Diwali 2024
-
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
హనుమకొండ : సంబురంగా సదర్ ఉత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
నా భర్తతో తొలి దీపావళి.. చాలా ప్రత్యేకమన్న రకుల్ ప్రీత్ సింగ్
-
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు
సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు. వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి. ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి! -
కోపంతో జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న కమెడియన్.. వీడియో వైరల్
ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.దీపావళి అలా జరుపుకోవద్దు!దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నటుడి క్షమాపణలుదీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. నెలన్నరకోసారి నన్ను చూస్తారుఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్పాల్ అసహనం వ్యక్తం చేశాడు.ఫోన్ లాక్కున్న నటుడువెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజ్పాల్ తన ఫోన్ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు. लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024 చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి -
లవ్ అండ్ లైట్ : ఫెస్టివ్ వైబ్స్తో కళకళలాడిపోతున్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ప్రమిదల తయారీలో రాహుల్ గాంధీ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోమారు వృత్తి పనివారల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు 9 నిమిషాల వీడియోను శుక్రవారం ‘ఎక్స్’లో విడుదల చేశారు. ఢిల్లీలో మట్టి ప్రమిదలను తయారు చేసే మహిళ ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లారు. ప్రమిదలను సొంతంగా తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వీటిని తన తల్లి సోనియా గాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఇస్తానన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులతో గుర్తుండిపోయే దీపావళి ఇది. దీపావళి నాడు పెయింటర్ సోదరులతో, కుమ్మరి వృత్తి పని వారి కుటుంబంతో పనిచేస్తూ గడిపాను. వారి వృత్తి పనిని దగ్గర్నుంచి గమనించాను. వారి పనితనాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రయతి్నంచాను. వారి కష్టనష్టాలను అర్థం చేసుకున్నాను. మనం కుటుంబంతో కలిసి పండగలను సంతోషంతో జరుపుకుంటాం. వారు మాత్రం ఎంతోకొంత డబ్బు సంపాదించుకునేందుకు సొంతింటిని, కుటుంబాన్ని, సొంతూరిని, నగరాన్ని మర్చిపోతున్నారు’అని అనంతరం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘మట్టిలోనే వారు సంతోషం వెదుక్కుంటున్నారు. ఇతరుల జీవితాల్లో పండుగ వెలుగుల కోసం ప్రయత్నిస్తూ..తమ జీవితాల్లో వెలుగులు నింపుకోగలుతున్నారా? ఇళ్లను నిర్మించే వీరికి సొంతిల్లు కూడా ఉండటం గగనంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలం, ఆత్మగౌరవాన్ని అందించే వ్యవస్థను మనం తయారు చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ దీపావళి అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.10, జన్పథ్ బంగ్లా అంటే పెద్దగా ఇష్టం లేదుఢిల్లీలోని ల్యుటెన్స్ ప్రాంతంలో ఉన్న 10, జన్పథ్ బంగ్లా అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో హత్యకు గురైన సమయంలో ఈ బంగ్లాలోనే ఉన్నారని, అందుకే అంతగా ఇష్టం లేదని ఆయన గురువారం చెప్పారు. జన్పథ్ బంగ్లాకు రంగులు వేసే కారి్మకులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంకా గాంధీ కుమారుడు, మేనల్లుడు రైహాన్ రాజీవ్ వాద్రాతో ఈ మేరకు చేసిన సంభాషణ వీడియోను ఆయన విడుదల చేశారు. రాహుల్ గాంధీ చిన్నప్పటి నుంచి 10, జన్పథ్ బంగ్లాలోనే గడిపారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం తల్లి సోనియా గాం«దీకి ఈ భవనాన్ని కేటాయించారు. రాహుల్ ఎంపీ అయ్యాక తుగ్లక్ లేన్లోని 12వ నంబర్ బంగ్లాకు మకాం మార్చారు. 2023లో పరువునష్టం కేసులో అనర్హత వేటు పడటంతో తల్లి ఉండే జన్పథ్ బంగ్లాకు మారారు. అనర్హత వేటు తొలిగి, మళ్లీ ఎంపీ అయ్యాక కూడా రాహుల్ ఇక్కడే ఉంటున్నారు. -
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
లాభాలతో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 7 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42% లాభపడి 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి.సాయంత్రం 6 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో సెషన్ను ప్రారంభించాయి. అన్ని రంగాలు గ్రీన్లో ట్రేడయ్యాయి. కంపెనీలు తమ నెలవారీ విక్రయాల సంఖ్యను విడుదల చేయడంతో ఆటో స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం (సంవత్ 2081) ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొసాగింది.మహీంద్రా అండ్ మహీంద్రా, ఒఎన్జిసి, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. -
స్టాక్మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.ఇలా ప్రారంభమైంది..ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. -
ప్రముఖ నటి షబానా అజ్మీ ఇంట్లో తారల దీపావళి సందడి (ఫోటోలు)
-
సమంత దీపావళి సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
అలెక్సా చెబితే టపాసు వింటోంది!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..హైటెక్ లాంచ్మనీస్ప్రాజెక్ట్ల్యాబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Mani's Projects Lab (@manisprojectslab) -
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు... రష్మిక, విజయ్ దేవరకొండ సహా! (ఫొటోలు)
-
Diwali 2024: హ్యపీ దివాలీ సెలబ్రిటీల సందడి
-
టాలీవుడ్ నటి అనసూయ దివాళీ లుక్.. అదిరిపోయిందిగా!
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
‘ఇంకో నెల తర్వాతే మాకు దీపావళి’
దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. హిమాచల్ ప్రదేశ్లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు. -
ప్రభాస్ 'స్పిరిట్'.. రెబల్ స్టార్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్..!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో నటిస్తున్నారు. ది రాజాసాబ్ పేరుతో రొమాంటిక్-హారర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ తర్వాత ప్రభాస్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో ప్రభాస్ రోల్పై ఇటీవల ఓ ఈవెంట్లో సందీప్ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్లో కనిపించనున్నారు. కాగా.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముంది.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ఇవాళ దీపావళి సందర్భంగా స్పిరిట్ టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలయ్యాయని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ వింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ జోడీ కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar) -
Diwali 2024 అచ్చమైన తెలుగందం,పక్కింటి అమ్మాయిలా, వైష్ణవి చైతన్య
-
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్లోని దెప్పాంగ్, దేమ్చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
నా నవ్వుకు నువ్వే కారణం: సానియా మీర్జా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్తో సరికొత్త ట్రెండ్ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్ఫిట్లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్వేర్తో ఫ్యాషన్కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్లో డిఫెరెంట్గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్తో మహారాణిల మెరిసిపోయింది. ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్లెస్లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్ని ధరించానని ఇన్స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్వేర్లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..) -
వెలుగు దివ్వెల దీపావళి : ముద్దుల తనయ, ఎర్రచీరలో అందంగా నటి శ్రియాశరణ్ (ఫోటోలు)
-
బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చేవారిపై పోలీసులు నిఘా సారించారు. గల్లీగల్లీని నిశింతగా పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను స్వీకరిస్తూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.దీపావళి వేళ నగరంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఇది అమలయ్యేలా చూసేందుకు ప్రభుత్వం 377 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బాణాసంచా నిషేధం అమలయ్యేలా చూసేందుకు సాధారణ దుస్తుల్లో పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు.ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 14న నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కొనుగోళ్లను నిషేధించింది. ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు అమలులో ఉంటుంది. దీపావళి రోజున చాందినీ చౌక్, సరోజినీ నగర్, లజ్పత్ నగర్, గ్రేటర్ కైలాష్, ఆజాద్పూర్, ఘాజీపూర్ వంటి మార్కెట్లలో భారీ రద్దీ నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ దీపావళి వేళ మార్కెట్లు, మాల్స్, వివిధ సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటెన్సివ్ పెట్రోలింగ్, అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా సారించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పెట్రోలింగ్ బృందాలు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది కూడా చదవండి: కాలుష్యంలేని, నిశ్శబ్ద దీపావళి సాధ్యమేనా? ఈ టిప్స్ పాటిద్దాం! -
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్
-
పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ ఈ వేడుక చేస్తారు.ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే.. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
పండగవేళ నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్మెడ్స్ ఫ్రెష్పిక్ -
అయోధ్య: ఆ మట్టి ప్రమిదలను ఏం చేస్తారంటే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిన్న(బుధవారం) అత్యంత వేడుకగా దీపోత్సవం జరిగింది. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి యోగి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.దీపావళి సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేళ నగరం వినూత్న కాంతులతో నిండిపోతుంది. అయితే దీపోత్సవం సందర్భంగా దీపాలు వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలను ఏమి చేస్తారు? ఈ ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది.గత ఎనిమిది ఏళ్లుగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగిస్తున్నారు. తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో లక్షకు పైగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఏటా ఈ సంఖ్యను పెంచుతూ నిన్న జరిగిన ఎనిమిదో దీపోత్సవంలో 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని వరల్డ్ రికార్డ్స్ బృందం లెక్కించి సర్టిఫికేట్ జారీ చేయనుంది.ఈ లెక్కింపు అనంతరం అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ దీపాల ప్రమిదిలను అక్కడి నుంచి తొలగించనున్నారు. అవధ్ యూనివర్సిటీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ దీపోత్సవం అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ బృందం అన్ని ఘాట్లను శుభ్రం చేసి,ఆ ప్రమిదలనన్నింటినీ సేకరించి, ఒక చోటచేర్చి, ఆ తర్వాత పారవేస్తుందని తెలిపారు. ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
ప్రతి దీపకాంతి పసిడి వర్ణంలో వెలుగులు విరజిమ్ముతుంది. అయితే, కొన్ని దీపాల నుంచి వచ్చే పరిమళాలు మాత్రం విభిన్నంగా మదిని కట్టిపడేస్తున్నాయి. మట్టి ప్రమిదల్లో నూనెతో దీపాలను వెలిగించడంతోనే సంతృప్తి పడటం లేదు నేటితరం అందుకే, భిన్న ఆస్వాదనల వెలుగులను పరిచయం చేస్తున్నారు క్రియేటర్స్. ఈ దీపావళిని సుంగంధ భరితం చేస్తున్న వెలుగులు ఇవి..స్వీట్ ట్రీట్లను పోలి ఉండేలా నోరూరించే దియా డిజైన్ల శ్రేణి ఆన్లైన్ మార్కెట్లో సందడి చేస్తోంది. తియ్యని కప్ కేక్ల నుంచి ఐస్క్రీమ్ల వరకు ప్రతి కొవ్వొత్తి డిజైన్ అబ్బుర పరుస్తోంది. క్రీముతో కూడిన పంచదార పాకం సువాసనలను ఈ కొవ్వొత్తుల ద్వారా ఆస్వాదించవచ్చు. వీటి ధరలు కూడా వందల రూపాయల నుంచి వేలలో ఉన్నాయి. వీగన్ కాంతి..జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండా వీగన్ కొవ్వొత్తుల డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్ డిజర్ట్ క్యాండిల్స్లో కుకీస్, బ్లాక్బెర్రీ, డార్క్ చాకొలెట్, లెమన్ డిజర్ట్, స్ట్రాబెర్రీ డిజర్ట్ క్యాండిల్స్ చూపులకు, సువాసనలకు నోరూరిస్తున్నాయి కూడా.ఆకారానికో అందం..మనుషులు, జంతు ఆకారాలను పోలిన క్యాండిల్స్తోపాటు సెంటెడ్ మట్కీ దియా సెట్, టెర్రకోట క్యాండిల్ దియాస్, ఘీ బ్లెండెడ్ ఫిల్డ్ క్లే దియా, మిర్రర్ డెకొరేషన్ దియాస్, షాడో దియాస్, వాటర్ లైట్ దియాస్ లభిస్తున్నాయి. భిన్న ఆకృతిలో డిజైన్లలో కనిపిస్తున్న వెలుగులు ఈ దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. (చదవండి: -
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
సెలబ్రిటీల దీపావళి ముచ్చట్లు.. భయం లేకపోవడమే వెలుగు..!
జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు. ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్లను కలిసి కాల్చేవారు. ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు. అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి. కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను. సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను. (చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు) -
ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. देशवासियों को दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना करता हूं। मां लक्ष्मी और भगवान श्री गणेश की कृपा से सबका कल्याण हो।— Narendra Modi (@narendramodi) October 31, 2024 దీనికిముందు ప్రధాని మోదీ.. ఒక పోస్టులో అయోధ్యలోని నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు. अलौकिक अयोध्या!मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के अपने भव्य मंदिर में विराजने के बाद यह पहली दीपावली है। अयोध्या में श्री राम लला के मंदिर की यह अनुपम छटा हर किसी को अभिभूत करने वाली है। 500 वर्षों के पश्चात यह पावन घड़ी रामभक्तों के अनगिनत बलिदान और अनवरत त्याग-तपस्या के बाद… https://t.co/e0BwDRUnV6— Narendra Modi (@narendramodi) October 30, 2024ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్పూర్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఇది కూడా చదవండి: స్టార్మర్ దీపావళి వేడుకలు -
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
Diwali 2024: దీపావళి మెరుపుల్..
అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి సవాళ్లు నెలకొన్నప్పటికీ సంవత్ 2080లో దేశీ సూచీలు కొత్త రికార్డు స్థాయులను తాకాయి. నిఫ్టీ50 దాదాపు 26,250 మార్కును, బీఎస్ఈ సెన్సెక్స్ 85,900 మార్కును దాటాయి. గత దీపావళి నుంచి దాదాపు 25 శాతం పెరిగాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ సూచీల్లో భారత్కి వెయిటేజ్ గణనీయంగా పెరుగుతోంది. దిగ్గజ గ్లోబల్ ఫండ్స్ దృష్టిని భారత మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. అమెరికా డాలరు బలహీనత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్పీఐలు) మన మార్కెట్ల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ 22 శాతం, సెన్సెక్స్ 27 శాతం పెరగవచ్చనే అంచనాలున్నాయి. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, కొంత ఉద్దీపన చర్యలతో చైనా మార్కెట్లు పుంజుకోవడం వంటి అంశాల ప్రభావం మన మార్కెట్లపైనా ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లో కన్సాలిడేషన్ జరగవచ్చని, 2080 సంవత్తో పోలిస్తే కొత్త సంవత్ 2081లో రాబడులు తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గత 12–18 నెలలుగా ర్యాలీ చేసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ .. ఆదాయ అంచనాలను అందుకోలేకపోతే గణనీయంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్తో పోలిస్తే కాస్త స్థిరంగా, మెరుగైన వేల్యుయేషన్స్తో లార్జ్ క్యాప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ తదితర రంగాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే పసిడి, వెండికి కూడా కొంత కేటాయించాలనే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు బ్రోకరేజీలు కొత్త సంవత్ 2081లో పరిశీలించతగిన స్టాక్స్ను సూచించాయి. వాటిలో కొన్ని .. గణనీయంగా పెరిగిన బంగారం ధరలు రాబోయే రోజుల్లోనూ అదే ధోరణి కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 30న అంతర్జాతీయంగా పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రా) ఆల్ టైమ్ గరిష్టం 2,801 డాలర్లని దాటింది.. ఎంసీఎక్స్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 79,775కి ఎగిసింది. 2080 సంవత్ నాటి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్ల పాలసీల కారణంగా గ్లోబల్గా గోల్డ్ ధరలు 41 శాతం పైగా, ఎంసీఎక్స్లో 27 శాతం పైగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు చైనాలో పటిష్టమైన డిమాండ్, స్పెక్యులేటివ్ కొనుగోళ్లు కూడా పసిడికి ఊతమిస్తున్నాయి. దేశీయంగా ఇటీవల పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. 2081 సంవత్లో పసిడి రేట్లు మరింత బలపడొచ్చు. ఎంసీఎక్స్లో పది గ్రాముల పసిడి రూ. 70,000– 87,000 శ్రేణిలో తిరుగాడవచ్చు. అంతర్జాతీయంగా ఔన్సు ధర 3,030 డాలర్ల స్థాయికి తాకే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాల వల్ల పెరుగుదలకు కాస్త అడ్డుకట్ట పడినా, మొత్తం మీద చూస్తే మాత్రం సానుకూల అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లకు బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉంటుంది. – కాయ్నాత్ చైన్వాలా, అసోసియేట్ వీపీ, కమోడిటీ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్ బ్రోకరేజి సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 107.35 టార్గెట్ ధర: రూ. 132 పటిష్టమైన క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, నికర వడ్డీ మార్జిన్లు .. అసెట్ క్వాలిటీ మెరుగుపడటం వంటివి సానుకూలాంశాలు. వ్యవసాయ, ఎస్ఎంఈ సెగ్మెంట్లలో అసెట్ నాణ్యత పడిపోయే అవకాశాలు, మొండిబాకీల పరిష్కారం ఆశించినంత స్థాయిలో ఉండకపోవడం, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయడం ప్రతికూలాంశాలు.జ్యోతిల్యాబ్స్ ప్రస్తుత ధర: రూ. 513.55 టార్గెట్ ధర: రూ. 600ప్రమోటర్ ఆధారిత, దక్షిణాది కేంద్రంగా, సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా పని చేయడం నుంచి ప్రొఫెషనల్స్ నిర్వహణలో, బహుళ ఉత్పత్తులతో, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన సంస్థగా ఎదిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం మార్జిన్లకు దన్నుగా ఉండగలవు. ప్రతికూల వర్షపాతం, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు.నాల్కో ప్రస్తుత ధర: రూ. 227.20 టార్గెట్ ధర: రూ. 270అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా అంతగా లేకపోవడంతో అల్యూమినియం ధరలు పెరుగుతుండటం కంపెనీకి సానుకూలాంశాలు. నియంత్రణ విధానాలపరమైన మార్పులు, ముడివస్తువుల ధరల పెరుగుదల, అల్యూమినా రేట్లలో హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రతికూలంగా ఉండవచ్చు.నవీన్ ఫ్లోరిన్ ప్రస్తుత ధర: రూ. 3,331.95 టార్గెట్ ధర: రూ. 3,948సీడీఎంవో, స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్స్ విభాగాలు వృద్ధి చెందుతుండటం కలిసి రానున్నాయి. ప్రోడక్ట్ మిక్స్ మెరుగ్గా ఉండటం వల్ల వచ్చే మూడేళ్లలో మార్జిన్లు750 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడొచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పోటీ, వ్యాపార విస్తరణలో జాప్యాలు మొదలైనవి మైనస్.ఎన్సీసీ ప్రస్తుత ధర: రూ. 292.20 టార్గెట్ ధర: రూ. 363మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు సానుకూల అంశం. ఆర్డర్ బుక్, బ్యాలెన్స్ షీట్ బాగుంది. ప్రాజెక్టుల అమలు వేగవంతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యకాలికంగా కంపెనీ ఆరోగ్యకరమైన స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టుల వ్యయాలు పెరిగిపోవడం, జాప్యం వంటి రిసు్కలు ఉన్నాయి.చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ బజాజ్ ఆటో ప్రస్తుత ధర: రూ. 9,917 టార్గెట్ ధర: రూ. 12,483మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు ఎగుమతులపై దృష్టి పెడుతుండటం, కొత్త వాహనాలు, ఈవీ చేతక్కు డిమాండ్ పెరుగుతుండటం, సీఎన్జీ ఆధారిత టూ–వీలర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ల విక్రయాలను పెంచుకునే వ్యూహాలు మొదలైనవి కలసి రానున్నాయి.భారత్ డైనమిక్స్ ప్రస్తుత ధర: రూ. 1,063.70టార్గెట్ ధర: రూ. 1,501భద్రతా బలగాల అవసరాల ఉత్పత్తులను అందిస్తోంది. భారీ ప్రాజెక్టులు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగుమతులను పెంచుకునే క్రమంలో 4–5 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. సాయుధ బలగాలకు సంబంధించి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. 2024 ఏప్రిల్ 1 నాటికి రూ. 19,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది.ఏసీసీ ప్రస్తుత ధర: రూ. 2,337.80 టార్గెట్ ధర: రూ. 2,795దేశీయంగా సిమెంట్కు డిమాండ్ 7–8 శాతం మేర వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తిని 140 మిలియన్ టన్నుల స్థాయికి రెట్టింపు చేసుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 89 మిలియన్ టన్నులుగా ఉంది. వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతోంది.టీసీఎస్ ప్రస్తుత ధర: రూ. 4,085.60 టార్గెట్ ధర: రూ. 4,664వృద్ధికి అవకాశమున్న వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. టోటల్ కాంట్రాక్ట్ వేల్యూ దాదాపు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో ఉండటం, జెన్ఏఐపై క్లయింట్ల ఆసక్తి పెరుగుతుండటం వంటివి వ్యాపార వృద్ధికి దోహదపడే సానుకూలాంశాలు.గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 551.60 టార్గెట్ ధర: రూ. 723ఎఫ్డీ సెగ్మెంట్వైపు వ్యూహాత్మకంగా మళ్లుతుండటం, యూరప్లో పారాసెట్మల్ ఏపీఐల అమ్మకాలు స్థిరపడుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. అలాగే, కొత్త ఎఫ్డీ ప్లాంటు అందుబాటులోకి రావడం, ఉత్తర అమెరికాలో కొత్త ఉత్పత్తుల లాంచింగ్ వంటి అంశాలు వ్యాపార వృద్ధికి తోడ్పడగలవు.ఎస్బీఐ సెక్యూరిటీస్ కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 449.55టార్గెట్ ధర: రూ. 593భారీ ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడంలో పురోగతి సాధించింది. లాభసాటి కాని భూగర్భ గనుల నుంచి తప్పుకోవడం ద్వారా వ్యయాలను నియంత్రించుకుంటోంది. గ్రాఫైట్ వంటి ఇతర విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రస్తుత ధర: రూ. 1,181.80 టార్గెట్ ధర: రూ. 1,398 రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా రాణిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్హౌసింగ్ వంటి వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,363 కోట్లుగా ఉన్న రుణభారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా రూ. 7,680 కోట్లకు తగ్గించుకుంది.భారతి హెక్సాకామ్ ప్రస్తుత ధర: రూ. 1,420.90టార్గెట్ ధర: రూ. 1,747రాజస్థాన్, ఈశాన్య టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 25,704 టవర్లు, 79,835 మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్టేషన్లతో పటిష్టమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ ఉంది. భారతి ఎయిర్టెల్తో అనుబంధం వల్ల డిజిటల్ ఇన్ఫ్రా, మేనేజ్మెంట్ నైపుణ్యాలపరంగా ప్రయోజనాలను పొందుతోంది.నిప్పన్ లైఫ్ ఏఎంసీ ప్రస్తుత ధర: రూ. 683టార్గెట్ ధర: రూ. 825ఈక్విటీ, ఈటీఎఫ్ ఏయూఎంపరంగా పటిష్ట వృద్ధి కనపరుస్తోంది. 2024–26 ఆరి్ధక సంవత్సరాల మధ్య కాలంలో ఏయూఎం వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. బలమైన రిటైల్ నెట్వర్క్, దేశీ యంగా మ్యుచువల్ ఫండ్ విస్తృతి తక్కువగా ఉండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడనున్నాయి. ఎస్కార్ట్స్ కుబోటా ప్రస్తుత ధర: రూ. 3,642.45 టార్గెట్ ధర: రూ. 4,40812 హెచ్పీ నుంచి 120 హెచ్పీ వరకు వివిధ సామర్థ్యాలున్న ట్రాక్టర్లతో బలమైన పోర్ట్ఫోలియో ఉంది. మూడు తయారీ ప్లాంట్లు, ఏటా 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. హైడ్రాలిక్ మొబైల్ క్రేన్లకు సంబంధించి దేశీ మార్కెట్లో అగ్రగామిగా ఉంటోంది. 1,200 పైచిలుకు డీలర్లతో మార్కెట్లలో విస్తరిస్తోంది.సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ (ఇండియా) పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 925 టార్గెట్ ధర: రూ. 1,333 దేశీయంగా మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఏయూఎం రూ. 71,243 కోట్లుగాను, లోన్ బుక్ రూ. 65,358 కోట్లుగా ఉంది. రిటైల్ లోన్ బుక్ను 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. వార్షికంగా 50 చొప్పున 2026 నాటికి మొత్తం 400 శాఖలు ఏర్పాటు చేయనుంది.శ్రీరామ్ ప్రాపరీ్టస్ ప్రస్తుత ధర: రూ. 106.95 టార్గెట్ ధర: రూ. 152 దక్షిణాదిలో దిగ్గజ రెసిడెన్షియల్ డెవ లపర్లలో ఒకటిగా వ్యాపార వృద్ధి, లాభదాయకతపై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే మూడేళ్లలో 15 ఎంఎస్ఎఫ్ స్థాయిలో విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమపై సానుకూల అంచనాలు ఉండటం, మిడ్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉండటం వంటివి సంస్థకు సానుకూలాంశాలు.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 464.85 టార్గెట్ ధర: రూ. 700 ఇది దేశీయంగా నాలుగో అతి పెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 2021 ఆర్థిక సంవత్సరంలో 40 శాతంగా ఉన్న సెక్యూర్డ్ లోన్ పోర్ట్ఫోలియో 2024 ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండటం, నికర ఎన్పీఏలు తగ్గుతుండటంతో లాభాల మార్జిన్లు మెరుగుపడనున్నాయి. ఏయూఎం వృద్ధి 19–20% అంచనా. పేటీఎం ప్రస్తుత ధర: రూ. 752.25టార్గెట్ ధర: రూ. 900 ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని రూ. 2,000 కోట్లకు జొమాటోకి విక్రయించడం ద్వారా కీలకమైన పేమెంట్, ఆర్థిక సేవలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ డీల్తో నగదు నిల్వలు పెరిగి, భవిష్యత్లో పెట్టుబడులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. విస్తృతమైన మర్చంట్ నెట్వర్క్, పటిష్టమైన సౌండ్–బాక్స్ సబ్్రస్కయిబర్లు సానుకూలాంశాలు.జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ధర: రూ. 80.70టార్గెట్ ధర: రూ. 108 దేశంలోనే రద్దీగా ఉండే రెండు విమానాశ్రయాలను (డీఐఏఎల్, జీహెచ్ఐఏఎల్) నిర్వహిస్తోంది. ఈ రెండింటిలో ప్యాసింజర్ ట్రాఫిక్ గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 13%, 19% మేర వృద్ధి చెందింది. డ్యూ టీ–ఫ్రీ సర్వీసెస్ వంటి నాన్–ఏరోనాటికల్ ఆదాయ వనరులను పెంచుకుంటోంది. గ్రూప్ ఏడీపీతో భాగస్వా మ్యం వల్ల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది.యాక్సిస్ సెక్యూరిటీస్ గ్రావిటా ఇండియా ప్రస్తుత ధర: రూ. 2,000.70 టార్గెట్ ధర: రూ. 3,000 వచ్చే ఏడాది వ్యవధిలో కంపెనీ పటిష్టమైన ఎబిటా నమోదు చేసే అవకాశం ఉంది. వాల్యూమ్స్, ప్రతి టన్నుపై ఎబిటా వృద్ధి మెరుగ్గా ఉండగలవు.అరవింద్ స్మార్ట్ స్పేసెస్ ప్రస్తుత ధర: రూ. 918.75 టార్గెట్ ధర: రూ. 1,085 ఎన్హెచ్47 సూరత్, సౌత్ అహ్మదాబాద్ ప్రాజెక్టుల బుకింగ్స్ సానుకూలంగా ఉండవచ్చు. వీటి నుంచి వరుసగా రూ. 1,100 కోట్లు, రూ. 1,450 కోట్ల మేర రావచ్చని అంచనా.ఐనాక్స్ విండ్ ప్రస్తుత ధర: రూ. 218.70 టార్గెట్ ధర: రూ. 270 2023–24 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ/ఎబిటాలు వార్షిక ప్రాతిపదికన 83 శాతం/90 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా.కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: రూ. 1,386.10 టార్గెట్ ధర: రూ. 2,150 ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉండటంతో దీర్ఘకాలంలో అధిక వృద్ధిని కొనసాగించగలమని మేనేజ్మెంట్ ధీమాగా ఉంది.హెచ్జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ ప్రస్తుత ధర: రూ. 1,331.85 టార్గెట్ ధర: రూ. 1,700వ్యూహాత్మక డైవర్సిఫికేషన్పై దృష్టి పెడుతుండటం సంస్థకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
హరిత దీపావళి జరుపుకొందాం!
భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.భారత్లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్’ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన దశాబ్ద కాలం నుంచి మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్ఏ ఎఫ్ఏఆర్) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది. గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.– సంపతి రమేష్ మహారాజ్ ‘ ఉపాధ్యాయుడు -
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
అయోధ్య దీపోత్సవం.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు
లక్నో: అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించిన దీపోత్సవ వేడుక బాల రాముడి సాక్షిగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హారతి ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు వెలిగించి రికార్టు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నిస్ వరల్డ్ రికార్టును అయోధ్య దీపోత్సవం సాధించింది. గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కన్సల్టెంట్ నిశ్చల్ బరోట్ నేతృత్వంలోని 30 మంది బృందం 55 ఘాట్లలో డ్రోన్లను ఉపయోగించి దీపాలను లెక్కించింది. #WATCH | Ayodhya, Uttar Pradesh: 2 new Guinness World Records created during the #Deepotsav celebrations in AyodhyaGuinness World Record created for the most people performing 'diya' rotation simultaneously and the largest display of oil lamps with 25,12,585 achieved by… pic.twitter.com/ppvlbt17L1— ANI (@ANI) October 30, 2024 ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. లక్షల దీపాలతో సరయూ తీరం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. #WATCH | Uttar Pradesh: Lakhs of diyas illuminated along the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration here. #Diwali2024 pic.twitter.com/P29BPld9KO— ANI (@ANI) October 30, 2024గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో అధికారులు స్థానిక చేతివృత్తుల వారి నుంచి 28 లక్షల దీపాలు ఆర్డర్ చేశారు. ఈ వేడుక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అయోధ్య నగరం అంతటా సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అందులో సగం మంది సాధారణ దుస్తులలో ఉన్నారు. #WATCH | 'Aarti' being performed by Uttar Pradesh CM Yogi Adityanath, Union Minister Gajendra Singh Shekhawat, Deputy CM Brajesh Pathak and others on the banks of Saryu River in Ayodhya #Diwali2024 #Deepotsav pic.twitter.com/FMXzUzokbD— ANI (@ANI) October 30, 2024పదో నంబర్ ఘాట్ వద్ద కార్యక్రమానికి శుభసూచకంగా స్వస్తిక్ రూపంలో సుమారు 80 వేల దీపాలను పెట్టారు. ఘాట్ల వద్ద 5 వేల నుంచి 6 వేల మంది అతిథులు బస చేసేందుకు ఏర్పాటుపూర్తి చేసినట్లు దీపోత్సవ్ నోడల్ అధికారి సంత్ శరణ్ మిశ్రా తెలిపారు. కార్యక్రమానికి హాజరుకాలేని వారి కోసం నలభై జంబో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేశారు.#WATCH | Uttar Pradesh: Laser and light show underway at Saryu Ghat in Ayodhya. With the Ghat lit up with diyas and colourful lights, Ram Leela is being narrated through a sound-light show. #Diwali2024 #Deepotsav pic.twitter.com/pg05s5dX4H— ANI (@ANI) October 30, 2024 ఈ వేడుకలో మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా వంటి ఆరు దేశాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో ఆకట్టుకుంది. -
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి ఒకటి. ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమావాస్యనాడు వచ్చే పండుగ అయినా జగమంతా వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.దీపావళి కథశ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. దీపావళి నాడు ఏం చేయాలి?ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు.దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం. దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీపూజ ఇలా మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. పిండి ముగ్గులతో ముంగిళ్లను తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి. ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు, పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.దీపావళి సందడి మరింతదీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి, వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు. బొమ్మల కొలువుబొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.మతాబులు, చిచ్చుబుడ్లుపూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు. తక్కువ పొగ, శబ్దం వచ్చే క్రాకర్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.ఈ దీపావళి అందరికీ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం. -
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
‘అయోధ్య దీపోత్సవ్కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’’అలాగే.. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2024క్లిక్ చేయండి: పులివెందులలో.. జనంతో జగన్ -
దీపావళి వేడుకలు: అయోధ్య నుంచి అమృత్సర్ వరకూ..
దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.అయోధ్యఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వారణాసికాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.ఉదయపూర్రాజస్థాన్లోని ఉదయపూర్ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్లు విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అమృత్సర్అమృత్సర్లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.కోల్కతాపశ్చిమబెంగాల్లో దీపావళి నాడు కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
ఒకటిన బద్రీనాథ్, కేదార్నాథ్లో దీపావళి వేడుకలు
డెహ్రాడూన్: దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్లలో నవంబర్ ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ఉత్తరాఖండ్ అంతటా నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. బద్రీనాథ్ ధామ్కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చింది. ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉంటుంది. దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుంది.నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుగా నవంబర్ 1న దీపావళి సెలవు ప్రకటించింది. అయితే తరువాత దానిని సవరించి అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. తిరిగి ఇప్పుడు దీపావళి అధికారిక సెలవుదినం నవంబర్ ఒకటిగా పేర్కొంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలలో నవంబర్ ఒకటిన దీపావళిని జరుపుకోవాలని తెలియజేశాయని, అందుకే ఉత్తరాఖండ్లో నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకుంటున్నట్లు రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య నిపుణులు తెలిపారు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్.. సురక్షితం.. కాలుష్య రహితం
దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.remote control ignition device for crackers दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024 ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్లు, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
ఫ్లిప్కార్ట్ సరికొత్త రికార్డ్: పండుగ సీజన్లో..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ పండుగ సీజన్లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్కార్ట్ను సందర్శించినట్లు సమాచారం.కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.ఎక్కువ మంది పండుగ సీజన్లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్టాప్లు, టాబ్లెట్ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.సమర్థ్ సేల్ ఈవెంట్పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్లతో పండుగ సీజన్ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్లక్షకు పైగా ఉద్యోగాలుపండుగ సీజన్లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్లో ఫ్లిప్కార్ట్.. కస్టమర్లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది. -
వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు
దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది. అమెరికాలోని అత్యంత ఎత్తైన భవనమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్హౌస్లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ లైట్లు ట్విన్ టవర్స్ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. న్యూయార్క్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దీపోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. #WATCH दिवाली से पहले अमेरिका की सबसे ऊंची इमारत वन वर्ल्ड ट्रेड सेंटर को रंग-बिरंगी रोशनी से जगमग किया गया।(सोर्स: इंडिया इन न्यूयॉर्क) pic.twitter.com/Z81Zd0rrtp— ANI_HindiNews (@AHindinews) October 30, 20242021లో తొలిసారిగా న్యూయార్క్లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వేడుకలు జరిగాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. నాటి నుంచి ప్రతీయేటా దీపావళి నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ను అందమైన లైట్లతో అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు మత సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం నేడు (అక్టోబర్ 30) మరో రికార్డుకు వేదికకానుంది. ఈ రోజు అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.అయోధ్యలో ఈరోజు సాయంత్రం జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వెలుగుల పండుగలో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్ కీ పైడీతో సహా 55 ఘాట్ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది.దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లేజర్ షో, బాణసంచా కాల్చడం, రాంలీల ప్రదర్శనలు ఉండనున్నాయి.ఈ ఏడాది జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. దీనితరువాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో స్థానికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈరోజు జరిగే దీపోత్సవంలో సరయూ ఒడ్డు, రామ్కీ పైడీ, ఇతర 55 ఘాట్లలో 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిని వెలిగించి పాత రికార్డును బద్దలు కొట్టడం ద్వారా గిన్నిస్ బుక్లో కొత్త రికార్డు నమోదు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది.గత ఏడాది దీపోత్సవంలో 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈసారి జరుగుతున్న దీపోత్సవంలో అవధ్ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు తమ సేవలు అందిస్తున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు -
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్హౌజ్లోని బ్లూ రూమ్లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్రూమ్లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
బడ్జెట్ ధరలో బెస్ట్ స్కూటర్లు: గొప్ప మైలేజ్ కూడా..
ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్స్ మార్కెట్లలో ఒకటైన భారత్లో.. ఎప్పటికప్పుడు సరికొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కొత్త టూ వీలర్స్ లాంచ్ అయినా.. ప్రజలు మాత్రం ఎక్కువగా కొన్ని స్కూటర్లను మాత్రమే ఎంపిక చేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ దీపావళికి ఓ మంచి స్కూటర్ కొనాలనుకునే వారికి కూడా అలాంటివి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.హోండా యాక్టివాభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా అగ్రగామి అనే చెప్పాలి. ఇది ఇప్పటికే మూడు కోట్లు కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. ప్రస్తుతం యాక్టివా 125, యాక్టివా 6జీ వంటి రూపాల్లో అందుబాటులో ఉంది.యాక్టివా 125 ధర రూ. 84,085 నుంచి రూ. 92,257 మధ్య ఉంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 51.23 కిమీ మైలేజ్ అందిస్తుంది. యాక్టివా 6జీ విషయానికి వస్తే.. దీని ధర రూ. 79624 నుంచి రూ. 84624 మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 59.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ జుపీటర్హోండా యాక్టివా తరువాత అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ టీవీఎస్ జుపీటర్. ఇది జుపీటర్ 110, జుపీటర్ 125 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.జుపీటర్ 110 ధర రూ. 77,400 నుంచి రూ. 90,150 మధ్య ఉంది. ఇది 113.3 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 62 కిమీ మైలేజ్ అందిస్తుంది. జుపీటర్ 125 విషయానికి వస్తే.. దీని ధర రూ. 89,155 నుంచి రూ. 99,805 మధ్య ఉంది. ఇది 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 57.27 కిమీ మైలేజ్ అందిస్తుంది.హోండా డియోఎక్కువ మంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో హోండా డియో కూడా ఒకటి. రూ. 75630 నుంచి రూ. 82580 మధ్య ధరతో (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇది 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.సుజుకి యాక్సెస్ 125ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 83,482 నుంచి రూ. 94,082 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇందులోని 124 సీసీ పెట్రోల్ ఇంజిన్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎన్టార్క్ 125టీవీఎస్ ఎన్టార్క్ 125 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 93,126 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 47 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఓ మంచి స్టైలిష్ స్కూటర్ కావాలనుకునే వారికి ఈ స్కూటర్ ఓ మంచి ఎంపిక అవుతుంది. -
థాయ్లాండ్లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్లాండ్లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
సింగం పాఠశాలలో దీపావళి వేడుకలు
సోలాపూర్: దత్తు నగర్లోని దత్తు మందిర్ దేవస్థానం కమిటీ దివంగత వెంకటనరసు వీరయ్య సింగం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీపావళి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను అప్రతిమంగా తయారుచేసి తీర్చిదిద్దారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త గణేశ్ రంగయ్య గుడుమల్ పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు సకినాలు, గారెలు, మడుగులు, శంకరపల్లిలు, లడ్డూ వంటి ఫలహారాల పాకెట్లను పంపిణీ చేశారు. అలాగే సంజయ్ మడూర్ తరఫున ఉపాధ్యాయులకు దీపావళి బహుమతులు అందజేసి సన్మానించారు. (ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి)ఈ సందర్భంగా దత్త మందిర్ దేవస్థానం సంస్థ కమిటీ అధ్యక్షుడు మహేశ్ దేవసాని, సంజయ్ మడూర్, కిశోర్ దేవసాని, గణేశ్ దేవసాని, నరేశ్ దేవరశెట్టి, దామోదర్ మాచర్లను దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ దేవసాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పర్వదినాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలు పేదలు కూడా సనాతన కాలంగా వస్తున్న దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి
ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. . -
దీపావళి ఔట్ ఫిట్: రాశీఖన్నా రీగల్ లుక్ (ఫొటోలు)
-
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం