Animal Movie
-
ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా తన ఇన్స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.అయితే తాజాగా మరోసారి తన బాయ్ఫ్రెండ్ సామ్ మర్చంట్తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమ రిలేషన్పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. #TriptiiDimri was seen on a bike with rumoured beau #SamMerchant.🫶🏻#FilmfareLens pic.twitter.com/FvH0s70F7Z— Filmfare (@filmfare) February 19, 2025 -
చంద్రకాంత రంగు చీరలో..మురిపిస్తున్న ట్రెండింగ్ గర్ల్ ఫోటోస్
-
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
అల్లు అర్జున్ ఆ మాట అనడం సంతోషాన్నిచ్చింది: యానిమల్ నటుడు
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ను దాటేసింది పుష్ప-2. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం వసూళ్లపరంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2021లో పుష్ప మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అయితే చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవా. యానిమల్ మూవీలో బాబీ డియోల్ సోదరుడిగా మెప్పించిన సౌరభ్ సచ్దేవా పుష్ప-2లో నటించడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యుకు హాజరైన సౌరభ్ అల్లు అర్జున్తో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సౌరభ్ సచ్దేవా మాట్లాడుతూ..' యానిమల్లో నా నటన చూసిన పుష్ప 2 మేకర్స్ నన్ను సంప్రదించారు. నాతో సుకుమార్ సార్ వీడియో సమావేశంలో మాట్లాడారు. పుష్ప-2లో నా పాత్ర గురించి దాదాపు 20 నిమిషాలు చర్చించాం. నా కంటే ముందు చాలా మందిని సంప్రదించినా.. చివరికీ నన్ను ఖరారు చేశారు' అని తెలిపాడు.అల్లు అర్జున్ గురించి సౌరభ్ మాట్లాడుతూ..'నేను అతన్ని మొదటిసారి సెట్స్లోనే కలిశా. అతను చాలా స్వీట్ పర్సన్. నా అభ్యర్థనపై తన వానిటీ వ్యాన్ మొత్తం నాకు చూపించాడు. అతను ఒక సూపర్స్టార్లా కాకుండా చాలా బాగా మాట్లాడారు. యానిమల్ నా రోల్ పవర్ఫుల్ అని అల్లు అర్జున్ అన్నారు. నా పాత్రను బన్నీ ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. యానిమల్, పుష్ప-2 చిత్రాలతో నాకు మరింత ఫేమ్ వచ్చిందని సౌరభ్ తెలిపారు. -
‘యానిమల్’ వార్ మెషిన్గన్ వాహనంపై పెళ్లి ఊరేగింపు, నెటిజన్ల కామెంట్స్
‘మురారి’, ‘వరుడు’ సినిమాల లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఒకపుడు పెళ్లి కాని పిల్లలు కలలు కనేవారు. కాలానికి తగ్గట్టు ఇపుడు ట్రెండ్ మారింది. బ్లాక్ బస్టర్ మూవీ ప్రేరణతో పెళ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది. 'వార్ మెషిన్ గన్'తో వధూవరుల ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల వేలాది ఫన్నీ కామెంట్లతో సందడితో ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.రణబీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక నటించిన యానిమల్ స్ఫూర్తితో కదిలే స్టీల్ మెషిన్ గన్పై జంట వివాహ వేడుకును జరుపుకున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ సుయ్వాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మూవీలో రణబీర్ కేరెక్టర్ 500 కిలోల మూవబుల్ స్టీల్ మెషిన్ గన్ని ఉపయోగించి తన శత్రువులతో పోరాడిన దృశ్యాలు అభిమానులను ఉర్రూతలూగించి. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్లా ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంగాపై వివాహ వేదికకు చేరుకోవడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. వధువు సిగ్గుతో గన్ క్యారేజ్పై కూర్చొని ఉండగా, వరుడు గర్వంగా ఈ స్పెషల్ రైడ్ను ఆస్వాదిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ashish Suiwal (@saini5019) “హవ్వా పగ, ప్రతీకారంతో అధికారంకోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతారు" అని ఒకరు, "ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు క్రియేటివిటీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటే ఇంకొక నెటిజన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు. -
యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అందుకే యానిమల్ రిజెక్ట్ చేశాపరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్సినిమాకాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్జోత్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్ఫ్లిక్స్లో రిలీజైంది.చదవండి: విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్ -
మరింత హాట్గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
-
అప్పు డు యానిమల్.. ఇప్పుడు పుష్ప 2.. రణబీర్ ను ఫాలో అవుతున్న పుష్ప రాజ్
-
బ్లాక్ డ్రెస్లో యానిమల్ బ్యూటీ.. మతి పొగోట్టేస్తోందిగా!
-
యానిమల్ రిలీజ్ తర్వాత మూడు రోజులు ఏడ్చా: తృప్తి
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలపై ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. లుక్ బాలేకున్నా, సినిమాలో పాత్ర అటూఇటుగా ఉన్నా, ఏం చేసినా, చేయకపోయినా సరే నోరు పారేసుకుంటున్నారు. అలా యానిమల్ మూవీలోని తన పాత్ర వల్ల చాలామంది ట్రోల్ చేశారంటోంది హీరోయిన్ తృప్తి డిమ్రి.ట్రోలింగ్ అంటేనే తెలీదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాకు ముందు విమర్శలనేవే తెలియదు. కానీ ఈ సినిమా వచ్చాక చాలా ట్రోల్ చేశారు. మెయిన్ స్ట్రీమ్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. బుల్బుల్, కాలా సినిమాల సమయంలో ఎవరూ విమర్శించలేదు. ఏ పోస్ట్ కింద చూసినా మంచి కామెంట్లే ఉండేవి. ఓపక్క అలా.. మరోపక్క ఇలా..కానీ యానిమల్ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. నేను నా డ్యూటీ చేశాను. ఏ తప్పు చేశానని ఇలా తిడుతున్నారని బాధపడ్డాను. ఇంత నెగెటివిటీ ఎందుకు చూపిస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఓపక్క సగంమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మరో పక్క మిగతా సగం మంది నన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు.చాలా ఏడ్చా..యానిమల్ రిలీజయ్యాక రెండుమూడురోజులపాటు చాలా ఏడ్చాను. ఇంత ట్రోలింగ్ ఉంటుందని ఊహించలేదు. నేను చాలా సెన్సిటివ్. ఎవరితోనైనా ఫైట్ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటాను. అలాంటిదాన్ని. ఆ సమయంలో విపరీతమైన ట్రోల్స్ చూశాక వర్క్పై కూడా శ్రద్ధ పెట్టలేకపోయాను' అని చెప్పుకొచ్చింది.కాగా తృప్తి.. మామ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. లైలా మజ్ను, బుల్బుల్, కాలా చిత్రాల్లో నటించింది. యానిమల్ మూవీతో నేషనల్ క్రష్గా మారింది. ఈ బ్యూటీ ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాలో నటించింది.చదవండి: దమ్ములాగిన విష్ణు.. సోనియా చెప్పింది ఈమె గురించేనా? -
యానిమల్ బ్యూటీపై ఆరోపణలు.. ఆమె టీమ్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.అసలేం జరిగిందంటే..?జైపుర్కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024 -
మోసం చేసిన 'యానిమల్' హీరోయిన్.. డబ్బులు తీసుకుని
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి తృప్తి దిమ్రి. అంతకు ముందు పలు హిందీ చిత్రాల్లో నటించింది. కానీ ఈ మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్తో కాస్త బిజీ అయిపోయింది. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ ఈవెంట్కి హాజరవుతానని చెప్పి లక్షల తీసుకుని మోసం చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు) ఇంతకీ ఏమైంది?జైపుర్కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు.ఇక ఈ ఘటనపై స్పందించిన నిర్వహకురాలు.. తృప్తి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. జైపుర్లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని, ఆమె తమని మోసం చేసిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో తృప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Tripti Dimri skips event after pocketing ₹5 lakhs; women’s group protests by blackening her poster pic.twitter.com/Ih2bLKzWcG— WarpaintJournal.in (@WarpaintJ) October 1, 2024 -
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
#IIFAAwards2024 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక (ఫొటోలు)
-
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్ను సైతం దాటేసింది.కాగా.. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్
సందీప్రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్గా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రణ్బీర్తో పాటు బాబీ డియోల్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక రోజు నాకు సందీప్ వంగా నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నానని సందీప్ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్బీర్తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది. సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. -
నాలుగేళ్ల షెడ్యూల్.. ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్పై సందీప్ ప్రకటన
అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ సినిమా వరకు బాక్సాఫీస్ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్తో హీరోగా తాను తెరకెక్కించనున్న 'స్పిరిట్'కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తెలిపారు.'ప్రస్తుతం తన చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ రెండు ప్రాజెక్ట్లకే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, సినిమా విడుదలకు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని తెలిపాడు. అంటే స్పిరిట్ 2026లో విడుదల కానుందని రివీల్ చేశాడు. స్పిరిట్ సినిమా తర్వాతనే 'యానిమల్ పార్క్'పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని సందీప్ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఖాకీ డ్రెస్లో తొలిసారి ప్రభాస్'స్పిరిట్' పాన్ ఇండియా రేంజ్లో టీ సిరీస్ బ్యానర్పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశముందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఈ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోబోతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్సియోక్ విలన్గా కనిపించబోతున్నాడని ప్రచారం ఉంది. 'యానిమల్ పార్క్' విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన 'యానిమల్'కు సీక్వెల్గా రానున్న విషయం తెలిసిందే. -
కెమెరాలకు కూడా దొరకని అందంతో తృప్తి డిమ్రి (ఫోటోలు)
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫొటోలు)
-
'యానిమల్' నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి
'యానిమల్' నిర్మాతల్లో ఒకరైనా కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే క్యాన్సర్తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కూడా మరణవార్తని ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ-సిరీస్ ఛైర్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. 1995లో 'బేవఫా సనమ్' అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన 'యానిమల్' నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.ఇకపోతే కృషన్ కుమార్కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. కానీ వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం!(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
Triptii Dimri: యానిమల్ బ్యూటీ గ్లామర్ షో (ఫోటోలు)
-
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సందీప్ రెడ్డి, రణ్బీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటివరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్ఫ్లిక్స్లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబర్లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు. ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. -
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
-
వీకెండ్లో రష్మిక ఎవరిని కలుస్తుందంటే..?
నటీ నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ వుంటుంది. కొందరు ఆదివారం షూటింగ్లకు సెలవు ప్రకటిస్తుంటారు. మరి కొందరు వారాంతర రోజున కుటుంబసభ్యులకు కేటాయిస్తూ వుంటారు. ఇంకొందరు పార్టీలకు, పబ్లకు వెళుతుంటారు. ఇక రష్మిక మందన్న ఏం చేస్తారో తెలుసా? ఇండియా క్రష్ అయిన ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరికలేనంత బిజీ. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం యానిమల్ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో రష్మిక మందన్న బాలీవుడ్లోనూ స్టార్ అంతస్థుకు చేరుకున్నారు. అక్కడ మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇటీవల జపాన్ వెళ్లి వచ్చిన రష్మికకు అక్కడ అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు, తమిళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటిస్తూ రష్మిక మందన్న బిజీగా వున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు వీకెండ్లో తన మిత్రబృందంతోనే ఎక్కువగా గడుపుతారట. కుటుంబసభ్యులకు కాస్త సమయాన్ని కేటాయించినా, ఎక్కువగా స్నేహితులతోనే జాలీగా గడిపేస్తారట. ఇది తన పాలసీ అని రష్మిక మందన్న వర్గం మాట. -
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. హాలీవుడ్కు వెళ్లి సక్సెస్ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. -
Tripti Dimri HD Photos: బ్లాక్ డ్రెస్ లో ‘యానిమల్’ హాట్ బ్యూటీ (ఫోటోలు)
-
యానిమల్ హీరోయిన్తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్బీర్కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్లో నటించారు. -
ఆరు నెలల తర్వాత అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. కారణం ఇదే
ఇప్పుడు ఇండియన్ సినిమా క్రష్ ఎవరంటే.. టక్కున రష్మిక మందన్నా పేరే చెబుతారు. పాన్ ఇండియా చిత్రం పుష్ప తరువాత ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. 2016లో కన్నడ చిత్రం కిరాక్ పార్టీతో కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ అక్కడ మరో రెండు చిత్రాలు చేసి, టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ఛలో' చిత్రంలో నటించి, గుర్తింపు పొందిన రష్మిక మందన్నా గీతగోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. కట్ చేస్తే బాలీవుడ్లో పాగా వేసేసింది. అక్కడ తొలుత నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినా, మూడో చిత్రం 'యానిమల్' సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తినా, కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. దీంతో రష్మిక మందన్నా పాన్ ఇండియన్ నటిగా వీర లేవల్లో పాపులర్ అయింది. తాజాగా చావ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న ఈమె ప్రస్తుతం తనకు అనూహ్య క్రేజ్ను తెచ్చి పెట్టిన పుష్ప చిత్ర సీక్వెల్ను పూర్తి చేసే పనిలో ఉంది. దీనితో పాటు రెయిన్బో అనే ద్విభాషా( తెలుగు, తమిళం) చిత్రం, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లో కూడా నటిస్తున్న రష్మిక మందన్నా ఇప్పుడు వర్కౌట్స్పై పూర్తిగా దృష్టి పెట్టిందట. అదేమిటీ ఇప్పటివరకూ వర్కౌట్స్ చేయడం లేదా? అని ఆశ్యర్యపోతున్నారా? నిజమే పని బిజీయో, లేక మరే కారణంగానో ఈ అమ్మడు గత ఆరేడు నెలలుగా వర్కౌట్స్ చేయడం లేదట. ఇక నుంచి వర్కౌట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దీని గురించి రష్మికనే తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. అంతే కాదు ఇకపై కచ్చితంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తీవ్రంగా తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సందీప్ - జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
'యానిమల్' బ్యూటీ రెమ్యునరేషన్ అంత తక్కువ..?
సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం గతేడాదిలో విడుదలయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి బాగా హైలెట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో నేషనల్ క్రష్గా కూడా తెగ చక్కర్లు కొట్టింది. సినిమా వచ్చి చాలా రోజులే అయినా.. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్తో ఇంటిమేట్ సీన్లో నటించి యూత్కు దగ్గరైంది త్రిప్తి. యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అంతే కాకుండా సినిమాలో కూడా ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె తక్కువ పారితోషకానికే యానిమల్కు ఒప్పుకుంది. కానీ యానిమల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో త్రిప్తి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలకు భారీగానే డిమాండ్ ఉంది. తాజాగా ఆమె 'భూల్ భులయా'లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే త్రిప్తి డుమ్రి మరో కోటి పెంచడం ఖాయం అని చెప్పవచ్చు. మేరే మెహబూబ్ మేరే సనమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్.. ఇలా సడన్ షాకిచ్చాడేంటి?
గతేడాది యానిమల్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్ లుక్తో కనిపించిన సందీప్ రెడ్డి ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సందీప్ రెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతోనే మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. #TFNReels: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందీప్ రెడ్డి వంగా Sensational director @imvangasandeep visits Tirumala & seeks divine blessings of Lord Venkateshwara, reveals his next film with Rebel star #Prabhas is gonna start soon! 💫#SandeepReddyVanga #Spirit #TeluguFilmNagar pic.twitter.com/kpgWhJ9hMU — Telugu FilmNagar (@telugufilmnagar) March 6, 2024 -
సందీప్ రెడ్డి సినిమాల కంటే ఆయనలో అదే నా ఫేవరెట్: స్టార్ హీరో
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. డిఫరెంట్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇతడు.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇతడి లేటెస్ట్ మూవీ 'యానిమల్'ని ఎంతలా బాగుందని మెచ్చుకున్నారో అంతే ఘోరంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అందరూ 'యానిమల్' చిత్రాన్ని, సందీప్ రెడ్డి వంగాపై దారుణమైన కామెంట్స్ చేశారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ మాత్రం తాజాగా ఓ కార్యక్రమంలో వీళ్లందరితో పోలిస్తే భిన్నంగా మాట్లాడాడు. (ఇదీ చదవండి: సెట్లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ తమిళ దర్శకుడు) రెండే సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పలు ఈవెంట్స్కి అతిథిగా హాజరవుతూ బిజీగా ఉన్నాడు. ఇలానే తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడింది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 'సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకా చాలా నచ్చుతుంది. సినిమాలో ఆయన మ్యూజిక్ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 'యానిమల్' చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు' అని శివకార్తికేయన్ స్టేజీపైనే చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్పై విమర్శలు చేస్తున్న తమిళ సెలబ్రిటీలు అందరికీ చెప్పుతో కొట్టినట్లయింది. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) #Sivakarthikeyan: Tamil actor Siva Karthikeyan expressed his love for Sandeep Reddy Vanga's work and music. Probably, the first actor outside telugu states to come front and appreciate the film, if I'm not wrong !pic.twitter.com/sycq7JxWwJ — Movies4u (@Movies4uOfficl) March 5, 2024 -
ప్రభాస్ కోసం రణబీర్ ని పక్కకి పెట్టిన సందీప్ వంగా
-
టాలీవుడ్పై అనిల్ కపూర్ వ్యాఖ్యలు వైరల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మరోసారి సౌత్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్,ఫైటర్ చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన ఆయన విజయాన్ని అందుకున్నారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్గా ఎదిగానని అనిల్ కపూర్ అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడారు. 'మంచి పాత్రలకు నన్ను ఎంపిక చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని భాషల్లో నన్ను ఆధరిస్తారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ప్రస్తుతం వస్తున్న యూత్ ఆలోచనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అందుకే నేను సమయం దొరికితే ఎక్కువగా వారితో సంభాషిస్తాను. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే.. బాలీవుడ్లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ చిత్రాలే.. దేశంలో ఉండే గొప్ప నటుల్లో ఎక్కువమంది కూడా దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేసిన వారే.. అక్కడ గొప్ప యాక్టర్స్ ఉన్నారు. మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వచ్చినవే బాహుబలి,ఆర్ఆర్ఆర్,పుష్ప,కేజీఎఫ్ వంటి చిత్రాలు ఉన్నాయి. సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ విడదీయకండి. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి.' అని ఆయన అన్నారు. 1980లో వంశవృక్షం చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు అనిల్ కపూర్. డైరెక్టర్ బాపు ఆయన్ను పరిచయం చేశారు. బాపు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఇప్పటికే పలుమార్లు అనిల్ కపూర్ చెప్పారు. -
యానిమల్ మూవీ చూడొద్దని పిల్లలే వార్నింగ్ ఇచ్చారు: ఖుష్బూ
యానిమల్ మూవీ.. ఎన్నో విమర్శలు, వివాదాలు.. అయితేనేం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్.. కళ్లు చెదిరే కలెక్షన్స్.. బ్రహ్మరథం పట్టిన జనాలు.. ఇది సరపోదా చిత్రయూనిట్ సంబరాలు చేసుకోవడానికి! ఈ మధ్యే ఈ సినిమాకు, అందులో నటించినవాళ్లకు అవార్డులు కూడా వచ్చాయి. ఇంత పేరు గడించిన యానిమల్ మూవీని తానింతవరకూ చూడలేదంటోంది సీనియర్ నటి ఖుష్బూ. కబీర్ సింగే సమస్య అనుకుంటే యానిమల్.. ఓ వేదికపై ఖుష్బూ మాట్లాడుతూ.. నాకు యానిమల్ తరహా సినిమాలు నచ్చవు. అందుకే ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. అయినా ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్నాయంటే జనాల మైండ్సెట్ ఎలా ఉందో ఆలోచించాలి. ఇంతకు ముందు వచ్చిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) మూవీ కూడా ఒక సమస్యగానే ఫీలయ్యాం. నేను డైరెక్టర్ను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే అతడు ఈ సినిమాలతో సక్సెస్ చూశాడు. యువత.. చదువుకున్నవాళ్లు ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సమాజం ఎటు పోతోందో.. మాకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తుంటే అసలు మీ మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అని అనుకునేదాన్ని. నా పిల్లలు ఈ సినిమా చూసి వచ్చాక నేను చూడొద్దని హెచ్చరించారు. జనాలు ఎందుకిలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు? సమాజం ఎటు పోతోంది? ఈ సొసైటీలో మార్పు రావాలి? అని అదేపనిగా ఆలోచిస్తూ బాధపడతానని నన్ను యానిమల్ చూడొద్దన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ 'అరణ్మయి 4' సినిమాలో నటిస్తోంది. చదవండి: 'తనకేవేవో కలలు.. నేనేమో.. కనెక్షన్ మిస్ అవుతోంది.. ' భార్యతో విడిపోయిన నటుడు -
'యానిమల్' సక్సెస్ను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదంటే.: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన గత చిత్రం 'యానిమల్' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. గీతాంజలిగా ఆమె అందరికి మెచ్చేలా నటించింది. యానిమల్ సినిమా విడుదలైన తర్వాత, తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేయడం ప్రారంభించిన ఈ బ్యూటీ.. యానిమల్ సక్సెస్ మీట్లో రష్మిక పెద్దగా కనిపించలేదు. యానిమల్కు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ, రష్మిక ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడంపై అభిమానుల్లో పలు సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా మట్లాడారు. 'యానిమల్ విడుదల తర్వాత నా తదుపరి సినిమాల కోసం సెట్స్ పైకి వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్ వెనువెంటనే ఉండటం వల్ల ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేకపోయాను.. అందువల్ల పెద్దగా బహిరంగంగా కనిపించలేదు. నా పట్ల ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. అందరూ అనుకుంటున్నట్టుగా నేనూ యానిమల్ విజయాన్ని ఆస్వాదించాలనుకున్నాను. అందుకు కొంత సమయం కేటాయించాలనుకుంటే ఆ అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం నా కెరీర్లో అతి పెద్ద, కీలకమైన సినిమాల్లో నటిస్తున్నా. దీంతో రాత్రిళ్లూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ కారణం వల్ల చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయాను. మీరందరూ నన్ను మిస్ అవుతారని నాకు తెలుసు. త్వరలో నా నుంచి వచ్చే సినిమాలు ఆ లోటుని భర్తీ చేస్తాయని నమ్ముతున్నాను. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.' అంటూ ఆమె చెప్పింది. రష్మిక పుష్ప పార్ట్2, ది గర్ల్ప్రెండ్, రెయిన్బో వంటి చిత్రాల్లో ఆమె బిజీగా ఉంది. తాజాగా తన ఇన్స్టాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక లుక్ రివీల్ చేయలేదు. అది ఒక సినిమాకు సంబంధించినది కావడంతో రివీల్ చేయలేకపోయానని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
వ్యాపారవేత్త ప్రేమలో త్రిప్తి డిమ్రి.. ఫోటోలు షేర్ చేసిన ప్రియుడు
'యానిమల్' సినిమాతో టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి . ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. 'జోయ' పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. 'నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ వివరాల కోసం త్రిప్తి ఫ్యాన్స్ గూగుల్లో వెతుకుతున్నారు. సామ్మర్చంట్ తొలుత మోడల్గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్ క్లబ్స్తో పాటు పలు హోటల్స్ ఉన్నాయని తెలిసింది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ఇద్దరూ ఇప్పటి వరకు తెలుపలేదు. -
'జమల కుదు' పాటకు అల్లు అర్జున్ కూతురు క్యూట్ డ్యాన్స్
అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇతడి సినిమాలు గుర్తొస్తాయి. అదే టైంలో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా గుర్తొస్తారు. ఎందుకంటే పేరుకే చిన్న పిల్లలు అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. తాజాగా అల్లు అర్హ.. అలా 'యానిమల్' సినిమాలోని హిట్ పాటకు స్టెప్పులేసి వైరల్ అయిపోతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) అల్లు అర్జున్ సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లకు పైనే అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇతడి కొడుకు అయాన్ కూడా మోడల్ పోజులిస్తూ నవ్విస్తుంటాడు. కూతురు అర్హ కూడా ముద్దుముద్దుగా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే 'యానిమల్' సినిమాలోని 'జమల్ కుదు' పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. అర్హ మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని.. ఆ పాటని పోలినట్లు నడుస్తూ వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) Arha😂😂❤ pic.twitter.com/ywwSnzTtuw — AK. (@flawsomedamsel) February 21, 2024 -
'యానిమల్' బ్యూటీ కొత్త బాయ్ఫ్రెండ్.. అలా తెలిసిపోయింది!
'యానిమల్' సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో విషయం నచ్చింది. కొందరికి రణ్బీర్ యాక్టింగ్ నచ్చితే మరికొందరికి యాక్షన్ సీన్స్ నచ్చాయి. మిగతా చాలామందికి మాత్రం జోయ పాత్ర చేసిన నటి తెగ నచ్చేసింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీసి, ఆమె గురించి తెలుసుకుని మొత్తానికి తృప్తిని ఫేమస్ చేసి పడేశారు. దీంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి బయటపడింది. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) తృప్తి దిమ్రి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2017లో మామ్, పోస్టర్ బాయ్స్ చిత్రాల్లో నటించింది. బుల్ బుల్, కాలా తదితర చిత్రాల్లో బాగా చేసిందని పేరయితే తెచ్చుకుంది గానీ గుర్తింపు రాలేదు. కానీ 'యానిమల్' మూవీతో రాత్రికి రాత్రి ఈమె ఫేట్ మారిపోయింది. కుర్రాళ్లకు పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. గతంలో ఈమె.. అనుష్క శర్మ తమ్ముడు కర్నేశ్ శర్మతో రిలేషన్ ఉందని అన్నారు గానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికైతే 'యానిమల్' బ్యూటీ తృప్తి సింగిల్గానే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈమెకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని టాక్. సామ్ మర్చంట్ అనే యంగ్ బిజినెస్మ్యాన్.. తాజాగా తృప్తి పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి' అని ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఒకవేళ సీక్రెట్ రిలేషన్షిప్ లాంటిది ఏమైనా ఉంటే త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేయొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
రష్మిక రెమ్యునరేషన్పై క్రేజీ రూమర్.. స్పందించిన నేషనల్ క్రష్!
ఇండియన్ క్రష్ నటి రష్మిక మందన్న. నటిగా ఏడేళ్లలోనే కథానాయకిగా అనూహ్య స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ 2016లో ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగళూరు భామ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అంటూ బహుభాషల్లో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను మోసేశారు. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగిపోయారు. పుష్ప చిత్రం విజయం ఈమె కెరీర్ను మార్చేసింది. దెబ్బతో బాలీవుడ్ దృష్టిలో పడింది. అక్కడ తొలి చిత్రం గుడ్బై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం విమర్శలను మూటకట్టుకున్నా, భారీ వసూళ్లను రాబట్టుకుంది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాధారణంగా ఒక్క హిట్ వస్తేనే తారలు తమ పారి తోషికాన్ని పెంచేస్తారు. అలాంటిది ఈ ఇండియా క్రష్ బ్యూటీ, సక్సెస్ఫుల్ కథానాయకి పారితోషికాన్ని పెంచకుండా ఉంటారా? ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా, కాదా అన్నది పక్కన పెడితే రష్మిక మాత్రం అంగీకరించడం లేదు. పైగా ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ సైటెర్లు వేస్తోంది. ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదుగా అంటూ నెటిజన్లు ఆమైపె ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద రష్మికపై ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప–2 , ద్విభాషా చిత్రం రెయిన్బో చిత్రాలపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️ — Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024 -
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్గా రూపొందించిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఈ సిరీస్ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది!
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్-1 ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్షిప్ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. -
'యానిమల్'లో ఆ సీన్స్.. నా భార్యకు నచ్చలేదు: సందీప్ రెడ్డి
'యానిమల్' సినిమా రిలీజై రెండు నెలలకు పైనే అయిపోయింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్గా తనపై విమర్శలు చేసిన హీరో ఆమిర్ భార్య కిరణ్ రావ్, దిగ్గజ రైటర్ జావేద్ అక్తర్కి ఇచ్చిపడేశాడు. అది అలా ఉంచితే తాజాగా 'యానిమల్' చూసిన తర్వాత తన భార్య, కొడుకు ఎలా రియాక్ట్ అయ్యారనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్బాస్ 7' బ్యాచ్తో కలిసి స్కిట్!) సందీప్ రెడ్డిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన సిద్ధార్థ్ కన్నన్.. ఈ సినిమా మీ ఏడేళ్ల కొడుక్కి చూపించారా? అతడి రియాక్షన్ ఏంటి? అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన సందీప్.. 'చూపించకూడని కొన్ని సీన్స్ ఎడిట్ చేసి 'యానిమల్' మూవీని ఓ హార్ట్ డిస్క్లో ఉంచా. ఏ రేటింగ్స్ సన్నివేశాలు లేని వెర్షన్ని గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డికి చూపించాను. అది వాడికి బాగా నచ్చింది. అండర్వేర్ యాక్షన్ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాడు' 'నా భార్య మనీషా మాత్రం ఈ సినిమాలోని రక్తపాతం సీన్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయింది. స్త్రీ పాత్రలని చూపించిన విధానం గురించి మాత్రం పెద్దగా ఏం చెప్పలేదు. అయితే నేను తీసే చిత్రాలకు సరైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి వస్తుంది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనబెడితే సందీప్.. ప్రభాస్తో 'స్పిరిట్' తీస్తాడు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్, అనంతరం అల్లు అర్జున్తో మూవీ ఉంది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) -
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
మేము ప్రశ్నిస్తే.. ఈ వృత్తిలోకి తెలిసే వచ్చారు కదా అంటున్నారు: రష్మిక
సినిమా అనే పవర్ఫుల్ మీడియాలో సక్సెస్ఫుల్ హీరో హీరోయిన్లకు ఉండే క్రేజే వేరు. అయితే వాళ్లు మామూలు మనుషులే. సమస్యలు అనే వాటికి వారు అతీతులు కారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెతలా వ్యక్తిగత సమస్యలతో పాటు కొందరు చర్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు నటీమణుల గురించి వదంతులు ప్రచారం చేయడం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా డీప్ ఫేక్ అనేది వారిని వేదనకు గురిచేస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏఐ అనే టెక్నాలజీతో హీరోయిన్లను నకిలీ ముఖాలను (డీప్ ఫేక్) రూపొందించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి వాటిని రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్, అభిరామి వంటి ప్రముఖ తారలు ఎదుర్కొంటున్నారు. ఫేక్ వీడియోలపై రష్మిక మందన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ డీప్ ఫేక్ వీడియోలు నానాటికి పెరుగుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే ఇలాంటివన్నీ కోరుకునే కదా మీరు వృత్తిలోకి వచ్చారు అని అంటున్నారన్నారు. ఇతర అమ్మాయిలకు ఇలాంటివి ఎదురైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందన్నారు. దీని గురించి తనలాంటి వాళ్లు మాట్లాడితే డీప్ ఫేక్ అంటే ఏమిటి, ఇలాంటివి కరెక్టేనా అనే అంశాలపై కొందరు మహిళలకైనా తెలిసే అవకాశం ఉంటుందన్నారు. అసలు ఈ డీప్ ఫేక్ అనే విషయం గురించి అవగాహన కలగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని రష్మిక మందన్న వ్యక్తం చేశారు. -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
విజయ్ దేవరకొండపై ఫస్ట్టైమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మిక
పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మక మందన్న.. 'యానిమల్' చిత్రంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ నార్త్ ఇండియాలో పెరిగింది. సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యానిమల్ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందులో గీతాంజలిగా ఆమె ఒక బలమైన పాత్రలోనే కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు మరిన్నీ బాలీవుడ్ చిత్రాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన సహ నటులు అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ముఖ్యంగా అమితాబ్ సర్ చాలా సరదాగా ఉంటారని ఆమె చెప్పింది. షూటింగ్ సమయంలో ఎవరైన ఆయనకు కనిపిస్తే వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారని తెలిపింది. రణబీర్ కపూర్ చాలా స్పోర్టీవ్గా ఉంటాడని చెప్పిన రష్మిక జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని ఆయన ఇచ్చారని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండతో తనకు ఉన్న అనుబంధాన్ని రష్మిక ఇలా చెప్పింది. ' కెరీర్లో నేను ఎంతో కష్టపడే వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఆ సమయంలో తప్పకుండా అతని సలహా తీసుకుంటాను. అది నాకు ఎంతో అవసరం కూడా.. ఆ సమయంలో నాకు ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయ్.' అని రష్మిక తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ తన నిశ్చితార్థం లేదని. తన పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో విజయ్ బిజీగా ఉంటే.. మరోవైపు రష్మక కూడా బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న 'ఛావా' చిత్రంలో విక్కీ కౌశల్తో కలసి నటిస్తుంది.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితాధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్తో ‘పుష్ప 2’లో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు.. వాడినే పెళ్లి చేసుకుంటా: త్రిప్తి డిమ్రి
'యానిమల్' సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ అయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు. ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఆమె మళ్లీ భారీగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్బీర్ - త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు వైరల్గా మారాయి. దీంతో ఎందరో ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుందని వార్తలు నెట్టింట భారీగానే వైరల్ అయ్యాయి. ఇప్పటికే డేటింగ్లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. పెళ్లి రూమర్స్పై ఓ ఇటర్వ్యూలో త్రిప్తి డిమ్రి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలపై ఆమెను ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. అతనికి డబ్బు, పాపులారిటీ వంటివి లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అని కాబోయే భర్తపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. యానిమల్’ కంటే ముందే త్రిప్తి డిమ్రి పలు ఓటీటీలలో నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా ఓటీటీని మాత్రం నిర్లక్ష్యం చేయనని తెలిపింది. త్రిప్తి డిమ్రికి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెకు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. -
ఓటీటీలో యానిమల్ దూకుడు.. మూడు రోజుల్లోనే సలార్ రికార్డ్ బ్రేక్!
గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియన్స్ను అలరించిన ఈ చిత్రం జనవరి 26న ఓటీటీకి వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచే సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన యానిమల్ వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. అంతకుముందే రిలీజైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్ను అధిగమించింది. కేవలం టాప్ ట్రెండింగ్ ఉన్న సినిమాలే కాదు.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యానిమల్ మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ మూవీస్ లిస్ట్లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఇండియాతో పాటు దాదాపు 16 దేశాల్లో నంబర్వన్ స్థానంలో ట్రెండింగ్లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కమర్షియల్ యాక్షన్ మూవీ సలార్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత జనవరి 20న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సలార్ ఇండియా వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. సలార్ను దాటేసిన యానిమల్.. టాప్ ట్రెండింగ్ మూవీస్లోనే కాదు.. వ్యూస్ విషయంలోనూ సలార్కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. యానిమల్ నెట్ఫ్లిక్స్లో మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్షిప్ను నమోదు చేసింది. కాగా.. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్తో పాటు 10.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. దీంతో ఓటీటీలో సలార్కు రణ్బీర్ కపూర్ యానిమల్ గట్టి పోటీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. -
యానిమల్పై మండిపడ్డ స్టార్ హీరోయిన్.. ఆ విషయంలో నేనైతే!
సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్. అర్జున్రెడ్డి ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్కుమార్ యానిమల్ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. -
ఫిలింఫేర్ అవార్డులు.. ఆ సినిమాల పంట పండింది!
ప్రతిష్టాత్మక 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ జాబితా వచ్చేసింది. జనవరి 28న గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలనే ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విక్రాంత్ మాస్సే-విధు వినోద్ చోప్రా చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే! బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్- అలియా భట్ ఉత్తమ హీరో, హీరోయిన్ అవార్డును ఎగరేసుకుపోయారు. యానిమల్ చిత్రానికిగానూ రణబీర్ కపూర్ ఎంపికైతే.. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రానికి గాను అలియాభట్ ఎంపికైంది. 12th ఫెయిల్ చిత్రాన్ని తెరకెక్కించిన విధు వినోద్ చోప్రాకు ఉత్తమ డైరెక్టర్గా అవార్డు దక్కింది. 69వ ఫిలింఫేర్ అవార్డుల జాబితా ♦ ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ ♦ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్ ♦ ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్ (యానిమల్) ♦ ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్) ♦ ఉత్తమ నటి: అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్) ♦ ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ♦ ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ) ♦ ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(జరా హత్కే జరా బచ్కే) ♦ ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: (యానిమల్ ) ♦ ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్) ♦ ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్) ♦ ఉత్తమ కథ: అమిత్ రాయ్ (OMG 2) ♦ ఉత్తమ స్క్రీన్ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ♦ ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్రామేశ్వర్ (యానిమల్) ♦ ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్ ధావారే (త్రీ ఆఫ్ అజ్) ♦ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (స్యామ్ బహదూర్) ♦ ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య ( వాట్ జుమ్కా?- రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) -
ఓటీటీలో యానిమల్.. నెట్ఫ్లిక్స్పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?
ఓటీటీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమా గణతంత్రం దినోత్సవం రోజునే ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా యానిమల్ చిత్రంపై వ్యతిరేకత వస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. అయితే ఈ చిత్రంపై థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్స్ మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్ఫ్లిక్స్ను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఓటీటీ నుంచి యానిమల్ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ తన ట్వీట్లో రాస్తూ.. "నేను యానిమల్ చిత్రం చూసి కలత చెందా. ఈ సినిమా భారతీయ మహిళలను కించపరిచేలా ఉంది. ఇది భారతీయ వివాహా బంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. మన సంప్రదాయం, వారసత్వం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అన్న భావనకు భంగం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి సినిమాపై చర్యలు తీసుకోండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నయనతార నటించిన అన్నపూరణి చిత్రం నెట్ఫ్లిక్స్ తొలగించిన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. మరో నెటిజన్స్ రాస్తూ..'దయచేసి నెట్ఫ్లిక్స్ నుంచి యానిమల్ సినిమాని తీసేయండి. ఇది మహిళలపై ఘోరమైన హింసను ప్రతిబింబిస్తోంది. దీన్ని ఎంటర్టైన్మెంట్ అని ఎవరూ పిలవరు" అంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. Remove annapoorani @NetflixIndia but promotes Misogyny and hatred. And you ma'am @NayantharaU have apologized to these vadakans. Shame on Netflix #AnimalOnNetflix #Animal https://t.co/ouKElRp1G7 — Andrew (@Noob_Diablo) January 28, 2024 Lol good one, I watched Annaporani wondering what was so offensive in the movie that Netflix removed it. It is an average movie just like Animal. It came to my mind that, why didn't @netflix remove Animal as well which has hurt sentiments of women. — Kushel Giriraj (@g_kushel) January 27, 2024 Hello @NetflixIndia @annamalai_k I’m an Indian Hindu woman disturbed by the movie Animal which shows an Indian man having affairs outside marriage. Cultural heritage what makes India & this movie disturbs the “one man one wife” concept of this country. Plz take action. — Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 27, 2024 @NetflixIndia @netflix please remove Hindi movie ANIMAL from Netflix, it reflects gore violence and abuse against women, this isn’t called entertainment — JaganN (@JaganJ80470849) January 26, 2024 -
భార్య రికార్డును బద్ధలు కొట్టిన రణ్బీర్.. పప్పా అని ఎన్నిసార్లు..
కొందరు మాటకు ముందోసారి, వెనుకోసారి పేరు పెట్టి పిలుస్తూనే ఉంటారు. సినిమాల్లో కూడా ఇది జరుగుతుంది. అందుకు బ్రహ్మాస్త్ర మూవీ నిదర్శనం. ఈ సినిమాలో రియల్ జంట రణ్బీర్ కపూర్-ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. రణ్బీర్.. శివ అనే పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఆలియా.. అతడిని పదేపదే శివ శివ అంటూ పిలిచేది. కొందరు దీన్ని లెక్కగట్టి సోషల్ మీడియాలో వదిలారు. సినిమా మొత్తమ్మీద రణ్బీర్ను 104 సార్లు శివ అని పిలిచిందని లెక్క తేల్చారు. ఇప్పుడీ రికార్డును బద్ధలు కొట్టాడు రణ్బీర్. అదెలాగంటే.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో యానిమల్ రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్. రూ.890 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో అనిల్ కపూర్ తండ్రి పాత్రను పోషించాడు. పదేపదే పప్పా (నాన్న).. పప్పా అని తండ్రి గురించి ఆరాటపడతాడు హీరో. సినిమా మొత్తం ఈ తండ్రి ప్రేమ పొందాలన్న హీరో తపన గురించే కథ నడుస్తూ ఉంటుంది. పప్పా అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందంటే? అలా ఈ సినిమాలో పప్పా అన్న పదం ఏకంగా 196 సార్లు వచ్చిందట. ఒక్క రణ్బీర్ నోటి నుంచే 150 కంటే ఎక్కువసార్లు పప్పా అన్న పదం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసిన జనాలు మొత్తానికి బ్రహ్మాస్త్ర రికార్డును యానిమల్ బద్ధలు కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్య రికార్డును రణ్బీర్ బ్రేక్ చేశాడని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. #Animal papa count. pic.twitter.com/ltaaIJzK1l — LetsCinema (@letscinema) January 27, 2024 చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! -
యానిమల్ ఫ్యాన్స్ కు దారుణంగా మోసం చేసిన సందీప్ వంగా
-
'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి
మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
నెట్ఫ్లిక్స్లో యానిమల్ మూవీ
-
Animal OTT Release: నేడు అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి 'యానిమల్'
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన సూపర్హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. యానిమల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు తాజగా నెట్ఫ్లిక్స్ ఒక టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్ చిత్రం ఉంటుందని నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు. యానిమల్ రన్టైమ్ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్ చేస్తున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్ పార్క్' టైటిల్తో ఈ చిత్రానికి సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి యానిమల్.. ఆ రోజే రిలీజ్?
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. అయితే బాక్సాఫీస్ సూపర్హిట్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. (ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) అసలేం జరిగిందంటే.. కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్ఫ్లిక్స్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది. వివాదం తొలగినట్లే..! ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. -
అనిమల్ మూవీ OTT అప్డేట్
-
యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ?
-
అలియా భట్ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్బీర్ కపూర్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్ సన్నివేశాలను లైట్ తీసుకొని, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ) ఇటీవల ఇంటిమేట్ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్బీర్ కపూర్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. కెరీర్ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించానని రణ్బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?) ‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్ వంగా యానిమల్ కథ చెబుతూ.. ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్ చాలా సపోర్ట్గా నిలిచింది. ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్బీర్ చెప్పారు. యానిమల్ విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్బీర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానుంది. -
యానిమల్ ఓటీటీ రిలీజ్ కు కష్టాలు...సమన్లు జారీ చేసిన కోర్టు..
-
ఓటీటీలోకి 'యానిమల్'.. సమన్లు జారీ చేసిన కోర్టు
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన సూపర్హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారట. జనవరి 26 నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓటీటీ కోసం ఆ సీన్స్ యానిమల్ రన్టైమ్ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకుల ఇబ్బంది పడుతారని భావించి సుమారు సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు సందీప్ రెడ్డి గతంలో చెప్పాడు. నెట్ఫ్లిక్స్ వెర్షన్ కోసం ఎడిటింగ్ చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపాడు. థియేటర్ కోసం తొలగించిన కొన్ని షాట్స్ను ఓటీటీ వెర్షన్కు యాడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అందులో రష్మికతో రణ్బీర్ లిప్లాక్ సీన్స్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. యానిమల్ ఓటీటీ రిలీజ్కు చిక్కులు యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్ఫ్లిక్స్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై నేడు (జనవరి20) వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరగనుంది. -
Animal Film: ఆడవారిపై హింస.. ఎంజాయ్ చేస్తున్నారు, నా వల్ల కాదు!
-
చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక
పాన్ ఇండియా రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఓ చెంపదెబ్బ వల్లే ఇదంతా జరిగింది. అప్పుడేం జరిగిందనే విషయాన్ని స్వయంగా ఈ బ్యూటీనే బయటపెట్టింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని.. ఏడుస్తూ అరిచేశానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం 'యానిమల్' మూవీలో నటించిన రష్మిక.. అద్భుతమైన సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అలానే ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర సంగతుల్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు) యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ విజయ్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటించారు. జోయా పాత్రలో తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. ఓ సీన్లో భాగంగా జోయాతో శృంగారంలో పాల్గొన్నానని రణ్ విజయ్ వచ్చి తన భార్య గీతాంజలితో చెబుతాడు. దీంతో ఈమెకు కోపమొచ్చి భర్త చెంపపై గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయితే ఈ సీన్ పూర్తయిన తర్వాత తను ఏడవడంతో పాటు గట్టిగట్టిగా అరిచానని రష్మిక చెప్పింది. 'ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్లో కంప్లీట్ చేశాం. అయితే ఈ సీన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాననేది కూడా నాకు గుర్తులేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే రియాక్ట్ అవ్వాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్-కట్ తప్పితే మధ్యలో ఏం జరిగిందో గుర్తులేదు. అయితే సీన్లో రణ్బీర్ చెంపపై కొట్టిన తర్వాత గట్టిగా ఏడవడంతో పాటు అరిచేశాను. ఆ తర్వాత రణ్బీర్ దగ్గరకు వెళ్లి అంతా ఓకేనా అని అడిగాను. అయితే ఈ సినిమా, ఈ సీన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది' అని రష్మిక చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ సినిమాపై హీరోయిన్ సమంత రివ్యూ) -
యానిమల్ చూసి జనాలు ఆనందిస్తున్నారు, బాధేసింది: హీరో
కొన్ని చిత్రాలు బ్లాక్బస్టర్ విజయాన్ని సాధిస్తాయి.. కానీ కొందరికి నచ్చవు. మరికొన్ని చిత్రాలు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేవు, కానీ ఎంతోమందికి ఇట్టే కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఒక్కో సినిమాది ఒక్కో రిజల్ట్. ఈ మధ్య కాలంలో బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రాల్లో యానిమల్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ చిత్రంపై విమర్శలు కూడా వచ్చాయి. అమ్మాయిని చులకనగా చూడటం నచ్చలేదు తాజాగా తమిళ హీరో, దర్శకుడు ఆర్జే బాలాజీ యానిమల్ మూవీ నచ్చలేదంటున్నాడు. అతడు మాట్లాడుతూ.. 'థియేటర్లో నేను యానిమల్ సినిమా చూడలేదు, చూడాలనుకోలేదు కూడా! చాలామంది ఈ సినిమా చూడమని, అద్భుతంగా ఉందని సలహా ఇచ్చారు. నాకు నచ్చని అంశం ఏంటంటే.. ఒకమ్మాయిని కొడుతుంటే, తనను వేధిస్తుంటే థియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని నేను సహించలేను. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ జనాలు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. నా సినిమాలో అయితే ఒప్పుకోను అలాంటి సన్నివేశాలను చూసి ఆనందించడం సరైనది కాదు. ఇవి జనాలను ఏదో ఒకరకంగా ప్రేరేపిస్తాయి. అలాంటి సన్నివేశాలు నా సినిమాలో అయితే పెట్టనివ్వను. యానిమల్లో హీరో.. తృప్తి డిమ్రిని తన షూ నాకమన్నాడట. యూత్ ఇలాంటివి చూసినప్పుడు ఆడవాళ్లతో అలాంటి పనులు చేయించడం తప్పేం కాదని ఫీలవుతారు' అని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: పాన్ ఇండియా సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు! -
Filmfare 2024: యానిమల్ హవా.. ఏకంగా 19 నామినేషన్స్!
గతేడాది చెప్పుకోదగ్గ చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్లుగా నిలవగా మరికొన్ని ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాయి. కొన్ని సినిమాలు వందల కోట్లు అవలీలగా రాబడితే మరికొన్నేమో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం ఈజీగా సొంతం చేసుకున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా రాబట్టి సినీప్రియులను అబ్బురపరిచింది. త్వరలో జరగబోయే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలోనూ సత్తా చాటేట్లు కనిపిస్తోంది. 69వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 27, 28వ తేదీలలో గుజరాత్లో జరగనుంది. తాజాగా ఈ అవార్డుల నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. యానిమల్ సినిమా ఏకంగా 19 నామినేషన్లతో దూసుకుపోతోంది. పాపులర్ అవార్డ్స్, క్రిటిక్స్ అవార్డ్స్, టెక్నికల్ అవార్డ్స్.. ఇలా మెజారిటీ విభాగాల్లో యానిమల్ పోటీపడుతోంది.12th ఫెయిల్ మూవీ పాపులర్, క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రం అవార్డు కోసం పోటీపడుతోంది. ఫిలింఫేర్ అవార్డులు.. నామినేషన్ల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం (పాపులర్) 12th ఫెయిల్ జవాన్ Omg 2 పఠాన్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) 12th ఫెయిల్ భీద్ ఫరాజ్ జోరం సామ్ బహదూర్ త్రీ ఆఫ్ అస్ జ్విగాటో ఉత్తమ డైరెక్టర్ అమీర్ రాయ్(OMG 2)) అట్లీ (జవాన్) కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) సందీప్ రెడ్డి వంగా (యానిమల్) సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్) విదు వినోద్ చోప్రా (12 ఫెయిల్) ఉత్తమ నటుడు- లీడ్ రోల్ రణ్బీర్ కపూర్ (యానిమల్) రణ్వీర్ సింగ్ (రానీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) షారుక్ ఖాన్ (డంకీ) షారుక్ ఖాన్ (జవాన్) సన్నీడియోల్ (గదర్ 2) విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అభిషేక్ బచ్చన్ (ఘూమర్) జైదీప్ అహ్లావత్ (త్రీ ఆఫ్ అస్) మనోజ్ బాజ్పాయ్ (జోరం) పంకజ్ త్రిపాఠి (OMG 2)) రాజ్కుమార్ రావు (భీద్) విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) ఉత్తమ నటి - లీడింగ్ రోల్ అలియా భట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్) దీపికా పదుకొణె (పఠాన్) కియారా అద్వాణి (సత్యప్రేమ్ కీ కథ) రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) తాప్సీ పన్ను (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్) దీప్తి నావల్ (గోల్డ్ ఫిష్) ఫాతిమా సనా షైఖ్ (ధక్ ధక్) రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) సైయామీ ఖేర్ (ఘూమర్) షహానా గోస్వామి (జ్విగాటో) షెఫాలీ షా (త్రీ ఆఫ్ అస్) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య రావల్ (ఫరాజ్) అనిల్ కపూర్ (యానిమల్) బాబీ డియోల్ (యానిమల్) ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3) తోట రాయ్ చౌదరి (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని) విక్కీ కౌశల్ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) రత్న పాఠక్ షా (ధక్ ధక్) షబానా అజ్మీ (ఘూమర్) షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) తృప్తి డిమ్రి (యానిమల్) యామీ గౌతమ్ (OMG 2) ఉత్తమ లిరిక్స్ అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. - జర హట్కే జర బచ్కే) అమితాబ్ భట్టాచార్య (తుమ్ క్యా మిలె - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) గుల్జర్ (ఇత్నీ సీ బాత్.. - సామ్ బహదూర్) జావెద్ అక్తర్ (నిఖలే ద కభీ హమ్ ఘర్సే.. - డంకీ) కుమార్ (చలెయా.. - జవాన్) సిద్దార్థ్- గరిమ (సాత్రంగా..- యానిమల్) స్వనంద్ కిర్కిరే, ఐపీ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ) ఉత్తమ సంగీతం యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్ర, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పుర్నాయక్, జానీ, భుపీందర్ బబ్బల్, అషీమ్ కెమ్సన్, హర్షవర్దన్ రామేశ్వర్, గురీందర్ సీగల్) డంకీ (ప్రీతమ్) జవాన్ (అనిరుధ్ రవిచందర్) పఠాన్ (విశాల్ అండ్ శేఖర్) రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని (ప్రీతమ్) తు జూఠీ మే మక్కర్ (ప్రీతమ్) జర హట్కే జర బచ్కే (సచనిగ్- జిగర్) ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ) అర్జిత్ సింగ్ (సాత్రంగా.. - యానిమల్) భుపీందర్ బబ్బల్ (అర్జన్ వాలా.. - యానిమల్) షాహిద్ మాల్యా (కుడ్మయి.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) సోను నిగమ్ (నిక్లే ద కబీ హమ్ ఘర్సే.. - డంకీ) వరుణ్ జైన్, సచిన్-జిగార్, షాదబ్ ఫరిది, అల్టామాష్ ఫరిది (తేరే వాస్తే ఫలక్.. - జర హట్కే జర బచ్కే)) ఉత్తమ గాయని దీప్తి సురేశ్ (అరారి రారో... - జవాన్) జోనిత గాంధీ (హే ఫికర్.. - 8 A.M. మెట్రో) శిల్ప రావు (బేషరం ర్యాంగ్.. - పఠాన్) శిల్ప రావు (చలెయా... - జవాన్) శ్రేయ ఘోషల్ (తుమ్ క్యా మిలే.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) శ్రేయ ఘోషల్ (వి కమ్లియా.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) ఉత్తమ కథ అమిత్ రాయ్ (OMG 2)) అనుభవ్ సిన్హా (భీద్) అట్లీ (జవాన్) దేవశిశ్ మఖిజా (జోరం) ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) కరణ్ శ్రీకాంత్ శర్మ (సత్యప్రేమ్ కీ కథ) పారిజాత్ జోషి, తరుణ్ దుడేజా (ధక్ ధక్) సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్) ఉత్తమ స్క్రీన్ప్లే అమిత్ రాయ్ (OMG 2) ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) ఓంకార్ అచ్యుత్ బర్వే, అర్పిత చటర్జీ, అవినాష్ అరుణ్ ధవరె (త్రీ ఆఫ్ అస్) సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేశ్ బండారు (యానిమల్) శ్రీధర్ రాఘవన్ (పఠాన్) విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ఉత్తమ డైలాగ్స్ అబ్బాస్ తైర్వాలా (పఠాన్) అమిత్ రాయ్ (OMG 2) ఇషితా మైత్ర (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్) వరుణ్ గ్రోవర్, షోయబ్ జుల్ఫీ నజీర్ (త్రీ ఆఫ్ అస్) సుమిత్ అరోరా (జవాన్) ఉత్తమ బీజీఎమ్ అలోఖనంద దాస్గుప్తా (త్రీ ఆఫ్ అస్) హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) కేల్ ఆంటొనిన్ (అఫ్వా) కేతన్ సోధ (సామ్ బహదూర్) సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (పఠాన్) శాంతను మైత్ర (12th ఫెయిల్) తపాస్ రేలియా (గోల్డ్ ఫిష్) బెస్ట్ సినిమాటోగ్రఫీ అమిత్ రాయ్ (యానిమల్) అవినాష్ అరుణ్ ధావరె (త్రీఆఫ్ అస్) జీకే విష్ణు (జవాన్) మనుష్ నందన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) ప్రాతమ్ మెహ్రా (ఫరాజ్) రంగరాజన్ రామభద్రన్ (12th ఫెయిల్) సచ్చిత్ పౌలోజ్ (పఠాన్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అమృత మహల్ నాకై (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) నిఖిల్ కోవలె (OMG 2) ప్రశాంత్ బిడ్కర్ (12th ఫెయిల్) రీటా ఘోష్ (జ్విగాటో) సుభత్ర చక్రవర్తి, అమిత్ రాయ్ (సామ్ బహదూర్) సురేశ్ సెల్వరాజన్ (యానిమల్) టి ముత్తురాజ్ (జవాన్) ఉత్తమ వీఎఫ్ఎక్స్ డూ ఇట్ క్రియేటివ్ లిమిటెడ్, న్యూ వీఎఫ్ఎక్స్వాలా, విజువల్ బర్డ్స్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్, ఫేమస్ స్టూడియోస్ (యానిమల్) ప్రిస్కా, పిక్సెల్ స్టూడియోస్ (గదర్ 2) రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (జవాన్) వైఎఫ్ఎక్స్ (పఠాన్) ఉత్తమ కొరియోగ్రఫీ బోస్కో - సీజర్ (జూమె జో పఠాన్ - పఠాన్) గణేశ్ ఆచార్య (లుట్ పుట్ గయా- డంకీ) గణేశ్ ఆచార్య (తేరే వాస్తే ఫలక్ - జరే హట్కే జర బచ్కే) గణేశ్ ఆచార్య (వాట్ జుమ్కా?.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) షోయబ్ పాల్రాజ్ (జిందా బందా - జవాన్) వైభవి మర్చంట్ (దండరో బాజే.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మాలవిక బజాజ్ (12th ఫెయిల్) మనీశ్ మల్హోత్రా ఏక లఖాని (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) సచిన్ లవ్లేఖర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్) షాలీనా నాథని, కవిత, అనిరుధ్ సింగ్, దీపిక లాల్ (జవాన్) షాలీనా నాథని, మమత ఆనంద్, నిహారిక జాలీ (పఠాన్) షీతల్ శర్మ (యానిమల్) ఉత్తమ సౌండ్ డిజైన్ అనిత కుశ్వాహ (భీద్) కుణాల్ శర్మ (సామ్ బహదూర్) మానస్ చౌదరి, గణేశ్ గోవర్దన్ (పఠాన్) మానవ్ శ్రోత్రియ (12th ఫెయిల్) సింక్ సినిమా (యానిమల్) వినీత్ డిసౌజా (త్రీ ఆఫ్ అస్) ఉత్తమ ఎడిటింగ్ ఆరిఫ్ షైఖ్ (పఠాన్) అటను ముఖర్జీ (అఫ్వా) జస్కున్వార్ కోహిల్- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) రుబెన్ (జవాన్) సందీప్ రెడ్డి వంగా (యానిమల్) సువిర్ నాథ్ (OMG 2) ఉత్తమ యాక్షన్ సీజీ ఓనీల్, క్రయాగ్ మక్కే, సునీల్ రోడ్రిగ్స్ (పఠాన్) ఫ్రాంజ్ స్పిలాస్, ఓ సీ యంగ్, సునీల్ రోడ్రిగ్స్ (టైగర్ 3) పర్వేజ్ షైఖ్ (సామ్ బహదూర్) రవి వర్మ, శ్యామ్ కౌశల్, అబ్బాస్ అలీ మొఘల్, టీను వర్మ (గదర్ 2) స్పైరో రజటోస్, అనిల్ అరసు, క్రైగ్ మక్రే, యానిక్ బెన్, కెచ కంఫాక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్) సుప్రీం సుందర్ (యానిమల్) టిమ్ మ్యాన్, విక్రమ్ దహియా (గణ్పథ్) -
డైరెక్టర్ టచ్ చేయనిచ్చేవాడే కాదు: యానిమల్ నటులు
యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు సిక్కులంటే ఎంతో అభిమానం, గౌరవమట. సిక్కులను సినిమాలో చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడట. ఈ విషయాన్ని యానిమల్ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన అమంజోత్ సింగ్, మంజోత్ సింగ్, విక్రమ్ బక్షి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ముగ్గురూ సినిమాలో రణ్బీర్ కపూర్ కజిన్లుగా నటించారు. బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)కు ఆపదలో ఉన్నాడని తెలియగానే పంజాబ్ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయనకు రక్షణగా నిలబడతారు. తాజాగా ఈ ముగ్గురు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సందీప్ స్వయంగా చెప్పాడు ఈ సందర్భంగా అమంజోత్ మాట్లాడుతూ.. 'సర్దార్లు కామెడీ పాత్రల కోసం పుట్టలేదు. వారి యాటిట్యూడ్, స్వభావం, పోరాట చరిత్ర.. అదంతా కామెడీ కాదు. వారిని నేను కమెడియన్లలా చూపించలేను అని దర్శకుడు సందీప్ స్వయంగా నాతో చెప్పాడు. హీరోలుగా చూపించాల్సిన వారిని కామెడీ పీసులుగా మార్చడం ఇష్టం లేదన్నాడు. కాలేజీలో తనకు పంజాబీ స్నేహితులు ఎక్కువగా ఉండేవారట. అలా సిక్కుల గురించి ఆయన బాగా తెలుసుకున్నాడు' అని చెప్పాడు. సీరియస్ పాత్రల్లో సిక్కులు కనిపించి ఎన్నాళ్లయిందో! విక్రమ్ బక్షి మాట్లాడుతూ.. 'సీరియస్గా కనిపించే సిక్కు పాత్రను చివరిసారిగా ఎప్పుడు చూశారో మీకేమైనా గుర్తుందా? గుర్తు రావడం లేదు కదూ.. సినిమాలో మేము పరిస్థితులను బట్టి అక్కడక్కడా సరదాగా కామెడీ పండించాము. అంతేకానీ వెకిలి కామెడీ మాత్రం చేయలేదు' అన్నాడు. ఇంతలో మంజోత్ సింగ్ మధ్యలో కల్పించుకుంటూ.. 'ఏదైనా సన్నివేశం షూట్ చేసేముందు చాలాసార్లు అతడు మా అనుమతి కోరేవారు. సినిమా లుక్ టెస్ట్ కోసం వెళ్లినప్పుడు అక్కడి మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్ రెబెకా.. నా ముఖం మీదున్న వెంట్రుకలు తీసేయాలన్నాడు. గడ్డం తీసేయమంటే.. అలాగే నా గడ్డం వైపు చూపిస్తూ అది కొంత తీసేయాలన్నాడు. సందీప్ అందుకు ఒప్పుకోలేదు. గడ్డాన్ని తాకడానికే వీల్లేదన్నాడు. దాన్ని అలాగే ఉండనీయమన్నాడు. మాకు చాలా స్వేచ్ఛను ఇచ్చాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ విషయానికి వస్తే ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన మహేశ్.. డల్గా కనిపించిన సూపర్స్టార్ -
ఇదొక్కటి ఉంటే చాలు మీరు కూడా అందంగా ఉంటారు: రష్మిక
ప్రాంతీయ చిత్ర సీమ నుంచి పాన్ ఇండియా రేంజ్కు చేరుకుని చిత్రసీమలోనే అగ్ర కథానాయికగా రష్మిక మందన్న కొనసాగుతుంది. 2016లో కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడలో అరంగేట్రం చేసింది. 2018లో ఛలో సినిమాతో హిట్ కొట్టి ఆపై విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం'తో మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఆపై పుష్ప,వారసుడు, సుల్తాన్,యానిమల్ వంటి చిత్రాల ద్వారా హిట్లు కొట్టి ప్రస్తుతం బిజీగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది. రష్మిక సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. అలాగే, ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ముఖానికి ఫేస్ మాస్క్ ధరించి ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ పనుల వల్ల బిజీగా ఉన్న సమయంలో కూడా తన అందాన్ని తాను ఎలా కాపాడుకుంటుందో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. ఆ పోస్ట్ను చాలామంది షేర్ చేస్తుండటం విశేషం. అందరం పనిలో పడిపోయి సమయం కూడా లేకుండా బిజీగా ఉన్నప్పుడు.. కనీస నిద్ర కూడా లేకపోవడం.. ఎక్కు ప్రయాణం చేయడం వంటి వాటితో చర్మం దెబ్బ తింటుందని రష్మిక తెలిపింది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కోసారి డెర్మటాలజిస్ట్ దగ్గరకు కూడా వెళ్లే సమయం ఉండదు. అప్పుడు ఏదైనా బ్యూటీ ఫేస్ మాస్క్లు ఉపయోగించడం సరైన మార్గమని ఆమె తెలిపింది. సౌత్ ఇండియాలో పాపులర్ అయిన రష్మిక బాలీవుడ్లో నటుడు అమితాబ్ బచ్చన్తో 'గుడ్బై' సినిమాతో అరంగేట్రం చేసింది. తరువాత, ఆమె ఇటీవలే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్'లో నటుడు రణబీర్ కపూర్ భార్య పాత్రను పోషించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం పేర్కొంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఆడియన్స్ అలాంటి చిత్రాలనే ప్రోత్సహిస్తున్నారు: కంగనా
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా.. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. అయితే ఎప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. సినిమాల్లో మహిళల పరిస్థితిని చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ..' ప్రస్తుతం సినిమాల ట్రెండ్ చూస్తుంటే భయంకరంగా మారింది. మహిళల పరువును, వారి బట్టలను హింసాత్మకంగా, అవమానకరంగా తీసి కేవలం గోడమీద పువ్వు లాగా మార్చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేను సినిమాల్లోకి వచ్చినప్పటీ రోజులు గుర్తుకొస్తున్నాయి. అసభ్యకరమైన ఐటెమ్ నంబర్లు, మూగ పాత్రలు ప్రబలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా వేతన సమానత్వం కోసం పోరాడుతున్నా. అందుకే గ్యాంగ్స్టర్, వో లమ్హే, ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక, తలైవి, తేజస్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించాను కూడా. అందుకే యశ్రాజ్ ఫిల్మ్స్, ధర్మ వంటి పెద్ద ప్రొడక్షన్స్కు వ్యతిరేకంగా వెళ్లా.' అని తెలిపింది. అంతే కాకుండా.. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి పెద్ద హీరోలకు కూడా నో చెప్పా. కానీ నాకు వారితో వ్యక్తిగతంగా వైరం లేదు. కేవలం మహిళా సాధికారత కోసమే నా పోరాటం. నేటి సినిమాల్లోని మహిళల స్థితిగతులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణమా? సినిమాల్లో స్త్రీల ఈ విపరీతమైన ధోరణికి ప్రేక్షకులకు భాగస్వామ్యం లేదా?' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన సినిమాలపై చేస్తున్న నెగెటివ్ ప్రచారంపై కూడా స్పందించింది. కంగనా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..' నా సినిమాలకు డబ్బులిచ్చి మరీ నెగిటివ్ ప్రచారం చేయడం ఎక్కువైంది. అయినా నేను ఇప్పటికీ అలాంటి వారిపై పోరాడుతున్నా. కానీ ప్రేక్షకులు కూడా మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే చిత్రాలనే ప్రోత్సహిస్తున్నారు. ఇది స్త్రీల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న వారిని తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. రాబోయే కాలంలో మహిళా సాధికారత చిత్రాలే కెరీర్గా ఎంచుకున్న నా జీవితంలో మరింత విలువైన సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చింది. The latest trend of films where women are reduced to mere flower on the wall, violently and disgracefully stripped of their dignity and clothes is beyond appalling. Reminds me of the time when I entered films, vulgar item numbers, quick in and out sleazy and dumb roles against… — Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024 Paid negativity for my films is overwhelming, I have been fighting hard so far but even audiences are encouraging women beating films where they are treated like sex objects and asked to lick shoes, this is deeply discouraging for someone who has been dedicating her life for… https://t.co/VExJHxRE3P — Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024 -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
ముంబైలో యానిమల్ సక్సెస్ మీట్.. మెరిసిన సినీ తారలు (ఫొటోలు)