Director Shankar
-
డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడుతున్న హీరోలు
-
భారతీయుడు -3 మాత్రమే లాస్ట్ ఛాన్స్?
-
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్లో విజయ్తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..సాధారణంగా తాను ఎంత గ్రాండ్గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?. .. టీఎఫ్ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్లో పొలిటికల్గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!. -
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్గారు నాలో యాక్టర్ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్లో ఫస్ట్ హాఫ్ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
నా అనుమతి లేకుండా కాపీ కొట్టారు: శంకర్ ఆవేదన
తాను హక్కులు పొందిన ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడేశారని దర్శకుడు శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాపీ రైట్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ముఖ్య గమనిక! వెంకటేశన్ రాసిన తమిళ నవల వీర యుగ నాయగన్ వేళ్ కాపీరైట్స్ నావే.. నా అనుమతి లేకుండా చాలా సినిమాల్లో ఈ నవలలోని కీలక సన్నివేశాలను ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఇక చాలు, ఆపేయండిఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్లోనూ ఓ ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్.. ఇలా ఏ ఇతర ప్లాట్ఫామ్లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్ ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని రాసుకొచ్చాడు. సినిమా సంగతులు..ఇది చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శంకర్.. సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా తెరకెక్కించిన భారతీయుడు 2తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్చరణ్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్లో విడుదల కానుంది. Attention to all ! As the copyright holder of Su. Venkatesan’s iconic Tamil novel "Veera Yuga Nayagan Vel Paari", I'm disturbed to see key scenes being ripped off & used without permission in many movies. Really upset to see important key scene from the novel in a recent movie…— Shankar Shanmugham (@shankarshanmugh) September 22, 2024 చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవికి చోటు -
భారతీయుడు 3 రిలీజ్ అవుతుందా.. లేదా..!
-
ఓటీటీలో భారతీయుడు-2 రిలీజ్.. శంకర్ ను తిట్టిపోస్తున్న నెటిజెన్స్..
-
ఫ్యాన్స్ ఎదురుచూపులను నీరుగార్చిన శంకర్
-
భారతీయుడు 2 తీయడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే..
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
పది రోజులతో ఆట పూర్తి
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్ ఓ అప్డేట్ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ క్లైమాక్స్కు చేరుకుంది.కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ (కమల్హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది) సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయిన తర్వాత ‘గేమ్ చేంజర్’ షూటింగ్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పో స్ట్ప్రోడక్షన్ పనులు మొదలుపెడతాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్జె సూర్య, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ రాజకీయ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
శంకర్ రూట్ ను ఎంచుకున్న సుకుమార్
-
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
-
ఇండియన్ 2 కోసం కష్టపడ్డానన్న కాజల్.. సినిమాలో ఆమె పాత్ర లేదన్న డైరెక్టర్
తల్లయ్యాక హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అంతకుముందున్న క్రేజ్ను కంటిన్యూ చేయడం కత్తిమీద సామే అవుతుంది. కానీ బాలీవుడ్లో మాత్రం అలియా భట్, కరీనా కపూర్, కాజోల్.. ఇలా పలువురూ తల్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సౌత్లో నయనతారను మినహాయిస్తే మరెవరికీ తల్లిగా ప్రమోషన్ పొందాక గొప్ప క్యారెక్టర్లు రావడం లేదు. బహుశా అందుకేనేమో చాలామంది బ్యూటీలు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.మా కోసం కథలు రాసుకుంటేనే..తాజాగా ఈ ధోరణిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. దక్షిణాదిన ఇంకా కొన్ని పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అది త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాను. పెళ్లయి పిల్లలున్నప్పటికీ మేము ఏ పాత్రనైనా పోషించగలం. మమ్మల్ని శక్తివంతంగా చూపించే పాత్రలు మేకర్స్ డిజైన్ చేయాలి. వీళ్లు అలాంటి కథలు రాసుకుంటేనే కదా ప్రేక్షకులు చూసేది. కొంతవరకు పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే తను సెలక్ట్ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. యాక్షన్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ ఇలా తనకు నచ్చినవి చేస్తోంది.డెలివరీ అవగానే సినిమాలో..నా విషయానికి వస్తే.. నేను కరోనాకు ముందే కొన్ని సినిమాలకు సంతకం చేశాను. వాటిని దాదాపు పూర్తి చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే ఇండియన్ 2 సినిమాలో పని చేయాల్సి వచ్చింది. ఇందులో నా జీవితంలోనే కష్టమైన పాత్రను పోషించాను. డైరెక్టర్ శంకర్ సర్ నాకోసం ఎదురుచూసి లాస్ట్ షెడ్యూల్కు రమ్మన్నాడు. ఎంతో కష్టంగా ఉన్న నా పాత్రను పూర్తి చేసేశాను అని చెప్పుకొచ్చింది.ఇండియన్ 2లో కాజల్ లేదుశనివారం (జూన్ 1న) జరిగిన ఇండియన్ 2 ఆడియో లాంచ్లో డైరెక్టర్ శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కార్యక్రమం వేదికగా భారతీయుడు 2లో కాజల్ లేదని వెల్లడించాడు. తను మూడో భాగంలో ఉంటుందని తెలిపాడు. అసలు తనను తీసేసిన విషయం కాజల్కైనా తెలుసా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ 2లో ఆమె లేదని తేల్చేయడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం జూలై 12న గ్రాండ్గా విడుదల కానుంది.చదవండి: వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు! -
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
శంకర్ ఇండియన్ 2 సినిమా పై భారీ ప్లాన్
-
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
మళ్లీ డిజప్పాయింట్ చేసిన శంకర్..
-
గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలు.
-
శంకర్ ను టార్గెట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
-
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
శంకర్ కు షాక్..బుచ్చిబాబు సినిమాపై చరణ్ ఫుల్ ఫోకస్..
-
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్హాసన్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
తమిళ స్టార్ డైరెక్టర్స్తో రామ్చరణ్.. ఎందుకు కలిశాడు?
మెగా పవర్స్టార్ రామ్చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్గా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) -
7 పాత్రలా...రామ్ చరణ్ ని ముంచుతారా ? తేలుస్తారా ?
-
కూతురికి కండీషన్ పెట్టిన డైరెక్టర్ శంకర్.. పెళ్లి కోసమే!
హీరోయిన్ అదితి శంకర్.. స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా సినీ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికి కథానాయికగా చేసింది రెండు చిత్రాలే అయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన అదితి శంకర్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తోంది. సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇందులో విష్ణు విశాల్తో జత కట్టనుంది. కాగా ఎంబీబీఎస్ చదివిన అదితి శంకర్కు డాక్టర్ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల ఆకాంక్ష అని తెలుస్తోంది. చాలా చలాకీగా ఉండే అదితి శంకర్కు సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. అయితే అదితి శంకర్ నటించడానికి అంగీకరించిన ఆమె తండ్రి శంకర్ ఓ కండిషన్ పెట్టారట. రెండేళ్ల వరకూ నువ్వు ఎన్ని చిత్రాల్లో అయినా నటించు.. ఆ తరువాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తేల్చిచెప్పారట. అందుకనే ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని అదితి తహతహలాడుతోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే డైరెక్టర్ శంకర్ ఇలాంటి కండీషన్ పెట్టాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. బహుశా ఇది వుట్టి పుకారు మాత్రమే అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. లేదంటే తన ప్రతిభను చూశాకైనా శంకర్ ఈ కండీషన్ ఉపసంహరించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చదవండి: కోర్టు గొడవల్లో భోళా శంకర్ -
చేసింది రెండే సినిమాలు.. క్యూ కడుతోన్న ఆఫర్లు!
కోలీవుడ్ భామ అదితి శంకర్కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. (ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా అదితి శంకర్కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్కు సిద్ధం అవుతోందన్నమాట. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! ) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
సినిమా ఇండస్ట్రీకే గేమ్ ఛేంజర్.. 30 ఏళ్లుగా టాప్ దర్శకుడిగా..
చిత్ర పరిశ్రమలో అందరూ సినిమాను ప్రేమించే వారే. అయితే సినిమానే శ్వాసగా భావించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శంకర్ ఒకరు. తొలి చిత్రంతోనే స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తొలి చిత్రం జెంటిల్మెన్. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఆదివారం (జూలై 30) నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే శంకర్ ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకొని కమర్షియల్ అంశాలు చొప్పించి ప్రయోజనాత్మక, జనరంజక కథా చిత్రంగా జెంటిల్మెన్ను మలిచారు. ఆ తర్వాత కూడా శంకర్ తన చిత్రాల్లో సామాజిక అంచాలను తెరపై ఆవిష్కరించడాన్ని విస్మరించలేదు. ఇక ఒక దర్శకుడిగా 30 ఏళ్ల క్రితం ఉదయించిన శంకర్ ఇప్పటికి 13 చిత్రాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఈయన తమిళంలో ఇండియన్– 2, తెలుగులో గేమ్ ఛేంజర్ చిత్రాలను చేస్తున్నారు. అలా తక్కువ చిత్రాలు చేసినా నేడు టాప్ 10 దర్శకుల్లో ఒకరిగా రాణించటం శంకర్కే చెల్లింది. ఇప్పటి వరకు ముదల్ వన్, బాయ్స్, ఇండియన్, ఎందిరన్, శివాజీ, రోబో –2, నన్బన్ తదితర చిత్రాలు బ్రహ్మాండానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే శంకర్ను బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు అని పేర్కొంటారు. కాగా జెంటిల్మెన్ చిత్రం 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శిష్య బృందం (జెంటిల్మెన్ , ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పనిచేసిన సిబ్బంది) ఆదివా రం చైన్నెలోని శంకర్ కార్యాలయంలో ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకలో శంకర్ పాల్గొని కేకను కట్ చేశారు. A true #GameChanger in Indian Film Industry ❤️🔥 Congratulations @shankarshanmugh sir for completing 30 splendid years. Here's to more exemplary work and accolades that await you.😊 pic.twitter.com/KSWSHa91j6 — Ram Charan (@AlwaysRamCharan) July 30, 2023 చదవండి: ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బాలీవుడ్ జంట -
ఇండియన్ 3.. ఆన్ ది వే!
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా శంకర్ మూడో భాగాన్ని కూడా ప్లాన్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘ఇండియన్ 2’ షూటింగ్ పూర్తయిందని, ‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా 70 శాతం పూర్తయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ‘ఇండియన్ 2’ విడుదలైన ఏడాది తర్వాత ‘ఇండియన్ 3’ రిలీజ్ అవుతుందని భోగట్టా. -
భారతీయుడు 3 ఫిక్స్... హీరో ఎవరంటే?
-
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్తో మాస్ ఎలిమెంట్స్ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
1200 మంది ఫైటర్స్తో గేమ్ చేంజర్...
-
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్చరణ్తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్చరణ్కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. చదవండి: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు అస్వస్థత గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిపోయిందని, ఇప్పుడు తన ఫోకస్ ఇండియన్-2 సినిమాకు షిఫ్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆయన రామ్చరణ్తో గేమ్ ఛేంజర్, కమల్హాసన్తో ఇండియన్-2 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్-2 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఇండియన్-2పై ఫోకస్ పెట్టనున్నారు శంకర్. చదవండి: ప్రభాస్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet — Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023 -
అఫీషియల్: శంకర్ డైరెక్షన్లో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్హాసన్తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్డే విషెస్ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨ 🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr — Lyca Productions (@LycaProductions) April 17, 2023 -
గేమ్ చేంజర్ అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్కి డబుల్ బొనాంజా
-
‘ఇండియన్ 2’.. తైవాన్ టు సౌతాఫ్రికా
తైవాన్కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్ గారెట్, గుల్షన్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తైవాన్లో మొదలైన ‘ఇండియన్ 2’ షెడ్యూల్ ముగిసింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కమల్హాసన్ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారు. తైవాన్ షెడ్యూల్ తర్వాత యూనిట్ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్లో మరో యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. -
ఇండియన్ 2 మూవీ టార్గెట్ ఫిక్స్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్లో జరుగుతోంది. కమల్ హాసన్పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్ను జూన్కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్చరణ్-శంకర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ రివీల్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ(సోమవారం)రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేసేశారు. ప్రస్తుతం RC15 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ అంటూ ఈ పాన్ ఇండియా చిత్రానికి పేరు పెట్టిన మేకర్స్ మరో అప్డేట్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. చరణ్ బర్త్డే సందర్భంగా డబుల్ ధమాకాగా ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అభిమానులను మరింత ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. #GAMECHANGER it is…💥💥https://t.co/avGa74S8vH Mega Powerstar @alwaysramcharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/2htttRsvPx — Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023 -
రామ్ చరణ్కు ఆర్సీ15 టీం సర్ప్రైజ్.. సెట్లో ఘనంగా బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
RC15 సెట్స్లో అదిరిపోయిన రామ్చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. ఇక రేపు(సోమవారం)రామ్చరణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్లో యూనిట్ సభ్యుల మధ్య రామ్చరణ్ తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్కట్ చేయించారు. ఈ వేడకలో శంకర్, దిల్రాజు, కియారాలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ram charan. RC (@rc_15_love_) Global star @AlwaysRamCharan birthday celebrations begins #RC15 #GlobalStarRamCharan #Ramcharan pic.twitter.com/CqnpfZeBuJ — SivaCherry (@sivacherry9) March 25, 2023 -
శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్? రూ. 900కోట్ల బడ్జెట్!
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడు రామ్చరణ్తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆయన రూ.900 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఆ క్రేజీ కాంబినేషన్ దళపతి విజయ్, బాద్షా షారుక్ ఖాన్. ఎప్పుడూ కొత్త కంటెంట్ను తీసుకునే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి అండర్ వాటర్లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కోలీవుడ్కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇక దళపతి విజయ్ ఇంతకుముందే శంకర్ దర్శకత్వంలో నన్బన్ చిత్రంలో నటించారు. విజయ్ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్ ఖాన్కు విజయ్కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్లో విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
తిరుపతిలో భారతీయుడు
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ని రూపొందిస్తున్నారు. కమల్–శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్సింగ్, ప్రియా భవానీశంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కాజల్ న్యూలుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్గా, నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు. ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ అగర్వాల్ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్ జంటగా ఇండియన్ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ అగర్వాల్ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇండియన్– 2 చిత్రంలో కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది. -
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
RC15 : న్యూజిలాండ్లో షూటింగ్ కంప్లీట్ చేసిన రామ్చరణ్, కియారా
న్యూజిలాండ్కి బై బై చెప్పారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల న్యూజిలాండ్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, కియారాలపై బాస్కో వర్టిస్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారు. ‘న్యూజిలాండ్లో సాంగ్ షూటింగ్ పూర్తయింది. అద్భుతమైన విజువల్స్ వచ్చాయి’’ అని బుధవారం ట్వీట్ చేశారు రామ్చరణ్. కాగా ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ.15కోట్లు ఖర్చుచేశారట చిత్రయూనిట్. సో.. ఈ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్గా ఉండనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
శంకర్- రామ్చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రామ్చరణ్కు భార్యగా అంజలి.. లీకైన ఫోటోలు
ఫ్లాష్బ్యాక్ మోడ్లో ఉన్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలను తీస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరో వారం పాటు అక్కడి లొకేషన్స్లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో వస్తాయని, 1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్లో రామ్చరణ్, అంజలి భార్యభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపోస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి. అంతేకాదు. ఈ సినిమాలో రామ్చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. -
సూర్య హీరోగా రూ. 1000కోట్ల బడ్జెట్తో శంకర్ సినిమా
తమిళసినిమా: ఈ ఆధునిక యుగంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కథలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. అయితే దర్శకుడు శంకర్ తన చిత్రాల కథల విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెంటిల్మెన్ నుంచి 2.ఓ చిత్రం వరకు ఈయన చిత్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రా మ్చరణ్ కథానాయకుడిగా చేస్తున్న చిత్రంతో పాటు తమిళంలో కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. వీటి తరువాత పొన్నియన్ చిత్ర హిందీ రీమేక్కు సిద్ధం అవుతారని సమాచారం. ఆ తరువాత రూ. 1000 కోట్ల బడ్జెట్లో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. లోక్సభ సభుయడు ఎస్.వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి నవలను చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీని స్క్రీన్ప్లేను వెంకటేశ్, శంకర్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీనిని రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రం, శివ దర్శకత్వంలో తాను 42వ చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చేయాల్సి ఉంది. ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించే అవకా శం ఉందని టాక్. ఇలాంటి చారిత్రక కథా చిత్రాలు కోలీవుడ్లో వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రూపొంది సంచలన విజయం సాధించాయి. వాటి ఇన్సిఫిరేషన్తోనే శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది. -
వచ్చే నెలలో వైజాగ్లో...
హీరో రామ్చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ని సెప్టెంబరులో ఆరంభించనున్నట్లు అప్డేట్ ఇచ్చారు శంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్లో ఆగస్టు 1 నుంచి షూటింగ్లు బంద్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. సెప్టెంబర్ 1నుంచి తిరిగి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్చరణ్–శంకర్ సినిమా కూడా రీ స్టార్ట్ కానుంది. ‘‘ప్రస్తుతం కమల్హాసన్తో ‘ఇండియన్ 2, రామ్ చరణ్తో ‘ఆర్సి 15’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ‘ఆర్సి 15’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్లో జరగనుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
'ఆ హీరోతో నటించొద్దు'.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్
పెళ్లై అత్తవారింటికి వెళ్లే వరకు కూతుళ్లకు తమ రక్షణ అవసరమని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఇలానే భావించారన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్. ఈమెకు సినిమా హీరోయిన్ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది ఆమె తండ్రి దర్శకుడు శంకర్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించాట. అయితే ఆయనకు అసలు టెన్షన్ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇది దర్శకుడు శంకర్కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట. ఈ నేపథ్యంలో కరోనా కుమార్ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ టెన్షన్ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - డైరెక్టర్ ఎస్. శంకర్
-
ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె
Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai: వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహవీరుడు'గా రాబోతుంది. తమిళ చిత్రం 'మండేలా' చిత్రానికి దర్శకత్వం వహించిన మడోనా అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అదితి ఇదివరకే కార్తీ హీరోగా నటించిన 'విరుమన్' చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం (ఆగస్టు 5) చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ప్రిన్స్’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. -
కాజల్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మథర్వుడ్ని ఆస్వాదిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కాజల్ మళ్లీ సినీ కెరీర్ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా నేహా ధూపియాతో ఇన్స్టా లైవ్లో ముచ్చటించిన కాజల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాతో త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై మెరవనుంది. కమల్హాసన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్లో ప్రమాదం జరగడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్, ఇతరాత్ర కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ప్రసవం తర్వాత కాజల్ నటిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. -
RC15: రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్కు నో చెప్పిన అగ్ర నటుడు
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇటివల సెట్స్పైకి వచ్చిన ఈ మూవీ 30 శాతం షూటింగ్ను జరుపుకుంది. ఈ మూవీని RC15 అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభించారు. ఇందులో చరణ్కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదిలా ఉంటే RC15 సెట్స్పైకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ తాజాగా మరో షాకింగ్ అప్డేట్ నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం RC15లో కీ రోల్ కోసం ఓ స్టార్ నటుడిని సంప్రదించగా ఆయన ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ నటుడు ఎవరో కాదు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఈ మూవీలో ప్రతికథానాయకుడి పాత్ర కోసం శంకర్ అండ్ టీం రీసెంట్గా ఆయనను సంప్రదించారట. ఈ పాత్ర కథ విన్న ఆయన శంకర్ ఆఫర్ను రిజెక్ట్ చేశాడని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ ఇందులో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్ పాత్ర ఉండనుందని సమాచారం. ఈ రోల్ కోసమే ఆయనను అడగ్గా మోహన్ లాల్ ఈ పాత్రకు ఆసక్తి చూపలేదని ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇటీవల మోహన్ లాల్ నటించి బ్రో డాడీ చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. కాగా RC15లో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారిక కనిపించనున్న సంగతి తెలిసిందే. -
RC15: ఒక్క ఫైట్ సీన్కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్!
Director Shankar Spend Rs 10 Crore For Only Fight Scene: డైరెక్టర్ శంకర్ సినిమాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆయన సినిమాలో వావ్ అనిపించే ఎన్నో వింతలు కనిపిస్తాయి. అత్యాధునిక విజువల్ వండర్స్తో సినిమాలను తెరకెక్కించే ఇండియన్ ఏకైక డైరెక్టర్ ఆయన. అందుకే శంకర్ సినిమా అనగానే ఆయన ఏలాంటి వండర్ క్రియేట్ చేయబోతున్నారా? అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతలా గుర్తింపు పొందిన ఆయన.. సినిమాలను తెరకెక్కించే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: టాలీవుడ్ హీరోయిన్పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! RC15 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సెట్స్పైకి వచ్చిన ఈ సినిమా కొంతభాగం షూటింగ్ను జరుపుకోగా అందులో ఓ భారీ ఫైట్ సీన్, ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్క ఫైట్ సీన్ కోసం శంకర్ రూ. 10 కోట్లు ఖర్చు చేయించారట. అంతేకాదు పాటకు కూడా రూ. 10కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఓ పాట, ఫైట్ సీన్కే శంకర్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తే ఇక సినిమా అయిపోయేసరికి ఎంత ఖర్చు పెట్టిస్తారో అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్కు కూడా శంకర్ భారీగా ఖర్చు పెట్టించినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వాని, మిగతా నటీనటులుచ, నిర్మాత దిల్ రాజు, శంకర్లు సూటు ధరించి ఆఫీసర్స్ లుక్లో ఉన్న ఆ పోస్టర్కు దాదాపు కోటీన్నరకు పైగా ఖర్చయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇదే జోషల్ ఆచార్య మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చరణ్ పాల్గొననున్నాడట. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను కొరటాల శివ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత చరణ్ తిరిగి RC15 షూటింగ్లో పాల్గొన్ననున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఆర్ఆర్ఆర్’ మూవీపై డైరెక్టర్ శంకర్ ట్వీట్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు
Director Shankar Comments On RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మార్చి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిని సినీ దిగ్గజాలలు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూ ప్రకటిస్తు డైరెక్టర్ రాజమౌళి, చిత్రం బృందాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంతో తాజాగా సెన్సెషన్ డైరెక్టర్ శంకర్ సైతం ఆర్ఆర్ఆర్పై తన రివ్యూను ప్రకటించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్. రోర్ అన్ని సమయాలలో ప్రతిధ్వనిస్తుంది. అసమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీంకు ధన్యవాదాలు. రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్… తారక్ రేడియంట్ భీమ్ మీ హృదయాన్ని ఆకర్షించారు. మీ ఊహ అజేయంగా ఉంటుంది.. హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి’ అంటూ ఆయన ఆర్ఆర్ఆర్ టీం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ RC15 అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మీటూ' అంటే తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు ఇక దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే ఆర్ఆర్ఆర్.. బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ థియేటర్ ముందు చూసిన అభిమానులు సందడి చూస్తుంటే పండగ వాతావారణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీంగా... రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా నటించిన సంగతి తెలిసిందే. Ravishing,Riveting,Robust.A Roar that’ll echo throughout times.Thanks to the whole team for an unparalleled experience.@AlwaysRamCharan-Raging Performance & Screen presence.@tarak9999 ‘s Radiant Bheem captivates your heart.Ur imagination stays undefeated,hats off “MahaRaja”mouli. — Shankar Shanmugham (@shankarshanmugh) March 25, 2022 -
దయచేసి అలా చేయకండి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. చదవండి: మెగా ఫాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! ‘‘కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి సహకరించండి’’ అని శంకర్ అండ్ కో ఓ నోట్ను విడుదల చేసింది. -
శంకర్ - చరణ్ చిత్రం
-
వరుణ్ తేజ్ సినిమా కోసం సింగర్గా మారిన డైరెక్టర్ శంకర్ కూతురు
Shankar Daughter Turns As Singer : ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్మీదుంది. అయితే అదితి హీరోయిన్గానే కాకుండా సింగర్గానూ పరిచయం అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్ చేయనున్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఆవిష్కరించనున్నారు. MY SINGING DEBUT✨🎙🎼 Waited so long to share this with you all. Another dream come true. @MusicThaman sir Thank you so much for trusting me and giving me this opportunity. Hope you guys like it♥️🧿🤞#ghani #romeojuliet #singingdebut pic.twitter.com/JOboB9VaMM — Aditi Shankar (@AditiShankarofl) February 6, 2022 -
డైరెక్టర్ శంకర్కు క్షమాపణలు చెప్పిన మహేశ్, అసలేం జరిగిందంటే..
Mahesh Babu Sorry To Director Shankar: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో శుక్రవారంతో ముగిసింది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్తో సంచలనం సృష్టించి ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేశాడు. ఆయనతో పాటు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాలయ్య, మహేశ్ బాబుకు సంబంధించిన సీక్రెట్స్ను బయటపెట్టించాడు. ఇలా ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ ఎపిసోడ్లో మహేశ్ బాబు తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి కాగా ఈ షో మధ్యలో బాలయ్య డైరెక్టర్ మెహర్ రమేష్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ ముంబైలో చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. ఓ సారి ముంబై మారిటన్ హోటల్లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు. ఇక దీనికి మహేశ్ బాబు సమాధానం ఇస్తూ.. ‘ముంబైలో మారిటన్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఉంది. ఓ ఇద్దర అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీ అని అడిగారు. ఇప్పుడు కాదు.. ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను. చదవండి: సుందరం మాస్టర్పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే.. దీంతో ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక రమేశ్ నాతో.. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్లు అని చెప్పాడు. దీంతో వెంటనే పరిగెత్తుకుని కిందకు వెళ్లాను. సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ ఫ్యామిలీ, మెహర్ రమేశ్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం తెలిసిందే. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కొడుకు..
Director Shankar Son Arjith To Debut As Hero: ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు శంకర్ తన కొడుకు తనయుడు అర్జిత్ను హీరోగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే అర్జిత్ యాక్టింగ్, డైరెక్షన్లో శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తుంది. 2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ప్రేమిస్తే పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఇక్కడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్తో అర్జిత్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాను సైతం శంకర్ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే శంకర్ చిన్న కూతురు అదితి కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. -
రామ్ చరణ్ సినిమాకు రూ.200 కోట్ల భారీ ఆఫర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం వస్తోన్న విషయం తెలిసిందే. ఇక దానికి తోడు ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ఏంటంటే ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ఓ ప్రముఖ సంస్థ దాదాపు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. -
నా జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: స్టార్ డైరెక్టర్ కూతురు
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో తనకుంటూ ఫేమ్తో పాటు నేమ్ని సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్. ఇండియన్ 2 సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒకలా ఈ దర్శకుడు ప్రొఫెషనల్ పరంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శంకర్ పర్సనల్ లైఫ్కి సంబంధించి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. ఎలా అంటారా..? శంకర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు ఐశ్వర్య.. ఇటీవల ఓ క్రికెటర్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే అదితి మాత్రం తన కెరీర్ని సిని రంగానికే పరిమితం కాకుండా మరోపక్క చదువును కొనసాగించింది. శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి డాక్టర్ డిగ్రీని పొందిన తరువాత భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్ర లేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగించడంతో అదితిని మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదితి శంకర్ సినిమాల విషయాలకొస్తే.. త్వరలోనే హీరోయిన్గా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం కానుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే చిత్రంతో కోలీవుడ్లో తమిళ తంబీలను పలకరించనుంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021 -
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్.. కారణం అదేనా?
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్ంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా భారీ హిట్ సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్గా రాబోతుంది. పలు అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఆటంకం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని టాక్. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అని కోలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాజల్ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అన్ని వివాదాలు సద్దుమణిగి తిరిగి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందనంగా ఈ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ్, వివేక్ తదితరులు నటిస్తున్నారు. భారతీయుడు సినిమా పలు రికార్డులను సొంత చేసుకోవడంతో ఈ సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చదవండి: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్ -
డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్పై లైంగిక వేధింపుల కేసు!
ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రోహిత్తో పాటు మరో అయిదుగురిని పుదుచ్చెరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్, మిగలిన అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, అతడి తండ్రి దామోదరన్, కోచ్ థమరాయ్ కన్నన్తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత దీంతో రోహిత్తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అయితే వారిని అరెస్టు చేశారా? లేదా?, ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్లో డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యతో రోహిత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం చదవండి: నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్కిరణ్తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్కిరణ్తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్తో కోలీవుడ్లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్కాంత్పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్కాంత్తో వైరం కోలీవుడ్లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్స్పెషల్ -
RC15: పట్టలేనంత సంతోషంలో తమన్
తమన్ పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. మరి.. ఏ దర్శకుడి సినిమాలో నటుడిగా కనిపించారో అదే దర్శకుడి సినిమాకి పాటలిచ్చే అవకాశం వస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ (2003)లో ఐదుగురు యువకుల్లో ఓ యువకుడిగా తమన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు శంకర్ డైరెక్షన్లో యాక్టర్గా కనిపించిన తమన్ ఇప్పుడు ఆయన సినిమాకి ట్యూన్స్ ఇవ్వనుండటం విశేషం. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న ప్యాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ‘‘2000 సంవత్సరం నుంచి శంకర్ సార్ని చూస్తున్నాను. సైన్స్ని, సినిమాకి మించిన విషయాలను ఆయన ఊహించే విధానం అద్భుతం. ఆయనలో అదే ఉత్సాహం ఉంది. ‘నాయక్’, ‘బ్రూస్లీ’ తర్వాత రామ్ చరణ్ సినిమాకి పని చేయనున్నాను. నా బెస్ట్ ఇవ్వ డానికి ప్రయత్నం చేస్తాను’’ అన్నారు తమన్. -
RAPO19 యూనిట్కు శంకర్ సడన్ సర్ప్రైజ్!
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది. -
ఆయనతో ఫొటో దిగాలనుకున్నా, ఇప్పుడు ఏకంగా: RRR డైలాగ్ రైటర్
ఎలాంటి కథకైనా లోతైన, పదునైన మాటల్ని రాయడంలో దిట్టగా పేరు సాధించాడు డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన దగ్గరకు చేరుతున్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు. రామ్చరణ్ - శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రానికి సాయిమాధవ్ను డైలాగ్ రైటర్గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు సాయిమాధవ్. ‘'జెంటిల్ మేన్' సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు, రామ్చరణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు‘ అంటూ ట్వీట్ చేశాడు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను .. Thanks to Sankar sir.. Thanks to Dil Rajugaru.. and Thanks to our Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG — Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021 ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలతో పాటు ‘మహానటి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్, ‘సైరా’ తదితర చిత్రాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుకు కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు. -
రణ్వీర్ సింగ్.. వీడు నిజంగానే తేడా సింగ్
యాక్టింగ్తో పాటు యాటిట్యూడ్.. యాక్టర్స్ నుంచి ఇప్పటి జనరేషన్ కోరుకునేది ఇదే. ఆ లక్షణాలతో వందకు వంద శాతం పూర్తిగా న్యాయం చేస్తున్న ఏకైక బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన విచిత్రమైన మేనరిజంతో.. నటనలో వేరియేషన్స్తో అతని ఫ్యాన్స్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతుంటాడు రణ్వీర్. ఇవాళ రణ్వీర్ 36వ పుట్టినరోజు... బాంద్రాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జగ్జీత్ సింగ్ భవ్నాని కొడుకే ఈ రణ్వీర్ సింగ్. స్కూల్ రోజుల్లోనే అల్లరిని అవపోసన పట్టిన రణ్వీర్.. పేరు పొడుగ్గా ఉందనే ఉద్దేశంలో భవ్నానిని లేపేసుకున్నాడు. కాపీరైటర్గా కెరీర్ మొదలుపెట్టి ఆపై మోడలింగ్ అటు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు రణ్వీర్ సింగ్. ఎక్స్ రేటెడ్(అడల్ట్) మ్యాగజైన్స్ను తెగ ఇష్టపడే రణ్వీర్.. అవకాశాల కోసం తొలినాళ్లలో బాగానే కష్టపడ్డాడు. అయితే ఆరంభంలోనే మూడు పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ, బ్యాండ్ బాజా బరాత్ కోసం ఇచ్చిన కమిట్మెంట్కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు. ఫ్యాన్స్ ఫేవరెట్ కోస్టార్స్కి మాత్రమే కాదు.. అభిమానులకూ రణ్వీర్ సింగ్ అంటే ఒక ఎనర్జీ. ఈవెంట ఏదైనాసరే ఎప్పుడూ రెడ్బుల్ తాగినోడిలా ఎనర్జిటిక్గా ఉంటూ సందడి చేస్తుంటాడు. ఫ్యాన్స్కు అతనొక ఫ్రెండ్లీ స్టార్. ఎవరైనా ‘సర్ మీ అభిమాని’ని అని చెబితే చాలు.. ఆప్యాయంగా వాళ్లను వాటేసుకుని ఫొటోలు దిగుతుంటాడు రణ్వీర్. అంతేకాదు ఎందరికో ఆర్థిక సాయం అందించాడు. చెప్పాపెట్టకుండా అభిమాల పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరై ఆశ్చర్యపరుస్తుంటాడు. అభిమానుల మానసిక ఆనందమే తనకు ముఖ్యమని చాలాసార్లు ప్రకటించాడు ఈ యంగ్ హీరో. ఖిల్జీగా క్రూరత్వం కెరీర్ మొదట్లో రణ్వీర్ది చిచ్చొర యాక్టింగ్ అనే ముద్రపడిపోయింది. కానీ, తనలోని వేరియెన్స్ను క్రమంగా బయటపెడుతూ అలరిస్తూ వచ్చాడు. దిల్ దడక్నే దో(2015) రణ్వీర్ నటనకు తొలిగా ప్రశంసలు దక్కేలా చేసింది. గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలాలోని అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నటనను మెచ్చి బాలీవుడ్ బిగ్బీ అమితాబ్.. రణ్వీర్ను పొడుగుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంపాడు. ఇక బాజీరావ్ మస్తానీలో నటనకు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అందుకున్న రణ్వీర్.. పద్మావత్లో అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్తో క్రూరత్వాన్ని పండించి అందరినీ మెప్పించాడు. సింబా, గల్లీబాయ్ సక్సెస్ల తర్వాత ‘83’ లాంటి బయోగ్రాఫికల్ స్పోర్స్ డ్రామా ద్వారా, అపరిచితుడు రీమేక్తో తన కెపాసిటీని చూపించేందుకు రెడీ అయ్యాడు. లవ్ యూ దీప్వీర్ కెరీర్లో, బయట క్రేజీగా కనబడే రణ్వీర్.. ఫ్యామిలీ విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటాడు. పేరెంట్స్, అక్క మధ్య అల్లరిగా పెరిగిన రణ్వీర్.. ఎఫైర్ల విషయంలోనూ ఓపెన్గానే ఉంటాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడి చిల్లరగా వ్యవహరించానని ఓపెన్గానే ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నాడు రణ్వీర్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక హేమా మాలిని చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్ చేశాడు. ఆ తర్వాత దీపికా పదుకొనేతో ప్రేమాయాణం.. అభిమానుల అనుమానాల మధ్యే వాళ్ల వాళ్లిద్దరూ ఒక్కటైపోవడం.. ఆప్యాయంగా సాగుతున్న దీప్వీర్ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీడు హీరోనా?:కరణ్ రణ్వీర్ తొలి మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’(2010). రణ్వీర్ను యశ్రాజ్ స్టూడియో దగ్గర తొలిసారి చూసిన బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్మేకర్ కరణ్ జోహర్ ‘వీడేం హీరో’ అనుకున్నాడట. ఇక ఈ సినిమా పోస్టర్ చూసి ‘వీడు హీరో అయితే ఈ సినిమా ఎవడు చూస్తాడు’ అనుకున్నాడంట. అంతేకాదు నిర్మాత ఆదిత్యా చోప్రాతో ఈ విషయంపై చర్చించాడట కూడా. ఇక బలవంతంగా ఆ సినిమా చూశాక.. తన అభిప్రాయం మార్చుకున్నాడనని, రణ్వీర్ విషయంలో మూర్ఖంగా ఆలోచించాననే విషయం అప్పుడు అర్థమైందని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు కరణ్. ఇప్పుడు అదే కరణ్ డైరెక్షన్లో కొత్తగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అలియాభట్తో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మీమ్ కంటెంట్ రణ్వీర్.. సోషల్ మీడియాలో ఒక మీమ్ స్టఫ్. యాక్టింగ్ కంటే రణ్వీర్ జనాలకు ఎక్కువగా దగ్గరైంది ఈ యాటిట్యూడ్తో. విచిత్రమైన అతని అటిరే(డ్రెస్సింగ్ విధానం), వేషధారణలు మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ చర్చగా మారుతుంటాయి. ఫ్యాషన్ విషయంలో అతనొక ట్రెండ్ సెట్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆ ట్రెండ్ను ఫాలో కావాలంటే కొంచెం గట్స్ కూడా ఉండాలి. అంతెందుకు కండోమ్ యాడ్లో యాక్ట్ దమ్మున్న హీరో రణ్వీర్ మాత్రమేనేమో!. సెటైర్, వరెస్ట్.. ఇలా ఎన్ని కామెంట్లు వినిపించినా.. విమర్శలు చుట్టుముట్టినా రణ్వీర్ మాత్రం మారడు. పైగా ఈ కోణాలన్ని ఉన్నందునే ఈ యంగ్ ఫైనెస్ట్ యాక్టర్ను ‘తేడా సింగ్’గా చూస్తూ.. ఆదరిస్తూ వస్తున్నారు అశేష అభిమానులు. -
విశ్రాంత న్యాయమూర్తి చేతికి ఇండియన్–2 పంచాయితీ
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇండియన్–2. ఈ చిత్ర నిర్మాణం ఆది నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. షూటింగ్ స్పాట్లో ట్రైన్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు యూనిట్ సభ్యులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ మొదలవలేదు. మధ్యలో కరోనా కష్టాలు కూడా ఇండియన్–2 చిత్ర నిర్మాణం జాప్యానికి ఒక కారణం. ఇలాంటి పలు కారణాలతో దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇండియన్–2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా శంకర్ వేరే చిత్రం చేయడానికి అనుమతించరాదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో దర్శకుడు శంకర్ కూడా చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఇండియన్–2 చిత్ర షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నటుడు కమలహాసన్ మధ్యవర్తిత్వం వహించినా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్ర సమస్యను పరిష్కరించడానికి చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి ఇండియన్–2 చిత్ర వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి వివరాలను కోర్టుకు సమర్పించిన తరువాత ఈ కేసులో తుది తీర్పును వెల్లడించను న్నట్లు చెన్నై హైకోర్టు పేర్కొంది. చదవండి: Krithi Shetty: ఇక బిజీబిజీగా మారిపోనున్న కృతీ క్రికెటర్తో ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం -
ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్ రోహిత్ దామోదరన్తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరుడు రోహిత్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇదిలా వుంటే శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్తో అపరిచితుడు రీమేక్ కూడా చేయనున్నట్లు భోగట్టా. చదవండి: క్రికెటర్తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి -
క్రికెటర్తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి
ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. పెళ్లి డేట్పై స్పష్టత లేదు. వృతిరీత్యా శంకర్ కూతురు ఐశ్యర్య డాక్టర్ కాగా రోహిత్ టీఎన్పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ కావడం విశేషం. ఇక రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా. అయితే గత మేలో శంకర్ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా శంకర్కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్తో అపరిచితుడు రీమేక్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: శవం ముందు నటి డ్యాన్స్, అవాక్కైన నెటిజన్లు Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ హీరోయిన్! -
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తు లక్ష్మి (88) మంగళవారం సాయంత్రం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మే 18న తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. శంకర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లి ముత్తు లక్ష్మి అని పలు ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పేవారు. తన చిన్న వయసులో ఎన్నో కష్టాలుపడి పెంచి తనను ఈ స్థాయి తీసుకొచ్చారంటూ ఆయన తరచూ తల్లిని గుర్తు చేసుకునేవారు. కాగా ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ నటీనటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది. ఈ తరుణంలో తాజాగా శంకర్ తల్లి మృతి వార్త మరింత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ను తిరిగి ప్రారంభించే పనిలో పడ్డారు. Director #Shankar's mother S Muthulakshmi age 88 passed away today pic.twitter.com/8lTNJfSLIk — Priya - PRO (@PRO_Priya) May 18, 2021 -
సీఎం స్టాలిన్ను కలిసిన తారలు: విరాళాల వెల్లువ
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. అయితే ప్రజలకు ఆర్థికసాయం చేయడానికి, కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడానికి ఆర్థిక పరమైన అవసరాలు ఏర్పడడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దాతలు కరోనా నివారణ నిధికి ఆర్థికసాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తున్న ఎడిటర్ మోహన్ కుటుంబం దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే శివకుమార్ కుటుంబం, అజిత్, సౌందర్య రజనీకాంత్ కుటుంబం తదితరులు విరాళాలు అందించారు. తాజాగా మరికొందరు సినీ దర్శక నటులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నటుడు శివకార్తికేయన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అదేవిధంగా నిర్మాత, ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్రాజ, నటుడు జయం రవి ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. దర్శకుడు వెట్రిమారన్ దర్శకుడు శంకర్ కరోనా నివారణకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు పంపించారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందించారు. రజనీకాంత్, విజయ్, ధనుష్, శింబు తదితర ప్రముఖులు ఇంకా తమ విరాళాలను ప్రకటించలేదు. అజిత్ విరాళాన్ని ప్రకటించడంతో ఆయనకు పోటీదారులుగా భావించే విజయ్ ఇంకా విరాళాన్ని ప్రకటించలేదు. కాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నటుడు శివకార్తికేయన్ చదవండి: పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. సీఎం స్టాలిన్ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు