది. మనం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా పని చేయగలం. పృథ్వీరాజ్ నన్ను కొత్తవాడిగా కాకుండా సహానటుడిగా చూశాడు. నువ్వు నాలాగే బాగా పని చేస్తున్నావు అని నాతో చెప్పాడు' అని పంచుకున్నారు. కాగా.. బెన్యామిన్ రచించిన 2008 నవల ఆడుజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1990ల్లో పని కోసం గల్ఫ్కు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవలే ధియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. -
సీక్రెట్గా ప్రముఖ సింగర్ వివాహం.. !
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దిల్జీత్ దోసాంజ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. అందుకే సీక్రెట్గా..: నటి
బాబీ, రోటి కపడా ఔర్ మకాన్, రాకీ, లవ్ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్లో తొలిసారి డైరెక్టర్ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు. ఒకరంటే ఒకరికి కోపం చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల అన్నీ మేనేజ్ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్ షూట్ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది. ప్రేమలో పడిపోయాం ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్గా మారిపోయాడు. కూల్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్ వర్గం శివసేన నుంచి అమోల్ కిర్తికర్ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు. #WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO — ANI (@ANI) March 28, 2024 మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు #WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV — ANI (@ANI) March 28, 2024 ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్ నేత రామ్నాయక్పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ప్రకాష్ రాజ్ బర్త్డే స్పెషల్.. రేర్ పిక్స్
-
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
'ఓ నాన్న ప్రేమ'..! దూరమైన కూతుర్ని ఏకంగా ఏఐ సాంకేతికతో..!
ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'! తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి. అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది. తన ఏకైక బిడ్డను డిజిటల్గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది. అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!. (చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్పెట్టే ఆహార పదార్థాలివే!) -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
బాలీవుడ్ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. నివేదిక ప్రకారం, రితురాజ్ సోమవారం రాత్రి మరణించాడు. ప్యాంక్రియాటిక్ (కాలేయ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రితురాజ్ సింగ్ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చేరుకున్నాడు. అనంతరం గుండెపోటుతో మరణించాడని ఆయన స్నేహితుడు అమిత్ తెలిపాడు. అప్పటికే ఆయనకు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆపై ప్యాంక్రియాటిక్ సమస్య కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన పేర్కొన్నాడు. రితురాజ్ బాలీవుడ్లో అనేక సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా నటించారు. బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించారు. గతేడాదిలో వచ్చిన అజిత్ (తెగింపు) చిత్రంలో కూడా ఆయన నటించాడు. -
మహిళా జర్నలిస్టులపై వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడికి జైలు శిక్ష
కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత ఎస్వీ శేఖర్కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించించింది. వివరాలు.. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి 2018లో ఒక పోస్ట్ను పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగింది.. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పారు. కానీ కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆ వరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారిస్తూ వచ్చారు. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు. ఎస్వీశేఖర్కు నెలు రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించారు. అదే సమయంలో అప్పీల్కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పీల్ కోసం రెండు నుంచి నాలుగు వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగి పోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
లేటు వయసులో గర్ల్ఫ్రెండ్తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్
హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో లేటు వయసులో తండ్రి కావడంపై స్పందించారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న నీరో , గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్తో కలిపి గత ఏడాది ఏప్రిల్లో 79 ఏళ్ళ వయసులో ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా చూసినపుడు చాగా తనకు సంతోషంగా ఉంటుదని, ఈ వయసులో సాధ్యమైనంత ఎక్కువ సమయం పాపతో గడపాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. “I'm an 80-year-old dad, and it's great. And I want to be around for as long as I can to enjoy it.” Robert De Niro gets emotional talking about his baby daughter during an interview with AARP. pic.twitter.com/C1PHzxetnP — AP Entertainment (@APEntertainment) January 25, 2024 ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో మరో అవార్డు అందుకున్నాడు. రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే మోడల్-నటి టౌకీ స్మిత్తో జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. దీంతో పాటు రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్తో కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్ , నీరోకు పాప గియా పుట్టింది. -
మాజీ భార్యతో డేటింగ్.. నేను మారిపోయా: నటుడు
2024.. ఈ ఏడాది ప్రారంభమైన రోజు ఎంతోమంది ఎన్నో కలలు కన్నారు. వంట నేర్చుకోవాలి, జిమ్కు వెళ్లాలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, ధ్యానం చేయాలి, చెడు వ్యసనాలు మానేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటీ సరిగా పాటించరు. అయితే ఈ నటుడు మాత్రం పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. ఈ ఏడాది తన భార్యకు సెకండ్ ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాడు. అదేంటో చదివేయండి.. విడాకులిచ్చిన తర్వాత మళ్లీ చిగురించిన ప్రేమ బాలీవుడ్ నటుడు గుల్షాన్ దేవయ్య- నటి కలిరోయ్ జియాఫెటా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వైవాహిక జీవితాన్ని ఆరంభించిన వీరు 2020లో విడిపోయారు. అయితే దూరమైన కొంతకాలానికిగానీ వీరి మధ్య ఎంత ప్రేముందో వారికి తెలిసిరాలేదు. అందుకే తమ ప్రేమకు మరో ఛాన్స్ ఇచ్చి చూద్దామని భావించారు. విడిపోయిన మూడేళ్లకు మళ్లీ కలిశారు. గతేడాది చివర్లో డేటింగ్ మొదలుపెట్టారు. దీని గురించి దేవయ్య మాట్లాడుతూ.. 'ఇప్పటికీ మా అనుబంధం చెక్కు చెదరలేదు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మారిపోయాం.. గతంలో ఉన్న పరిస్థితుల వల్ల మేము కలిసి ఉండలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, మేమూ మారిపోయాం. ఇంకా బెటర్గా తయారయ్యాం. ఆ విడాకులే మమ్మల్ని ఇలా మెరుగ్గా మార్చింది. ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఏది జరిగినా స్వీకరిస్తున్నాను. ఓపికను అలవర్చుకున్నాను. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కదిద్దుకుంటున్నాను. అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని ఆందోళన చెందడం లేదు. ఇప్పుడు మేము కలిసి రెస్టారెంట్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ల వయసున్న ఇతడు కుదిరితే తన మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. చదవండి: పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్ అయిన నిహారిక -
ఒకప్పుడు పండ్లు అమ్ముకుంటూ బతికాడు.. సినిమాల్లోకి వచ్చాక..
రజనీకాంత్ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్ కండక్టర్గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్స్టార్గా ఎదిగాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా మొదట్లో ఫుడ్ స్టాల్లో పని చేశాడు. మోడలింగ్ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్ కపూర్. సినిమాకే అంకితమయ్యేవాడిని.. కునాల్ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా.. 'అక్స్' అనే మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టాడు కునాల్. తర్వాత నసీరుద్దీన్ షా నడిపిన యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్ జిందగీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో' ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్ఫామ్. 2012లో జహీర్ అదెన్వాలా, వరుణ్ సేత్లతో కలిసి కునాల్ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్ఫామ్ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్ కపూర్.. బిగ్బీ అమితాబ్ బచ్చన్కూ బంధువే! అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు నైనాను కునాల్ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్కు అల్లుడయ్యాడు. కునాల్ చివరగా ద ఎంపైర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా.. -
మాలాంటివాళ్లకు భారత్లో పనిచేస్తే విలువ, గుర్తింపు: పాక్ నటుడు
పాకిస్తాన్ నటీనటులు సొంత దేశంలోనే కాకుండా ఇండియా వంటి ఇతర దేశాల్లో వివిధ భాషల్లో సినిమాలు చేస్తేనే మరింత గుర్తింపు, గౌరవం దక్కుతుందంటున్నాడు. తనకు నటుడిగా ఇండియానే గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'నా కెరీర్ భారత్లోనే మొదలైంది. ఇక్కడే నాకంటూ గౌరవాన్ని, పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్నాను. ఇక్కడ దాదాపు ఫేమస్ అయిపోవడంతో పాకిస్తాన్లో పని చేసేటప్పుడు నాకంతగా ఇబ్బందులు ఎదురవలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక ఇండస్ట్రీలలో పని చేసిన అనుభవం ఉంది. బడ్జెట్ సమస్య కాదు పాక్ ప్రజలు తమ సొంతవాళ్లను అంత సులువుగా సపోర్ట్ చేయరు. అదే మేము ఇండియాకు వచ్చి ఇక్కడ పేరు తెచ్చుకుంటే అప్పుడు మాకు గౌరవమర్యాదలు ఇస్తారు. పాక్, ఇండియన్ సినిమాలకు మధ్య తేడా బడ్జెట్ లెక్కలే అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. అప్పట్లో బేజా ఫ్రై అని ఓ సినిమా వచ్చింది. రూ.50 లక్షలు పెడితే రూ.10 కోట్లు వచ్చింది. ఆ పది కోట్లతో సీక్వెల్ తీస్తే ఉన్నదంతా పోయింది. బడ్జెట్ ఒక్కటే ప్రధానమైన తేడా కాదు. ఇక్కడ ఎవరూ సమయపాలన పాటించరు. అన్నీ ఆలస్యంగానే అవుతాయి కమర్షియల్ షూటింగ్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. మనం సమయానికి అక్కడున్నా సరే యాడ్ షూట్ సాగుతూనే ఉంటుంది. అందరూ డీలా పడిపోతారు. సినిమా షెడ్యూల్స్లో భాగంగా 25 రోజుల్లో అయ్యే షూటింగ్ కూడా 50 రోజులు పడుతుంది. చాలా ప్రాజెక్టులు అనుకున్న సమయానికంటే ఆలస్యంగానే పూర్తవుతాయి. శిక్షణ పొందిన ఆర్టిస్టులు పాక్ ఇండస్ట్రీలోకి రానంతవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ నటుడు ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఆ ఆర్చీస్లో, అలాగే హాట్స్టార్లో ప్రసారమవుతున్న ద ట్రయల్ వెబ్ సిరీస్లలో కనిపించాడు. చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్బాస్కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి -
యాక్టింగ్కు గుడ్ బై చెప్పి రూ.1400 కోట్ల కంపెనీ సీఈవోగా
దూరదర్శన్లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈ పాపులర్ సీరియల్లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే. బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్ఫారమ్ కమిషన్ జంక్షన్లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ సీరియల్లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. -
అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది
ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు. రాములవారికి ఎలాంటి పరిస్థితి? శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు. వారి త్యాగం ఊరికే పోలేదు అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
Ramayan: అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు. ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్ఘాట్, హానుమాన్గర్హి, లతాచౌక్లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు. ఇదీచదవండి.. రామ్ మందిర ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్ -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న నటుడు?
కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలామంది చాలా కలలు కంటుంటారు. వేకువజామునే నిద్ర లేవాలి, జిమ్కు వెళ్లాలి, డైట్ మెయింటైన్ చేయాలి, జంక్ ఫుడ్ మానేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఉన్న అప్పులు తీర్చేయాలి.. ఇలా ఎన్నో అనుకుంటారు. కానీ కొందరే వాటిని విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులు అవుతారు. తాజాగా ఓ నటుడు ఈ ఏడాది ఓ ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇళయరాజా సోదరుడు జ్ఞాని అమరన్ చిన్న కుమారుడు, నటుడు ప్రేమ్జీ అమరన్ 2024లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట! ఈ ఏడాదే పెళ్లి ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'హ్యాపీ న్యూయర్. ఈ ఏడాది నేను వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తాను' అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు.. ఈ ట్వీట్ చేసిన తర్వాతే జపాన్లో భారీ భూకంపం వచ్చి ఉంటుంది.. ఇంతకీ ఇది నిజమేనా మాస్టారు? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 44 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే మిగిలిపోయాడు. మరి ఈసారైనా దీన్ని సీరియస్గా తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడో, లేదో చూడాలి! ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాల్సిందే! అమరన్ కెరీర్ విషయానికి వస్తే.. పున్నగై పూవె సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. శింబు హీరోగా నటించిన వల్లభ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గోవా, సరోజ, బిర్యానీ, మంగత తదితర చిత్రాలు చేశాడు. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ప్రేమ్జీ నటించాడు. కస్టడీ, ప్రిన్స్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 68వ సినిమాలో అమరన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. Happy new year. This year I am getting married. Dot. — PREMGI (@Premgiamaren) January 1, 2024 చదవండి: హీరోగా ఆట సందీప్.. బెస్ట్ సంచాలక్ అట! పోస్టర్పై నెట్టింట ట్రోల్స్.. -
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
అల్లు అర్జున్ ఇల్లు కట్టింది నేనే!: మంగళవారం నటుడు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న లక్ష్మణ్ మీసాల ఈమధ్యే రిలీజైన మంగళవారం సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. ఎన్నో నాటకాల్లో యాక్ట్ చేసిన లక్ష్మణ్.. కో అంటే కోటి సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. పాతికకు పైగా సినిమాలు చేసిన ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. ఏ పనిలోనూ తృప్తి దొరకలేదు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'పదో తరగతికే చదువు ఆపేశాను. సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో పనులు చేశాను. ఏ పని చేసినా అందులో తృప్తి దొరకలేదు. అందుకని కొన్నాళ్లకే ఆ పని మానేసి మరొకటి చేసుకుంటూ పోయాను. కానీ సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇక్కడ ఆగిపోయాను. నటుడిగానే కొనసాగుతున్నాను. అయితే ఇండస్ట్రీకి రావడానికి ముందు కూలీ పని కూడా చేశాను. నాకు తెలియకుండానే కొందరు ప్రముఖుల ఇంటి నిర్మాణానికి పని చేశాను. తెలియకుండా వాళ్ల ఇంటికి పని చేశా అందులో ఒకటి అల్లు అర్జున్ ఇంటి నిర్మాణానికి పని చేయడం! ఆయన ఇంటి నిర్మాణానికి కూలీ పని చేశాను. చేసినప్పుడు తెలియదు కానీ, తర్వాత అది అల్లు అర్జున్ గారి ఇల్లని తెలిసింది. కూలీ పని చేసేటప్పుడు చాలా దెబ్బలు తగులుతాయి. అలా అక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారింది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి సైతం పని చేశాను. దర్శకరచయిత ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటికి కూడా కూలీగా పని చేశాను. ఎవరెవరి ఇంటికో తెలియకుండానే పని చేశాను' అని తెలిపాడు లక్ష్మణ్. చదవండి: కానరాని లోకాలకు కరుప్పు ఎంజీఆర్.. ఎన్ని కష్టాలు వచ్చినా.. యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే? -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్కాంత్ ఇక లేరు. విజయ్కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్కాంత్ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్బాబు హీరోగా నటించారు. విజయ్కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్కాంత్ హీరోగా నటించి, బ్లాక్బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్రాజ్ పేరుని విజయ్కాంత్గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్కాంత్కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్కాంత్కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్గా కొనియాడబడ్డారు విజయ్కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్కాంత్కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్కాంత్. బావ ఎల్.కె. సుధీశ్తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
కెప్టెన్ విజయ్కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. విజయ్కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
కెప్టెన్గా విజయ్కాంత్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
డీఎండీతే అధినేత, నటుడు విజయ్కాంత్ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే.. "కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్కాంత్కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్కాంత్.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. -
ఆస్కార్ మూవీ నటుడు అనుమానాస్పద మృతి
అతడు ప్రముఖ నటుడు. 'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమాలోనూ నటించాడు. తాజాగా ఓ కేసులో ఇరుక్కున్నాడు. సడన్గా ఇతడు కనిపించడం లేదని అతడి భార్య ఫిర్యాదు చేసింది. అనుహ్యంగా ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో కారులో విగతజీవిగా కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే) కొరియన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న లీ సన్ క్యూన్.. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న 'పారాసైట్' మూవీలోనూ కీలకపాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఇతడు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు. సడన్గా లీ సన్ క్యూన్ కనిపించడం లేదని రెండు మూడు రోజుల క్రితం ఇతడి భార్య కంప్లైంట్ చేసింది. దీంతో ఎక్కడికి వెళ్లాడా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంట్లోనే ఇతడి సూసైట్ నోట్ దొరికింది. అలానే పార్కింగ్ చేసిన కారులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని లీ భార్య పోలీసులు చెప్పింది. అయితే ఇతడు చనిపోయాడా? ఎవరైనా చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) -
టాప్ హీరో హీరోయిన్లకు చెక్! ఆ విషయంలో కష్టమే!
కాలంతో పాటు సినిమా రూపాంతరం చెందుతోందనడంలో ఎటువంటి సందేహం ఉండదు. జయాపయజాలను బట్టి చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం స్థాయి మారుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక చిత్రం హిట్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లు ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తారన్నది తెలిసిన విషయమే. అయితే దీనికి చెక్ పెట్టే పరిస్థితి రానున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చాలామటుకు సినిమాను కార్పొరేట్ సంస్థలే ఏలుతున్నాయి. దీంతో పలు పాత చిత్ర నిర్మాణ సంస్థలు తెరమరుగు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు స్టార్ హీరో హీరోయిన్లకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. రెమ్యునరేషన్ డిమాండ్.. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లు నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తాయి. దీంతో అలాంటి నటీనటులను బాక్సాఫీస్ గాడ్స్గా భావిస్తుంటారు. నిజానిజాల మాట అటు ఉంచితే ఇటీవల ఒక హీరో నటించిన చిత్రం వసూళ్లు రూ.500 కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలతో అలాంటి స్టార్స్కు క్రేజ్ మరింత పెరుగుతుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ను పెంచుకుంటూ పోతున్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ సంస్థలే! ఆ డబ్బుతోనే ఎక్కువ చెల్లిస్తున్నారు! సాటిలైట్, ఓటీటీ సంస్థలు ఇచ్చే డబ్బుతోనే నిర్మాతలు హీరో హీరోయిన్లకు పారితోషికం పెంచేస్తున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా వెలుగొందుతున్న నటి నయనతార కూడా రూ.10 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈమె తన చిత్రాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది లేదనే పలు కండిషన్లు పెడుతున్నారు. అయినా కానీ ఆమె మార్కెట్ తగ్గడం లేదు. ఇలాంటి వారికి తాజాగా కార్పొరేట్ సంస్థలు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 20 శాటిలైట్ హక్కులను, ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులను ఇకపై అధిక ధరకు చెల్లించరాదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో స్టార్ హీరో హీరోయిన్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బెంజ్ కారు కొనేసిన మానస్.. ఫొటోలు వైరల్ -
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్ శంకరన్ (93) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గురువు శంకరన్ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్కు నివాళులు అర్పిస్తున్నారు. 1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు శంకరన్. ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్ కోట్టై తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌనరాగం చిత్రంలో రేవతి తండ్రిగా చంద్రమౌళి అనే పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఈయన చివరిగా 1999లో అళగర్ సామి అనే చిత్రంలో నటించారు. 1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేన్ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్ మీన్, పెరిమై కురియవన్, వేలుమ్ మైలుమ్ తున్నై, కుమారి పెణిన్ ఉళ్లత్తిలే వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు భారతి రాజా ఈయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. எனது ஆசிரியர் இயக்குனர் திரு.ரா.சங்கரன் சார் அவர்களின் மறைவு வேதனை அளிக்கிறது. அவரை இழந்து வாடும் அவரது குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன். pic.twitter.com/SJmO0dApeq — Bharathiraja (@offBharathiraja) December 14, 2023 చదవండి: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు.. -
ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్పూర్-పఠాన్కోట్ లోక్సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పఠాన్కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్కోట్, సుజన్పూర్లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు! -
తెలుగు విలన్ అరెస్ట్.. కాల్పులు జరిపి హత్య చేయడంతో..
ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ ఘటన జరగ్గా భూపిందర్ సింగ్తో పాటు అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెట్ల దగ్గర గొడవ.. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కౌన్కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది. దీని పక్కనే గుర్దీప్ సింగ్ నివాసం ఉంటున్నాడు. ఇద్దరి స్థలం సరిహద్దులో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆదివారం రోజు ఆ చెట్లను తొలగించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో భూపిందర్ సింగ్ లైసెన్స్ పొందిన తన పిస్టోల్తో వరుస కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్దీప్ సింగ్, అతడి భార్య మీరాబాయ్, తనయుడు బుటా సింగ్ తీవ్రంగా గాయపడగా మరో తనయుడు గోబింద్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఎవరీ భూపిందర్ సింగ్? జై మహాభారత్ సీరియల్తో కెరీర్ ఆరంభించాడు భూపిందర్ సింగ్. ఏక్ హసీనా తీ, తేరే షెహర్ మే, మధుబాల- ఏక్ ఇష్క్ ఏక్ జనూన్ వంటి పలు సీరియల్స్లో నటించాడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు. తమ్ముడు, అన్నయ్య, దేవి పుత్రుడు, భలేవాడివి బాసు, విలన్, అంజి, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. 2010లో సోచ్ లో అనే హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. చదవండి: విజయ్ సినిమాలో ఛాన్స్.. నో చెప్పిన హీరోయిన్! -
సీఐడీ నటుడికి గుండెపోటు? పరిస్థితి విషమం!
బాలీవుడ్ నటుడు, సీఐడీ షో ద్వారా పాపులర్ అయిన దినేశ్ ఫడ్నీస్ తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్పై చికిత్స అందుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు నటులు ఆస్పత్రికి చేరుకుని ఆయన్ను పరామర్శిస్తున్నారు. గుండెపోటు వల్లే ఆయన ఆస్పత్రిపాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఐడీ సహనటుడు దయానంద్ శెట్టి సదరు వార్తలపై స్పందిస్తూ.. దినేశ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నమాట వాస్తవమే! ఆయన వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు గుండెపోటు రాలేదు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిపాలయ్యాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు అని తెలిపాడు. కాగా దినేశ్.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్ సీరియల్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్. సర్ఫరోష్, సూపర్ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Dinesh Phadnis (@dineshphadnis) చదవండి: ప్రముఖ నటి కన్నుమూత... బెడ్పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో -
దీనస్థితిలో నటుడు.. 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడన్న డాక్టర్స్!
సీనియర్ నటుడు, దర్శకుడు జూనియర్ మహ్మద్ అలియాస్ నయూమ్ సయ్యద్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. గత నవంబర్లో ఇతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగోదశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఊపిరితిత్తులు సహా ఇతర శరీర అవయవాలు పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. జూనియర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి ఆప్తమిత్రుడు సలాం కాజీ మాట్లాడుతూ.. 'నెల రోజుల కిందటే అతడికి క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. మొదట కడుపులో కణతి కనిపించింది. పరీక్షించగా క్యాన్సర్ అని తేలింది. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా అప్పుడే 20 కిలోలు తగ్గిపోయాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. నెల రోజుల్లోనే నాలుగో స్టేజీకి రావడంతో 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడని వైద్యులు చెప్పారు' అని తెలిపాడు. దీంతో ఆయనకు సాయం చేయడానికి కమెడియన్ జానీ లివర్.. ముంబైలోని మహ్మద్ ఇంటికి వెళ్లాడు. నటుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది. చికిత్సకుగానూ కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా కానీ వారి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించడంతో బలవంతంగా కొంత డబ్బును అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ మహ్మద్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టాడు. మరాఠీ భాషలో అనేక సినిమాలను తెరకెక్కించాడు, నటించాడు. దాదాపు 265 చిత్రాల్లో నటించాడు. కైటీ పతంగ్, ఆన్ మిలో సజ్నా, కారవాన్ వంటి పలు సినిమాలతో ఆయన పాపులర్ అయ్యాడు. Viral | Popular actor of yester years, Junior Mehmood has not been keeping well. Comedian Jonny liver seen here trying to lift up his spirits. pic.twitter.com/KQyErg4EBL — MUMBAI NEWS (@Mumbaikhabar9) December 1, 2023 చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్కు అదే కారణమంటూ.. -
ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!
హాలీవుడ్ నటి క్యాన్సర్ బారిన పడింది. అది కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది. బతికే అవకాశాలు లేవు. కానీ ఆమె మాత్రం నేను చనిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి బతుకుతాను అంటూ మొండి ధైర్యంతో జయించే ప్రయత్నం చేస్తుంది. పైగే ఈ దారుణ స్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారిస్తుంది. ఆమె అచంచలమైన ధైర్యం తనలా అనారోగ్యంతో బాధపడేవాళ్లలో ఓ కొత్త ఊపిరిని, స్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె హీరోయిన్గా వెండి తెరపైనే కాదు బయట కూడా హీరోయినే అని ప్రూవ్ చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికా నటి షానెన్ డోహెర్టీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. అది గుర్తించే నాటికే ఫోర్ట్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఆమె ఎముకలంతటికి వ్యాపించి పరిస్థితి కాస్త సివియర్గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అయినా కూడా ఎక్కడ కించెత్తు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ స్థితిలో కూడా 'నేను చనిపోవాలని కోరుకోవడం లేదు' కాబట్టి బతుకుతా. 'నేను పూర్తిగా జీవించలేదు'. 'పూర్తిగా ప్రేమించబడ లేదు'. కాబట్టి కచ్చితంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని ధీమాగా చెబుతుంది. పైగా తనలా మరెవరూ ఈ క్యాన్సర్తో బాధపడుకుండా ఉండేలా పరిశోధనలు మరింత విస్తృతంగా చేసేందుకు నిధులు వెచ్చిస్తుంది. అంతేకాదు ఈ క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది? అది కూడా స్టేజ్4లోనే ఎందుకు ఉన్నా? ఇందంత ఏదో తన వల్ల అయ్యే గొప్ప ప్రయోజనం కోసమే ఇలా అయ్యి ఉంటుంది. అందుకే ఆ దిశగా నన్ను నేను బతికేలా ధైర్యం కూడగట్టకుంటూ క్యాన్సర్ అంతమొందించే ప్రపంచానికై తపస్సు చేస్తున్నానని నిర్భయంగా చెబుతోంది. ఈ వ్యాధి కారణంగా నడవలేం, తినలేం కనీసం పనిచేయలేం అని ఆవేదనగా చెబుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ వ్యాధిని చూసి డీలా పడకుండా భిన్నమైన దృక్పథంతో మాలాంటి పేషెంట్లు ఉండి జీవితాన్ని నూతనోత్సాహంతో ఆస్వాదించాలి. అప్పుడే మళ్లీ మునుపటి జీవితాన్ని పొందగలరు అని నిరాశ నిస్ప్రుహలో ఉన్న క్యాన్సర్ పేషంట్లందరికి స్ఫూర్తినిచ్చేలా చెబుతోంది. నటి షానెన్ డోహెర్టీ 1990ల బ్లాక్బస్టర్ బెవర్లీ హిల్స్, 90201లో బ్రెండా వాల్ష్ వంటి పాత్రలతో అభిమానుల మనుసులను గెలుచుకుంది. ఈమెకు 2015లో క్యాన్సర్ నిర్థారణ అయినప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది కూడా. అయితే అది మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4లో ఉండటమే బాధాకరం. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా పెళ్లిపీటలెక్కాడు. ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్ను వివాహం చేసుకున్నాడు. మణిపూర్లోని ఇంపాల్లో బుధవారం (నవంబర్ 29న) నాడు ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. మైటీ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరుడు రణ్దీప్ తెల్ల దుస్తులు ధరించగా, వధువు లిన్ మణిపురి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఒంటి నిండా నగలు ధరించి పుత్తడి బొమ్మలా మండపానికి నడుచుకుంటూ వచ్చిన వధువు మొదటగా వరుడికి నమస్కరించి అతడి మెడలో మల్లెపూల మాల వేసింది. తర్వాత రణ్దీప్ భార్య మెడలో మల్లెపూల మాల వేశాడు. వీరి సాంప్రదాయాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. కాగా రణ్దీప్ కంటే లిన్ పదేళ్లు చిన్నది. ప్రస్తుతం రణ్దీప్ వయసు 47 ఏళ్లు కాగా లిన్ వయసు 37 ఏళ్లు. సినిమాల విషయానికి వస్తే.. రణ్దీప్ 'మాన్సూన్ వెడ్డింగ్' చిత్రంతో సిల్వర్ స్క్రీన్పై రంగప్రవేశం చేశాడు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్స్టర్', సల్మాన్ ఖాన్ 'కిక్', 'రంగ్ రాసియ', 'జిస్మ్ 2' వంటి పలు చిత్రాలతో పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2: ఖూన్ చుస్వా' సినిమాలు చేస్తున్నాడు. లిన్ విషయానికి వస్తే.. 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. 'మేరీ కోమ్', 'మాతృ కి బిజిలీ కా మండోలా', 'రంగూన్', 'ఆక్సోన్', 'ఉమ్రిక', 'ఖైదీ బంద్' వంటి చిత్రాల్లో నటించింది. ఈమె చివరిసారిగా జానే జాన్ సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) Ceremonies that don't look like right out of a bollywood assembly line are so refreshing. Beautiful! “#RandeepHooda and Lin Laishram tied the knot in a traditional Meitei wedding ceremony in Imphal.” pic.twitter.com/DMzEXIKW2Z — prachi (@ahamprachi) November 29, 2023 ❤️ How often do we see such beautiful traditional weddings in Bollywood?#RandeepHooda and #LinLaishram tie the knot in a Meitei ceremony. Congratulations 🥰 pic.twitter.com/oLUtYvV1oH — Mimansa Shekhar (@mimansashekhar) November 29, 2023 చదవండి: విజయ్ ఆంటోని గొప్పదనాన్ని వివరించిన బాహుబలి నటుడు -
స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన నటుడు.. అవకాశాల్లేక వాచ్మెన్గా..
కెరీర్ను సరిగా ప్లాన్ చేసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఛాన్సులు రాకుండా పోతాయో ఊహించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే నటుడికి కూడా ఇదే జరిగింది. అప్పటిదాకా సూపర్ స్టార్స్తో కలిసి నటించిన ఈయనకు ఆ తర్వాత అవకాశాలు రావడమే గగనమైపోయింది.. ఇంతకీ ఆ నటుడెవరో చూద్దాం.. సడన్గా వాచ్మెన్గా... బ్లాక్ ఫ్రైడే, గులాల్, పటియాలా హౌస్ వంటి పలు చిత్రాల్లో సవి సిద్ధు నటించాడు. ఇతడు పోషించింది చిన్నపాత్రలే అయినా వాటికి మంచి ఆదరణ ఉండేది. అక్షయ్ కుమార్, కేకే మీనన్ వంటి స్టార్స్తో నటించాడు. అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వాణీ వంటి ప్రముఖ దర్శకుల డైరెక్షన్లో యాక్ట్ చేశాడు. కానీ 2019లో ముంబైలోని ఓ భవంతి ముందు ఇతడు వాచ్మెన్గా దర్శనమిచ్చాడు. అవకాశాలు రాకపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీకి దూరమై వాచ్మెన్గా మారానని చెప్పుకొచ్చాడు. అందరూ వదిలేసి పోయారు సవి మాట్లాడుతూ.. 'నా జీవితంలో కోలుకోలేని దెబ్బ.. నా భార్య మరణం. తర్వాత అమ్మానాన్న కూడా చనిపోయారు. ఒక్కడినే మిగిలాను. ఒంటరివాడినయ్యాను. ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలా సమయమే పట్టింది. కానీ అప్పుడు అవకాశాలు రాలేదు. ఖాళీగా కూర్చుంటే పొట్ట నింపుకోవడం కష్టమని వాచ్మెన్గా చేరాను. 12 గంటల పాటు పని చేయాలి. ఎక్కడికైనా వెళ్లడానికి బస్సు టికెట్ కూడా కొనుకోలేని దీనస్థితిలో ఉన్నాను. అప్పుడు రీఎంట్రీ.. ఆ తర్వాత.. ఇప్పుడు థియేటర్లో సినిమా చూడటం అనేది కూడా నాకు అందని ద్రాక్షగా మారింది. నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు' అని పేర్కొన్నాడు. అప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్గా మారగా అనురాగ్ కశ్యప్, రాజ్కుమార్ రావు అతడికి మద్దతుగా నిలబడ్డారు. ఛాన్సులు రావడానికి సాయపడతామన్నారు. అలా సవి 2020వ సంవత్సరంలో మస్కా సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత సవి గురించి ఏ సమాచారమూ బయటకు రాలేదు. చదవండి: బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి రెస్టారెంట్ బిజినెస్.. చివరకు దాన్ని కూడా మూసేసి.. -
యాక్టింగ్ మీద ప్యాషన్తో బ్యాంకు ఉద్యోగం, రెస్టారెంట్ బిజినెస్ వదిలేశా: నటుడు
నెలానెలా అకౌంట్లో డబ్బు పడే ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన నటనను కెరీర్గా ఎంచుకున్నాడు హిందీ నటుడు ప్రిన్స్ రోడ్. మొదట్లో బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న అతడు రెస్టారెంట్లు పెట్టి బిజినెస్మెన్గా మారాడు. కానీ నటనవైపు మనసు లాగడంతో అన్నింటికీ ముగింపు పలికి రంగుల ప్రపంచంలోకి రంగప్రవేశం చేశాడు. ఈరోజు(నవంబర్ 24న) ప్రిన్స్ రోడ్ బర్త్డే. ఈ సందర్భంగా అతడు తన కెరీర్ ప్రయాణాన్ని వివరించాడు. ఉద్యోగానికి రాజీనామా 'నా చదువు పూర్తయ్యాక నేను ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగం చేశాను. 2009లో ముంబైకు బదిలీ చేశారు. అక్కడకు వెళ్లాక నటుడిని కావాలన్న కోరిక మరింత బలపడింది. ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు రెస్టారెంట్లు ప్రారంభించాను. ఓ పక్క ఈ వ్యాపారం చూసుకుంటూ యాక్టింగ్ చేసుకోవచ్చనుకున్నాను. కానీ ఇలా రెండు పడవల ప్రయాణం వర్కవుట్ కాదని తెలుసుకున్నాను. 2018లో రెస్టారెంట్ల బిజినెస్ కూడా వదిలేసి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాను. నా వరకు నేను తీసుకుంది మంచి నిర్ణయమే అనుకుంటున్నాను. ఇతరుల్ని అడుక్కోవాలి.. ఉద్యోగంలోలాగా ఇక్కడ ఇన్ని గంటలు, ఇంతే పని చేయాలి వంటి నియమాలేమీ ఉండవు. రకరకాల పాత్రలు పోషించాలి. ముఖ్యంగా ఈగో పక్కనపెట్టి పని కోసం ఇతరుల్ని అడుక్కోవాలి. వీటన్నింటినీ దాటుకుని వచ్చాను. అయితే నటుడిగా కెరీర్ ఆరంభించాను. కానీ కరోనా విపత్తు సమయంలో రచయితగా మారాను. ఎన్నో కథలు, స్క్రిప్టులు రాశాను. వాటిని ఓటీటీకి ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రిన్స్ రోడ్.. చాన్స్ పే డ్యాన్స్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. దిల్ సే దిల్ తక్ అనే టీవీ షోలోనూ కనిపించాడు. ద షోలే గర్ల్, మంఘదంత్ వంటి ప్రాజెక్టులతో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు వెబ్సిరీస్లు ఉన్నాయి. చదవండి: సోదర బంధం గొప్పది.. కానీ ఈగో ఉండొద్దు.. ఎవరో ఒకరు తగ్గాలి.. -
Chandra Mohan Santhapa Sabha: నటుడు చంద్రమోహన్ సంతాప సభలో భార్య, కుటుంబసభ్యులు (ఫొటోలు)
-
కటిక పేదరికం వల్ల ఆగిన చదువు.. 67 ఏళ్ల వయసులో బడికెళ్తున్న నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రాన్ పదో తరగతి పరీక్షకు సంసిద్ధమవుతున్నాడు. పేదరికం వల్ల బాల్యంలో చదువుకు దూరమయ్యానని అందుకే ఇప్పుడు మళ్లీ బడి బాట పట్టానంటున్నాడు. 67 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసి పాస్ అయి చూపిస్తానంటున్నాడు. చిన్నతనంలో ఆపేసిన చదువును ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నాడు. ప్రతి ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరువుతున్నానని, వచ్చే ఏడాది పరీక్షలకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నానని తెలిపాడు. ఎవరీ ఇంద్రాన్స్.. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఇంద్రాన్స్ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అతడి ఇంట ఏడుగురు సంతానంలో ఇంద్రాన్స్ మూడోవాడు. చదువుకునే స్థోమత లేక నాలుగో తరగతికే బడికి వెళ్లడం మానేశాడు. కటిక పేదరికం వల్ల విద్యకు ఫుల్స్టాప్ పెట్టి ఏదైనా పని చేయాలనుకున్నాడు. తన అంకుల్ దగ్గర దుస్తులు కుట్టడం నేర్చుకున్నాడు. మరోపక్క నాటకాలు కూడా నేర్చుకున్నాడు. 'కలివీడు' అనే సీరియల్తో తన కెరీర్ను మొదలుపెట్టాడు. అటు తన సోదరుడు జయకుమార్తో కలిసి కేరళలోని కుమారపురంలో ఇంద్రాన్స్ బ్రదర్స్ అనే టైలర్ షాప్ ప్రారంభించాడు. కమెడియన్గా వందలాది సినిమాలు 1981లో 'చూతట్టం' అనే సినిమాతో మలయాళ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గానూ పని చేశాడు. అలా కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తూ చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయాడు. 'సీఐడీ ఉన్నికృష్ణన్ బీఏ, బీఎడ్' సినిమాతో పాపులర్ అయ్యాడు. కమెడియన్గా వందలాది చిత్రాలు చేశాడు. హోమ్ సినిమాకుగానూ జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. చదవండి: డాక్టర్ బాబు మాస్టర్ మైండ్.. షాకైన శివాజీ, రైతుబిడ్డ.. ఇదే కంటిన్యూ అయితే టాప్ 5! -
టాలీవుడ్ అగ్ర హీరోపై నటి విచిత్ర సంచలన ఆరోపణలు
-
నటుడు, రచయిత ఉత్తేజ్ను ఇలా ఎప్పుడైనా చూశారా? (అరుదైన ఫొటోలు)
-
కారులో అనుమానాస్పదంగా ప్రముఖ నటుడి మృతదేహాం
మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు వినోద్ థామస్ (47) మరణించారు. ఆయన అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది. మలయాళంలో పాపులర్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేశాడు. గత రాత్రి (నవంబర్ 18) కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలోని ఓ హోటల్ పార్కింగ్ వద్ద చాలా సమయం నుంచి అనుమానాస్పదంగా ఒక కారు ఆగి ఉంది. దానిని గమనించిన హోటల్ సిబ్బంది. కారు వద్దకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అందులో మృత దేహం కనిపించింది. వెంటనే డోర్ క్లోజ్ చేసి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు కారును పరిశీలించి ఆ మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు మలయాళ నటుడు వినోద్ థామస్ అని తేలింది. ‘అయ్యప్పనుమ్ కోషి’, ‘నాతోలి ఏరు ఒకిత మీనాళ్ల’ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించడం గమనార్హం. ఈ సంఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.వినోద్ థామస్ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అలాగే వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ కేసులో వినోద్ థామస్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. -
ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్
బాలీవుడ్లో తన నటనతో ఎనలేని ప్రశంసలు దక్కించుకున్నాడు నానా పటేకర్.. కానీ ఆయన నిజ జీవితంలో అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటుంటాడు. కొద్దిరోజుల క్రితం ‘ది వ్యాక్సిన్ వార్’తో ప్రేక్షకులను అలరించాడు నానా పటేకర్. సినిమా షూట్లో భాగంగా ఆయన వారణాసిలో తాజాగా పర్యటించాడు. వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో గట్టిగా తల మీద ఒక్కటిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. ఈ వివాదంపై ఆ చిత్ర దర్శకనిర్మాత అనిల్ శర్మ ఇలా స్పందించాడు. 'సినిమాలో నానా పటేకర్ మానసిక స్థితి బాగలేని పాత్రలో కనిపిస్తారు. గుంపులో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీకోసం ఒకరు రావడం. తనను ఆ వ్యక్తి కొట్టడం. ఇదంతా షూటింగ్లో భాగం మాత్రమే' అని అన్నారు. క్షమించమని కోరిన నానా పటేకర్ 'నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేశాము... మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాము. దర్శకుడు స్టార్ట్ అనగానే. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్నాము. అతను ఎవరో నాకు తెలియదు, అతను మా సిబ్బందిలో ఒకడని భావించాను కాబట్టి నేను చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది. (ఇదీ చదవండి: నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్) కాబట్టి, నేను వెంటనే అతనిని తిరిగి పిలిచాను కూడా.. కానీ అతను అప్పటికే వెళ్లిపోయాడు. బహుశా అతని స్నేహితుడు ఈ వీడియో చిత్రీకరించి ఉంటాడు. నేను. ఫోటో కోసం ఎవ్వరితోనూ ఇప్పటి వరకు నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను.' అని ఆయన అన్నాడు. #WATCH | On a viral showing him slapping a boy for taking a selfie with him, actor Nana Patekar says, "A video is going viral where I have hit a boy. Though this sequence is a part of our film, we had one rehearsal...We were scheduled to have a second rehearsal. The director told… pic.twitter.com/CVgCainRg1 — ANI (@ANI) November 16, 2023 वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 -
సెల్ఫీ కోసం వెళ్తే తల మీద ఒక్కటిచ్చిన నటుడు, వీడియో వైరల్
అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్మని కొట్టాడు. మెడ పట్టి గెంటేశారు ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి.. కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాడు. वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 చదవండి: చైతూ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు? -
ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?
మలయాళ బుల్లి తెర నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసింది. నిండు గర్భిణి అయిన ఆమె సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న శిశువుని బయటకు తీసి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెలల నిండక మునుపే పుట్టడంతో వైద్యులు ఆ చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయా? ఎందువల్ల ఇలా జరుగుతుంది తదితరాల గురించే ఈ కథనం!. అధిక రక్తపోటు, ధూమపానం తదితరాలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కానీ నిపుణల అభిప్రాయం ప్రకారం గుండె సంబంధ సమస్యలకు మరో ప్రధాన కారకం ఉంది. అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8% వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్లో 15% అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని తెలిపారు వైద్యులు. ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తలనొప్పి మబ్బు మబ్బుగా కనిపించడం కంటిలో నల్లటి మచ్చలు కడుపులో కుడివైపు నొప్పి చేతులు, ముఖం వాచి ఉండటం ఊపిరి ఆడకపోవడం గర్భధారణ సమయంలో గుండె పదిలంగా ఉండాలంటే.. రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఆరోగ్యకరమైన, కాలానుగుణ ఆహారాన్ని తినడం వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుండి అధిక-తీవ్రత వర్కౌట్లు లేదా యోగా ఉంటాయి అధిక బరువు పెరగకుండా ఉండండి ఒత్తిడికి దూరంగా ఉండండి శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవడం తదితరాలను పాటిస్తే గర్భధారణ సమస్యలో ఈ గుండె సంబంధిత సమస్యల ఎదురవ్వవు. (చదవండి: తక్కువ వ్యాయామమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
Dalip Tahil Rare Pics: బాలీవుడ్ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ పుట్టినరోజు సందర్భంగా రేర్ (ఫోటోలు)
-
హాలీవుడ్ నటుడు మాథ్యూ ఫెర్రీ ఇక లేరు
అమెరికన్ ప్రముఖ నటుడు మాథ్యూ ఫెర్రీ (54) ఇక లేరు. లాస్ ఏంజిల్స్లోని స్వగృహంలో ఫెర్రీ అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. జాన్ బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ మోరిసన్ దంపతులకు 1969 ఆగస్టు 19న జన్మించారు మాథ్యూ ఫెర్రీ. ఫెర్రీకి ఏడాది వయసు పూర్తి కాక ముందే బెన్నెట్ ఫెర్రీ, సుజానే మేరీ విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్లు తల్లి వద్దే ఉంటూ చదువుకున్నాడు ఫెర్రీ. ఆ తర్వాత అప్పటికే నటనా రంగంలో ఉన్న తండ్రి బాటలో నడిచారు ఫెర్రీ. అలా సినిమాలు, ముఖ్యంగా సీరియల్స్లో నటించి పేరు గడించారు. 1994లో ఆరంభమైన ‘ఫ్రెండ్స్’ సిరీస్తో ఆయన జీవితం కీలక మలుపు తీసుకుంది.ఇందులో ఫెర్రీ పోషించిన చాండ్లర్ బింగ్ పాత్ర అద్భుతంగా క్లిక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఫెర్రీకి అభిమానులను సంపాదించిపెట్టింది. ‘ఫ్రెండ్స్’ సిరీస్ 2014 వరకు ఓ అమెరికన్ చానెల్లో ప్రసారమైంది. అలాగే 2021లో ‘ఫ్రెండ్స్ రీ యూనియన్ షో’ కూడా జరిగింది. ఈ షో ఓ ప్రముఖ ఓటీటీ ΄్లాట్ఫామ్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఎమ్టీ నెస్ట్’, ‘హైవే టు హెవెన్’, ‘ఫ్రెండ్స్’, ‘మిస్టర్ సన్షైన్’... ఇలా 40కి పైగా టెలివిజన్ సిరీస్లలో నటించారు ఫెర్రీ. అలాగే ‘ది కిడ్’, ‘బర్డ్స్ ఆఫ్ అమెరికా’.. ఇలా దాదాపు 15 హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారాయన. ఇక ఫెర్రీ మృతి పట్ల ఇండియన్ స్టార్స్ వెంకటేశ్, మహేశ్బాబు, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, సమంత, కరీనా కపూర్లతో పాటు పలువరు హాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. -
ఏడ్చేసిన బలగం నటుడు!
బలగం సినిమాలో నటించిన అందరు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారిలో నటుడు మురళీధర్ కూడా ఉన్నాడు. ఈయన స్వస్థలం మెదక్ జిల్లా రామాయంపేట. సిద్దిపేటలో చదువుకున్నాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పని చేసి రిటైర్ అయిన ఈ పెద్దాయన విశ్రాంతి తీసుకునే సమయంలో నటనారంగంలో అడుగుపెట్టాడు. బలగంతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇటీవలే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలోనూ నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రిటైర్ అయ్యాక నటుడవ్వాలనే కోరికతో సినిమా రంగానికి వచ్చాను. ఈ వయసులో నాకు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదోనని మొదట సీరియల్స్ వైపు వెళ్లాను. అక్కడ గుర్తింపు వచ్చాక సినిమాల్లో ప్రయత్నించాను. బలగం, భగవంత్ కేసరి.. ఇలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. భగవంత్ కేసరి మూవీలో మంచి పాత్ర ఇచ్చారు. ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ఆనంద భాష్పాలు రాల్చాడు మురళీధర్ గౌడ్. చదవండి: ఓటీటీలోకి వచ్చేసి భయపెడుతున్న హారర్, సైకో థ్రిల్లర్ మూవీస్.. స్ట్రీమింగ్ అక్కడే! -
విడాకులపై ఎట్టకేలకు నోరు విప్పిన బుల్లితెర నటి.. రాగద్వేషాల వల్లే!
రంగుల ప్రపంచంలో రాణించే సెలబ్రటీలు వ్యక్తిగత విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యం ప్రేమ-పెళ్లి విషయాల్లో ఎంతోమంది తారలు ఒడిదుడుకులకు లోనవుతున్నారు. ప్రేమించినవారి చేయి పట్టుకుని నడిచినా కొంతకాలానికే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తుంది బుల్లితెర జంట కరణ్ వీర్ మెహ్రా- నిధి సేత్. ఏడాది క్రితమే విడిపోయిన జంట 2021 జనవరిలో పెళ్లి చేసుకున్న వీరిద్దరు కొంతకాలానికే తమ దారులు వేరని తెలుసుకున్నారు. ఏడాది కిందటే విడిపోయారు. మూడు నెలల కిందట విడాకులు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కరణ్ వీర్ ముంబైలోనే ఉండగా నిధి బెంగళూరులో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా తమ విడాకుల విషయాన్ని ఎట్టకేలకు ధృవీకరించింది నిధి సేత్. పెళ్లి చేసుకునేటప్పుడు అవన్నీ తప్పనిసరి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, మేము విడిపోయి దాదాపు ఏడాదవుతోంది. మూడు నెలల కిందటే విడాకులు కూడా తీసుకున్నాం. ఏ బంధంలోనైనా రాగద్వేషాలు, విషపూరిత వాతావరణం ఉండకూడదు. పరస్పర గౌరవం, మానసిక ప్రశాంతత, నిజాయితీ, ఆర్థిక స్థిరత్వం అనేది వివాహ బంధానికి తప్పనిసరిగా అవసరం' అని చెప్పుకొచ్చింది. బుల్లితెర నుంచి బాలీవుడ్కు కరణ్ వీర్ మెహ్రా 2005లో 'రీమిక్స్' షోతో బుల్లితెరపై అడుగు పెట్టాడు. 'పవిత్ర రిష్తా' సీరియల్లో నటనకుగానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. స్మాల్ స్క్రీన్కే పరిమితం కాకుండా వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రాగిని ఎమ్ఎమ్ఎస్ 2, మేరే డాడ్కీ మారుతి, బ్లడ్ మనీ, బద్మాషీయాన్, ఆమెన్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఆ సీరియల్స్తో ఫేమస్ ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు దేవిక మెహ్రాను ఇదివరకే పెళ్లి చేసుకున్నప్పటికీ 2009లో వీరు విడిపోయారు. తర్వాత తన సహనటి నిధి సేత్తో ప్రేమలో పడ్డ ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు, కానీ ఈ వివాహం కూడా ఎంతో కాలం నిలవలేదు. ఇక నిధి సేత్ శ్రీమద్ భగ్వత్ మహాపురాణ్, మేరే డాడ్ కీ దుల్హాన్, కిస్మత్ కా ఖేల్ వంటి పలు సీరియల్స్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. చేతులు కట్టుకుని చూస్తారు మరి! -
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు.. సినీనటుడు సుమన్ రియాక్షన్
సాక్షి, విశాఖపట్నం: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ తప్పుబట్టారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ‘‘రోజాను వ్యక్తిగతంగా ఎదుర్కోనలేకే ఆరోపణలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే మంత్రి రోజాను రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు పడి మంత్రి రోజా ఈ స్థాయికి వచ్చింది బండారు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా ఇదే విధంగా మాట్లాడితే బండారు ఊరుకుంటారా’’ అంటూ మండిపడ్డారు. చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు, మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ను ఫాలో అవ్వండి -
బిగ్బీతో వర్క్ చేయడం నా అదృష్టం: సీనియర్ హీరో
నటుడు రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అమితాబచ్చన్తో కలిసి నటించడం విశేషం. ఇకపోతే ఈయన నటుడిగా నాలుగు వసంతాలు పూర్తి చేసుకోవడం మరో విశేషం. కళాశాల విద్య పూర్తి కాగానే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వరించింది. అలా 1983లో కూడే వీడే అనే మలయాళ చిత్రంతో రెహమాన్ తన నట జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నటుడిగా ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళంలోనూ కె. బాలచందర్, సురేష్ కృష్ణ వంటి పలువురు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అదేవిధంగా తెలుగులో రాగలీల అనే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి మన్మథ సామ్రాజ్యం, చిన్నారి స్నేహం, భార్యలు జాగ్రత్త ,భారత్ బంద్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. విశేషమేమిటంటే మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మధురాంతకన్ రాజాగా నటించి ఆ పాత్రకు హుందాతనం చేకూర్చారు. ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన సమరా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. తాజాగా గణపథ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేశారు. ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. ఇది ఈనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు రెహమాన్ శనివారం సాయంత్రం చైన్నెలో విలేకరులతో ముచ్చటించారు. అమితాబచ్చన్తో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందని బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్తో భారీ ఫైట్ సన్నివేశాల్లో పోటీపడి నటించినట్లు చెప్పారు. కాక తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. ఈమేరకు కథను కూడా సిద్ధం చేసుకుని ఈడెన్ గార్డెన్ అనే టైటిల్ ను కూడా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే నటుడిగా పేరుప్రతిష్టలు, డబ్బు వస్తుంటే ఇప్పుడు దర్శకత్వం ఎందుకని తన భార్య చెప్పడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు రెహమాన్ తెలిపారు. చదవండి: బిగ్బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? -
రూ.25 లక్షల కోసం వెళ్లి మర్డర్ కేసులో ఇరుక్కున్నా: సై సూర్య
ఎన్నో సినిమాలు చేస్తే కానీ కొందరికి గుర్తింపు లభించదు. మరికొందరికి మాత్రం తొలి చిత్రంతోనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నటుడు సూర్య రెండో కోవలోకి వస్తాడు. ఇతడు రాజమౌళి సై సినిమాతో నటుడిగా క్లిక్ అయ్యాడు. ఆ నలుగురు చిత్రంతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించాడు. ఆ మధ్య ఓ హత్య కేసులోనూ అతడి పేరు వినిపించడంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. పాతిక లక్షల కోసం వెళ్లి.. తాజాగా సదరు ఘటన గురించి సూర్యంగా వివరంగా చెప్పుకొచ్చాడు. 'నేను కలియుగ అనే సినిమా తీశాను. దానికోసం నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టేశాను. రిలీజ్కు రూ.25 లక్షలు అవసరమయ్యాయి. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేశ్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతడు చిన్న చిన్న సినిమాలకు డబ్బు అప్పుగా ఇస్తుంటాడు. నా సినిమా చూపించి డబ్బు అడిగాను. ఇక్కడేమైందంటే డబ్బులు అవసరమై చిగురుపాటి జయరాం అనే వ్యక్తిని కూడా కలిశాను. ఆ మరునాడే హత్య.. మీడియాలో నా పేరు పది రోజుల్లో డబ్బు సర్దుతానన్నాడు, సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ మరునాడే ఆయన హత్య జరిగింది. ముందు రోజు నేను ఆయనను కలవడంతో నామీద అనుమానపడ్డారు. సినిమా వాళ్ల గురించి ఎలా రాస్తారో తెలిసిందే! ఆ హత్యతో నాకసలు సంబంధమే లేదని రుజువైంది. కానీ అప్పటికే మీడియాలో నా గురించి ఏదిపడితే అది రాశారు. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇకపోతే కలియుగ సినిమా కోసం నా ఇల్లు కూడా ఇమ్మేశాను. ఈ మూవీ వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోంది' అని చెప్పుకొచ్చాడు సూర్య. చదవండి: మహాలక్ష్మిని, నన్ను ఎవరూ వేరు చేయలేరు.. ఎంతైనా తిట్టుకోండి.. -
Anil Kapoor: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ (ఫొటోలు)
-
Kiran Abbavaram: తిరుమల శ్రీవారి సేవలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (ఫోటోలు)
-
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ని పెళ్లాడి సినిమాలకు గుడ్బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
Aishwarya Upendra: ఉపేంద్ర కూతురిని చూశారా? గ్లామర్తో మెరిసిపోతోంది (ఫోటోలు)
-
విషాదం.. '3 ఇడియట్స్' నటుడు కన్నుమూత
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా(58) కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 21) బాల్కనీలో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి కిందపడటంతో అక్కడికక్కడే మరణించారు. నటుడి మరణంతో ఆయన భార్య సుజానే కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 'నా భాగస్వామి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, నా గుండె ముక్కలైంది' అని కన్నీటిపర్యంతమవుతోంది. కాగా అఖిల్ మిశ్రా.. డాన్, వెల్డన్ అబ్బా, హజారన్ ఖ్వైషేన్ ఐసీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 3 ఇడియట్స్ సినిమాలో లైబ్రేరియన్గా నటించి జనాలకు మరింత దగ్గరయ్యారు. సినిమాలే కాకుండా సీరియల్స్, టీవీ షోలు కూడా చేశారు. 1983లో ఈయన తన సహనటి మంజు మిశ్రను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయనను ఒంటరి చేస్తూ 1996లో ఆమె మరణించింది. దీంతో 2009లో జెర్మన్ నటి సుజానే బెర్నర్ట్ను పెళ్లాడారు. చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి! -
వంద కోట్ల సినిమాలో ఆఫర్.. అంత ఈజీగా ఒప్పుకోనంటున్న నటుడు
కొందరు సినిమా ఛాన్స్ వస్తే చాలనుకుంటారు, మరికొందరు మంచి రోల్ వస్తేనే చేస్తామంటారు. బాలీవుడ్ నటుడు గోవింద రెండో కేటగిరీకి చెందినవాడు. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయే రకం కాదు. చిన్న చిత్రమైనా, పెద్ద సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే అందులో నటిస్తాడు. ఈమాటకు కట్టుబడి నాలుగేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దేన్నీ అంత సులువుగా అంగీకరించను. జనాలేమో నాకు అవకాశాలు రావడం లేదనుకుంటారు. కానీ వినాయకుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉన్నాయి. నాకు ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది నేను.. వంద కోట్లతో తెరకెక్కిన ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాను. అసలు ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో అద్దం ముందు నిల్చుని నన్ను నేను కొట్టుకున్నాను. నిజానికి వాళ్లు చాలా డబ్బు ఇస్తామన్నారు, కానీ నాకు ఏదిపడితే అది, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడంతో వదిలేసుకున్నాను. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద 1986లో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. 170కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరో నెం.1, షోలా ఔర్ షబ్నం, పార్ట్నర్ వంటి అనేక హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన చివరగా 2019లో వచ్చిన రంగీలా రాజా సినిమాలో నటించాడు. అప్పటినుంచి మరే చిత్రంలోనూ కనిపించలేదు. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు: జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్దాస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు) జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు రియో కపాడియా(66) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సప్నే సుహానే లడక్పాన్ కే, మహాభారత్ సీరియల్స్లోనూ నటించారు. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దానీ చిత్రాల్లో కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రియో మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంతాపం ప్రకటించింది. కపాడియా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో చిత్రంలో కనిపించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్- 2 అనే వెబ్ సిరీస్లో కనిపించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రిగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తన కెరీర్లో కుటుంబం, జుద్వా రాజా, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్స్లో నటించి మెప్పించారు. మహాభారతం సీరియల్లో గంధర్ రాజు పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. CINTAA expresses its condolences on the demise of Rio Kapadia (Member since 2004) .#condolence #condolencias #restinpeace #rip #RioKapadia #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/d6GOLdtUZu — CINTAA_Official (@CintaaOfficial) September 14, 2023 -
దక్షిణాదిన బిజీబిజీ.. బాలీవుడ్లో ఎంట్రీకి రెడీ అయిన నటుడు
సినిమాకు భాషాబేధం లేదు.. ఇక్కడ ప్రతిభే ప్రధానం. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కన్ను దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడిందనే విషయం తెలిసిందే. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ సహా అనేకమంది ప్రముఖ బాలీవుడ్ నటులు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దక్షిణాది సినిమాల్లో గర్తింపు తెచ్చుకున్న నటుడు జాన్ కొక్కెన్ బాలీవుడ్లో ఎంట్రీకి రెడీ అయ్యారు. మలయాళ కుటుంబానికి చెందిన ఈయన పుట్టి పెరిగింది ముంబైలో.. కానీ నటుడిగా రంగ ప్రవేశం చేసింది మాత్రం మాతృభాష అయిన మలయాళంలోనే. దాదాపు 17 ఏళ్లుగా మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో దరువు, 1 నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్ లీ, వీరసింహరెడ్డి వంటి సినిమాల్లో నటించిన జాన్ కొక్కెన్.. తమిళంలో వీరం, సార్పట్ట పరంపరై, తునివు(తెగింపు) వంటి పలు చిత్రాల్లో సత్తా చాటారు. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తాజాగా 'ది ఫ్రీలాన్సర్' అనే హిందీ వెబ్ సిరీస్లో నటించడం విశేషం. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీబీఐ అధికారిగా పవర్ఫుల్ పాత్రను పోషించినట్లు జాన్ కొక్కెన్ తెలిపారు. తన పాత్ర చాలా సాఫ్ట్గా వైవిధ్య భరితంగా ఉంటుందన్నారు. తాను నటిస్తున్న తొలి హిందీ వెబ్ సిరీస్ ఇదనీ, తనకిది చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. నీరజ్ పాండే క్రియేటివ్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే.. -
సిగరెట్, గంజాయి తాగడం.. ఇలా చాలా అలవాట్లుండేవి: తనికెళ్ల భరణి
నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.. ఆ మధ్య నటుడు తనికెళ్ల భరణి ఈ కవిత చదివి వినిపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పట్లో ఈ వీడియోను చూసి కంటతడి పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా తన తండ్రిని తలుచుకుని మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు తనికెళ్ల భరణి. ఓ ఇంటర్వ్యూలో ఆయన తండ్రితో తనకున్న అనుబంధాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చెప్పులు కొనిస్తాడనుకుంటే.. ఏడో తరగతి చదువుకునే వరకు నా కాలికి చెప్పుల్లేవు. ఓసారి రోడ్డుమీద నడుస్తుండగా కాలిన సిగరెట్ మీద కావాలని కాలేసి అమ్మా అని అరిచాను. మా నాన్న వెంటనే అటూఇటు చూసి చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి నాకో జత కొనిస్తాడని అలా చేశాను. కానీ మా నాన్న చూసుకుని నడవలేవా? అని ఒక్కటిచ్చాడు. ఒకసారైతే నేను చేసే పనులు చూసి చెట్టుకు కట్టేసి కొట్టాడు. వంద రూపాయల కోసం బూతులు.. మా నాన్న లాల్చీలో నుంచి రెండు రూపాయలు అలా కొట్టేసేవాడిని. ఓసారి ఆయన జేబులో నుంచి వంద రూపాయలు కొట్టేశాను. రాత్రి నేను అన్నం తింటుండగా వచ్చి.. వాడికి పప్పు, నెయ్యి ఎక్కువ వేయి, మనింట్లో భోజనం చేయడం ఇదే చివరిసారి కదా.. రేపటినుంచి జైల్లోనే కదా ఉండేది అని అమ్మతో అన్నాడు. వంద రూపాయలు కొట్టేస్తావా.. అని బూతులు తిట్టాడు. ఎప్పుడైనా నేను మా నాన్న జేబులో వెయ్యి రూపాయలు పెడితే ఎందుకనేవాడు. చిన్నప్పుడు కొట్టేసిన డబ్బులకు వడ్డీ అని చెప్పేవాడిని. చెడు అలవాట్లు.. నాన్న ఎంత బాధపడ్డాడో అప్పట్లో సిగరెట్స్ కాల్చేవాడిని. ధూమపానం మానేసిన నాన్న ఓసారి నా జేబులో నుంచి సిగరెట్ కొట్టేసి కాల్చాడు. అయితే ఒకానొక సమయంలో నాన్న నా గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు నాకు సిగరెట్ తాగడం, గంజాయి తాగడం.. ఇలా ఊహించనన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. నన్ను కొట్టాడు.. కానీ ఆయన మనసులో ఎంత బాధపడ్డాడో!' అని చెప్తూ ఏడ్చేశాడు తనికెళ్ల భరణి. చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. కావాలనే ఇండస్ట్రీకి దూరం చేశారు -
నటుడు ప్రకాశ్రాజ్పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్రాజ్పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
జైలర్లో డ్యాన్సర్ గుర్తున్నాడా? సక్సెస్ చూడకముందే..
వరుసగా ఫ్లాపులతో సతమతమైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్తో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను నేలమట్టం చేస్తూ కలెక్షన్స్తో విజృంభించాడు. ఆగస్టు 10న రిలీజైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలో ఐదు వందల కోట్ల మార్క్ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్ డ్యాన్సర్ ఎవరో తెలుసా? ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ జైలర్ మూవీ బోలెడంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విలన్ చిల్ అయ్యేందుకు తన దగ్గర పనిచేసేవాళ్లను డ్యాన్స్ చేయమంటూ ఉంటాడు. అందులో ఒకరు అందరినీ నవ్వించేలా స్టెప్పులేస్తూ ఉంటాడు. ఈయన పర్ఫామెన్స్ చూసి నవ్వనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా తన నటనతో మెప్పించిన వ్యక్తి పేరు రమేశ్. ఈయన తమిళ నటుడు, డ్యాన్సర్. ఈయన టిక్టాక్లో మూన్ వాక్లు, డిఫరెంట్ డ్యాన్స్లతో ఫేమస్ అయ్యాడు. తునివు చిత్రంలోనూ ఈయన నటించినట్లు తెలుస్తోంది. తాజాగా జైలర్లో నటించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో ఈయన గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్, సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు. జైలర్కు ముందే మరణం అయితే ఆయన మన మధ్య లేరు. జైలర్ విజయాన్ని చూడకముందే కన్నుమూశారు. జనవరి 27న తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. కోలీవుడ్ కథనాల ప్రకారం ఆయన తీవ్రమైన ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారట. ఈ క్రమంలోనే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. రమేశ్ మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తను బతికి ఉండుంటే మరిన్ని అవకాశాలు వచ్చేవని కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/OtT0TvmyXB https://t.co/dWYwGkiUTK — madhoe (@madhuuyaar) August 15, 2023 His (Ramesh) Dance in #Jailer 👌 [Sad thing is he's no longer alive to see this] Ramesh Passed away this Jan 2023. He was famous during TikTok times for his unique dance steps & MoonWalk. He had also done a cameo in #Thunivu pic.twitter.com/kVacm3s5jU — Christopher Kanagaraj (@Chrissuccess) August 17, 2023 చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది: డిస్కో శాంతి -
ఈ ఫోటోలోని చిన్నారి ఓ సూపర్ స్టార్.. ప్రభాస్ ప్రాజెక్ట్-కెలో కీ రోల్!
నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 1960లో తమిళ భాషా చిత్రం కలతుర్ కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అతనే ఇప్పుడొక సూపర్ స్టార్. ఏకంగా ఆరు భాషల్లో నటించిన చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఏకంగా 232 చిత్రాలతో 64 సంవత్సరాల పాటు స్టార్గా కొనసాగిన హీరో అతనొక్కడే. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 64 ఏళ్ల సినీ ప్రయాణం సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఆరు దశాబ్దాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ అతను యంగ్ హీరోలతో సమానంగా పోటీ పడుతున్నాడు. సినీ ప్రపంచంలో ఎందరో యువ నటులకు సైతం స్ఫూర్తిగా నిలిచిన మన హీరో ఆయనే తమిళ స్టార్ కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు 64 ఏళ్లగా పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్.. ఆ తరువాత జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. తెలుగులోనూ బ్లాక్ బస్టర్స్ 1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ మూవీ ఆయన కెరీర్నే మార్చేసింది. ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. మలయాళంలో సైతం స్టార్డమ్ను సంపాదించుకున్నారు. మలయాళంలో దాదాపు 40కి పైగా చిత్రాలలో నటించారు. హిందీ, తెలుగు సినిమాల్లోనూ తనదైన ముద్రవేశారు. తెలుగులో ఆయన నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి చిత్రాలు కమల్ను సూపర్స్టార్ను చేసేశాయి. హిందీలో ఏక్ దుజే కే లియే, సద్మా, సాగర్ వంటి చిత్రాల విజయం తర్వాత బాలీవుడ్లో ఫేమ్ సంపాదించారు. ఆ తర్వాత కన్నడ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు. ఆయన నటించిన ఉలగనాయగన్ చిత్రం భారతీయ సినిమాలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. ఈ చిత్రంలో వినియోగించిన సాంకేతిక అంశాలను మెరుగుపరచడమే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత 1992లో తన చిత్రం తేవర్ మగన్తో మొట్టమొదటిసారి ఆస్కార్ ఎంట్రీతో భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. 1985 మరియు 1987 మధ్య ఏకంగా మూడు సినిమాలు ఆస్కార్కు నామినేషన్స్ సాధించాయి. వయసు పెరుగుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్లో కమల్ హాసన్ కనిపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్2, ప్రాజెక్ట్- K చిత్రాల్లో నటిస్తున్నారు. 68 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ చిత్రం కల్కి 2898-AD లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. తన 64 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఆయన కూతురు శ్రుతి హాసన్, విజయ్ సేతుపతి వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 63 years since the release of Kalathur Kannamma. A landmark film for several reasons, the poignant story of Rajalingam, Kannamma & Selvam directed by A.Bhimsingh was a major commercial success, running for over 100 days in theatres. The film starring #GeminiGanesan & #Savithri,… pic.twitter.com/uN6Pjh8ouN — AVM Productions (@avmproductions) August 11, 2023 -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్లో టాప్లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
చైనీస్ సినిమాల్లో మనోడి హవా.. అక్కడ సూపర్స్టార్!
మన దేశంలో చాలామందికి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చి, క్రేజ్ తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. అలా విదేశీ ప్రేక్షకుల్ని అలరించిన వాళ్లు ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి ఎవరైనా పేరు తెచ్చుకున్నారా? అని అడిగితే ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంలా ఓ నటుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి పుట్టి చైనాలో సూపర్స్టార్ అయ్యాడు. సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇంతకీ అతడెవరు? అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకెళ్లాడు? సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో కసి, పట్టుదల, విషాదం లాంటి అంశాలు ఉంటాయి. ఈ మధ్య చైనీస్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో దేవ్ రాతూరి అనే భారతీయుడు గురించి పాఠంగా పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అతడు లైఫ్లో ఏం జరిగిందా అని సెర్చ్ చేస్తే బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. ఉత్తరాఖండ్ తెహ్రి గర్వాల్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో పుట్టిన దేవ్ రాతూరి ప్రస్తుతం చైనాలో సూపర్స్టార్, 20కి పైగా చైనీస్ మూవీస్- వెబ్ సిరీసుల్లో నటించాడు. అక్కడి స్టార్స్తో కలిసి పనిచేశాడు. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) దేవ్ జర్నీ గురించి చెప్పాలంటే 1998 నుంచి మొదలుపెట్టాలి. బ్రూస్ లీని చూసి యాక్టర్ అవుదామనుకున్నాడు. దిల్లీలోని బంధువుల నుంచి ఇంటి నుంచి ముంబయికి పారిపోయాడు. అక్కడికి వెళ్లిన తర్వాత గానీ అసలు విషయం బోధపడలేదు. బాలీవుడ్లో నటుడు కావడం అనుకున్నంత ఈజీ కాదని రియాలిటీలో తెలిసొచ్చింది. 'నెలల పాటు జనాల్లో కూర్చోవడం, చప్పట్లు కొట్టడం, పరుగెత్తడం లాంటి రోల్స్ వచ్చాయి తప్పితే కెమెరాలో కనిపించే అవకాశం రాలేదు' అని దేవ్ రాతూరి అప్పటి సంగతులు చెప్పుకొచ్చాడు. ఇక ముంబయిలో ఉంటే నటుడు కాలేమని ఫిక్స్ అయిన దేవ్ రాతూరి.. తిరిగి దిల్లీ వచ్చేశాడు. ఆరు నెలలపాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. డబ్బుల కోసం హోటల్ లో వెయిటర్ గా పనిచేశాడు. ప్లేట్స్ కడుగుతున్నా, టేబుల్స్ తుడుస్తున్నా.. బ్రూస్ లీ, చైనానే గుర్తొచ్చేవి. దీంతో 2005లో ఓ ఫ్రెండ్.. టికెట్ తీసి సహాయం చేయడంతో చైనా ఫ్లైట్ ఎక్కేసి, అక్కడ ల్యాండ్ అయ్యాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) కట్టుబట్టలతో చైనా వెళ్లిన దేవ్.. చేతులో డబ్బుల్లేక ఓ రెస్టారెంట్ లో దాదాపు ఏడేళ్లపాటు పనిచేశాడు. అలా వచ్చిన అనుభవంతో 2013లో చైనాలో ఓ హెటల్ ప్రారంభించాడు. ఇప్పుడవి కాస్త ఎనిమిది అయ్యాయి. బిజినెస్ లో బిజీ అయిపోయిన దేవ్.. నటన గురించి మర్చిపోయాడు. ఏదైనా మనది అని రాసుంటే, తిరిగి తిరిగి మన దగ్గరకే వస్తుందనే సామెతలా దేవ్ కి అదృష్టం తలుపుతట్టింది. ఓసారి దేవ్ రెస్టారెంట్ కి వచ్చిన ఓ చైనీస్ దర్శకుడు.. లో బడ్జెట్ మూవీ కోసం లోకేషన్, యాక్టర్ ని వెతుకుతున్నానని మాటల మధ్యలో ఇతడితో చెప్పాడు. దీంతో తనలోని నటుడు ఉన్నాడనే విషయం గుర్తొచ్చింది. అదే సదరు దర్శకుడికి చెబితే.. ఓకే చెప్పాడు. అలా 2015లో చైనీస్ చిత్రాల్లో దేవ్ జర్నీ షురూ అయింది. ఇప్పటివరకు ప్రతినాయక తరహా పాత్రలు చేశాడు. వ్యోమగామి, మాస్టర్ చెఫ్, చిత్ర నిర్మాత లాంటి డిఫరెంట్ గెటప్స్ చేస్తూ నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇతడి లైఫ్ జర్నీ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఇండియా.. ఎక్కడ చైనా.. ఎక్కడ సినిమాలు.. హేట్సాఫ్ అని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Dev Raturi (@raturiorg) (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
సీనియర్ నటుడు మృతి.. రోడ్డు పక్కన శవమై కనిపించి!
'విచిత్ర సోదరులు' సినిమాలో కమలహాసన్తో కలిసి నటించిన మోహన్(55) అనే సహాయనటుడు మృతి చెందాడు. అయితే ఈయన మరణం అనుమానాస్పదంగా మారింది. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియ రథం వీధి సమీపంలోని వెళ్లింగిండ్రు వద్ద ఓ మృతదేహం పడివున్నట్లు మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల విచారణలో ఆ మృతదేహం సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన సహాయ నటుడు మోహన్ది అని తేలింది. మోహన్.. 'విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్తో కలిసి నటించాడు. (ఇదీ చదవండి: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి!) ఈ సినిమాతో పాటు నాన్ కడవుల్, అదిశయ మనిదర్గళ్ తదితర తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. అయితే సేలంకి చెందిన మోహన్.. మధురై ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు? అతని మరణానికి కారణాలేమిటి? అనే విషయాల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మోహన్ మృతి చెందిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సినిమా అవకాశాల కోసమే మోహన్ మధురై వచ్చాడని, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలీక కొన్నాళ్ల నుంచి వీధుల్లో భిక్షాటన చేసుకుంటున్నాడని, అలా పేదరికం, అనారోగ్య సమస్యల వల్లే చనిపోయాడని అంటున్నారు. ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
రోజుకో కారు మెయింటెన్ చేసిన స్టార్ హీరో.. చివరి రోజుల్లో మురికివాడలో
డబ్బుతో ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న అనుకునేరు.. డబ్బును అందరూ ఒకేలా వాడరు. కొందరు పొదుపు చేస్తారు, కొందరు ఖర్చు చేస్తారు, మరికొందరేమో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. బోలెడంత డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువశాతం జనాలు విలాసాలకే వినియోగిస్తుంటారు. ఇలా ఉన్నదంతా ఖర్చు పెట్టి చివరికి కడు పేదరికాన్ని గడిపిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. అందులో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో భగవాన్ దాదా. మిల్లులో పనిచేసి.. ఈయన కార్మికుడు, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు, నిర్మాత! భగవాన్ దాదా అసలు పేరు భగవాన్ ఆబాజీ పలావ్. కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపిన ఇతడిని అందరూ ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచుకునేవారు. మొదట ఈయన బాంబేలోని వస్త్ర మిల్లులో పని చేశాడు. విరామం లేకుండా పని చేస్తున్న ఈయనకు ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండేవి. ఈ ఆసక్తితోనే సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్తో సినిమాలు తీయడం ప్రారంభించాడు. చిన్న సినిమాలతో హిట్ చిత్రయూనిట్కు భోజనం సమకూర్చడం దగ్గరి నుంచి నటీనటుల దుస్తుల ఎంపిక వరకు అన్నీ తనే స్వయంగా చూసుకుని బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తపడేవాడు. 1938లో బహదూర్ కిసాన్ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. తర్వాత చిన్నాచితకా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవి సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ధైర్యంతో భగవాన్ నిర్మాతగానూ మారాడు. ప్రేమ, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. రోజుకో కారు, అతి పెద్ద బంగ్లా అయితే ఏదైనా సామాజిక చిత్రం తీయమని 1951లో రాజ్కపూర్ సలహా ఇవ్వడంతో అల్బెలా తీశాడు. ఇది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులోని షోలా జో భడ్కే అనే పాటకు భగవాన్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. బాలీవుడ్లో గొప్ప డ్యాన్సర్గా ఇతడిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇకపోతే జమేలా, భాగం భాగ్ అనే సూపర్ హిట్స్ బాలీవుడ్కు అందించాడు. ఊహించని విజయాలతో అతడికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. ఒకేసారి స్టార్డమ్ స్టేటస్ రావడంతో విలాసాలకు బాగా ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో ముంబై జుహులో 25 గదులు ఉన్న పెద్ద బంగ్లా కొని అందులోనే నివసించాడు. వారం రోజులపాటు రోజుకో కారులో తిరిగేలా ఏడు లగ్జరీ కార్లను మెయింటైన్ చేశాడు. భార్య నగలు కూడా అమ్మేయాల్సిన దుస్థితి కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అతడి సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి భగవాన్.. హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచే స్థాయికి పడిపోయాడు. నెమ్మదిగా ఆ కాస్త అవకాశాలు రావడం కూడా కనుమరుగైపోయాయి. ఆర్థిక అవసరాల కోసం ఒక్కో కారును, ఇంటిని, భార్య నగలను కూడా అమ్మేయాల్సి వచ్చింది. చివరికి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో మురికివాడలో జీవనం కొనసాగించాడు. 2002లో 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే! రెండు పెళ్లిళ్లు ఫెయిల్.. ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్బాస్ కంటెస్టెంట్ -
డబుల్ ఇస్మార్ట్లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
పిల్లలు పుట్టేందుకు ఆపరేషన్.. వికటించడంతోనే నెల్లూరి కాంతారావు మృతి
అలనాటి వెండితెర చిత్రాల్లో నటుడిగా, పహిల్వాన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు నెల్లూరు కాంతారావు. అయితే ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఆయన నిండు ప్రాణాలు పోయాయి. తాజాగా కాంతారావు సతీమణి నిర్మల(80) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మాది ఉమ్మడి కుటుంబం. కాంతారావుకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేది. తనకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్సర్సైజ్ చేసేవాడు. మాకు కనకమహల్ అని థియేటర్ ఉండేది. దాన్ని కూడా ఆయనే బాగా చూసుకునేవాడు. ముగ్గురిని చంపేశారంటూ పుకారు ఓ సినిమా రిలీజైనప్పుడు ముగ్గురు పిల్లలు క్యూలైన్లో నిలబడకుండా ముందుకు వెళ్లారు. అక్కడున్న వాళ్ల ఆపుతుంటే వీళ్లు ఇంకా తిడుతూ రెచ్చిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతారావు కోపంతో వాళ్లను చెంప మీద ఒక్కటిచ్చాడు. వాళ్లు కింద పడటంతో ఏదైనా అయ్యిందేమోనని క్యాంటీన్కు తీసుకెళ్లి సోడా తాగించి మరీ సారీ చెప్పాడు. వాళ్లు కూడా తప్పు మాదే అని తిరిగి సారీ చెప్పారు. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి ముగ్గురిని చంపి బాత్రూమ్లో వేశారంట అని అడిగారు. ఆ పిల్లలేమో మాకు తెలియకుండా అక్కడి నుంచి జారుకుని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అసలేం జరిగిందనేది బయటకు చెప్పడం లేదు. కాంతారావు అరెస్ట్ ఇక కాంతారావు విద్యార్థులను హత్య చేశాడని ప్రచారం జరిగింది. విద్యార్థులు పెట్రోల్ తీసుకుని థియేటర్ దగ్గరకు వచ్చారు. రాళ్లు తీసుకుని థియేటర్ అద్దాలు పగలగొట్టారు. ఏం చేయాలో అర్థం కాక కాంతారావు అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఆయన్ను అరెస్ట్ చేసేవరకు రచ్చరచ్చ చేశారు. తర్వాత ఎలాగో బయటకు వచ్చాడు. ఆయన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కానీ మేము చేసిన ఓ పని వల్ల ఆయన ప్రాణమే పోయింది. పిల్లల కోసం ఆస్పత్రికి అసలేమైందంటే.. మా పెదనాన్న కొడుక్కి పిల్లలు లేకపోతే మద్రాసులో ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన మందులతో వారికి పిల్లలు పుట్టారు. ఈయన ఓ నలుగురిని తీసుకెళ్తే వారికి కూడా పుట్టారు. మమ్మల్ని కూడా వెళ్లమని చెప్తూ ఉండేవాడు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత మేము కూడా వెళ్లాం. అన్ని టెస్టులు చేశారు. మందులిచ్చారు, మళ్లీ రమ్మన్నారు. ఈసారి వెళ్లినప్పుడు కాంతారావుకు ఒక ఆపరేషన్ చేస్తామన్నారు. మత్తుమందు వికటించి అప్పుడు ఓ సినిమా చేస్తున్నందున అది పూర్తయిపోయాక వస్తానని చెప్పాడు. సినిమా రిలీజవగానే ఆస్పత్రికి వెళ్లాం. ఆపరేషన్ చేసేందుకు క్లోరోఫామ్(మత్తుమందు) ఇచ్చారు. ఈయన పహిల్వాన్ కావడంతో ఆక్సిజన్ మాస్క్లాంటివి పీకేస్తాడేమోనని బెడ్కు కట్టేశారు. కానీ మత్తు మందు వికటించి ఆయన చనిపోయారు. నా భర్త అలా చనిపోతాడని అనుకోలేదు' అని చెప్పుకొచ్చింది నిర్మల. చదవండి: చిరంజీవి చెడామడా తిట్టేశాడు: కోట శ్రీనివాసరావు -
రాజేంద్రప్రసాద్ అరుదైన ఫోటోలు.. చూశారా?
-
అంతటి హాలీవుడ్ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?
అవును... హాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు. సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్ఫ్లిక్స్ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో రచయిత కమ్ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్ఫ్లిక్స్, పీకాక్ లాంటి పలు స్ట్రీమింగ్ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది. జీతం, పింఛన్, స్ట్రీమింగ్లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్లకు దూరం జరిగింది. గత నవంబర్లో రంగప్రవేశం చేసిన ఛాట్జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్. ప్రస్తుతం స్ట్రీమింగ్ వేదికలు పెరిగాయి. కంటెంట్ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు. అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్ స్తంభించింది. 2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి. 1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్కాలర్ ఉద్యోగాలు పోతాయని భయం. అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్ నోలన్ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! -
హాలీవుడ్లో సమ్మె సైరన్.. 60 ఏళ్ల తర్వాత ఇలా..
ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్కి పేరు. భారీ బడ్జెట్ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్. ఇప్పుడు ఆ హాలీవుడ్ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్ తప్ప యాక్షన్.. సౌండ్లాంటి షూటింగ్ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్లో వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని డబుల్ స్ట్రయిక్ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్స్ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్లు ఆగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్ యాక్టర్స్తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’, ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి నిష్క్రమణ... క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఓపెన్ హైమర్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్లో గురువారం ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి యాక్టర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్ (సమ్మె)ప్రారంభించారని టాక్. ఎమ్మీ, ఆస్కార్ అవార్డ్ వాయిదా? హాలీవుడ్లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలోవార్తలొస్తున్నాయి. ∙ సమ్మె బాధాకరం ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది. -
అమిగోస్ మూవీ హీరోయిన్ ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!
హాయ్..‘అమిగోస్’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి ఆశికా రంగనాథ్.. డజన్కు పైగా కన్నడ సినిమాల్లో నటించి యూత్లో మంచి మార్కులే కొట్టేసింది. ఐతే తాను సినిమాల్లోకి రాకముందు నుంచే అందం పట్ల శ్రద్ధ తీసుకునేదాన్ని. ఓసారి కాలేజీలో అందాల పోటీలో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డుతో పాటు సినిమా చాన్స్ కూడా వచ్చింది అని చెబుతోంది ఆశికా రంగనాథ్. ఇక ఆ ఘనతలో తమకూ భాగస్వామ్యం ఉందంటున్న ఫ్యాషన్ బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. కవిత గుత్తా.. ఓ కుట్టు మెషిన్, ఒక వర్కర్తో ప్రారంభమైన ‘కవిత గుత్తా ’ ఫ్యాషన్ హౌస్.. నేడు టాప్ మోస్ట్ ట్రెడిషనల్ బ్రాండ్గా మారింది. అమ్మాయిల లాలిత్యానికి అద్భుతంగా మ్యాచ్ అయ్యే పరికిణీలు ఈ బ్రాండ్ ప్రత్యేకత. హైదరాబాద్కు చెందిన కవిత గుత్తా.. తన ఇద్దరి కూతుళ్లకు తానే స్వయంగా ఫ్యాబ్రిక్ తెచ్చి, డిజైన్ చేసి మురిసిపోయేది. అలా తన ఇంటి ఆడపిల్లలతో మొదలైన కవిత గుత్తా డిజైన్స్.. నేడు సెలబ్రిటీలను మురిపించే స్థాయికి చేరాయి. ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే ఈ అందమైన డిజైన్స్.. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్లైన్లోనూ లభ్యం. జ్యూలరీ బ్రాండ్: వీఏజేఆర్ జ్యూలర్స్ :స్వచ్ఛమైన వజ్రాల ఆభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఇది క్రియేట్ చేసుకున్న వాల్యూ. ‘ది రాయల్టీ ఆఫ్ హైదరాబాద్’ అంటూ హైదరాబాద్లో ప్రారంభమైన ఈ సంస్థ.. దేశంలోని ప్రముఖ నగరాలకూ విస్తరించి.. పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్స్పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కవితా గుత్తా.. చీర బ్రాండ్: ఆశికా రంగనాథ్ ధరించిన కవితా గుత్తా డిజైనర్ చీర ధర.. రూ. 77,700 (చదవండి: ‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా..
యువతులతో బలవంతంగా సెక్స్ రాకెట్ నడిపిన వ్యవహారంలో ప్రముఖ అమెరికన్ నటి ఎలిసన్ మాక్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నటి ఎలిసన్ పలువురు యువతులను బలవంతంగా ఈ రొంపిలోకి లాగిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెపై దర్యాప్తు చేపట్టిన అనంతరం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది. ఆమెకు ఈ శిక్ష సెప్టెంబరు 29 నుంచి అమలుకానున్నదని సమాచారం. కాగా అదే కోర్టులో జడ్జిల సమక్షంలో తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానని ఎలిసన్ పేర్కొంది. కాగా ఈ తీర్పు వెలువడక ముందు ఎలిసన్ బాధితులతో, వారి కుటుంబ సభ్యుల ముందు ఏడుస్తూ తాను చేసిన పనులు అమానవీయమైనవని, తాను ఎన్ఎక్స్ఐవీఎం నేత కీథ్ రెనాయర్ను పూర్తిగా విడిచిపెట్టేశానని తెలిపింది. అతనికి కొంతకాలం క్రితం అపహరణ, ఇతర నేరాల కింద 120 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కీథ్ ఎన్ఎక్స్ఐవీఎం పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. దానిలో ఆయన మినహా మిగిలినవారంతా మహిళా సభ్యులే ఉన్నారు. ఈ గ్రూపు సభ్యులు మహిళలతో జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవారు. ఈ గ్రూపులోని మహిళా సభ్యులు కీథ్తో శారీరక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇతర మహిళలపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ గ్రూపులోని ఎలిసన్ ఇటువంటి పనులకు ఎంతగానో సహకరిస్తుంటుంది. యువతులను అపహరించడం లాంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించేది. ‘స్మాల్ విలే’తో అనూహ్య ఆదరణ ఎలిసన్ మాక్ డబ్ల్యుబీ టెలివిజన్ సిరీస్ ‘స్మాల్ విలే’తో ఎంతో ప్రజాదరణ పొందింది. ఎలిసన్ అత్యధిక వెబ్సిరీస్లలో నటించింది. ఆమె నటించి బోల్డ్ సీన్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1982 జూలై 29న జన్మించిన ఎలిసన్ చిన్న వయసులోనే తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. 2001 నుంచి 2011 వరకూ ప్రసారమైన సూపర్మ్యాన్ స్టోరీ ఆధారంగా రూపొందిన టెలివిజన్ షోలో ఆమె విలేకరి క్లో సులివన్గా నటించి అందరి అభినందనలు అందుకుంది. ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్
అంబాజీపేట(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని వారే చెబుతున్నారని తెలిపారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చదవండి: అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా? -
యంగ్ హీరోకి వరుస ఆఫర్స్.. తగ్గేదే లే!
తొలి చిత్రం 'నాటకం'తో ప్రేక్షకుల మనసు దోచేసిన ఆశిష్ గాంధీ.. అప్పటి నుంచి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి చిత్రంతోనే తన నటనా ప్రతిభను బయటపెట్టిన ఆశిష్.. ఆ తర్వాత 'దర్శకుడు', 'ఉనికి' లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటించారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన 'రుద్రంగి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ 'రుద్రంగి'లో మల్లేష్ అనే కీలకపాత్ర చేస్తున్నారు. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆశిష్ గాంధీ రోల్పై ఆసక్తిని పెంచాయి. జులై 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ ప్రేక్షకులనూ తన నటనతో అలరించేందుకు రెడీ అవుతున్నారు హీరో ఆశిష్ గాంధీ. పికాసో (Picaso) అనే వైవిధ్యభరితమైన చిత్రంతో కేరళ ఆడియెన్స్ను మెస్మరైజ్ చేయబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టేసి సెట్స్పై బిజీ బిజీగా ఉంటున్నారు. ఆశిష్ గాంధీ చేస్తున్న తదుపరి సినిమా 'హద్దు లేదు రా'. ఇది ఆగస్టులో విడుదల కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మరో చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఇది సెప్టెంబరు నుంచి షురూ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు హరీశ్ మాగోన్(76) ముంబయిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ట్విట్టర్లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) గోల్ మాల్, నమక్ హలాల్, చుప్కే చుప్కే, షహెన్షా, ఖుష్బూ, ఇంకార్, ముఖద్దర్ కా సికందర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో హరీశ్ మాగోన్ నటించారు. ఆయన చివరిసారిగా కనిపించిన చిత్రం ఉఫ్! యే మొహబ్బత్ కాగా.. ఆ మూవీ 1997లో విడుదలైంది. కాగా.. హరీష్కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అతను ముంబయిలోని జుహులో హరీష్ మాగోన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. స్టూడెంట్ సంతాపం ఆయన మృతికి సంతాపంగా 1975లో విడుదలైన ఆంధీ సినిమాలోని ఒక పాటలోని హరీష్ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. హరీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్నని.. గుల్జార్ అసిస్టెంట్ మేరాజ్కి సన్నిహిత మిత్రుడినని ట్విటర్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!) Harish Magon - #InMemories Will always be remembered for those cute cameos in Hindi Cinema. A graduate3 from FTII, he was a close friend of Gulzar's assistant Meraj and hence get to face the camera here in #Aandhi song for a break HarishMagon #RIP @rmanish1 @SukanyaVerma https://t.co/di3N4qCpQ7 pic.twitter.com/seyECwOh2r — Pavan Jha (@p1j) July 2, 2023 CINTAA expresses its condolences on the demise of Harish Magon (Member since JUNE. 1988) .#condolence #condolencias #restinpeace #rip #harishmagon #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/qMtAnTPThX — CINTAA_Official (@CintaaOfficial) July 1, 2023 -
తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం
అతడు థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'కీడా కోలా' సినిమాతో బిజీగా ఉన్నాడు. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులోనూ కీలకపాత్రలో నటించాడు. ఇప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. నటుడు హరికాంత్.. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు. అలా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో వచ్చాడు. ప్రస్తుతం 'కీడా కోలా'లో ఓ పాత్ర చేస్తున్నాడు. టీజర్ లో అతడికి సంబంధించిన షాట్ మీరు చూడొచ్చు. శనివారం ఉదయం అతడికి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్ఓ ఒకరు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటున్నారు. A hardworking theater artist turned actor (Keeda Cola & other films) 33-year old Harikanth passed away today in the early hours due to cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/6FbP9sjwwE — Vamsi Kaka (@vamsikaka) July 1, 2023 (ఇదీ చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?) -
కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్లాక్.. బుర్ర పనిచేస్తుందా?
బాలీవుడ్ నుంచి జియో సినిమాలో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ OTT 2'లో రోజుకో అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షోలోని కంటెస్టెంట్ జైద్ హదీద్, ఆకాంక్ష పూరి వివాదం వైరల్ అయ్యింది. పూరి ఆకాంక్షను జైద్ హదీద్ తప్పుగా తాకినప్పుడు ఆమె గొడవ చేసింది. తాజాగా వారిద్దరూ ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?) 'బిగ్ బాస్ OTT 2' జూన్ 17 నుంచి జియో సినిమాలో ప్రసారం అవుతుంది. షో ప్రారంభం అయిన వెంటనే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు షోలో ఇలాంటివి చాలా జరిగాయి. ముఖ్యంగా షో ప్రారంభం అయిన 24 గంటల్లోనే ఒక పోటీదారుడిని తొలగించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. వెంటనే షోలోని పోటీదారులు జైద్ హదీద్, ఆకాంక్ష పూరిల వివాదం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఒక వీడియో కనిపించింది, దీనిలో ఆకాంక్ష, జైద్ 30 సెకన్ల పాటు ఫ్రెంచ్ ముద్దులు పెట్టుకున్నారు. ఇందులో బిగ్బాస్ 'డేర్ గేమ్' పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు. పోటీలో పాల్గొనేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కానీ కొంత సమయం తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి గేమ్లో పాల్గొన్నారు. అలా 30 సెకన్ల పాటు ఓపెన్గా ముద్దు పెట్టుకునే ధైర్యం చేశారు. ఆ తర్వాత కూడా కొందరు కంటెస్టెంట్స్ ధైర్యం చేసి ఫ్రెంచ్ కిస్ చేశారు. దీంతో నెటిజన్లు షో నిర్వాహుకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్క్ల పేరుతో ఇలాంటి పిచ్చి పనులు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. బిగ్బాస్ బుర్ర పనిచేస్తుందా అంటూ మండిపడుతున్నారు. #SalmanKhan had said he will let #BiggBossOTT2 contestants cross the line, Lets see who he reacts to this Kiss by #AkankshaPuri and #JadHadid pic.twitter.com/ZFV1h3J80d — The Khabri (@TheKhabriTweets) June 29, 2023 (ఇదీ చదవండి: ఆస్కార్లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ) -
ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!
భోజ్పురి నటుడు రవికిషన్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా ప్రతినాయకుని పాత్రలో మెప్పించాడు. హిందీలో 'ఫిర్ హేరా ఫేరీ', 'వెల్కమ్ టు సజ్జన్పూర్', 'ముక్కాబాజ్', 'కిక్ 2' చిత్రాల్లోనూ నటించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవికిషన్ గోరఖ్పూర్ ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కూతురు ఇషితా శుక్లా ఆర్మీలో చేరడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తండ్రి, కూతురిని అభినందిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) ప్రస్తుతం రవి కిషన్ కూతురు ఇషిత వయసు 21 ఏళ్లు కాగా.. నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఇద్దరిని చూసి మేము గర్విస్తున్నాము.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అంటూ పొగుడుతున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 26న జరిగిన పరేడ్లోనూ రవికిషన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని రవికిషన్ ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. ( ఇది చదవండి:ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో? ) View this post on Instagram A post shared by @varindertchawla 🇮🇳 https://t.co/Bjh3qIjTWg — Ravi Kishan (@ravikishann) June 27, 2023 मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ — Ravi Kishan (@ravikishann) June 15, 2022 Being a father of an extremely diligent daughter Ishita Shukla has broken all records for me to keep head up with pride as she received award of excellence ADG, Delhi DTE out of 1500 cadets. Her training begins to serve our nation Jai Hind!!! @HQ_DG_NCC pic.twitter.com/HzU4XkTBhP — Ravi Kishan (@ravikishann) January 30, 2022 -
ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్
బాలీవుడ్ బుల్లితెరలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 2 జియో సినిమాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా అందులోని పోటీదారుల మధ్య జరిగే తగాదాలతో షో హీటెక్కుతుంది. అయితే ఈసారి మరో కారణంతో షోను హీటెక్కించారు కంటెస్టెంట్స్. కెమెరాలు లైవ్లో ఉంటాయని తెలిసి కూడా బాలీవుడ్ నటుడు జాద్ హదీద్ చేసిన పనితో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో అతనిని దారుణంగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నటువంటి షోలో ఇలా చేయడం మంచిది కాదు. ఈ విషయంపై హోస్ట్గా ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..) షో ప్రారంభం నుంచే నటి ఆకాంక్ష పూరి పట్ల జైద్ హదీద్ ప్రవర్తన కూడా కొంచెం తేడాగానే ఉంది. తాజాగా కెమెరాలు లైవ్ స్ట్రీమ్లో ఉండగా.. ఆకాంక్ష నడుమును హదీద్ పట్టుకున్నాడు.. అంతటితో ఆగని అతను దగ్గరకు లాగడం ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అసౌకర్యంగా భావించినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా హదీద్ను దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ.. అతని ప్రవర్తనను మందలించింది. ఇలా తనను తాకడం ఇష్టం లేదని కూడా అక్కడే చెప్పింది. ఈ వీడియోను చూసిన వారు.. సోషల్ మీడియాలో జైద్ హదీద్పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕣ꫀꪖꪶⅈ𝕥ꪗ 𝕥ꪖᦔ𝕜ꪖ (@reality__tadka) (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలో బీజేపీ అన్నారు) -
ప్రముఖ నటుడి సోదరి మృతి, ఆమె మరణాన్ని తట్టుకోలేక..
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు బోస్ వెంకట్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు చెన్నైలో బోస్ వెంకట్ అక్క వలర్మతి గుండెపోటుతో మరణించింది. సోదరి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వలర్మతి మరణవార్తను తట్టుకోలేకపోయిన రంగనాథన్ తన సోదరి మృతదేహంపై పడి బోరున విలపించాడు. ఆమె అంత్యక్రియలు చేస్తున్న సమయంలో రంగనాథన్కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరు తోబుట్టువులు మరణించడంతో బోస్ వెంకట్ కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. కాగా బోస్.. తమిళ సీరియల్స్, సినిమాల్లో.. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. మెట్టి ఆయిల్ సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2020లో వచ్చిన కన్ని మేడమ్ సినిమాతో డైరెక్టర్గా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా పలు సినిమాలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం అతడు స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: ఇళయరాజా వల్ల నా కెరీర్ ముగిసింది: చిన్ని చిన్ని ఆశ సింగర్