cricket betting
-
క్రికెట్ బెట్టింగ్లో ఒకరి అరెస్ట్.. స్పందించిన వైజయంతి మూవీస్
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే, తాను వైజయంతీ మూవీస్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు నిలేశ్ చోప్రా చెప్పారని వార్తలు రావడంతో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో తాజాగా వైజయంతీ మూవీస్ ఎక్స్ పేజీ ద్వారా స్పందించింది. నిలేశ్ చోప్రా ఎవరో తమకు తెలియదని , అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి తమ వద్ద ఎప్పుడు కూడా పనిచేయలేదని పేర్కొంది.'ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నందుకు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్లో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి ఎస్ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. వాస్తవాలను వారికి వివరించాం. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు తమను సంప్రదించి వాస్తవాలను ధృవీకరించవలసిందిగా మీడియాను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము' అని పేర్కొంది.It has come to our notice that a person named Nilesh Chopra had been arrested by SR Nagar Police for online gambling.THE SAID INDIVIDUAL HAS NEVER WORKED WITH US AT VYJAYANTHI MOVIES OFFICE AND WE ARE UNAWARE OF ANY ASSOCIATION WITH HIM IN ANY OTHER FORM.We have formally…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 6, 2025 -
పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు
ఒక చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్పై వదలడమో, రిమాండ్కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు. -
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్
-
బీటెక్ రవి అరెస్టు
సాక్షి ప్రతినిధి, కడప: క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రవిపై వల్లూరు పోలీసుస్టేషన్లో ఓ కేసు పెండింగ్లో ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నేపధ్యంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, కాలు ఫ్యాక్చర్ కావడానికి బీటెక్ రవి కారకుడైనట్లు అప్పట్లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రవిని అరెస్టు చేసిన పోలీసులు... రిమ్స్లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. మళ్ళీ బుధవారం ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు. నిజానికి ఈ మధ్యే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బీటెక్ రవి చుట్టూనే చేరింది. క్రికెట్ బెట్టింగ్ విషయాల్లో వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్గా ఉండటంతో... స్థానికంగా పేరున్న లాడ్జిలను ఆయనే స్వయంగా తనిఖీలు సైతం చేశారు. బెట్టింగ్ అణిచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరుమామిళ్ల బెట్టింగ్ రాకెట్ మొత్తం బీటెక్ రవి కనుసన్నుల్లో నడిచినట్లు రూఢీ అయ్యింది. పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో... బీటెక్ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా బ్లడ్లోనే జూదం ఉంది.. బీటెక్ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో సింహాద్రిపురం కేంద్రంగా ‘జూదం మా బడ్ల్లోనే ఉంది’ అంటూ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పలుసార్లు వివిధ సందర్భాల్లో ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి జూదం అలవాటు ఉన్నట్లుగా అప్పట్లో వచ్చిన ఆరోపణలపై స్వయంగా వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండటంతో పోలీసులు బెట్టింగ్ను సీరియస్గా తీసుకుని తనిఖీలు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్కు పాల్పడే అలవాటున్న బెట్టింగ్ రాయుళ్లందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్థులను పిలిపించి, క్రికెట్ బెట్టింగ్ ఎక్కడా నిర్వహించరాదని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే పోరుమామిళ్ల కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోందని, ఇదంతా బీటెక్ రవి కనుసన్నల్లోనే నడుస్తోందని బయటపడినట్లు సమాచారం. ఆ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కిడ్నాప్ అంటూ హైడ్రామా.... పోలీసులు క్రికెట్ బెట్టింగ్లో బీటెక్ రవిని అదుపులోకి తీసుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి.. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంతే!! వాస్తవాలు ఏమాత్రం తెలుసుకోకుండా ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుగా ఎల్లో మీడియా కిడ్నాప్ కలకలం అంటూ కాసేపు ఊదరగొట్టింది. చివరకు పోలీసులు అరెస్టును ధ్రువీకరించటంతో ఈ గాసిప్లకు తెరపడింది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు!
అనకాపల్లిటౌన్: క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయిన విద్యార్థి పి.మధు ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ అంజిబాబు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలివి. మండలంలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన పి.మధు క్రికెట్ బెట్టింగ్లో నష్టం వచ్చిందని ఆవేదన చెందుతూ ఈనెల 23వ తేదీన గ్రామ సమీపంలో పొలాల్లో గులుకులు సేవించాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. (టీడీపీ నేత వినోద్కుమార్ జైన్కు జీవితకాల జైలుశిక్ష) -
అశోక్రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్కు బానిసై క్రికెట్ మొదలు హార్స్రైడింగ్వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్లోకి ప్రవేశించాడు. నాగోల్లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్పల్లిలోని భక్తినగర్కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్ను కలెక్షన్ ఏజెంట్గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది. చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా! ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంపముంచిన అత్యాశ పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్లైన్లో వన్ ఎక్స్బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బును సైతం బెట్టింగ్లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు. దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..
బెంగళూరు: పుట్టించి నుంచి డబ్బు తేవాలని వేధిస్తూ భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. హాసన్ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్ బెంగళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రూ.80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్ బెట్టింగ్కు బానిసైన అతడు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. పుట్టింటికెళ్లి డబ్బు తేవాలని భార్య తేజస్వినిని వేధించేవాడు. పెద్ద మనుషులు అనేకసార్లు రాజీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇక బెంగళూరులో జీవించలేని మంజునాథ్ సంసారాన్ని హాసన్కు మార్చాడు. అక్కడ తేజస్విని చిన్న ఉద్యోగానికి వెళ్లేది. ఆమెను అనుమానిస్తూ వేధించేవాడు. చివరకు సోమవారం ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను అరెస్ట్ చేశారు. చదవండి: (షట్టర్ పగలగొట్టి.. గ్యాస్ కట్టర్తో లాకర్ తెరిచి..) -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్
అనపర్తి: యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న ఐదుగురిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి (సత్య) ఇంట్లోనే నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్లకు ఆయనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అనపర్తి సీఐ జె.వి.రమణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అనపర్తి మండలం రామవరంలో ఓ ముఠా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ సత్య, మరో నలుగురు యువకులు ఐపీఎల్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. సత్యతో పాటు తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంతరెడ్డి, కర్రి వీరవెంకటసత్యనారాయణరెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డిలను అరెస్టు చేసి.. రూ.2.50 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ, బెట్టింగ్ లావాదేవీలు, బెట్టింగ్ ఆడుతున్నవారి వివరాలతో ఉన్న పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్య ఆధ్వర్యంలోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన బుకీలు, పంటర్లు ఎవరనే దానిపై లోతైన విచారణ నిర్వహించి, దీంతో సంబంధమున్న వారందర్నీ అరెస్ట్ చేస్తామని సీఐ వెల్లడించారు. -
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్పై అమిత్ను పోలీసులు హైదరాబాద్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
‘స్మార్ట్’ బెట్టింగ్.. ఐపీఎల్ మ్యాచ్లపై పందేల జోరు
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్ మ్యాచ్లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్, ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్కు దిగుతున్నారు. దీనికితోడు సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. ♦మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ యాప్ బెట్టింగ్ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ♦పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు ♦కుప్పంలో ఓ ఆటోడ్రైవర్ క్రికెట్ బెట్టింగుల్లో ఓడి తనకు జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ♦కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ♦జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్కు తెరతీశాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిడెన్ యాప్లే కీలకం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్ మోడ్లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్హౌస్లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్ రాజా కాయ్ అంటున్నట్టు తెలుస్తోంది. కోడ్లతో లావాదేవీలు ఐపీఎల్ మ్యాచ్లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్ , ఓడిన జట్టును ఈటింగ్ , రూ.వెయ్యిని ఫింగర్ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్ అని పిలుస్తుంటారు. ఫోన్ పే, గూగు ల్ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. కర్ణాటక ముఠాలదే హవా కర్ణాటకలోని శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్కు ముందు బెట్టింగ్ రేట్ నిర్ణయించి ఆన్లైన్లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు. పలమనేరులో పందేల జోరు పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్కు అడ్డాలుగా మారినట్లు సమాచారం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం పలమనేరు సబ్డివిజన్పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రతి మ్యాచ్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. బెట్టింగ్లకు బానిసగా మారాడు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్ ఉదయ్ కుమార్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన లైన్లను తీసుకునేవాడు. మన్సూరాబాద్లోని చండీశ్వర్ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్ను సబ్– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్ లోటస్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ సెటప్ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్ దాడులు చేసి మెయిన్ ఆర్గనైజర్ దేవినేని చక్రవర్తి, సబ్ బుకీ హరీష్లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్రెడ్డి సురేశ్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ ఆసిఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్ ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు. (చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్ వీడియో) -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
భారత్లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో స్పోర్ట్స్ బెట్టింగ్ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్పై భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా మనీశ్ పాండే..? -
భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్లైన్లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్బుక్లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా ప్రారంభించాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్లైన్లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్కు ముంబై కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అభయ్తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు. చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే.. లాభాల పంపకంలో ఉండగా.. 2019లో బెట్టింగ్ నేరంపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్లైన్లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్స్టేషన్లో రెండు, హనుమకొండ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్ ఇంటికి రాగా, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా.. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్కుమార్, వెంకటసుదర్శన్రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్రావు వివరించారు. -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్దేవ్పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్ బోర్డ్లు, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు. పరారీలో ఉన్న మెయిన్ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్ సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) డీసీపీ సందీప్లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. విజయవాడకు చెందిన మెయిన్ బూకీ మహా నుంచి లీడ్స్ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్కు చెందిన గోదవర్తి వెంకటేష్ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్ మ్యాచ్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్(35), దుర్గాప్రసాద్ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్ కుమార్ (27), అట్లూరి రంజిత్ కుమార్(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్(25), భద్రాచలం గౌరిదేవిపేట్కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్(39), మైలార్దేవ్పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్కు చెందిన బొప్ప వెంకటేష్ (30), గన్ని కల్యాణ్ కుమార్ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్, కేపీహెచ్బీకి చెందిన పవన్ అలియాస్ ప్రవీణ్, రాయచూర్కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఫోటోలు
-
క్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. తీర్చేందుకు వేరే దారి లేక..
సాక్షి, బంజారాహిల్స్ ( హైదరాబద్): అప్పులు తీర్చేందుకు చోరీకి పాల్పడ్డ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన జన్నా రమేష్ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్మికనగర్లో నివాసం ఉంటున్నాడు. టైల్స్ వర్క్ చేస్తున్న రమేష్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటుపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అప్పులు చేసి బెట్టింగ్లు కట్టాడు. వాటిని తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో ఈ నెల 15న రెహ్మత్నగర్లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి ఆంజనేయులు ఇంట్లో చొరబడి అల్మారాలోంచి రూ.25,500 నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఆంజనేయులు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం జన్నా రమేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఖాకీ అసాంఘిక దోస్తీ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్స్టేషన్కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల కేంద్రంగా.. నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్లే కాకుండా స్పోర్ట్స్ చానెల్లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు. బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు.. క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పేకాట క్లబ్ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్కుమార్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
PSL: క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్..
మేడ్చల్(హైదరాబాద్) : బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ఈ ముఠా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ బెట్టింగ్ను కొత్త తరహాలో చేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్తో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయని అన్నారు. కాగా ఈ ముఠా నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. చదవండి: ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్లపై వీరు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. తప్పుడు రేటింగ్లు చెబుతూ.. పాకిస్తాన్ సూపర్లీగ్ టీ–20 మ్యాచ్లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్కు బదులు తప్పుడు రేటింగ్లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్కు ఇంజనీరింగ్ విద్యార్థి బలి
సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన కుప్పంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పానికి చెందిన కిరణ్ అనే విద్యార్థి కేఈసీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కిరణ్కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనంగా మారింది. దీంతో లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి పోగొట్టుకుని, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. చనిపోయే ముందు ఇన్స్టాగ్రామ్లో ‘ఎవ్వరూ బెట్టింగులు పెట్టి మోసపోవద్దు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి : కిలేడీ.. మేకప్ వేసుకుంటే కనుక్కోలేం!.. దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను.. -
సీఐ జగదీశ్ కేసు: రోజుకో విషయం వెలుగులోకి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో సీఐ జగదీశ్ టచ్లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, జగదీశ్కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్కు సంబందించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. చదవండి: (బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
కట్టలు కట్టలుగా డబ్బు..
సాక్షి, నిజామాబాద్ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కామారెడ్డి సీఐ జగదీశ్కు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్కి సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి.. 34,40,000 రూపాయల నగదుతో పాటు 9 లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను సీజ్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావుతెలిపారు. సస్పెండైన సీఐ జగదీశ్కు సంబంధించి అక్రమాస్తులను గుర్తించే పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున జగదీష్ భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) -
కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. మధ్యవర్తి సుజయ్ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. -
విషాదం నింపిన క్రికెట్ బెట్టింగ్
సాక్షి, గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని బెల్లంకొండలో విషాదాన్ని నింపింది. బెట్టింగ్ నిర్వహించి అప్పులపాలవ్వడంతో ఇద్దరు యువకుల ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్, కొమరయ్య పురుగుల మందు సేవించగా.. తొలుత 10న సురేష్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతి చెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. సెల్ఫీ వీడియోతో!) అయితే గ్రామస్థుల సమాచార ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ డబ్బులు కట్టాలంటూ బుకీ ఒత్తిడి తెవడంతోనే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. -
గుంటూరు: బలికోరిన క్రికెట్ బెట్టింగ్
-
అమ్మా, నాన్నా.. మేం పోతున్నాం
సాక్షి, గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: గోల్మాల్ గేమ్! అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్డౌన్తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్రెడ్డి, కరీంనగర్ సీపీ -
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ యువత పెడదోవ పడుతోందన్నారు. బెట్టింగులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్ధుల కదలికలపై జాగ్రత్త వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక అంతర్జాతీయ రాకెట్ ప్రమేయం ఉందని ఇప్పటివరకు 151 మంది అరెస్ట్ చేసి 8,34,320 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టును రట్టుచేశారు. ఈ కేసులో ఇద్దరు దుండగులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్లోనూ ఐపీఎల్ బెట్టింగ్లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్పేట్కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్లకు పాల్పడుతున్నాడని టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం) -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
సాక్షి, అల్వాల్: ఐపీఎల్పై బెట్టింగ్ రాయుళ్లు జోరు ఓ వైపు కొనసాగుతుంటే.. మరో వైపు వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్లో నిన్న జరిగిన హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ లో భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ బాలనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. భూదేవి నగర్లోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని ఎస్ఓటీ పోలీసులు అల్వాల్ పోలీసులకు అప్పగించారు. -
డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చౌటుప్పల్కు చెందిన బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్ రెడ్డితో కలిసి బీఎన్ రెడ్డి హిల్స్లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్కు చెందిన రవి అలియాస్ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్రెడ్డి ఇంట్లో హౌస్కీపింగ్ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్లోని సర్వెంట్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. పప్పులో కలిపి.. సోమవారం రాత్రి డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్రెడ్డి బాత్రూంలో పడిపోయారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్ క్వార్టర్ వద్ద ఓ లాకర్ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయాన్ తేరుకుని.. మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు. ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు. వారు బయటికొచ్చి సమీపంలోని సైట్ వద్ద ఉన్న వాచ్మన్ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. మధుసూదన్ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు ఏడుగురు.. పక్కా ప్లాన్నే నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు. చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్లెట్ల పౌడర్ కలిపి ఉండొచ్చు.. నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్.. కూర, గ్రీన్ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ నంబర్ల లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్పేట్ పీఎస్ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముమైత్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు పంజగుట్ట: సినీ నటి మొమైత్ ఖాన్ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్ ఖాన్ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్స్పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాప్తో బెట్టింగ్స్ ఈ త్రయం బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యాప్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ క్రికెట్ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడిన బెట్టింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ ఆన్లైన్ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్లైన్లోనే బెట్టింగ్ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలను ఆ యాప్ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులుగా గోవాలో మకాం నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్వేర్, యాప్లతో కూడిన సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్కు చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్ సోమయ్య చౌదరి అలియాస్ అక్కినేని కార్తీక్ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు. లగ్జరీ హోటల్స్లో మకాం.. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్ హౌస్లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను కొట్టేసేవాడు. సొంతూరికెళ్లి జల్సాలు తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇతని నేరాలపై మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. టెక్నికల్ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుధీర్తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. సెల్ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్కు చెక్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్గా చేసుకుని సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్పుర పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్ఫోన్ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్ను వీరు నేరుగా ప్రశాంత్కు అప్పగిస్తారు. అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు. -
అవతార్ యాప్తో క్రికెట్ బెట్టింగ్
సాక్షి, కృష్ణా: బెజవాడ నగరం కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఆన్లైన్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్పై భారీగా బెట్టింగ్లు నిర్వహించిన ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన సెటప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నరని, ఈ మూఠా తూర్పు గోదావరి జిల్లా చెందిందిగా పోలీసులు వెల్లడించారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందిందని తెలిపారు. దీంతో అక్కడికి చేరుకొని బెట్టింగ్ సామాగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని వెల్లడించారు. బాగా తెలిసిన వాళ్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ కాస్తున్నారని చెప్పారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఇక ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి నవీన్ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్పై సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్లకు ఆకర్షితులు కావద్దని విజ్ఞప్తి చేశారు. -
కాయ్ రాజా కాయ్.. భారీగా బెట్టింగ్లకు పావులు
అసలే కరోనాకాలం. అందరి పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయాయి. ఇదే సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరు దారులు వెతుకుతున్నారు. ఇలాంటివారికి ఐపీఎల్ సీజన్ కలిసొచ్చింది. ఇంకేముంది టీవీ ఆన్ చేయడం.. బంతి బంతికీ బెట్టింగ్ కట్టడం, ఫోన్లలోనే లావాదేవీలు జరపడం ఇట్టే జరిగిపోతోంది. బెట్టింగుల సంస్కృతిని కట్టడిచేయడానికి పోలీసులు సైతం రహస్యంగా నిఘా ఉంచడం విశేషం. చిత్తూరు అర్బన్: ఐపీఎల్.. పరిచయం అక్కర్లేనిపేరు. క్రికెట్ గురించి తెలియనివాళ్లు కూడా ఐపీఎల్ ఉన్న మజాను ఆస్వాదిస్తారు. ఎప్పుడో వేసవిలో జరగాల్సిన మ్యాచ్లు కరోనా కారణంగా వాయిదాపడుతూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, ఛీర్ గర్ల్స్ కనిపించకున్నా.. ప్రతి మ్యాచ్లో బెట్టింగులు నిర్వహించడానికి మాత్రం కొన్ని ముఠాలు సిద్ధమైపోయాయి. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సెల్ఫోన్లలో బేరాలు నడుస్తుంటాయి. ఈ సీజన్లో జిల్లా నుంచి రోజుకు రూ.30 కోట్లు బెట్టింగులు జర గొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ బెట్టింగ్ వ్యవహారాన్ని పసిగట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. వాటి మూలాల్లోకి వెళ్లి చట్టరీత్యా ఆటకట్టిస్తామంటుని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బంతి బంతికో లెక్క పొట్టి క్రికెట్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందూలోనూ స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా కలిసి జట్లుగా ఆడేసే ఐపీఎల్పై ప్రతీ ఏటా జిల్లాలో పెద్ద మొత్తంలో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రతీ ఓవర్లో వేసే బంతి బంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. అన్నీ కూడా సెల్ఫోన్లలోనే జరుగుతుంటాయి. ఇదివరకులాగా ఫోన్లు చేసి బేరసారాలు చేయకుండా.. వాట్సాప్కాల్స్, మెసెంజర్ కాల్స్, వాయిస్ మెసేజ్ల రూపంలో బెట్టింగులు పెడుతున్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన జాడ్యం జిల్లాలోని పల్లెలకు పాకిపోయింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె లాంటి ఓ మోస్తరు ప్రాంతాల నుంచి కుప్పం, పలమనేరు, బి.కొత్తకోట లాంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. పుట్టగొడుగుల్లా బుకీలు ఐపీఎల్ మ్యాచ్ల్లో బెట్టింగులుచేసే వాళ్లు ఎవరికివాళ్లు బుకీలు, సబ్ బుకీల అవతారం ఎత్తుతున్నారు. ఎదుటివ్యక్తి బలహీనత, అత్యాశే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారు. తమ ప్రధాన కేంద్రం బెంగళూరు, చెన్నైలో ఉందని చెబుతూ.. గెలిచిన డబ్బుకు ఎలాంటి ఢోకాలేదని హామీలు ఇస్తున్నారు. పందెంకాచే డబ్బును ఇపుడంతా డిజిటల్ మనీ యాప్స్ ద్వారా మొబైల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గెలిచినవాళ్లకు సైతం ఇదే పద్ధతిలో నగదు ముట్టజెబుతున్నారు. ఈ గోతిలో ఎక్కువగా చదువుకున్న విద్యావంతులు చిక్కుకుంటుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ సమయంలో కష్టం లేకుండా ఎక్కువ సంపాధించాలనే అత్యాశాపరులు ఐపీఎల్ పందాలకోసం కాచుక్కూర్చున్నారు. గతంలో పట్టుబడ్డా.. గతంలో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగులపై పోలీసులు కన్నెర్రజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేసి, నగదు సీజ్ చేశారు. తిరుపతిలో ఓ వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చిత్తూరులో నాటి టీడీపీ యువ నాయకుడు క్రికెట్ పందెంలో అడ్డంగా దొరికిపోయినా, ఓ కార్పొరేటర్ ప్రమేయం ఉందని సాక్ష్యాలు లభించినా ప్ర త్యేక పోలీసుల సాయంతో తప్పించుకున్నాడు. కు ప్పం నియోజకవర్గంలో ఓ సర్పంచ్ వద్ద 12 సెల్ఫోన్లతోపాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. నాలుగేళ్లలో జిల్లాలో బెట్టింగ్ కేసులు మొత్తం కేసులు -15 అరెస్టయిన వ్యక్తులు -75 పట్టుబడిన నగదు - రూ.6.06 లక్షలు -
ఐపీఎల్ షురూ: పోలీసుల చేతిలో బుకీల చిట్టా
ప్రొద్దుటూరు క్రైం: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్–2020 సీజన్ రానే వచ్చింది. చిన్నా..పెద్దా ఎవరి నోట విన్నా ఐపీఎల్ మ్యాచ్ గురించే. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారికి.. ఐపీఎల్ మస్త్ కాలక్షేపాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. క్రికెట్ అభిమానులకు ఇక 53 రోజుల పాటు పండగే అని చెప్పవచ్చు. దుబాయ్ వేదికగా శనివారం ముంబై ఇండియన్– చెన్నై సూపర్కింగ్ జట్ల మ్యాచ్లతో క్రికెట్ సమరం గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు పోటీలు జరగనున్నాయి. అయితే క్రీడా స్ఫూర్తిని పొందాల్సిన యువత.. జూదంగా చూస్తోంది. ఈ పరిణామం బుకీలకు కాసుల పంటగా మారింది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు పందెం రాయుళ్లు తోకముడిచారు. ఇప్పుడు మళ్లీ వారి ఆశలకు రెక్కలొచ్చినట్లు అయింది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, దువ్వూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటితోపాటు అనేక ప్రాంతాల్లో క్రికెట్ పందాలు జోరుగా నిర్వహిస్తారు. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం పల్లెలకు పాకింది. ఫ్యాన్సీ పందాలే ఎక్కువ గతంలో గెలుపోటములపై మాత్రమే పందెం కాసేవారు. కానీ ప్రస్తుతం టాస్ వేసినప్పటి నుంచి బంతి బంతికి కడుతున్నారు. బుకీలు వారి పరిభాషలో దీన్ని ఫ్యాన్సీ బెట్టింగ్ అని పిలుచుకుంటారు. ఫ్యాన్సీ బెట్టింగ్ నిర్వహించే వారు క్రికెట్ మ్యాచ్లో ప్రతి బాల్ను చూడాల్సి వస్తుంది. ప్రతి ఓవర్లో కొట్టే సిక్స్లు, ఫోర్లపై బెట్టింగ్ హోరు కొనసాగుతుంది. బ్యాట్స్మన్ కొట్టే పరుగులపై కూడా పందెం కాస్తారు. ప్రారంభ ఓవర్ నుంచి చివరి వరకు మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతుంది. పందెం కాసిన జట్టు పరుగులు కొడుతున్న సేపు ఫంటర్ల (పందెం కాసేవాళ్లు)లో ఆశలు చిగురిస్తుంటాయి. అయితే టప టపా వికెట్లు పడితే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ కొందరు ఫంటర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి. బెట్టింగ్లో యువత, విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్లో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్ మనీతో రహస్యంగా బెట్టింగ్ ఆడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చొని సెల్ఫోన్ ద్వారా డబ్బు పెడుతున్నారు. తమ పిల్లలు క్రికెట్ పందాలు ఆడే విషయం తల్లిదండ్రులకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో.. తమ పిల్లలు బాకీ పడ్డ డబ్బును వారు తీర్చేస్తున్నారు. యువకులు, విద్యార్థులను కొందరు బుకీలు కలెక్షన్ బాయ్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారికి బైక్తో పాటు రోజు వారి ఖర్చుకు డబ్బు, ఆకర్షణీయమైన జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కొరియర్లుగా, సబ్బుకీలుగా పని చేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న దందా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రికెట్ దందా గుట్టుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మ్యాచ్ల సమయాల్లో రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్లో అయితే మరింత ఎక్కువగా నడుస్తుంది. కష్టం లేకుండా అడ్డదారిలో, సులభంగా డబ్బు సంపాదించవచ్చని అనేక మంది బెట్టింగ్ ఫీవర్కు బలైపోతున్నారు. బెట్టింగ్కు పాల్పడిన వారి నుంచి బుకీలు వెంటపడి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేక కొందరైతే బైక్లు, బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది బుకీలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ దందా కొనసాగిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన షేఠ్లతో సంబంధాలు పెట్టుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకు చిక్కకుండా సాగిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువ మంది బెట్టింగ్ జూదం నిర్వహిస్తుండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కదలికలపై నిఘా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న బుకీల చిట్టా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. వారి కదలికలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు గతంలో కేసులు నమోదైన వారిని పిలిపించి బైండోవర్ చేస్తున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బెట్టింగ్ ఊబిలో పడి అనేక కుటుంబాలు చితికి పోతున్నాయి. పోలీసులు గట్టి చర్యలు తీసుకొని అలాంటి వారిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు గొడవ
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్: క్రికెట్ బెట్టింగ్ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. -
ఖాకీలకు చిక్కని బుకీలు
సాక్షి, ఒంగోలు: సప్త వ్యసనాల్లో లేని కొత్త వ్యసనం ఒకటి దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంత యువతను పెడదోవ పట్టిస్తూ పీల్చిపిప్పి చేస్తోంది. ఆ వ్యసనం పేరే క్రికెట్ బెట్టింగ్. గత 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ బెట్టింగ్ వ్యసనం మొదట్లో ఇండియా జట్టు ఆడే మ్యాచ్లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ఆడేది వన్డే, టెస్ట్మ్యాచ్ అనే బేధం లేకుండా, ఆడేది మన జట్టా, విదేశీ జట్లా అనేది చూసుకోకుండా బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. టి–20 మ్యాచ్లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం బాగా ఊపందుకుంది. దీనికితోడు ఐపీఎల్ అంటూ ఒక సీజన్లో వరుసగా 90 నుంచి 100 మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ జాఢ్యం మరింత ముదిరి పాకాన పడినట్లయింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే బుకీలు ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఏజంట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ వ్యసనాన్ని దేశవ్యాప్తం చేశారు. విచారణలో జాప్యం.. అజ్ఞాతంలోకి కీలక బుకీలు.. ఒంగోలు నగరంలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సుమారు 15 రోజుల క్రితం పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో రెండు విభాగాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. అయితే పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల విచారణ ముందుకు సాగలేదు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కేసును సీసీఎస్కు బదిలీ చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. విచారణలో జరిగిన జాప్యం వల్ల కీలక బుకీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బెట్టింగ్ ముఠా దొరగ్గానే వారి నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ఉంటే కీలక బుకీలు దొరికే అవకాశం ఉండేది. ఇప్పటికైనా పోలీసులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న కీలక బుకీలను పట్టి అత్యాశతో జీవితాలు కోల్పోతున్న యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు. కీలక బుకీలను పట్టలేక పోతున్నారు... ఎక్కడెక్కడో ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు సైతం తమ బెట్టింగ్ను విస్తరించి కోట్లు గడిస్తున్న బుకీలను పోలీసు వ్యవస్థ ఏమి చేయలేకపోవడం శోచనీయం. ఆన్లైన్ ద్వారా అనేక మంది ఏజంట్లను పెట్టుకొని దేశవ్యాప్తంగా తమ బెట్టింగ్ దందాను నడుపుతున్న బుకీలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు బుకీల నుంచి మామూళ్లు తీసుకుంటూ బెట్టింగ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్కు పాల్పడే బుకీల మూలాలను కనిపెట్టి ఆటకట్టించాల్సిన పోలీసులు లాడ్జిలు, హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లలో చిన్న చిన్న బెట్టింగ్లు నిర్వహించే యువకులను అదుపులోకి తీసుకొని వారిపై తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్ నిర్వహించే ఏజంట్లను అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారు ఎవరి వద్ద నుంచి లైన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారో కనుగొని తద్వారా తీగలాగుతూ డొంకను కదిలించాల్సిన పోలీసు అధికారులు మాకేం పట్టిందిలే అనుకుంటూ దొరికిన వారిపై చోటా మోటా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పోలీసు, ఇంటిలిజెన్స్ రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించి బెట్టింగ్ మహమ్మారిని కూకటి వేళ్ళతో పెకిలించకపోతే ఎందరో యువకులు బలి కావడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలకూ పాకిన జాఢ్యం.. మొదట్లో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో, ఈ వ్యసనానికి బానిసలైన యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే బుకీల వద్ద నుంచి వారి ఏజంట్లు, క్రికెట్ బెట్టింగ్లాడే యువత వరకు వీరందరిలో క్రికెట్ అంటే తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. క్రికెట్ బెట్టింగ్లు ఆడేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా ప్రైవేట్ కంపెనీలు, చిన్నచిన్న షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తున్న యువకులు, విద్యార్థులు, చివరకు పొలం పనులు చేసుకునే యువ రైతులు సైతం ఈ బెట్టింగ్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నుంచి క్రికెట్ బుకీలు ఆన్లైన్లో బెట్టింగ్లు నిర్వహిస్తూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతను ఆకర్షిస్తూ బెట్టింగ్ మహమ్మారిని విస్తరిస్తున్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారికి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు బెట్టింగ్ల్లో సర్వం కోల్పొయి ఉన్న అప్పులు చెల్లించలేక ఊరు వదిలి పరారై అజ్ఞాతంలో జీవనం సాగిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
క్రికెట్ బెట్టింగ్తో.. బ్యాంక్కు క్యాషియర్ కన్నం
సాక్షి, కోవూరు: ‘అతను బ్యాంక్లో క్యాషియర్. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో పనిచేస్తున్న బ్యాంక్కే కన్నం వేశాడు. ఈ వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. వివరాలను బుధవారం కోవూరు సీఐ జీఎల్ శ్రీనివాసులు స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. మండల కేంద్రమైన అల్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దోసరి నాగబాబు సుమారు మూడేళ్లుగా క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. అతడికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. పెద్ద మొత్తంలో నగదు పోయింది. ఈక్రమంలో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంక్కే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ నాగబాబు, కస్టోడియన్ మునిస్వామిలు సాయంత్రం లెక్క చూసి లాకర్లో డబ్బు పెట్టాలి. లాకర్ నుంచే నగదు చోరీ చేయాలని భావించిన నాగబాబు మునిస్వామిని నమ్మించడం ప్రారంభించాడు. నగదు పెట్టే సమయంలో కస్టోడియన్ను ఏమార్చి లెక్క మొత్తం సరిపోయిందని చెప్పేవాడు. అదే సమయంలో కొంత నగదు, బంగారు ఆభరణాలు తీసి బ్యాంక్లో దాచిపెట్టేవాడు. ఈవిధంగా కొద్దిరోజులపాటు జరిగింది. ఈనెల 16వ తేదీన కస్టోడియన్ బ్యాంక్కు వెళ్లి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు చూడగా తేడా వచ్చింది. ఈక్రమంలో మేనేజర్ రవించంద్రకు చెప్పాడు. వారు సీసీ టీవీ ఫుటేజీ చూశారు. అందులో నాగబాబు పలుమార్లు నగదు, ఆభరణాలు తీసుకెళ్లినట్లుగా రికార్డైంది. దీంతో మేనేజర్ అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రఘునాథ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగబాబు కస్టోడియన్ను ఏమార్చి రూ.5.40 లక్షలు, కొంత బంగారు ఆభరణాలు (మొత్తం కలిపి రూ.6.32 లక్షలు) చోరీ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం నిందితుడు నాగబాబు అల్లూరు పాత బస్టాండ్ సెంటర్లో ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇందులో కస్టోడియన్ పాత్ర లేదని, అతడిని నమ్మించి నాగబాబు నగదు, ఆభరణాలు అపహరించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బంది యానాదయ్య, మురళి, వేణు, గౌస్బాషా, తిరుపతిస్వామి, దశరథ్, చంద్రలను సీఐ అభినందించారు. కేసును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, కేవీ రాఘవారెడ్డి పర్యవేక్షణలో ఛేదించామన్నారు. -
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు : పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాకమూరి మారుతి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేవాడు. కోడెల శివరామ్ అండదండలతో యథేచ్ఛగా తన అనుచరులతో బెట్టింగ్ నిర్వహింపచేయడం, సమయానికి డబ్బులు ఇవ్వని వారిపై గూండాలతో దాడులు చేయటం వంటి చర్యలకు పాల్పడేవాడు. మాజీ స్పీకర్ కోడెల అండ పుష్కలంగా ఉండటంతో స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. రెండేళ్ల క్రితం రూరల్ ఎస్పీగా పనిచేసిన వెంకటప్పలనాయుడు మారుతి, అతని అనుచరులను అరెస్ట్ కేసు నమోదు చేశారు. విచారణలో మారుతికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అతడి వద్ద పందేలు ఆడి నష్టపోయిన బాధితులు గత నెలరోజుల క్రితం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వలపన్ని బీసీ కాలనీలో ఓ గృహంలో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా దాడులు చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన మారుతి పరారీ అవగా, అతని అనుచరులు ఖాజా, నాగూర్లను అరెస్ట్ చేశారు. -
కాయ్ రాజా కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్కు ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్రాయుళ్లల్లోనూ జోష్ పెంచింది. ఈ క్రేజ్కు క్యాష్ చేసుకోవడానికి బుకీలు కొత్త ‘అవతారాల్లో’ రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి చెక్ చెప్పడానికి నిఘా ముమ్మరం చేశారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, కదలికలనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన అనేక మంది బుకీలు ఇటీవల తమ పంథా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు వీరంతా నగరంలోనే ఉండి నేరుగా పందేలు కాసేవాళ్లతో (పంటర్లు) సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇలా చేయడంతో పోలీసులు దాడి చేసినప్పుడు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో కొందరు కీలక బుకీలు ఇటీవల కాలంలో తమ పంథా మార్చారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో వాళ్లు మకాం వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్తో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బెట్టింగ్స్ను పర్యవేక్షిస్తున్నారు. వీరివద్ద పందేలు కాసే పంటర్లు సుపరిచితులే. దీంతో ఫోన్ల ద్వారా పందేలను అంగీకరిస్తున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు మాత్రమే నగరంలో ఉంటూ ప్రధాన బుకీలకు సహకరిస్తుంటారు. పోలీసులకు వీళ్లు చిక్కుతున్నా అనేక సందర్భాల్లో సూత్రధారులు పట్టుబడట్లేదు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ముందస్తు పందాల కంటే ఇటీవల కాలంలో లైవ్ బెట్టింగ్లు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుందని, ఇన్ని పరుగులు చేస్తుందని, ఓడిపోయే జట్టు ఇన్ని పరుగులకే కట్టడి అవుతుందని.. ఈ పంథాలో జరిగేవి ముందస్తు పందేల కిందికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రేషియో ఆధారంగా బంతి బంతికీ జరిగే పందేలను లైవ్ బెట్టింగ్లుగా పరిగణిస్తుంటారు. యాప్స్ ఆధారంగా బెట్టింగ్ దందా నిర్వహించే బుకీలు ఈ తరహాకే ఎక్కువ ప్రాధాన్యమస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నగరంలో బెట్టింగ్ నిర్వహణకు, ఏజెంట్ల కదలికలను ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ప్రస్తుత క్రికెట్ వరల్డ్కప్ నేపథ్యంలో యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్న బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి న్యూకాలనీలోని క్లాసిక్ మెడికల్ ఏజెన్సీపై నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పక్కా సమాచారంతో దాడి చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 9 మందిని అరెస్టు చేశారు. మిగతావారు పరారయ్యారు. వీరి నుంచి రూ.5,91,360 నగదు, 9 సెల్ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు, ఒక చెక్ బుక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యవహారంలో బుగత దేవీప్రసాద్, పెల్లూరి రాజేష్, పళ్లా గణేష్, మరడాన సురేష్కుమార్, అల్లు ఉమామహేశ్వరరావు, పెళ్లూరి విజయ, బుడ్డి గురునాథరావు, శిమ్మ భాస్కరరావు, కడిమి ఉమామహేష్, సర్వేశ్వరరావులను అరెస్టు చేసినట్లు వివరించారు. నాగరాజు, అప్పన్న, రవిశంకర్, రాజేష్, వెంకటరమణ, రామినాయుడు, బరంపురం శ్రీను, మయూరి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో జూదం, బెట్టింగ్, బైక్ రేసింగ్, గంజాయి తదితర మాదకద్రవ్యాల విక్రయం వంటి అనైతిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరం, రాజాం పట్టణ క్లబ్ల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా దృష్టి పెట్టామన్నారు. ఇటీవల జాతీయ రహదారిపై రాత్రిళ్లు బైక్ రేసింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా నిఘా పెట్టి అరెస్టు చేస్తామన్నారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున పట్టుకున్నామని, ఎవరికైనా మాదకద్రవ్యాల విషయంలో సమాచారం ఉంటే తెలియజేయాలన్నారు. బెట్టింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఏఎస్ చక్రవర్తి, పీవీ కృష్ణవర్మ, ఎస్ శంకరరావు, ఎం పారినాయుడు, కే ముకుందరావు, వై ప్రసాదరావు, ఎల్ జగన్మోహనరావు, వీ మోహనరావు, బీ సత్యనారాయణ, ఈ రామకృష్ణ, పీ శివ, ఎస్ ఉషాకిరణ్లను అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మంగరాజు, డీఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు. -
బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
సుల్తాన్బజార్: వేర్వేరు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్బజార్, ఆప్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్కు చెందిన దినేశ్ వరల్డ్ కప్ సిరీస్ మ్యాచ్లకు గాను బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. నగరంలో సైతం పంటర్లను ఆకర్శిస్తూ వారి నుంచి తెలిసిన వారితో డబ్బులు వసూల చేయిస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన రవినారాయణ్ రామ్కోఠిలోని సుమతి రెసిడెన్సీలో ఉంటూ దినేశ్ వద్ద కమీషన్ తీసుకుంటూ పంటర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. జవార్ వేణుగోపాల్ అలియాస్ ఆంథోని అనే వ్యక్తి వీరి వద్ద పందాలు కాసేవాడు. బెట్టింగ్ ముఠాపై సమాచారం అందడంతో మంగళవారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరు బూకీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. జావార్ వేణుగోపాల్ వద్ద రూ. 1.31 లక్షల నగదు, ఒక టీవీ, రిమోట్లు, సెటప్బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. వేణుగోపాల్పై గేమింగ్ యాక్ట్ సెక్షన్లకు కింద మంగళ్హాట్, నల్లకుంట, ఆప్జల్గంజ్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. రవినారాయణ్ నుంచి రూ. 21 వేల నగదు, ఓ సెల్ఫోన్, ఒక టీవి, సెట్అప్బాక్స్, రిమోట్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్బజార్, ఆప్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ జగద్గిరిగుట్ట: బాచుపల్లిలో పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టు రట్టు చేశారు.. కౌసా ల్య కాలనీలోని టిఅండ్పాన్ షాపులో అదే కాలనీ కి చెందిన భూపతి రాజు కిశోర్, శ్రీనివాస్రావు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్లే స్టోర్ నుంచి క్రికెట్ లైవ్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ నుంచి లైవ్ మ్యాచ్ చూస్తూ మ్యాచ్కు కొంత నగదు చొప్పున (వేలల్లో) బెట్టింగ్కు పాల్పడ్డారు. భూపతి రాజు బూకీగా ఉంటూ శ్రీనివాస్రావు హంటర్గా వరల్డ్ కప్ ప్రారంభం నుంచి రేటింగ్ను బట్టి బెట్టింగ్కు పాల్పడ్డారు.మంగళవారం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడం తో దాడి చేసిన బాచుపల్లి పోలీసులు నిందితుల ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.73 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బుకీ ఫారెన్లో... పంటర్లు సిటీలో!
సాక్షి, సిటీబ్యూరో/ సనత్ నగర్: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహణలో ఇదో హైటెక్ పంథా... పోలీసు నిఘాకు చిక్కకుండా ఆద్యంతం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు... విజిట్ వీసాపై వెళ్ళి అమెరికాలో తిష్టవేశాడు ప్రధాన బుకీ... పందేల కోసమే ప్రత్యేకంగా యాప్ను తయారు చేయించాడు. సబ్–బుకీలకు గోవాలో సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశాడు. వీళ్ళు దళారుల సాయంతో నగరంలోని పందెంరాయుళ్ళ (పంటర్లు) ద్వారా దందా నడిపిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో మొదలై, వరల్డ్ కప్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ వ్యవహారం గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ.8 లక్షల నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వెల్లడించారు. అమెరికాను అడ్డాగా చేసుకుని... నగరంలోని సింధికాలనీ ప్రాంతానికి చెందిన బర్కత్ లలానీ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు దానికి అవసరమైన ఖర్చుల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి క్రికెట్ బెట్టింగ్స్పై పడింది. హైదరాబాద్ కేంద్రంగా కొన్నాళ్ళు నిర్వహించినప్పటికీ ఆపై పోలీసుల నిఘాకు భయపడ్డాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభంకావడానికి ముందే విజిట్ వీసాపై అమెరికా వెళ్ళాడు. అక్కడ ఉంటూనే బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేకంగా ‘మ్యాచ్బాక్స్9.కామ్’ పేరుతో యాప్ తయారు చేయించాడు. బెట్టింగ్స్ నిర్వహణకు అవసరమైన రికార్డులు, స్లిప్స్, పత్రాలు, మ్యాచ్ చూడటానికి టీవీ, రెష్యో తెలుసుకోవడానికి ఫోన్... ఇలా ఏదీ అవసరం లేకుండా కేవలం స్మార్ట్ఫోన్ ఆధారంగా అటు పంటర్లు, ఇటు బుకీ దందా నిర్వహించడానికి ఉపయుక్తంగా దీన్ని రూపొందించాడు. దీని అడ్మిన్గా అతడే ఉండి సకల లావాదేవీలు అనునిత్యం పరిశీలించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. డిపాజిట్ చేస్తేనే లింకు పంపేది... తనకు పరిచయస్తులైన దానిష్, సోహైల్, సాహిల్లను ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. మ్యాచ్లకు చెందిన సిరీస్ ప్రారంభంకావడానికి ముందు సింధికాలనీకి చెందిన ఈ ముగ్గురినీ గోవాకు పంపిస్తాడు. అక్కడ వీరికి సకలసౌకర్యాలతో బస ఏర్పాటు చేస్తాడు. బెట్టింగ్ యాప్నకు సంబంధించిన లింకు వీరి వద్ద మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురూ నగరానికి చెందిన మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరి, రాహుల్జైన్, వైభవ్ సాల్విలను సబ్–బుకీలుగా నియమించుకున్నారు. స్థానికంగా ఉన్న పంటర్లలో నమ్మకమైన వారిని గుర్తించే వీళ్ళు వారికి ఈ యాప్, బెట్టింగ్స్ దందాలను వివరిస్తారు. పంటర్లుగా మారడానికి ఆసక్తిచూపిన వారితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిపాజిట్గా గోవాలోని వారికి చెల్లించేలా చేస్తాడు. ఈ డబ్బు ముట్టిన వెంటనే వాళ్ళు యాప్నకు సంబంధించి లింకును వాట్సాప్ ద్వారా పంటర్లకు పంపిస్తారు. యాప్ ద్వారా పందేలు కాస్తూ డిపాజిట్ మొత్తం ఖాళీ అయ్యే వరకు వీళ్ళు పాలుపంచుకోవచ్చు. ఆపై మళ్ళీ డిపాజిట్ చేసి కొనసాగాల్సి ఉంటుంది. కొందరు పంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి జయానీ రూపానీ, నిజాం గిలానీలను కలెక్షన్ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. మూడు శాతం కమీషన్ తీసుకుంటూ... గోవాలో కూర్చున్న ముగ్గురూ ఈ యాప్కు సంబంధించిన లైన్ను నిర్వహిస్తూ బెట్టింగ్ రేష్యోలు తెలుసుకుని అప్డేట్ చేస్తుంటారు. ఈ పంథాలో బర్కత్ ఒక్కో మ్యాచ్కు గరిష్టంగా రూ.50 లక్షల వరకు టర్నోవర్ చేస్తున్నాడు. నగరంలో ఉన్న సబ్–బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు ఈ మొత్తంలో మూడు శాతం కమీషన్గా తీసుకుని మిగిలింది గోవాలోని వారికి పంపిస్తారు. వాళ్ళు తమకు రావాల్సింది మినహాయించుకుని మిగిలిన మొత్తం బర్కత్కు చేరవేస్తుంటారు. ఈ లావాదేవీలు అన్నీ హవాలా మార్గంలోనే నడిపిపోతున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతుండటంతో బర్కత్ జోరుగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్వర్మ, ఎన్.శ్రీశైలం,వి.నరేందర్, తర్ఖుద్దీన్లు సింధికాలనీలోని ఓ ప్రాంతంపై దాడి చేశారు. బర్కత్,డానష్, సోహైల్, సాహిల్ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును రామ్గోపాల్పేట పోలీసులకు అప్పగించారు. -
బెట్టింగ్ వేస్తే బ్యాటింగే!
సాక్షి, హైదరాబాద్: ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా హైదరాబాద్లో బుకీలు సిద్ధమైపోతారు.. ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందేలు కాస్తుంటారు. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏం జరిగినా పందెం రాయుళ్లు పడగ విప్పుతారు.. గెలుపోటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. తాజాగా రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలతో పాటు గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్ జరుగుతోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బుకీలపై (పందేలు అంగీకరించే వారు) మాత్రమే కాదు.. పంటర్లనూ (పందేలు కాసే వ్యక్తులు) నిందితులుగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టు బిగిస్తే.. బుకీలు, పంటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొత్తగా బుకీలుగా మారే వారు గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. తమ యజమానికి చెందిన కొందరు కస్టమర్లను తమ వైపునకు లాక్కొంటున్నారు. వీరిద్వారా పరిచయమైన వారినే కొత్త పంటర్లను కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారు కూడా ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. నోటీసుల జారీకి అవకాశం.. ఈ పందాలు కాసే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్కు బానిసలుగా మారారనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఆపై నేర నిరూపణకు అవసరమైన ఆధారాలు లభిస్తే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారి కుటుంబీకులకూ విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. ఇక్కడ దాడులు చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. పక్కాగా దొరుకుతున్న ఆధారాలు బెట్టింగ్ గ్యాంగ్స్ను టాస్క్ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, బెట్టింగ్ స్లిప్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు పంటర్ల రికార్డులూ గుర్తిస్తుంటారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్టాప్స్ విశ్లేషిస్తే మరికొందరు పంటర్ల పేర్లూ బయటికొస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. -
క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి
ఇబ్రహీంపట్నం రూరల్: క్రికెట్ బెట్టింగ్కు ఓ యువకుడు బలయ్యాడు. బెట్టింగ్లో ఓడిపోయి డబ్బులు చెల్లించలేనిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తుర్కయంజాల్ గ్రామానికి చెందిన పలుస దాసుగౌడ్ కుమారుడు అఖిల్గౌడ్(21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను వారంరోజులుగా కళాశాలకు వెళ్లి వచ్చి ఏకాంతంగా ఉంటున్నాడు. రెండురోజుల నుంచి అఖిల్గౌడ్ వద్ద ఉన్న ఫోన్ పోయింది. పోన్ ఎక్కడ పోయింది.. ఎవరికి ఇచ్చావని తండ్రి మందలించడంతో ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పాడు. మంగళవారం ఉదయం తండ్రి మరోమారు మందలించి ఫోన్ తీసుకురావాలని చెప్పాడు. దీంతో అఖిల్గౌడ్ ఇంట్లో మొదటి అంతస్తులో గల షట్టర్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కుమారుడి మృతికి గల కారణాలపై తండ్రి ఆరా తీయగా ఇటీవల అఖిల్గౌడ్ ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బు చెల్లించకపోవడంతో ఫోన్ లాక్కున్నారని అతని స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో మనస్తాపానికిగురై అత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన కుమారుడి మృతి పట్ల పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని దాసుగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై జోరుగా బెట్టింగ్ ఆడుతున్న 14 మందిని అనంతపురం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడుసెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను సీఐ యుగంధర్ వెల్లడించారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్లో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయయి. నగరంలోని సైఫుల్లా హిందూ శ్మశాన వాటిక సమీపంలో, హౌసింగ్బోర్డు కాలనీ శివారులోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. నవోదయ కాలనీకి చెందిన ఉద్దల కిష్టప్ప, రాప్తాడు మండల కేంద్రానికి చెందిన చిరుతల శివయ్య, నగరంలో గౌసల్వరావీధికి చెందిన తపాలా సర్దార్ అనే క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశామన్నారు. వీరితో పాటునగరంలో ఆముదాలవీధికి చెందిన పసుపులేటి సాయికుమార్, లక్ష్మీనగర్కు చెందిన అచల సల్మాన్ఖాన్, రహమత్నగర్కు చెందిన సాదిక్, అశోక్నగర్కు చెందిన మంజునాథ్, మారుతీనగర్కు చెందిన షేక్బాషా, రాజమ్మవీదికి చెందిన హాజీషఫీ, గుంతకల్లు చెందిన శ్రీనివాసులు, నగరంలో పాన్వాలీవీధికి చెందిన షాకీర్, వేణుగోపాల్కు చెందిన ఓంకార్, బళ్లారి రోడ్డుకు చెందిన సోమశేఖర్, భవానీనగర్కు చెందిన షేక్బాబాఫకృద్దీన్లను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. క్రికెట్బుకీలు బెట్టింగ్తో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు తేలిందని తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని..
సాక్షి, నిజమాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్తో గొడవ తలెత్తి ఓ యువకుడిని బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్లో కలకలం రేపింది. బోధన్కు చెందిన యువకులు, రెంజల్ మండలం కందకుర్తి చెందిన యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాశారు. ఈ బెట్టింగ్లో కందకుర్తి గ్రామానికి చెందిన యువకులు ఓడిపోయారు. డబ్బు కోసం బోధన్ యువకులు కందకుర్తికి వెళ్లారు. అక్కడే ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో స్థానికులు వీరిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత కందకుర్తికి చెందిన యువకుడు పనిపై బోధన్ వెళ్లాడు. అప్పుడే కందకుర్తి యువకుడిని బోధన్ యువకులు బంధించారు. డబ్బులు ఇవ్వమని యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయందోళనకు చెందిన యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బోధన్ యువకులు, ఇద్దరు కందకుర్తి యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు
గుంటూరు: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్వి రాజశేఖరబాబు వివరాలు వెల్లడించారు. ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన బుకీ పసుపులేటి నాగరాజుతో పాటు భోపాల్కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారా వెబ్సైట్ యజమానిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అభీర్ చందగా గుర్తించారు. అతను ఆ రాష్ట్రంలోని కూచ్బిహార్ జిల్లా దిన్లాటా గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరు పరిచి గుంటూరుకు తరలించారు. కోల్కత్తాకు చెందిన సాఫ్ట్వేర్ డిజైనర్ సాయన్ గోష్కు సోమవారం గుంటూరులో విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. నిందితుడు అభీర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది మాస్టర్ బుకీలు ఉన్నారు. వారి పరిధిలో 50 మంది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్లు, 60 మంది ప్రధాన బుకీలు, 400 మంది సబ్ బుకీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక పంటర్స్ దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. ఇతర దేశాల్లో అధికారికంగా బెట్టింగ్కు లైసెన్సులు ఉన్నందున అక్కడ నుంచి సాఫ్ట్వేర్ కొని వివిధ క్రీడల బెట్టింగ్కు అనుకూలంగా రూపొందించారు. వాటిలో మన దేశంలో ప్రధానంగా 6 రకాల క్రీడల్లో బెట్టింగ్లు జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్టాప్లు, ఐదు సెల్ఫోన్లు, బంగారు చైను, బ్రేస్లెట్తో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 7 లక్షల నగదును సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్తో పాటు సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బుకీలను అరెస్టు చేసేందుకు ఏఎస్పీ ఎస్ వరదరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాకు చెందిన బుకీలు కొందరిని ఇప్పటికే గుర్తించారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన బృందం సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఎస్.వరదరాజు, డీఎస్పీ యు కాలేషావలి, సిబ్బంది పాల్గొన్నారు. -
జోరుగా ఆన్లైన్ బెట్టింగ్లు
క్రికెట్కు యువతలో ఉన్న క్రేజ్ను ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్లైన్లో బెట్టింగులను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. బెట్టింగ్లకు డీలర్షిప్లు తీసుకుని, కమీషన్లపై పనిచేసేలా సబ్డీలర్లను నియమించుకుని చెలరేగిపోతున్నారు. ఈజీ మనీ కోసం యువకులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వేలు, లక్షలాది రూపాయలు బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా మాఫియా రూ.కోట్లలో బెట్టింగ్లకు పాల్పడుతోంది. దినసరి కూలీలు, యువత ఈజీ మని కోసం వేలల్లో పందేలు కాస్తుంటే.. వారిని మాయ చేస్తున్న బుకీలు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాధారణ క్రికెట్ మ్యాచ్లకే బెట్టింగ్లు భారీగా నడుస్తుంటాయి. ఇక టీ–20, ఐపీఎల్ మ్యాచ్ల సీజన్లో బెట్టింగ్లు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఒక్కరోజులోనే జిల్లాలో రూ.5 నుంచి 10కోట్ల వరకు బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్–12 ఫైనల్ మ్యాచ్ జరిగే మే 12వ తేదీలో బెట్టింగ్లు రూ.30కోట్లు దాటే అవకాశాలున్నాయని బెట్టర్లు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తుల ద్వారా బుకీల దందా ఆన్¯Œలైన్ క్రికెట్ బెట్టింగ్ కొన్ని విదేశాల్లో అధికారికంగా కొనసాగుతోంది. ఆయా దేశాల వ్యక్తులతో పరిచయాలు చేసుకున్న మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాల్లోని వ్యక్తులతో జిల్లాకు చెందిన బుకీలు పరిచయాలు చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న జాతీయ బుకీలతో సంబంధాలున్న జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలు ఆన్¯Œలైన్ బెట్టింగ్లో డీలర్ షిప్ తీసుకుని సబ్ డీలర్స్ను సైతం నియమించుకున్నారు. ముందస్తుగా ఫండర్ల నుంచి బుకీలు (డీలర్ షీప్ తీసుకున్న నిర్వాహకులు) కొంత సొమ్ము తీసుకుని బెట్టింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ, ఆన్లైన్ లింక్లు షేర్ చేస్తారు. వెబ్ పేజీ, లైన్, నేరుగా ఫోన్లో మాట్లాడే విధంగా మొత్తంగా మూడు దశల్లో పెద్దఎత్తున ఈ దందా కొనసాగుతోంది. ఇదే తరహాలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ భారీ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన బుకీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు బిత్తరపోయే వివరాలు తెలిశాయి. జిల్లాకు చెందిన 36 మందితో సహా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జాతీయస్థాయి బెట్టింగ్ బుకీల వివరాలు వెలుగు చూశాయి. ప్రత్యేకమైన యాప్లు ఐపీఎల్, ఇతర క్రికెట్ బెట్టింగ్ల కోసం నిర్వాహకులు హైటెక్ పద్ధతిని వినియోగిస్తున్నారు. సెల్ఫో¯Œన్లలో బెట్ –365, బెట్వీ, స్పోర్ట్స్ బెట్టింగ్, బెట్ ప్లేయర్, డ్రీమ్ 11, మై టీమ్, ఇండస్ గేమ్స్, మై టీమ్ 11 వంటి యాప్ల నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్తో పాటు వాలీబాల్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడలపై కూడా ఈ యాప్ల ద్వారా బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి లావాదేవీలు గూగుల్ పే, మై మనీ, భీమ్, ఫోన్ పే వంటి ఆన్లైన్ నగదు బదిలీ యాప్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లు చేపడుతున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని ఫ్లాట్లు అడ్డాలుగా చేసుకుని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నంత సేపు బెట్టింగ్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. వేసిన బాళ్లు, క్యాచ్లు, వికెట్లు, ఫోర్లు, సిక్స్లను బట్టి బెట్టింగ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. చిత్తవుతున్న యువత జల్సాలకు అలవాటుపడిన యువత తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈజీ మనీ సంపాదన బాట పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బుకీలు తమవైపుకు ఆకర్షించుకుని యువతను ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. జిల్లాలోని పలు పేరు మోసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో సైతం కొందరు విద్యార్థులు సహ బుకీలుగా ఉంటూ తోటి విద్యార్థులతో బెట్టింగ్లు వేయిస్తున్నారు. చదువులు, హాస్టళ్ల అవసరాల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బెట్టింగ్ల్లో పెట్టి పోగొట్టుకుంటున్న విద్యార్థులు వచ్చే మ్యాచ్లో డబ్బు వస్తుందని ఆశతో మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. చాలా సందర్భాల్లో బుకీలే విద్యార్థులకు డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తెలిసో తెలియకో ఈ కూపంలోకి దిగి బుకీలకు డబ్బు కట్టలేక, ఇంట్లో తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందని విద్యార్థులు సతమవుతూ చదువుపై శ్రద్ధ పెట్టలేక బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. -
తీగలాగితే డొంక కదిలింది
క్రికెట్ బెట్టింగ్ అనేక మంది జీవితాలను నాశనం చేసింది. ఎందరో యువకులు సర్వం కోల్పోయి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన మధ్యప్రదేశ్ యువకులను విచారిస్తే కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా 220 మందికిపైగా బుకీలు ఉన్నట్లు గుర్తించారు. బుకీలను అరెస్టు చేసేందుకు రూరల్ ఎస్పీ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన రాష్ట్రాల పోలీసులతో సంప్రదించి బెట్టింగ్ ముఠాల గుట్టురట్టు చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు: యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ ఆన్లైన్లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న జిల్లాకు చెందిన బుకీతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ ద్వివేది, అవదీష్ ప్రతాప్సింగ్, దివ్యాంషు సింగ్లను అదుపులోకి తీసుకొని, 5న రాజపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి నాగార్జునలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచి జిల్లాలో బెట్టింగ్లు కొనసాగుతున్న సంఘటనలు ఎస్పీ రాజశేఖరబాబు దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బుకీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న కలకత్తాకు చెందిన ప్రధాన బుకీ వద్ద నుంచి నాగార్జున ప్రత్యేకంగా వెబ్సైట్లో లింక్లను తీసుకొని వాటిని బెట్టింగ్ రాయుళ్లకు షేర్ చేస్తూ వాటి ద్వారా బెట్టింగ్లు నిర్వహించాడు. రంగంలోకి టాస్క్ఫోర్స్ బృందం... సత్తెనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ల్లో నాగార్జున బెట్టింగ్లో తనకు ఇవ్వాల్సి ఉన్న రూ 6 వేలు ఇవ్వలేదంటూ సత్తెనపల్లికి చెందిన అంకళ్ల ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతను టాస్క్ఫోర్స్ బృందానికి అప్పగించారు. దీంతో వరుసగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దైన శైలిలో విచారణ చేపట్టడంతో పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూడటంతో అవాక్కవడం వారి వంతైంది. ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 226 మంది బెట్టింగ్లో పాల్గొన్నట్లు తేల్చారు. వెంటనే ప్రధాన నిందుతుడైన నాగరాజు బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి అతని ఖాతాలో ఉన్న రూ. 22,16 లక్షల నగదును సీజ్ చేశారు. విడివిడిగా విచారణలో.... విచారణలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను విడివిడిగా విచారణ చేపట్టడంతో పొంతన లేని సమాదానాలు చెప్పడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయాలు రాబట్టారు. ముగ్గురు నిందితుల వాట్సాప్, ఫేస్బుక్ లను పరిశీలించి వారి వద్ద ఉన్న బుకీల ఫోను నెంబర్లను వారి అడ్రస్లను పరిశీలిస్తే దాదాపుగా దేశ వ్యాప్తంగా బుకీలు వీరి పరిధిలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునతో పాటు ఇంకా బుకీలు ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా 220 మంది ప్రధాన బుకీలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. బెట్టింగ్ రాయుళ్ల సంగతికి వస్తే వేలాదిగా ఉన్నట్లు గుర్తించారు. డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లిన ఎస్పీ... క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి పునాదులను జిల్లాలో కూడా పోలీసులు గుర్తించడంతో జిల్లాలో ఉన్న బుకీలందరూ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా అండర్గ్రౌండ్కు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ప్రకారం బుకీలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టాస్క్ఫోర్స్ బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు ప్రారంబించారు. విచారణలో తీగ లాగితే డొంక కదలడంతో దేశ వ్యాప్తంగా బుకీలు ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. మిగిలిన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిసింది. మరోసారి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురి పోలీస్ కష్టడీకి తీసుకొని విచారణ చేపట్టేందుకు సిద్దం అయ్యారు. టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు బుకీల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాధ్యం అయ్యేనా... ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలను గుర్తించి వారిని అరెస్టు చేయడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా నిలిచింది. పక్క రాష్ట్రం నుంచి నిందితులను అరెస్టు చేయాలంటే డీజీపీ అనుమతితో ఎస్పీ ఫారన్ పాస్పోర్టు జారీ చేయాల్సి ఉంటుంది. విడతల వారీగా చేపట్టినా అందరినీ అరెస్టు చేయాలంటే దాదాపుగా ఏడాది సమయం పడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇదంతా సాధ్యం అవుతుందా? లేక పోతే మమ అనిపిస్తారా? అనే సందేహాలు పోలీస్శాఖలో ఉన్నాయి. ఏదిఏమైనా పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే సాధ్యం అవుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
అనంతపురం, పెనుకొండ రూరల్: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు పెనుకొండ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,17,800 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునిమడుగు గ్రామానికి చెందిన వెంకటరాముడు, తుపాకుల నరసింహ, గుట్టూరుకు చెందిన చిన్న ఆంజనేయులు, ఎరికల శివ, కురుబవాండ్లపల్లికి చెందిన లింగమయ్య, పెనుకొండకు చెందిన అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, శ్రీనాథ్లు అందరూ కలసి ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ల ద్వారా ప్రతి బాల్కు సిక్స్, ఫోర్, వికెట్ అంటూ పందెం కాస్తున్నారన్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుంది, ఓడుతుందని బెట్టింగ్ ఆడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరైనా బెట్టింగ్లో గెలిస్తే వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారన్నారు. తమకందిన సమాచారంతో డీఎస్పీ ఐ.రామకృష్ణ ద్వారా సర్చ్ వారంట్ తీసు కుని మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ఇంటిని సోదా చేశామన్నారు. ఆధారాలు లభించడంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సీ గంగాధర్, కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, నాగేంద్రప్రసాద్, లక్ష్మి పాల్గొన్నారు. -
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను నెల్లూరులోని పప్పులవీధిలో నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బుకీల వివరాలను వెల్లడించారు. పప్పులవీధిలో నివాసం ఉంటున్న వెంకట రమేష్ అలియాస్ డీటీఎస్, సంతపేట ఈద్గామిట్టకు చెందిన షేక్ ఖాదర్నవాజ్లు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గతంలో పలుమార్లు వీరు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన ఇద్దరూ మరికొందరితో కలిసి ఐపీఎల్ ప్రారంభం నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై వీరప్రతాప్, సిబ్బంది ఈనెల 6వ తేదీ రాత్రి నిందితులు ఓ కల్యాణ మండపం సమీపంలో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించి బుకీలకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. గతంలో క్రికెట్ బెట్టింగ్లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తి బావమరిది ప్రస్తుతం బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో 13 మంది బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో ప్రస్తుతం చిక్కిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నగర డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్కు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫంటర్లపై సైతం కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై వీరపత్రాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ల జోరు
గుంటూరు, సత్తెనపల్లి: చిన్నా, పెద్దా అందరూ క్రికెట్ అంటే అభిమానం చూపడం సాధారణ విషయమే.మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతుంటారు కొందరు. మూడు గంటల్లో అయిపోయే ఐపీఎల్ మ్యాచ్లకైతే ఆ క్రేజే వేరు. ఇదే అదునుగా ఆ జట్టు గెలుస్తుంది.. ఈ జట్టు గెలుస్తుందంటూ బెట్టింగ్లు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పాఠశాల విద్యార్థులు సైతం బెట్టింగ్లలో మునిగి పోతున్నారు. ఇంట్లో డబ్బులు తీసుకు వచ్చి మ్యాచ్లపై తోటి స్నేహితులు, పెద్ద వారితో బెట్టింగ్లు కాస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతి విద్యార్థులు, యువతలో పెద్ద వ్యసనంగా మారింది. గతంలో పేకాట జోరుగా సాగుతుండేది. రానురాను దానిపై యువతకు మోజు లేకుండా పోయింది. ఈ స్థానంలో ఐపీఎల్ బెట్టింగ్ పెద్ద వ్యసనంగా మారింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు సమాజంలో చోటు చేసుకంటాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలే కేంద్రాలు ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్లకు సత్తెనపల్లి కేంద్రంగా మారింది. పట్టణం తోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముఖ్యంగా దుకాణాలే కేంద్రాలుగా మారి పోతున్నాయి. వాటి వద్దకు చేరే వ్యసనపరులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్లు కాస్తున్నారు. మ్యాచ్ ఫలితాలపైనే కాకుండా ఓవర్కు ఎన్ని పరుగులు వస్తాయని బంతి, బంతికి పందేలే వేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లు, బుకీలు ఎక్కడో ముంబై వంటి నగరాల్లో హోటళ్లలో కూర్చొని అన్నీ నడిపిస్తారు. కానీ ప్రస్తుతం చిన్నస్థాయి బుకీలు తయారయ్యారు. ఓడిపోతే డబ్బులు బెదిరించి మరీ తీసుకుంటున్నారు. గెలిస్తే మాత్రం చాలాచోట్ల డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యలు వస్తాయని భయపడి తమలో తాము మథనపడి వెళ్లిపోతున్నారు. భారీ స్థాయి బెట్టింగ్లు పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ హోటళ్లు, స్నేహితుల గదుల్లో మకాం వేసి బెట్టింగ్లు కాస్తున్నారు. ఐపీఎల్ పందేల్లో సింహ భాగం పల్నాడులోని సత్తెనపల్లి వాసులదే. పోలీసుల నిఘా మరింత పటిష్టం కావాలని, ఈ బెట్టింగ్ల సంస్కృతిని సంపూర్ణంగా అరికట్టాలని పురప్రజలు కోరుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు, గోపాలపట్నం పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో అల్లిపురానికి చెందిన అల్ల్రూ? రామచంద్ర రెడ్డి, గోపాలపట్నానికి చెందిన షేక్ ఇషాక్, శ్రీరామ్నగర్కు చెం దిన బొడ్డేపల్లి కిషోర్ కుమార్, చంద్రనగర్కు చెందిన తుంపల బుజ్జి, నాగేంద్ర కాలనీకి చెందిన అమరపల్లి మహాలక్ష్మి, కొత్తపాలెంకు చెందిన మళ్ల దుర్గాప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముంబయి ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.32 వేలు నగదు, మొబైల్ బెట్టింగ్ల వివరాలతో కూడిన మూడు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. -
బంతి బంతికి బెట్టింగ్
టేక్మాల్(మెదక్): ఐపీఎల్.. బెట్టింగ్కు పర్యాయపదంగా మారింది. టోర్నీ పై యువతలో ఉన్న వివపరీతమైన క్రేజ్ను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్లో టాస్ను మొదలుకొని బంతి బంతికి పందేలు కాస్తున్నారు. వ్యవహారమంతా ఆన్లైన్లలో, సెల్ఫోన్ల ద్వారా సాగుస్తున్నారు. మ్యాచ్ మొదలవ్వడానికి రెండు మూడు గంటల ముందే వాట్సప్, మెసేజ్, ఫోన్ కాల్స్, ఇంటర్నెట్లలో యువత బెట్టింగ్ను హోరెత్తిస్తుంది. ప్రస్తుతం ఐపిఎల్ నాకౌట్ దశకు చేరుకోవడంతో జూదం తారాస్థాయికి చేరింది. సాయంత్రం అయితే చాలు యువకులంతా గుమిగూడి ఫోన్లలో బీజిబీజిగా గడుపుతున్నారు. బెట్టింగ్ సాగుతుందిలా.. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు ఆ రోజు నిర్వహించే ఐపిఎల్ మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలబలాలను బేరీజు వేసుకొని బెట్టింగ్కు దిగుతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్ ప్లే ఆరు ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్ సాగిస్తున్నారు. వీటితో పాట ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ల వ్యక్తిగత స్కోరు ఎంత చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. చోరీలకు పాల్పడుతున్న యువత.. బెట్టింగ్ పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పాకెట్ మనీకోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి డబ్బుల కోసం సొంత ఇళ్లతో పాటూ వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. బెట్టింగ్లో డబ్బులు పొగొట్టుకుంటున్న యువత ఏమి తోచని పరిస్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహరంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండాలి ఐపిఎల్ బెట్టింగ్ వ్యసనానికి యువకులు, విద్యార్థులు దూరంగా ఉండాలి. డబ్బులను వృథా చేసుకోకూడదు. ఇంట్లో అవసరాలకు ఇచ్చిన డబ్బులను బెట్టింగ్లలో పెట్టరాదు. బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలుకావొద్దు. ఇటువంటి బెట్టింగ్లు చట్టరీత్యా నేరం. బెట్టింగ్లు పెట్టినట్లు మాకు తెలిసినా, సమాచారం అందినా, అనుమానితులైన వారిని విచారిస్తాం. బెట్టింగ్ రాయుళ్లపై కేసులు పెడతాం.–విజయరావ్, ఎస్ఐ, టేక్మాల్. -
కలుగులో క్రికెట్ బు‘కీ’లు..!
సాక్షి, గుంటూరు:క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ బుకీల ఆట కట్టించి మరికొందరు ఈ వ్యసనానికి బలికాకుండా చూడాలనే ఉద్దేశంతో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన కీలక క్రికెట్ బుకీలంతా సెల్ఫోన్లు పక్కన పడేసి గత వారం రోజులుగా కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలంతా వైజాగ్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటూ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నరసరావుపేట, గుంటూరుకు చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి బుకీల సమాచారంతో పాటు, వీరికి సహకరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను సైతం వారి నుంచి సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో కీలక క్రికెట్ బుకీలంతా టీడీపీ నేతల అండతో పోలీసుల కంటపడకుండా కలుగులోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు కీలక బుకీలు మాత్రం పోలీసులు తమ జోలికి రాకుండా కొందరు టీడీపీ ముఖ్యనేతలు, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో ఆఫర్లు పెడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సైతం క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ బుకీల కోసం టాస్క్ఫోర్స్ బృందాల గాలింపు జిల్లాలో రూరల్ ఎస్పీ ఎస్.వి. రాజశేఖర్బాబు ఇద్దరు సీఐలతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి క్రికెట్బుకీల కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ తదితర ప్రాంతాలకు చెందిన మరికొందరు కీలక బుకీలంతా రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. సెల్ఫోన్లు ఉంటే టెక్నాలజీ ద్వారా, ఎక్కడ పోలీసులు తమ ఆచూకీ తెలుసుకుంటారోననే భయంతో వాటిని సైతం పక్కన పడేసి కుటుంబం సభ్యులతో సైతం మాట్లాడకుండా వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిని నమ్మాలో తెలియని ఎస్పీలు కొందరు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బుకీల కోసం వేట సాగిస్తున్నారు. ఇవి కొంతమేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ఇంటి దొంగలపై రూరల్ ఎస్పీ సీరియస్గా దృష్టి సారించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని బెట్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, సిబ్బంది పనిపట్టేందుకు రూరల్ ఎస్పీ సంకల్పించారు. జిల్లాలో క్రికెట్ బెట్టర్ల నుంచి నెలవారి మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్న అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులు టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుతో వణికిపోతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గుట్కా మాఫియా నుంచి డబ్బులు వసూలు చేసిన పోలీసు అధికారులపై రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు చర్యలకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సైతం అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నారు. తమకు మామూళ్లు ఇచ్చిన క్రికెట్ బుకీలను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలంటూ సదరు పోలీసు అధికారులే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు
కర్నూలు: కర్నూలు నగరంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల గుట్టు రట్టయ్యింది. మొబైల్ యాప్ చూస్తూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మూడవ పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ విశ్వనాథ్రెడ్డి, సిబ్బంది పాండునాయక్, లక్ష్మీనారాయణ, మహేష్తో కలిసి బుధవారపేటలోని భవానీ దేవాలయం వద్ద బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరం పెద్దరంగరాజు వీధికి చెందిన గద్దెల రాజేశ్వరరావు... ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ అనే వ్యక్తులకు బుకీగా వ్యవహరిస్తూ ఆటగాళ్లతో డబ్బులు వసూలు చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. రాజేశ్వరరావుతో పాటు పెద్దరంగరాజు వీధికి చెందిన సాయికుమార్, అభిలాష్, మేదరవీధికి చెందిన కమలాపురం శివకోటి, తెలుగువీ«ధిలో నివాసం ఉంటున్న జీతూరి వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు. పోలీసులపై టీజీ భరత్ ఒత్తిడి క్రికెట్ బెట్టింగ్లో బుకీతో పాటు నలుగురు ఆటగాళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందడంతో బెట్టింగ్ రాయుళ్లను విడిపించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు, కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో తనకు యువకులు సహకరించినందున ఎలాగైనా వదిలిపెట్టాలని పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. బెట్టింగ్ నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించినప్పటికీ టీజీ భరత్ ఒత్తిడి మేరకు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి, తక్కువ మొత్తంతోనే అరెస్ట్ చూపినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. -
జోరుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాయంత్రం ఆరు గంటలైంది... చింతూరు మెయిన్రోడ్ సెంటర్లోని ఓ దుకాణం వద్ద పదుల సంఖ్యలో యువత గుంపులుగా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇన్ని వేలు, అన్ని వేలు అంటూ బిజీ బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన అటుగా వెళ్లేవారు యువకులు కదా.. ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నారని అనుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఆ ఫోన్ల సంభాషణ.. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోసమని తెలిసేది అతి కొద్ది మందికే. తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): చింతూరు ప్రధాన కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చింతూరు మెయిన్రోడ్డులోని ఓ దుకాణం వద్ద ఈ దందా సాగుతున్నట్టు సమాచారం. రూ.5 వేల నుంచి రూ.10 వేలు.. ఆపైన బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్లు, ఆన్లైన్ ద్వారా రూ.లక్షల్లో బెట్టింగ్లు నడుస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. బెట్టింగ్ కోసం యువకులందరూ కలసి ఓ మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని.. బెట్టింగ్ వేసిన సొమ్ములో అతనికి 10 శాతం కమీషన్గా ముట్టచెబుతున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్లో ప్రధానంగా చింతూరుకు చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇతర మండలాలతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్గఢ్కు చెందిన యువత కూడా ఇక్కడికి వచ్చి బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ జరుగుతోందిలా... బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ఆ రోజు నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలాబలాలను బేరీజువేసుకుని బెట్టింగ్కు దిగుతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20 ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. వీటితో పాటు ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ల వ్యక్తిగతంగా ఎంత స్కోరు చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. పెడదోవ పడుతున్న యువత బెట్టింగ్ల పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తిరిగి బెట్టింగ్ కాసేందుకు సొమ్ము కోసం పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు పాకెట్ మనీ కోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి సొమ్ముల కోసం సొంత ఇళ్లతో పాటు వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. బెట్టింగుల్లో సొమ్ములు పోగొట్టుకుంటున్న యువతకు బెట్టింగ్ ముఠా అధిక వడ్డీలకు సొమ్మును అప్పుగా ఇచ్చి తిరిగి ఆ సొమ్మును బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఒత్తిడిని తట్టుకోలేని యువత అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. -
కాయ్ రాజా కాయ్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండలానికి చెందిన సీతారాం(పేరు మార్చాం) డిగ్రీ చదువుతున్నాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఇతనికి అదే మండలానికి చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం)తో పరిచయం ఏర్పడింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో చెన్నైపై బెంగళూరు గెలుస్తుం దని సీతారాం రూ.50 వేలు బెట్టింగ్ కాశాడు. అప్పటికే అప్పుల్లో ఉండటంతో ఈ మ్యాచ్ గెలిస్తే బాకీ తీర్చేయవచ్చని భావించాడు. అయితే అనూహ్యంగా బెంగళూరు ఓటమితో ఈయన ఆశలు గల్లంతయ్యాయి. ఆ అప్పులు తీర్చేందుకు కంపె నీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి కూలీ పని చేసుకుంటూ వడ్డీలు కడుతున్నాడు. జిల్లాలో ఇలాంటి యువకులు ఎందరో.. జూదం.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మూడు ముక్కలాట, పేకాట లాంటివి. ప్రస్తుతం వీటికన్నా ప్రమాదకరమైన జూదం క్రికెట్ బెట్టింగ్ తయారైంది. ఇన్నాళ్లు నగరానికే పరిమితమైన ఈ భూతం ఇప్పుడు పల్లెకు సైతం పాకింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కొంతమంది చేతుల్లో నడుస్తున్న వికృత పోకడ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ ఫీవర్ ఈ స్థాయిలో ఉంటే, రానున్న ప్రపంచకప్కు ఏ స్థాయిలో ఉంటుందో ఊహిస్తేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. యువత, విద్యార్థులు బలి.. గతంలో ఒకేచోట కూర్చుని బెట్టింగులు చేస్తుంటే పోలీసులు నిఘాపెట్టి పట్టుకునేవారు. దీంతో బెట్టింగుబాబులు రూటు మార్చారు. బెట్ 385, సీబీ, క్రిక్బజ్, క్రికెట్ మజా అనే ఆన్లైన్ యాప్లు డౌన్లోడ్ చేసి.. టీవీలో ఒక బంతి కంటే ముందే వచ్చే సమాచారాన్ని చూస్తూ.. ఫోన్ల ద్వారానే బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు.. బెట్టింగ్ రాయళ్లతో పందాలు కాయిస్తున్నారు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే అత్యాసతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్థితిమంతులు, ఆటోడ్రైవర్లు బెట్టింగు ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో చివరకు బుకీ మాత్రం పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటుండగా.. బెట్టింగురాయుళ్లు మాత్రం బికారులుగా మారిపోతున్నారు. బంతి బంతికి బెట్టింగే.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే 50 ఓవర్లు చొప్పున ఉండేది. రోజంతా ఆటసాగి.. సాయంత్రం ఫలితం వచ్చేది. ఆట చివర్లో ఉత్కంఠ ఉండేది. ఈ నేపథ్యంలో టీ–20, ఐపీఎల్ మ్యాచ్లు వచ్చాక బంతి బంతికి రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ బంతి సిక్స్.. ఈ బంతి ఫోర్ అంటూ.. బెట్టింగులు కడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు బెట్టింగురాయళ్ల చేతుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. తమ ఫేవరేట్ జట్లపై బెట్టింగ్.. మరికొంతమంది తమ ఫేవరేట్ ఐపీఎల్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, రాజస్థాన్ ఆడే మ్యాచ్ల ఫలితంపై బెట్టింగులు కాస్తున్నారు. ఇందుకోసం దొంగతనాలు, దోపిడీలకు వెనుకాడటం లేదు. ఇంట్లో విలువైన వస్తువులను గోప్యంగా తరలిస్తున్నారు. కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి యువతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఐపీఎల్తో ముదిరిన బెట్టింగ్.. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ–20 మ్యాచ్లతో బెట్టింగ్ భూతం మరింత ముదిరింది. ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగులతో భరించలేని టెన్షన్, నరాలు తెగే ఉత్కంఠతో మద్యం, సిగరెట్లకు బానిసలుగా మారుతూ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పాలకొండ, సీతంపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం తదితర ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. -
కాయ్ రాజా కాయ్..
ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు హీట్ పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఒక వైపు.. మరోవైపు ఎన్నికల ఫలితాలు మరింత కాక పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మొదలైతే పందెం రాయుళ్లకు పండగే. బుకీలు, సబ్ బుకీలే కాకుండా అన్ని వర్గాల వారు క్రికెట్ మ్యాచ్లపై పందెం కాస్తారు. సాధారణ మ్యాచ్లకు భిన్నంగా బెట్టింగ్ కోసమే నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎన్నికల ఫలితాలు కూడా తోడు కావడంతో పందేలు జాతరను తలపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ మే 23న నిర్వహించనున్నారు. ఫలితాలు వెలువడటా నికి ఎక్కువ వ్యవధి ఉండటంతో పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకోవడం, సవాళ్లు విసురుకోవడం, కొందరు మరో అడుగు ముందుకేసి వారి శక్తి మేరకు గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. చాలా మంది పార్టీలపై అభిమానాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా పందేలు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లోని రచ్చబండలు, చావిడులతో పాటు పట్టణాల్లో టీ బంకులు, పార్కులు ఫలితాల విశ్లేషణ కేంద్రాలుగా మారాయి. అభ్యర్థుల మాటేమోగానీ సాధారణ ప్రజలకు మాత్రం ఈ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకిస్తున్నాయి. ప్రొద్దుటూరు కేంద్రంగా బెట్టింగ్.. ప్రొద్దుటూరు అంటేనే ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్కు పెట్టింది పేరు. క్రికెట్ పందేలకు రాష్ట్రంలోనే ప్రొద్దుటూరుకు రికార్డు ఉంది. జిల్లాతో పాటు రాయలసీమలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి బుకీలే బెట్టింగ్ పాఠాలు నేర్పారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో క్రికెట్ బుకీలు పోలీసులకు పట్టుబడ్డా వారిలో ప్రొద్దుటూరుకు చెందిన వారు ఉంటారు. అందుకే క్రికెట్ పందేలతో పాటు ఏ పందేలు ఆడటంలో అయినా ఇక్కడి బుకీలు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్న బుకీల చూపు ఎన్నికల ఫలితాలపై పడింది. నిత్యం రూ. కోట్లు చేతులు మారుతున్నాయి. గ్రూపులుగా ఏర్పడి చాలా మంది పందేలు కాస్తున్నారు. 5 శాతం కమీషన్ తీసుకొని ఇరువురి మధ్య దళారులు పందేలు కుదుర్చుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ అవగాహన ఉన్నవారు మాత్రమే నిర్వహిస్తుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల వారు పందేలకు దిగుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే ఎన్నికల ఫలితాలపై అంశాల వారిగా పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది..? అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ప్రొద్దుటూరులో మెజారిటీ ఎంత వస్తుంది..? మంగళగిరిలో గెలుపెవరిది..? జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? జమ్మలమడుగులో ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇలా అనేక విధాలుగా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్లో రకరకాల పద్దతులు ఉన్నాయి. పందెం కాసి రూపాయికి రూపాయి ఇవ్వడం ఒక పద్దతి. ఒకటికి ఒకటినర్ర.. ఒకటికి రెండు ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. ఫలితాలు వెలువడటానికి ఇంకా ఎక్కువ సమయం ఉండటంతో ప్రస్తుతానికైతే ఒకటికి ఒకటి చొప్పున పందెం కాస్తున్నారు. ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్గే జీవనంగా సాగించే పెద్ద పెద్ద బుకీలు ఉన్నారు. వారు ఇంకా రంగంలోకి దిగలేదు. -
బంతి పోలీసుల చేతిలో..
ఐపీఎల్ బెట్టింగ్ ఖాకీల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారికి గతంలో గన్మ్యాన్గా ఉన్న ఓ కానిస్టేబుల్ అనంతపురం కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నగరంలోని బళ్లారి బైపాస్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో యువకులను ఉంచి.. వారి ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుంతకల్లు, ధర్మవరంలోనూ ఖాకీల కనుసన్నల్లోనే ఈ బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు సమాచారం. అందుకే బెట్టింగ్ దందా ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది.. జిల్లా వ్యాప్తంగా ఎంత మంది బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారనే సమాచారం ఇంటెలిజెన్స్, ఎస్బీ సిబ్బందికి తెలిసినా.. ఖాకీల ప్రమేయం ఉండటంతో మౌనం దాలుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్ అంటూ ఊగిపోయే ఇండియాలో ఏడాదికి ఒకసారి వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎందరో జీవితాలను తారుమారు చేస్తోంది. గల్లీ క్రికెటర్ను ఒక్క మ్యాచ్తో స్టార్గా మార్చేస్తున్న పొట్టి ఫార్మాట్ మ్యాచ్లు.. బెట్టింగ్ బారిన పడిన ఎందరో జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్క బంతికే బతుకు బస్టాండై పోతోంది. బెట్టింగ్ నడిపిస్తున్న బుకీలకు మాత్రం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఐపీఎల్–12 సీజన్ మార్చి 23న ప్రారంభం కాగా.. మే 12 వరకు కొనసాగనుంది. రూ.కోట్లలో బెట్టింగ్ ఐపీఎల్ వచ్చిందంటే చాలు బుకీలకు పండగే. అనంతపురాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా సబ్ బ్రాంచ్లు ఏర్పాటు చేసి బెట్టింగ్ నడిపిస్తున్నారు. మన జిల్లాలో ఒక్క సీజన్కే రూ.100 కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువతే బెట్టింగ్ మాయాజాలంలో చిక్కి అప్పుల పాలవుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభమై 25 రోజులు పూర్తి కాగా బెట్టింగ్ కూడా భారీగా సాగినట్లు తెలుస్తోంది. ఏటా ఐపీఎల్ బెట్టింగ్పై నిఘా ఉంచే పోలీసులు...ఈ సారి ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా...బెట్టింగ్ రాయుళ్లు బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. ఒక్కో మ్యాచ్కు జిల్లాలో రూ. 5 కోట్లకు పైగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇండియన్ ్రíపీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా బెట్టింగ్ లీగ్గా మారుతోంది. ప్రతి బంతీ కీలకమే ఫ్యాన్సీ పేరుతో జరిగే పందేలలో మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఒకరు పందెం కాస్తే, మరొకరు ఈ ఓవర్లో ఇన్ని పరుగుల కొడతారని బెట్టింగ్ వేస్తున్నారు. అలాగే ఈ బాల్కు వికెట్ పడుతుందని, ఈ ఓవర్లో సిక్సర్ కొడతారని, 20 ఓవర్లకు ఇన్ని పరుగులు వస్తాయని పందెలు కాస్తున్నారు. మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచి ఈ బెట్టింగ్ తంతు కొనసాగుతుంది. ప్రధానంగా టాస్ ఏ జట్టు గెలుస్తుంది అన్న దానిపై మొదలయ్యే బెట్టింగ్ జట్టు విజయంలో చివరి బంతి వరకు కూడా కొనసాగుతుంది. అత్యుత్తమ జట్టుకు అత్యధిక రేటింగ్ పలుకుతూ పెద్ద ఎత్తున బెట్టింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై, ముంబయి, బెంగళూరు జట్ల మ్యాచ్లపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా జట్లు ప్రాతినిథ్యం వహించే మ్యాచుల్లో అధిక సంఖ్యలో బూకీలు వాటి రేటింగ్ను పెద్ద ఎత్తున పెంచేస్తున్నారు. ఆయా జట్లు ఆడుతున్న సమయంలో ఒకటికి రెండు, మూడింతలు అధికంగా అందించి బెట్టింగ్లో యువతను దాసోహం చేస్తున్నారు. ఆత్మహత్యలే శరణ్యం క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలో పడిన అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారంతా ఎక్కువగా జిల్లాకేంద్రంలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తుండగా...వారికి బెట్టింగ్ అలవాటు చేసేందుకు ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ద్వారానే బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు డబ్బుపై ఆశతో బెట్టింగ్ ఉచ్చు పడి.. అప్పుల పాలై...అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లో నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరోవైపు అప్పుల వాళ్లకు భయపడి ఇళ్లు వదిలి వెళ్లిన యువకులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో బిజీగా పోలీసులు ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీబిజీగా ఉండటంతో గత నెల ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ క్రికెట్ పోటీలు బూకీల పాలిట కల్పతరువుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో వీటిపై పోలీసులు దృష్టి సారించకపోవడం...మరికొందరు ఖాకీలూ బెట్టింగ్కు సహకరించడంతో బూకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే సీజన్ మొదలై 25 రోజుల గడుస్తున్నా.. నేటికీ ఒక్కకేసు నమోదు కావడం లేదు. నగరంలో సోమనాథ్నగర్కు చెందిన షేక్ గౌస్పీర్ (27) తపోవనం సమీపంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ నడిపేవాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడిన గౌస్పీర్ రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు కొంత మేర చెల్లించినా..ఇంకా భారీమొత్తం బాకీ పడ్డాడు. ఓవైపు రుణదాతలు...మరోవైపు బుకీల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో 2018 మే 5న ఇంట్లోనే ఉరివేసుకుని ఊపిరితీసుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ముంబయి కేంద్రంగా... ఐపీఎల్ బెట్టింగ్ ముంబయి కేంద్రంగా నడుస్తున్నట్లు గతంలో తేలింది. వీటికి సబ్ బ్రాంచ్ బెంగళూరులో ఉండగా కీలకమైన వ్యక్తులు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు ఉన్నారు. ఈ ముఠా సభ్యులు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుత్తిలలో క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మార్చుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద డిపాజిట్లు పెట్టి మొబైల్ ఫోన్ల ద్వారా పందేలు ఆడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, యువకులు, రోజు కూలీలు బెట్టింగ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ బెట్టింగ్ మాఫియాను నిర్వహిస్తూ... ప్రతి మ్యాచ్ ద్వారా రూ.లక్షల ఆదాయం గడిస్తున్నారు. తాడిపత్రిలో కొన్ని రోజుల క్రితం బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు
సాక్షి, గుంటూరు: ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రికెట్ బుకీల మాయ మాటలు నమ్మి సాధారణ, మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసులకు పట్టుబడి జైలు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరంతా క్రికెట్ బెట్టింగ్ బుకీల మాయ మాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయారు. ఎవరిని కదిలించినా బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. మ్యాచ్ ఏదైన పందేం కాసేది ఏవైపైనా, ఎన్ని పందేలు కట్టినా ఓడిపోయేది మాత్రం బెట్టింగ్ రాయుళ్లే ఈ విషయం తెలుసుకోలేని మధ్య తరగతి, సాధారణ ప్రజలు అప్పులపాలై, పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్తున్నారు. బెట్టింగ్ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. జోరుగా బెట్టింగ్లు.. ప్రస్తుతం ఐపీఎల్ 2019 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మల్లగుల్లాలు పడుతుంటే, బెట్టింగ్ రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలకు పోలీస్ శాఖలో కొందరి సహాయం ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. బుకీల నుంచి పలువురు పోలీస్ అధికారులకు మామూళ్లు సైతం ముడుతున్నాయి. టీడీపీ కీలక నేతల అండదండలతో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాలు మాఫియాగా ఏర్పడ్డాయి. ఈ మాఫియాలోని బుకీలు అమాయకులను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అమాయకులు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. బుకీల మోసం ఇలా.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ టాస్ నుంచి మ్యాచ్ గెలుపు, ఓటముల వరకు బెట్టింగ్లు నడుస్తుంటాయి. అయితే బెట్టింగ్ రాయుళ్లందరూ టీవీల్లో, ఆన్లైన్ లైవ్లో చూస్తూ ఫండర్లు పందేలు కాస్తుంటారు. ఈ బెట్టింగ్లు బుకీలు నిర్వహిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రధాన క్రికెట్ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్లైన్ సెటప్ చేసుకుని, వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్లో చోటు చేసుకునే అంశాల మీద పందెం «ధరలను నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్ ఎవరు గెలుస్తారు.. సెషన్స్ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది, బాల్ టూ బాల్, తర్వాత బాల్లో వికెట్ పడుతుందా, సిక్స్ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్లు కడుతుంటారు. అయితే 90 శాతం బెట్టింగ్ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటాయి. అబ్బ జస్ట్ మిస్ నెక్టŠస్ టైం కచ్చితంగా గెలుస్తాం.. అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. బుకీలందరూ తెలుగు తమ్ముళ్లే రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజలను క్రికెట్ బెట్టింగ్ల పేరుతో మోసం చేస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే అధికంగా ఉండటం గమనార్హం. గత ఐపీఎల్ సీజన్లో పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అదే సీజన్లో చిలకలూరిపేటలో పట్టుబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్ కుమార్ టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం. కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్, పెదకూరపాడు తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు బెట్టింగ్లు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఘటన జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే మిగిలేది విషాదమే క్రికెట్ బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బుతో స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా దుఖఃమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్లలో డబ్బులు పెట్టి నష్టపోవద్దు. కష్టాలు కొనితెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్య తరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ బుకీలు మోసం చేస్తుంటారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెంట్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బెట్టింగ్లకు పాల్పడి అరెస్టు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ -
పాఠశాల విద్యార్థుల పందేలు!
శంషాబాద్: శంషాబాద్లో ఐపీఎల్ పందేలు జోరుగా సాగుతున్నాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఐపీఎల్ పందేలు కాస్తున్నారు. డబ్బుల విషయంలో తేడాలు వస్తే ఘర్షణకు దిగుతున్నారు. తాజాగా మధురానగర్, ఆర్బీనగర్కు చెందిన కొందరు విద్యార్థులు ఐపీఎల్ పందెం డబ్బుల విషయమై గొడవలకు దిగారు. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదే విషయమై తాజాగా గురువారం కూడా మరో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కాలనీలో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థులను మందలించి సర్దిచెప్పారు. పందేలుకాసే విద్యార్థులంతా ఏడో తరగతి నుంచి పదోతరగతి లోపు విద్యార్థులే. స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ తీరుగా ఐపీఎల్ పందేల ఉచ్చులో చిక్కుకుపోతున్న తీరుతో తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మొహిన్ మహల్లాలో.. పట్టణంలో మొహిన్ మహల్లా బస్తీ ఐపీఎల్తో పాటు సాధారణ క్రికెట్ పోటీల పందెలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. గతంలో పలుమార్లు ఇక్కడ ఐపీఎల్ పందెం రాయుళ్లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిఘా కొరవడడడంతో ప్రతిరోజు లక్షల రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నాయి. బెట్టింగ్ల ఉచ్చులో చిక్కుకుపోయిన కొందరు యువకులు ఇప్పటికే లక్షల రూపాయల్లో అప్పుల పాలయ్యారు. గతంలో ఐపీఎల్ పందెలుకాసి ఏకంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డుపాలైన వ్యక్తులు స్థానికంగా పదుల సంఖ్యల్లోనే ఉన్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావడంతో స్థానికంగా పందేల జోరు కొనసాగుతోంది. రెండురోజుల కిందట పందెంలో డబ్బులు కాసి ఓడిపోయిన వ్యక్తి దళారీకి డబ్బులు చెల్లించకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లలో స్థానికంగా కొందరు యువకులు దళారులుగా ఉండి నగరంలో బెట్టింగ్ నిర్వహించే వారితో అనుసంధానంగా దందా నడిపిస్తున్నారు. పందెం కాసే వారికి వీరే డబ్బు సమకూర్చుతున్నారు. తీరా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చే సమయానికి దాడులు కూడా చేస్తున్నారు. బెట్టింగ్లపై పోలీసుల నిఘాను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బెట్టింగ్ ముఠా అరెస్ట్
చాంద్రాయణగుట్ట: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్నుమా, ముస్తఫానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్రం, సుల్తాన్ఖాన్, మహ్మద్ అక్తర్, పర్వేజ్ ముఠాగా ఏర్పడి ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన కింగ్స్–11 పంజాబ్, ఢిల్లీ క్యాపిట్స్ ఐపీఎల్ మ్యాచ్కు సెల్ఫోన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎస్సై రమేష్ నాయక్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఫర్వేజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,00,500 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్ను ఇన్స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వీరే... కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్సాదీక్, శ్రీకాంత్రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు. కీలక వ్యక్తుల అరెస్ట్ మిర్యాలగూడ అశోక్నగర్కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్నగర్కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్నగర్లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మొబైల్ గాంబ్లింగ్ మత్తులో యువత
పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సాంకేతిక పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు క్యాండీక్రష్లాంటి గేమ్స్ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్ గేమ్లపై పడింది. జిల్లాలో ఎటుచూసినా యువతనోట ఎంజీ మాటే. ఈ జూదానికి బానిసైనవారిలో కళాశాలల విద్యార్థులుండడం బాధాకరం. కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. నేడు మండల కేంద్రాలకు ఇది వ్యాపించింది. రూ.10 నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు :గతంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగేది. ఇప్పుడు ట్రెండ్మారింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న కొత్త మొబైల్ గ్యాంబ్లింగ్ గేమ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్ కాíసినోస్, ప్లే కార్డ్ ఎక్స్ప్రెస్, రమ్మీ, రియల్ మనీ క్యాసినో, ఫాస్ట్ బెట్టింగ్, ఈజీటు ఎర్న్, క్యాండీక్రష్ బెట్టింగ్ ఇలా రకరకాల బెట్టింగ్లు ఉన్నాయి. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునే గ్యాంబ్లిగ్ యాప్స్ వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్టైమ్, రాలెట్ రాయల్, బ్లాక్ జాక్, స్లాట్ మిషీన్, లకీడే,స్పిన్టు విన్, హార్స్ బెట్టింగ్, సూపర్ స్నేక్, జాక్పాట్ రాజా, టీన్పతి గోల్డ్,బింగో లాంటి గేమ్స్లో నిమిషాల్లో బెట్టింగ్ జరుగుతోంది. నలుగురు కలిస్తే బెట్టింగ్లే మామూలుగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లే యూత్ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ల కంటే చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. బంగారు ఆభరణాలు, మొబైల్ఫోన్లు, బైక్లు సైతం బెట్టింగ్లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతోపాటు మంచి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో కూడా రాత్రుళ్లు మేలుకుని కూడా ఈ గేమ్స్ ఆడుతున్నారు. పోలీసులు కనుక్కోలేరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె,పలమనేరులో యూత్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్ ఆడుతున్నామనో, స్మార్ట్ ఫోన్లో గేమ్స్ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి పోలీసులు సైతం ఏం చేయలేక పోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన తమ పిల్లలను ఎలా దారినపెట్టాలో అర్థంగాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. -
బెట్టింగ్ గుట్టు రట్టు
నెల్లూరు(క్రైమ్): ఓ ఫైనాన్షియర్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన వేదాయపాళెం పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడిచేసి బుకీతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం వేదాయపాళెం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు నిందితుల వివరాలను వెల్లడించారు. చంద్రమౌళినగర్కు చెందిన బి.సురేంద్ర ఫైనాన్స్ వ్యాపారి. అతను తన స్నేహితులైన భక్తవత్సనగర్లో నివాసం ఉంటున్న కారు డ్రైవర్ పి.శ్రీకాంత్, చంద్రమౌళినగర్లో ఉంటున్న కిరాణా వ్యాపారి రాజేష్, వేదాయపాళెంకు చెందిన కిరణ్లతో కలిసి కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. వేదాయపాళెంలోని ఓ ఫ్యాన్సీ షాపు మిద్దెపైన గదిలో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లో ప్లే 365 యాప్ను వినియోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం తెలియడంతో వేదాయపాళెం పోలీసులు కొంతకాలంగా నిఘా ఉంచారు. గురువారం న్యూజిలాండ్ – ఇండియా వన్డే మ్యాచ్కు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఇ¯Œన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి కేంద్రంపై దాడిచేశారు. పోలీసుల రాకను గమనించిన కిరణ్ అక్కడినుంచి పరారవగా సురేంద్ర, శ్రీకాంత్, రాజేష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.50 లక్షలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కిరణ్ కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సమాచారం అందించండి బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్సైలు సీహెచ్ కొండయ్య, మస్తానయ్య, క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో:సెల్ఫోన్ల ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరుగుతున్న రెనీగ్రేడ్స్, సిడ్నీ థండర్ టీ–20 మ్యాచ్పై, కేఎఫ్సీ బిగ్బాష్ లీగ్ 2018–19పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఫీల్ఖానా వాసి సూరజ్ వ్యాస్ను షాహినాయత్గంజ్ ఠాణా పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5,38,000 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ఎల్ఈడీ టీవీ, ఒక ల్యాప్టాప్, రెండు ప్యాకెట్ డైరీలను స్వాధీనం చేసుకున్నారు.డిగ్రీ పూర్తి చేసి మూడు కంపెనీల్లో అకౌంటెంట్గా పనిచేసిన సూరజ్ వ్యాస్ జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం 2017 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తదుపరి విచారణ కోసం షాహినాయత్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావు తెలిపారు. పరారీలో ఉన్న విశాల్ కోసం గాలిస్తున్నామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
కర్నూలు : కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులకు చిక్కిన వారంతా ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్గ్రా డ్యుయేట్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు కావడం గమనార్హం. కర్నూలు నగరం ఎఫ్సీఐ కాలనీలోని కేఎంసీ పార్కు వద్ద బుధవారం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను మూడో పట్టణ పోలీసులతో కలసి స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దాడుల్లో 15 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నారు. పట్టబడిన వారి వద్ద నుంచి రూ.5.58 లక్షల నగదు, రూ.92 లక్షల విలువ చేసే చెక్కులు, రూ.2.21 కోట్ల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, 30 సెల్ఫోన్లు, రెండు కాలిక్యులేటర్లు, 5 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ డి.శ్రీనివాసులుతో కలసి ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు. రెండు గ్రూపులుగా.. కర్నూలు మండలం భూపాల్నగర్కు చెందిన పాలకుర్తి విశ్వనాథ్రెడ్డి ప్రధాన సూత్రధారిగా కర్నూలు నగరం లక్ష్మీనగర్కు చెందిన మొగలి యల్లగౌడ్, కృష్ణానగర్కు చెందిన బవనాసి అనిల్కుమార్, బుధవారపేటకు చెందిన పాషావలి, అరోరా నగర్కు చెందిన పేరుమల సాగర్, పత్తికొండ పట్టణానికి చెందిన బండ సందీప్, కర్నూలు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన కట్టుబడి శ్రీధర్, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కరణం ప్రభాకర్, తాండ్రపాడుకు చెందిన ప్రకాష్ గౌడ్, అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన జిట్టా నరేష్, పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం శ్యాంబాబు, కర్నూలు నగరం సంతోష్నగర్కు చందిన షేక్ సద్దాం, భూపాల్నగర్కు చెందిన బత్తిన సురేంద్ర ఒక గ్రూపు, మరో ప్రధాన సూత్రధారి కర్నూలు నగరం బి.క్యాంప్లో నివాసముంటున్న ఫషీవుల్లా అలియాస్ జానకిరామ్ నేతృత్వంలో మరో గ్రూపు కొంతకాలంగా కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. పరారీలో 11 మంది... పై రెండు గ్రూపులతో అనుసంధానంగా పనిచేస్తూ క్రికెట్ బుకీలకు లాభాలు ఆర్జించిపెడుతున్న మరో 11 మంది పరారీలో ఉన్నారు. మొదటి గ్రూపులో జానకిరామ్ అలియాస్ జేడీ, శివశంకర్, తిమ్మయ్య, రాజశేఖర్రెడ్డి, విశ్వనాథరెడ్డి, పుల్లయ్య గౌడ్, రెండో గ్రూపులో షఫీవుల్లా కింద పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇనాయతుల్లా ఖాద్రి, సుదర్శన్రెడ్డి, శ్రీకాంత్, అశోక్, నాగరాజు తదితరులు పరారీలో ఉన్నారు. నిందితులపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ (క్రికెట్ బెట్టింగ్) కింద కేసు నమోదయ్యింది. రూ. కోట్లలో లావాదేవీలు... షఫీవుల్లా వివిధ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సంపాదించిన ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకపోగా పేదరికంలో మగ్గుతున్నట్లు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు, అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మట్కా, బెట్టింగ్ రాయుళ్ల ఆస్తులనుకోర్టుకు అటాచ్ చేయిస్తాం.. మట్కా, బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నడిపించేవారి ఆస్తులను జప్తు చేసి, కోర్టుకు అటాచ్ చేయిస్తామని ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై టెక్నాలజీ ద్వారా నిఘా పెట్టామన్నారు. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించినట్లయితే (లాడ్జిలైనా సరే) వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల వాట్సాప్ నంబర్ 77778 77722కు సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు. మూడో పట్టణ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ తిరుపాల్ బాబు, ఏఎస్ఐ విశ్వనాథ్రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
బెట్టింగే వీరి ప్రొఫెషన్
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్ ప్రొఫెషన్గా మార్చుకొన్న ఇద్దరు సోదరులతో పాటు వారికి సహకరించిన ఓ ఏజెంట్, ఓ గ్యాంబ్లర్ను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాతనగరంలోని ఘాన్సీబజార్కు చెందిన అకింత్ అగర్వాల్(28), మోహిత్ అగర్వాల్(25) క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నిరంతరంగా బిగ్బాష్ లీగ్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెట్టింగ్లపై నిఘా పెంచారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్ ఓ గదిని అకింత్ అగర్వాల్, మొహిత్ అగర్వాల్తో పాటు జిడిమెట్ల ప్రాంతానికి చెందిన యాసిమిన్ మహేష్(44) కలెక్షన్ ఏజెంట్, బెట్టింగ్ సబ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్న చార్కమాన్ బస్తీకి చెందిన రోహిత్ అగర్వాల్ (27) అద్దెకు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు, ఓ క్యాలికులేటర్, స్కోరింగ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అంకిత్, మొహిత్ అగర్వాల్లు 2016 క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుత సుల్తాన్బజార్ పోలీసులకు చిక్కి జైలుశిక్ష సైతం అనుభవించారు. అదే తరహాలో 2018 ఐపీఎల్ క్రికెట్ సందర్భంలో రాజేంద్రనగర్, వెస్ట్మారేడ్పల్లి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ లావాదేవీలన్నింటినీ వీరు కొనసాగిస్తున్నారని డీసీపీ ప్రకాష్రెడ్డి తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడకూడదని డీసీపీ సూచించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా చాలామంది యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారని చెప్పారు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి,హైదరాబాద్: హైటెక్ పంథాలో ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్ఫోర్స్ బృందం రట్టు చేసింది. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పోలీసులు రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి కొత్వాల్ అంజనీకుమార్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పంటర్గా మొదలై బుకీగా..: హిమాయత్నగర్కు చెందిన వ్యాపారి అలోక్ జైన్ ముందు పంటర్గా పందాలు కాసి నష్టపోయాడు. దీంతో తన సోదరుడు అభిషేక్ జైన్, స్నేహితుడు మేహుల్ కే మార్జారియాలతో కలి సి బుకీగా మారాడు. చిక్కడపల్లిలో ఓ ఫ్లాట్ తీసుకుని బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి పందాలు అంగీకరి స్తూ ఆ లెక్కల్ని రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ ముగిశాక పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ నిష్పత్తిని సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. యాప్ తయారు చేయించిన సుభాష్ దేశంలోనే ప్రముఖ బుకీగా పేరున్న రాజస్థాన్ వాసి సులేమాన్ సురానీ అలియాస్ సుభాష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. బెట్టింగ్స్ నిర్వహణకు సుభాష్ వెబ్సైట్, యాప్ రూపొందించాడు. వీటిల్లోకి లాగిన్ కావాలం టే యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తప్పనిసరి. గత ఐపీఎల్లో అలోక్ ఇందులో భాగస్వామిగా చేరాడు. అలోక్ వద్ద బెట్టింగ్కు పాల్పడే పంటర్లకూ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేందుకు ఒక్క క్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తూ కొంత సుభాష్కు పంపిస్తున్నాడు. ఆ సైట్, యాప్స్లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ నిష్పత్తి అన్నీ అక్కడే కనిపిస్తాయి. క్రికెట్కే కాకుండా ఏ క్రీడకైనా ఈ యాప్ ద్వారా పందాలు కాసుకోవచ్చు. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు ఈ యాప్లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు హవా లా మార్గంలో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. సమస్యలుంటే వాట్సాప్ ద్వారా నే సంప్రదింపులు జరపాలి. అనేక మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహించిన అలోక్ గ్యాంగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో బృందం దాడి చేసి అలోక్, అభిషేక్, మార్జారియాలను అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైట్, యాప్లను సుభాష్ బ్లాక్ చేశాడు. సుభాష్పై ఎల్ఓసీ జారీ చేయించాలని నిర్ణయించారు. ఈ అంశాల్లోనే బెట్టింగ్.. 1. టాస్ ఏ జట్టు గెలుస్తుంది? 2. ఫేవరేట్ టీమ్ ఏది? 3. ఓ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ దాటతారు? 4. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? 5. మొదటి సెషన్లో (6 ఓవర్లు) ఎన్ని రన్స్ చేస్తారు? 6. రెండు, మూడు, నాలుగు సెషన్స్లో ఎన్నేసి నమోదవుతాయి? -
పోలీసుల మెడకు బెట్టింగ్ ఉచ్చు
ప్రొద్దుటూరు క్రైం : మట్కా, క్రికెట్ పందేలు, పేకాట ఈ మూడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. సామాన్యుడి నుంచి కోట్లకు పడగలెత్తిన వారు సైతం వీటిలో ఏదోఒక జూదం ఆడుతున్నారు. కొందరు నిర్వహిస్తున్నారు. వీటిని నియంత్రించడంలో పోలీసుల కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. కానిస్టేబుల్ మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అసాంఘిక కార్యకలాపాలను రూపు మాపడానికి అహర్శిశలు కృషి చేస్తున్నారు. రోజు వారి విధులు, ఉత్సవాలు, వీఐపీల బందోబస్తులు ఎన్ని ఉన్నా మట్కా, క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు సిబ్బంది పోలీసు శాఖకు మాయని మచ్చ తెస్తున్నారు. పోలీసుల్లో కొందరు క్రికెట్ పందేలను ఆడటమే గాక బుకీలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రికెట్ బుకీలపై దాడి చేసిన నేపథ్యంలో పోలీసు– బుకీల బంధం బయట పడింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసు అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుకీ ల్యాప్టాప్లో పోలీసుల నెంబర్లు కొన్ని రోజుల క్రితం కడప పోలీసులు బెంగళూరులో దాడులు నిర్వహించి పలువురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. కొంత డబ్బుతో పాటు వారి వద్ద నుంచి ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రొద్దుటూరులోని 30 మందికి పైగా క్రికెట్ బుకీలు, సబ్ బుకీలు, బాయ్ల పేర్లు, సెల్నెంబర్లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు కూడా ఉన్నాయి. పోలీసుల పేర్లను పక్కన పెట్టిన అధికారులు ముందుగా ల్యాప్టాప్లో ఉన్న బుకీల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని రోజుల క్రితమే బుకీలకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టిన అధికారులు పోలీసుల పాత్రపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రొద్దుటూరులోని ముగ్గురు కానిస్టేబుళ్లను పలు మార్లు విచారణ కూడా చేసినట్లు తెలుస్తోంది. కానిస్టేబుళ్లతో సంబంధాలు ఉన్న ప్రధాన బుకీల వివరాలను అధికారులు సేకరించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన స్థానిక అధికారులు నివేదికను జిల్లా అధికారులకు పంపినట్లు సమాచారం. బుకీలకు సమాచారం ఇవ్వడంపై సీరియస్.. మట్కా, క్రికెట్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. అయితే మట్కా కంపెనీ నిర్వాహకులు, క్రికెట్ బుకీలతో సంబంధాలను కొనసాగించడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. దాడుల సమాచారాన్ని వారికి చేరవేయడం, వారితో నెల మామూళ్లు తీసుకోవడం తదితర అంశాల పట్ల జిల్లా ఎస్పీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఒక లాడ్జిలో క్రికెట్ బుకీలు ఉన్నారని ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. పక్కా ప్లాన్తో పోలీసులు బెంగళూరుకు వెళ్లగా అక్కడి లాడ్జీలో ఎవ్వరూ లేరు. స్థానికంగా ఉన్న కొందరు పోలీసులు బుకీలకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గ్రహించారు. ఇలా అనేక సార్లు దాడుల సమాచారం బుకీలకు, మట్కా కంపెనీ నిర్వాహకులకు అందడంతో ప్రొద్దుటూరు పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుకీలతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న కొందరిని పిలిపించి అధికారులు విచారణ చేశారు. కానిస్టేబుల్పై వేటుతోనైనా మారతారా.. ఈ క్రమంలోనే ఒంటిమిట్టకు చెందిన ఓబులేసు అనే కానిస్టేబుల్పై పోలీసు అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రీ టౌన్ పోలీసులు కొందరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకొని విచారించగా ఒంటిమిట్ట కానిస్టేబుల్ పేరు బయటికి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి వారం రోజుల క్రితం రిమాండుకు పంపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇంటికే ఒంటిమిట్ట కానిస్టేబుల్కు బుకీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టాం. క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ,బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశాం. క్రికెట్ బుకీలకు సహకరించే వారు, అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు ఇంటికి వెళ్తారు. ఎవ్వరిని వదలం.– శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ -
వందల్లో బుకీలు.. వేలల్లో పంటర్లు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: గాంధీరోడ్డులో బాగా పేరున్న కుటుంబం.. ఆ కుటుంబంలోని ఒక యువకుడు కొన్ని నెలల నుంచి ఇంట్లో తెలియకుండా క్రికెట్ పందేలు ఆడుతున్నాడు. రూ. వందల్లో ప్రారంభమైన క్రికెట్ బెట్టింగ్ రూ. లక్షలకు చేరుకుంది. కనీస పరిజ్ఞానం లేకుండానే క్రికెట్ జట్లపై రూ. లక్షల్లో పందేలు కాసేవాడు. ఇలా అతను సుమారు రూ. 40 లక్షలకు పైగా ప్రధాన బుకీకి బాకీ పడ్డాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. బయట తెలిస్తే పరువుపోతుందని క్రికెట్ బుకీకి డబ్బు కట్టారు. మైదుకూరు రోడ్డులోని ఒక యువకుడు బంగారు దుకాణం నిర్వహించేవాడు. రెండేళ్లలోనే రూ. లక్షలు సంపాదించాడు. అయితే తోటి మిత్రుల మాటలు విని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. సుమారు రూ.35 లక్షలు దాకా పోగొట్టుకున్నాడు. బుకీల నుంచి ఒత్తిళ్లు రావడంతో దిక్కు తోచని స్థితిలో భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. డబ్బు తీసుకొని వస్తేనే కాపురానికి పిలుచుకుంటాను లేకుంటే వద్దని చెప్పాడు. ప్రొద్దుటూరులోని ఎక్కువ మంది బుకీలు చేసే పని ఇదే. డబ్బున్న యువకులను ఎంచుకొని బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. పరువు పోతుం దనే భయంతో బంగారు నగలు విక్రయించి బాకీ కట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊళ్లోనూ క్రికెట్æ బెట్టింగ్ బాధితులు ఉన్నారు. గతంలో అప్పుల పాలై ఆత్మహత్యలకు ప్రయత్నించిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఉన్నారు. సంపన్నులు, వ్యాపారుల పిల్లలే టార్గెట్.. క్రికెట్ ఆట ద్వారా సంపాదనకు అలవాటు పడిన బుకీలు అమాయకులపై ఆశల వల విసురుతున్నారు. ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలు జిల్లాలోని తమ బుకీల ద్వారా మండల కేంద్రాల్లో సబ్ బుకీలను, బాయ్లను నియమించుకొని క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కొత్త వ్యక్తులను కూడా బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. 20–20 మ్యాచుల్లో పందేలు కాస్తే సునాయసంగా డబ్బు గెలుచుకోవచ్చని మభ్యపెడుతున్నారు. ఫలాన వ్యక్తి మా దగ్గర బెట్టింగ్ ఆడి రూ.లక్షలు గెలుచుకున్నారంటూ నమ్మ బలుకుతున్నారు. ధనికులు, వ్యాపార వర్గాలకు చెందిన పిల్లలపై బుకీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రూ.లక్షలు బాకీ పడ్డాక బుకీలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గ్రామాలకు ప్రాకిన బెట్టింగ్ జాడ్యం.. క్రికెట్ పందేల జాడ్యం గ్రామ స్థాయికి చేరింది. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్ పందేలు ఇప్పుడు గ్రామాల్లోకి గల్లీలకు ప్రాకింది. క్రికెట్ పందేలు అడే వారే కాకుండా బుకీలు కూడా గ్రామల్లో ఎక్కువగా ఉన్నారు. దువ్వూరు, ఎర్రగుంట్ల, చాపాడు, ఆర్టీపీపీల నుంచి పందేలు నిర్వహించడానికి ప్రొద్దుటూరుకు వస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్బాద్ గ్రామంలో పెద్ద సంఖ్యలో బుకీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఒక ప్రధాన బుకీ ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సబ్ బుకీలను నియమించుకొని అతను ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరో ప్రధాన బుకీ హైదరాబాద్లో ఉంటూ బినామీలను నియమించుకొని కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ప్రొద్దుటూరులోని పలు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల పలువురు బుకీలుగా అవతారం ఎత్తినట్లు తెలిసింది. కనిపించని పోలీసుల చర్యలు.. గతంలో క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయాల్లో ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న బుకీలను పోలీస్స్టేషన్లలో కూర్చోబెట్టేవారు. మ్యాచ్లు ముగిసే వరకు స్టేషన్లలోనే వారిని ఉంచుకునేవారు. ఈ చర్యల వల్ల కొంత మేర పందేలు అదుపులో ఉండేది. గతంలో పని చేసిన డీఎస్పీలు శ్రీనివాసులరెడ్డి, పూజితానీలం ఈ విధానం అనుసరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రతి వీధిలోనూ క్రికెట్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు, వేలల్లో పంటర్లు (ఆడేవారు) ఉన్నారు. చాలా మంది ప్రధాన బుకీలు హైదరాబాద్, బెంగుళూరు, గోవా, విజయవాడ కేంద్రాలుగా చేసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ – ఇండియా క్రికెట్ మ్యాచుల్లో బుకీలు బాగా లాభ పడినట్లు తెలుస్తోంది. బాగా లాభాలు రావడంతో పలువురు బుకీలు విదేశీ టూర్లకు కూడా వెళ్లినట్లు సమాచారం. -
బెట్టింగ్ భూతం!
బెట్టింగ్ మాఫియా ఉచ్చులో చిక్కుకొని యువత విలవిల్లాడుతోంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారాలన్న అత్యాశతో కొందరు యువకులు శక్తికి మించి అప్పులు చేస్తున్నారు. కోటీశ్వరుల మాట అటుంచితే ఉన్న డబ్బులు పొగొట్టుకుని.. చేసిన అప్పులు గుదిబండలుగా మారి.. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కల్పిస్తున్నారు. బందరులో గతంలో కొంత మంది అప్పుల బాధతో ఊరొదిలి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రాణాంతక వ్యసనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మొన్న ఐపీఎల్ టీ–20 మ్యాచ్లు.. నిన్న చాంపియన్ ట్రోఫీ.. నేడు ఇండియా– వెస్టిండిస్ వన్డే మ్యాచ్లు.. టోర్నీ ఏదైతేనేం.. పోటీదారు ఎవరైతేనేం.. బుకీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో యువతే లక్ష్యంగా బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. దీనికి బానిసవుతున్న యువత అత్యాశకు పోయి అప్పులపాలవుతోంది. ఇండియా – వెస్టిండీస్ మ్యాచ్లకుభారీ బెట్టింగ్లు.. వేసవిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో బందరులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. అలాగే చాంపియన్ ట్రోఫీలో ఇండియా–పాక్ మధ్య జరిగిన మ్యాచ్లకు విపరీతంగా బెట్టింగ్ జరినట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియా – వెస్టిండీస్ వన్డే మ్యాచ్లకు సంబంధించి బందరులో బుకీలు భారీ స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ çసిరీస్లో ఐదు వన్డే మ్యాచ్లు ఉండగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరిగాయి. విద్యార్థులే టార్గెట్.. ఈ వన్డే మ్యాచ్లకు సంబంధించి బుకీలు ఉద్యోగులు, విద్యార్థులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి ఉచ్చులో పడి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు సమాచారం. మ్యాచ్లు పోగొట్టుకుని కట్టిన పందెం డబ్బులు బుకీలకు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్లను సైతం బుకీల వద్ద ఉంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చేసిన తప్పులు తల్లిదండ్రులకు తెలియకుండా దాచి ఉంచేందుకు విద్యార్థులు బైక్లను తమ స్నేహితులకు ఇచ్చినట్లు అబద్దమాడుతూ బుకీలకు అప్పజెప్పుతున్నారు. ఫ్యాన్సీ బెట్టింగ్.. ఇండియా – వెస్టిండీస్ వన్డే మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. సరాసరి మ్యాచ్ బెట్టింగ్లే కాకుండా ఫ్యాన్సీ బెట్టింగ్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఓవరులో ఎంత కొడతారు, ఎన్ని వికెట్లు తీస్తారు. ఎన్ని ఫోర్లు కొడతారు, సిక్సర్లు ఎన్ని కొడతారు వంటి అంశాలపైనా పెద్ద మొత్తంలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. నిద్దరోతున్న నిఘా! బందరులో క్రికెట్ బెట్టింగ్లు భారీ స్థాయిలో జరుగుతున్నా పోలీసులు బుకీల వైపు కన్నెత్తిచూడకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ మ్యాచ్ల్లో పేరుమోసిన బుకీలతో పాటు ఒకప్పుడు బుకీల వద్ద పనిచేసిన అనేక మంది ఇప్పుడు నేరుగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఉపేక్షించేది లేదు.. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. తక్షణమే అదుపులోకి తీసుకుంటాం. బుకీలపై మరింత నిఘా పెడతాం. పట్టుబడిన వారిపై కేసులు పెడతాం. ఎలాంటి సిఫార్సులను పట్టించుకుని ప్రసక్తేలేదు. –మహబూబ్బాషా, బందరు డీఎస్పీ -
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్టు
కడప అర్బన్ : ఎక్కడ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ మ్యాచ్లు జరిగినా బెట్టింగ్లకు పాల్పడుతూ అమాయక ప్రజలను ఆ వ్యసనానికి బానిసలుగా మారుస్తున్న నలుగురు క్రికెట్ బుకీల ముఠాను సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వివరాలను ఆదివారం సాయంత్రం కడప సీసీఎస్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ వెల్లడించారు. ప్రొద్దుటూరు టౌన్ నడింపల్లెవీధికి చెందిన షేక్ ఇమ్రాన్, ఆర్ట్స్ కళాశాల రోడ్డులో నివసిస్తున్న కందుల కుమార్ అలియాస్ రాజేష్, ముళ్ల మైనుద్దీన్, షేక్ మహబూబ్బాషా ముఠాగా ఏర్పడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తమ మకాం మారుస్తూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల సమయాల్లో బెట్టింగ్లకు పాల్పడుతారు. దీంతో వారిపై పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రాజంపేట మండలం మన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి అమ్మకం గురించి తెలుసుకుని దాడి చేశారు. పై నలుగురు నిందితులు టీవీలో ఇండియా–వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ చూస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ గంజాయి పెట్టుకుని అమ్ముతూ ఉండగా సీసీఎస్ డీఎస్పీ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో రెండున్నర కిలోల గంజాయి, రూ. 8,00,550 నగదు, బొలెరో వాహనం, పది సెల్ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు కృషి చేసిన పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వరరెడ్డి, మన్నూరు ఎస్ఐలను, సీసీఎస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుళ్లు భూపాల్రెడ్డి, విశ్వనాథరెడ్డి, జగన్నాథరెడ్డి, కానిస్టేబుళ్లు పరమేష్, ప్రసాద్, బాలరాజు, హోంగార్డు సుబ్బరాయుడులను డీఎస్పీ అభినందించారు. -
క్రికెట్ బుకీల అరెస్టు
సాక్షి, అమరావతిబ్యూరో: ల్యాప్ట్యాప్లు, సెల్ఫోన్లు వినియోగిస్తూ ఆన్లైన్లో రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ప్రధాన బుకీ సప్పా రవిచంద్ర మౌలిని విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బుకీతోపాటు బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో 21 మందిని కూడా అదపులోకి తీసుకుని వారివద్ద నుంచి సెల్ఫోన్లు, లాప్ట్యాప్లు, టీవీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల జరిగిన ఆసియా కప్ క్రికెట్ పోటీల సందర్భంగా నగరంలో ‘బంతి బంతికి బెట్టింగ్’ అనే శీర్షిక పేరిట సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసు కమిషనర్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసే బాధ్యతలను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులకు అప్పగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధాన బుకీతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. విజయవాడ కేంద్రంగా బెట్టింగ్.. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు విజయవాడ కేంద్రంగా రాజ మండ్రి, గుంటూరు, భీమవరం తదితర ప్రాం తాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై టాస్క్ ఫోర్సు పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యం లో గత నెల 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంట్లో రెండో అంతస్తులో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్ట్యాప్లు, 19 సెల్ఫో న్లు, ఎల్ఈడీ టీవీ, ఒక కారుతోపాటు రూ. 1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడ, గుం టూరు నగరాలకు చెందిన మరో 12 మందిని కూ డా అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.51 లక్షల నగదుతోపాటు 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ‘టాస్క్ఫోర్సు’ దాడులతో గుట్టురట్టు.. నగరంలో ఒకే రోజు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేశాక.. టాస్క్ఫోర్సు పోలీసులు ప్రధాన బుకీ కోసం వేట ప్రారంభించారు. గత నెలలోనే ఇబ్రహీంపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. సప్పా రవిచంద్ర నగరానికి వచ్చాడన్న సమాచారంతో పోలీసులు శనివారం అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక లాప్టాప్తోపాటు రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ‡రవీచంద్ర ఇచ్చిన సమాచారంతో గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు చెందిన ఆరు మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నేరాలపై ఉక్కుపాదం : సీపీ రాజధాని ప్రాంతంమైన విజయవాడలో క్రికెట్ బెట్టింగ్, హైటెక్ వ్యభిచారం, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీసు కమిషనర్ ద్వారాక తిరుమలరావు స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన ప్రధాన బుకీ రవిచంద్ర అరెస్టు చేసిన సందర్భంగా శనివారం సీపీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎవరైనా క్రికెట్బెట్టింగ్లు నిర్వహించినా.. పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని.. రౌడీషీట్లు తెరవడంతోపాటు పీడీ యాక్ట్ను ప్రయోగిస్తామని.. బహిష్కరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. -
ఆరుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
కడప అర్బన్: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురు బుకీలను కడప పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 3న సాయంత్రం సౌత్ఆఫ్రికా– జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా ఆధ్వర్యంలో అర్బన్ ఇన్చార్జి సీఐ టీవీ సత్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కడప తాలూకా ఇన్చార్జి ఎస్ఐ జి. అమర్నాథ్ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వర రెడ్డి, క్రైం పార్టీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి పాల్గొన్నారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ షేక్ మాసుంబాషా గురువారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ♦ కడప నగరం అక్కాయపల్లి శాస్త్రి నగర్లో ఇంటి ముందు వరండాలో కొత్తపల్లి శివారెడ్డి అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక టీవీ, రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను పెండ్లిమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ♦ మరోకేసులో తాలూకా పరిధిలో చౌటపల్లి రోడ్డు రైల్వేగేటు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.55 లక్షలు నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ♦ ఈ సంఘటనలో అరెస్టయిన వారిలో కడప నగరం ఇండస్ట్రియల్ ఎస్టేట్కు చెందిన గోపిశెట్టి వెంకట సామ్రాట్ బిందెల వ్యాపారం చేస్తూ, దురలవాట్లకు బానిసగా మారి క్రికెట్బుకీగా మారా>డు. ♦ శివానందపురానికి చెందిన షేక్ మహమ్మద్ సేల్స్మాన్గా పనిచేస్తూ క్రికెట్బుకీగా మారాడు. ♦ పెండ్లిమర్రి మండలం, నందిమండలానికి చెందిన కోవూరు రవిశంకర్ ఫోటోస్టూడియోతో జీవనం సాగిస్తూ, క్రికెట్ బుకీగా మారాడు. ♦ ఓ కార్యాలయంలో ఆఫీస్బాయ్గా పనిచేస్తున్న, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నివాసియైన గుగ్గుళ్ల మహేశ్వర రెడ్డి క్రికెట్ బుకీగా మారాడు. ♦ కడప నగరం అక్కాయపల్లికి చెందిన పోలిరెడ్డి కొండారెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్ బుకీగా మారాడు. ♦ రెండు కేసుల్లో ఆరుగురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి రూ. 3.05 లక్షలు నగదు, ఒక టీవీ, 9 సెల్ఫోన్లు, రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ♦ క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ టీవీ సత్యనారాయణ, కడప తాలూకా ఇన్చార్జి ఎస్ఐ జి. అమర్నాథ్ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, క్రైం పార్టీ సిబ్బంది హుస్సేన్, శేఖర్, నరేంద్ర, సాయిగోపి, సుధాకర్, కడప తాలూకా సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు. -
క్రికెట్ బెట్టింగ్తో కూలుతున్న జీవితాలు
నెల్లూరు, గూడూరు: క్రికెట్ బెట్టింట్ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతకాలం క్రితం పోలీసు యంత్రాంగం బెట్టింగ్పై ఉక్కుపాదం మోపింది. దీంతో చాలావరకు తగ్గిందని అంతా భావించారు. అయితే సోమవారం గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పడాల సుధాకర్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. దీనికి బెట్టింగ్ కారణమని బయటపడటంతో సంచలనమైంది. ఏం జరగిందంటే.. సేకరించిన సమాచారం మేరకు.. సైదాపురం పోస్టాఫీస్లో పనిచేస్తున్న సుధాకర్ బెట్టింగ్ కారణంగా సుమారు రూ.1.30 కోట్లు అప్పులపాలైనట్లు చెబుతున్నారు. బయటచేసిన అప్పులే కాకుండా పోస్టాఫీస్కు చెందిన రూ.12 లక్షల మొత్తాన్ని కూడా అతను బెట్టింగ్కు వాడేయడంతో విషయం బయటకు పొక్కి ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వచ్చినట్లు సమాచారం. దీంతో అతని బంధువులు ఆ మొత్తాన్ని చెల్లించినప్పుటికీ విషయం బయటకు తెలియడంతో మూడునెలల క్రితం సుధాకర్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు అతను చేసిన అప్పులు తీర్చేందుకు బెట్టింగ్నే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మరింత అప్పులపాలయ్యాడు. ఇతని భార్య ఉపాధ్యాయురాలు కాగా, ఆమె చేత కూడా లోన్లు పెట్టించి అప్పులు తీసుకుని ఆ మొత్తాలను కూడా బెట్టింగ్ల్లో పెట్టి పాగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను ఊర్లో తిరిగితే అవమానాల పాలవుతామని, కొద్దిరోజుల క్రితం గూడూరులో కాపురం పెట్టాడు. మళ్లీ చెన్నూరుకు వచ్చి అప్పులవాళ్లకు కనిపించకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇకపై ఈ అవమానాలతో తట్టుకోలేమనే సోమవారం సాయంత్రం ఉరేసుకుని మృతిచెందాడు. సుధాకర్కు మూడో తరగతి చదువుతున్న కుమార్తె, 7వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. గతంలో పలువురు.. సుమారు మూడేళ్లక్రితం చెన్నూరు గ్రామానికి చెందిన పోలి శివయ్య అనే వ్యక్తి పాత ఇనుప సామాన్లు విక్రయించి జీవనం సాగించేవాడు. అతను కూడా క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన మట్టం మునీంద్ర కూడా బెట్టింగ్తో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం కూడా క్రికెట్ బెట్టింగ్ల్లో అప్పులపాలై ఆది అనే వ్యక్తి కూడా గూడూరులో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. గ్రామంలో అప్పులపాలై ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ఇంకా కొందరు బెట్టింగ్ను బాహాటంగానే కొనసాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు దృష్టిసారించాలని కోరుతున్నారు. -
క్రికెట్ బుకీల అరెస్టు
వైఎస్ఆర్ జిల్లా,ఎర్రగుంట్ల : పాకిస్తాన్– బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,20,200లు నగదు తోపాటు రెండు కిలోల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మాసూం బాషా తెలిపారు. గురువారం ఎర్రగుంట్లలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మాలెపాడు గ్రామంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతన్నారని సమాచారం అందడంతో ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్ఐ చిరంజీవిలతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కలసి దాడి చేశారన్నారు. గ్రామానికి చెందిన వేగిలిశెట్టి వెంకటేష్ ఇంటి ముందు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్న మాలెపాడుకు చెందిన వేగిలిశెట్టి వెంకటేష్, కర్నూలు జిల్లా గోస్పాడు మండలం ఎం.చింతకుంట గ్రామానికి చెందిన కనాల శ్రీధర్లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,20,200లు నగదు తోపాటు రెండు కిలోల గంజాయిని, ఐదు సెల్ ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో మాలెపాడుకు చెందిన గుండ్లదుర్తి చిన్నరెడ్డి, ఇల్లూరు రాజేశ్వర్రెడ్డి, పసల చిన్న ఓబులపతి, పామిడి సురేంద్ర, గజ్జల సుబ్బయ్య, కలమల్ల గ్రామానికి చెందిన అంకనపల్లి అశ్వర్థ రెడ్డి ఉన్నారని చెప్పారు. క్రికెట్ బుకీలను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్ఐ చిరంజీవిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని, వారికి రివార్డును అందిస్తామని డీఎస్పీ తెలిపారు. -
బంతి బంతికి బెట్టింగ్
సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పల్లెటూళ్లకు వ్యాపించింది. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునేవారికి క్రికెట్ వేదికగా మారింది. ఎందరో ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. దేశ భవిష్యత్తును నిర్దేశించాల్సిన యువత పందెం ఉచ్చులో చిక్కుకు పోతోంది. పేదలు మొదలుకుని సంపన్నుల వరకు బెట్టింగ్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆసియా కప్ సందర్భంగా జిల్లాలో మళ్లీ క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. ముఖ్యంగా ఇండియా–పాకిస్థాన్ మధ్య మ్యాచ్లకు రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారు. జిల్లాలో చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్కు బానిసలవుతున్నారు. ప్రధానంగా చదువుకుంటున్న, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న చాలామంది పందేలు కాస్తున్నారు. వ్యాపారులు, చదువుకున్నవారితో మొదలైన బెట్టింగ్ పల్లెలకు పాకింది. నేరాలకు పాల్పడుతూ... ఈ క్రమంలో పలువురు దురలవాట్లకు బానిసలై బెట్టింగ్లో నష్టపోతూ చివరకు నేరాలకు పాల్పడుతున్నారు. స్నాచింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. నష్టపోయిన కొందరు బెట్టింగ్ నిర్వాహకులకు ఏజెంట్లుగా మారుతున్నారు. బెట్టింగ్లు నిర్వహించే బుకీలు సైతం కంప్యూటర్లు వినియోగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో పనికానిచ్చేస్తున్నారు. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంటిలో ల్యాప్టాప్లకు అనుసంధానంగా సెల్ఫోన్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏకకాలంలో దాదాపు 15 మందితో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు ఆదివారం రట్టయింది. ఈ ముఠా నుంచి 2 ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, రూ. 2 లక్షల నగదు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లోనే బెట్టింగ్ జరుగుతున్న తీరును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. నిఘా అంతంత మాత్రమే.. క్రికెట్ మ్యాచ్లు జరిగే సందర్భాల్లో బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంచడం.. అరికట్టే విషయంలో కొందరు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సంస్థాగత సమస్యలు ఒక కారణమైతే పోలీసు అధికారులు అవినీతి తదితరాలు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. గత ఏడాది తెలంగాణ రాజధాని హైదరాబాద్తోపాటు మన రాష్టంలోని విశాఖపట్నం, ఏలూరు ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలు మకాం వేసిన సంగతి వారిని అరెస్టు చేసే వరకు పోలీసు గుర్తించలేకపోయారు. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారు. అయినప్పటికీ నిఘా ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడంటే.. కృష్ణా జిల్లాలో.. విజయవాడ నగరంలోని భవానీపురం, సింగ్నగర్, కృష్ణలంక, గాంధీనగర్, గవర్నర్పేట, పటమట, పెనమలూరు, గొల్లపూడి, వన్టౌన్లతోపాటు శివారు ప్రాంతాల్లోని లాడ్జీలు, బహుళ అంతస్తుల భవనాలను నిర్వాహకులు అడ్డాలుగా చేసుకుంటున్నారు. మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడ, గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ ముఖ్య పట్టణాల్లోనూ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇతర ప్రాంతాల్లో సెల్ఫోన్, ఇంటర్నెట్ దుకాణాల నిర్వాహకులు, ఇళ్లు, లాడ్జీలు, ప్రత్యేక స్థావరాల్లో కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో.. క్రికెట్ పందేల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో డబ్బు, చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు బెట్టింగ్ కాసేయొచ్చు. ఫోన్ ద్వారా దేనికి బెట్టింగ్ కాస్తున్నామో చెప్పి, ఆన్లైన్లో డబ్బు మళ్లింపు చేస్తే సరిపోతుంది. అందుకే నిర్వాహకులు మారుమూల ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ఫోన్ల ద్వారా కార్యకలాపాలు నడిపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన పలువురు విజయవాడ శివార్లలో ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లలోని గదులు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్కు సంబంధించి ప్రత్యేక భాష వాడుకలోకి రావడంతో కొత్తవారు అర్థం చేసుకోవడం కష్ట సాధ్యంగా మారింది. -
బెట్టింగ్ బాధలతో ఆత్మహత్యాయత్నం
ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్ భూతం ఒక యువకుడ్ని ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా చేసింది. ఈ ఘటన స్థానిక ఒంగోలు వన్టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఉన్న విద్యుత్శాఖ సబ్స్టేషన్ ఆవరణలో ఉదయం 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానిక సీతారామపురానికి చెందిన బేతపూడి సాయి గత 12 సంవత్సరాలుగా విద్యుత్శాఖలో షిఫ్టు ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం డ్యూటీ ఎక్కాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే వాచ్మేన్ను పేపర్ తీసుకురమ్మని పంపాడు. అతను పేపర్ తీసుకొని వచ్చేసరికి సాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని వద్ద కీటకాల సంహరణకు వినియోగించే మందు డబ్బా కనిపించింది. భయభ్రాంతులకు గురైన వాచ్మేన్ను అతికష్టంమీద బైక్ ఎక్కించుకొని రిమ్స్కు తరలించాడు. మార్గమధ్యంలోనే వాంతులు కూడా చేసుకున్నాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సాయి తండ్రి వెంకట్రావు కథనం ప్రకారం నిత్యం నలుగురు లేదా అయిదుగురు వ్యక్తులు ఇంటికి వస్తుంటారని, ఎవరంటే స్నేహితులు అని చెబుతుండేవాడన్నాడు. తాము విచారిస్తే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసిందని తెలిపాడు. ఎంత మొత్తం అనేది మాత్రం చెప్పలేదన్నాడు. బెట్టింగ్ బాధలు తట్టుకోలేక తన ఉద్యోగాన్ని ఎవరికైనా ఇస్తే డబ్బులు వస్తాయేమోనని యత్నించాడని, చివరకు అది కూడా ఫలించక ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నామన్నాడు. సాయికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మరో 48 గంటలపాటు గడిస్తే కాని సాయి ఆరోగ్యంపై ఒక స్పష్టతకు రాలేమని వైద్యులు పేర్కొంటున్నారు. -
టీడీపీ నేతలే బుకీలు..!
టాస్ నుంచి బాల్ బాల్కి పందెం. గెలిచిన వారికి ఆనందం.. ఆస్తులు ఆవిరై ఓడిన వారికి నిర్వేదం. వీటి నడుమ బుకీలుగా మారి అమాయకుల బతుకులను బుగ్గి చేస్తున్న టీడీపీ నేతల చిద్విలాసం. ఇదీ జిల్లాలో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న క్రికెట్ బెట్టింగ్ జాఢ్యం. అభిమానాన్ని ఆసరాగా చేసుకుని ప్రాణాలతో పందేలాడుతున్న టీడీపీ నేతల కాసుల కక్కుర్తి ఇది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో అంతర్జాతీయ స్థాయి బుకీలుగా ఎదిగిన ద్వితీయ శ్రేణి నేతల బెట్టింగ్ మాఫియా కథ ఇది. ఎట్టకేలకు వీరి అరాచకాలకు కళ్లెం పడింది. జిల్లా ఎస్పీల తెగువ.. బుకీల కీలు విరిచి కటకటాల వెనక్కి పంపింది. సాక్షి,గుంటూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ల్లో అప్పుల పాలై ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అప్పుల భారంతో మొఖం చూపించుకోలేక అనేక కుటుంబాలు ఇతర జిల్లాలకు వలసలు వెళ్లాయి.. దీనికంతటికి కారణం అధికార పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లో నడుస్తున్న బెట్టింగ్ మాఫియా. జిల్లాలో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అంతర్జాతీయ క్రికెట్ బుకీల వరకు ఎదిగారు. మొన్న పెదకూరపాడుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మేనల్లుడు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ గుంటూరు అర్బన్ పోలీసులకు చిక్కాడు. నిన్న పిడుగురాళ్ళ మున్సిపల్ వార్డు కౌన్సిలర్.. నేడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ టాస్క్ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. అంతకు ముందు రెంటచింతల మండల పరిషత్ ఉపాధ్యక్షుని సోదరుక్రిడు కెట్ బెట్టింగ్లో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కాడు. వీరిని బెట్టింగ్ కేసుల్లో అరెస్టు చేయకుండా వదిలేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు తలొగ్గకుండా బుకీల ఆట కట్టించారు. టీడీపీ ముఖ్యనేతల అండదండలతో.. జిల్లాలలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న కీలక బుకీలంతా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కావడం గమనార్హం. వీరి కనుసన్నల్లోనే క్రికెట్ బెట్టింగ్ మాఫియా జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. గుంటూరు అర్బన్ ఎస్పీ క్విక్ రియాక్షన్ టీమ్, సీసీఎస్ బృందాలతో, గుంటూరు రూరల్ ఎస్పీ టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసుల బృందాలతో జిల్లా వ్యాప్తంగా దాడులు చేయిస్తూ కీలక క్రికెట్ బుకీల ఆట కట్టిస్తున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు గతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అందులో అప్పుల పాలైన బాధితుల నుంచి పొలాలు, స్థలాలు బలవంతంగా రాయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. అందులో కీలక బుకీగా ఉన్న బాలాజీ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు వరుసకు మేనల్లుడు కావడంతో ఆయన్ను వదిలేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. పోలీసులు మాత్రం అతనితోపాటు, బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో గుంటూరు రూరల్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పిడుగురాళ్లలోని ఓ రెస్టారెంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థానిక రెండో వార్డు కౌన్సిలర్ కోయ శ్యామలరావు అలియాస్ శ్యామ్తోపాటు అధికార పార్టీ నేతలు చల్లగుండ్ల బాబూరావు, గుదె భీష్మ మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు, నరసరావుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు అయిన శాఖమూరి మారుతి నవీన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను అమెరికా, న్యూయార్క్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం సబ్ బుకీలను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అనేక సంవత్సరాలుగా నరసరావుపేటలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అధికార పార్టీ ముఖ్య నేత తనయునికి అనుచరుడు కావడంతో గతంలో బుకీలను అరెస్టు చేసిన సమయంలో పక్కనే ఉన్నప్పటికీ వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్పీలను టార్గెట్ చేస్తారు జిల్లాలో క్రికెట్ బుకీలకు అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన పీహెచ్డీ రామకృష్ణ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎనిమిది నెలలు గడవకుండానే ఆయన్ను బదిలీ చేయించారు. బుకీలంతా అధికార పార్టీ నేతలకు కోట్లలో ముడుపులు సమర్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అర్బన్, రూరల్ ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్పై సీరియస్గా దృష్టి సారించడంతో అధికార పార్టీ నేతలు వీరినీ బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నాట్లు సమాచారం. గతంలో క్రికెట్ బుకీల జోలికి వెళ్లిన ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పోస్టింగ్లు లేక లూప్ లైన్లలో ఉన్నారు. బుకీలకు సహకరించి మామూళ్లు పుచ్చుకున్న వారు సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీసు స్టేషన్లలో తిష్ట వేసి కూర్చున్నారు. -
మారని తీరు.. బెట్టింగుల జోరు!
నరసరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన రహీం డిగ్రీ చదివాడు. ఆటోకన్సల్టెంట్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వస్తున్న ఆదాయం సరిపోక బెట్టింగ్లు నిర్వహిస్తూ అక్రమ ధనార్జనకు అలవాటు పడ్డాడు. ఇతడిపై నరసరావుపే–1, నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. సుమారు నెల రోజుల కిందట నరసరావుపేట రూరల్ పోలీస్ అధికారులు ఇతడిని అరెస్టు చేయగా బెయిల్పై బయటకు వచ్చాడు. అయినా ఇతని ప్రవర్తనలో మార్పురాలేదు. మళ్లీ బెట్టింగ్లు మొదలుపెట్టి గురువారం అర్ధరాత్రి గుంటూరు రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. సాక్షి, గుంటూరు: ఐపీఎల్ సీజన్ అయిపోయినా బెట్టింగ్ రాయుళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో జరిగే ప్రీమియర్ లీగ్లు, టెస్ట్లు, వన్డే క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు దాడుల్లో చాలా మంది పట్టుబడుతూ, జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. కానీ వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అరెస్టయిన ప్రతిసారీ బెయిల్పై బయటికి వచ్చి దందా సాగిస్తున్నారు. ఫంటర్లుగా అరెస్టు అయిన వారు సబ్బుకీలు, బుకీలుగా మారుతున్నారు. జిల్లాలో రోజు రోజుకి బెట్టింగ్లు నిర్వహించే వారు, వారి మాయ మాటలు నమ్మి బెట్టింగ్లకు పాల్పడి సర్వం కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు అరికట్టాలని ప్రయత్నిస్తున్నా బెట్టింగ్ మాఫియా మాత్రం ఎక్కడో చోట దందా సాగిస్తూనే ఉంటోంది. రూరల్ పరిధిలో భారీగా అరెస్టులు.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీసులు 190 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ బుకీలు, సబ్బుకీలు, బెట్టింగ్ రాయుళ్లని అరెస్టు చేశారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రా>వడం లేదు. బెయిల్పై బయటికి వచ్చి తిరిగి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 20–20 మ్యాచ్లపై నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్న 15 మంది సభ్యులతో కూడిన భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆరు మంది పాత నేరస్తులే ఉండటం గమనార్హం. వీరిపై వివిధ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో క్రికెట్ బెట్టింగ్ కేసులు ఉన్నాయి. అరెస్టయి తర్వాత బెయిల్ పై బయటికి వచ్చి వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ నిర్వాహకులతో చానళ్లుగా ఏర్పడి భారీగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. విద్యార్థులు, చిరుద్యోగులు.. సులువైన మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలు, సబ్బుకీల్లో చాలా వరకూ విద్యార్థులు, చిరుద్యోగులు ఉండటం కలవర పెడుతున్న అంశం. కొందరు క్రికెట్ బుకీలు యువకులకు మాయ మాటలు చెప్పి సబ్ బుకీలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మాటలు నమ్మిన అమాయక యువకులు సర్వం కోల్పోవడమే కాకుండా జైలు పాలవుతున్నారు. గేమింగ్ యాక్టునుకఠినతరం చేస్తాం.. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ అరెస్టయిన వారు బెయిల్పై బయటకు వచ్చి తిరిగి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గేమింగ్ యాక్టును కఠినతరం చేస్తాం. బెయిల్పై బయట తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. – సీహెచ్. వెంకటప్పల నాయుడు, గుంటూరు రూరల్ ఎస్పీ -
మ్యాచ్ ఇంగ్లండ్లో.. బెట్టింగ్ అబిడ్స్లో!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఘరానా క్రికెట్ బుకీల్లో ఒకరైన సికిందర్ను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లకు సంబంధించి అబిడ్స్లోని చిరాగ్ అలీ లైన్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఇతడితో పాటు కలెక్షన్ బాయ్ హరినీ అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ చైతన్యకుమార్ మంగళవారం తెలిపారు. గుజరాత్కు చెందిన సికిందర్ నిజా అలీ చరానియా 20 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. బేకరీ, నోవల్టీస్, చాక్లెట్స్... ఇలా ఎన్నో వ్యాపారాలు చేసినా నష్టాలే మిగిలాయి. తేలిగ్గా, తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ బుకీగా మారాడు. తొలినాళ్లల్లో సింధికాలనీకి చెందిన బర్ఖాంత్తో కలిసి పందాలు అంగీకరించాడు. 2013 నుంచి తానే సొంతంగా దందా నిర్వహిస్తూ 2014లో అబిడ్స్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ల్యాప్టాప్లో బెట్టింగ్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా మ్యాట్రిక్స్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నాడు. బెట్ ఫెయిర్ వెబ్సైట్ ద్వారా రేష్యో, క్రిక్బుక్ ద్వారా మ్యాచ్ అప్డేట్స్ తెలుసుకునేవాడు. పందాలు కాసే పంటర్లతో సంప్రదింపులు జరపడానికి ఏడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సిమ్కార్డులు తీసుకున్నాడు. అబిడ్స్కు చెందిన హరి ప్రసాద్ను కలెక్షన్ బాయ్గా ఏర్పాటు చేసుకున్నాడు. పంటర్లలో ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి ఇచ్చిరావడం ఇతడి పని. ఐపీఎల్ మ్యాచ్ల సీజన్లో నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో గోవాలోని కలింగూడ్కు మకాం మార్చాడు. అక్కడ నుంచే నగరంలో ఉన్న పరిచయస్తులు, పరిచయం లేని పంటర్ల నుంచి ఫోన్ ద్వారా పందాలు అంగీకరించాడు. ఐపీఎల్ సీజన్ ముసిగిన తర్వాత సిటీకి వచ్చిన అతను ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న మూడో టీ–20 మ్యాచ్ల నేపథ్యంలో మళ్లీ పందాలు అంగీకరించడం మొదలెట్టాడు. ఆదివారం కార్డిఫ్లో జరిగిన మ్యాచ్కు సంబంధించి భారీగా పందాలు నిర్వహించాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్వర్మ, ఎన్.శ్రీశైలం, జి.వెంకటరామిరెడ్డి, మహ్మద్ తర్ఖుద్దీన్లు దాడి చేసి అలీతో పాటు హరినీ అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.5.28 లక్షల నగదు, ల్యాప్టాప్, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. -
ప్రభుత్వ జూదశాలలకు చట్టబద్ధతా?
దేశానికి మేలు చేసేలా న్యాయ సంస్కరణలను ప్రతిపాదించాల్సిన భారత న్యాయ కమిషన్ జూదాన్ని చట్టబద్ధం చెయ్యాలని సిఫార్సు చెయ్య డం హాస్యాస్పదం. పైగా అక్రమ జూదం అరికట్టడం సాధ్యం కాదు కనుక, చట్టబద్ధం చేసేస్తే ఖజానాకు లాభం అంటూ లెక్కలు వెయ్యడం పలాయన వాదం. ఇదే లాజిక్ అన్వయిస్తే ప్రభుత్వం నిషేధం అమలు చెయ్యలేని చీకటి వ్యాపారాల్ని.. మాదక ద్రవ్యాలు, దోపిడీ, దొంగతనంలాంటివన్నీ.. చట్ట బద్ధం చేయాల్సి వస్తుంది. ఖజానాకు కాసులు దొరుకుతాయి కానీ సామాజిక ఆరోగ్యం మాటేమిటో లా కమిషన్ సెలవివ్వాలి. కమిషన్, తన ప్రతిపాదనకి పురాణాల్ని కూడా ప్రాతిపదికగా చేసుకుంది. మహాభారత కాలంలో జూదం చట్టబద్ధమే అయ్యుంటే, ధర్మరాజు తమ్ముల్ని, భార్యనీ ఒడ్డి ఉండేవాడు కాదనీ, తద్వారా యుద్ధం జరిగేది కాదని చెప్పుకొచ్చారు. నిజమే మరి. వారి ఉద్దేశంలో చక్కగా కౌరవులు దేశాన్ని పాలించి, ఆదర్శంగా నిలిచే వారేమో. వ్యాసుడికి, మన కవిత్రయానికి, ఇంకా వందలాది రచయితలకు ముడిసరుకు కష్టమయ్యేది.జూదం, పేకాట లాంటివి సమాజానికి కీడు చేస్తాయి. వ్యసనంగా తయారై వ్యక్తిని అప్పుల పాలు చేసి, కుటుంబాల్ని ఆర్థిక అరాచకంలోకి నెట్టివేస్తాయి. క్రమశిక్షణ లేని జీవితాన్ని, అది పేద, ధనిక స్థాయీ భేదంతో సంబంధం లేకుండా అలవాటు చేసి దిగజారుస్తాయి. వాటిని అరికట్టడం లేకపోతే పోయె, కనీసం వాటికి ఆమోద ముద్ర వేసి సామాజిక గౌరవం కల్పిం చడం ఆత్మహత్యా సదృశం. కమిషన్లోనే ఒక సభ్యుడు వ్యతిరేకిస్తూ చెప్పినట్టు భారత్ ఈ తరహా సంస్కరణకు సిద్ధంగా లేదు. పేదలున్న దేశంలో మరింత మంది పేదల్ని సృష్టించే కార్యక్రమం అవుతుంది ఇది. ఒక్కమాటలో స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ జూదశాలలు, జాతీయ పేకాట పోటీలు ఈ దేశానికి అవసరం లేదు. – డా.డి.వి.జి.శంకరరావు,మాజీ ఎంపీ, పార్వతీపురం -
సంచలనం.. బెట్టింగ్లకు అనుమతించండి
క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది. 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
జూదం, క్రికెట్ బెట్టింగ్ల నిరోధానికి ప్రత్యేక నిఘా
ఏలూరు టౌన్ : జూదం, క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. క్రికెట్, పేకాట, ఇతర కేసులు పదికంటే ఎక్కువ నమోదైతే సంబంధిత వ్యక్తిపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. తన కుమార్తెను అపహరించారని దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భీమవరం నుంచి వచ్చిన ఓ మహిళ కోరారు. వివాహేతర సంబంధం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆకివీడు నుంచి వచ్చిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని విక్రయిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెదవేగికి చెందిన ఓ మహిళ ఎస్పీని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశా>రు. -
బెట్టింగ్ మాఫియా వర్సెస్ ఎస్పీ..!
సాక్షి, గుంటూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఐపీఎస్ అధికారులను సైతం లెక్కచేయడం లేదు. అలా కాకుండా ఎవరైనా తమ జోలికి వస్తే జిల్లా నుంచే పంపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారినే టార్గెట్ చేస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన పీ.హెచ్.డీ.రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, ఫండర్స్ను అరెస్టు చేయడంతోపాటు సస్పెక్టెడ్ షీట్లు తెరిచి జిల్లా నుంచి పరారయ్యేలా చేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన బెట్టింగ్ మాఫియా అధికార పార్టీ ముఖ్యనేతల సహకారంతో ఎనిమిది నెలలకే ఆయన్ని బదిలీ చేయించారు. ఆ తర్వాత యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించారు. తాజాగా గుంటూరు రూరల్ ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు సైతం క్రికెట్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన్ను సైతం బదిలీ చేయించేందుకు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల అండతో.. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు అధికార పార్టీ నేతలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి పోలీసు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఎస్పీ బదిలీకి భారీ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అవినీతి పోలీసు అధికారులపై క్రికెట్ బుకీలు, పోలీసు సిబ్బంది లిఖిత పూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక పంపిన విషయం తెలిసిందే. అయితే ఎస్పీ నివేదికను తొక్కిపట్టి ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు తిరిగి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ డీఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎస్పీ ఇచ్చిన నివేదికను తప్పుడు నివేదికగా చూపించే ప్రయత్నం జరగుతోందని పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎస్పీ బదిలీకి భారీ స్కెచ్.. ముఖ్యంగా అధికార పార్టీ ముఖ్యనేతల అండతో ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఎస్పీపై కాలు దువ్వుతున్నారు. తప్పు చేసి తప్పించుకునేందుకు అందరిని బెదిరిస్తూ మరిన్ని తప్పులు చేస్తున్నారని సొంత శాఖలోని అధికారులే విమర్శిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ముఖ్యనేతలు అప్పట్లో ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి క్రికెట్ బెట్టింగ్పై విచారణ నిలిచిపోయేలా చేశారు. అంతటితో ఆగకుండా ఎస్పీ ఇచ్చిన నివేదికను వెనక్కు పంపి డీఎస్పీ స్థాయి అధికారితో తిరిగి విచారణ చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ పాత్రపై లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన బుకీలు, వారి వద్ద పనిచేయిస్తున్న సిబ్బందిని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు తప్పని చెప్పాలంటూ అవినీతి అధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది గతంలో తమను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారంటూ రాయించి నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు పంపి ఎస్పీని బదలానం చేయాలనే కుట్ర జరుగుతున్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎస్పీ ఇచ్చిన నివేదికపై తిరిగి విచారణ జరపాల్సిన అవసరం వస్తే అంతకంటే పై స్థాయి అధికారిచేత విచారణ జరపాల్సి ఉండగా కింది స్థాయి అధికారితో విచారణ చేయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఐపీఎస్ బదిలీలు ఉన్న నేపథ్యంలో రూరల్ఎస్పీని జిల్లా నుంచి పంపించేందుకు అవినీతి పోలీసు అధికారులు, క్రికెట్బుకీలు అధికార పార్టీ ముఖ్య నేతల ద్వారా సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బుకీలు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కు విరుద్ధంగా ప్రస్తుత విచారణ అధికారి వద్ద స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్.. క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి దెబ్బకు ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడగా, మరెన్నో కుటుంబాలు అప్పులపాలై రోడ్డున పడుతున్న ఘటనలు నిత్యం పెరగిపోతున్నాయి. ఈ ఘటనలను సీరియస్గా తీసుకున్న గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మారీ నిఘాను పెంచారు. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ప్రధాన క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని విచారించడంతో అవినీతి అధికారుల పాత్ర బయటపడింది. క్రికెట్ బుకీల వద్ద భారీ స్థాయిలో మామూళ్లు పుచ్చుకుంటూ వారికి అండగా నిలుస్తున్న అవినీతి అధికారుల జాబితాను తయారు చేశారు. అంతటితో ఆగకుండా వారికి డబ్బులు ఇచ్చిన బుకీలు, వాటిని అధికారికి చేరవేసిన సిబ్బందిని విచారించి వారి నుంచి లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్లు నమోదు చేయించారు. దీని ఆధారంగా అప్పట్లో కొందరు ఎస్సైలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతోపాటు, మరికొందరు డీఎస్పీలు, సీఐల పాత్రపై ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తమ పేర్లు బయటకు వచ్చాయని తెలుసుకున్న అవినీతి పోలీసు అధికారులు తమపై వేటు పడకుండా కాపాడాలంటూ అధికార పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయించారు. ఆ తర్వాత కూడా క్రికెట్ మాఫియాను వదలకుండా తెనాలిలో 25 మంది ముఠాను, నరసరావుపేట డివిజన్లో ఏకంగా 52 మందిని ముఠాను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ సైతం పట్టుబడడంతో అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
కాయ్ రాజా కాయ్
-
అవును.. బెట్టింగ్కు పాల్పడ్డా!
థానె: గత ఐదారేళ్లుగా క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ అంగీకరించారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్–11వ సీజన్లో మాత్రం దాని జోలికిపోలేదని అన్నారు. ఈమధ్యే గుట్టురట్టయిన ఐపీఎల్ బెట్టింగ్ ముఠా కేసులో ఆయన శనివారం థానె పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్కు పాల్పడిన దావూద్ అనుచరుడు, బుకీ సోనూ జలన్ అరెస్టయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం పోలీసులు అర్బాజ్కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ వ్యవహారంలో మే 15న జలన్ సహా నలుగురు అరెస్టయ్యారు. సోనూను విచారిస్తుండగా జలన్తో అర్బాజ్ ఖాన్కున్న సంబంధం, బెట్టింగ్ వివరాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్లో జలన్కు రూ.2.80 కోట్లు కోల్పోయిన అర్బాజ్, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో జలన్ నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. అటు, బెట్టింగ్లో ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు భాగస్వామ్యముందని పోలీసులకు జలన్ వెల్లడించారు. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని త్వరలోనే సమన్లు జారీచేస్తామని పోలీసులు తెలిపారు. ఆ నిర్మాత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సినీ నిర్మాణ, పంపిణీ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ వల్లే మలైకాతో విడాకులు! బెట్టింగ్ వ్యసనమే అర్బాజ్ వైవాహిక జీవితాన్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్లో పాల్గొనవద్దని భార్య మలైకా అరోరా ఎంత నచ్చజెప్పినా అర్బాజ్ పెడచెవిన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికే దెబ్బతిన్న వారి సంబంధాలు బెట్టింగ్ వల్ల మరింత క్షీణించాయని వెల్లడించాయి. సోదరులు సల్మాన్ఖాన్, సొహైల్ ఖాన్లు కూడా అర్బాజ్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిసింది. విడిపోతున్నామని 2016లోనే ప్రకటించిన అర్బాజ్–మలైకా దంపతులకు గతేడాది నవంబర్లో విడాకులు మంజూరయ్యాయి. తమ విడాకులపై వచ్చిన పలు కట్టుకథలను వారు ఖండించారు. విడిపోయిన తరువాత కూడా వారిద్దరు 15 ఏళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్లో అర్బాజ్ఖాన్
ముంబై/థానే: 2008లో భారత క్రికెట్ను, బాలీవుడ్ను కుదిపేసిన బెట్టింగ్ కేసు విచారణలో భాగంగా లాగిన తీగతో భారీ క్రికెట్ బెట్టింగ్ డొంక కదిలింది. 2008 ఐపీఎల్ బెట్టింగ్కు సంబంధించిన కేసులో దావూద్ అనుచరుడు, హైప్రొఫైల్ బుకీ సోనూ యోగేంద్ర జలన్ను అరెస్టు చేసి విచారించగా ఏటా ఐపీఎల్లో జరుగుతున్న బెట్టింగ్ వ్యవహారంతో పాటు తాజా సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయలు, భాగస్వాములైన బాలీవుడ్ ప్రముఖుల వివరాలూ వెల్లడయ్యాయి. గతవారం ముగిసిన 11వ సీజన్ ఐపీఎల్లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని ఇందులో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని సోనూ చెప్పాడు. ఈ సీజన్లో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ రూ.2.8 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అర్బాజ్ శనివారం విచారణకు రావాలంటూ థానే పోలీస్ బలవంతపు వసూళ్ల నిరోధక బృందం (ఏఈసీ) నోటీసులు పంపింది. అర్బాజ్ను బెట్టింగ్పై విచారించి అతని ఖాతాలు, లావాదేవీలను పరిశీలించనున్నారు. ‘బుకీల ద్వారానే అర్బాజ్ పెద్దమొత్తంలో డబ్బును బెట్టింగ్లో పెట్టారని తెలిసింది. అర్బాజ్ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అని ఈ కేసును విచారిస్తున్న ఏఈసీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ వెల్లడించారు. కాగా, బెట్టింగ్, పోలీసుల నోటీసులపై తనకు తెలియదని అర్బాజ్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. విచారణలో విస్తుపోయే అంశాలు ఓ ప్రైవేటు వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణ సందర్భంగా సోనూ తెలిపిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. అర్బాజ్ బెట్టింగ్కు పాల్పడ్డట్లు ఆధారాలతోపాటు.. అతని లావాదేవీల వివరాలనూ ఏఈసీ పోలీసులు సంపాదించారు. సల్మాన్ సోదరుడు దాదాపు రూ. 2.8కోట్లు కేవలం ఈ ఏడాది ఐపీఎల్ బెట్టింగ్లో నష్టపోయినట్లు తెలిసింది. అయితే.. ఈ రూ. 2.8 కోట్లను అర్బాజ్ ఇంకా చెల్లించలేదని తెలిసింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని అడుగుతున్నా అర్బాజ్ స్పందించడం లేదని.. దీంతో ఇరువురి మధ్య గొడవ జరుగుతోందని సోనూ పోలీసులకు తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో పేరును బయటకు చెబుతానని అర్బాజ్ను బెదిరించినట్లు కూడా సోనూ ఒప్పుకున్నారు. గతంలో 2 మ్యాచుల్లో అర్బాజ్ బెట్టింగ్ పెట్టాడని వెల్లడించాడు. ముంబై బుకీలకు దావూద్ గ్యాంగ్తో సంబంధాలపైనా సోనూ కీలక సమాచారమిచ్చాడు. గతంలో ఐపీఎల్ కేసులో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్కు పాల్పడ్డారు. బెట్టింగ్ కింగ్ సోనూ! ముంబై సట్టా బజార్, గ్యాంబ్లింగ్ సర్కిల్స్లో సోనూ పేరు తెలియని వారుండరు. ఇతనికి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా,దక్షిణాఫ్రికా ఇతర దేశాల్లోనూ క్లయింట్లు ఉన్నారు. ‘బెట్ అండ్ టేక్’ అనే సాఫ్ట్వేర్ను రూపొందించి దీని ద్వారా ఐపీఎల్తోపాటు భారత్లో, విదేశాల్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను నడిపిస్తున్నాడు. 2016లో శ్రీలంక–ఆస్ట్రేలియా మధ్య శ్రీలంకలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్ను సోనూ ఫిక్స్ (క్యురేటర్ సాయంతో) చేసినట్లు ఆధారాలు దొరికాయి. అర్బాజ్తో తన సాన్నిహిత్యాన్ని తెలుపుతూ పలు చిత్రాలను సోనూ పోలీసులకిచ్చాడు. సోనూ వద్ద స్వాధీనం చేసుకున్న డైరీలో బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, షేర్మార్కెట్ పెట్టుబడిదారులు, 100 మంది బుకీల వివరాలున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సోనూ సహా ఆరుగురు బుకీలను అరెస్టు చేశారు. థానే జిల్లా డోంబివలీలోని ఓ హోటల్ నుంచి మే 15న మరో ముగ్గురిని బెట్టింగ్ కేసులో ఏఈసీ బృందం అరెస్టు చేసింది. వీరిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో వీరికి సాయం చేసేందుకు వచ్చిన సోనూను పోలీసులు వలపన్ని అరెస్టు చేయటం, విచారణ జరపడంతో తాజా ఐపీఎల్ బెట్టింగ్పై కొత్త అంశాలు బయటికొచ్చాయి. సోనూ∙నుంచి సేకరించిన సమాచారంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఒకరున్నట్లు తెలుస్తున్నప్పటికీ అది ఎవరనే విషయం బయటకు తెలియడంలేదు. సోనూ టర్నోవర్ ఏడాదికి రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
‘వర్మ కంపెనీ’ పేరుతో బెట్టింగ్ నిర్వహణ
కడప అర్బన్ : అంతర్రాష్ట్ర క్రికెట్ బుకీలుగా ఎదిగిన ఇద్దరు రాష్ట్రంలోని పలు జిల్లాల వారికి మోస్ట్ వాం టెడ్గా ఉన్నారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐసీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ఈనెల 27న లైవ్లో చూస్తూ బెట్టింగ్కు నిర్వహిస్తూ పోలీ సులకు చిక్కారు.రూ. 60 లక్షల మేరకు విలువైన నగదు, కారు, ఇతర సామగ్రితో పట్టుబడ్డారు. వీరు సాధారణ గుమాస్తాలుగా తమ జీవితాలను ప్రారంభించి ‘వర్మ కంపెనీ’ పేరుతో రూ. 15 కోట్లు ఇప్పటి వరకు బెట్టింగ్లకు పాల్పడి విలాసవంతమైన జీవితాలను గడిపారు. వీరి కోసం కడప పోలీసులతో పాటు, హైదరాబాద్, అనంతపురం, ధర్మవరం, పశ్చిగోదావరి, నెల్లూరు జిల్లా పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలివి.. వర్మ కంపెనీ వ్యవస్థాపక, నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముదునూరి అశోక్ వర్మ అలియాస్ వర్మ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సంస్థలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. 2013లో ఒక క్రికెట్ బుకీ పరిచయమయ్యాడు. అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. తర్వాత 2016లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయం ఏర్పడింది. అతనితోపాటు, మరికొందరితో కలిసి ‘వర్మ కంపెనీనీ ఏర్పాటు చేశాడు. అంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల మంది సబ్ బుకీల ద్వారా పంటర్లను (బెట్టింగ్ ఆడేవారు) దించి వారి ద్వారా బెట్టింగ్ జరుపుతున్నాడు. తద్వారా సంపాదించిన సొమ్ముతో హైదరాబాదు, విజయవాడల్లో ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఇతనిపై కడప, నెల్లూరు, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్ బెట్టింగ్ కేసులు కలవు. ఇతన్ని అరెస్టు చేసేందుకు హైదరాబాద్, అనంతపురం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పెన్మస్థ రవివర్మ అలియాస్ రవి పదవ తరగతి వరకు చదువుకుని అదే గ్రామంలో ఎరువుల దుకాణంలో గుమస్తాగా చేరాడు. తర్వాత 2014లో క్రికెట్ బుకీతో పరిచయం ఏర్పడి అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. 2016లో అశోక్వర్మ ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయమై వర్మ కంపెనీలో బెట్టింగ్ వివరాలు చేసేవాడు. ఇందుకుగాను ఇతనికి సంస్థ ద్వారా నెలకు రూ. 1.50 లక్షల జీతం, సంస్థ ఆదాయంలో కొంత వాటా ఇస్తారు. ఇతనిపై కడప, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్ బెట్టింగ్ కేసులు ఉన్నాయి. గంజాయి వ్యాపారం కూడా... క్రికెట్ మ్యాచ్లలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు, గోవా, కడప, ప్రొద్దుటూరులలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని అమాయకులు, విద్యార్థులను బెట్టింగ్ కూపంలోకి దించి వారిని మోసం చేసి పెద్ద మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో గంజా యి వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిసింది. వీరికి ప్రొద్దుటూరు, భీమవరం, గుంటూరు, హైదరాబాద్లకు చెందిన మరికొందరు ప్రధాన బుకీలతో, మహరాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే బెట్టింగ్ దందా నడిపించే సేట్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వీరద్దరూ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 15 కోట్లు బెట్టింగ్ లావాదేవీలు జరిపినట్లు, గెలిచిన, ఓడిపోయిన వారికి మద్య లావాదేవీలను హవాలా మార్గం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు, బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ జల్సాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్.. అశోక్వర్మ, రవివర్మ కడప తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలో ఒక అద్దె ఇంటి ఆవరణంలో ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన లైవ్ మ్యాచ్ను టీవీలో చూస్తూ బెట్టింగ్లను కాశారని, 26 సెల్ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్ ద్వారా, ఆరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ అందులోని అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ రేటు తెలుపుతూ ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటూ ఉండగా సమాచారం అందిందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలిపారు. సోమవారం విలేకరుల ఎదుట అరెస్టు అయిన బుకీలను హాజరు పరిచారు.ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు సీసీఎస్ డీఎస్పీ జి.నాగేశ్వర్రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్రెడ్డి, తాలూకా ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ రాజారెడ్డి, సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి రూ. 35,05,000 నగదు, 26 సెల్ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్, ల్యాప్టాప్, ఆరు సెల్ఫోన్లు, టీవీ, కారు, నాలుగు కిలోల గంజాయి, బెట్టింగ్కు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు, తాలూకా ఏఎస్ఐ వర్మ, హెడ్ కానిస్టేబుల్ మురళి, కానిస్టేబుళ్లు శివప్రసాద్, కిరణ్బాబు, సురేష్రెడ్డి, సుబ్బయ్య, సీసీఎస్ సిబ్బంది ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుళ్లు సుధాకర్రెడ్డి, ప్రభు, బాష, హోం గార్డు నాయక్లను ఆయన అభినందించారు. -
రూ.1.5 లక్షలు ఇస్తే..బెట్టింగ్ కేసు లేకుండా చేస్తా
-
నేర నియంత్రణకు ‘జీఎస్ఎఫ్’
జీఎస్ఎఫ్...ఈ పేరు చెబితే గుంటూరు జిల్లా పోలీసు అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుంటూరు రూరల్ ఎస్పీగా వచ్చినప్పటి నుంచి సీహెచ్ వెంకటప్పలనాయుడు ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్పై దృష్టిసారించారు. తీగ లాగితే డొంక కదిలినట్టు బెట్టింగ్ బుకీలను అరెస్టు చేస్తుంటే, వారి వెనుక ఉన్న పోలీసు అధికారుల బాగోతం వెల్లడైంది. దీంతో నివ్వెరపోయిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు తమ శాఖను కూడా ప్రక్షాళన చేయాలని సంకల్పించారు. డిపార్టుమెంట్లో పని చేస్తున్న వారితో కాకుండా కొత్తవారితో ఒక టీం ఏర్పాటు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని భావించారు. నూతనంగా శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిన 460 మంది కానిస్టేబుళ్లతో గుంటూరు స్పెషల్ ఫోర్స్(జీఎస్ఎఫ్) పేరుతో ఒక దళం తయారు చేశారు. 20 బృందాలుగా విభజించి జిల్లాలో త్వరలో వీరిని రంగంలోకి దింపనున్నారు. సాక్షి, గుంటూరు: అవినీతి పోలీసు అధికారుల ఆట కట్టించడంతో పాటు, జిల్లాలో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి నేరాలను అదుపు చేసేందుకు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు గుంటూరు స్పెషల్ ఫోర్స్(జీఎస్ఎఫ్)కు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు రూరల్ జిల్లాకు నూతనంగా 460 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ప్రస్తుతం వారంతా ఫీల్డ్ స్టడీస్లో ఉన్నారు. మామూలుగా అయితే వారిని పోలీసుశాఖలోని వివిధ విభాగాలకు కేటాయించి ఉద్యోగ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లలో అధిక శాతం మంది గ్రాడ్యుయేట్, పోస్ట్రుగాడ్యుయేట్లు ఉండడంతో వారిని మొదటి నుంచే సక్రమంగా పనిచేయించాలనే తలంపుతో ఎస్పీ వెంకటప్పలనాయుడు గుంటూరు స్పెషల్ ఫోర్స్ (జీఎస్ఎఫ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పక్కా ప్రణాళిక రూపొందించారు. వీరందరిని 20 ప్రత్యేక గుంటూరు స్పెషల్ ఫోర్స్ (జీఎస్ఎఫ్) బృందాలుగా ఏర్పాటుచేశారు. వీరిపై పర్యవేక్షణ కోసం 12 మంది ప్రత్యేక అధికారులను నియమించేలా సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ బృందాలు తిరిగేందుకు కావాల్సిన వాహనాలు, బడ్జెట్ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత జీఎస్ఎఫ్ను ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహనకు ఫీల్డ్ స్టడీస్ నూతన కానిస్టేబుళ్లల్లో అధిక శాతం మంది విద్యాధికులున్నట్టు గుర్తించిన ఎస్పీ వారిని సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు జీఎస్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీరికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో నడుచుకోవాల్సిన తీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఫీల్డ్ స్టడీస్ పేరుతో జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లతోపాటు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, సీసీఎస్ వంటి విభాగాలకు కేటాయించి మెలకువలు నేర్పుతున్నారు. ఫీల్డ్ స్టడీస్ 15 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో వీరితో సమావేశం నిర్వహించి ఇప్పటివరకు వీరు క్షేత్రస్థాయిలో ఏం చేశారు? ఏం నేర్చుకున్నారు? ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? అనే అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. జిల్లాకు కేటాయించిన 460 మంది నూతన కానిస్టేబుళ్లను 20 జీఎస్ఎఫ్ బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమగ్ర వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ బృందాలకు దిశ, నిర్దేశం చేసేందుకు 12 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించాలని ఎస్పీ సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం వీరికి ప్రత్యేక డ్రస్ కోడ్తో పాటు, జిల్లాలో తిరగడానికి కావాల్సిన సౌకర్యాలు, వాహన సదుపాయాలు, అందుకోసం బడ్జెట్ కేటాయింపులపై ఎస్పీ పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చిన ఎస్పీ ఇటీవల ప్రత్యేక బృందంలోని కొందరు అధికారులకు కార్యాచరణ గురించి వివరించారు. అవినీతి అధికారుల ఆట కట్టించేందుకే... గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి రేషన్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్లు, గుట్కా అక్రమ రవాణా, మట్కా వంటి వాటిపై ఎస్పీ వెంకటప్పలనాయుడు ఇప్పటికే ఉక్కుపాదం మోపారు. ఎస్పీ దెబ్బకు క్రికెట్ బుకీలంతా జిల్లా వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఇటీవల టాస్క్ఫోర్స్ బృందాలు అందించిన సమాచారం ఆధారంగా జాతీయ రహదారిపై నిఘా పెంచి రూరల్ పోలీసులు రెండున్నర క్వింటాళ్ల గంజాయిని కారులో తరలిస్తుండగా సినీ ఫక్కీలో వెంబడించి రెండు కార్లతో పాటు, ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు, మూడు బృందాలకే జిల్లాలో సత్ఫలితాలు వస్తున్నాయంటే 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తే అసాంఘిక కార్యకలాపాలను ఏవిధంగా అరికట్టవచ్చో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఎస్పీ అనుకున్న విధంగా జీఎస్ఎఫ్ బృందాలు ఏర్పాటై కార్యాచరణ మొదలు పెడితే అవినీతి అధికారులకు చెక్ పడడం ఖాయం. జీఎస్ఎఫ్ ఏర్పాటు విషయం తెలుసుకున్న అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో ఎస్పీని బదిలీ చేయించాలంటూ అధికార పార్టీ నేతల చుట్టూ కొందరు అవినీతి పోలీసు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. -
కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
-
ఎస్ఐ హనుమంతు..అవినీతి తంతు..
అతను నేరాలను నియంత్రించాల్సిన బాధ్యత గల ఎస్ఐ.కానీ గతి తప్పారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు లేకుండా చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. తమ కుమారుడిని వదిలేస్తారనే ఆశతో పాపం.. ఆ వృద్ధ తండ్రి అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు ముట్టజెప్పారు. తీరాచూస్తే కొడుకుపై కేసు నమోదు చేయడంతో ఆవేదనతో పోలీసు స్టేషన్కు చేరుకుని ఎస్ఐని నిలదీశారు. జమ్మలమడుగు రూరల్ : ‘లక్షాయాభైవేల రూపాయలు ఇస్తే.. నీ కొడుకుపై క్రికెట్ బెట్టింగ్ కేసు లేకుండా చేస్తానన్నాడు జమ్మలమడుగు పట్టణ ఎస్ఐ హనుమంతు. అడిగినంత మొత్తం తెచ్చి పోలీసు స్టేషన్లోనే ఎస్ఐ చేతిలో పెట్టా. డబ్బంతా దిగమింగి, ఇప్పుడు నా కుమారుడు అమీర్బాషాపై బెట్టిం గ్తో పాటు గంజాయి కేసు కూడా పెట్టారు. డబ్బు తిని ఇలా మోసం చేస్తే ఎలా’ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ.. గురువారం అర్బన్ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి గగ్గోలుపెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారం మేర కు కొద్దిరోజులక్రితం నలుగురు బెట్టింగ్రాయుళ్లను జమ్మలమడుగు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైలవరం మండలం నవాబుపేటకి చెందిన అమీర్బాషా ఉన్నాడు. అమీర్బాషా పేరును కేసులో లేకుండా చేస్తానని, అందుకు ప్రతి ఫలంగా రూ.1.5లక్షలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేసినట్లు అమీర్ బాషా తండ్రి మహబూబ్బాషా ఆరో పించారు. అడిగినంత డబ్బు ఇచ్చినా తన కుమారుడి పేరును కేసులో ఎందు కు పెట్టారన్నది బాషా వాదన. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం స్టేషన్లో ఎస్ఐ హనుమంతుకు, మహబూబ్ బాషాకు మధ్య తీవ్ర వాగ్వాదం జరి గింది. ‘కేసు లేకుండా చేస్తానంటే అక్షరాల రూ.లక్షా 50వేల నగదు తెచ్చి అధికారుల సమక్షంలో నీ చేతిలో పెట్టా.. డబ్బు ఇచ్చానని దేవుని వద్ద నేను ప్రమాణం చేస్తా.. తీసుకోలేదని నీవు ప్రమాణం చేస్తావా?’ అంటూ బాషా ఎస్ఐకి సవాలు విసిరారు. అయినా నీవు నాకు డబ్బు ఎందుకు ఇచ్చావు.. అంటూ ఎస్ఐ ఎదురుదాడి కి దిగారు. ఈ తతంగమంతా గురువారం ఉదయం పట్టణ పోలీసుస్టేషన్లో విలేకరుల ఎదుటే జరగడంతో నివ్వెరపోవడం పోలీసుల వంతైంది. లాంటిదేమీ జరగలేదు.. నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. లోపాయికారి ఒప్పందాలు నేను అసలు చేయలేదు. మహబూబ్ బాషా మాటల్లో వీసమెత్తు కూడా నిజం లేదు. కేవలం అతని కుమారుడిని కేసులో పెట్టానని బాధతోనే అతను నాపై నింద వేస్తున్నాడు.– హనుమంతు, అర్బన్ ఎస్ఐ, జమ్మలమడుగు -
బెట్టింగ్
జిల్లా కేంద్రం ఆదిలాబాద్లోని పలు బార్లు క్రికెట్ బెట్టింగ్కు అడ్డగా మారాయి. ఐపీఎల్ 11 ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ బార్లలో రోజూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రం మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు బార్లలో ఇదే సందడి నెలకొంటోంది. స్థానికులే దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం చెన్నయ్ సూపర్కింగ్స్, హైదరాబాద్ సన్రైజర్స్ మధ్య జరిగిన పోటీ లక్షల రూపాయల బెట్టింగ్ జరిగింది. ఓ బడాబాబు చెన్నయ్ సూపర్ కింగ్స్ గెలుస్తుందని రూ.2 లక్షల బెట్టింగ్ కాసాడు. ఆ టీం గెలుపొందడంతో అంతకు నాలుగింతలు రూ.8 లక్షలు ఆయన చేతికి అందాయి. ఈ ఒక్క సంఘటననే జిల్లాలో బెట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందనేది తెలుస్తోంది. బడాబాబులు లక్షల రూపాయలు బెట్టింగ్ కాసేందుకు వెనకాడడం లేదు. సాక్షి, ఆదిలాబాద్ : బడాబాబులు రూ.లక్షల్లో పెడుతుంటే కొంతమంది యువత జట్టు కట్టి మరీ బెట్టింగ్ కాస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పని చేసే ఓ యువకుడు తన వంతుగా రూ.500 ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై పెట్టాడు. తన మిత్రులందరి ద్వారా కలిసి రూ.40 వేలు జమచేసి ఈ బెట్టింగ్లో పెట్టారు. ఆ జట్టు గెలుపొందడంతో ఆ ఆఫీస్ బాయ్కి రూ.2 వేలు, ఆ మిత్రులు మొత్తం కలిసి పెట్టిన మొత్తానికి రూ.లక్షా 60 వేలు చేతి కందాయి. ఇప్పుడు క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్లపై ఆ మొత్తాన్ని బెట్టింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే సమయంలో కొంతమంది యువకులు జట్టుగా కలిసి రూ.70 వేలు రాజస్థాన్ రాయల్స్పై పెట్టి నష్టపోయారు. ఇలాంటివి ఒకట్రెండు దృష్టికి రాగా వందలాది మంది యువకులు జట్టుగా కలిసి రోజు బెట్టింగ్ కట్టడం జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఆదిలాబాద్ కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పొట్టి క్రికెట్ మజాను కొంతమంది బెట్టింగ్ రూపంలోకి తీసుకువచ్చి స్థానికంగా పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, ముఖ్యంగా యువకులను ఈ రోంపిలోకి వచ్చేలా చేసి వారి డబ్బుల ఆశను సోమ్ము చేసుకుం టున్నారు. లోకల్గానే ఈ వ్యవహారం అంతా సాగుతోందని, స్థానికంగా బుకీలుగా అవతారం ఎత్తిన వారికి పైస్థాయిలో ఇతర రాష్ట్రాల్లోని బడాబుకీలతో సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లలో ఆదిలాబాద్లో మామూలుగా సాగిన వ్యవహరం ఐపీఎల్–11కు వచ్చే సరికి మాత్రం కోట్ల రూపాయలకు పాకి మున్ముందు బుకీ వ్యవస్థ ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న పరిస్థితి కనిపిస్తోంది. 11వ ఐపీఎల్ ప్రారంభమైన తరువాత గుట్టుచప్పడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో ఆదిలాబాద్ పట్ట ణానికి చెందిన కొంతమంది బార్లు, వైన్స్ల య జమానులు కోట్ల రూపాయల్లో దీన్ని సాగిస్తున్నా రు. గతంలో పేకాట క్లబ్లను నిర్వహించిన అనుభవం ఉన్న కొంతమంది ఈ వ్యవహరాన్ని పకడ్బందీగా సాగిస్తున్నారు. కొందరు యువకులు ఈ బెట్టింగ్ను నిర్వహిస్తూ రోజు కూలీ పనులు చేసుకునే వారిని, పేదలను దీని పట్ల ఆకర్షితులయ్యేలా చేసి వారి డబ్బులను గుల్ల చేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టణంలో మట్కా, పేకాట ను పోలీసులు అరికట్టడంతో కొందరు ఈ బెట్టిం గ్ వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఖానాపూర్, భుక్తాపూర్ కాలనీల్లో పలువురు ఈ బెట్టింగ్ను నిర్వహిస్తూ దం దా కొనసాగిస్తున్నారు. విద్యానగర్లోని ఓ లాడ్జి నిత్యం పలువురు కళాశాల విద్యార్థులు, ఇతరులతో సాయంత్రం సమయంలో కిక్కిరిసి ఉంటోం ది. ఈ లాడ్జిలో బెట్టింగ్ జోరుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చేస్తున్నరా లేనిపక్షంలో ఈ వ్యవహరాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నరా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తే రెట్టింపు... 11వ ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభమైంది. ఈ నెల 27న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సీజన్ ప్రారంభమైన తరువాత ఆదిలాబాద్లో బెట్టింగ్ను స్థానికులైన పలువురు వ్యాపారులు, యువకులు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్ మొదటి నుంచి ప్రముఖ హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డలుగా చేసుకొని బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రధానమైన టీంలపై ఈ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోంది. బలమైన టీం గెలుస్తుందని బెట్టింగ్ పెట్టినప్పుడు రెట్టింపు, అంతకంటే ఎక్కువ, కొన్ని పరిస్థితుల్లో నాలుగింతలు డబ్బులు వస్తాయి. బలమైన టీంపై బెట్టింగ్ చేస్తే తక్కువ వస్తాయని, బలహీన టీంపై బెట్టింగ్ చేసి గెలిచిన వారికి అంతకంటే ఎక్కువే డబ్బులు ముట్టజేబుతామని ఆశ చూపడంతో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, యువత అయోమయంలో డబ్బులు పెట్టి వేలు, లక్షలు నష్టపోతున్నారు. వేసవి సెలవులు కావడంతో పలువురు యువత కూడా ఖాళీ సమయాన్ని దీనికి కేటాయిస్తుండడంతో పక్కదారి పడుతున్నారు. నిర్వాహకులు హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డగా చేసుకుని కేవలం సెల్ఫోన్ ద్వారా మంతనాలు చేస్తూ నడిపిస్తున్నారు. ఆదిలాబాద్లో ఓ బార్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం పేరు, సెల్ నం, బెట్టింగ్ పెట్టే జట్టు పేరు, ఎంత నగదు బెట్టింగ్ అనేవి రాసుకుంటున్నారు. మొదట బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ చేసుకున్న వారికి నంబర్ కేటాయించి దాని ఆధారంగా మ్యాచ్ అనంతరం ఫలితాన్ని బట్టి పేమెంట్ చేస్తున్నారు. ఇలా వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ఫలితాలకు అనుగుణంగా డబ్బులు ముట్టజెబుతుండడంతో వ్యవహారం బయటకు రావడం లేదు. ఈ బెట్టింగ్ ద్వారా ఓ వ్యాపారి సుమారు కోటి రూపాయలు గడించినట్లు పట్టణంలో చర్చ సాగడం సంచలనం కలిగిస్తోంది. నిర్వాహకులు లాభ పడుతుండగా, బెట్టింగ్ చేసిన మాములు వ్యక్తులు ఈ లెక్కన కోట్ల రూపాయలలో నష్టపోతున్నారు. కొంతమంది ఫలితాల కోసం హోటళ్లలో గదులు బుక్ చేసుకుని అర్ధరాత్రి వరకు మ్యాచ్లు చూస్తూ విందువినోదలతో గడుపుతున్నారు. క్వాలిఫయర్ 2, ఫైనల్ నేపథ్యంలో జోరు... ఇప్పటివరకు బెట్టింగ్ ఓ స్థాయిలో జరుగగా, క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం, ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుండడంతో బెట్టింగ్ తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ జరగనుంది. ఈ రెండు టీమ్లలో సమాన గెలుపు అవకాశాలు ఉండడంతో బెట్టింగ్లో కొంత తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఫైనల్కు చేరిన చెన్నయ్ సూపర్కింగ్స్ మీద పలువురు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు వెనకాడడం లేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆ టీం పైనే పలువురు బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచుల్లో బెట్టింగ్ కోట్ల రూపాయల్లో సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఓ బార్లో పలువురు నిర్వాహకులు సమావేశమై చర్చలు జరిపారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. నిఘా పెట్టినం.. బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం రావడంతో పలుచోట్ల నిఘా పెట్టాం. ఆదిలాబాద్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. పకడ్బందీగా దాడి చేసి పట్టుకోవడం జరుగుతుంది. – విష్ణు ఎస్.వారియర్, ఎస్పీ -
విద్యార్థి ఉసురు తీసిన క్రికెట్ బెట్టింగ్
చీమకుర్తి రూరల్: క్రికెట్ బెట్టింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది. ఓబచెత్తపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి (21) గత నెల 27న రామతీర్థం రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వేధింపులకు గురిచేసిన బీటెక్ విద్యార్థి కందుల సురేంద్రరెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి సోమవారం చీమకుర్తి పోలీస్స్టేషన్లో మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను సీఐ ఎం.మురళీకృష్ణ విలేకరులకు వివరించారు. సీఐ కథనం ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ఒంగోలు హర్షిణీ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. క్విస్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కందుకూరు మండలం పందలపాడుకు చెందిన సురేంద్రరెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరంతా ఇతర విద్యార్థులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో వేలకు వేలు పందేలు పెడుతున్నారు. దానిలో భాగంగా గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.22 వేలను సురేంద్రరెడ్డికి బాకీ పడ్డాడు. ఆ డబ్బులు చెల్లించాలని ఫోన్లో వేధించసాగాడు. ఇంట్లో చెప్పలేక, తాను డబ్బులు చెల్లించలేక శ్రీనివాసరెడ్డి మానసిక వేదనకు గురయ్యాడు. సురేంద్రరెడ్డి వేధింపులు తట్టుకోలేక రామతీర్థం రిజర్వాయర్లో పడి చనిపోతున్నానని మెసేజీ కూడా పెట్టాడు. అయినా సురేంద్రరెడ్డి తనకు ఇవ్వాలసిన డబ్బులు సంగతేంటని తీవ్ర ఒత్తిడి చేశాడు. బెట్టింగ్ ముఠా సభ్యులకు సురేంద్రరరెడ్డి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వారు ఒత్తిడి చేసినప్పుడలా శ్రీనివాసరెడ్డిని సురేంద్రరెడ్డి ఒత్తిడి చేసేవాడు. చివరకు డబ్బులు ఇవ్వలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని ఆందోళనకు గురై రిజర్వాయర్లో గత నెల 27న దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు శ్రీనివాసరెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 29న పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సురేంద్రరెడ్డి వేధింపులే కారణంగా పోలీసుల విచారణలో తేలడంతో అతడిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ మురళీకృష్ణ మీడియాకు వివరించారు. పిల్లలను గమనిస్తూ ఉండాలి: మురళీకృష్ణ, సీఐ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీకి వెళ్తున్నామంటే వేలకు వేలు డబ్బులు ఇచ్చి పంపటమే కాదు. ఆ డబ్బుతో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. విద్యార్థులు ఇటీవల క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి ఇంట్లో తీసుకెళ్లిన డబ్బులే కాకుండా వేలకు వేలు అప్పులు చేసి పందేలు కాస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుంటే కొంతమంది పిల్లలు అరాచకాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉంది. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. -
హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి దగ్గర నుంచి రూ. 7.8 లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
దారి తప్పిన ‘నాల్గో’ సింహం
అనంతపురంలోని కోవూరు నగర్లో ఓ స్కూల్ సమీపంలో నివాస గృహాల మధ్య జోరుగా వ్యభిచారం సాగుతోంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. ఉన్నతాధి కారుల దృష్టికి విషయం వెళ్లడంతో ఈ నెల 4న తప్పని పరిస్థితిలో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న అనంతపురంలోని సోమనాథ్నగర్లో నివాసముంటున్న షేక్ గౌస్ పీరా (27) ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్లో రూ. లక్షలు పోగొట్టుకున్న అతను నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ భూతానికి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్లో పాలన గాడి తప్పింది. క్రికెట్ బెట్టింగ్, మట్కా, జనావాసాల మధ్య వ్యభిచారం.. తదితర అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దందాలకు అడ్డాగా టీకేఫ్లు మారాయి. బార్లు, మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా నాల్గో పట్టణపోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు మద్యం బాటిళ్లు అమ్ముతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దందాలకు అడ్డాగా.. అనంత నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలు అత్యధికంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఉంటున్నారు. వీరిని టార్గెట్గా చేసుకుని స్టేషన్పరిధిలో ఉన్న 68 రౌడీ షీటర్లు చిన్న చిన్న దందాలకు తెరలేపారు. తమ మాట వినకపోతే దాడులకు సైతం వెనుకాడడం లేదు. స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బైక్ రేస్, వీలింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రమైతే ఏకంగా జాతీయ రహదారి పక్కనే మందుబాబులు తిష్టవేసి బాటిళ్లను తెప్పించుకుని ఫుల్గా తాగి తందనాలాడుతున్నారు. జాతీయ రహదారిపై విచ్ఛలవిడిగా వ్యభిచారం సాగుతున్నా.. పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. రియల్ నజరానా.. స్టేషన్పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా సాగుతోంది. ఓ అధికారిని లోబర్చుకున్న రియల్వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి లావాదేవీలైనా.. తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవడంలో భాగంగా ఎదురయ్యే వివాదాలను సులువుగా పరిష్కరించుకునేందుకు రియల్టర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ అధికారికి అన్ని హంగులూ సమకూరుస్తున్నారు. బెంగుళూరు నగరానికి పిలుచుకెళ్లి విందూ వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిక వడ్డీ... అసాంఘిక కార్యకలాపాలు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జనావాసాల మధ్య వ్యభిచార కేంద్రాలు, పేకాట స్థావరాలు, క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పనుల కోసం వలస వచ్చిన వారు జీవనోపాధి కోసం చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీల్చి పిప్పి చేస్తున్నారు. రూ. 5 నుంచి రూ. 10 వరకు వడ్డీ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తూ నెలవారి మాముళ్లను మోస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మాముళ్లు అందకపోయినా.. స్థానికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువైనప్పుడు కంటి తుడుపు దాడులు నిర్వహిస్తూ నిందితుల అరెస్ట్ చూపుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ అశోక్కుమార్ చర్యలు చేపడుతున్నా.. జిల్లా కేంద్రంలోనే అడ్డూఅదుపు లేకుండా సాగుతుండడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇటీవల నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమనాథ్నగర్లో షేక్ గౌస్పీరా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పోలీసుల వైఫల్యాలకు పరాకాష్టగా మారింది. నేడు ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ రాక అనంతపురం సెంట్రల్: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఆదివారం జిల్లాకు రానున్నారు. పది రోజుల పాటు కుటుంబ సభ్యులతో యూఎస్ఏ పర్యటనకు వెళ్లిన ఆయన ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రానికి జిల్లాకు వస్తారు. సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
బౌండరీలు దాటిన బెట్టింగ్లు
చిలకలూరిపేటకు చెందిన శీలం సతీష్ బంగారు దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబం. సాఫీగా సాగుతున్న అతని జీవితంలోకి అదే పట్టణానికి చెందిన ఓ క్రికెట్ బెట్టింగ్ బుకీ పరిచయం అయ్యాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందంటూ బెట్టింగ్లకు పాల్పడేలా ప్రోత్సహించాడు. మొదట్లో బాగానే డబ్బులు గెలుచుకున్న సతీష్ తర్వాతి మ్యాచ్ల్లో పోగొట్టుకుని మాయలో పడి రూ. 70 వేలు అప్పులు చేశాడు. ఇటీవల పందేలు కాస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాయని, పందేలు కాయడం వల్ల డబ్బులు పోగొట్టుకోవడమే తప్పా లాభం ఉండదు అని చెప్పాడు. సాక్షి, గుంటూరు: ఫ్రాంచైంజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రెకెట్ బుకీల మాయమాటలు నమ్మి సాధారణ మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసలకు పట్టుబడి జైలుపాలు అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరంతా క్రికెట్ బెట్టింగ్ బుకీల మాయమాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయిన వారే. ఎవరిని కదిపినా అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. బెట్టింగ్ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లలో మార్పు రావడం లేదు. బుకీలు మోసం చేస్తోంది ఇలా.. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన క్రికెట్ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్లైన్ సెట్ అప్ చేసుకుని వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్లో చోటు చేసుకునే అంశాల మీద పందెం ధరల్ని నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్ ఎవరు గెలుస్తారు.. సెషన్స్ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది.. బాల్ టూ బాల్..తరువాతి బాల్లో వికెట్ పడుతుందా ... సిక్స్ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్లు కడుతుంటారు. అయితే 90% బెట్టింగ్ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటుంది. అబ్బ జస్ట్ మిస్ నెక్టŠస్ టైం కచ్చితంగా గెలుస్తాం అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. బుకీలందరూ టీడీపీ నేతలే... రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజల్ని క్రికెట్ బెట్టింగ్ల పేరుతో మోసం చేస్తున్న వారిలో టీడీపీ నేతలు అధికంగా ఉన్నారు. ఇటీవల పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ »బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టయిన విషయం తెలిసిందే. చిలకలూరిపేటలో పట్టిబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్కుమార్ అధికార పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న సంఘటన ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అమాయక ప్రజల్ని మాయమాటలతో మోసం చేస్తున్నారు. చివరకు మిగిలేది విషాదమే.. క్రికెట్ బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బు వల్ల స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా విషాదమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్లలో డబ్బులు పెడుతూ నష్టపోవద్దు. స్వల్పకాలిక ఆనందం కోసం బెట్టింగ్లకు పాల్పడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్యతరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ బుకీలు మాయమాటలు చెప్తూ మోసం చేస్తుంటారు. అవి నమ్మి సర్వం కోల్పోకుండా అప్రమత్తంగా వ్యవహరించండి.– రూరల్ ఎస్పీ, సీహెచ్ వెంకటప్పలనాయుడు -
జిల్లాలో ఎలాంటి గ్యాంగ్లు లేవు... పుకార్లు నమ్మొద్దు...
కర్నూలు : నగరంలో వాట్సాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు. ఇద్దరు బుకీలు, నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ వారి వద్ద నుంచి రూ.6.10 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు, 3 పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి డీఎస్పీ ఖాదర్ బాషాతో కలిసి వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు సంబంధించి గత నెల 23న పాతబస్తీలోని లాల్ మసీదు ఎదురుగా ఉన్న సొహైల్ ఇంటితో పాటు బిర్లా కాంపౌండ్లోని శశికాంత్ ప్లాజాలోని మల్లికార్జునగౌడ్ ఆఫీస్ (సారథి కమ్యూనికేషన్స్)లో సోదాలు నిర్వహించి మొత్తం 22 మంది నిందితులను గుర్తించి 8 మందిని అరెస్టు చేశారు. విచారణలో మరికొంతమంది ఉన్నట్లు తేలడంతో నిఘా వేశారు. ఈ మేరకు బుకీలు షేక్ మహమ్మద్ షొయబ్, ఖలీల్ మజీద్ ఖాన్, బెట్టింగ్ రాయుళ్లు షేక్ మహమ్మద్ అసిఫ్, షేక్ మహమ్మద్ షబ్బీర్, ఖలీల్, షర్జిల్ ఖాన్, మగ్బూల్ అహ్మద్ను పట్టుకున్నారు. బుకీలు ప్రధాన బుకీ ప్రొద్దుటూరు శంకర్తో నందికొట్కూరుకు చెందిన రఫీ ద్వారా పరిచయం పెంచుకుని కర్నూలులో బెట్టింగ్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో వెలుగుచూసింది. ఇప్పటివరకు నలుగురు బెట్టింగ్ నిర్వాహకులు, 15 మంది బెట్టింగ్రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం రూ.12.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో బెట్టింగ్ రాకెట్ను పూర్తిగా అరికడతామన్నారు. బెట్టింగ్లో పాల్గొన్న పది మంది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసినట్లు వెల్లడించారు. అలాగే బెట్టింగ్కు పాల్పడిన ఆరుగురిపై రౌడీషీట్లతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి యువత చెడుదారిన పడకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను గమనిస్తుండాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన ఒకటో పట్టణ సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి, పోలీసు సిబ్బంది బాలరాజు, మహబూబ్ బాషా, రఘునాథ్ తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఎలాంటి గ్యాంగ్లు లేవు... పుకార్లు నమ్మొద్దు... జిల్లాలో చెడ్డీ, పార్థి గ్యాంగ్లు సంచరిస్తున్నాయంటూ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని ఎస్పీ కోరారు. కొత్త వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారమిచ్చి పట్టించాలి తప్ప దాడిచేయడం సరికాదన్నారు. -
బాబాయ్.. అబ్బాయ్!
సాక్షి, సిటీబ్యూరో: వారిద్దరూ బాబాయ్, అబ్బా యిలు... ఒకరు రాజు పిట్టి, మరొకరు ప్రీతీష్ పిట్టి... ఇద్దరి స్వస్థలం కాచిగూడ ప్రాంతమే... రాజధానిలో ఉన్న బెట్టింగ్ రారాజుల్లో వీరిది ప్రత్యేక స్థానం. 2007లో వెలుగులోకి వచ్చిన నకిలీ పాస్పోర్ట్ కుంభకోణంతో రాజు పిట్టి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసులో రాజు పిట్టి కీలక నిందితుడు. తాజాగా సోమవారం ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన హైటెక్ బెట్టింగ్ గ్యాంగ్స్లో ప్రీతీష్ పిట్టి ఉన్నాడు. రాజుపిట్టి... మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాస్పోర్టుల కేసులో కీలక నిందితుడు. 2007లో ఈ కేసు వెలుగులోకి రావడంతో కొందరు నేతల రాజకీయ పునాదులు కదిలాయి. గుజరాత్కు చెందిన రాజుపిట్టి తండ్రి పన్నాలాల్ పిట్టి మధ్యస్థాయి వ్యాపారవేత్త. ఇతని సోదరులిద్దరూ నగరంలో పారిశుధ్య కాంట్రాక్టర్లు. వీరిలో వినోద్ పిట్టి ఒకరు. ఈయన కుమారుడే ప్రీతీష్ పిట్టి. ప్రస్తుతం సన్ సిటీలో ఉంటున్న అతడి వృత్తి శానిటరీ వ్యాపారమైనా ప్రవృత్తి మాత్రం బుకీ వ్యవహారం. రాజు పిట్టి సైతం 2000–2001లో బషీర్బాగ్కి చెందిన యోగేష్కుమార్తో కలిసి బుకీగా మారాడు. ఈ కుటుంబానికి సంబంధించి వినోద్, రాజు, ప్రీతీష్ ముగ్గురూ రాజధానిలోని బుకీల్లో ప్రముఖులు. వీరిపై కాచిగూడతో పాటు ఇతర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. రాజు ఇలా ఫేమస్... 2005లో రాజుపిట్టికి రషీద్తో స్నేహం ఏర్పడంటంతో రషీద్కు అవసరమైన సొమ్మును రాజు వడ్డీకిచ్చేవాడు. ఈ నేపథ్యంలో రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని పిట్టికి చెప్పాడు. అదే ఏడాది జనవరిలో గుజరాత్లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన భరత్భాయ్ని పిట్టి కలుసుకున్నాడు. అనంతరం వారితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. వీరు అనేక మంది గుజరాతీయులను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్పోర్టులు ఇప్పించే వారు. ఇందుకుగాను సదరు నేతలకు భారీగానే ముట్టజెప్పేవారు. 2006 నవంబర్లో రషీద్ నుంచి రాజుపిట్టికి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బోథ్ నియోజకవర్గాలకు చెందిన కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించేందుకు సమ్మతించారన్నది దాని సారాంశం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టుతో సంచలనం రేపింది. తరువాత రషీద్, మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్భాయ్ పట్టుబడ్డారు. 2008 ఆగస్టు 23న రాజుపిట్టి సైతం కటకటాల్లోకి వెళ్లాడు. మరోపక్క 2011 వరకు ప్రధాన బుకీగా ఉన్న ప్రీతీష్ పిట్టి ఆపై సబ్–బుకీగా, ఏజెంట్గా మారిపోయాడు. కొడుకు అక్కడ... తండ్రి ఇక్కడ... ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం గుట్టురట్టు చేసిన బెట్టింగ్ ముఠాల్లో తండ్రీ కొడుకులు ఉన్నారు. ఈ ముఠాలు ఉత్తరాదిలో డెన్స్ ఏర్పాటు చేసుకున్న ప్రధాన బుకీల ఆదేశాల మేరకు పని చేశాయి. మంగళ్హాట్కు చెందిన తండ్రీ కొడుకులు ముఖేష్ సింగ్, ప్రకాష్ సింగ్ల పం«థా వేరు. గోవా కేంద్రంగా ప్రకాష్ సింగ్ డెన్ ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తుండగా... నగరంలో ముఖేష్ సబ్–బుకీగా మారి ఇతర వ్యవహారాలు చూసుకునేవాడు. ప్రస్తుతం తండ్రి ముఖేష్తో పాటు ఇతడికి సహకరించిన శ్రీనివాస్, కునాల్సింగ్, సుర్జీత్ సింగ్ చిక్కగా... ప్రకాష్ పరారీలో ఉన్నాడు. బెట్టింగ్స్తో నష్టాలే ఎక్కువ క్రికెట్ సీజన్లో కష్టార్జితాన్ని బెట్టింగ్స్లో పెట్టి నష్టపోవద్దు. ఈ దందాలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సోమవారం చిక్కిన ముఠాల వద్ద పందెం కాసిన ఓ పంటర్ రూ.7 లక్షలు నష్టపోయి రూ.లక్ష మాత్రం సంపాదించాడు. తల్లిదండ్రులు, పెద్దలు యువతపై కన్నేసి ఉంచాలి. పందాలు కాసి షార్ట్కట్లో ధనవంతులు కావాలని భావిస్తే ఇబ్బందులు రావడంతో పాటు కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుంది. అంజినీ కుమార్, నగర కొత్వాల్ -
ఈజీ మనీ ఆశతోనే ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఉల్లాసం సంగతేమోగానీ ఐపీఎల్ మ్యాచ్ల వల్ల కొందరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తోన్న 12 మందిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర్నుంచి రూ.15.50 లక్షల నగదు, 22 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ‘‘డిజిటల్ నెట్వర్క్ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలు కేంద్రంగా జరుగుతోన్న ఈ దందాలో హైదరాబాద్కు చెందిన పలువురికి భాగస్వామ్యం ఉంది. ఈస్ట్జోన్లోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేసిన గ్యాంగ్లు భారీ స్థాయిలో బెట్టింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను పట్టుకున్నాం. వీళ్ల వెనకున్న సూత్రధారుల కోసం వేట ప్రారంభించాం’’ అని సీపీ అజనీ కుమార్ చెప్పారు. ఈజీ మనీ కోసమే: కాగా, అరెస్టైన నిందితులు వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈజీ మనీ కోసమే బెట్టింగ్లకు పాల్పడుతున్నారని కమిషనర్ తెలిపారు. చట్టవ్యతిరేక కలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ల జోలికి పోయి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. -
బెట్టింగ్కు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం
-
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
ఆదోని రూరల్: ఆదోని శివారు ప్రాంతంలోని శిరుగుప్ప క్రాస్ సమీపంలో మాధవరం రోడ్డులోని ఫ్రెండ్స్ రైస్ మిల్లు వద్ద ఆదివారం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఇస్వీ ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన ఏఎం ప్రవీన్, వీరస్వామి, అరాఫత్, ధనుంజయ, నబీ రసూల్, నబీ బాషాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. స్థానికుల సమాచారం మేరకు తనతో పాటు క్రైం పార్టీ ఏఎస్ఐ ఆనంద్, హెడ్కానిస్టేబుల్ శాంతరాజు, కానిస్టేబుల్ ఎలిషా దాడుల్లో పాల్గొన్నట్లు వివరించారు. దాడుల్లో రూ.20,630, ఎనిమిది మొబైల్స్, రెండు బైక్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న రామాంజినేయులు అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఆ కేసులో పోలీసుల తీరు సరిగా లేదు
సాక్షి, నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అని పేర్కొన్నారు. కోడి పందేలు నిషేధం అని హైకోర్టు చెబితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆడారని గుర్తుచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా బెట్టింగ్తో ఎలాంటి సంబంధం లేకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిరెడ్డి శ్రీధర్రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కలెక్టర్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేతలంతా కలిసి ఈ దారుణాలపై సంఘటితంగా పోరాడతామని చెప్పారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. జరిగింది ఒకటి, మీడియాకు పోలీసులు ఇచ్చే లీకులు మరొకటని మండిపడ్డారు. మొదట రెండు సార్లు విచారణకి పిలిచారని, దానిపై స్పష్టత ఇవ్వకుండా మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసు అంతం అవ్వాలంటే ఏసీబీ విచారణ కావాలని తానే మొదట అడిగానని తెలిపారు. క్రికెట్ బుకీల కాల్ లిస్ట్ ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్సీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణసింగ్ అనే బుకీతో తాను ఎక్కడైనా ఉన్నట్లు కనబడితే సీసీ ఫుటేజీని బయటపెట్టాలని, ఫుటేజీని బయటపెడితే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. -
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్
సులభమార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. క్రికెట్ మోజులో పడి అప్పు చేసి మరీ పందేలు కాశాడు. పందెంలో కలసిరాలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. చివరకు అప్పులిచ్చిన వాళ్లు డబ్బు కోసం ఇంటి వద్ద గొడవ చేశారు. మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం సెంట్రల్: క్రికెట్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్న యువకుడు అప్పుల వారి ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన శనివారం అనంతపురంలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సోమనాథ్నగర్లో నివాసముంటున్న షేక్గౌస్పీరా (27) తపోవనం సమీపంలోని వాటర్సర్వీసింగ్ సెంటర్ ద్వారా జీవనం సాగించేవాడు. కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడిన గౌస్పీరా రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులే దాదాపు రూ. 4 లక్షలకు పైగా అప్పులు చెల్లించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై కూడా బెట్టింగ్ ఆడేవాడు. ఈసారి కూడా అచ్చిరాలేదు. లక్షల్లోనే డబ్బు పోగొట్టుకున్నాడు. రెండు రోజుల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలు, అప్పులు ఇచ్చిన వ్యక్తులు డబ్బు కట్టాలని గౌస్పీరా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి వచ్చి గొడవ చేశారు. శనివారం ఉదయానికల్లా కట్టకపోతే బాగుండదంటూ హెచ్చరించారు. అప్పులిచ్చిన వారిని చూసి.. శనివారం ఉదయం ఆరు గంటలకే అప్పులిచ్చిన వారు నివాసం వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన గౌస్పీరా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు కూడా లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపులు కొట్టగా ఎంత సేపటికీ తీయలేదు. అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచారు. అప్పటికే గౌస్పీరా మృతి చెందాడు. మృతునికి భార్య (గర్భిణి), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భర్త మృతి చెందడంలో భార్య సల్మా బోరున విలపించారు. నాల్గవ పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ వివరించారు. -
ఆధారాలు చూపితే గంటలో రాజీనామా చేస్తా
నెల్లూరు(సెంట్రల్): తాను క్రికెట్ బుకీలను విజయవాడ, కడపలో కలిసి మాట్లాడినటు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధారాలు చూపితే గంటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎస్పీకి బహిరంగ సవాల్ విసిరారు. నగరంలోని రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెట్టింగ్ నిర్మూలనకు ఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను మద్దతు ఇస్తామన్నారు. కానీ రాజకీయ ప్రోద్భలంతో, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేసుల్లో ఇరికించే వాటికి వ్యతిరేకమన్నారు. పదిహేను నెలలుగా తాను పరారీలో ఉన్నట్లు కోర్టులో ఎస్పీ చార్జీషీట్ వేయడం చూస్తేనే ఈ కేసు ఎంత రాజకీయ రంగు పులుముకుని ఉందో తెలుస్తుందన్నారు. తాను ఏ పోలీసు అధికారికి ఫోన్ చేసి బుకీలను వదలమన్నానో ఆ పోలీసు అధికారుల పేర్లు స్పష్ట చేయాలన్నారు. బుకీలుగా ఉన్న వారు మంత్రులకు సన్మానాలు, విందులు ఇస్తే వారి పేర్లను చార్జీషీట్లో నమోదు చేయడానికి, వారికి నోటీసులు ఇవ్వడానికి ఎస్పీ రామకృష్ణ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం ఎస్పీ రామకృష్ణ జిల్లా పోలీసు బాస్ అనే అహంకారంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజాయితీగా ఉన్నానంటున్న ఎస్పీ కొందరు పోలీసులు బుకీలతో మాట్లాడిని కాల్ డేటాను ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. రాజకీయ దురద్దేశంతో కావాలని కక్షసాధింపుగా తనపై కేసులు నమోదు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మాత్రం న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎస్పీని కలవాలని కోరితే తాను వివిధ పనుల్లో ఉన్నానంటూ తనకు సమాధానంగా ఎస్పీ ఎస్ఎమ్మెఎస్ పంపారన్నారు. కానీ అన్ని విషయాలను లిఖిత పూర్వకంగా ఎస్పీకి రిజిష్టర్ పోస్టులో పంపుతున్నాన్నారు. పత్రికలకు నోటీసులు జారీ చేస్తా తాను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపమని మొదటి నుంచి చెబుతున్నానని, కాని కొందరు పోలీసులు శాఖలోని లీకు వీరుల సాయంతో, వారి మాటల ఆధారంగా తనపై అసత్య కథనాలు రాస్తున్న కొన్ని పత్రికలకు, టీవీ చానల్స్కు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చెప్పారు. కనీసం తాను బెయిల్ కూడా తెచ్చుకోనని, తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా కావాలని పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని న్యాయం స్థానం ముందు నిలబెడతానన్నారు. న్యాయపరంగానే పోరాటం చేద్దాం నెల్లూరు (సెంట్రల్): ప్రభుత్వ ఒత్తిడితో నమోదయ్యే తప్పుడు కేసులపై న్యాయపరంగానే పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో ఫోన్లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఫోన్ చేసి కేసు విషయాలు మాట్లాడి అధైర్య పడొద్దని సూచించారు. రాజకీయ కక్షతో పెట్టే కేసులను న్యాయ పరంగానే ఎదుర్కొని పోరాడదామని సూచించారు. పార్టీ నేతలు, శ్రేణులు అందరు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
విజయవాడ : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడే ముఠాను గురువారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పటమట ఏరియాలోని కరెన్సీనగర్లో కమల రెసిడెన్సీ అపార్టుమెంట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కాస్తున్న 12మందిని టాస్క్ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెట్టింగ్కు నాయకత్వం వíßహిస్తున్న కె. చంద్రమోహన్తో పాటు 11మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 సెల్ఫోన్లు, కలర్ టీవీ సీజ్ చేశారు. పందెం దారులు యాప్ ద్వారా బెట్టింగులు కాస్తున్నారు. విజయవాడ టాస్క్ఫోర్స్ ఏసీపీ పి. మురళీధర్, ఆర్. సురేష్రెడ్డి, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. -
టార్గెట్ వైఎస్సార్ సీపీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచి జిల్లాలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహరం తాజాగా కొత్త రంగు పులుముకుని సరికొత్త మలుపు తిరిగింది. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రజాప్రతినిధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో హట్టాపిక్గా మారింది. దీనిపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించి న్యాయపోరాటంతో ఎదుర్కొంటారని ప్రకటించారు. జిల్లాలో గతేడాది క్రికెట్ బెట్టింగ్ కేసులు వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఈ క్రమంలో క్రికెట్ బుకీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని అధికార పార్టీ ఒత్తిళ్లలో పోలీసులు మొదటి నుంచి ఆ దిశగానే విచారణ నిర్వహించారు. వాస్తవానికి జిల్లాలో అధికార పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులకు బుకీలతో మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ సత్యం. కానీ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అసత్య ప్రచారంతో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసే విధంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దలు రాజకీయంగా పోలీసులుపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిజాయితీగా, ప్రజా సేవే పరమార్థంగా తన పని తాను చేసుకునిపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణమాలు, పొలిటికల్ బీజీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక పర్యాయం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థి ఎన్నికల సమయంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను బెయిల్ తెచ్చుకోకుండా న్యాయపోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి 366 రోజుల పాదయాత్ర ప్రారంభించిన సమయంలో కోర్టులో పోలీసులు చార్జీషీటు వేసి ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఈ నెల 14న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఈ పరిణామాల క్రమంలో కేసు మళ్లీ అవినీతి నిరోధక శాఖకు అప్పగించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఈ కేసు నివేదికను డీజీపీ మాలకొండయ్యకు పంపిన క్రమంలో ఆయన కేసును ఏసీబీకి కేటాయించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. నేడు ఎస్పీని కలవనున్న కోటంరెడ్డి తాజా పరిణమాల క్రమంలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి శుక్రవారం జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను నేరుగానే కలవనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎస్పీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. -
పొలిటికల్ డ్యూటీ చేస్తున్న ఎస్పీ
నెల్లూరు(సెంట్రల్): ప్రజలకు సేవ చేయాల్సిన ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పొలిటికల్ డ్యూటీ చేస్తున్నారని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విరుచుకుపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరురూరల్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తీరుపై మండిపడ్డారు. బెట్టింగ్ కేసులో ఇతరులకు సహకరించినట్లు తనపై విచారణ పూర్తిచేసి కోర్టులో ఎస్పీ రామకృష్ణ చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినా స్పందించే పరిస్థితి లేదన్నారు. కానీ క్రికెట్ బెట్టింగ్లో దొరికిన వారికి తాను పోలీసులకు ఫోన్ చేసి విడిపించానని కట్టుకథ ఎస్పీ అల్లారని, నిజంగా తాను ఏ పోలీసు అధికారికి ఫోన్ చేశానో స్పష్టం చేయాలన్నారు. బుకీలకు తాను సపోర్టు చేస్తే తప్పు అయినప్పుడు, పో లీసులు విడుదల చేసినప్పుడు వారిది కూడా తప్పేన న్నారు. తాను ఏ ఎస్సై, సీఐ డీఎస్పీకి ఫోన్ చేసి విడిపిం చానో ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. నంద్యాల ఎన్ని కల సమయంలో, రాజ్యసభ ఎన్నికలప్పుడు, తాను పాదయాత్ర చేపట్టబోయే సమయంలో ఎస్పీ కా వాలని తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. ఎస్పీ నిజాయితీ పరుడా? ఎస్పీ రామకృష్ణ నిజాయితీ పరుడైతే క్రికెట్ బుకీలుగా ఉన్న వారు అధికార పార్టీ మంత్రులకు సన్మానాలు, విందులు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వీరిపై చార్జీషీట్ వేసి ఏసీబీ, జ్యుడిషియల్ విచారణకు ఎందుకు లేఖ రాయడానికి ఎస్పీ భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బెట్టింగ్లు చేసే వారితో పోలీసు అధికారులు వారి అటెండర్లు, డ్రైవర్ల ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్పై ఎందుకు విచారణ చేయడానికి ఎస్పీ జంకుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. పోలీస్ అధికారిగా కాకుండా పొలిటకల్ డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు. 100 కేసులు పెట్టినా భయపడను తనపై అక్రమంగా వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎస్పీ రామకృష్ణ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటానన్నారు. అధికార పార్టీ నాయకులు ఆడించినట్లు ఆడుతూ తనపై అక్రమ, అబద్ధాల చార్జీషీట్ వేసిన దానిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఎస్పీ తాటాకు బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. -
అంతా ఆన్లైన్లోనే..
కర్నూల్, ఎమ్మిగనూరురూరల్: క్రికెట్ బెట్టింగ్ అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. పందెం కాయడం నుంచి డబ్బు పంపిణీ వరకూ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. దీనిపై కన్నేసిన పోలీసులు పక్కా సమాచారం మేరకు బెట్టింగ్రాయుళ్లను పట్టుకుని కటకటాల వెనక్కునెట్టారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ జీ.ప్రసాద్ వివరాలు వెల్లడించారు.కొద్ది రోజులుగా అన్లైన్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నందవరం ఎస్ఐ జగన్మోహన్, హెడ్కానిస్టేబుల్ రాముడు, కానిస్టేబుల్స్ దశరధరాముడు, గంగన్న, సోమశేఖర్, సుభాన్ టీమ్గా ఏర్పడి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అనుమానితుల ఫోన్కాల్స్, బ్యాంక్ లావాదేవీలపై కన్నేశారు. ఈక్రమంలో కీలక బుకీ సైఫుల్లా బ్యాంకు ఖాతా నుంచి మరో బుకీ జాకీర్హుసేన్ ఖాతాకు రోజూ పెద్దమొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గాంధీనగర్లో ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్ నిర్వహిస్తున్న సైఫుల్లా, దస్తగిరి, హాలహర్వికి చెందిన నిజామీన్, బూదురుకు చెందిన రవికుమార్కు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ. 2.20 లక్షల నగదు, రెండు సెల్ఫోన్స్, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మరో బుకీ జాకీర్హుసేన్ కదలికలపై నిఘా ఉంచామని, త్వరలో అతడిన పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసును చేధించిన పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్ఐ హరిప్రసాద్, ధనుంజయ్ పాల్గొన్నారు. -
12 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
కదిరి: కదిరిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. 12 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుండి రూ. 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో ఆరుగురు పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకొని పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి గురువారం పట్టణ సీఐ కార్యాలయం వద్ద మీడియాకు వివరించడంతో పాటు బెట్టింగ్ రాయుళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కదిరి సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేరును కూడా గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఖాకీలపై ఖద్దరు కక్ష
సాక్షి, గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది క్రికెట్ బెట్టింగ్లో సర్వం కోల్పోయి, అప్పుల పాలై ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలపై దృష్టి సారించారు. జిల్లాలో పలువురు బుకీలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటి దొంగల పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయి. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, పలువురు ఎస్సైలకు క్రికెట్ బుకీలతో సంబంధాలున్నట్లు ఆధారాలు దొరికాయి. క్రికెట్ బుకీల స్టేట్మెంట్తోపాటు అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చిన డ్రైవర్లు, గన్మెన్లు, హోంగార్డుల నుంచి లిఖితపూర్వక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరు ఎస్సైలు, ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించారు. క్రికెట్ బుకీలు తమ పేర్లు బయటపెట్టారని తెలుసుకున్న కొందరు అవినీతి పోలీసు అధికారులు తమపై వేటు పడకుండా రక్షించాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయించారు. పోలీసులకు చిక్కిన క్రికెట్ బుకీల్లో పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్తోపాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. సత్తెనపల్లిలో దొరికిన బుకీల్లోనూ ‘అధికార’ నేతలుండడం గమనార్హం. బెట్టింగ్ మాఫియా జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు విచారణను నిలిపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారిని టీడీపీ నేతలు బదిలీ చేయించారు. ఆయన్ని వీఆర్లో ఉంచేలా చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీపై సైతం బదిలీ వేటు చేయించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
అమ్మ.. దొంగా..!
రాయచోటిటౌన్ : వారిద్దరు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడి బుకీకి డబ్బులు బాకీ పడ్డారు. బాకీలోకి చెల్లేసుకోమంటూ తమ బైకును ఇచ్చేశారు. ఆ తర్వాత తమ బైకు చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాల తనిఖీలో పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి నిందితులను అరెస్టు చేశారు. అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. రాయచోటి పట్టణ శివార్లలో మంగళవారం వాహనాల రికా ర్డులు తనిఖీ చేస్తున్న సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన రాజశేఖ ర్ అనే వ్యక్తి వచ్చి ఆయన వద్ద ఉన్న రికార్డులు పోలీసులకు చూపిం చాడు. రికార్డులను ఆన్లైన్ ద్వారా పరిశీలించిన పోలీసులు ఈ వాహనం గతంలో చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ వాహనం ఎక్కడిది.. నీకు ఎవరిచ్చారు.. అని పోలీసులు ప్రశ్నించారు. రామాపురం మండలానికి చెందిన నవకాంత్ రెడ్డి, సోమిరెడ్డిలు తన వద్ద క్రికెట్ బెట్టింగ్లో ఓడిపోయి రూ.30వేలు బాకీ పడ్డారని, దీనికి సంబంధించి రూ.24 వేలకు సోమురెడ్డి వాహనాన్ని నవకాంత్ రెడ్డి తనకు అమ్మాడని చెప్పారు. మిగిలిన మొత్తం రూ.6,000 నగదు చెల్లించారని చెప్పాడు. ఆ తరువాత సోమురెడ్డి, నవకాంత్ రెడ్డిలు ఇద్దరు కలసి తమ వాహనం రాయచోటి పట్టణంలో తమ బంధువుల ఇళ్ల వద్ద పెట్టి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు బైకు ఆచూకీ తెలియకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి ఇవ్వడంతో వీరు ఇ న్సూరెన్స్ కంపెనీ వారికి అందించి కంతులు కట్టకుండా తప్పించుకున్నారు. ఇలా వ్యవహారం నడిపిన ఇద్దరు చివరికి ఇలా పోలీసులకు చిక్కారు. దీంతో పో లీసులు వీరిపై కేసు నమోదు చేసి కోర్టు కు హాజరుపెట్టారు. అర్బన్ ఎస్ఐ రమేష్బాబు ఉన్నారు. -
రూ.10 వేలు కోసం ప్రాణం తీసుకున్నాడు
ఏటూరునాగారం : తన అవసరాలను తీర్చుకోవడానికి తల్లిని రూ.10 వేలు అడిగితే ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు జంపన్నవాగు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘణపురంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన భూక్య రాజు, విజయ దంపతుల కుమారుడు భూక్య బాలాజీ (23) బుధవారం రాత్రి తల్లిని రూ.10 వేలు కావాలని అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో బాలాజీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పలుచోట్ల వెతికినా అతడి జాడ కనిపించలేదు. గురువారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్ కారణమా ? ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన బాలాజీ మృతికి ఐపీఎల్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో జరిగే క్రికెట్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్లు ఏటూరునాగారం ప్రాంతంలో జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు తన మిత్రులతో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టిన బాలాజీ, తాను చాలెంజ్ చేసిన జట్టు ఓడిపోవడంతో రూ.10 వేలు మిత్రుడికి బాకీ పడినట్లు తెలిసింది. డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని మిత్రులు ఒత్తిడి చేయడంతో డబ్బులను ఇంటి వారి నుంచి రాబట్టలేక, ఇటు స్నేహితులతో మాటపడలేక తనువు చాలించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో పోలీçసులు బెట్టింగ్కు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేసి జరిమానా విధించారు. అయిన బెట్టింగ్లు అదుపులోకి రాకపోవడం గమనార్హం. -
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై పోలీసులు కక్ష సాధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరుకాలేదనే కారణంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అది కూడా366 రోజుల పాదయాత్రకు ఒక్కరోజు ముందుగా. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 14న కోర్టుకు హాజరుకావాలని.. నెల్లూరు రెండో నగర పోలీస్స్టేషన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు కృష్ణసింగ్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కృష్ణసింగ్తో పాటు మరికొందరు బుకీలను ఎమ్మెల్యే ప్రోత్సహించినట్లు వారికి సహకరించనట్లు, వారితో లావాదేవీలు నిర్వహించినట్లు తగిన ఆధారాలు సేకరించి ఎమ్మెల్యేకు రెండు పర్యాయాలు నోటీసులు ఇస్తే ఆయన విచారణకు నిరాకరించిన కారణంగా బుధవారం కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా వచ్చే నెల 14వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఇతరులకు సమన్లు జారీ చేశారని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తును ఏసీబీ అధికారులు నిర్వహిస్తారని కేసును వారికి అప్పగించినట్లు ప్రకటనలో వివరించారు. న్యాయపోరాటంతోనే ఎస్పీ డొల్లతనంబయటపెడతా పోలీసులు తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. న్యాయ పోరాటంలోనే జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ డొల్లతనం బయటపెడతానన్నారు. తనపై అక్రమ కేసులో కుట్రలో ఉన్న మంత్రులు, పోలీసు పెద్దలు అందరి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. తానే గతంలో ఈ అక్రమ కేసును సీబీఐ, సీఐడీ లేదా ఏసీబీకి ఇవ్వాలని డిమాండ్ చేశానన్నారు. అక్కడ తాను, ఎస్పీ రామకృష్ణ ఇద్దరు వివరణలు ఇవ్వాలని, దీనికి తాను సిద్ధంగా ఉన్నానని ఎస్పీ సిద్ధంగా ఉన్నారా అని గతంలోనే ప్రశ్నించానని చెప్పారు. 2017లో అగస్టులో స్వయంగా జిల్లా పోలీస్ బాస్ ఈ కేసులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ప్రకటించారు. కానీ తర్వాత రాజకీయ కక్షతో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఇచ్చారని మళ్లీ రెండో పర్యాయం 8 నెలల తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చారని వివరించారు. ఇప్పుడు 366 రోజుల పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పాదయాత్రకు ఒక్కరోజు ముందు కోర్టు సమన్లు ఇచ్చిందని పోలీసులు ప్రకటించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో పోలీస్ పెద్దల డైరక్షన్లో తనపై కుట్ర జరగుతుందని మండిపడ్డారు. తాను నిత్యం జనాల్లో ఉంటూ ప్రతి నిమిషం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటుండగా పోలీసులు మాత్రం తాను అజ్ఞాతంలో ఉన్నట్లు చార్జీషీటులో పేర్కొనటం అత్యంత దారుణం అన్నారు. చార్జీషీటులో ఒక రకంగా పత్రికలకు ఒక రకంగా చెబుతూ జిల్లా ఎస్పీ మైండ్గేమ్ అడుతున్నారని, పూర్తి ఆధారాలతో పోలీసుల డొల్లతనాన్ని బయటపెడతానని, ఇలాంటి అక్రమ కేసులకు తానేమీ భయపడనని చెప్పారు. -
కేటుగాళ్లకు కేరాఫ్..
రేషన్ బియ్యం నుంచి గంజాయి సరఫరా వరకు.. అక్రమమైనింగ్ నుంచి రంగురాళ్ల వేట వరకు.. దారిదోపిడీల నుంచి పేకాట క్లబ్ల వరకు... అక్రమ దందాలన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పిడుగురాళ్లలోని ఓ హోటల్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతల బండారం టాస్క్ఫోర్స్ బృందాల దాడిలో బట్టబయలైంది. నిందితుల్లో టీడీపీ కౌన్సిలర్తోపాటు పలువురు నాయకులు ఉండటంతో ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా, అక్రమ మైనింగ్, బెల్టుషాపులు, ఇలా ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతూ కోట్లు గడిస్తున్నారు. అయినా వీరికి ధన దాహం తీరడం లేదు. పేకాట, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రంగురాళ్ల వేట, దొంగనోట్లు వంటి అసాంఘిక కార్యకలాపాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే స్వయంగా నిర్వహిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో దాచేపల్లిలో పేకాట క్లబ్ను ఏర్పాటు చేసి యథేచ్ఛగా పేకాట ఆడించిన వ్యవహారం ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ జరగడం, అనంతరం యువనేత ఆదేశాలతో మళ్లీ తెరుచుకోవడం, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా దృష్టి సారించి మూసివేయించిన ఘటన అందరికీ తెలిసిందే. దాచేపల్లి మండలంలోని అటవీ భూముల్లో మండల స్థాయి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో రంగురాళ్లను తవ్వి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం కలిగించింది. మాచర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేత అనుచరులు దొంగ నోట్లు మారుస్తూ నల్లగొండ పోలీసులకు దొరికిపోయిన విషయం కూడా తెలిసిందే. జిల్లా రూరల్ ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ ఉన్న సమయంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ ముఖ్య నేత ఆయన్ను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. పిడుగురాళ్ళ, కారంపూడి, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీ నేతలను స్పెషల్ పార్టీ పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. తాజాగా పిడుగురాళ్ళ పట్టణంలోని అపూర్వ హోటల్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను టాస్క్ఫోర్స్ బృందాలు అరెస్టు చేశారు. అధికారపార్టీకి చెందిన పిడుగురాళ్ళ మున్సిపాలిటీ రెండోవార్డు కౌన్సిలర్ కోయ శ్యామలారావు అలియాస్ శ్యామ్, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గుదె భీష్మ, మొదటి నిందితుడు చల్లగుండ్ల బాబురావుతో పాటు పలువురు అధికార పార్టీ నేతలు వీరిలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు అధికార పార్టీ ముఖ్యనేత చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యా యి. వీరి వద్ద భారీ స్థాయిలో గంజాయి సైతం పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి అనేక మంది అమాయకులు బలవగా, వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యారు. అలాంటి క్రికెట్ మాఫియాను అడ్డుకోవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే వారికి అండగా నిలుస్తూ కొమ్ముకాస్తుండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దంటూ వేదికలపై ఉపన్యాసాలు చెప్పే ప్రజాప్రతినిధులే వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
టీడీపీ నేతలే క్రికెట్ బు‘కీ’లు!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న బుకీలు, బెట్టింగ్ రాయుళ్లను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం మండలం పిల్లుట్లకు చెందిన జిల్లా రాంబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరెస్టు చేసిన నిర్వాహకులు, బుకీలను విలేకరుల ముందు సోమవారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. రాంబాబు ఇచ్చిన సమాచారం మేరకు సీసీఎస్, టాస్క్ఫోర్స్, సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీసులతో కూడిన బృందాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. పిడుగురాళ్లలో కొండమోడు ప్రాంతంలో అపూర్వ హోటల్లో ఈ నెల 22న క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న చల్లగుండ్ల బాబు, గుదె భీష్మలను బృందాలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాయని చెప్పారు. వీరి నుంచి కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్ట్యాప్, రూ.20 వేలు నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక్కొక్కరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదే హోటల్లో బెట్టింగ్లు కాస్తున్న పిడుగురాళ్ల మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ కోయ శ్యామలరావు, మరో 11 మందిని ఈ నెల 23న అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.21 వేలు నగదు, ఒక టీవీనీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన ఎస్ఐ రవీంద్రబాబు, ఏఎస్ఐ దరియాసాహెబ్, పీసీ గోపాల్, కరీముల్లా, గుర్నా«థ్రెడ్డి, పార్థసారథి, హోంగార్డు బాషాలను రూరల్ ఎస్పీ అభినందించారు. బుకీలు, నిర్వాహకులంతా టీడీపీ నేతలే.. బెట్టింగ్ ముఠాలో టీడీపీ కౌన్సిలర్తోపాటు, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఉండడం గమనార్హం. పిడుగురాళ్ల మున్సిపాల్టీలోని రెండో వార్డు కౌన్సిలర్ కోయ శ్యామలరావు అలియాస్ శ్యామ్తోపాటు ఆ పార్టీ నేతలు చల్లగుండ్ల బాబూరావు, గుదె భీష్మ, వడ్లవల్లి సైదారావు, మద్దికుంట వెంకటేశ్వరరావు, భవిరిశెట్టి విష్ణుమూర్తి, షేక్ మస్తాన్వలి, ఆవుల పుల్లారావు, చల్లగుండ్ల అంజయ్య క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిని వదిలేయాలంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ వాటికి లొంగకుండా పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. -
బెట్టింగ్ కోసమే ఓ వాట్సాప్ గ్రూపు..
సాక్షి,నిజామాబాద్ : ఐపీఎల్ సందడి మొదలయ్యిందంటే చాలు.. జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ జోరు పెరుగుతుంది. రూ. కోట్లలో టర్నోవర్ కాగా.. బెట్టింగ్లో పాల్గొంటున్న వారెందరో నిండా మునిగి పోతున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర పుణేకు చెందిన గుర్తు తెలియని ప్రధాన బూకీకి నిజామాబాద్లో నలుగురితో పరిచయం ఉంది. ప్రధాన సుత్రధారి ఓంలైన్ పేరిట వాటప్స్ గ్రూప్ను సృష్టించి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, లాడ్జీలు, బోధన్ రోడ్డు, కంఠేశ్వర్ ప్రాంతాలతో పాటు, ఆర్మూర్, బోధన్ ప్రాంతాలలో బెట్టింగ్ల జోరుగా సాగుతున్నట్లు సమాచారం. బెట్టింగ్ సంస్కృతి మండలాలకు సైతం పాకినట్లు తెలుస్తోంది. బెట్టింగ్లో డబ్బులు వచ్చిన వారు మరికొందరిని ఈ ఉచ్చులో దింపుతున్నారు. క్రికెట్ ఆటపై పూర్తిగా అవగాహన ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుండగా, మిగతావారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు, మూడవ టౌన్ పోలీసులు నగరంలో బెట్టింగ్ జరుగుతున్న ఇంటిపై దాడిచేయగా అసలు విషయం బయటపడింది. గతంలో బెట్టింగ్కు పాల్పడిన కొందరిని పోలీసులు పట్టుకుని విచారించగా ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్లో పాత్రదారులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన కందికంటి నాగరాజుగౌడ్, గౌతంనగర్కు చెందిన మధుగాని బాలకృష్ణ, నాందేవ్వాడకు చెందిన సంత్పాలే జ్యోతిశ్వర్ భాగ్యనగర్కాలనీ ఖానాపూర్కు చెందిన పాంచాల రమేష్లు క్రికెట్ బుకీలు. వీరికి మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రధాన బూకీ పరిచయం ఉంది. క్రికెట్ మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి ఇతను సృష్టించిన వాట్సాప్స్ గ్రూపు ద్వారా బెట్టింగ్ సాగింది. నాగరాజు గౌడ్ తన ఇంటినే బెట్టింగ్ అడ్డాగా మార్చాడు. బూకీలతో పాటు 80 మందిపై కేసుల నమోదు... నగరానికి చెందిన క్రికెట్ బూకీలు నాగరాజు గౌడ్ వద్ద 33 మంది, బాలకృష్ణ వద్ద 33 మంది, నవాతే సంజీవ్ వద్ద 28, జ్యోతిశ్వరం వద్ద 13 మంది, రమేష్ వద్ద ఆరుగురు మొత్తం 80 మంది బెట్టింగ్లు ఆడేవారు ఉన్నారు. బూకీల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసే రమేష్ అలియాస్ నాని, భోజ్య యాదగిరి, మోరు రాంజీలు బెట్టింగ్ ఆడేవారి వద్ద నుంచి వివరాలు సేకరించి నమోదు చేస్తారు. గెలిచిన వారికి డబ్బులు ఇవ్వడం , ఓడిన వారి నుంచి వసూలు చేయడం వీరి పని. పోలీసులు దాడులు చేసిన సమయంలో వీరినుంచిరూ. 3లక్షల నగదు, 13 సెల్ఫోన్లు, నాలు గు నోట్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ శనివారం విలేకరులకు వివరాలను వెళ్లడించారు. బెట్టింగ్ నిర్వహణ ప్రధాన సూత్రధారి కోసం త్వరలో పుణేకు పోలీస్ బృందం వెళ్లనున్నట్లు సీపీ తెలిపారు. క్రికెట్ బూకీలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన నగర సీఐ సుభాష్చంద్రబోస్, టాస్క్ఫోర్సు సీఐ జగదీష్, చందర్రాథోడ్, మూడవ టౌన్ ఎస్సై ఆర్ కృష్ణ, కానిస్టేబుళ్లు సంగేష్, సర్దార్లను సీపీ అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ శ్రీధర్రెడ్డి, ఏసీపీ సుదర్శన్, నగర సీఐ సుభాష్ చంద్రబోస్, ఎస్సై కృష్ణలు పాల్గొన్నారు. -
క్రికెట్ బుకీల ఆటకట్టు
సాక్షి, గుంటూరు: పల్నాడులో కీలక క్రికెట్ బుకీల్ని టాస్క్ఫోర్స్ బృందాల ద్వారా అదుపులోకి తీసుకుని మూలాల్ని వెతికే పనిలో పోలీసు అధికారులు పడ్డారు. వారి ద్వారా బెట్టింగ్ తీగను లాగుతూ డొంకను కదిల్చే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న క్రికెట్ బుకీల్లో అధికార పార్టీకి చెందిన పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్తోపాటు, పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వారిని వదిలేయాలంటూ పోలీస్ బాస్ల ద్వారా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే, రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు మాత్రం బుకీలు అందించిన కీలక సమాచారంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ఆట కట్టించే దిశగా సీరియస్గా అడుగులు వేస్తున్నారు. బెట్టింగ్ ఉచ్చులో అమాయకులు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి ఉచ్చులో చిక్కుకుని ఎందరో అమాయకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరెన్నో కుటుంబాలు అప్పులపాలై రోడ్డున పడ్డ సంఘటనలు అందరికీ తెలిసినవే. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ వందల కుటుంబాలు సర్వనాశనం చేస్తున్న బుకీల ఆటకట్టించాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిదే క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తుండటంపై జిల్లా ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ప్రజాప్రతినిధి చేయాల్సిన పనేనా అంటూ మండి పడుతున్నారు. ఇది టీడీపీ, ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. సీఎం పేషీ నుంచి సైతం ఒత్తిడి టాస్క్ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకున్న క్రికెట్ బుకీల్లో ఓ కౌన్సిలర్తోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఉండటంతో పల్నాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ వారిని వదిలేయాలంటూ పోలీసు బాస్ల ద్వారా జిల్లా పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. సీఎం పేషీనుంచి సైతం పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి క్రికెట్ బుకీలను విడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం. పోలీసులు సీరియస్ జిల్లాలో బెట్టింగ్ జాడ్యాన్ని రూపుమాపేందుకు గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రెండు పోలీసు జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేసి క్రికెట్ బుకీలను జిల్లా నుంచి తరిమే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పిడుగురాళ్ల పట్టణంలో ఓ రెస్టారెంట్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న కొందరు బుకీలను టాస్క్ఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. వీరిలో అధికారపార్టీకి చెందిన పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్తోపాటు, పలువురు టీడీపీ నేతలు సైతం ఉండటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుకీల్ని విచారిస్తూ వారి నుంచి కీలక సమాచారాలను రాబట్టినట్లు తెలిసింది. గుంటూరు నగరంలోని ఓ క్లబ్లో కూర్చొని గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ రాయుళ్లకు లైన్ ఇస్తూ ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. ఎస్సీల దెబ్బకు ఇప్పటికే పలువురు బుకీలు జిల్లా వదిలి వెళ్లి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తుండగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో వీరు మాత్రం జిల్లా నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం. -
క్రికెట్ బెట్టింగ్ జోరు
రాయచోటి రూరల్ : మన దేశంలో యువత నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారిలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆట క్రికెట్. టి–20 మ్యాచులతో క్రికెట్కు మరింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఐపీఎల్ పేరుతో నిర్వహిస్తున్న అతి పెద్ద టి–20 క్రికెట్ టోర్నమెంట్కు ఆట పరంగా క్రేజ్తో పాటు బెట్టింగ్ పరంగా దేశ వ్యాప్తంగా విపరీతమైన మోజు పెరుగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో ఐపీఎల్ జోరుగా కొనసాగుతుండటంతో, అంతే స్థాయిలో క్రికెట్బెట్టింగ్ కూడా సాగుతోంది. జిల్లా వ్యాప్తం గా ఎక్కడ చూసినా ఐపీఎల్ మాటే. ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉండటంతో హోటళ్లు, ప్రధాన కూడలి ప్రాంతాలు, రెస్టారెంట్లు బుకీలకు వేదికగా మారాయి. అయితే జిల్లాలో ప్రొద్దుటూరు బెట్టింగ్లో మొదటి స్థానం సాధించగా, రాయచోటి రెండవ స్థానంలో ఉన్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వీటితో పాటు రాజంపేట, కడప, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో బెట్టింగ్కు పాల్పడే వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం విశేషం. పలు రకాలుగా బెట్టింగ్లు.! ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు వివిధ రకాలుగా నిమిషాలలో వేలాది రూపాయలు చేతులు మారే విధంగా బెట్టింగ్లు కాస్తున్నారు. ఫలా నా ఓవర్లో ఇంత స్కోరు వస్తుంది, ఫలానా ఓవర్లో అవుట్ అవుతారు, ఓవర్ల వారిగా ఫోర్లు, సిక్సర్లు వస్తాయంటూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి ఎవరు గెలుస్తారు, టాస్ వేయకముందే మొదటి ఫీల్డింగ్ చేసే వారో, లేక బ్యాటింగ్ చేసే వారో గెలుస్తారంటూ లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే ప్రధాన ఆట గాళ్ల ఆటతీరుపైన కూడా బెట్టింగ్లు జరుపుతున్నారు. ఏదీ ఏమైనా ఎక్కువ శాతం కమీషన్లు తీసుకుని బుకీలు బెట్టింగ్కు పాల్పడుతూ యువతలో క్రికెట్పై ఉన్న క్రేజ్ను సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల వలలో చిక్కుతున్న చేపలు, తప్పించుకుంటున్న తిమింగళాలు ప్రతి రోజు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో బెట్టింగ్ రాయుళ్లపై , బుకీలపై , యువతపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాకముందు నుంచి గతంలో బెట్టింగ్కు పాల్పడిన వారిని, కేసుల్లో ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కొత్తగా తయారైన బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు పోలీసుల నిఘాను ఏమార్చేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఇక్కడి వారితో బెట్టింగ్లు కట్టించే విధంగా ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు మరింత చాకచక్యంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు వేస్తున్న వలలో చిన్నపాటి బెట్టింగ్లకు పాల్పడుతున్న చేపలే చిక్కుతున్నాయి కానీ , పెద్ద పెద్ద తిమింగళాలు మాత్రం తప్పించుకుంటున్నాయని రాయచోటి పట్టణంలోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. రూ.100 కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం.! జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మండల , గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఐపీఎల్ జరిగే నెల రోజులకు పైగా ప్రతి రోజు రూ.2 కోట్లు–2.5 కోట్ల నుంచి మొత్తం 100కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ల రూపంలో చే తులు మారే అవకాశం ఉన్నట్లు కొం దరు బుకీలు, ప్రధాన బెట్టింగ్ రాయు ళ్లు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్లపై 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి: అట్టాడ బాబూజీ, ఎస్పీ యువత చెడుమార్గంలోనకి వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ నుంచి మేము కూడా అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ తీసి దాని ద్వారా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. బెట్టింగ్ను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత . బెట్టింగ్ నివారణకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అనుమానాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నాము. బెట్టింగ్ వల్ల చాలా వరకు కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. బెట్టింగ్పైన ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆయా పోలీసు స్టేషన్లలో కానీ, 100 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలి. -
కాయ్ రాజా.. కాయ్!
మహబూబ్నగర్ క్రైం: ఐపీఎల్ పోటీలు మొదలవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బెట్టింగ్రాయుళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ కేంద్రాల శివారుల్లో ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. మరికొందరు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లోనే బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. బెట్టింగ్ మూలంగా ఎంతోమంది తీవ్రంగా నష్టపోయి సర్వస్వం కోల్పోగా.. ఈ విష సంస్కృతికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సైతం విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నా.. తిరిగి యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.. అంతా సెల్ఫోన్లపైనే.. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలకు ఆధారంగా మారిన సెల్ఫోన్ను.. బెట్టింగ్కు కూడా పలువురు ఉపయోగించుకంటున్నారు. గతంలో మాదిరి అందరూ కలిసి ఒక గదిలో టీవీ ఏర్పాటు చేసుకుని మ్యాచ్ చూస్తూ పందెం కాసే రోజులు పోయాయి. ఇంటా, బయట ఎక్కడ ఉన్నా చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు బెట్టింగ్ వేయడానికి అవకాశం ఉంది. ఓడిన వ్యక్తుల నుంచి మరుసటి రోజు ఉదయం డబ్బు వసూలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొన్ని అడ్డాల్లో ఈ వ్యవహారం ప్రముఖంగా కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్లు మొదలవుతుండగా.. మూడు గంటల నుంచే పందెలు షూరూ అవుతున్నాయి. ఎవరు టాస్ గెలుస్తారు, ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారు. ఎవరు ఫీల్డింగ్ చేస్తారనే అంశం మొదలు... ఒక్కో క్రీడాకారుడు ఎన్ని పరుగులు చేస్తాడు.. ఎవరెన్ని వికెట్లు తీస్తారు.. ఎవరు ఎక్కువ క్యాచ్లు పడతారు.. ఏ ఆటగాడు ఎక్కువ సిక్స్లు కొడతాడు... అంటూ బెట్టింట్లు ప్రారంభిస్తున్నారు. ఆటను చూస్తున్నప్పుడు చేతిలో డబ్బులు లేని వారికి ప్రతీ రూ.వెయ్యికి రూ.10 చొప్పున కమీషన్గా తీసుకుంటూ కొందరు అక్కడే ఉండి డబ్బు సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇక పోలీసులు కానీ ఇంకా ఎవరికైనా బెట్టింగ్ కాసే విషయం తెలియకుండా జట్టు సభ్యుల దుస్తుల రంగు, ఇతరత్రా అంశాలను కోడ్గా ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి బెట్టింగ్లో సాంకేతికత ప్రవేశించిందని సమాచారం. వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని యాప్లను దీనికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కేవలం మహానగరాలకే పరిమితమైన ఈ పరిజ్ఞానాన్ని నిర్వాహకులు ఇక్కడా వాడుతున్నారు. ప్రధానంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. వాట్సప్లో రూ.3వేలు వెచ్చించి ఒక లైన్ తీసుకుంటుండగా.. ఈని ద్వారా మ్యాచ్ స్థితిగతులు బుకీలకు తెలుస్తాయి. టాస్ వేసిన క్షణం నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్ స్వరూపం మారుతుంటుంది. కొందరు మ్యాచ్ ఓడిపోతుందనే అంచనాకు రాగానే ఎక్కువ రేటింగ్ ఇచ్చి వేరే జట్టుకు తమ పందేన్ని మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నిర్వాహకులకు అధిక లాభాలు ఉంటాయి. రేటింగ్ ఎక్కువ ఉన్న జట్టును అప్పటికప్పుడు తీసుకుంటే రూ.10వేలకు రూ.15వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక బెట్టింగ్లో ఓడిపోయిన వారి దగ్గర మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి డబ్బు తీసుకుంటారని.. ఇదంతా మధ్యవర్తుల ద్వారానే సాగుతుంది తప్ప అసలు సూత్రధారులు ఎవరు కూడా తెరపై కనిపించని తెలుస్తోంది అలవాటైన వారు మళ్లీ.. ఒకసారి పందెంలో పాల్గొని గెలిచినా లేదా ఒడిన వారు మళ్లీమళ్లీ పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్య పట్టణ కేంద్రాలకు చెందిన కొందరు వ్యాపారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. కొందరైతే ఈ సీజన్ జరిగినన్ని రోజులు వ్యాపారాలకు స్వస్తి పలికి బెట్టింగ్లోనే మునిగి తేలుతున్నారని చెబుతున్నారు. ఇక ఎలాంటి కష్టం లేకుండా.. కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించాలనే ఆశతో ఐపీఎల్ బెట్టింగ్లో యువత పాల్గొంటున్నారు. అయితే, ఈ పందెంలో కొందరే గెలుస్తుండగా.. ఎక్కువ మంది ఓడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఇదేసమయంలో డబ్బు చెల్లించలేక పలువురు విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు తాకట్టు పెడుతున్నారని.. కొందరు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు.. పట్టణంలోని అపార్టుమెంట్లు, హోటళ్లు, దుకాణాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాగా. పందెంలో పాల్గొంటున్న వారిలో ఎస్సెస్సీ విద్యార్థులు మొదలు పీజీ చదువుతున్న వారు కూడా ఉంటున్నారని చెబుతుండడం ఆందోళన కలిగించే విషయం. నిఘా ఏర్పాటు చేస్తాం బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. ఎంతటి వారైనా వదిలేది లేదు. బెట్టింగ్ ద్వారా యువత, వారి కుటుంబాలు భారీగా నష్టపోతాయి. ఈజీ మనీ కోసం కొందరు ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్ క్రికెట్పై ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా, మోసపూరిత చర్యలకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ జరుగుతున్న ప్రాంతాలు, బాధ్యుల సమాచారాన్ని మాకు అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి నిందితులను పట్టుకుంటాం.– బి.అనురాధ, ఎస్పీ, మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ జడ్చర్ల: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ కాస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాదేపల్లి గౌరీశంకర్కాలనీ సమీపంలో మైనార్టీ గురుకుల పాఠశాల వెనకాల ఓ ఇంటిలో బెట్టింగ్ కాస్తున్నట్లు అందిన సమాచారంతో ఆదివారం సీఐ బాలరాజుయాదవ్ ఆధ్వర్యాన పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్లకు చెందిన శ్యాం, సౌసిక్, పవన్, మోసిన్, నవీన్, ఉదయ్, హరీష్, రాకేష్బాబును అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి నుంచి రూ.39 వేల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఐపీఎల్ టోర్నీల ప్రారంభం నుంచి శ్యాం అనే యువకుడు ఓ గది అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జీవితాలతో ఆట!
కొండసాని సురేశ్రెడ్డి. ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి పీఏగా పనిచేసిన వ్యక్తి. జీవా తాడిపత్రి వాసి. వీరి కనుసన్నల్లో నడిచే బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేస్తే రూ.29.90 లక్షలు పట్టుబడింది. తాడిపత్రి అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోందని ‘సాక్షి’లో లెక్కలేనన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు బెట్టింగ్పై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడంతో నిర్వాహకులతో పాటు బెట్టింగ్రాయుళ్లలో వణుకు పుడుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్కా.. క్రికెట్ బెట్టింగ్.. పేకాట. ఈ మూడింటికీ అనంత అడ్డాగా మారింది. తాడిపత్రి కేంద్రంగా ఎన్నో జీవితాలు కూలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బడా నేతల అండతో అనుచరవర్గం సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు ఈ ఆట గుట్టురట్టు చేసింది. అయితే అప్పటికప్పుడు బుకీలను అరెస్టు చేయడం.. బెట్టింగ్రాయుళ్లను అదుపులోకి తీసుకుని వదిలేయడంతో పోలీసులు తమ పని అయిందనిపించడం పరిపాటిగా మారుతోంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ల మధ్య మంగళవారం నుంచి ముక్కోణపు టీ–20 సిరీస్ ఆరంభమైన నేపథ్యం లో ఒక రోజు ముందుగానే బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్లీగ్)మ్యాచ్లకు బెట్టింగ్ కాస్తూ పట్టుబడ్డారు. సోమవారం బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నా మంగళవారం రాత్రి శ్రీలంక–భారత్ మ్యాచ్కు యథేచ్ఛగా భారీగా బెట్టింగ్ సాగడం గమనార్హం. తాడిపత్రి, అనంత కేంద్రంగా బెట్టింగ్ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు బుకీలు తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. బుకీలు ముంబయి, హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ సబ్ బుకీలను నియమించుకుంటారు. మ్యాచ్ ప్రారంభం నుంచి.. ముగిసే వరకు బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. దీనికి వ్యాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి బెట్టింగ్ రేటును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే ఎక్కుగా బెట్టింగ్ నడుస్తోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఒక జట్టును ఫెవరెట్గా పరిగణిస్తారు. ఫేవరెట్ జట్టుపై బెట్టింగ్ కాసి ఆ జట్టు విజయం సాధిస్తే తక్కువ డబ్బు వస్తుంది. ఫేవరేట్ కాని జట్టు గెలిస్తే భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడిన వారిలో లక్షకు ఐదు లక్షల చొప్పున కూడా బెట్టింగ్ కాశారు. మ్యాచ్లో ఫేవరెట్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోతే వెంటనే బెట్టింగ్ తీరు మారిపోతోంది. 50–50కి వస్తుంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ తన స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగే జిల్లాలో రోజూ రూ.2 కోట్ల దాకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాల్టు బాల్ బెట్టింగ్ సబ్బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్? ఫోర్ కొడతాడా? బౌలర్ డాట్ బాల్ వేస్తాడా? బ్యాట్స్మన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతీ బాల్కు బెట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బాల్స్పై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్కు కొన్ని లాడ్జీలు, ఇళ్లను రోజువారీ అద్దెకు తీసుకుని నడిపిస్తారు. ఇలాంటి ఇళ్లకు రోజుకు రూ.5వేలు కూడా అద్దె చెల్లిస్తున్నారు. అలాగే 10–20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి మ్యాచ్ సమయంలో ఓ లాడ్జీ ని అద్దెకు తీసుకుని అక్కడ బెట్టింగ్ ఆడుతుంటారు. సోమవారం పట్టుబడిన వారు కూడా అనంతలో ఓ గదిని అద్దెకు తీసుకుని పట్టుబడ్డారు. ఈ తరహా బెట్టింగ్ రోజూ రూ.1.50కోట్ల దాకా ఉంటోందని సమాచారం. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయిస్తేనే ప్రయోజనం జీవా విజయవాడలో ఎక్కువగా ఉంటాడు. అక్కడి నుంచే బెట్టింగ్ను నిర్వహిస్తుంటాడని తెలుస్తోంది. జీవాను విచారిస్తే పూర్తిగా బెట్టింగ్ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ఇతని కనుసన్నల్లో తాడిపత్రిలో మరో ఆరుగురు సబ్బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ‘అనంత’లోనూ భారీగా బెట్టింగ్ సాగుతోంది. వన్టౌన్ పరిధిలోని పంజాబ్నేషనల్ బ్యాంకు వీధిలో రోజూ బెట్టింగ్రాయుళ్లు సమావేశమవుతుంటారు. అలాగే కమలానగర్లోని ఓ కేఫ్లోనూ మరో బృందం రోజూ సమావేశమై బెట్టింగ్ నిర్వహిస్తోంది. రాజు రోడ్డులోని ఓ హోటల్లో సూట్ బుక్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలో ఏ లీగ్, టోర్నీ జరిగినా పందేలు కాస్తున్నారు. రోజూ టీవీలో ఏదో ఒక మ్యాచ్ వస్తుంటుంది. అంటే రోజూ బెట్టింగ్ నడుస్తున్నట్లే లెక్క. భారత్ ఆడే మ్యాచ్లు ఉంటే బెట్టింగ్కాసే వాళ్లు మరింత ఎక్కువగా ఉంటారు. మంగళవారం నుంచి మొదలైన ముక్కోణపు టోర్నీ జరిగే సమయాల్లో దాడులు నిర్వహిస్తే భారీగా బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడే అవకాశం ఉంది. భారీ వడ్డీలకు అప్పులు బెట్టింగ్లో కలిసొస్తే పదివేలతో వెళ్లిన వాడు రూ.లక్షతో తిరిగొస్తాడు. లేదంటే రూ.లక్ష తీసుకెళ్లిన వాడు రూపాయి కూడా మిగిల్చుకోలేని పరిస్థితి. దీంతో బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీతో డబ్బులు తెస్తున్నారు. ఇంకొందరు పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్లను కూడా తాకట్టుపెడుతున్నారు. -
పోలీసుల అదుపులో జేసీ అనుచరుడు
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కొండసాని సురేశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కొండసాని సురేష్రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పీఏగా పనిచేశారు. ఇప్పుడు అనధికారికంగా జేసీకి సేవలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ పేరు మోసిన క్రికెట్ బుకీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొండసాని సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసేందుకు తర్జనభర్జన పడుతున్నారు. కాగా పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తూ ఇటీవల సురేష్ రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి పేరుతో భూబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సురేశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు జేసీ ద్వారా సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. -
దొంగను చేసిన క్రికెట్ బెట్టింగ్!
సాక్షి, చిత్తూరు : క్రికెట్ బెట్టింగ్ ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ను దొంగను చేసింది. జిల్లాలోని వి.కోట ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచిలో మేనేజర్గా పనిచేస్తున్న ప్రకాశ్ ఏకంగా తనాఖా పెట్టిన నగలను బెట్టింగ్ కాసి పోగొట్టుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన 2 కేజీల నగల స్థానంలో నకిలీ బంగారు నగలను పెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మనస్థాపంతో ప్రకాశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో సుభాష్ అరెస్ట్
నెల్లూరు(సెంట్రల్): క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత దువ్వూరు శరత్చంద్ర కుమారుడు దువ్వూరు సుభాష్ను ఆరోనగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సుభాష్ అరెస్ట్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితమే సుభాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో నామమాత్రపు కేసులు పెట్టి అరెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. సుభాష్ వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, రూ.1,540 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలాజీనగర్ పోలీసులు తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడిది ఒంగోలు
ఒంగోలు క్రైం: క్రికెట్ బెట్టింగ్ల ప్రధాన సూత్రధారిది ఒంగోలుగా అద్దంకి పోలీసులు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అతడు ఒంగోలులో ఓ సారి అరెస్టయ్యాడు. ఈ నెల 7న క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న దాదాపు 15 మందిని అద్దంకి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన క్రికెట్ బుకీగా తూము వెంకట్రావుగా గుర్తించారు. వెంకట్రావు బండ్లమిట్టకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ముంగమూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. అద్దంకి పోలీసులు నమోదు చేసిన కేసులో ఇతడిని ఎనిమిదో నిందితుడిగా చేర్చడం గమనార్హం. ఇతడు స్థానిక అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. క్రికెట్ బెట్టింగులపై దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి అద్దంకి పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్లతో పాటు గంజాయి వ్యాపారం కూడా వెలుగు చూసింది. ఏజెన్సీ ప్రాంతాలైన నర్సీపట్నం, చింతపల్లి ఏరియాల నుంచి గంజాయి తెప్పించి ఎన్డీపీఎస్ చట్టాన్ని అతిక్రమించినట్టు కూడా అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దంకి కొత్తపేటకు చెందిన బంగారు వ్యాపారి నన్నాబత్తిన విశ్వరూపాచారి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అతడి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. సెల్ఫోన్లు ఉపయోగించి ‘క్రికెట్ మజా’ అన్న యాప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం మీద 15 మందిని అరెసుఏ్ట చేశారు. ప్రధాన బుకీలైన తూము వెంకట్రావు, చిలకలూరిపేటకు చెందిన రామకృష్ణ అలియాస్ ఆర్కేలను అరెస్టు చేయాల్సి ఉంది. వెంకట్రావు తన అనుచరులతో ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తెప్పించేవాడని నన్నాబత్తిన విశ్వరూపాచారి పోలీసులకు రెవెన్యూ అధికారుల సమక్షంలో వాంగ్మూలం ఇచ్చాడు. సుమారు 25 ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న తూము వెంకట్రావు కోట్లాది రూపాయలు ఆర్జించాడని కూడా ప్రచారం జరుగుతోంది. -
తీగ లాగినా డొంక కదలదేం..?
బెట్టింగ్ భూతాన్ని తుదముట్టిస్తామని పోలీసు అధికారులు శపథాలు చేశారు.. బుకీల ఆటకట్టించి ఊచలు లెక్కబెట్టిస్తామని బీరాలు పలికారు.. పౌర సమాజం సహకరిస్తే ఎంతటి వారినైనా విడిచేది లేదని ప్రగల్భాలు పలికారు.. ఎవరు వివరాలు అందజేసినా తక్షణం స్పందిస్తామని అభయమిచ్చారు. తీరా జిల్లాకు చెందిన కీలక బుకీలను రెండు రోజుల క్రితం హైదరాబాద్లో అక్కడి పోలీసులు అరెస్టు చేసినా ఇక్కడ స్పందించే వారే కరువయ్యారు. తీగ లాగినా..డొంక కదిలించడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారు. ‘అధికారం’ అండతో గల్లీ నాయకులు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతున్నారు. సాక్షి, గుంటూరు: రెండు రోజుల క్రితం హైదరాబాద్లో బెట్టింగ్ నిర్వహిస్తూ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులకు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వీరి వల్ల ఇబ్బందులు పడిన అనేక మంది బాధితులు తెలంగాణా పోలీసులను చూసైనా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి బెట్టింగ్ ముఠా మూలాలను వెతికి పట్టుకుంటారని ఆశించారు. అయితే పోలీసుల నుంచి ఏమాత్రం కనీస స్పందన లేకపోవడం గమనార్హం. పల్నాడులో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలు ఉండటంతోనే రెంటచింతల నాయకులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితో బెట్టింగ్ పెచ్చరిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి. భారీ సరంజామా స్వాధీనం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠా వద్ద హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో నగదు, సెల్ఫోన్లు సీజ్ చేయడం గమనార్హం. హైదరాబాద్ ప్రగతినగర్లోని లక్ష్మీనిలయం పెంట్ హౌస్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెంటచింతల మండల పరిషత్ ఉపాధ్యక్షుడి సోదరుడు గొంటు రవికిరణ్రెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కాసాని కోటిరెడ్డి, ఎం.అజయ్రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి వద్ద నుంచి రూ.15,28,460 నగదు, మూడు ల్యాప్టాప్లు, ఒక నోట్ప్యాడ్, 33 సెల్ఫోన్లు, కమ్యూనికేటర్ బాక్స్, ఎల్ఈడీ టీవీ, రెండు కోడ్బుక్లు, నాలుగు చెక్బుక్లు, నాలుగు డెబిట్ కార్డులు, రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇన్నోవా వాహనం కూడా పోలీసులు స్వాధీనంలో తీసుకున్నారు. రవికిరణ్రెడ్డి మూడు మ్యాచ్లకు సంబంధించిన నగదును అరెస్టు అయిన రోజు ఉదయం ప్రధాన బుకీ అయిన వెంకిబాబుకు చేరవేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ఒక్కరోజు ముందు పోలీసులు దాడి చేసి ఉంటే భారీ మొత్తంలో నగదు దొరికి ఉండేదని పోలీసులే అంచనా వేయడం గమనార్హం. ఏజెంట్లను నియమించి మరీ ‘బెట్టింగ్’ రెంటచింతల మండలపరిషత్ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్రెడ్డి సోదరుడు రవికిరణ్రెడ్డి గతంలో రెంటచింతల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం నడిపేవాడని సమాచారం. అంచెలంచెలుగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చీకటి సామ్రాజ్యంలో ఎందరో బుకీలతో సంబంధాలు ఏర్పరుచుకుని రాష్ట్రవ్యాప్తంగా బుకీగా అవతారమెత్తాడు. అనేక జిల్లాల్లో ఏజెంట్లను నియమించి మరీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడంటే ఏ స్థాయికి చేరాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో రేషన్ మాఫియా సైతం సదరు వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్లో పట్టుబడిన రవికిరణ్రెడ్డికి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుకీలు, ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆస్తులను రికవరీ చేయాలని బెట్టింగ్లతో నష్టపోయిన బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
క్రికెట్ బెట్టింగ్: టీడీపీ నేతల అరెస్టు
-
భారీ క్రికెట్ బెట్టింగ్: టీడీపీ నేతల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ నేత రవికిరణ్ రెడ్డితో పాటు అజయ్రెడ్డి, అప్పన్న, కోటిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో క్రికెట్ బుకీ వెంకిబాబు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వారి నుంచి రూ.15 లక్షల నగదు, కారు, టీవీ, 41 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం: ఏపీ హోంమంత్రి
సాక్షి, విజయవాడ : క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఆయన నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, కుల,వర్గ విభేదాలను అదుపు చేయగలిగామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కళాశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చినరాజప్ప హెచ్చరించారు. ఎవరైనా సరే రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో సరిపడనంత మంది పోలీసులు లేకపోయినా నేరాలను నియంత్రించడంలో వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. -
ఎక్కడున్నారో... ఎమయ్యరో?
ప్రొద్దుటూరు క్రైం : మట్కా.. క్రికెట్ బెట్టింగ్..పేకాట.. వ్యభిచారం ఇవి సమాజానికి చీడ పురుగుల్లాంటివి. వీటిని నిర్వహిస్తున్న.. ప్రోత్సహిస్తున్న వాళ్లెవరైనా, ఎంతటి వారైనా శిక్షించాల్సిందే. మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర వ్యసనాలను మానుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ‘పరివర్తన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా జూదరుల్లో మార్పు తీసుకొని రావడానికి పోలీసులు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేశారు. జూదరులు, వారి కుటుంబ సభ్యులను కడపకు పిలిపించి ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ తీసుకున్న చర్యల వల్ల చాలా వరకు మట్కా జూదం తగ్గినట్లు కనిపిస్తోంది. కొందరు మాత్రం పోలీసుల ఆదేశాలను ఖాతరు చేయలేదు. దొంగచాటుగా తమ పని కానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. దాడుల మాటున కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్పీ మెప్పు పొందేందుకు కొందరు పోలీసు అధికారులు మట్కా జూదం మానేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టుకెళ్లారు.. మట్కా నిర్వహిస్తున్నారనే కారణంతో ప్రొద్దుటూరులోని రామేశ్వరం, ఆర్ట్స్కాలేజి రోడ్డు తదితర ప్రాం తాల నుంచి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు మట్కా రాసేవారు, ఇంకొందరు 4–5 ఏళ్ల కిందటే మట్కా జూదాన్ని మానుకున్న వారు ఉన్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినా, విచారణకు తీసుకెళ్లేటప్పుడు అయినా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. ఒక వేళ తీసుకొని వెళ్లేటప్పుడు అది సా«ధ్యం కాకుంటే తర్వాతైనా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయాలి. అయితే ప్రొద్దుటూరు పోలీసులు మాత్రం ఈ నిబంధనను మరచినట్టు ఉన్నారు. 15 మందిని విచారణ పేరుతో తీసుకొని వెళ్లిన పోలీసులు వీరిలో ఏ ఒక్క కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దీంతో తమ వాళ్లు ఎక్కడున్నారో అని వారు ఆందోళన చెందుతున్నారు. మట్కా మానేసిన తమ వాళ్లను ఎందుకు శిక్షిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. కాగా ప్రొద్దుటూరు నుంచి తీసుకొని వెళ్లిన 15 మందిని కడపలోని ఓ పోలీస్ స్టేషన్లో ఉంచి నట్లు తెలుస్తోంది. మట్కా ఆడుతున్నట్లు అంగీకరించాలని వారిలో కొందరిని పోలీసులు బాగా కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. రూ. 3–4 లక్షలు తీసుకొని వస్తే కేసులో పెడతామని, తర్వాత మిమ్మల్ని వదిలేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. తప్పు చేస్తే కేసులు పెట్టుకోండి.. లేదంటే వదిలేయండి.. అంతేగానీ నాలుగైదు రోజులు స్టేషన్లో పెట్టుకొని చితక బాదడం ఏంటని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని, మట్కా మానేసి సంఘంలో మర్యాదగా జీవిస్తున్న వారికి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్.. 14మంది అరెస్టు
సాక్షి, అనంతపురం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 14మందిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ. 79వేల నగదు, నాలుగు ఉంగరాలు, సెల్ఫోన్లు, టీవీని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంక్రటావ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. భారత్, న్యూజిలాండ్ టి20మ్యాచ్ సందర్భంగా రాణినగర్లో గోగుల రామాంజినేయులు అనే వ్యక్తి ఇంట్లో బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన వన్టౌన్, స్పెషల్ పార్టీ పోలీసులు అతని ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రాణినగర్కు చిందిన షేక్ హైదర్వలి, రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందన బంగి సంగప్ప, పాతూరుకు చెందిన కరూరు నిజాముద్దీన్, మారుతినగర్కు చెందిన రామకృష్ణారెడ్డి, భాస్కర్, కాట్నేకాలువకు చెందిన మునీశ్వరరెడ్డి, అశోక్నగర్కు చెందిన నారాయణరెడ్డి, గడంగవీధికి చెందిన హనుమంతరావు, రాణినగర్కు చెందిన మహబూబ్బాషా, దాదాఖలందర్, రాజమ్మకాలనీకి నారాయష్వామిలు పట్టుబడ్డారు. వీరందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న వారిలో గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన రాజశేఖర్, వేమారెడ్డి ముఖ్యలు అని తెలిపారు. ఈ సమావేశంలో వన్టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ రంగయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచ్చు బిగుస్తోంది!
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బుకీలతో మమేకమే.. వసూళ్లకు తెగబడిన పోలీసు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఇప్పటికే జిల్లాలో పలువురు అధికారులు, సిబ్బందిపై వేటు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఐలు, డీఎస్పీల పాత్ర కూడా ఉన్నట్టు బుకీలు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో పూర్తి ఆధారాలతో వారిపైనా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా దెబ్బకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నా పోలీస్ అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు దీనిపై సీరియస్గా దృష్టి సారించారు. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని పోలీస్ అధికారుల పాత్రపై సమగ్ర సమాచారాన్ని రాబట్టడంతో పాటు పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారిని అరికట్టాలంటే ముందుగా ఇంటి దొంగల పని పట్టాలని భావించిన ఎస్పీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు, ఓ ఏఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న కీలక బుకీలను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీస్ ఉన్నతాధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చినట్లు సమాచారం. క్రికెట్ బుకీలు బెట్టింగ్ నిర్వహణకు అడ్డు లేకుండా చేసుకునేందుకు కొందరు పోలీస్ అధికారులను తమ అదుపులో పెట్టుకుని యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగించినట్లు తేలింది. జిల్లాలోని పలువురు సీఐలు, డీఎస్పీలు సైతం క్రికెట్ బుకీల నుంచి భారీ ఎత్తున మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎస్పీ దీనిపై సీరియస్గా దృష్టి సారించారు. నరసరావుపేటకు చెందిన ఇద్దరు కీలక బుకీల ద్వారా సీఐలు, డీఎస్పీల పాత్రపై పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో పూర్తిస్థాయి విచారణ జరిపి కీలక ఆధారాలను రాబట్టిన అనంతరం వీరిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలోని నెల్లూరులో ఎస్పీ రామకృష్ణ క్రికెట్ బుకీలను ఏరివేయడంతో పాటు నలుగురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాలోని అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతి త్వరలో జిల్లాలోనూ పలువురు సీఐలు, డీఎస్పీలపై సైతం సస్పెన్షన్ వేటు పడనుందని పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో వీరు ఉన్నట్లు సమాచారం. దీంతో తమపై వేటు పడకుండా చూడాలంటూ అధికార పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్లు, హోంగార్డుల ద్వారా వసూళ్లు జిల్లాలోని కొందరు సీఐలు, డీఎస్పీలు తమ వద్ద పనిచేసే డ్రైవర్లు, హోంగార్డుల ద్వారా క్రికెట్ బుకీల నుంచి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. క్రికెట్ బుకీలతో వారి సెల్ఫోన్ల నుంచి మాట్లాడి బేరసారాలు నడిపినట్లు చెబుతున్నారు. జిల్లాలోని పలు సర్కిళ్లలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఐలకు సదరు హోంగార్డులు, డ్రైవర్లే ఆదాయ వనరుల గురించి చెప్పి వసూలు చేసి ఇస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించిన ఎస్పీ జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న హోంగార్డులతో పాటు అధికారులకు వసూళ్లు చేసి పెడుతున్న కానిస్టేబుళ్ల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
తప్పుడు కేసులు పెట్టి.. జీవితాలు నాశనం చేశారు
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : ‘చదువుకునే సమయంలో స్నేహితులతో కలసి అప్పుడప్పుడు క్రికెట్ పందేలు నిర్వహించే వాళ్లం.. ఐదారేళ్ల తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్న సమయంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెన్నూరు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి మా జీవితాలను నాశనం చేశారు’ అని ఇద్దరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరుకు చెందిన ఉమ్మడి రమేష్, గుగ్గిళ్ల చాణక్య మంగళవారం ప్రొద్దుటూరులోని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. తాను తిరుపతిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పని చేస్తున్నానని రమేష్ తెలిపారు. తనపై పోలీసులు క్రికెట్ బెట్టింగ్, గంజాయి కేసులు పెట్టారని పేర్కొన్నారు. తాను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానని చాణక్య చెప్పారు. పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులను తెచ్చి.. నేరస్తులుగా మారుస్తారా: నేరాలను అరికట్టాల్సిన పోలీసులు ఉద్యోగాలు చేసుకునే వారిని నేరస్తులుగా మారుస్తున్నారని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. ఆమె స్వగృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు నిజమైన బుకీల జోలికి వెళ్లడం లేదని, అమాయక యువకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. యువకుల జీవితాలు రోడ్లపాలు కావడానికి కారణమైన ఎస్ఐ వినోద్కుమార్, సీఐ నాయకుల నారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
క్రికెట్ పందేలు.. దొంగతనాలు
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు.. మధ్యలో చదువు మానేసి చిల్లరగా తిరగడం మొదలెట్టాడు.. స్నేహితులతో కలిసి క్రికెట్ పందేలు నిర్వహించేవాడు.. తర్వాత క్రికెట్ పందేలే వ్యసనంగా మార్చుకున్న అతను బైక్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు.. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. అరెస్ట్ వివరాలను మంగళవా రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరించారు. రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి చిల్లరగా తిరిగేవాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు. అందులో ఒకటి, రెండు సార్లు డబ్బు రావడంతో పందేలకే బానిస అయ్యాడు. తాగుడుకు అలవాటు పడిన యువకుడు జల్సా జీవితం అనుభవించడం మొదలు పెట్టాడు. క్రికెట్ పందేలు, జల్సా జీవితం గడపడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులోని బైక్ను కొన్ని రోజుల క్రితం దొంగిలించాడు. ఇలా ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాం తాల్లో సుమారు 18 బైక్లను చోరీ చేశా డు. దొంగిలించిన ద్విచక్ర వాహనాల్లో కొన్నింటిని బద్వేలులో ఉన్న తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు తక్కువ ధరకు విక్రయించాడు. వెంకటసుబ్బయ్య బద్వేలులోని ఓ వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. ఇలా పోలీసులకు దొరికిపోయాడు.. సీఐ సదాశివయ్య, టూ టౌన్ ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డిలు తమ సిబ్బందితో కలిసి మడూరు రోడ్డులో వాహన తని ఖీలు చేపట్టారు. అదే సమయంలో వెంకటేశ్వరరాజు బైక్లో అదే దారిలో రాగా పోలీసులు ఆపి వాహన రికార్డులు చూపించమన్నారు. అయితే అతను రికా ర్డు చూపించకపోగా, పోలీసులను చూసి భయంతో వణికిపోయాడు. అనుమానించిన పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకొని వెళ్లి విచారించగా బైక్ దొంగతనాలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు ఆర్టీసి బస్టాండులో ఆరు, జిల్లా ఆస్పత్రి ఆవరణంలో రెండు, కోట వీధిలో ఒకటి, ఎర్రగుంట్ల బైపాస్రోడ్డులో ఒకటి, మైదుకూరు ఆర్టీసీ బస్టాండులో 7 బైక్లను చోరీ చేసినట్లు అతను అంగీకరించాడు. వాటిలో ఆరు బైక్లను బద్వేలుకు చెందిన తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు విక్రయించినట్లు పోలీసులకు వివరించాడు. వెంకటసుబ్బయ్యను కూడా అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో దాచిన బైక్లను స్వాధీనం చేసుకొని, ఇద్దరిని రిమాండుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులకు రివార్డులు ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డి, హెడ్కానిస్టేబుల్ దీప్లానాయక్, కానిస్టేబుళ్లు దస్తగిరి, శివశంకర్, భద్రారెడ్డి, రామచంద్రరాజులకు డీఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. భారీగా మోటార్ బైక్లను రికవరీ చేసినందుకు ఎస్పీ అట్టాడ బాబూజీ ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులను అభినందించారు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
పట్నంబజారు(గుంటూరు) : క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వ్యక్తులతోపాటు, నిర్వాహకులను అర్బన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. అరండల్పేట పరిసర ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు క్యూఆర్టీ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో చెరుకూరి రాధాకృష్ణ అనే నిర్వాహకుడు, సహాయకులు వడ్డూరి కృష్ణకిషోర్, తోక బాలయ్య, పందెం కాసే వ్యక్తులు దాసరి ప్రసాద్, అన్నపురెడ్డి పొట్టయ్య, సిద్ధాబత్తిని హేమేశ్వర వెంకటమురళీమోహన్రావు, ఆలా అరవింద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్టాప్, ఒక టీవీ, ఐదు సెల్ఫోన్లతో పాటు రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్ల పాడు పోలీసు స్టేషన్ పరిధిలో గేమింగ్ యాక్ట్ కింద పల్లపాటి శ్రీనివాసరావు, ముత్యాల శివవెంకటేశ్వరరావు అలియాస్ బాబు అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని చెప్పారు. బుకీలపై ఉక్కుపాదం మో పుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు వైటీ నాయుడు, ఇ.సుబ్బారాయుడు, డీఎస్పీలు కేజీవీ సరిత, కండె శ్రీనివాసులు, పి.శ్రీనివాస్, సీఐలు వై.శ్రీనివాసరావు, ఎన్.శ్రీకాంత్బాబు, టి.బాలమురళీకృష్ణ, క్యూఆర్టీ ఎస్సై షేక్ నాగుల్మీరా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘చర’ చిక్కాడు
♦ పోలీసులకు లొంగిపోయిన బెట్టింగ్ సూత్రధారి ♦ నెలన్నరపాటు సింగపూర్లో మకాం ♦ అధికార పార్టీ అండతో తప్పించుకునేందుకు విఫలయత్నం ♦ ఇంకా అజ్ఞాతంలోనే శరత్చంద్ర కుమారుడు సుభాష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ దువ్వూరి శరత్చంద్ర అలియాస్ చరను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే విదేశాలకు పరారైన చర, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బాలకృష్ణనాయుడు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న చర కుమారుడు సుభాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు కూడా దొరికితే బెట్టింగ్ కేసు దాదాపు ముగింపు దశకు వస్తుంది. సీఎం పేషీ స్థాయిలో పైరవీలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్పై దృష్టిపెట్టి కీలక వ్యక్తులతోపాటు పంటర్లనూ కలుగుల్లోంచి బయటకు లాగారు. మొక్కుబడి అరెస్ట్లకు పరిమితం కాకుండా మూలాలను గుర్తించి 300 మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన బుకీలుగా ఉన్న 40 మందికిపైగా నిందితులపై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ మాజీ కౌన్సిలర్, జిల్లా మంత్రికి సన్నిహితుడు అయిన దువ్వూరు శరత్చంద్ర పలాయన మంత్రం జపిం చాడు. అధికార పార్టీ నేత కావడం, మంత్రి అండదండలు ఉండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేశం విడిచి పారి పోయాడు. తన కుమారుడు సుభాష్తో కలిసి సింగపూర్లో చక్కర్లు కొట్టాడు. అతడి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో సోమవారం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తండ్రీ కొడుకులే కీలకం జిల్లాలో బెట్టింగ్ రాకెట్పై పోలీసులు సీరియస్గా దృష్టి సారించడానికి చర, అతని కుమారుడు సుభాష్ సాగించిన వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ చివరి వారంలో నగరానికి చెందిన దారం మల్లికార్జునరావు తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లికార్జునరావు, అతని భార్య మాధురి, కుమారుడు ప్రణవ్ జూలై 1న రామేశ్వరంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లికార్జునరావు టీడీపీ నేత దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్ వద్ద పలు మ్యాచ్లపై బెట్టింగ్లు కట్టాడు. ఆస్తిపాస్తులన్నీ ధారబోసినా ఇంకా లక్షలాది రూపాయలు బకాయి పడ్డాడు. దీంతో శరత్చంద్ర, అతని కుమారుడు కలిసి మల్లికార్జునరావును మానసికంగా వేధించడంతోపాటు అతడి ఇంటికెళ్లి బకాయిల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే అతని కుటుంబమంతా అసువులు తీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బెట్టింగ్ మూలాల్లోకి వెళ్లారు. వందల మందిని అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేత శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్, బాలకృష్ణనాయుడు జూలై రెండో వారం నుంచి పరారీలో ఉన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతల ద్వారా వివిధ రూపాల్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ చివరకు లొంగిపోక తప్పలేదు. హైకోర్టులో బెయిల్ పిటీషన్! నెల్లూరు (క్రైమ్): బెట్టింగ్ కేసులో రిమాండ్ అనుభవిస్తున్న కీలక సూత్రధారి దేవళ్ల కృష్ణసింగ్, మరికొందరు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా కోర్టులో పలు దఫాలుగా బెయిల్ పిటీషన్ వేయగా.. కోర్టు నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీటిని మంగళవారం విచారించే అవకాశం ఉందని సమాచారం. -
అజ్ఞాతంలో కీలక బు‘కీ’లు..!
♦ బుకీలకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు ♦ బాధితుల ఫిర్యాదుతో గతంలో ఐదుగురి అరెస్ట్ ♦ మరో బుకీని బుధవారం అరెస్ట్ చూపిన వైనం ♦ అరెస్టయినవారిలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ♦ ఎస్పీలు దృష్టి సారించడంతో నెలరోజులుగా అజ్ఞాతంలోనే బుకీలు సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. బెట్టింగ్లలో సొమ్ము పోగొట్టుకుని అప్పుల పాలై తెనాలికి చెందిన కుటుంబం మొత్తం మాచర్లకు వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్వం కోల్పోయి తల్లిదండ్రులకు ముఖం చూపలేక ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా క్రికెట్ బు‘కీ’లను మాత్రం పట్టలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా ఉన్న సమయంలో మాత్రం బెట్టింగ్లు కాసే వారిని అదుపులోకి తీసుకుని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా డొంకను కదల్చలేకపోతున్నారు. కుటుంబాలను బలి తీసుకుంటున్న క్రికెట్ మహమ్మారికి సీరియస్గా వ్యవహరించాల్సిన పాలకులే కీలక బుకీలకు అండగా నిలుస్తూ పోలీసులు వారి జోలికి రాకుండా రక్షిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా పనిచేసిన పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కీలక బుకీలను అదుపులోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించిన క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేశారంటే జిల్లాలో బుకీలకు ప్రభుత్వ పెద్దల నుంచి ఏ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్లపై సీరియస్గా దృష్టి సారించిన సమయంలో అధికార పార్టీ నేతల అండతో అండర్గ్రౌండ్కు వెళ్లిపోవడం, వారితో పోలీసు అధికారులకు చెప్పించుకుని యథావిధిగా బెట్టింగ్లకు పాల్పడడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి... జిల్లాలో గత నెలలో క్రికెట్ బెట్టింగ్లలో తీవ్రంగా నష్టపోయి బుకీల దౌర్జన్యానికి పొలాలు, స్థలాలు కోల్పోయిన అనేక మంది బాధితులు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కీలక బుకీ బాలాజీతో పాటు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక బుకీలు అధికార పార్టీకి చెందిన రాజధాని ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులు, అనుచరులు కావడంతో వారిపై సరైన చర్యలు లేకుండా వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసులో మరో బుకీ గంజికుంట సాంబశివరావును బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు క్రికెట్ బుకీలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులపైనే ఒత్తిళ్లు... గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు క్రికెట్ బుకీలపై దృష్టి సారించారనే విషయం తెలుసుకున్న అనేక మంది కీలక బుకీలు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కీలక బుకీలుగా ఉన్న ఐదుగురు అధికార పార్టీ నేతల స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలకు భారీ మొత్తంలో ఆఫర్లు ఎర వేసి పోలీసులు తమ జోలికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరంతా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేత తనయ, తనయుడు, రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓ మంత్రి వద్దకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారులు తమను అదుపులోకి తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, బెట్టింగ్లు నిర్వహించే వారంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తుండటంతో పోలీసులు సైతం వీరికి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.