Expert advice
-
ఇంద్రుడిలా.. ఇన్కం ట్యాక్స్ వాళ్లు..
ఇంద్రుడికి వేయి కళ్లున్నాయి అనేది నాటి కథ. పురాణ కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది నేటి కథ. జరగబోయే కథ. ఇన్కం ట్యాక్స్ వాళ్లు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాలను వాడుతూ, ఎన్నో రాళ్లు రువ్వుతున్నారు రతనాల కోసం. ప్రతి రాయీ రత్నం అవుతోంది. ఆదాయాన్ని తెస్తోంది. వారి దగ్గర ఉన్నది ‘‘డేటా’’ కాదు .. మీ బ్యాంకు బ్యాలెన్సు. ఆదాయాన్ని అసెస్ చేసి, వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ మైమరచిపోయే రోజులు పోయాయి. అరకొర సిబ్బంది ఏమీ చేయలేరని అనుకోకండి. అర కొర సిబ్బందికి కొత్త కోరలు వచ్చాయి. ఇక జాగ్రత్త.‘‘సంసారం గుట్టు .. రోగం రట్టు’’ అనేది ఒక సామెత. ‘‘సంపాదన గుట్టు, రోగం గుట్టు’’ అనే వాళ్లూ ఉన్నారు. మగవాడి జీతం అడగకూడదనే నానుడి ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. సీక్రెసీ లేదు. ప్రైవసీ లేదు. ఇనుపపెట్టెలో రొక్కం, బీరువాలో నగలు, లాకర్లో బంగారం, స్విస్ బ్యాంకులో జమలు.. ఇవన్నీ తెలుసుకుంటున్నారు.మనం మన వంటికి ‘కవచకుండలం’లాగా భావించే సెల్ఫోన్ నిజానికి కవచ కుండలం కాదు. డేటాను వెదజల్లే కుండ. మన సంభాషణలు, వాట్సప్లో సందేశాలు, ఈమెయిళ్లు, గూగుల్ చెల్లింపులు, పేటీఎం చెల్లింపులు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లు, స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు, విదేశీ ప్రయాణాలు, పండగ ఆఫర్లు, బంగారం కొనుగోళ్లు ప్రతీదీ తెలిసిపోతుంది. అలాగే బిల్డర్లతో, బ్రోకర్స్తో, బ్యాంకర్లతో, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్తో, వ్యాపారవేత్తలతో స్నేహితులతో, పిల్లలతో, భాగస్వాములతో జరిపే ఈమెయిల్స్ సంభాషణలు, మన ఇన్స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, లింక్డిన్ ఖాతాలు మొదలైన వివరాలన్నీ తెలిసిపోతాయి.2026 ఏప్రిల్ 1 నుంచి అంటే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్కం ట్యాక్స్ అధికారులకు ఇంద్రుడిలాగా విస్తృత అధికారాలు ఇచ్చారు. మీ సోషల్ మీడియా అకౌంటు, బ్యాంకు అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు ... ఇలా అన్నీ చెక్ చేయొచ్చు. బ్యాంకు లాకర్లు పగలకొట్టడం విన్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ సిస్టంను బ్రేక్ చేస్తారు. వర్చువల్ డిజిటల్ స్పేస్లో ప్రవేశిస్తారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్స్ని ఇన్వాల్వ్ చేసి మన సమాచారం తప్పని, తక్కువని, పూర్తిగా జరిపిన వ్యవహారాలన్నీ చూపించి మన జాతక విశ్వరూప ప్రదర్శనం చేసి వారి ‘‘విశ్వరూపాన్ని’’ చూపిస్తున్నారు. మేఘాల్లో (క్లౌడ్) నుంచి కూడా సమాచారాన్ని సంగ్రహించి, అసెస్మెంట్ చేస్తున్నారు. వెబ్సైట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ ప్లాట్ఫాంలు దేన్నీ వదలడం లేదు. ‘‘ఇందుగలడందు లేడ’’ని చెప్పినట్లు, ఎక్కడికైనా వెళ్తారు. ఆగమేఘాల మీద రావడం అంటే ఇదేనేమో.అధికార్లు ఎందుకు వస్తారు... నా ప్రైవసీలోకి రావచ్చా.. ఇది రాజ్యాంగబద్ధమా.. ఇది హక్కులు నేలరాయటం కాదా లాంటి ప్రశ్నలు వెయ్యకండి. కొత్త బిల్లులో నిర్వచనం చాలా పకడ్బందీగా రాశారు. ఉద్యోగి సిస్టం ద్వారా యజమాని వివరాలు తెలుసుకుంటారు. అంతే కాకుండా కొన్న సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లు వెనక్కు వెళ్తారు. అందుకని జాగ్రత్త వహించండి. మనం ఎవరికీ తెలియకుండా వ్యాపారం/వ్యవహారం చేస్తున్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగుకి, అన్నదమ్ములకు తప్ప అందరికీ తెలుస్తుంది. ‘కాగల కార్యం గంధర్వులే’ తీర్చినట్లుగా తెలియకూడని వాళ్లకే సర్వం తెలిసిపోతోంది. ‘సర్వం జగన్నాధం’.అయితే, ఈ అధికారాలు దుర్వినియోగం కాకూడదు. అందరికీ సమానంగా, అంటే పన్ను ఎగవేసే ప్రతి బడాబాబుకీ వర్తించేలా, బంధుప్రీతి లేకుండా, కక్ష సాధింపులా కాకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగితే ఎంతో మంచిది. అదే విశ్వకల్యాణం.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శివకుమార్ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. అయితే 50–60 శాతం పెట్టుబడులను మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్తో పోర్ట్ఫోలియో నిర్మించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్క్యాప్ పెట్టుబడులు 25 - 30 శాతానికి పరిమితం అవుతాయి.లార్జ్క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి 50–60 శాతం కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలకు గురవుతుంది.చైనా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలని ఉంది. ఇందుకు ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయా? – యోగితా రాణాఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా వైవిధ్యం చేసుకోవాలన్న మీ ఆలోచన అభినందనీయం. అయితే ఈ వైవిధ్యం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. కేవలం చైనాలో ఇన్వెస్ట్ చేసేవి లేదా కేవలం యూఎస్లో ఇన్వెస్ట్ చేసే వాటితో కాన్సన్ట్రేషన్ రిస్క్ (పెట్టుబడి ఒకే చోట ఉండిపోవడం) ఏర్పడుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది చక్కటి వైవిధ్యంతో ఉండాలి. ఇన్వెస్టర్లు కేవలం ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే వాటికి దూరంగా ఉండడం మంచిది.యూఎస్ ఫండ్స్కు ఇందులో కొంత మినహాయింపు ఉంది. యూఎస్కు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపనీల్లో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యూఎస్ కంపెనీలను పరిశీలిస్తే అవి కేవలం యూఎస్కే పరిమితం కాకపోవడాన్ని గుర్తించొచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు (గూగుల్, మెటా, యాపిల్ తదితర) అంతర్జాతీయంగా కస్టమర్లు ఉంటారు. ఆయా కస్టమర్లు కేవలం యూఎస్లోనే ఉండరు. కనుక యూ ఎస్కు చెందిన ఫండ్ ఒకే ప్రాంతానికి చెందినది అయినప్పటికీ, అంతర్జాతీయ ఎక్స్పోజర్ను ఇస్తుంది.ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 5 - 10% మించకుండా చైనా స్టాక్స్కు కేటాయించుకునేట్టు అయితే.. యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఎఫ్వోఎఫ్ డైరెక్ట్ ఫండ్, ఎడెల్వీజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్షోర్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్సెంగ్ టెక్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్సెంగ్ బీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్. -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్లలో వారాంతపు ట్రేడింగ్లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్.. ఫండ్స్లోనా లేదా స్టాక్స్లోనా..?
రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణిమీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.1. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.4. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు. -
డిపాజిట్లా.. స్టాక్మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?
చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.1. పోస్ట్ఆఫీస్వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.* ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. * చాలా తక్కువ రాబడి. * పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. * డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. * ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు. * ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.2. బ్యాంకు డిపాజిట్వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. * ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. * తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) చార్జీలు వసూలు చేస్తారు.* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్ను ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు. * మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.3. స్టాక్ మార్కెట్కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. * డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. * పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. * పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం). * మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. * బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్కు మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. * చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే 'రాజా ది గ్రేట్'
వీటి గురించి లోతుపాతుల్లోకి వెళ్లేముందు డీమ్యాట్ ఖాతాల గురించి తెలుసుకోవాలి. కోవిడ్కు ముందు వరకూ.. అంటే 2020 మార్చి వరకు దేశంలో దాదాపు 4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే.. కేవలం నాలుగున్నరేళ్ల వ్యవధిలో అవి 17 కోట్లు దాటేశాయి. సుమారు నాలుగు రెట్లు పెరిగాయన్న మాట.ఇలా ఖాతాలు తెరిచినవాళ్లు ఊరకనే ఉంటారా.. ఉండరు కదా.. కొంత డబ్బులు పట్టుకెళ్లి డీమ్యాట్ ఖాతాకు మళ్లించడం.. ఆ తరువాత ట్రేడ్ చేయడం మొదలెట్టారు. వీళ్లల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు తక్కువే.. 100 కి 95 మంది తమ కష్టార్జితాన్ని ట్రేడింగ్ వైపే మళ్లిస్తున్నారు. దీనికి కారణం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించేయవచ్చన్న అత్యాశ.సంపాదించొచ్చు.. తప్పు లేదు. మనం డిగ్రీ దాకా వచ్చామంటే ముందు అ, ఆ లు నేర్చుకుని, ఆ తర్వాత ఒక్కో తరగతి పాస్ అవుతూ వచ్చాం కదా.. మరి ఇదే సూత్రం మార్కెట్కి కూడా వర్తిస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి.. చేతిలో డబ్బులున్నాయి కదా అని, ఒకేసారి భారీగా సంపాదించేయాలని ఉబలాటపడిపోతారు.వెంటనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. స్కాల్పింగ్ స్ట్రాటజీ తో నిమిషాల్లో అధిక లాభాలు వస్తాయనే ఓ థంబ్నెయిల్ కనిపిస్తుంది. అది బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది. వెంటనే అది చూసి ట్రేడింగ్ మొదలెట్టేస్తారు. నిమిషాల్లో లాభాలు కళ్ళచూడొచ్చని ఆ పెద్ద మనిషి చెప్పింది వాస్తవమే.. కానీ అక్కడ మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలు చెబుతాడు ఆ వీడియో పెద్ద మనిషి. కానీ మనోడు అవేవీ తలకెక్కించుకోడు. ఫలితం నిమిషాల్లో సంపాదించడం మాట అటుంచి.. ఉన్నది మొత్తం నిమిషాల్లో పోగొట్టుకుంటాడు.ఈతరహా వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు.. ఒకళ్ళు పోగొట్టుకున్న దానితో కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో ఆచితూచి వ్యవహరిస్తారు. అంటే.. అన్నీ తెలుసుకున్నాకే మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెడతారు.ఇక రెండోరకం... వీళ్ళు సబ్జెక్టు నేర్చుకోవడం మాట అటుంచి.. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించేయాలని ఈసారి గతంలో కంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు తెచ్చి మార్కెట్లో పెడతారు. ఈసారి సక్సెస్ కారు. అది కూడా పోగొట్టుకుంటారు. అటు బయటకు చెప్పుకోలేక, ఇటు దుఃఖాన్ని దిగమింగుకోలేక వేదన అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకి వీళ్ళ ఆర్ధిక జీవితం అతలాకుతలం అయిపోయినట్లే.ఇలా తప్పుల మీద తప్పులు చేసేవాళ్లను ఎవరూ మార్చలేరు. వారి ఖర్మకి వారినే వదిలేయడం తప్ప. ఇప్పుడు మనం పైన ప్రశ్నించుకున్న పాయింట్లకొద్దాం.మీరు ఏ సంప్రదాయ పెట్టుబడులు పరిగణనలోకి తీసుకున్నా వాటికి మించి రెండింతలు, మూడింతలు, అంతకుమించి ఇవ్వగల సామర్ధ్యం స్టాక్ మార్కెట్కు ఉంది. మీరు చేయాల్సిందల్లా.. సరైన స్టాక్నుసెలెక్ట్ చేసుకోవడం. ముందు మీ దగ్గర పెట్టుబడి పెట్టదగ్గ సొమ్ములు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఆ తర్వాత అందులో సగం డబ్బుల్ని మాత్రమే పెట్టుబడుల వైపు మళ్లించండి.ఉదా: మీదగ్గర ఓ రూ. 2 లక్షలు ఉన్నాయి అనుకుందాం. అందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టండి. అయితే ఆ లక్షతో ఏ షేర్లు కొనాలనే సందేహం రావొచ్చు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్లో 30 షేర్లు ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి విషయానికొస్తే దీని ప్రామాణిక సూచీ నిఫ్టీ. దీంట్లో 50 షేర్లు ఉంటాయి. పెట్టుబడులకు వీటిని ఎంచుకోవచ్చు.ఈ షేర్లు మార్కెట్ పడినా పెద్దగా పడిపోవు. మళ్ళీ మార్కెట్లో రికవరీ రాగానే ఇవి పెరగడం మొదలెడతాయి. కాబట్టి మీరు కొన్న తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో షేర్ ధర క్షీణించినా... ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అలాకాక తక్కువ రేటుకు వస్తున్నాయి అనో, ఎక్కువ పరిమాణంలో కొనేయొచ్చనో డబ్బులతో ప్రయోగాలు చేయకండి.ఉదా: మీదగ్గరున్న లక్షతో 10 రూపాయల లోపు ఉండే షేర్లు 10,000 రావొచ్చు. అయితే అవి ఒక రూపాయి పెరగడానికి ఒక్కోసారి ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు. పైగా వాటిలో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే.. మనకు డబ్బులు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుందామంటే కొనే నాథుడు ఉండదు. అలా ఇరుక్కుపోతారు.అదే మంచి లిక్విడిటీ ఉండే నిఫ్టీ, సెన్సెక్స్ షేర్లలో పెట్టుబడి పెడితే ఒకవేళ మార్కెట్ పడినా.. తర్వాత రికవరీ లో మంచి ప్రాఫిట్స్ అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి సొమ్ములు చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మంచి స్టాక్ను ఎంచుకోవడం. అదెలా అన్నది మరోసారి విశ్లేషించుకుందాం.ఇతర మార్గాలతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో కచ్చితంగా మంచి డబ్బులే సంపాదించవచ్చన్నది నా మాట. నాలెడ్జి లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తేనే అసలు ముప్పంతా. అంచేత ముందు సబ్జెక్టు తెలుసుకోండి. అధిక రాబడి ఇవ్వగల సామర్ధ్యం మార్కెట్కు ఉంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవడమే మీ చేతుల్లో ఉంది. ఇదొక రెండో ఆదాయ మార్గపు వనరుగా భావించి ఒక క్రమ పద్ధతిలో, అత్యాశకు పోకుండా పెట్టుబడి మార్గంగా వినియోగించుకొంటే మీరు భవిష్యత్లో 'రాజా ది గ్రేట్' అవుతారనడంలో సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు. -
సిప్తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్లో ప్రస్తుత పోర్ట్ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు. -
నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా? – వికాస్ సింగ్మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి. నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది? – పి.కె గుప్తాస్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది. -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
రూ.1.5 కోట్లు వచ్చాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఒక ప్రాపర్టీ అమ్మగా రూ.1.5 కోట్లు వచ్చాయి. వచ్చే 12 ఏళ్ల వరకు వీటితో నాకు అవసరం లేదు. కనుక వీటిని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను సహేతుక స్థాయిలో రిస్క్ తీసుకోగలను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎంపిక చేసుకోవాలి? రూ.1.5 కోట్లను మొత్తం ఎన్ని నెలల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లించాలి? నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ మాదిరి ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక చేసుకోవచ్చా? – రాజన్ప్రాపర్టీ అమ్మగా వచ్చిన రూ.1.5 కోట్లు.. మీ మొత్తం సంపద విలువలో 50–60 శాతంగా ఉంటే కనుక, ఇక్కడి నుంచి మూడేళ్ల కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే మార్కెట్ ఓ పది శాతం మేర పడిపోతే అప్పుడు భావోద్వేగ పరమైన రిస్క్ సులభంగా అధిగమించేందుకు ఇలా చేయాలి. ఒకవేళ మీరు చెప్పిన రూ.1.5 కోట్లు మీ మొత్తం సంపదలో కేవలం 10–15 శాతంగానే ఉంటే అప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పలు వాయిదాలుగా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.12 ఏళ్ల కాలం ఈక్విటీ పెట్టుబడులకు అనుకూలమైనది. కనుక మీ పెట్టుబడుల్లో 20–50 శాతం మేర మిడ్క్యాప్, స్మాల్క్యాప్, మైక్రోకాŠయ్ప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో లార్జ్క్యాప్ ఫండ్స్కు ఎక్కువ మొత్తం కేటాయించుకోవడం వల్ల అనిశ్చిత సమయాల్లో పోర్ట్ఫోలియోకి స్థిరత్వం ఉంటుంది. నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ మంచి ఆప్షన్. ఇది ప్యాసివ్ పథకం.కనుక నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. యాక్టివ్గా పనిచేసే మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ను సైతం పరిగణనలోకి తీసుకోవచ్చు. యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ మిశ్రమంగా ఉండడం పోర్ట్ఫోలియోకి మంచిది. సరైన యాక్టివ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు ప్యాసివ్ ఫండ్స్కు పరిమితం కావొచ్చు. ఒకే సూచీని అనుసరించి పనిచేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – వేణుగోపాల్ఒకే సూచీని అనుసరించి ఇన్వెస్ట్ చేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఒకేసారి కాకుండా వివిధ సమయాల్లో ప్రారంభమవుతుంటాయి. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ.. 2022లో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్తో పోల్చితే 22 ఏళ్ల కాలం పాటు వృద్ధి చెందుతూ వచ్చింది. కనుక దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ఎన్ఏవీ రూ.10 అయినా లేక రూ.100 అయినా ఇండెక్స్ పనితీరు ఆధారంగానే రాబడులు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇండెక్స్లో ఎంత శాతం మేర మార్పు వచ్చిందన్నదే ముఖ్యంగా చూడాలి కానీ, ఎన్ఏవీ కాదు. సెన్సెక్స్ 10 శాతం పెరిగితే అప్పుడు సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసే వివిధ ఫండ్స్ ఎన్ఏవీ రూ.10, రూ.100గా ఉన్నప్పటికీ అవి కూడా 10 శాతమే పెరిగి ఉంటాయ్. కనుక ఎన్ఏవీతో సంబంధం లేకుండా ఇండెక్స్ ఆధారితంగా పథకం ఎన్ఏవీలో వృద్ధి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి! -
పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే.. తస్మాత్ జాగ్రత్త!
పన్ను తప్పకపోవచ్చు. అలాంటప్పుడు కట్టడమే.. నాగరిక పౌరుల బాధ్యత. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పన్ను చెల్లించకపోవడమే ‘ఎగవేత’. ఈ ‘ఎగవేత’ సముద్రంలో ఎందరో గజ ఈతగాళ్లను ఏరిపారేసిన చట్టాలున్నాయి. దాని ఊసెత్తకండి. ఎన్నెన్నో మార్గాలు.ఆదాయాన్ని చూపించకపోవడం, ఆదాయం తక్కువ చేయడం, పన్ను చెల్లించకపోవటం, తప్పుడు లెక్కలు చూపడం, లెక్కలు రాయకపోవడం, స్మగ్లింగ్, దొంగ కంపెనీలు, తప్పుడు బిల్లులు, బ్లాక్ వ్యవహారాలు .. ఇలా శతకోటి మార్గాలు. కొన్ని పరిశ్రమ రంగాల్లో అవకాశం ‘ఎండమావి’లాగా ఎదురుచూస్తుంది. సినిమా రంగం, రియల్ ఎస్టేట్, కొన్ని వస్తువుల ఉత్పత్తిలో, బంగారంలో, షేరు మార్కెట్, వ్యవసాయం, బెట్టింగ్, పందాలు, అస్తవ్యస్తమైన రంగాలు.. ఇలా ఎన్నో. చట్టాన్ని అనుసరించడానికి ఒకే మార్గం. రాచమార్గం ఉంటుంది. అతిక్రమించడానికి అన్నీ అడ్డదార్లే.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 1. తనిఖీ చేయడం 2. సమన్లు ఇవ్వటం 3. పిలిచి ఎంక్వైరీ చేయడం 4. సెర్చ్ 5. సీజ్ చేయడం 6. సర్వే చేయడం 7. ఇతరులను కూడా ఎంక్వైరీ చేయడం 8. సాక్ష్యాలను సేకరించటం 9. పన్ను కట్టించడం (కక్కించడం) 10. వడ్డీ, రుసుములు, పెనాల్టీ విధించడం 11. జైలుకి పంపడం ఇలా ఎన్నో విస్తృత అధికారాలు ఉన్నాయి.బినామీ వ్యవహారాల చట్టం.. ఇది సునామీలాంటి చట్టం. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత చేస్తుంటారు. ఈ చట్టం ప్రకారం అధికార్లకు నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీలు, వ్యవహారంలో ఉన్న ఆస్తులను జప్తు చేయడం మొదలైన అధికారాలు ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం ప్రపంచంలో జరిగే వ్యవహారాల మీద నిఘా ఉంటుంది. విదేశీయులతో వ్యవహారాలు, ఎక్స్చేంజ్ వ్యవహారాలు, అనుమతులు లేకుండా ఆస్తుల సేకరణ, ఆస్తులను ఉంచుకోవడం, వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా లబ్ధి పొందడం .. ఇలాంటి వాటిపై అధికార్ల వీక్షణం తీక్షణంగా ఉంటుంది. అన్యాయంగా వ్యవహారాలు చేస్తే, తప్పులు చేస్తే ఉపేక్షించదు ఈ చట్టం. అతిక్రమణ జరిగితే ‘అంతే సంగతులు’ .. శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.మనీలాండరింగ్కి సంబంధించిన చట్టం.. అక్రమంగా పొందిన డబ్బుని దాచి.. కాదు దోచి.. దాని మూలాలను భద్రపర్చి.. పన్ను కట్టకుండా.. లెక్కలు చూపకుండా .. దానికి ‘లీగల్’ రంగు పూసే ప్రయత్నమే మనీలాండరింగ్. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధం. ఇందులో ఎందరో బడాబడా బాబులు ఇరు క్కుని జైలు పాలయ్యారు. హవాలా వ్యవహారాలు మొదట్లో హల్వాలాగా ఉంటాయి. హలీంలాగా నోట్లో కరిగిపోతాయి. కానీ అవి చాలా డేంజర్. అలవాట్లకు బానిస అయి, తాత్కాలిక ఆర్థిక ఒత్తిళ్లకు తలవంచి ‘లంచావతారం’గా మారిన వారు ఉద్యోగాలు కోల్పోయి.. ఉనికినే కోల్పోయారు. కాబట్టి, సారాంశం ఏమిటంటే ‘ఎండమావి’ భ్రమలో పడకండి. చక్కటి ప్లానింగ్ ద్వారా చట్టప్రకారం సరైన దారిలో వెళ్లే ప్రయత్నం చేయండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – సుర్జిత్ సింగ్ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. ఇక మీ వద్దనున్న రూ.12లక్షలను ఈ ఫండ్స్లో ఒకే విడతలో పెట్టేయకూడదు.12 నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఈక్విటీ ఆటుపోట్లను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత ఈక్విటీలు 20 శాతం పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆందోళనకు గురికావొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపంలో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగంలో ఏ పథకాలను ఎంపిక చేసుకోవాలి. – శిల్పారామన్దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడం కష్టం. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ స్టాక్స్ మంచి ప్రదర్శన చేస్తాయి.కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక అన్నింటిలో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంతో ఆ సైకిల్ను అధిగమించగలరు. -
IT Return: పొరపాటు జరిగిందా? రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు..
ఒరిజినల్ రిటర్ను వేశారు. వెరిఫై కూడా అయింది. కానీ మీరు ఆ రిటర్నుని చెక్ చేసుకుంటే, ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుని రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరుగుతాయంటే .. » కూడిక, తీసివేతల్లో తప్పులు » ఆదాయం మర్చిపోవడం.. పరిగణనలోకి తీసుకోకపోవడం » ఆదాయం లెక్కించడంలో పొరపాటు జరగడం » మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవి మర్చిపోవడం » ట్యాక్స్ లెక్కింపులో తప్పులు » టీడీఎస్లో పొరపాట్లు » అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినవి మర్చిపోవడం » మినహాయింపు మొదలైనవాటిని తప్పుగా, ఎక్కువగా క్లెయిమ్ చేయడం » బ్యాంకు అకౌంటు వివరాలు తప్పుగా ఇవ్వడం » ఒక ఫారంనకు బదులుగా మరొక ఫారం వేయడంసెక్షన్ 139(5) ప్రకారం మీరు మీ ఒరిజినల్ రిటర్నుని రివైజ్ చేసుకోవచ్చు. రివైజ్డ్ రిటర్న్ అంటేనే ఒరిజినల్ రిటర్న్కి బదులుగా అని .. మరొక రకంగా ‘రిప్లేస్మెంట్’ అని చెప్పవచ్చు. ఇలా వేయడంలో గతవారం చెప్పినట్లుగా రూ. 1,000/5,000 చెల్లించనవసరం లేదు. మీరు సకాలంలో వేసినట్లే. అయితే, పన్ను కట్టాల్సి ఉంటే పన్నుతో పాటు వడ్డీ చెల్లించాలి.ఎప్పటిలోగా ఈ రిటర్ను వేయొచ్చు.. మీరు వేసిన ఒరిజినల్ రిటర్నుకి సంబంధించి అసెస్మెంట్ ఆర్డర్లు వచ్చేలోగా లేదా 2024 డిసెంబర్ 12లోగా .. (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది). గడువుతేదీ తర్వాత రిటర్ను వేసిన వాళ్లు కూడా రివైజ్డ్ రిటర్ను వేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు .. అంటే ఎన్నిసార్లయినా రివైజ్ చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. అలా అని మాటిమాటికీ చేయకండి.రివైజ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి సుమా.. » మళ్లీ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోండి » సమగ్రంగా అన్ని వివరాలు సేకరించండి » రివైజ్ రిటర్న్ ఆప్షన్ను ఎంచుకోండి » సరైన ఐటీఆర్ను ఎంచుకోండి » ఒరిజినల్ రిటర్ను వివరాలన్నీ ఇవ్వాలి లేదా అప్లోడ్ చేయాలి » మిగతా పద్ధతంతా షరా మామూలేమనంతట మనమే రివైజ్ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేయడం సబబు కాదు. సమంజసం కాదు. రివైజ్ చేయడానికి కారణాలు సాంకేతికపరమైనవి, చిన్న చిన్నవైతే ఫర్వాలేదు. కానీ పెద్దవి అయితే మాత్రం మీ రివైజ్డ్ రిటర్నుని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్డెస్క్ -
ఫండ్స్ కంటే పీఎంఎస్ నయమా?
మ్యూచువల్ ఫండ్స్లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా? – విష్ణు నివాస్పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం.మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అద్వైత్మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6–12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్–ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
విదేశాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా..
విదేశాల వెళ్లాలనుకునేవారికి ఇన్కంట్యాక్స్ డిపార్టుమెంటు వారి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా అనే ప్రశ్న ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సుందరకాండలో హనుమంతుడి జవాబులాగా ‘‘అక్కర్లేదు’’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..ఈ మధ్యే ఆర్థిక శాఖ తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలో విదేశీయానం చేసేవారంతా ఆదాయపు పన్ను శాఖ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ధ్వనించింది. దీంతో అందరు పౌరులు ఉలిక్కిపడ్డారు. గాభరా పడ్డారు. షాక్ తిన్నారు. ఎందుకంటే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసేందుకు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వయంగా చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు.2023 మార్చి 31తో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 69.6 మిలియన్ల మంది విదేశీయానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అన్ని రకాల వారూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఆపాటి, ఈపాటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో విదేశీయానం చెయ్యని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.బడ్జెట్లో ఒక కొత్త మార్పు వచ్చింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం మొదలైనవాటిని చూపించని ఎంతో మంది భారతీయ పౌరులు ఉన్నారు. బ్లాక్మనీ 2015 చట్టం ప్రకారం ఇలాంటి ఆస్తులను చూపించకపోవటం నేరం. ఇలాంటి వారి మీద దృష్టి పెడుతోంది డిపార్టుమెంటు. ఒకప్పుడు ఎవరు విదేశీయానం చేసినా, ప్రయాణానికి ముందు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిబంధన ఉండేది. దాన్ని సడలించారు. రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా 1/4 బిఅని 1/6 అని షరతులు ఉండేవి. ఒక షరతు ప్రకారం స్వయంగా విదేశీయానం చేయకపోయినా ‘టికెట్’ కొని ఉంటే రిటర్నుల్లో చూపించాల్సి వచ్చేది. కాలక్రమేణా సరడలింపుల వల్ల అంతా మర్చిపోయారు.కానీ మొన్న బడ్జెట్లో ఈ ప్రస్తావన రావడంతో అందరిలోనూ గుబులు.. కానీ నిబంధన కొంతమందికే వర్తిస్తుంది. తల్లిదండ్రులెవరూ భయపడక్కర్లేదు. డిపార్టుమెంటుకి వెళ్లక్కర్లేదు. సర్టిఫికెట్ తీసుకోనవసరం లేదు. రిలాక్స్.. రిలాక్స్.. అందరికీ ఇది అవసరం లేదు. మీరంతా నిశ్చింతగా ప్లాన్ చేసుకోవచ్చు.ఎవరికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి..ఆర్థికపరంగా అవకతవకలు చేసినవారు, పది లక్షలు దాటి పన్ను చెల్లించాల్సిన వారు, ఈ పన్ను భారానికి ‘స్టే’ విధించకపోతే.. ఇటువంటి వారికి కావాలి. ఇది అరుదైన పరిస్థితి. అసాధారణ పరిస్థితి. ట్యాక్స్ చెల్లించకపోవడం నేరం. కట్టకుండా విదేశాలకు వెళ్లే వారి నుంచి .. అంటే డిఫాల్టర్ల నుంచి పన్ను వసూలు చెసే ప్రక్రియలో భాగంగా ఈ సర్టిఫికెట్ అడుగుతారు. పైన చెప్పిన రెండు షరతులు ఫిబ్రవరి 2004 నాడు జారీ చేసిన సూచన .. కాదు.. ఆదేశం అని అనాలి. అంటే 20 సంవత్సరాల మాట .. ఈ ఆదేశానికి, 2015 బ్లాక్ మనీ చట్టానికి లింకు కలిపారు. ఈ విషయాన్నే 2024లో ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల మాట .. ఇప్పుడు ప్రస్తావన తేవడంతో దురదృష్టవశాత్తూ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ఏం గాభరాపడక్కర్లేదు.మీరు ఒక విజయ్ మాల్యాని .. ఒక నీరవ్ మోడీని ప్రస్తావించి గవర్నమెంటు మీద దుమ్మెత్తిపోయకండి. చట్టప్రకారం రిటర్ను వేయడం విధి. పన్ను చెల్లించడం తప్పనిసరి. ఆ దోవలో వెళ్తే మిమ్మల్ని ఎవరూ ఆపరు. అడ్డు చెప్పరు. ఆటంకపర్చరు. ఎయిర్పోర్టుకి ఎవరూ రారు. అయితే, ఒక సూచన. మీతోపాటు మీ పాన్కార్డు, మీరు అసెస్సీ అయితే లేటెస్ట్ రిటర్ను కాపీ పెట్టుకోండి. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా రిటర్నులు వేసే అవసరం లేకపోయినా.. అసెస్మెంట్ కాకపోయినా .. అసెస్మెంట్ ఆగిపోయినా 10 లక్షల లోపుల పన్నులు చెల్లించకపోయినా (మనలో మన మాట, బండి అంతవరకు పోనివ్వకండి) గాభరా పడక్కర్లేదు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బాన్ వొయాజ్.. ఆల్ ద బెస్ట్. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) ఏదో ఒక ఇండెక్స్కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆస్తి అమ్మిన డబ్బుతో.. అలా వద్దండి!
అన్ని జాగ్రత్తలు తీసుకుని, సంబంధిత కాగితాలు భద్రపర్చుకుని, బ్యాంకులో జమ అయిన మొత్తంతో ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కాస్సేపు ఇలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘ప్రతిఫలం’ అని అందాం. ఈ ప్రతిఫలం నగదు రూపంలో వద్దండి! బ్యాంకులోనే జమ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమాచారం వెనువెంటనే కాకపోయినా .. త్వరగా కాకపోయినా.. అంతిమంగా సబ్ రిజిస్ట్రార్కి విధించిన గడువులోగా ఇన్కంట్యాక్స్ డిపార్టుమెంటు వారికి చేరుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతిఫలాన్ని ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబుగా ఆదాయపు పన్ను చట్టప్రకారం మరీ ఎక్కువగా ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యుల అవసరం ఏమిటి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చి హాయిగా కాలం గడుపుతున్న కొంత మందిని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. ➤ ఆ ఊళ్లో సాంబశివరావుగారు మంచి టీచర్. మానవతా విలువలతో పాటు విద్యావిలువలు తెలిసిన పెద్ద మనిషి. స్థిరాస్తి అమ్మకంతో వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ పన్ను భారాన్ని చెల్లించేసి, మిగతా మొత్తంతో పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని వారి వారి చదువులకు ఖర్చు పెట్టి వారిని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ భారత్లోనే ఉన్నారు. ➤ పిల్లలను విదేశాల్లో చదివించాలన్న విశ్వేశ్వరరావు కూడా అదే బాటని ఆశ్రయించారు. పన్ను భారం చెల్లించాక మిగిలిన మొత్తంతో కొడుకుని విదేశాల్లో ఉన్నత విద్యల కోసం పంపించి హాయిగా ఉన్నారు. ➤ చెల్లి పెళ్లి అప్పులతో తండ్రి చేశాడు. క్రమేణా కాలం కలిసొచ్చింది కల్యాణరావుకి. మావగారు ఇచ్చిన ఇల్లుకి రింగ్ రోడ్ ధర్మమా అని రేటు రాగానే అమ్మేశాడు, పన్ను కట్టాకా మిగిలిన మొత్తంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసి, మనవళ్ళతో ఆడుకుంటున్నాడు. ➤ శివరావుగారి తాతగారు ఎప్పుడో గుడి కట్టించారు. అది శిథిలం అయ్యింది. తండ్రి ఏమి చేయలేకపోయాడు. కానీ గుడిని పునరుద్ధరించాలనేది ఆయన చిరకాల కోరిక. శివరావుగారు తనకు వచ్చిన ‘ప్రతిఫలం’లో మిగిలిన మొత్తంతో గుడిని బాగుచేయించారు. తన శ్రమ శక్తి వల్ల ఏర్పడ్డ స్థిరాస్తి అమ్మకం.. శివభక్తికి అలా ఉపకరించింది. భార్య పార్వతమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ➤ తన స్కూలు చదువంతా ఎండా, వానల్లోనే. కాలేజీకి వచ్చే వరకు బెంచీలు చూడని విద్యాధరరావు డబ్బు సంపాదించి, ఇల్లు కొన్నాడు. అమ్మవలసినప్పుడు, అన్ని బాధ్యతలను తీర్చివేసి ఊళ్లో స్కూల్లో అన్ని తరగతులవారికి బెంచీలు కొన్నాడు. ➤ బంగార్రాజు పేరుకే బంగార్రాజు. పెళ్లాం లక్ష్మీ ప్రతిరోజూ పేచీయే బంగారం కొనమని. అనుకోకుండా అన్నదమ్ముల స్థిరాస్తి పంపకాల్లో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. పన్ను కట్టేసి మిగిలిన మొత్తంతో పెళ్లాం లక్ష్మమ్మని ఏడువారాల నగలు, వడ్డాణం కొని ‘లక్ష్మీదేవి’గా చేశాడు బంగార్రాజు. ➤ అమీర్పేటలో ఇరుకు ఇంట్లో నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయిన రాజారావు.. ’ప్రతిఫలం’తో ఓ విల్లా కొనుక్కుని, నార్సింగిలో సరదాగా ఉన్నాడు. పన్ను మినహాయింపులు కూడా పొందాడు. ➤ మొదటి నుంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వల్ల ’ప్రతిఫలం’ మొత్తాన్ని నిర్దేశిత బాండ్లలో ఇన్వెస్ట్ చేసి, ఆ వడ్డీలతో ఏ అప్పు లేకుండా పబ్బం గడుపుతున్నాడు ’లక్ష్మీపతి’. ➤ పాత ఇండస్ట్రీ షెడ్డుని అమ్మేసి, ఆ డబ్బుతో కొత్త షెడ్డు కొని వ్యాపారం చేస్తున్నారు నాయుడుగారు. ➤ అన్ని ఆస్తులు అమ్మినా, సరైన ప్లానింగ్ లేకుండా అప్పుల పాలైన అప్పారావూ ఉన్నారు. ఏదేమైనా ‘ప్రతిఫలం’ మొత్తాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్తో పోలిస్తే పోర్ట్ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్మార్క్తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ని బట్టి ఇండెక్స్ ఫండ్స్పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
పెట్టుబడికి బదులు బంగారం తీసుకోవచ్చా?
ఎన్పీఎస్ టైర్1 ఖాతాదారులకు అదనంగా రూ.50,000 పెట్టుబడి మొత్తంపై పన్ను ఆదా ఉందని తెలిసింది. నూతన పన్ను విధానంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చా? – జయంతి రామన్ నూతన పన్ను విధానం కింద, ఎన్పీఎస్ టైర్1 ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, మీరు అదనంగా రూ.50,000 మొత్తంపై పన్ను ఆదా చేసుకునేందుకు అవకాశం లేదు. పాత పన్ను విధానంలో ఉన్న వారే రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోగలరు. కాకపోతే మీరు పనిచేసే సంస్థలో మీ తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తున్నట్టు అయితే అప్పుడు అదనపు క్లెయిమ్కు అవకాశం ఉంది. మీ మూల వేతనం, డీఏలో గరిష్టంగా 10% మేర పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మూలవేతనం, డీఏలో 14% పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. నా వద్ద 2016–17 సంవత్సరానికి సంబంధించి 20 యూనిట్ల సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీలు) ఉన్నాయి. 2024 నవంబర్ 17తో వీటి గడువు ముగిసిపోతుంది. నగదు బదులు 20 గ్రాముల బంగారం తీసుకోవచ్చా? – వసంత పరిమి సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడుల కాల వ్యవధి ముగిసిన సమయంలో భౌతిక బంగారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం లేదు. భౌతిక బంగారాన్ని కలిగి ఉండడానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సాధనం ఎస్జీబీ. ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల పాటు పెట్టుబడులకు లాకిన్ ఉంటుంది. ఐదేళ్లు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. లాభంపై పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసే తేదీకి మూడు రోజుల ముందు 24 క్యారట్ల బంగారం సగటు ధర ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ఇన్వెస్టర్ ఎస్జీబీ కొనుగోలు సమయంలో ఇచ్చిన బ్యాంక్ ఖాతాతోనే గడువు అనంతరం మెచ్యూరిటీ మొత్తం జమ అవుతుంది. పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్ఎస్ఎస్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని అదే అస్సెట్ మేనేజ్మెంట్ నిర్వహించే పన్ను ఆదా ప్రయోజం లేని ఇతర ఈక్విటీ పథకంలోకి మార్చుకోవచ్చా? – రవి గుప్తా ఇందుకు అవకాశం లేదు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక ఈ మూడేళ్ల లాకిన్ పూర్తయిన తర్వాతే సదరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లోని పెట్టుబడులను ఇతర పథకంలోకి మార్చుకునేందుకు వీలుంటుంది. ఒక పథకం నుంచి మరో పథకంలోకి పెట్టుబడులు మళ్లించుకోవడాన్ని స్విచింగ్గా పిలుస్తారు. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఏఎంసీకి చెందిన రెండు పథకాల మధ్య పెట్టుబడులను స్విచింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలోకి పంపించుకుని, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గడువులోపు (మూడేళ్లు) స్విచింగ్ను అనుమతించడం లేదు. ఒకవేళ ఇన్వెస్టర్ మరణించిన సందర్భంలో.. సంబంధిత పెట్టుబడికి కనీసం ఏడాది ముగిసిన తర్వాతే నామినీ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. - సమాధానాలు - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
త్వరగా రిటైర్ అవుదామనుకుంటున్నా.. రిటైర్మెంట్ ఫండ్ ఎలా?
నా వయసు 35 ఏళ్లు? 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి రిటైర్మెంట్ ఫండ్ను సిద్ధం చేసుకోవడం ఎలా? – కీర్తిలాల్ మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు ఇంకా 20–25 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం చాలు. మీరు ఏ వయసులో రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి వీలైనంత అధిక మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధి ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే ముందున్న మార్గం. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మంచిది ఏదనే విషయంలో సందేహం నెలకొంది. ఏ పథకం మంచిది? – రమేష్ ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూసిన తర్వాత నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. - సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్క్యాప్ ఫండ్లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కామన్ అకౌంట్ నంబర్ అంటే?
ఫండ్స్లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? – దిలీప్ కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే ఏకీకృత వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులకు సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా ఖాతాలు ప్రారంభించి, లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. అయితే, క్యాన్ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కూడా లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా, బ్రోకర్ల ద్వారా సులభంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నా వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది పీపీఎఫ్ గడువు తీరి రూ.15 లక్షలు చేతికి వస్తాయి. ఎన్పీఎస్ తదితర అధిక వృద్ధికి అవకాశం ఉన్న సాధనాల్లోకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి నాకు అందే మొత్తం పన్ను మినహాయింపు కిందకు వస్తుందని తెలిసింది. కనుక ఈ మొత్తాన్ని క్రమానుగతంగా ఈక్విటీ ఫండ్స్లోకి మళ్లించేది ఎలా? – సుచిత్ పూతియా పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లోకి మళ్లించే సమయంలో మీరు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ముందుగా డ్యురేషన్ ఒకటి. మీరు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి పట్టిన కాలంలో సగం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు పీపీఎఫ్లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ మొత్తం సమకూరింది. కనుక ఏడున్నరేళ్ల పాటు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని కాదు. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా నెలవారీ వాయిదాల రూపంలో మీ వద్దనున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఐదేళ్లు పట్టిందని అనుకుందాం. అందులో సగం అంటే రెండున్నరేళ్ల పాటు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ నూతన కాల వ్యవధి 15–20 ఏళ్లు అని అంటున్నారు. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి మెరుగైన రాబడులను ఈక్విటీలు ఇవ్వగలవు. ఎన్పీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈక్విటీల్లో 75% ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత అప్పటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్నే ఉపసంహరించుకోవడానికి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు నిధిని ముట్టుకోని వారు అయితే, ఫ్లెక్సీ క్యాప్ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్పీఎస్లో అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం లార్జ్క్యాప్ స్టాక్స్కే కేటాయిస్తారు. కానీ, ఫ్లెక్సీక్యాప్ పథకాలు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. కనుక ఇవి కొంచెం మెరుగైన రాబడులు ఇస్తాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకపోతే, నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకునే విషయంలో ఆందోళన చెందుతుంటే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఈక్విటీల్లో 65% వరకే ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 35 శాతాన్ని డెట్లో పెడుతాయి. దీనివల్ల ఈక్విటీల్లోని అస్థిరతలను కొంత వరకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈక్విటీలతో పోలిస్తే స్థిరమైన రాబడులు ఇస్తాయి. -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్క్యాస్ట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్ఫామ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. కొనే ముందు డాక్యుమెంట్లు.. స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి. లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి. ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి. బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. అలాట్మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్కు పంపించగలరు. -
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్మెంట్ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సొంత ఇల్లు కొందామనుకుంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా? ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇంట్లోనే కాలం గడపడం మంచిదా? ఈ రోజు ఈ ప్రశ్నలకు జవాబుగా మీ జాతకపరంగా పరిష్కారం చెప్పటం లేదు. ఇది ఏదో ఒక రుణ సంస్థ తరఫున ప్రకటన కాదు. ఫలానా దగ్గరే కొనమని విసిగించడమూ కాదు. ఇప్పుడు చెప్పబోతున్నది ఇల్లు, ఫ్లాటు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే. కేవలం ఆర్థికపరంగా, ఇన్కం ట్యాక్స్ చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయంలో సెంటిమెంటు జోలికి వెళ్లకండి. ఎక్కడ కొందామనుకుంటున్నారు? మీకు కానీ మీ కుటుంబసభ్యులకు అనువైన లొకేషన్లో కొనండి. అన్నింటికీ దగ్గరగా ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. వాన, వరద వస్తే ముంపునకు గురి కాకూడదు. మీరే ఉంటారా లేక కేవలం అద్దె.. అంటే ఆదాయం కొసం తీసుకుందామనుకుంటున్నారా అనేది చూసుకోవాలి. కొంత మంది పెన్షన్ లేని వాళ్లు నెలసరి ఆదాయం కోసం ఇళ్లు కొన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వనరుల సంగతేమిటి? మీరు ఇంటికోసం ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇటువంటి విషయాల్లో ఎంత పక్కాగా లెక్కలు వేసినప్పటికీ అదనపు భారం అనివార్యం. టైం కూడా మీ చేతిలో ఉండదు. వ్యవహారం సాఫీగా జరగకపోవచ్చు. మొత్తం ఇన్వెస్టుమెంటు రెడీగా ఉందా? అప్పు అవసరమా? అనవసరమా? అప్పు ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఏ సంస్థా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వదు. మనం కొంత మార్జిన్ మనీ చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు చేసిన ఇన్వెస్టుమెంటుకి, చెల్లించిన మార్జిన్ మనీకి ‘సోర్స్’ ఉండాలి. ‘సోర్స్’ అంటే అప్పు కావచ్చు, మీ సేవింగ్స్ కావచ్చు, పన్ను చెల్లించగా మిగిలిన మొత్తం కావచ్చు, మీ అబ్బాయి అమెరికా నుండి పంపి ఉండవచ్చు, మీకు వీలునామా ద్వారా సంక్రమించిన బ్యాంకు బ్యాలెన్సు కావచ్చు లేదా లాటరీ తలుపు తట్టి ఉండవచ్చు. ‘సోర్స్’కి రాత లు, కోతలు ఉండాలి. అలా ఉండకపోతే ఆ మొ త్తాన్ని మీ ఆదాయంగా భావిస్తారు. క్యాపిటల్ బడ్జె ట్ వేసుకున్నాకా, రెవెన్యూ బడ్జెట్ వేసుకోవాలి. రెవెన్యూ బడ్జెట్ గురించి ఆలోచించారా? అన్నీ సక్రమంగా ఉండి, సకాలంలో ఇల్లు పూర్తి అయ్యిందనుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటే ఇంటి రుణం చెల్లింపుల మీద, రుణం మీద వడ్డీ (పరిమితుల మేరకు) మినహాయింపు లభిస్తుంది. కానీ ప్రతి నెలా వాయిదా (ఈఎంఐ) చెల్లించగలగాలి. మీకు వచ్చే హెచ్ఆర్ఏ పన్నుకి గురి అవుతుంది. ఆర్థికపరంగా బండి సాఫీగా వెళ్లాలి. అద్దెకి ఇచ్చారనుకోండి. వచ్చిన అద్దెను తప్పకుండా ఆదాయంగా చూపించాలి. అవసరం అయితే, పన్ను చెల్లించాలి. స్వంత ఇల్లు/కొత్త ఇల్లు నిర్వహించడానికి బోలెడంత .. లేదా అనుకోని ఖర్చులు అవుతాయి. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్కు పంపించగలరు. -
30లో ప్రెగ్నెన్సీ ప్లాన్,బీపీ, షుగర్ రిస్క్.. మరి పెళ్లికి సరైన వయసేది?
మా అమ్మాయికి 22 ఏళ్లు. ఇంజినీరింగ్ అయిపోయి ఈమధ్యనే ఉద్యోగంలో చేరింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ తను ఇంకో అయిదేళ్ల దాకా పెళ్లి ప్రసక్తి తేవద్దంటోంది. పిల్ల మొండితనం వల్ల పెళ్లికి మరీ ఆలస్యం అవుతుందేమోనని చింతగా ఉంది. ఆడపిల్ల పెళ్లికి సరైన వయసేదో సూచించగలరా? – చల్లపల్లి వింధ్యాకిరణ్, హోస్పేట్ ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం ప్రతి ఆడపిల్లా ప్రయత్నిస్తోంది. దాంతో వ్యక్తిగత శ్రద్ధ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. దీనివల్ల పెళ్లి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీస్ని చూస్తున్నాం. అలాగని ఎర్లీ మ్యారెజెస్ ఏమీ విజయవంతం కావడంలేదు. వాటిల్లో విడాకులనూ చూస్తున్నాం. అందుకని పెళ్లికి సరైన వయసు ఇదని చెప్పడం కష్టమే మరి! ఈ రెండు పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని 28 –32 ఏళ్ల మధ్య వయసు పెళ్లికి బెస్ట్ వయసుగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి. ఈ వయసుకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఈ వయసులో ట్రామా, స్ట్రెస్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ చక్కగా ఉంటాయి. మనం ఏం చేయాలి?మనకేం కావాలి? అనే విషయాల్లో స్పష్టంగా ఉంటారు. అమ్మాయికి 30 ఏళ్లు దాటినప్పటి నుంచి నేచురల్ లేదా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతుంటాయి. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో అండాల నాణ్యతా తగ్గిపోతోంది. ఏఎమ్హెచ్ అనే టెస్ట్తో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. లేట్ మ్యారేజెస్ .. ఇండైరెక్ట్గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి 28 – 30 ఏళ్ల మధ్యలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే భవిష్యత్లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్వోఎఫ్లను ఆయా ఫండ్స్ హౌస్లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్వోఎఫ్లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్వోఎఫ్లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్వోఎఫ్లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్వోఎఫ్లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్వోఎఫ్లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
జీతం.. గీతం.. అదనపు ఆదాయం ఉందా? ఐటీ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి!
ఈ వారం ట్యాక్స్ కాలంలో పొరుగింటి మీనాక్షమ్మ మొగుడు పుల్లయ్యను చూడక తప్పదు. తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు. వగలే కాని నగలెప్పుడైనా కొన్నారా అని నిలదీసి అడిగిన ఆండాళమ్మకు మొగుడు .. పక్కింటి పుల్లయ్య చేసే వ్యవహారం బైటపెడతాడు. వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ.. తెలుసుకోవే.. అని. చంద్రయానం గురించి తర్వాత తెలుసుకుందాం. ‘‘చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి’’ ఇది నాటి పాట. ప్రస్తుతం మన కథలన్నీ ఆదాయపు పన్ను వారికి తెలిసిపోతున్నాయి. మూన్లైటింగ్ కాదు.. మూన్ చేజింగ్. కరోనా కాలంలో ఇంటివద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతో ఆదాయం సంపాదించారు. ఒక యజమాని దగ్గర పని చేస్తూ సంపాదిస్తూ, అదే సమయంలో మరో యజమాని దగ్గర చేస్తూ ఎడాపెడా రెండు చేతులా సంపాదించారు. ఇలా సంపాదించడంలో తప్పు లేదు ‘‘కష్టే ఫలి’’ అన్నారు. అలాంటి రాబడిని ఆదాయపు పన్ను వారికి చూపెట్టక పోవడమే తప్పు. 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా సంపాదించి వారు రిటర్నుల్లో ఆదాయాన్ని డిక్లేర్ చేయని వారికి తాఖీదులు వెళ్లాయి. ఈ విషయం ఎలా తెలిసింది? ఆదాయం ఆన్లైన్లో వచ్చింది. బ్యాంకులో జమయ్యింది. డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిగాయి. కొంత మంది ఆస్తులు కొన్నారు. కొంత మంది బ్యాంకు ఎఫ్డీలు, షేర్లు.. డిబెంచర్లలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. కొంత మంది విలాసవంతమైన వస్తువులు కొన్నారు. టూర్లు.. బార్లు.. కార్లూ.. కొంత మంది రుణాలను బుద్ధిగా తీర్చేశారు. విదేశాలకు పంపారు కొంతమంది. గూగుల్ పేమెంట్లు, పేటీఎంలు.. ఇలా ఎన్నో. మీకు పేమెంట్లు చేసిన యజమానులు ఎప్పటికప్పుడు వివరాలను డిపార్టుమెంటు వారికి తెలియజేస్తున్నారు. మీకు రాబడి .. వారికి ఖర్చు. ఆ ఖర్చులు క్లెయిమ్ చేయడం వల్ల ఆ కంపెనీలకు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆదాయపు పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి వాళ్లు అన్ని వివరాలు, ఖర్చులు, జమలు, లాభనష్టాలు, సమర్పిస్తారు. టీడీఎస్ పరిధిలోకి రాకపోయినా వివరాలు మాత్రం ఇచ్చి ఉంటారు. ఇది కాకుండా పుల్లయగారికి ‘‘గీతం’’.. అంటే లంచంగా భావించారు ‘‘సంబరాల రాంబాబు’’లో పాట రచయిత. లంచం తప్పు. చట్టరీత్యా నేరం. దాన్నీ ఆదాయంగా పరిగణిస్తారు. ఇదీ చదవండి: జీఎస్టీ రివార్డ్ స్కీమ్: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు ఎలా బైటపడాలి? లెక్కలన్నీ సక్రమంగా చూపించి, బుద్ధిగా పన్ను కట్టండి. మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పని చేసి, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యుల అకౌంటులో వేస్తే పన్ను భారం తగ్గుతుందేమో చెక్ చేయాలి. అలాంటప్పుడు పన్ను పరిధిలో లేని వారిని ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్కు పంపించగలరు. -
ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్: ‘లక్ష’లో మీరున్నారా? కోరి కొరివితో పెట్టుకోకండి
ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్గారే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎవరికి పంపించారంటే.. ప్రధానంగా మూడు రకాల వారికి.. 1. రిటర్నులు వేయని వారికి 2. ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారికి 3.తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారికి పైన పేర్కొన్న వారందరికీ లక్ష నోటీసులు ఇచ్చారు. ఈ లక్షలో మీరున్నారా అనే ప్రశ్నకు జవాబుగా ‘మాయాబజార్’లో శర్మ–శాస్త్రిలాగా తాన–తందానలాగా ‘మేమా..మేమేం చేశాం’ ని కుదుటపడకండి. డిపార్ట్మెంట్ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్మెంటుని ‘రీ–ఓపెన్’ చేయొచ్చు. ఇలా ఇప్పటికే 55,000 మంది విషయంలో అసెస్మెంట్ చేశారు. ఇప్పటికి 2023 మార్చి ఆఖరు నాటికి సంబంధించి అత్యధిక సంఖ్యలో రిటర్నులు వేసినప్పటికీ, వేసిన వాటిలో 70 శాతం రిటర్నులలో ట్యాక్సబుల్ ఇన్కం లేదు. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ‘ఈ సంవత్సరానికి అయిపోయింది’ అని చేతులు దులుపుకున్న బాపతు అన్నమాట. ముందుగా, వాళ్లు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారికి ... ఇలా ఉన్న వారిలో వేయని వారు, తక్కువ చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారు. ఇవి ఏదో యధాలాపంగా, అనాలోచితంగా ఇవ్వలేదని, పస ఉన్న కేసులేనని ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఘంటాపథంగా చెప్పారు. ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇవి కాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారు. ఇవి ఎటువంటివి అంటే.. 1. ఇంటద్దె అలవెన్సు 2. లీవ్ ట్రావెల్ అలవెన్సు 3. ఇంటి రుణంపై వడ్డీ 4. మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు 5. సెక్షన్ 80 కింద చెల్లింపులు 6. పెట్టుబడులు 7. సేవింగ్స్ 8. పిల్లల స్కూలు ఫీజులు చాలా మంది ‘‘ఏమీ అడగరులే’’ అని దొంగ క్లెయిమ్లు చేస్తున్నారు. కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దయచేసి తప్పుగా/లేనిదాన్ని క్లెయిమ్ చేయకండి. అన్ని చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయండి. ప్రతి దానికి కాగితం, డాక్యుమెంటు, రుజువులు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, బ్యాంకు సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలు.. ఇవన్నీ మూడో వ్యక్తి నుంచి.. అంటే ఎక్స్టర్నల్ నుండి పొందండి. దీన్నే ‘‘ఎవిడెన్స్’’ అంటారు. జాగ్రత్తపడండి. కోరి కొరివితో పెట్టుకోకండి. -
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గాలు?
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – భానుశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ పెద్దింటి అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది. -
దీర్ఘకాల పెట్టుబడులకు సులభమైన మార్గం - డోంట్ మిస్!
దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసమే ఎవరైనా ఈక్విటీ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఈక్విటీ అంటేనే రిస్క్ ఉంటుంది. స్వల్ప కాలంలో అస్థిరతలు ఉంటుంటాయి. వీటన్నింటినీ అధిగమించి మెరుగైన రాబడులు ఇవ్వాలంటే, ఎంపిక చేసుకునే మ్యూచువల్ ఫండ్ పథకం కూడా కీలకం అవుతుంది. ఎంత లేదన్నా వార్షికంగా 12 శాతానికి పైన రాబడులు ఇచ్చే పథకం వల్లే దీర్ఘకాలంలో కావాల్సినంత సంపద సమకూరుతుంది. ఈ విధంగా చూసుకుంటే దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ను పరిశీలించొచ్చు. అన్ని రకాల మార్కెట్లలోనూ బలంగా నిలబడి, దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇవ్వగల స్టాక్స్ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. రాబడులు అన్ని కాలాల్లోనూ ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధిక రాబడులతో ముందుంది. ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 14.20 శాతం, పదేళ్లలో వార్షిక సగటు రాబడులు 17 శాతం చొప్పున ఉన్నాయి. ఇదే కాలంలో బీఎస్ఐ 500 టీఆర్ఐ రాబడులు 14.15 శాతం, 15.23 శాతం చొప్పున ఉన్నాయి. ఇక గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 17 శాతం రాబడి తెచ్చిపెట్టింది. మూడేళ్ల కాలంలో 21.78 శాతం చొప్పున రాబడినిచ్చింది. ఏడేళ్లలో వార్షిక రాబడి 14.30 శాతంగా ఉంది. 2004 అక్టోబర్ 11న ఈ పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 18.87 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో ముందు నుంచి ఉన్న పథకాల్లో ఇదీ ఒకటి. ఈ పథకం పోర్ట్ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతానికి 24 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్లోనే 51 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్ను పోర్ట్ఫోలియోలో కలిగి ఉంటాయి. విడిగా ఒక్కో స్టాక్పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కనుక, రాబడుల అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్ఫోలియో ఉంది. (ఇదీ చదవండి: పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?) ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.28,990 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్క్యాప్ కంపెనీల్లోనే 62 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిడ్క్యాప్లో 36 శాతం, స్మాల్క్యాప్లో 2 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. తన పోర్ట్ఫోలియోలో భాగంగా విదేశీ స్టాక్స్కు కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, 40 శాతం కేటాయింపులు ఈ రంగాల్లోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లో 10 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 9 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.70 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. హెల్త్కేర్ రంగ కేటాయింపులు 7 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు కేటాయింపులు 6 శాతానికిపైనే ఉన్నాయి. -
పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?
నా వయసు 40 ఏళ్లు. పీపీఎఫ్లో నేను 15 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఏడాదితో గడువు ముగుస్తుంది. దీంతో గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తాన్ని మెరుగైన వృద్ధి అవకాశాలున్న ఎన్పీఎస్, తదితర పథకాల్లో వచ్చే 15–20 ఏళ్ల కాలానికి పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి వచ్చే మొత్తం పన్ను రహితమని తెలుసు. ఈ మొత్తాన్ని క్రమంగా ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలి? సూచించగలరు. – సుచిత్ పూతియా మీ పెట్టుబడుల నిధిని ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవడానికి ముందు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారనేది స్పష్టత ఉండాలి. సాధారణంగా ఏకమొత్తంలో డబ్బు ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెడదామనుకుంటే.. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టింది. అప్పుడు ఈ మొత్తాన్ని 12 నుంచి 24 భాగాలు చేసుకోవాలి. అన్ని వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యవయం, రిస్క్ను తగ్గించుకోవచ్చు. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కనుక మీరు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇక మీ పెట్టుబడిని ఎన్పీఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఎన్పీఎస్లో ఉపసంహరణల పరంగా ఆంక్షలు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ మొత్తం నిధి నుంచి మీరు 60 శాతాన్నే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే అంటే, వైద్య వ్యయాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు ఉంటుంది. మీరు క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్గా ఎన్పీఎస్ నిధిని రిటైర్మెంట్ వరకు ముట్టుకోకుండా ఉంటే, అలాంటప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్పీఎస్లో ఈక్విటీ పెట్టుబడులు మొత్తం లార్జ్క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మిడ్, స్మాల్క్యాప్లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వైవిధ్యం పాటిస్తుంటాయి. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంత వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని వారు అయితే, పెట్టుబడులు మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఆందోళన ఉంటే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 35 శాతాన్ని డెట్లో పెడుతుంటాయి. దీనివల్ల ఈక్విటీ అస్థిరతలు తగ్గి, మరింత స్థిరమైన రాబడులకు వీలు కలుగుతుంది. నాకు ఒక అన్లిస్టెడ్ కంపెనీలో 20 ఏళ్ల నుంచి పెట్టుబడులు ఉన్నాయి. సదరు అన్లిస్టెడ్ కంపెనీ, ఒక లిస్టెడ్ కంపెనీలో విలీనం అయింది. దీంతో నేను ఈ షేర్లను విక్రయించేశాను. మూలధన లాభాల పన్నును నేను ఎలా లెక్కించాలో చెప్పగలరు? – విష్ణుప్రియ మూలధన లాభాల పన్నును నిర్ణయించే ముందు అన్లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి దీర్ఘకాలమా? లేక స్వల్పకాలమా? అన్నది తేల్చాలి. ఏదైనా అన్లిస్టెడ్ షేరులో పెట్టుబడి 24 నెలలకు మించి కొనసాగించి ఉంటే, అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి అవుతుంది. 24 నెలలకు మించి కొనసాగించినప్పుడు వచ్చే మూలధన లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. దీని నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం ప్రభావం మినహాయింపు) ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం వరకు పన్ను ఉండదని తెలిసిందే. అంతకుమించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. కానీ, కొనుగోలు, విక్రయం సమయంలోనూ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చెల్లించనట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. కానీ, మీ కేసులో మీరు కొనుగోలు సమయంలో కాకుండా, కేవలం విక్రయించేటప్పుడే సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను చెల్లించారు. కనుక దీర్ఘకాల మూలధన లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రాంబాబు.. ముగ్గురితో పెళ్లిళ్లు, విడాకులు.. విషయం ఏంటంటే..
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు తమ సమస్యలను పంచుకున్నా ఇదేమంత సమస్య కాదులే అని కొట్టిపారేస్తాం. మరికొన్ని సార్లు దాన్ని అసలు సమస్యగా కూడా గుర్తించం. అలాంటి వాటిలో బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఒకటి. రాంబాబు ప్రవర్తన చిన్నప్పటినుంచి భిన్నంగా ఉండేది. దాంతో ‘మావాడు కొంచెం తేడాలే, వాడికి తిక్క ఎక్కువ’ అని కుటుంబ సభ్యులే అంటుండేవారు. సరిగా చదవడం లేదని.. మందలించారని ఇంటర్మీడియట్లో ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో చూసి కాపాడారు. కొన్నాళ్లు హుషారుగా ఉంటే, మరికొన్నాళ్లు దిగులుగా గదికే పరిమితమయ్యేవాడు. పాతికేళ్ల వయసులో నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వద్దంటే ఏం చేసుకుంటాడోనని ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అతని మూడ్ స్వింగ్స్ని, కోపాన్ని భరించలేక ఏడాదికే నీరజ పుట్టింటికి చేరింది. ఆమెకు విడాకులిచ్చాక రేణుకను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చి అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెనూ వదిలేశాడు. బాగా నడుస్తున్న వ్యాపారాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగి భారీగా నష్టపోయాడు. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో ఇంట్లో అరుస్తుండేవాడు. రాంబాబు బాధ చూడలేక, పడలేక అతని పేరెంట్స్ ఫోన్ చేసి సమస్యను వివరించారు. అతని సహకారం లేకుండా ఏమీ చేయలేమని చెప్పాక, నచ్చజెప్పి కౌన్సెలింగ్కి తీసుకువచ్చారు. మొదటి సెషన్లో అతనితో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. బాధాకరమైన బాల్యం బీపీడీ సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది. పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న వ్యక్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి బీపీడీకి దారితీసే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యల బారిన పడినవారు ఉంటే వంశపారంపర్యంగా రావచ్చు. బాల్యంలో చూసిన, అనుభవించిన బాధాకరమైన సంఘటనలు ఈ రుగ్మతను మరింత ఎక్కువ చేస్తాయి. బీపీడీ ఉన్న వ్యక్తుల్లో 70శాతం మంది బాల్యంలో లైంగిక, భావోద్వేగ, శారీరక వేధింపులను అనుభవించి ఉంటారు. తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేకపోవడం, కఠినమైన నిబంధనలు, కుటుంబంలో ఆల్కహాల్ వినియోగం కూడా కారణాలై ఉంటాయి. బీపీడీ ఉన్నవారి మెదడులో భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించే భాగాలు సరిగా కమ్యూనికేట్ చేయవు. అది మెదడు పని విధానాన్ని ప్రభావితం చేస్తుంది. నాటకీయ ప్రవర్తన, అస్థిర బంధాలు బీపీడీ వ్యక్తిత్వసంబంధమైన ఒక మానసిక రుగ్మత. విపరీతమైన మూడ్ స్వింగ్స్, మానవ సంబంధాల్లో అస్థిరత, ఇంపల్సివిటీ దీని ప్రధాన లక్షణాలు. మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, విడిచిపెడతారని భావిస్తుంటారు. అలాంటప్పుడు వారిని ట్రాక్ చేస్తారు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేందుకు అందరినీ దూరంగా ఉంచుతారు. తిరస్కరణ, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు స్వీయ హాని, బెదిరింపులు, ఆత్మహత్య ఆలోచనలు ఉండవచ్చు. ఇతరులపై తమ అభిప్రాయాలను ఆకస్మికంగా, నాటకీయంగా మార్చుకుంటారు. దీనివల్ల స్నేహాలు, వివాహాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉంటాయి. వారి గురించి వారికే సరైన ఇమేజ్ ఉండదు. దానివల్ల తరచూ గిల్టీగా ఫీలవుతుంటారు. తనను తానే చెడుగా చూస్తారు. వృత్తిని, లక్ష్యాలను, స్నేహితులను అకస్మాత్తుగా మార్చడం ద్వారా తమ సెల్ఫ్ ఇమేజ్ని మార్చి చూపించాలని ప్రయత్నిస్తారు. అదుపు చేసుకోలేని కోపం, భయం, ఆందోళన, ద్వేషం, విచారం, ప్రేమ తరచుగా, వేగంగా మారతాయి. కోపాన్ని నియంత్రించుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ మూడ్ స్వింగ్స్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫైటింగ్, జూదం, డ్రగ్స్ వినియోగం, అతిగా తినడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు సాధారణం. విచారంగా, విసుగుగా, శూన్యతగా భావిస్తారు. విపరీతమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మతిస్థిమితం లేని ఆలోచనలు, కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి. ఒంటరిగా వదిలేయొదు. బీపీడీలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను ఎవరికి వారు గుర్తించలేరు. స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో గుర్తించాలి. మీకు తెలిసిన వారిలో బీపీడీ లక్షణాలు కనిపించినప్పుడు ఒంటరిగా వదిలేయకుండా సైకాలజిస్టును సంప్రదించండి. సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. చికిత్సకు ఏడాదికి పైగా సమయం పట్టవచ్చు. అందువల్ల సహకారం, సహనం, నిబద్ధత అవసరం. · కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా చికిత్స ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. మీ భద్రత ప్రమాదంలో ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ, స్కీమా ఫోకస్డ్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ లాంటివి బీపీడీ చికిత్సలో ఉపయోగపడతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, బాధలను తట్టుకోవడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలాగో నేర్పుతాయి. ప్రతికూల జీవన విధానాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, సానుకూల జీవన విధానాలను ప్రోత్సహిస్తాయి. -
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్క్యాప్, మిరే అస్సెట్ మిడ్క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సొంతిల్లు ఏ వయసుకు సమకూర్చుకోవాలి..?
మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి మారకం విలువను హెడ్జ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు. – ప్రవీణ్ షా ఐదు, పదేళ్ల క్రితం డాలర్తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే ఇప్పటికి చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చి న్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. సామర్థ్యం, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకో వాలి. మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీ మ్యూ చువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక అంతర్జాతీయ ఫండ్ ఎంపిక కీలకమని తెలుసుకోవాలి. నా వయసు 22 సంవత్సరాలు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఏ వయసుకు సొంతిల్లు సమకూర్చుకోవాలి? – రషీద్ సొంతిల్లు విషయంలో అందరికీ సరిపోయే ఏకైక ప్రామాణిక పరిష్కారం ఉందని అనుకోవడం లేదు. కాకపోతే ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఇవి సరైన నిర్ణయం తీసుకునేందుకు సాయపడతాయి. చాలా మందికి సొంతిల్లు ఆర్థికంగా అతిపెద్ద ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఇంటి రుణం పేరుతో అతిపెద్ద ఆర్థిక బాధ్యత వచ్చి పడుతుంది. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చొప్పున (ఈఎంఐ) చాలా ఏళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆర్థికంగా ఏ మేరకు స్థిరపడ్డామన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి. తమ ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో స్థిరత్వం గురించి స్పష్టతకు రావాలి. అప్పుడే తన ఆదాయంపై అంచనాకు రావచ్చు. వృత్తిపరంగా స్థిరత్వాన్ని సాధించారా? లేదంటే వచ్చే రెండు మూడేళ్లలో ఆ స్థాయికి చేరుకుంటామని భావిస్తున్నారా? ఈ విషయంలో స్పష్టత అవసరం. రెండో అంశం.. ఈఎంఐ కట్టాలన్న లక్ష్యంతో వ్యయాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ ఆదాయంలో ఈఎంఐ మూడింట ఒక వంతును మించకపోవడం సహేతుకమైనది. అప్పుడే ఇతర వ్యయాలను ఎదుర్కోవడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, ఇతర జీవిత లక్ష్యాలకూ కొంత ఆదా చేసుకోగలరు. నెలవారీ వేతనంలో ఈఎంఐ పరిమాణం ఎంతన్నది ముఖ్యమైనది. మీకున్న రుణ పరపతి ఏ మేరకు, బ్యాంక్ బ్యాలన్స్ ఏ మేరకు? అన్న అంశాలను రుణమిచ్చే సంస్థలు చూస్తాయి. వీటి ఆధారంగా రుణ రేటును నిర్ణయిస్తాయి. రుణ పరపతి మెరుగ్గా ఉంటే, ఆకర్షణీయమైన రేటుకే గృహ రుణం అందుకోవచ్చు. ఇక ఇంటిని కొనుగోలు చేయడం అన్నది ఒక్క ఆర్థికపరమైన నిర్ణయమే కాదు. ఇందులో జీవిత భాగస్వామి ప్రాధాన్యాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకుంటారు. కనుక దంపతులు ఇద్దరూ కలసి తమ జీవిత లక్ష్యాలు, ఎక్కడ స్థిరపడాలి, ఎటువంటి ఇల్లు కొనుగోలు చేయాలన్న అంశాలను నిర్ణయించుకోవాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వృద్ధులకు మెరుగైన పెట్టుబడి సాధనం?
వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్ఫామ్ ఉందా? – సమీర్ పటేల్ కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్ వృద్ధులు కేవలం డెట్లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి. నా సోదరుడు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – ఖలీద్ మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ పనితీరు చూపించడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు కొన్ని ప్రతికూల సమయాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకం పనితీరు గురించి మీరు ఆలోచన చేయవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్ లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను కొనసాగించొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుబడులు పెట్టే కాలంలో అస్సెట్ అలోకేషన్ను ఎలా నిర్వహించాలి? -వినయ్ శేఖర్ చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అస్సెట్ అలోకేషన్ ఎంతో కీలకమైనది. మీ పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించడం, అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసుకోవడమే అస్సెట్ అలోకేషన్. ఈక్విటీలు ఇతర సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మంచి రాబడులను ఇవ్వగలవు. మీ పెట్టుబడుల కాల వ్యవధి ముగింపునకు వస్తున్నప్పుడు, పెట్టుబడులతో అవసరం ఏర్పడడానికి కొంత ముందు నుంచే క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను డెట్లోకి మళ్లించు కోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు మూడేళ్ల లోపు ఉంటే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. మూడేళ్లకు మించి ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల కోసం అయితే 25-30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఐదు, ఏడేళ్ల కోసం అయితే ఈక్విటీ కేటాయింపులు 50 శాతం వరకు, లేదా మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఏడేళ్లకు మించిన లక్ష్యాల కోసం ఈక్విటీలకు 70-80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ముఖ్యమైనది. దీనివల్ల అస్థిరతలను అధిగమించొచ్చు. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
‘మార్చి 31’ గాభరావద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!
‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. ♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. ♦ ప్లానింగ్లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్ ఎక్స్గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి. ♦ అలాగే క్యాపిటల్ గెయిన్స్ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్ను దృష్టిలో పెట్టుకోండి. ♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
మంచి ఫండ్ను గుర్తించడం ఎలా? ఇదిగో ఇలా!
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లో ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – వెంటక రమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే అప్పుడు ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70-75 శాతాన్ని లార్జ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్క్యాప్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10-15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్క్యాప్నకు కేటాయించుకోవడం ద్వారా ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. మంచి మ్యూచువల్ ఫండ్ను గుర్తించడం ఎలా? అలాగే, ఏడాది కోసం ఒక మంచి పథకాన్ని సూచించగలరు. ఏడాదికి 12 శాతం కాంపౌండెడ్ రాబడి నా లక్ష్యం – ఇమ్రత్ సూతర్ చాలా విస్తృత శ్రేణిలో వేలాది పథకాలు ఉన్నప్పుడు సరైన పథకం ఎంపిక అన్నది కష్టమైన పనే. అయితే మంచి పథకం ఎంపికకు రాబడులు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీ లక్ష్యాలను గుర్తించాలి. మీ పెట్టుబడుల లక్ష్యం ఆధారంగానే ఎలాంటి పథకం ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలన్నది మీ లక్ష్యం అయితే అందుకు ఈక్విటీ పథకాలపై దృష్టి పెట్టాలి. అలా కాకుండా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటుంటే స్థిరాదాయ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రిస్క్ ఎంత తీసుకోగలరు? అన్నది కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. మీ పెట్టుబడులు విలువ పడిపోతూ, పెరుగుతూ ఉన్నా ఫర్వాలేదని అనుకుంటే అప్పుడు ఈక్విటీలు అనుకూలం. లేదా రిస్క్ లేని రాబడులు కోరుకుంటే డెట్ విభాగం అనుకూలం. అధిక రాబడులు ఇచ్చే సాధనాలు ఏవైనా అందులో అధిక రిస్క్ ఉంటుందని మర్చిపోవద్దు. రిస్క్, రాబడుల మధ్య సమతుల్యం అవసరం. పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించాలని అనుకుంటున్నారు? లిక్విడిటీ సమస్యలు సమీప భవిష్యత్తులో ఉన్నాయా? తదితర అంశాలను చూడాలి. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్ రిస్క్పై ఆధారపడి నడుస్తుంటాయి. అందుకని కనీసం ఐదేళ్లకు తక్కువ కాకుండా ఈక్విటీ పెట్టుబడులు కొనసాగించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీటికి సరితూగే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక ఏడాది కాలానికి 12 శాతం రాబడి కోరుకుంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లు కరెక్షన్లోకి వెళితే రాబడులు అటు ఉంచి, పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఏడాది కోసం అయితే, ఎఫ్డీ తదితర సంప్రదాయ సాధనాలనే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో మీరు కోరుకున్నంత రాబడి రాదు. -
చాయిస్ మనదే! అంకెలు తెలిశాక అడుగేయండి.. భారీగా పన్ను ఆదా చేసుకోండి
- ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య బడ్జెట్ వచ్చింది. 1–4–2023 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి అది వర్తిస్తుంది. అంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో (01–04–2023 నుంచి 31–03–2024 వరకు) సంపాదించిన లేదా సంబంధిత ఆదాయం మీద పన్ను భారం లెక్కించాలి. అలా లెక్కించడానికి బడ్జెట్లో మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం రిటర్నుల దాఖలుకు కొత్త విధానానికి మళ్లుతామా లేదా పాత పద్ధతే కొనసాగిస్తామా అన్నది మన ఇష్టం. ఎంపిక మనదే. చాయిస్ మనదే. ఏం చేద్దాం అన్న ఆలోచన .. ఎలా చేద్దాం అన్న ప్లానింగ్ విషయంలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే తీసుకోండి. ఆదాయపు అంకెలు తెలిశాక అడుగు వేయండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు. 01–04–2023 నుండి మొదలయ్యే సంవత్సరంలో మీ ఆదాయం ఎంత అనేది.. వేతన జీవులు .. గవర్నమెంటు వారైతేనేం, స్థిరంగా జీతభత్యాలు వచ్చే వారైతేనేం .. ఎవరైనా సరే కరెక్టుగా అంచనా వేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగస్తులు, ఉద్యోగం రాని వాళ్లు, లేని వాళ్లు అంచనా వేసుకోవడం కొంచెం కష్టం. వ్యాపారం/వృత్తుల్లో ఉన్నవారు కూడా అంచనా వేయడం కష్టమే. విధిగా.. అంటే తప్పనిసరిగా పీఎఫ్ కట్టేవారు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లించేవారు, రుణాన్ని సక్రమంగా చెల్లించేవారు, పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించేవారు, వీరందరికీ తప్పనిసరిగా 80సీ సెక్షన్ ప్రకారం తగ్గింపు లేదా మినహాయింపు ఉంటుంది. వీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే పన్ను ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పైన చెప్పినవి అన్నీ ఆచరిస్తారు. అప్పుడు కొత్త విధానం వైపు మొగ్గు చూపించనక్కర్లేదు. కానీ, చెక్ చేసుకోండి. కొత్త విధానంలో ప్రయోజనం ఉంటుందంటే అటు వైపు వెళ్లండి. ఇలాంటప్పుడు మీ ప్లానింగ్ .. ట్యాక్స్ ప్లానింగ్తో కన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముడిపడినట్లు. పీఎఫ్ పరిధిలోకి రానివారు, సేవింగ్స్ చేయలేని వాళ్లు, ఇల్లు లేని వారు, పిల్లలు లేనివాళ్లు .. వీళ్లంతా మరో కేటగిరీ. వీరికి 80సీ ప్రయోజనం అవసరం లేదు. ఆ సెక్షన్ని ఆశ్రయించనక్కర్లేదు. అలాంటప్పుడు పాత విధానం వైపు కన్నెత్తి చూడనక్కర్లేదు. కొత్త విధానమే సో బెటర్. ఒక విధానం కింద .. భవిష్యత్ కోసం దాచుకోవడం .. లేదా ఇన్వెస్ట్ చేయడం. ఈ మేరకు మీ బ్యాంకులో నుంచి రూ. 2,00,000 స్థిరంగా వెళ్లిపోతుంది. ఇంత మొత్తం లేకపోయినా సంసారాన్ని లాక్కుని రాగలరా? అయితే 80సీని ఆశ్రయించండి. ఎందుకు మాస్టారూ .. అంత మొత్తాన్ని బ్లాక్ ( ఆఔౖఇఓ) (నల్లధనం కాదు) చేసుకోవడం .. చేతుల్లో డబ్బు లేకుండా ఇబ్బంది పడటం? అని ఆలోచించే అవసరాల ఆనందరావు ఉంటారు.. ముందు జాగ్రత్తే ముఖ్యం అనే ముత్యాలరావు ఉంటారు. అమ్మాయి పెళ్లి కోసం ఆలోచించే కల్యాణరావు, అబ్బాయి చదువు కోసం ఆలోచించే సరస్వతీరావు, సొంతిల్లు కోసం కలలు కనే శోభనబాబు, ఫిక్సిడ్ డిపాజిట్ల పిన్నమయ్య, ఎన్నెస్సీల ఎంకయ్య ఇలా ఎందరో మనలో... మీ బాణీ మీదే, మీ ధోరణి మీదే, మీ ప్రాధాన్యత మీదే.. ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ గిఫ్ట్గా ఇవ్వొచ్చా? ఈ విషయాలు తెలుసా?
ఫండ్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని పిల్లల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలి. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవడం ఒక్కటే మార్గం. నేను ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 లేదా 5 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్దీప్ సింగ్ ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇది పన్ను ఆదా అవుతుంది. -ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేతన జీవులకు ఊరట ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్ 2020 తర్వాత మూడో సంవత్సరం, రెండో నెల, మొదటి రోజున ఐదో సారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 6.10 నుంచి 6.80 శాతం అభివృద్ధి రేటు ధీమాతో సప్త ప్రాధాన్యతలతో ఎనిమిది రకాలుగా రూపాయి ఎలా వస్తుందో.. తొమ్మిది రకాలుగా రూపాయి ఎలా ఖర్చు పెట్టనున్నారో పేర్కొన్నారు. ‘‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’’ నినాదంతో సప్తరుషులను స్మరించేలా ఏడు విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. ఇతర విషయాల జోలికి పోకుండా మనం కేవలం ఆదాయ పన్నుకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించుకుందాం. ఈ బడ్జెట్లో చేసిన మార్పులు చట్టంగా మారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వర్తిస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే అసెస్మెంట్ ఇయర్ 2024-25 అని అర్థం చేసుకోవాలి. ఈ మార్పులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించవు. 2023 మార్చి 31 తర్వాత మీరు దాఖలు చేసే రిటర్న్స్కు ఇవి వర్తించవు. ప్రస్తుతం ట్యాక్స్ చెల్లింపుదారులకు రెండు రకాల రిటర్న్స్ పద్ధతులు ఉన్నాయి. ఒకటి పాత ట్యాక్స్ విధానం.. మరొకటి కొత్త విధానం. పాత పద్ధతిలో బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షల తర్వాత 3 శ్లాబులు.. అంటే పన్ను శాతాలు వరుసగా 5 శాతం, 20 శాతం, 30 శాతం. ఈ విధానంలో మినహాయింపులు ఉంటాయి. కొత్త పన్ను విధానంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు. బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షలు కాగా, 6 శ్లాబులు అంటే.. 5, 10, 15, 20, 25, 30 శాతంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు. రాబోయే బడ్జెట్లో ఈ రెండూ కొనసాగుతాయి. మీకు నచ్చినదాంట్లో మీరు మీ ఆదాయాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతిలో ఎటువంటి మార్పులు లేవు. శ్లాబుల్లోనూ మార్పు లేదు. రేట్లలో కూడా ఎటువంటి మార్పు లేదు. 60 సంవత్సరాల లోపు వారికి 60-80; 80 ఏళ్లు దాటిన వారికి బేసిక్ లిమిట్లలోనూ ఎటువంటి మార్పూ లేదు. సేవింగ్స్, జీవిత బీమా, ఎన్ఎస్సీలు, ఇంటి రుణం మీద వడ్డీ, మినహాయింపుల విషయంలో ఎటువంటి మార్పులు లేవు. ఇతర మినహాయింపులు, తగ్గింపుల విషయంలో ఏ మార్పులు లేవు. ఈ విషయంలో సీతమ్మ ఎటువంటి కరుణ చూపలేదు. కొత్త పద్ధతి కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేశారు. కొత్త పద్ధతిలో కూడా రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది. ఫ్యామిలీ పెన్షన్ రూ. 15 వేలు వరకు తగ్గిస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది. అగ్నివీర్ కార్పస్ ఫండ్కి చెల్లించిన మొత్తాన్ని కూడా తగ్గిస్తారు. ఆదాయమూ తగ్గుతుంది. బేసిక్ లిమిట్ని రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. దీంతో పన్ను భారం తగ్గుతుంది. శ్లాబులు మార్చారు. వీటి వల్ల పన్ను భారం తగ్గుతుంది. రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను భారం ఉండకుండా రిబేటును పొందుపర్చారు. ఇది వేతన జీవులకు చిన్న ఊరట. -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలే!
నాకు పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఒకటి గడువు తీరడంతో కొంత మొత్తం చేతికి వచ్చింది. వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. అచ్చమైన ఈక్విటీ ఫండ్స్తో పోలిస్తే ఆటుపోట్లు తక్కువే. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలానికి ఈ ఫండ్స్లోనూ రిస్క్ ఉంటుంది. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ను కూడా పరిశీలించొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్లో మాదిరే ఉంటాయి. కాకపోతే వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉండడంతో, వాటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్కు వెళ్లొచ్చు. నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు వరకు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
సంపద సృష్టికి అనుకూలమైన ఫండ్: ఫండ్ రివ్యూ
మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. లార్జ్క్యాప్లో స్థిరత్వం, మిడ్క్యాప్లో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఎందుకంటే మిడ్క్యాప్, లార్జ్క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. రాబడులు ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు ఇవ్వలేక పోయింది. ఇందుకు మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది తప్పిస్తే దీర్ఘకాలంలో నమ్మకమైన పనితీరును గమనించొచ్చు. మూడేళ్లలో 20 శాతం, ఐదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే ‘నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ టీఆర్ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 7 శాతం, 18 శాతం, 13 శాతంగానే ఉండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పదేళ్లలో వార్షిక రాబడి 22 శాతంగా ఉంటే, ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి వార్షిక ప్రతిఫలం 20 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం/ పోర్ట్ఫోలియో లార్జ్క్యాప్, మిడ్క్యాప్నకు 35-65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.24,643 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 99 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, మిగిలిన ఒక శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 53.5 శాతం లార్జ్క్యాప్లో ఉంటే, మిడ్క్యాప్ కంపెనీల్లో 42 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్క్యాప్ కంపెనీలకు 4 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. ఈ పథకం పోర్ట్ఫోలియోలో 71 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్లోనే 36 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్లో 28 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత ఆటోమొబైల్లో కంపెనీల్లో 9.46 శాతం, ఇంధన రంగ కంపెనీల్లో 9.36 శాతం, టెక్నాలజీలో 8.22 శాతం, హెల్త్కేర్లో 7 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. దీంతో గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులను ఇవ్వలేకపోయింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం మొత్తం మీద మార్కెట్తో పోలిస్తే నష్టాలను పరిమితం చేసింది. -
మీకు ఈ పన్ను ప్రయోజనాల గురించి తెలుసా!
ఉమ్మడి కుటుంబంతో పలు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ కింద పేర్కొన్న ఉదాహరణలతో ఉమ్మడి కుటుంబం ద్వారా పన్ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు. ► పూర్వీకుల నాటి పొలం. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టడంతో నష్టపరిహారం వచ్చింది. వరహాలగారి వసంతమ్మగారికి. ఆమెకు ముగ్గురు అబ్బాయిలు. భర్త లేరు. నష్టపరిహారాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు ఉమ్మడి కుటుంబం మీద. వడ్డీ ప్రతి ఏటా రూ. 12 లక్షలు వస్తుంది. వసంతమ్మగారికి ప్రతి నెలా రూ. 1,00,000 పెన్షన్ వస్తుంది. ముగ్గురు పిల్లలూ ఉద్యోగస్తులే. అందరికీ అదే రేంజిలో జీతభత్యాలు. ► పూర్వీకులు ఇచ్చిన భవంతి మీద అద్దె ఏటా రూ. 9,00,000 వస్తుంది శ్రేష్టిగారికి. ఆయనకు కంపెనీలో పెద్ద ఉద్యోగం. రూ. 30,00,000 జీతం. శ్రేష్టిగారి తమ్ముడికి మంచి ఉద్యోగం, పెద్ద జీతం. అద్దెను ఎవ్వరూ వారి స్వంత అసెస్మెంట్లో చూపించరు. కుటుంబం పేరు మీదే లెక్కాడొక్కా. ► తనకున్న ఎనిమిది ఇళ్లనూ చూపిస్తూ, ఎటువంటి ఎగవేత లేకుండా అన్నింటికి పక్కా అగ్రిమెంట్లు, రెంట్లు, టీడీఎస్లు, పన్ను చెల్లింపులు సక్రమంగా చూపిస్తూ చక్రం తిప్పుతారు చక్రధర రావు చక చకా. ► తాతల నాటి ఇన్వెస్ట్మెంట్లు, షేర్లు, డిబెంచర్లమీద ఆదాయాన్ని కుటుంబం పేరిటే లెక్కిస్తున్నారు కోట్లకు ఎగబాకిన కోటేశ్వరరావు ఈ రోజుకీ. ► పూర్వీకుల నాటి నుంచి ఎంతో కలిసి వస్తున్న వ్యాపారం. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి ఎంతో మందికి. పేరు పక్కన ‘సన్స్’, పేరు పక్కన ‘బ్రదర్స్’ ఇటువంటి బాపతే. తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి పాస్తులే నాడూ, నేడూ శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుటుంబ వడ్డీ కుటుంబానికే వచ్చింది కాబట్టి అలా లెక్కించాలి. అప్పుడు పన్ను భారం రూ. 1,17,000 అవుతుంది. అలా కాకుండా రూ. 12,00,000 వడ్డీని నలుగురికి సమానంగా పంచితే తలా రూ. 3,00,000 వస్తుంది. ఒక్కొక్కరికి రూ. 93,600 చొప్పున అదనంగా పన్నుభారం పడుతుంది. 80సి, 80డి ప్రయోజనం అదనంగా రాదు. మొత్తం మీద రూ. 3,74,400 మిగులుతుంది. ఈ మేరకు పన్ను మిగిలినట్లే. -
ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పోర్ట్ఫోలియోలో ఒక్కటే మ్యూచువల్ ఫండ్, అది కూడా ఫ్లెక్సీక్యాప్ను కలిగి ఉండొచ్చా? ఎందుకంటే ఒక పథకం సైతం కనీసం 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది కనుక వైవిధ్యం ఉన్నట్టు అవుతుందిగా? పెట్టుబడుల విషయానికొస్తే వైవిధ్యం ఎంతో ముఖ్యమైనది. అన్ని గుడ్లను ఒక్కటే పెట్టెలో పెట్టడం సరికాదన్నట్టు.. పెట్టుబడులు అన్నింటినీ ఒక్కటే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది అనిపించుకోదు. అనుకున్న విధంగా సంబంధిత సాధనం పనితీరు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అది ప్రతికూలంగా మారిపోతే? అందుకే వైవిధ్యం అన్నది ఈ రిస్క్ను తగ్గించేస్తుంది. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. కొన్ని రకాల కంపెనీలు కొన్ని సమయాల్లో మంచిగాను, ప్రతికూలంగాను పనితీరు చూపిస్తుంటాయి. వివిధ కంపెనీలనేవి, వివిధ రంగాల నుంచి ఉండాలి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినవి అయి ఉండాలి. మెరుగ్గా నిర్వహించే ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలో అయినా ఈ విధమైన వైవిధ్యం ఉంటుంది. వివిధ కంపెనీలు, వివిధ రంగాలు, వివిధ పరిమాణాలతో కూడిన కంపెనీల (మార్కెట్ క్యాప్ ఆధారింగా సైజు) మధ్య పెట్టుబడులు విస్తరించి ఉంటాయి. అందుకే తగినంత భద్రత ఉంటుంది. కాకపోతే పెట్టుబడులు పెట్టే వారు ఫండ్ మేనేజర్ల పరంగా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం 20–30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల తగినంత వైవిధ్యం ఉంటుంది. కానీ, ఒక్కటే ఫండ్ మేనేజర్ పరిధిలో పెట్టుబడులను పరిమితం చేయడం వల్ల అది రిస్్కకు దారితీస్తుంది. ఒక్కటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పరిధిలోని వివిధ పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించినా కానీ, పెట్టుబడుల శ్రేణి ఒక్కటే ఉండడం వల్ల రిస్క్ ఉంటుంది. అందుకుని వివిధ ఫండ్స్ సంస్థల పరిధిలో వివిధ ఫండ్ మేనేజర్ల మధ్య మన పెట్టుబడులను విభజించుకోవాలి. మా నిర్ణయం ప్రకారం నాలుగు లేదా ఐదు ఫథకాలు ఈ విధమైన వైవిధ్యానికి సరిపోతాయి. ఇంతకుమించిన పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల అదనంగా వచ్చే వైవిధ్యం కానీ, రిస్క్ తగ్గడం కానీ ఉండదు. మరీ ఎక్కువ పథకాలు అయినా, పెట్టుబడుల సౌలభ్యం తగ్గుతుంది. నాణ్యమైన ఎంపికే రాబడులను నిర్ణయిస్తుంది. నా దగ్గర 1995లో కొనుగోలు చేసిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూనిట్లు ఉన్నాయి. వాటిని ఎలా విక్రయించాలి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలంటూ మేము మొదటి నుంచి సూచిస్తున్నాం. మీరు 25 ఏళ్లకు పైగా ఈ పెట్టుబడులను కొసాగించినందుకు అభినందనలు. ఫండ్ హౌస్ కస్టమర్ కేర్ను సంప్రదించడం ద్వారా మీ పెట్టుబడుల తాజా విలువ ఎంతన్నది తెలుసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్ నుంచి అయినా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్ తెరిచి, మై ఇన్వెస్ట్మెంట్స్ ట్యాబ్ కింద యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంపిక చేసుకోవాలి. మీ పెట్టుబడుల వివరాలను నమోదు చేయడం ద్వారా ఏ రోజుకారోజు వాటి విలువ ఎంతో చూసుకోవచ్చు. మీ దగ్గరున్న పెట్టుబడులను విక్రయించుకోవాలంటే, అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి చేసుకోవాలి. లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ (ఏఎంసీ) పంపిణీదారు అయిన క్యామ్స్ లేదా ఫిన్టెక్ ద్వారా కూడా రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిడెంప్షన్ ఫామ్ను పూరించి సమరి్పంచాలి. యూనిట్లను డీమెటీరియలైజ్ చేసుకుంటే, బ్రోకర్ ద్వారా విక్రయించుకోవచ్చు. -
అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!
జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. అవేమిటంటే.. ఇలా ఎన్నెన్నో .. యజమాని తన ప్రేమను కాసుల్లో కురిపిస్తే.. ప్రతి కాసు మీద పన్నుకట్టాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంది. మీరు ప్రస్తుతం ఇలాగే పన్ను కడుతున్నారు. ఏ సమస్యా లేదు. కానీ ఈ కింది వారిని ఒకసారి గమనించండి. లెక్కలమాస్టారికి లెక్క లేదు .. నగరంలో నంబర్ వన్ లెక్కల మాస్టారు నగధరరావుగారు. ఉదయం 4 గంటల నుండి ట్యూషన్లు, కాలేజీ టైమింగ్స్ తర్వాత నిశిరాత్రి దాకా కొనసాగుతుంటాయి. కానీ ట్యూషన్ ఫీజుల మీద పన్ను కట్టలేదు. అంతే కాకుండా పేపర్ సెట్టింగ్, వేల్యుయేషన్, ఇన్విజిలేషన్ మీద వచ్చేదీ ఎక్కడా అగుపడదు. డ్రిల్లు మాస్టారు యోగేశ్వర్రావుగారు కూడా అదే బాపతు. ఆయన యోగాలో ఎక్స్పర్టు. నగధరరావు గారిలా కాకపోయినా మూడుబ్యాచ్లు .. అరవై మంది పిల్లలు. ఇలా చిట్టీలు నడిపే చిదంబరం, బుక్స్ అమ్మే బుచ్చిరాజు, ఆవకాయలు .. పచ్చళ్లు పెట్టే అనంతయ్య, జ్యోతిష్యం చెప్పే జోస్యుల, సంగీతం చెప్పే సంగీత రావు, బ్యూటీపార్లరు బుచ్చమ్మ, హోమియో డాక్టర్ హనుమాన్లు, జంతికలు .. వడియాలు అమ్మే జనార్దన రావు, జీడిపప్పు .. కిస్మిస్ అమ్మే జీవనాధం, బట్టలు అమ్మే భుజంగం .. మొదలైనవారంతా మనకు కనిపిస్తూనే ఉంటారు. వీరి మీద మనకేం అసూయ లేదు .. ఏడుపూ ఉండదు. కానీ చట్టాన్ని పక్కన పెట్టి వీరు రాజ్యం ఏలుతున్నారు. ‘‘మేం కష్టపడి సంపాదిస్తున్నాం. తప్పేంటి?’’, ‘‘రెక్కాడితే గానీ డొక్కాడదు’’, ‘‘కష్టేఫలి’’, ‘‘చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడు’’ అంటూ వాదనకు దిగొద్దు. డిపార్ట్మెంట్ వారి దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కృత్రిమ మేథస్సు ద్వారా ఎంతో సేకరించారు. అసలే ‘‘డిజిటలైజేషన్ డేస్’’ .. తగిన జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి సైడు ఆదాయాలన్నింటిపైనా పన్ను చెల్లించండి. -
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి..
స్మాల్క్యాప్ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. కనుక ఒకటికి మించిన స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడులు చేసుకోవచ్చా? ఎందుకంటే అసెస్మెట్ మేనేజ్మెంట్ కంపెనీలన్నవి ఒక్కోటీ వేర్వేరు వెలుగు చూడని జెమ్స్ లాంటి కంపెనీలను గర్తించొచ్చు కదా..? – యోగేష్ పెట్టుబడులన్నవి ఎల్లప్పుడూ చాలా సులభంగా ఉండాలి. మేము అనుసరించే సూత్రం ఇదే. స్మాల్క్యాప్ పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించొచ్చా? అన్నది ప్రశ్న. పూర్తి స్థాయి పోర్ట్ఫోలియో నిర్మాణానికి వివిధ మార్కెట్ క్యాప్ సైజుల నుంచి నాలుగు లేదా ఐదు పథకాలను సూచిస్తుంటాం. చిన్న పోర్ట్ఫోలియో అయితే ఒక్కో కేటగిరీ నుంచి ఒక పథకాన్ని కలిగి ఉండొచ్చు. పెద్ద పోర్ట్ఫోలియో అయితే ఒకే విభాగం నుంచి రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు పథకాల మధ్య వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని గమనించి, ఆయా పథకాల పట్ల నమ్మకం ఏర్పడితే రెండు స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఇలా రెండు పథకాలను ఎంపిక చేసుకున్నప్పుడు వాటి పెట్టుబడుల పరంగా ఏకరూపత (ఒకే స్టాక్స్) 50% మించి ఉండకూడదు. ఏకరూపత అంటే రెండు స్మాల్క్యాప్ పథకాలు అవే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం. ఇంతకుమించితే పోర్ట్ఫోలియోకు రిస్క్ పెరుగుతుంది. ఈ రిస్క్ను వైవిధ్యం చేసుకునేందుకు.. వేర్వేరు పెట్టుబడుల విధానంతో కూడిన వేర్వేరు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సంబంధించి రెండు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ఏకరూపత రిస్క్ తగ్గుతుంది. మొత్తంపెట్టుబడుల్లో స్మాల్క్యాప్ విభాగానికి 20% మించకుండా చూసుకోవాలి. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న మార్గాలు ఏంటి? విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ రాబడి కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బ ణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్! -
పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్లేకుండా!
గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు.. రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. డెట్ ఫండ్స్లో మదుపు ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్ ఫండ్స్, అలాగే డైనమిక్ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్-రేట్ బాండ్లు (ఎఫ్ఆర్బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. లక్ష్యాల ఆధారిత ఫండ్స్ .. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా మల్టీ–అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్ సిప్, బూస్టర్ ఎస్టీపీ లేదా ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు .. వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా లేని వారికి గోల్డ్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండగలవు. -ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఎండీ, నిమేష్ షా -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్క్యాప్ ఫండ్స్ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్క్యాప్ ఫండ్స్కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్క్యాప్ ఫండ్స్లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్క్యాప్ ఫండ్స్లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్క్యాప్, లార్జ్క్యాప్తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్క్యాప్లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘ ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా? ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? ‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్మెంటు. పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. ‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్ఫేర్ అసోసియేషన్కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది. -
స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఎవరి పేరు పెట్టాలి?
ప్ర. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ సందర్భంలో అన్నీ కలిపి రూ. 1 కోటి వచ్చింది. ఆ మొత్తం బ్యాంకులో జమయింది. అందులో నుంచి రూ. 84 లక్షలతో హైదరాబాద్లో ఒక ఫ్లాటు కొన్నాను. డాక్యుమెంట్లో నా పేరు, నా భార్య పేరు, నా కుమారుడి పేరు రాయించి, రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాము. నా భార్యకు ఎటువంటి ఆదాయం లేదు. పాన్ ఉంది. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి. కేవలం జీతమే ఉంది. 2022 మార్చి 31 నాటికి రిటర్ను వేస్తే నోటీసు వచ్చింది. అందులో ఈ ఫ్లాటు కొన్నట్లుంది. వివరణ అడుగుతున్నారు. ఏం చేయాలి? జ. ఫారం 26 ఏఎస్లో ఉన్న సమాచారాన్ని డిపార్టుమెంటు వాళ్లు ఎనిమిది రకాల సంస్థల నుండి సేకరిస్తారు. ఈ సంస్థలు ప్రతి సంవత్సరం వారి దగ్గర వ్యవహారాలను డిపార్టుమెంటుకి తెలియజేస్తారు. ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఇలా వారి దగ్గర జరిగిన క్రయవిక్రయాల వివరాలు .. స్థిరాస్తి వివరాలు, అమ్మిన తేదీ, విలువ, అమ్మకందారు వివరాలు, కొన్న వ్యక్తి వివరాలు మొదలైనవి తెలియజేస్తారు. డిపార్టుమెంటు వారు అటు అమ్మిన వ్యక్తికి, ఇటు కొన్న వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. ఫారం 26ఏఎస్, ఫారం ఏఐఎస్ .. రెండూ వెబ్సైటులో ఉంటాయి. నిజానికి మీరు రిటర్ను దాఖలు చేసినప్పుడు ఫారం 16, 16ఏ ఇతర డాక్యుమెంట్లతో పాటు ఈ రెండూ చూడాలి. ఈ స్టేట్మెంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు జరిపిన వ్యవహారాలు ఉంటాయి. ఇదొక చిట్టా. డైరీలాంటిది. గడిచిన వైభవం. గడిచిన వైనం. ఇక మీ కేసులో మీకు మీ రిటైర్మెంటు సందర్భంలో వచ్చిన మొత్తాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. కానీ రిటర్ను వేసేటప్పుడు ఒక కాలంలో ఇటువంటి మినహాయింపు ఉన్న అంశాలను ప్రస్తావించాలి. వాటిలో ఇటువంటి వాటి గురించి రాయాలి. అలా రాసినప్పుడు మీరు వివరణ సులువుగా ఇవ్వొచ్చు. స్థిరాస్తుల క్రయంలో.. అంటే కొనేటప్పుడు కుటుంబ సభ్యుల పేరు రాసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేవు. అభ్యంతరం లేదు. డబ్బులు మీవి అయినా మీరు కాగితాల్లో మీ శ్రీమతి గారి పేరు, మీ అబ్బాయి పేరు రాసుకోవచ్చు. వివరణ ఇవ్వక్కర్లేదు. సెంటిమెంటల్ కానివ్వండి, లో లోపల ఒప్పందం కానివ్వండి, కుటుంబపు మర్యాద అనండి, ముందు చూపు అనుకోండి, సౌల భ్యం అనుకోండి, సమస్య లేకుండా అనుకోండి, అవాంతరాలు లేకుండా అనుకోండి. ఇలా ఏ కారణమయినా ఫర్వాలేదు. ఇది సమస్య కాదు. వ్యవహారం జరిగిందా లేదా? ఎంతకు కొన్నారు? ఎవరి దగ్గర్నుంచి కొన్నారు? విలువ ఎంత? అది ఎలా చెల్లించారు? ఆ చెల్లింపులకు ‘‘సోర్స్’’ ఏమిటి? మీ అబ్బాయికి నోటీసు వచ్చినా.. మీ అబ్బాయిని వివరణ అడిగినా ఏం గాభరా పడక్కర్లేదు. రూ. 84 లక్షల కొనుగోలుకి ‘‘సోర్స్’’ ఉందంటున్నారు. బ్యాంకు అకౌంటులో ముందుగా క్రమంగా ‘‘సోర్స్’’ జమ అయి ఉండాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డెబిట్లు.. లేదా ఖర్చుల పద్దులు ఉండాలి. నేను కొన్నాను అని, జాయింటు కొనుగోలుదార్లలో ఒకరినని.. పెట్టుబడి మాత్రం.. ‘‘సోర్స్’’ మాత్రం మా నాన్నగారిదని కాగితాలతో సహా జతపర్చి జవాబు ఇస్తే సరిపోతుంది. చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్! -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ విషయాలు తెలుసా మీకు?
మ్యూచువల్ ఫండ్స్లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? ఇన్వెస్టర్లు దీని కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరా? -దిలీప్ సాహి కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యం. ఈ ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. 2015లో ఎంఎఫ్యూ ఏర్పాటు తర్వాత ఇన్వెస్టర్లు ఇందులో క్యాన్ తెరిచి వాటన్నింటినీ దీని నుంచే నిర్వహించుకునే ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది. ఏ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలో ఇన్వెస్ట్ చేసినా క్యాన్కు మ్యాపింగ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నింటినీ ఈ ఖాతానుంచే చూసుకోవచ్చు. నిర్వహించుకోవచ్చు. తాజా పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణలు, కాంటాక్టు వివరాల్లో మార్పులు అన్నీ కూడా క్యాన్లో చేసుకుంటే సరిపోతుంది. క్యాన్ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలని లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పాన్, ఫొటో, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆదాయ మూలం తదితర వివరాలతో ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థను లేదా క్యామ్స్ తదితర ఫిన్టెక్ ప్లాట్ఫామ్లను సంప్రదించి కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈటీఎఫ్లకు సంబంధించి డివిడెండ్లు నా బ్యాంకు ఖాతాకు జమ అవుతాయా? పన్ను ఎలా లెక్కిస్తారు? -శరణ్ డివిడెండ్లు అన్నవి కంపెనీ నుంచి వాటాదారులకు అందే లాభాలు. మన దేశంలో ఈటీఎఫ్లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు చెల్లించడం లేదు. దీనికి బదులు డివిడెండ్ రూపంలో కంపెనీల నుంచి వచ్చిన మొత్తాన్ని ఈటీఎఫ్లు తిరిగి అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో బెంచ్మార్క్ రాబడులకు, ఈటీఎఫ్ రాబడులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఈటీఎఫ్లు బెంచ్మార్క్ను అనుసరించే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఈ రెండింటి మధ్య డివిడెండ్ల రూపంలో వచ్చిన రాబడుల వ్యత్యాసాన్ని ట్రాకింగ్ ఎర్రర్గా పరిగణిస్తారు. ‘గతంలో ఈటీఎఫ్లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు ప్రకటించేవి. కానీ, ఇప్పుడు కేవలం లిక్విడ్ ఈటీఎఫ్ల వరకే ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటిస్తున్నాయి. వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి’అని ఓ ప్రముఖ ఫండ్ హౌస్ సీనియర్ అధికారి ఈ విషయంలో సమాచారాన్ని తెలియజేశారు. ఇక డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం 2020-21 తర్వాత నుంచి ఇన్వెస్టర్ల ఆదాయంగా పరిగణించి పన్ను అమలు చేస్తున్నారు. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
ఐటీ రిఫండ్ చెక్ చేసుకున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి!
ఆదాయపు పన్ను శాఖ ఈ మధ్య అంటే.. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకూ రూ. 1.14 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్లు జారీ చేసింది. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారు మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. రిఫండ్ క్రెడిట్ అయి ఉంటుంది. క్రెడిట్ కాకపోతే వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోండి. అన్ని వివరాలు కరెక్టుగా ఉండి.. పన్నుకి సంబంధించిన వివరాలు ఫారం 26 అ ప్రకారం సరిగ్గా ఉంటే మీరు క్లెయిం చేసిన రిఫండు క్రెడిట్ అవుతుంది. ఎంత మొత్తం రిఫండు వస్తుంది.. మీరు దాఖలు చేసిన రిటర్నులోని అన్ని అంశాలు క్షుణ్నంగా చెక్ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే మీరు క్లెయిం చేసినదంతా వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసినట్లయితే, రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. మీరు క్లెయిం చేసిన మొత్తం కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆ ఎక్కువ మొత్తం వడ్డీ అనుకోండి. ఈ రెండింటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఫారం 26 అ లో ఈ మేరకు ఎంట్రీలు కనిపిస్తాయి. అప్పుడు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఫారం 26 అ డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీని మీ ఇన్కంట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. మీ సులువు కోసం .. సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఒక ఫైల్ నిర్వహించుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మీ రిఫండు.. మీ ఆదాయం కాదు. దాని మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. మీకు వచ్చిన ఈ రిఫండుని ప్రస్తుత సంవత్సరం రిటర్ను వేసినప్పుడు ‘మినహాయింపు ఆదాయం‘ కింద చూపెట్టుకోవచ్చు. లేదా అధికారులు అడిగినప్పుడు ఈ జమ మొత్తం .. ఆదాయం కాదు అని, రిఫండు వచ్చిందని రుజువులతో పాటు విశదీకరించాలి. అదనంగా వచ్చిన మొత్తం వడ్డీని మాత్రం ప్రస్తుత సంవత్సరంలో ఆదాయంగా, ఇతర ఆదాయాల కింద చూపించాలి. దీని మీద ఎటువంటి మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ.. పన్నుకి గురి అవుతుంది. ఈ వడ్డీ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి. రిఫండు తక్కువ రావచ్చు.. మీ రిఫండు క్లెయిం చేసినప్పటికీ పూర్తి మొత్తం రావచ్చు .. లేదా తగ్గవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల, అంకెల తప్పుల వల్ల, ట్యాక్స్ క్రెడిట్లు తప్పుగాా రావడం వల్ల మీ ఆదాయం పెరగవచ్చు .. మినహాయింపులు తగ్గనూ వచ్చు. ఆదాయంలో మార్పుల వల్ల, పన్నుల చెల్లింపులు తక్కువ కావడం వల్ల, రిఫండు తక్కువ రావచ్చు. ఇందులో తప్పులుంటే మీరు తెలియజేయవచ్చు. రాకపోనూ వచ్చు .. అవును. ఒక్కొక్కప్పుడు ఈ సంవత్సరం రిఫండును అసెస్ చేసి, ఆర్డర్ పాస్ చేసి.. గత సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం సర్దుబాటు చేసుకుంటున్నాం అని కూడా అంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆ మేరకు నిజమే అయితే ఊరుకోండి. కాకపోతే వివరణ ఇచ్చి, సవరించుకోండి. చివరిగా మీకు వచ్చిన రిఫండు అనేది ఆదాయం కాదని, అదనంగా వచ్చేది వడ్డీ అని, పన్నుకు గురవుతుందని గుర్తుపెట్టుకోండి. -
వారసత్వంగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్పై పన్ను కట్టాల్సిందేనా?
నాకు వారసత్వంగా వచ్చిన ఫండ్స్ ప్రస్తుత విలువ రూ.10 లక్షలు. కానీ, వాటిని కొనుగోలు చేసిన సమయంలో చేసిన పెట్టుబడి రూ.5 లక్షలే. నేను విక్రయించే సమయంలో రూ.15 లక్షలు ఉంటే అప్పుడు మూలధన లాభాల పన్నును ఎలా లెక్కిస్తారు? వాస్తవంగా కొనుగోలు చేసిన ధర నుంచి చూసి పన్ను చెల్లించాలా..? లేక నాకు బదిలీ అయిన నాటి విలువనే పరిగణనలోకి తీసుకుంటారా? – తరుణ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారు మరణిస్తే ఆ యూనిట్లను నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేస్తారు. ఇలా ఒకసారి బదిలీ చేసిన తర్వాత పన్ను అంశంపై సందేహం ఏర్పడడం సహజమే. అదృష్టవశాత్తూ మనదేశంలో వారసత్వ పన్ను లేదు. మీ తల్లిదండ్రులు లేదా మరొకరి నుంచి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు మీకు బదిలీ అయితే పన్ను చెల్లించక్కర్లేదు. కాకపోతే ఆ యూనిట్లను విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించినప్పుడు ఉండే బాధ్యతలే మీకు వర్తిస్తాయి. మూలధన లాభాల పన్ను విషయానికొస్తే ఆ పెట్టుబడిని ఎంత కాలం కొనసాగించారు (అసలు కొనుగోలు నాటి నుంచి) అనే దాని ఆధారంగా నిర్ణయానికి రావాలి. ఇక్కడ అసలు మొదట కొనుగోలు చేసిన తేదీనే పన్ను కోసం పరిగణనలోకి తీసుకుంటారు. మీకు బదిలీ అయిన తేదీ లెక్కలోకి రాదు. ఉదాహరణకు రవి తండ్రి రూ.5 లక్షలను ఓ పథకంలో 2019లో ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం. అప్పుడు అతని తండ్రి యూనిట్దారు అయితే, రవి నామినీ అవుతారు. దురదృష్టవశాత్తూ రవి తండ్రి గతేడాది మరణించారు. ఆయన పేరిట ఉన్న యూనిట్లు రవికి బదిలీ అయ్యాయి. బదిలీ అయ్యే నాటికి ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు వాటి విలువ రూ.7.80 లక్షలు ఉంది. రవి ఆ పెట్టుబడులను విక్రయించాలని అనుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడులను 2019 నుంచి కొనసాగించినట్టు చూస్తారు. ఈక్విటీ పథకంలో పెట్టుబడులు కనుక హోల్డింగ్ పీరియడ్ ఏడాదికిపైనే ఉంది. లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. మొదటి రూ.లక్ష లాభాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 10 శాతాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విక్రయించే నాటి విలువ రూ.7.80 లక్షల్లో పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయిస్తే అప్పుడు లాభం రూ.2.80 లక్షలు అవుతుంది. రూ.లక్ష లాభం మినహాయిస్తే, మిగిలిన రూ.1.80 లక్షల లాభంపై 10 శాతం పన్ను చొప్పున రూ.18,000 చెల్లించాలి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ గణేశ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసేది. వాటి పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ లేదా ఈక్విటీల్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్వోఎఫ్లను ఆయా ఫండ్స్ హౌస్లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్వోఎఫ్లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్వోఎఫ్లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్వోఎఫ్లు వేరే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండంచెల్లో ఎక్స్పెన్స్ రేషియో భారాన్ని మోయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఎఫ్వోఎఫ్లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో భరించాలని అర్థం చేసుకోవాలి. ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్వోఎఫ్లు నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. -
ఫ్లాట్ అమ్ముతున్నారా? అయితే ఈ విషయాలు గమనించండి
ప్రశ్న: నేను హైదరాబాద్లో నా ఫ్లాట్ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్ జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. ♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి. ♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు. ♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి. ♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్లైన్లో దొరుకుతుంది. ♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు. ♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు. ♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి. ♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. ♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి. ♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి. నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త -
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్: వారం/నెలవారీ సిప్ ఏది బెటర్?
ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్దీప్ సింగ్ ముందుగా ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. అందుకుని ముందు మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఎందుకు వైదొలుగుతున్నదీ సూక్ష్మంగా విశ్లేషించుకోవాలన్నది నా సూచన. ఆ తర్వాతే ఒకే విడతగానా లేదంటే ఎస్డబ్ల్యూపీ రూపంలోనా అన్న అంశానికి రావాలి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని సిస్టమ్యాటిక్గా వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా అవుతుంది. సిప్ రూపంలోఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం/నెలవారీ సిప్లలో ఏది బెటర్? – అమర్ సహాని వీక్లీ సిప్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్మెంట్ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. దీనివల్ల నెలలో నాలుగు సార్లు పెట్టుబడులు పెట్టుకున్నట్టు అవుతుంది. దీని కారణంగా మీ ఖాతాలో లావాదేవీల సంఖ్య చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందికరమే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్నే ఇన్వెస్టర్లకు సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్కు వెళ్లమనే నా సూచన. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
డబుల్పేమెంట్ జరిగిందా? స్టాక్మార్కెట్లో నష్టాలా? రిఫండ్ ఎలా?
ప్ర. నా పాన్ అకౌంటు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశాను. డిపార్ట్మెంట్ వారు ‘‘రిఫండ్ ఫెయిల్’’ అని మెసేజీలు పంపుతున్నారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే, ‘‘ఈ సమస్య మాది కాదు.. ఆదాయ పన్ను శాఖదే’’ అంటున్నారు. ఏం చేయాలి? – రాజు లక్ష్మి, ఈమెయిల్ ద్వారా జ. ఇటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నిజంగా రెండూ అనుసంధానం అయిన పక్షంలో ‘‘రిఫండ్ ఫెయిల్’’ అయిందంటున్నారు కాబట్టి రెండు వైపులా చెక్ చేయండి. బ్యాంకులో మళ్లీ సంబంధించిన కాగితాలివ్వండి. ఆ తతంగం ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ సైట్లోకి వెళ్లి మీ రిఫండ్ క్లెయిమ్ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసి, రీవేలిడేట్ చేయండి. సాంకేతిక సమస్యల వల్ల రికార్డులను అప్డేట్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రీవేలిడేట్ చేసిన తర్వాత రిఫండు వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్లో ఉండి ఉంటే ఫర్వాలేదు. లేదంటే పోర్టల్లో ఒక కంప్లెయింట్ ఇవ్వండి. గ్రీవెన్సును నమోదు చేయవచ్చు. ( జ. సీపీసీ నుండి 143 (1) సమాచారం వచ్చింది. ‘‘సమాచారం మెయిల్కి పంపుతున్నాము. డిమాండ్ ఉంది .. చెల్లించాలి’’ అని ఉంది. ఏం చేయాలి. – కర్ణ, ఈ–మెయిల్ ద్వారా జ. గత వారాల్లో 143 (1) సమాచారం గురించి సవివరంగా తెలియజేశాం. 143 (1) సెక్షన్ సమాచారం కోసం, మెయిల్ కోసం వేచి ఉండండి. ఆ ఆర్డరులో ఏయే కారణాల వల్ల డిమాండ్ ఏర్పడిందో విశ్లేషించండి. అది కరెక్టు అయితే చెల్లించండి. కాకపోతే విభేదిస్తూ జవాబు ఇవ్వవచ్చు. సరిదిద్దవచ్చు. తగినకాలంలో సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు. ప్ర. నేను ఉద్యోగిని. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నష్టం వచ్చింది. జీతం రూ. 5,00,000 దాటింది. రిటర్ను వేయాలా? ట్యాక్స్ ఎంత చెల్లించాలి? – మహ్మద్ షకీర్, ఈ–మెయిల్ ద్వారా జ. ఒక వ్యక్తికి ఒక పాన్ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎన్ని సోర్స్ల ద్వారా ఆదాయం వచ్చినా ఒకే రిటర్నులో చూపించి ఒకేసారి వేయాలి. మీరు మీ జీతం వివరాలు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలతో కలిపి ఒక రిటర్ను వేయాలి. స్టాక్ మార్కెట్లో 31-03-2023 నాటికి ఏర్పడ్డ లాభనష్టాలను తేల్చి, తెలుసుకుని వేయాలి. మీ బ్రోకింగ్ సంస్థ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అన్ని వివరాలుంటే తప్ప పన్ను భారం నిర్ధారించలేము. ప్ర. ప్రభుత్వం డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫారం 26ఏఎస్లో నమోదు కాలేదు. ఆ మేరకు డైరెక్టుగా చెల్లించి, రిటర్న్ దాఖలు చేశాను. ఈ నెలలో టీడీఎస్ పద్దులు నమోదయ్యాయి. – సుధా భరత్, ఈ-మెయిల్ ద్వారా జ. ఫారం 26ఏఎస్లో చెల్లింపుల గురించి మనం గత వారమే తెలుసుకున్నాం. ఎంట్రీలు ఆలస్యంగా పడటం, పడకపోవడం, తప్పులు పడటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉంటున్నాయి. మీ కేసులో డబుల్ పేమెంటు జరిగినట్లు. మీరు చేసిన చెల్లింపు, టీడీఎస్ ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినట్లయితే ఈ లోపల డిపార్టుమెంటు వారు అసెస్మెంటు చేసి రిఫండు ఇస్తారు. లేదా మీ అంతట మీరే స్వయంగా రివైజ్ చేసుకోవచ్చు. ఏదేనీ కారణం వల్ల ఎంట్రీలు తప్పుగా పడితే సరిదిద్దండి. సంవత్సరం మారితే డబుల్ పేమెంటు కాదు. ఒకే సంవత్సరానికి సంబంధించి, ఒకే ఆదాయం అయితే మీకు రిఫండు వస్తుంది. కేసీహెచ్ ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
ఫండ్స్లో సక్సెసివ్ నామినేషన్ ఎలా?
నా వయసు 63 ఏళ్లు. మ్యూచువల్ ఫండ్స్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సరైన ప్లాన్ను సూచించగలరు. – టీఆర్ లక్ష్మణన్ రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధి చేతికి అందుతుంది. లేదా ఇతర పెట్టుబడుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రావచ్చు. వీటిని మెరుగైన సాధనంలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైనదే. దీనికంటే ముందు దేని కోసం చూస్తున్నారు? పెట్టుబడుల నుంచి ఏమి ఆశిస్తున్నారు? అనే దానిపై స్పష్టత అవసరం. జీవన వ్యయాల కోసం క్రమం తప్పకుండా పెట్టుబడుల నుంచి ఆదాయం కోరు కుంటున్నారా? లేక సదరు పెట్టుబడిని దీర్ఘకాలం కోసం అట్టిపెట్టి, మంచి వృద్ధిని కోరుకుంటున్నారా? రెగ్యులర్ ఆదాయం కోరుకుంటున్నట్టయితే, మరే ఇతర ఆదాయం వనరు లేకపోతే అప్పుడు.. మీ వద్ద నిధిని రెండు భాగాలు చేయాలి. ఇందులో 30–40 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించాలి. మిగిలిన భాగాన్ని స్థిరాదాయ పథకాలకు (డెట్ ఫండ్స్) కేటాయించాలి. ఈక్విటీల్లో పెట్టుబడులు వృద్ధిని చూపిస్తాయి. జీవిత చరమాంకంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఆదాయం కోసం ఇది ఉపయోగపడుతుంది. డెట్ ఫండ్స్ నుంచి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాన్ని నెలవారీ వ్యయాల కోసం ఉపయోగించుకోవచ్చు. స్థిరాదాయం కోసం ప్రభుత్వ మద్దతు ఉండే సాధనాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) లేదా ప్రధానమంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై)కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ రెండు పథకాల్లో వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. అత్యవసరాల కోసం కొంత నిధిని బ్యాంకు ఖాతాలో లేదంటే ఎఫ్డీలో లేదా అధిక నాణ్యతతో కూడిన డెట్ పథకంలో పెట్టుకోవచ్చు. ఈక్విటీకి కేటాయించిన మొత్తాన్ని కొంచెం రక్షణాత్మక ధోరణితో నిర్వహించే ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక మొత్తాన్ని ఒకే విడత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవద్దు. దీన్ని 18–24 నెలల సమాన వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీర్ఘకాలంలో మీ పెట్టుబడి మంచిగా పెరగాలని కోరుకుంటున్నట్టు అయితే, ఈక్విటీ కేటాయింపులను 50–70 శాతానికి కూడా పెంచు కోవచ్చు. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం హైబ్రిడ్ ఫథకాలను పరిశీలించొచ్చు. వీటిల్లో పెట్టుబడులు వాటంతట అవే రీబ్యాలన్స్ అవుతుంటాయి. మీకు ఇప్పటికే తగినంత ఆదాయ వనరులు ఉంటే, మీదగ్గర ఉన్న పెట్టుబడిని ఈక్విటీలకు దీర్ఘకాలం కోసం కేటాయించుకోవచ్చు. లేదంటే నెలవారీ అవసరాలకు కావాల్సినంత వచ్చేలా డెట్లోనూ, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో సక్సెసివ్ నామినేషన్ అనుమతిస్తారా? అంటే నామినీ ఏ చనిపోతే, నామినీ బీ అర్హులు అవుతారా?- ఆర్పీ సూద్ అకాల, ఊహించని మరణం చోటు చేసుకుంటే పెట్టుబడులు, ఆస్తులు కుటుంబ సభ్యులకు సులభంగా బదిలీ అయ్యేందుకు నామినేషనల్ వీలు కల్పిస్తుంది. నామినేషన్ ఉన్నట్టయితే మ్యచువల్ ఫండ్స్ను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. లేదంటే పెట్టుబడుల బదిలీ ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. సక్సెసివ్ నామినేషన్ అంటే.. ఓ పథకంలో ఏ అనే వ్యక్తి పెట్టుబడి దారుడు అయితే, బీ అనే వ్యక్తి నామినీగా, సీ అనే వ్యక్తి సక్సెసివ్ నామినీగా ఉన్నారని అనుకుందాం. అప్పుడు ఏ చనిపోతే.. యూనిట్లను నామినీ బీకి బదిలీ చేస్తారు. ఒకవేళ బీ కూడా అందుబాటులో లేకపోతే, సీకి అవి బదిలీ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్లో ప్రస్తుతానికి ఈ ఆప్షన్ లేదు. కాకపోతే దీన్ని ఓ వీలునామా ద్వారా చేసుకోవచ్చు. యూనిట్ హోల్డర్ వీలునామా రాస్తూ, అందులో ఫండ్స్ పెట్టుబడులకు సక్సెసివ్ నామినీలను నమోదు చేసుకోవాలి. సక్సెసివ్ నామినీలుగా ఎంత మందిని అయిన పేర్కొనవచ్చు. లేదంటే జాయింట్ అకౌంట్ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఒక మార్గం. ఇక్కడ ఏ, బీ ఫండ్స్ పెట్టుబడులకు జాయింట్ ఖాతాదారులుగా ఉంటారు. సీ నామినీగా వ్యవహరిస్తారు. ఏ చనిపోతే జాయింట్ హోల్డర్ అయిన బీ ఆ యూనిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు నామినీగా సీ యథావిధిగా అమలవుతుంది. బీ కూడా చనిపోయిన సందర్భంలో నామినీగా ఉన్న సీకి యూనిట్లు బదిలీ అవుతాయి. -
ఫండ్స్ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా?
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి? – బ్రిజ్ మోహన్లాల్ గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ను 2021 డిసెంబర్లో సుందరం మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబాస్లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్ ఫండ్కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్ ఫండ్స్ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్ ఏ, ఫండ్ బీని తీసుకుందాం. ఫండ్ ఏను తీసుకెళ్లి ఫండ్ బీలో విలీనం చేశారు. ఫండ్ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్ బీ ఎన్ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి: ఈ పొరబాటు అసలు చేయకండి!
మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఒక పథకం ఎన్ఏవీ తక్కువగా ఉంటే.. దాన్ని చౌకగా భావించొచ్చా..? పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీసుకోవచ్చా? -జగదీశ్వర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఎన్ఏవీ అంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్ఫోలియో (పెట్టుబడులు) మార్కెట్ విలువను మొత్తం యూనిట్లతో భాగించగా వచ్చేదే ఎన్ఏవీ. ఒక పథకానికి సంబంధించి ఒక యూనిట్ విలువను ఇది చెబుతుంది. ఒక కంపెనీ షేరు మాదిరే, ఒక పథకం యూనిట్ అని అనుకోవచ్చు. ఒక యూనిట్ను కొనుగోలు చేసుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇది తెలియజేస్తుంది. అలాగే, ఒక యూనిట్ను విక్రయిస్తే ఎంత వస్తుందో చెప్పడానికి ప్రామాణికమే ఎన్ఏవీ. ఎన్ఏవీ ధర ఎన్ఏవీ విలువను చూసి ధరగా భావించొద్దు. తులం బంగారం కొనుగోలు చేద్దామని జ్యుయలరీ షాపునకు వెళ్లారని అనుకుందాం. 10 గ్రాములు రూ.50వేలు ఉంది. వెండి తులం ధర రూ.600. దీంతో చౌకగా వస్తుందని వెండిని కొనుగోలు చేసుకుని వెళతారా? ఒకవేళ కొనుగోలు చేసినా అది బంగారం కాదు. బంగారానికి ఉన్న విలువ రాదు. ఈ రెండింటి ధరలను పోల్చడానికి లేదు. అలాగే, రెండు పథకాల ఎన్ఏవీ కూడా అంతే. ఒక పథకం ఎన్ఏవీ చౌకగా ఉందని దాన్ని కొనుగోలు చేస్తామంటే అది సరి కాదు. ఎన్ఏవీ తక్కువగా ఉన్నది మెరుగైన పథకం కావాలని లేదు. ఒక పథకం నిర్వహణలోని పెట్టుబడుల మార్కెట్ విలువ మారినప్పుడు, తాజా పెట్టుబడులు, అదే పథకంనుంచి ఇన్వెస్టర్లు ఉప సంహరించుకున్న మొత్తం ఇవన్నీ కూడా పరిగణనలోకి వచ్చే అంశాలే. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే ఫండ్ ఎన్ఏవీ రూ.10 ఉంది. వై అనే ఫండ్ ఎన్ఏవీ రూ.50 ఉంది. ఏడాది కాలంలో ఈ రెండు పథకాలు ఒకే విధంగా 25 శాతం రాబడి ఇచ్చాయని అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఫండ్ ఎన్ఏవీ రూ.10 నుంచి రూ.12.50 అవుతుంది. వై ఫండ్ ఎన్ఏవీ రూ.50 నుంచి రూ.62.50 అవుతుంది. ఆయా పథకాల పెట్టుబడులపై వచ్చిన రాబడి ఆధారంగా ఎన్ఏవీలో మార్పులు ఉంటాయి. అంతేకానీ, ఎన్ఏవీ తక్కువగా ఉంటే చౌక, ఆకర్షణీయమని అనుకోవద్దు. వ్యయాలను మినహాయించిన తర్వాతే పనితీరు చూస్తారా? -విణదమ్ వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ వెబ్సైట్లో ఫండ్స్ పనితీరును వాటి ఎన్ఏవీలో వృద్ధి ఆధారంగా లెక్కిస్తుంటాం. వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎన్ఏవీపై నిర్ణయానికి వస్తాం. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల విలువను, మొత్తం యూనిట్లతో భాగించగా ఎన్ఏవీ వస్తుందని తెలుసుకదా. ఇక్కడ పథకానికి సంబంధించి అన్ని వ్యయాలను, నిర్వహణ ఫీజులను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అప్పుడు నికర విలువ వస్తుంది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్కెట్ ముగిసిన తర్వాత పెట్టుబడుల విలువ ఆధారంగా, వ్యయాలను మినహాయించి పథకాల ఎన్ఏవీలను ఖరారు చేస్తుంటుంది. ఆయా ఫండ్ పథకాలు రోజువారీగా ప్రకటించే ఎన్ఏవీల ఆధా రంగానే మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులను లెక్కిస్తుంటాం. ఉదాహరణకు ఒక పథకం ఎన్ఏవీ రూ.12 ఉందనుకుంటే, ఏడాది క్రితం ఇదే పథకం ఎన్ఏవీ రూ.10గా ఉంటే, ఏడాదిలో 20 శాతం రాబడులను ఇచ్చినట్టు. ఒకవేళ ఎన్ఏవీ రూ.12 నుంచి రూ.10కు తగ్గితే అప్పుడు 20 శాతం నష్టాలను ఇచ్చినట్టు. ఏడాదికాలానికి మించి రాబడులను చూసే సమయంలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు
నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – సిర్ముఖుద్దమ్ మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగానూ అనుకూలంగా ఉంటుంది. డెట్ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే డెట్ ఫండ్ అయితే పెట్టుబడి మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. ద్రవ్యోల్బణ తరుగు ప్రభావం మినహాయించిన తర్వాత మిగిలిన లాభంపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ డెట్ ఫండ్లో పెట్టుబడిని మూడేళ్లలోపు ఉపసంహరించుకుంటే అప్పుడు లాభం ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే ఆదాయానికి కలుస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్ ఫండ్స్లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి. కాకపోతే, నాణ్యమైన డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. నాకు ఎన్పీఎస్ పథకంలో టైర్ 1, టైర్ 2 ఖాతాలున్నాయి. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్స్లో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల్లో అస్థిరతలు.. షార్ట్ డ్యురేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్తో పోలిస్తే సహజంగా ఎక్కువ. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి కనుక, స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. అందుకని సమీప కాలానికి ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు సైతం అంత చక్కని ప్రదర్శన ఇవ్వవు. అయితే, ఈ అస్థిరతలు ఎప్పుడూ కూడా స్వల్పకాలంలోనే. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో చూసుకుంటే గిల్ట్ ఫండ్స్లో రాబడులు ఏమీ లేవని చెప్పుకోవాలి. కానీ మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. కనుక పెట్టుబడులపై, రాబడులపై అంత ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను మీరు తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో మీరు యాక్టివ్గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కనుక కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: మార్కెట్ అస్థిరతలను తట్టుకోవడం ఎలా? -
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
గోల్డ్ ఈటీఎఫ్, సావనీర్ గోల్డ్ బాండ్ ఏది బెటర్?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో నాకు పెట్టబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నామినీ పేరుమీదకు అప్పుడు బదలాయిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే అందుకు మార్గం లేదు. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. గోల్డ్ ఈటీఎఫ్లతో సావరీన్ గోల్డ్ బాండ్లను పోల్చి చూడడం ఎలా? ఎస్జీబీలు మెరుగైన ఆప్షనేనా? - జోసెఫ్ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈటీఎఫ్లతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీలు) మెరుగైన ఆప్షన్ అవుతాయి. ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం ధరల్లో వృద్ధికి ఇది అదనపు ప్రయోజనం. కానీ, గోల్డ్ ఈటీఎఫ్లు అలా కాదు. మార్కెట్ ధరల పరంగా వచ్చిన లాభం ఒక్కటే ప్రయోజనం. ఎస్జీబీల్లో వడ్డీని అదనపు ప్రయోజనం కింద చూడాలి. ఎస్బీజీలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి వ్యయాలు, నిర్వహణ చార్జీల్లేవు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఎక్స్పెన్స్ రేషియో పేరిట ఒక శాతం కోల్పోవాల్సి వస్తుంది. పన్నుల పరంగా చూసినా ఎస్జీబీలు మెరుగైనవి. ఎస్జీబీల్లో బంగారం ధరల వృద్ధి రూపంలో వచ్చే లాభంపై పన్ను లేదు. 8 ఏళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం. ఎస్జీబీలో పెట్టుబడిపై ఏటా స్వీకరించే 2.5 శాతం వడ్డీ ఆదాయం మాత్రం పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ల ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే ఎస్జీబీల లాభంపై పన్ను పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్ల్లో లాభం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. అది కూడా ఈక్విటీయేతర మూలధన లాభాల పన్ను అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఒక్కలిక్విడిటీ విషయంలోనే ఎస్జీబీలు ఈటీఎఫ్ల కంటే దిగువన ఉంటాయి. ఎస్జీబీలను ఐదేళ్ల తర్వాత నుంచి ఆర్బీఐకి స్వాధీనం చేసి పెట్టుబడిని పొందొచ్చు. ఐదేళ్లలోపు అయితే స్టాక్ ఎక్సేంజ్ల్లో విక్రయించుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్లు అలా కాదు. వాటికి లిక్విడిటీ తగినంత ఉంటుంది. కనుక గడువులోపు విక్రయించుకోవాల్సిన అవసరం లేని వారికి ఎస్జీబీలు మెరుగైనవి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
బంగారం మంచి పెట్టుబడి సాధనం కాదు! పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి?
నేను ఏటా ఒక లక్ష రూపాయల చొప్పున 15 ఏళ్లపాటు సావరీన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తుందా? – సుధాకర్ దీనికి జవాబు తెలుసుకోవడానికి ముందు నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్బీస్ పథకాన్ని ఒక సారి పరిశీలించాలి. గోల్డ్ ఫండ్స్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పథకం ఇది. ఇందులో రాబడులు 10 శాతానికి పైనే ఉన్నాయి. ఇది మంచి రాబడే. కానీ ఇదే ఈటీఎఫ్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే రాబడుల్లో అధిక శాతం గడిచిన నాలుగేళ్లలోనే వచి్చనట్టు గుర్తించొచ్చు. అంటే బంగారం అన్నది ఎంతో అస్థిరమైన పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ పథకం ప్రతికూల పనితీరు చూపించిన కాలాలను పరిశీలించినా.. ఒక వారంలో 13 శాతం నష్టం, ఒక ఏడాదిలో 20 శాతం నష్టం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే బంగారం ధరలు ఒక వారంలో 13 శాతం, ఒక ఏడాదిలో 20 శాతం పడిపోతాయని అర్థం చేసుకోవచ్చు. చాలా మంది బంగారంలో పెట్టుబడి మంచిదని భావిస్తుంటారు. కానీ, ఇది కూడా ఒక అస్థిరతలతో కూడిన సాధనం. బంగారంపై రాబడి ద్రవ్యోల్బణానికి దీటుగా ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేది అయితే అది ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. కానీ బంగారం అన్నది లాకర్లో ఉండేది. ప్రధానంగా డిమాండ్, సరఫరా దీని ధరలను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లు కుప్పకూలుతున్న తరుణంలో పెట్టుబడులకు సంబంధించి ఆకర్షణీయమైన సాధనం ఇది. మార్కెట్లు పడుతున్న సమయాల్లో బాండ్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లలోనూ.. కంపెనీలు దివాలా తీస్తే తమ పెట్టుబడి వెనక్కి రాదన్న ఆందోళన ఉంటుంది. బంగారం మంచి పెట్టుబడి సాధనం కాదు. ప్రపంచ భవిష్యత్తు విషయమై మీరు ఆశావహంగా ఉంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయకూడదు. పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా పేర్లను చూసి అనుసరించడం కానీ, మోసపోవడం కానీ చేయవద్దు. చిన్నారి కోసం పెట్టుబడులు పెడుతున్నట్టు అయితే అది చేతులు దులుపుకునేట్టు ఉండకూడదు. మీ పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్ అనుకూలం. మీరు తగినంత అనుభవం ఉన్న ఇన్వెస్టర్ అయితే వీలైనంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికంటే మూడేళ్ల ముందు సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. అప్పుడే మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే. తాను పిల్లల కోసం పెట్టుబడులను చైల్డ్ ఫండ్లోనే పెడుతున్నానన్న భావనతో చాలా మంది ఉంటారు. కానీ, మంచి పథకం ఎంపిక చేసుకోతగిన సామర్థ్యం మీకు ఉంటే, తగినంత క్రమశిక్షణతో వ్యవహరించేట్టు అయితే అప్పుడు ఎటువంటి ప్రతికూలతలు కనిపించవు. ఏ ఫండ్ అయినా చైల్డ్ ఫండ్గా అనిపిస్తుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచి్ఛకంగా ఉంటాయని తెలుసు. అది కూడా అధిక స్థాయిలో. భిన్న పథకాలను ఎంపిక చేసుకుని భిన్న కాలాలకు పోల్చి చూస్తే ఫలితాలు అంతే యాదృచ్ఛికంగా ఉంటాయి. వారం వారీ సిప్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్మెంట్ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అందుకే దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్కు వెళ్లమనే నా సూచన. సిల్వర్ ఈటీఎఫ్, సెన్సెక్స్/నిఫ్టీ ఇండెక్స్ మధ్య వ్యత్యాసాం ఏంటి? – అనూప్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ అన్నవి స్టాక్ మార్కెట్లకు సంబంధించి ప్రధాన సూచీలు. నిఫ్టీ 50 స్టాక్స్తో, సెన్సెక్స్ 30 స్టాక్స్తో ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ఈ సూచీల్లోని భిన్న కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫథకాల్లో రాబడులు సూచీలకు సమానంగా ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ అంశాల ఆధారంగా నికర రాబడుల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్లు అన్నవి పెట్టుబడిదారుల నుంచి అందుకున్న మొత్తాన్ని వెండిపై పెట్టుబడిగా పెడతాయి. వెండి ధరల పెరుగుదలపై రాబడులు ఆధారపడి ఉంటాయి. రాబడుల నుంచి వ్యయాలను మినహాయించాల్సి ఉంటుంది. అలాగే, వెండి ధర, ఈటీఎఫ్ ధర మధ్య పనితీరు వ్యత్యాసం కూడా రాబడులపై ప్రభావం చూపిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సిల్వర్ ఈటీఎఫ్ వెండిపై ఇన్వెస్ట్ చేస్తుందంతే. నా యవసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలాలా? – భాస్కర్ ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో ఉన్న అనుభవం ఏ మేరకు? ఒకవేళ ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడాల్సిన మరో అంశం మీకు కావాల్సిన ఆదాయ అవసరాలు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆదాయం కోరుకునేది కాకుండా, పెట్టుబడి అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఆదాయంపై మీ అంచనాల ఆధారంగానే ఎంపిక ఉండాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వాల్యూ రీసెర్చ్) -
లిక్విడ్ ఫండ్స్ రాబడులు తగ్గాయెందుకు?
ఇటీవలి కాలంలో లిక్విడ్ ఫండ్స్ మంచి పనితీరు చూపించడం లేదు ఎందుకని? ఈ కారణంగా స్వల్పకాలం కోసం నా పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్ నుంచి ఇతర విభాగాలకు బదిలీ చేసుకోవాలా? – భాస్కర్ మీ పెట్టుబడులను మరో విభాగానికి తరలించడం ద్వారా అధిక రాబడులు సమకూర్చుకోవడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. తక్కువ రిస్క్, ఊహించిన రాబడులు పొందాలంటే లిక్విడ్ ఫండ్స్ అనుకూలం. లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం అధిక మెచ్యూరిటీ కాలంతో ఉంటాయి. కనుక కొంత అదనపు రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు క్షీణించడమే లిక్విడ్ ఫండ్స్లో రాబడులు తగ్గడానికి కారణం. ద్రవ్యోల్బణం వచ్చే కొన్ని నెలల్లో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దాంతో రాబడులు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ ఫండ్స్ మంచి పనితీరు చూపిస్తాయి. 91 రోజులకు గడువు తీరే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలానికే గడువు తీరడం వల్ల మళ్లీ పెట్టుబడులకు ఆ నిధి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కాస్త మెరుగైన రాబడులను ఇవ్వగలవు. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్డబ్ల్యూపీ) కోసం డెట్ ఫండ్స్ కంటే హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుందా? ఎటువంటి హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాలి? – కృష్ణకుమార్ త్రిపాఠి ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుని, ఉపసంహరణ 4–6 శాతం మధ్య లేదా 7 శాతం ఉంటుందని అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం నయం. ఎందుకంటే అదే డెట్ ఫండ్స్ అయితే మీరు ఉపసంహరించుకున్నంత మేరే రాబడి కూడా ఉంటుంది. కనుక ద్రవ్యోల్బణం మించి మెరుగైన రాబడులు డెట్ ఫండ్స్ ఇస్తాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అందుకు హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. అప్పుడు ఉపసంహరణ రేటు 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. లేదంటే మీ రిస్క్ సామర్థ్యం అనుమతిస్తే ఈక్విటీ ఫథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడే మీరు ఉపసంహరించుకునే మొత్తానికంటే మీ పెట్టుబడి అధికంగా వృద్ధి చెందుతుంటుంది. క్రమానుగత పెట్టుబడి ఉపసంహరణ కోసం పెద్దగా రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లకు హైబ్రిడ్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే, మంచి హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవడం కూడా కీలకం అవుతుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ఫండ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ మధ్య సరైన ఎంకిక కీలకమన్నది మర్చిపోవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బ్యాలన్స్డ్ ఫండ్ లేదా అగ్రెస్సివ్ ఫండ్ అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరే ప్రవర్తిస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరతలకు దూరంగా ఉండలేవు. అయినప్పటికీ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే మరింత నిలకడగా వీటి పనితీరు ఉంటుంది. పెట్టుబడి నుంచి 4–5 శాతం మేర ఉపసంహరించుకోవాలంటే అగ్రెస్సివ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. అంతకుమించి వెనక్కి తీసుకోవాలంటే అప్పుడు బ్యాలన్స్డ్ ఫండ్కు వెళ్లాలి. అంతకంటే మరింతగా 6.5–7 శాతం మేర వెనక్కి తీసుకోవాలంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్కు వెళ్లాలి. ఎందుకంటే అస్థిరతలు ఎక్కువగా ఉండే (అధిక ఈక్విటీ కేటాయింపులు) చోటు నుంచి ఎక్కువ మొత్తంలో వెనక్కి తీసుకునేట్టు అయితే.. మార్కెట్ల పతనాల సమయంలో పెట్టుబడి తగ్గిపోతుంటుంది. అందుకనే ఉపసంహరణ రేటు ఎక్కువగా ఉంటే కన్జర్వేటివ్ ఫండ్ను ఎంపిక చేసుకోవడం సరైనది. ఇక పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అందుకని ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనంలో పెట్టుకోవాలి. మిగిలిన మొత్తాన్ని హైబ్రిడ్ లేదా ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏడాది తర్వాత నుంచి ఎస్డబ్ల్యూపీని మొదలు పెట్టుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
ITR: పన్ను భారం.. చట్టంలో లొసుగులు.. అబద్దపు లెక్కలు..
సాధారణంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో అందరూ ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు. 31–03–22తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరం విషయంలో ఆలోచనలు చేసి, అమలుపర్చాల్సిన సమయం ఇదే. ఆలస్యం చేయకండి. ట్యాక్స్ ప్లానింగ్నే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని కూడా అనవచ్చు. ఇలా ప్లానింగ్ చేయడం వల్ల రాజమార్గంలో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పన్నును ఎగవేయకూడదు కానీ.. ప్లానింగ్ ద్వారా పన్నుని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు.. 1. మీరు ఏ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 2. ఒక సంవత్సరంలో చేస్తే, ఆ తరువాత సంవత్సరంలో ఎటువంటి మినహాయింపు రాదు. 3. ట్యాక్స్ ప్లానింగ్ నూటికి నూరు పాళ్లు చట్టరీత్యా ఆమోదయోగ్యమైనది. 4. చట్టంలోని లొసుగులు ఆసరాగా తీసుకుని పన్ను భారం లేకుండా చేసుకోవడం.. తగ్గించుకోవటం తప్పు. ఉదాహరణకు దొంగ క్లెయిములు, నకిలీ పత్రాలు సృష్టించి క్లెయిమ్ చేయడం, అబద్ధపు లెక్కలు చూపించడం, లెక్కలు రాయకపోవడం, అబద్ధపు ఖర్చులు రాయడం, వ్యక్తిగత ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడం.. ఇలా వంద దారులు ఉన్నాయి. కానీ, ట్యాక్స్ ప్లానింగ్కు ఒకే ఒక మార్గం .. రాజమార్గం ఉంది. 5. మీ ఆదాయాన్ని సక్రమ మార్గంలో సంపాదించటమే ట్యాక్స్ ప్లానింగ్కు నాంది. దానికి తగ్గట్లుగా పునాది పడితే సహజసిద్ధంగా మంచి ఆలోచనలే వస్తాయి. 6. మంచి ఆలోచన అంటే.. ఆ ఆలోచన/ప్లానింగ్ అందరికీ ఒకేలాగా ఉండదు. మార్గం ఒకటే అయినా విధివిధానాలు వేరుగా ఉంటాయి. ప్రాధాన్యతలు వేరు.. ఉదాహరణకు 80సిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎవరి ప్రాధాన్యత, అవసరాలను బట్టి వారు ఇన్వెస్ట్ చేస్తారు. 7. వ్యాపారం, వృత్తి, స్థాయి, రెసిడెన్స్ స్టేటస్, వయస్సు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 8. కేవలం ఒక వ్యక్తి పన్ను భారం తగ్గించే ధోరణి కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, అమ్మాయి పెళ్లి, ఇల్లు కట్టుకోవడం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. 9. పక్కింటి పరంధామయ్యతో మీకు పని లేదు. ఎదురింటి ఏకాంబరం గారితో ఏమీ మాట్లాడక్కర్లేదు. మీ ప్లానింగ్ మీదే. పోలిక వద్దు.. పోటీ వద్దు. 10. మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చట్టప్రకారం మలచుకోండి. ఆదాయం, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్, పన్నులు చెల్లించటం, రిటర్నులను గడువు తేదీ లోపల వేయటం, ట్యాక్స్ ప్లానింగ్, కుటుంబపు ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సక్రమంగా సాగేలా ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ట్యాక్స్ ప్లానింగ్ కూడా భాగమే. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోవడం ఎలానో మీకు తెలుసా? -
టాక్స్ ఆడిట్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు..
టాక్స్ ఆడిట్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం.. ఈ వారం ఎలా చేయించాలో తెలుసుకోండి. - ముందుగా ఆర్ధిక సంవత్సరం చివరికి టర్నోవరు లేదా అమ్మకాలు లేదా బ్యాంకులో వసూళ్లు విలువ తెలుసుకోండి. చివరి దాకా వేచి ఉండక్కర్లేదు. మీ అనుభవం .. వ్యాపార సరళి, జీఎస్టీ రికార్డులను బట్టి తెలుస్తుంది. టర్నోవరు కోటి రూపాయలు దాటింది అంటే మీ కేసు టాక్స్ ఆడిట్ పరిధిలోనిది అన్నమాట. - వెంటనే ఒక ప్రాక్టీస్ లో ఉన్న సీఏని సంప్రదించండి. - సదరు సీఏని అపాయింట్ చేసుకోండి. అలాగే ఫీజు కూడా ముందుగానే పేర్కొనండి. - సీఏని మీరే నియమించినా ఆ వ్యక్తి ఇటు మీ తరఫున అటు ఇన్కం ట్యాక్స్ విభాగం తరఫున తన విధులకు న్యాయం చేస్తారు. - ఏం చేయాలన్నది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. - ఆడిట్ పరిధిలో ఏయే రికార్డులు వెరిఫై చేయాలన్నది ప్రస్తావించారు. - ఒక అస్సెస్సీకి సంబందించిన వందలాది అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇవ్వాలి. - ఉదాహరణకు వ్యాపారంలో సొంత ఖర్చులు ఉన్నాయా? క్యాపిటల్ ఖర్చులు మామూలు ఖర్చుల్లో కలవడం జరగలేదు కదా? బిజినెస్కి సంబంధం లేని ఖర్చులు విడిగా రాయడం చేశారా? సొంత వాడకాన్ని విడిగా చూపించారా? విరాళాలు విడిగా రాశారా? ఇలాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. - పైవన్నీ తప్పు అని అనటం లేదు... కొన్ని వ్యాపారాల్లో చాలా సహజం... జరిగింది జరిగినట్లు రాయండి.. ఆడిటర్ ఆ వ్యవహారాలను జల్లెడ బట్టి తన వృత్తి నైపుణ్యంతో విడగొడతారు. - ఆదాయాన్ని, ఖర్చులను సరిగ్గా నిర్ధారించడంపైనే ఈ ఆడిట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కొన్ని విధులు సరిగ్గా నిర్వహించడం జరిగిందా లేదా అన్నది రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా టీడీఎస్ లాంటివాటికి సంబంధించి చట్టప్రకారమే ప్రయోజనం పొందారా లేదా అన్నది పరిశీలిస్తుంది. - ఇందుకోసం ఆదాయపు పన్ను విభాగం నిర్దేశి ంచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. - అప్పుడు పూర్తి అవుతుంది.. ఆడిట్.. ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్పై ఇద్దరు సంతకం పెడతారు. దీన్ని గడువు తేదీ లోపల దాఖలు చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ భారీగా వడ్డీస్తారు. ఈ రిపోర్ట్ మీకూ శ్రీరామ రక్ష. 31మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఫిబ్రవరి 15 దాకా పొడిగించారు. కాబట్టి కాస్త త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసేసి ఉంటే 31 మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం రిటర్నుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ మెరుగైనదేనా?
పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి?– శివమ్ కంది రియల్ ఎస్టేట్ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. నివాసం కోసం ఇల్లు. లేదంటే పొలం. భూమి కోసం చేసే పెట్టుబడి, వ్యయాలు, మూలధనం, ఈ పెట్టుబడిపై తగినంత రాబడి రేటు ఇవన్నీ చూడాలి. రాబడులు తగినంత లేకపోయినా దీర్ఘకాలంలో భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో ముందుకు వెళ్లొచ్చని ఎవరైనా భావించొచ్చు. ఇల్లు అయితే ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టింపు కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ మెరుగ్గా కొనసాగొచ్చు. అలా చూస్తే చాలా మందికి ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి?– మంజునాథ ఉపాధ్యాయ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కానందున వీటి పట్ల నేను వ్యతిరేకం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఫండ్ సంస్థ డివిడెండ్ ప్రకటించినట్టయితే ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల డివిడెండ్ ఆదాయం కూడా మొత్తం ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు వారికి వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్ ప్లాన్ మెరుగైన ఎంపిక అవుతుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ ) -
మంచి ఇండెక్స్ ఫండ్ను ఎంపిక ఎలా?
మల్టీక్యాప్ ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– ఆశిష్ ఈ తరహా పథకాల నుంచి అర్థవంతమైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా 25 శాతం చొప్పున లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్దగా మారిపోయాయి. దీంతో 25 శాతం చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకమే. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. దీంతో వాటి నుంచి ఆందోళన వ్యక్తం అయింది. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించింది. దీంతో ఫ్లెక్సీక్యాప్ పేరుతో మరో విభాగాన్ని తీసుకొచ్చింది. 25% చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. ఇప్పుడు మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్ఎఫ్వోలు) ప్రకటిస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అని ఇన్వెస్టర్లు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్ పథకాలు వాటి పనితీరును నిరూపించుకోవాల్సి ఉంది. వీటిల్లో ఆరంభంలో ఇన్వెస్ట్ చేయకపోతే పెద్దగా కోల్పోయేదేమీ ఉండదు. దూరంగా ఉండొచ్చు. మంచి ఇండెక్స్ ఫండ్ను ఎంపిక ఎలా? – శశాంక్ ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. ఎక్స్పెన్స్ రేషియోను పరిశీలించడం కీలకమన్నది గమనించండి. మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. పెట్టుబడి మొత్తంలో 60 శాతాన్ని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్కు, 40 శాతాన్ని లార్జ్క్యాప్ ఫండ్స్కు కేటాయించుకోవచ్చా? – అంకిత్ రాజీపడలేని లక్ష్యం కోసం అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడేళ్ల కాలం అన్నది ఈక్విటీ పెట్టుబడులకు సరిపోదు. ఎందుకంటే అంత స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్ తీరు ఎలా ఉంటుందన్నది ఎవరూ చెప్పలేరు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మూడేళ్ల కాలం ఇన్వెస్ట్ చేసినా, నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరైనా ఒకరు ప్రతినెలా రూ.10,000 చొప్పున మూడేళ్లకాలంలో రూ.3.6 లక్షలను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చూస్తూ వెళితే చివర్లో ఆ మొత్తం విలువ రూ.2.5 లక్షలుగానే ఉండొచ్చు. ఒకవేళ రిస్క్ తీసుకునే అవకాశం ఉండి, వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయన్న నమ్మకం మీకు ఉంటే అప్పుడు మూడేళ్లకోసం అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు ఏవైనా కనీసం ఐదేళ్ల పాటు వేచి చూడగలనన్న సన్నద్ధతతో ఉండాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటీ? ఎందుకు చేయించాలి? ఎవరికి అవసరం
ఆడిట్ అంటే చాలా మందికి తెలిసిన అంశమే. మన దేశంలో ఎన్నో రకాల ఆడిట్లు అమల్లో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలో కూడా ఒక ఆడిట్ అంశం పొందుపర్చారు. సెక్షన్ 44అఆ ప్రకారం నిర్దేశిత టర్నోవర్/అమ్మకాలు/ వసూళ్లు దాటిన అస్సెస్సీలు వారి అకౌంట్స్ను ఆడిట్ చేయించాలి. అలా చేయించడాన్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఉద్దేశ్యం ఏమిటంటే .. అస్సెస్సీ సరైన అకౌంటు బుక్స్ నిర్వహించాలి. మిగతా ఎన్నో రికార్డులు రాయాలి. వీటి వల్ల సరైన ఆదాయం తెలుసుకోగలగాలి. అస్సెస్సీకి ఎన్నో మినహాయింపులు, తగ్గింపు, ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల ఆదాయపు పన్ను తగ్గుతుంది. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు, తప్పొప్పులు జరగకుండా చూడాలి. అమ్మకాలు, కొనుగోళ్లు, ఆస్తులు, అప్పులు, మూలధనం లేదా పెట్టుబడికి సంబంధించిన సోర్స్లు.. ఇలా ఎన్నో అంశాలు పుస్తకాల్లో రాస్తారు. అవి సరైనవేనా .. కాదా అన్నది చెక్ చేయాలి. ఆ ఆడిట్ వల్ల డిపార్ట్మెంటుకు ఎంతో సమయం, వనరులు వృధా కాకుండా ఉంటాయి. ఎవరి అకౌంట్స్ ఆడిట్ చేయాలి.. వ్యాపారం/వాణిజ్యం/ఇతరత్రా బిజినెస్లు చేస్తున్నవారికి ఈ ఆడిట్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిమితుల ప్రకారం బిజినెస్ చేసే వారికి వర్తించే పరిమితి రూ. 1 కోటిగా ఉంది. వృత్తికి సంబంధించిన వారికి రూ. రూ. 50 లక్షలుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమితి దాటితే ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. ఈ పరిమితి ప్రాతిపదికను నిర్ణయించడానికి వసూళ్లు/ఆదాయం/అమ్మకాలు/టర్నోవర్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆడిట్ ఎవరు చేయాలి.. ప్రాక్టీసు చేస్తున్న సీఏతో ఈ ఆడిట్ చేయించాలి. సదరు సీఏ .. ఆ వ్యక్తి దగ్గర/సంస్థలో ఉద్యోగంలో చేస్తున్న వారు కాకూడదు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. సీఏ స్వతంత్ర వ్యక్తి అయి ఉండాలి. సంస్థలు ఏయే బుక్స్ రాయాలి.. చట్టంలో నిర్వచించిన ప్రకారం డేబుక్స్, నగదు చిట్టా, లెడ్జర్లు, అకౌంట్స్ బుక్స్, ఇతర పుస్తకాలు.. రాతపూర్వకంగా గానీ లేదా కంప్యూటర్ ద్వారా, ఫ్లాపీ, డిస్క్, ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించవచ్చు. వృత్తిలో ఉన్న వారు .. అంటే లీగల్, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన వర్గాల వారు.. ఐటీ అధికారులు అసెస్మెంట్ చేయడానికి సహాయపడే విధంగా ఉండేలా రికార్డులు, అకౌంటు బుక్స్ నిర్వహించాలి. ఇక వ్యాపారస్తులు (వృత్తి నిపుణులు కాని వారు) కొన్ని పరిమితులకు లోబడి అకౌంట్స్ నిర్వహించాలి. ఆ పరిమితులను గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏతావాతా అమ్మకాలు, టర్నోవరు, వసూళ్లకు సంబంధించిన రికార్డులు రాయాలి. చట్టంలో ఎంతో భాష్యం జోడించారు కానీ.. దీని సారాంశం ఏమిటంటే అమ్మకాలకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్లు, రిజిస్టర్లు .. కొనుగోళ్లకు సంబంధించిన ఆస్తులకు, అప్పులకు సంబంధించినవి .. అన్నీ .. సమస్తమూ నిర్వహించాలి. బ్యాంకు అకౌంట్లు, వసూళ్లు/రాబడి/వాపసులు, ఖర్చులు, బిల్లులు, ఓచర్లు, కాగితాలు.. ఇలా ఎన్నో నిర్వహించాలి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ప్రతి ఆర్థిక లక్ష్యానికి ప్రత్యేక పోర్ట్ఫోలియో కావాలా?
నాకు ఏడు నుంచి ఎనిమిది వరకు ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్ఫోలియో ఉండాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – దేవరాజ్ చౌదరి లక్ష్యాలు, పోర్ట్ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాల్లోనూ.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ విషయమని అర్థం చేసుకోవాలి. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం వరకు లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డె) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం విభిన్న పోర్ట్ఫోలియోలను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఆయా సమయాల్లో మీ లక్ష్యానికి కావాల్సిన నగదు లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్లైన్లో ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్తో వేరు చేసుకోవచ్చు. ఒకే విధమైన పనితీరు కలిగిన రెండు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నాకు పెట్టుబడులున్నాయి. లాభాలు స్వీకరించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎగ్జిట్ లోడ్, మూలధన లాభాలు లేని పథకం ఏది? ఏ పథకం నుంచి వైదొలగాలి? – అరవింద్ కుమార్ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులను ప్రారంభించిన నాటి నుంచి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే మూలధనలాభంలో 15 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత తీసుకుంటే, లాభంలో 10 శాతం పన్ను చెల్లించాలి. దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించిన పెట్టుబడులపై లాభం) మొదటి రూ.లక్షపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాతే ఏ పథకం అన్నది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మార్కెట్లు పెరిగాయని లాభాలు తీసుకోవాలని అనుకుంటే అలా చేయవద్దు. పెట్టుబడులు వృద్ధి చెందాయనే లాభాలు తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ తరహా ఆలోచనతో పెట్టుబడులను వెనక్కి తీసుకుని.. ఆ తర్వాత మార్కెట్లు పడిపోతే తిరిగి ఇన్వెస్ట్ చేయాలని వేచి చూస్తుంటారు. ఒకవేళ భారీ కరెక్షన్ చోటు చేసుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా, భయంతో మరింత కిందకు పడిపోతాయన్న ఆలోచనతో ఇన్వెస్ట్ చేయకుండా ఉండిపోతారు. అక్కడి నుంచి మార్కెట్లు 10–15 శాతం పెరిగిపోయిన తర్వాత మంచి అవకాశాన్ని కోల్పోయామని విచారిస్తుంటారు. మార్కెట్లో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఉండే రిస్క్ ఇదే. అందుకే డబ్బుతో అవసరం పడితేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోండి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి:సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
ఎకానమీపై ‘థర్డ్వేవ్’ ఎఫెక్ట్.. వృద్ధికి గొడ్డలిపెట్టు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. - క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం. - కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. - అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్లంత తీవ్రత మూడవ వేవ్లో ఉండదని భావిస్తున్నాం. బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ! - రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ - పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.! - సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు - కరోనా ఒమిక్రాన్తో ఆంక్షల వల్ల అనిశ్చితి - ఆర్థికవేత్తల అంచనా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్డౌన్లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది. కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. చదవండి:ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..? -
మ్యూచువల్ ఫండ్ పథకానికి, న్యూ ఫండ్ ఆఫర్ల మధ్య తేడా ఏంటి?
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగం మధ్య వేటిని ఎంపిక చేసుకోవాలి? – శిల్ప దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యా ప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్కు ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్ను చక్కగా అధిగమించగలరు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను మర్చడాన్ని సూచిస్తారా? ఎటువంటి సందర్భాల్లో ఇది సూచనీయం? – సుఖ్దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు దీర్ఘకాలం కోసం అంటే రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. ఆ మొత్తం సమకూరితే మీ పెట్టుబడిని మొత్తం మీరు తీసేసుకోవచ్చు. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక మీరు ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే మీ పెట్టుబడులను విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. కాకపోతే మీరు అప్రమత్తం అయ్యేందుకు ఒక కారణంగా చూడొచ్చు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ పథకానికి, న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)కు మధ్య తేడా ఏంటి? – డి.తరుణ్ ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ నూతన పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభిస్తుంటుంది. ఏళ్లు గడిచిన కొద్దీ ఆ పథకం పాతది అయిపోతుంది. పెట్టుబడుల తీరు, మార్కెట్ కరెక్షన్లలో, మార్కెట్ ర్యాలీల్లో ప్రస్తుత పథకాల పనితీరు ఎలా ఉందో పరిశీలించొచ్చు. ఎన్ఎఫ్వో అన్నది కొత్త ఆఫర్. ఇన్వెస్టర్లు అప్పగించిన పెట్టుబడులను ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎన్ఎఫ్వో అంటే కొత్తగా ప్రారంభించడం. ఎవరు మీ పెట్టుబడులను చూసేదీ తెలుసుకోవచ్చు. ఆ కొత్త పథకం పెట్టుబడి లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. ఆ పథకం ఆరంభమైన సమయంపై పనితీరు ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయాల్లో పథకాన్ని ప్రారంభించి, అనంతరం మార్కెట్లు పెరిగిపోతే సహజంగానే పథకంలో రాబడులు చక్కగా వృద్ధి చెందుతాయి. అందుకే కొత్త పథకం మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడా లేక కనిష్టాల్లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుందా అన్నదానిపై ఇన్వెస్టర్కు అవగాహన ఉండాలి. ఎన్ఎఫ్వో రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంటాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి. చాలా మంది ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా ఎన్ఎఫ్వోల్లో అంత భారీ మొత్తంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి:ఐటీ రిటర్న్స్: ఆ గడువును పొడిగించిన ఐటీ శాఖ, ఎప్పటి వరకు అంటే.. -
యాదాద్రిని చూపించి వరంగల్ హైవే మార్కెట్ని పాడు చేశారు
పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ను మాత్రం యూడీఎస్ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్ దెబ్బతిన్నది. సిండికేట్గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్ డెవలపర్లు మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ మార్కె ట్ను సృష్టిస్తేనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్ను ఎవరూ ఆపలేరని వివరించారు. 2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్తో పాటూ షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్ను పాడుచేశారని పేర్కొన్నారు. సగం ధర అంటే అనుమానించండి.. కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. అంతా హ్యాపీగా ఉండాలంటే నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా? కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు 100, 200 గజాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. చదవండి: ఖాళీ స్థలం చూపిస్తూ యూడీఎస్లో విక్రయాలు -
స్టాక్ మార్కెట్లో స్టార్ కావాలంటే.. నిపుణుల సూచనలు
దేశీ మార్కెట్లు గత ఏడాది ఇన్వెస్టర్లకు భారీ రాబడులు అందించడంతో పాటు పలు మైలురాళ్లను అధిగమించాయి. కొత్త సంవత్సరంలో మహమ్మారిపరమైన షాక్లు మొదలుకుని రాష్ట్రాల ఎన్నికలు, అంతర్జాతీయ ట్రెండ్స్ మొదలైనవి మార్కెట్లను నిర్దేశించనున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే కేంద్ర బడ్జెట్లో సంస్కరణలు, కార్పొరేట్ల ఆదాయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ సెంట్రల్ బ్యాంకులు అనుసరించబోయే వడ్డీ రేట్ల విధానాలను ఇన్వెస్టర్లను నిశితంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీతో పాటు పలు సంస్థలు లిస్టింగ్ కోసం లైను కట్టనుండటంతో కొత్త సంవత్సరంలోనూ ఐపీవోల జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇక, చమురు ధరలు, బాండ్ ఈల్డ్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులు, అమెరికా డాలర్ ఇండెక్స్ కదలికలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మహమ్మారిపరమైన అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఎగియడం మొదలైనవి రిస్కులుగా ఉండగలవని చెబుతున్నారు. 2022లో నిఫ్టీ 12–15 శాతం మేర రాబడులు అందించే అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థ.. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పేర్కొంది. ఆర్థిక రికవరీ, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం ఇందుకు దోహదపడగలవని తెలిపింది. నూతన సంవత్సరంలో ఐటీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్, సిమెంటు, రియల్ ఎస్టేట్ రంగాలు రాణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా కాస్త వెనుకబడిన బ్యాంకింగ్, ఆటో రంగాలు కూడా పుంజుకోనున్నాయని అంచనా. గ్రీన్ ఎనర్జీ, ఇథనాల్, కొత్త తరం వ్యాపారాలు, టెక్నాలజీ, తయారీ, ఆన్లైన్ ఆధారిత కంపెనీలు మొదలైనవి మార్కెట్ల జోరుకు తోడ్పాటు అందించగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో మెరుగైన రాబడులు అందించగలవని వివిధ బ్రోకింగ్ సంస్థలు చేస్తున్న సిఫార్సుల్లో కొన్ని స్టాక్స్.. ఎడెల్వీజ్ వెల్త్ మేనేజ్మెంట్.. వ్యూ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర: రూ.253 టార్గెట్ ధర: రూ.425 అసెట్ లైట్ వ్యాపార విధానం కంపెనీ వృద్ధికి తోడ్పడగలదు. అమెరికా ప్రధాన మార్కెట్గా ఉండగా, భారత మార్కెట్పైనా మరింతగా దృష్టి పెడుతోంది. సామర్థ్యాలను కూడా మరింతగా పెంచుకోవడం సంస్థకు దీర్ఘకాలికంగా సానుకూలాంశం. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ.774 టార్గెట్ ధర: రూ.1,150 చిన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ మొత్తం గృహ రుణాల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ మార్కెట్ ఏటా 25–30 శాతం మేర వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో హోమ్ ఫస్ట్ మెరుగైన రాబ డులు, నికర వడ్డీ మార్జిన్లు నమోదు చేసే వీలుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ.740 టార్గెట్ ధర: రూ. 900 మొండిబాకీలు తగ్గుముఖం పడుతున్నాయి. నికర వడ్డీ మార్జిన్లు గడిచిన మూడు నాలుగేళ్లలో 60 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. ఇక గత మూడేళ్లలో అసెట్స్పై రాబడులు 75 బేసిస్ పాయింట్ల స్థాయిలో పెరిగాయి. ప్రతిభావంతులైన నిపుణులు సంస్థ సొంతం. ఐడీబీఐ క్యాపిటల్.. సిఫారసులు సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ ప్రస్తుత ధర: రూ. 743 టార్గెట్ ధర: రూ. 950 వార్షికంగా 50 శాతం వృద్ధి రేటుతో కంపెనీ ఎదుగుతోంది. రాబోయే రోజుల్లోనూ ఇదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. పటిష్టమైన అవకాశాల కారణంగా ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో కూడా స్టాక్ స్థిరంగా నిలబడింది. అయిదు, పదేళ్ల పాటైనా పోర్ట్ఫోలియోలో ఉంచుకోతగిన స్టాక్ ఇది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర: రూ. 1,197 టార్గెట్ ధర: రూ. 1,500 మొదటి, రెండో వేవ్ కోవిడ్–19 కారణంగా జీవిత బీమా సంస్థల స్టాక్స్ అంతగా రాణించలేదు. అయితే, ప్రీమియంలను పెంచడంతో పాటు కోవిడ్ సంబం ధ క్లెయిమ్లన్నింటికీ తగిన విధంగా ప్రొవిజన్లు చేశాయి. బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుండటం సానూకూలాంశం. కోల్టి–పాటిల్ డెవలపర్స్ ప్రస్తుత ధర: రూ. 301 టార్గెట్ ధర: రూ. 375 రియల్ ఎస్టేట్ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్లో ది కూడా ఒకటి. ముంబై, బెంగళూరులో కంపెనీ గణనీయంగా కార్యకలాపాలు విస్తరిస్తోంది. దీర్ఘకాలికంగా సంస్థకు ఇది సానుకూలాంశం కాగలదు. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ సానుకూలం. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్.. పంచాంగం గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రస్తుత ధర: రూ. 968 టార్గెట్ ధర: రూ. 1,180 మధ్యకాలికంగా మార్కెట్లో వాటా పెంచుకోవడం, వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా రెండంకెల స్థాయి వృద్ధిపై మరింతగా దృష్టి పెట్టాలని సంస్థ నిర్దేశించుకోవడం సానుకూలాంశాలు. గడిచిన ఏడాదిన్నరగా గోద్రెజ్ కన్జూమర్ ఉత్పత్తుల అమ్మకాలు దేశీయంగా గణనీయంగా పెరుగుతుండడం సానుకూలం. జెన్సార్ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: రూ. 521 టార్గెట్ ధర: రూ. 600 వృద్ధి ధోరణులు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సీఈవోతో టీమ్ ఏర్పడటం, వృద్ధి వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అంచనా. పోటీ సంస్థలకు దీటుగా వేల్యుయేషన్ పుంజుకోగలదని, స్టాక్ రీ–రేటింగ్కు అవకాశాలు ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ భావిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 5,013 టార్గెట్ ధర: రూ. 5,900 రిటైల్ స్టోర్స్ ఊతంతో అపోలో 24/7 ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా ఫార్మసీ వ్యాపారాన్ని సంస్థ గణనీయంగా విస్తరిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ–ఫార్మసీ విభాగంలో 14% మార్కెట్ వాటా దక్కించుకోవచ్చు. వార్షిక ప్రాతిపదికన 2022–2023 ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం 16%, లాభం 30 % వృద్ధి అంచనా. 5పైసా క్యాపిటల్.. అంచనాలు సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా) ప్రస్తుత ధర: రూ. 429 టార్గెట్ ధర: రూ. 480 రాబోయే రోజుల్లో ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకునే దిశగా సంస్థ పురోగమిస్తోందని అంచనా. ప్రస్తుతం ఆకర్షణీయమైన వేల్యుయేషన్లో లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 740 టార్గెట్ ధర: రూ. 810 పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వ్యవస్థ సానుకూలాంశం. అలాగే అత్యుత్తమ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ గల బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. డిజిటల్ మాధ్యమం ద్వారా వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగాయి. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర: రూ. 1,895 టార్గెట్ ధర: రూ. 2,200 మరిన్ని ప్రాజెక్టులను దక్కించుకోవడం, వేగవంతంగా పూర్తి చేయడంపై కంపెనీ ఆశాభావంతో ఉంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మార్జిన్లను నిలబెట్టుకోగలమనే ధీమాతో ఉంది. చదవండి:మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాతో జాగ్రత్త!! -
కరెక్షన్లో పెట్టుబడుల రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి
ఇటీవల స్టాక్ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చింది కదా.. భారీ దిద్దుబాటుకు అవకాశం ఉందా? వస్తే లాభాలు, పెట్టుబడులను కాపాడుకోవడం ఎలా?– నవీన్ కరెక్షన్ కనిపించింది. కానీ, గణనీయంగా ఏమీ పడిపోలేదు. ఆ తర్వాత నుంచి స్థిరంగా కోలుకోవడాన్ని చూస్తున్నాం. భారీ పతనం రానున్నదా? అంటే నిజంగా లేదనే చెప్పుకోవాలి. కానీ, నిజం ఏమిటంటే స్వల్పకాలంలో ఏమి జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడి నుంచి గణనీయంగా పెరిగిపోవచ్చు. ఖరీదైన మార్కెట్ వ్యాల్యూషన్ను చాలా కంపెనీలు ఆశించొచ్చు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వ్యాల్యూషన్లు ఖరీదుగా అనిపిస్తున్నప్పటికీ, ఇవి ముందుకే వెళ్లొచ్చు. కనుక స్వల్పకాలానికి అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో అంటే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ కంపెనీల ఆదాయాలు, లాభాలు మరింత వృద్ధి చెందొచ్చు. దీర్ఘకాలానికి మార్కెట్ పట్ల నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను. అయితే, అదే కాలంలో కొన్ని కంపెనీలు ప్రతికూలతలను చూడొచ్చా? అంటే అవుననే నా సమాధానం. మార్కెట్లో ఈ తరహా కంపెనీలు ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది ఐపీవోల్లో ఖరీదైన వ్యాల్యూషన్లకు స్టాక్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఏడాది, రెండేళ్ల తర్వాత లాభాలు రాకపోతే అంత ఖరీదుపెట్టి ఎందుకు కొన్నామా? అని అనిపించొచ్చు. ఇప్పుడైతే వాటి ధరలు పెరుగుతూ వెళుతుండడం పట్ల ఇన్వెస్టర్లు సౌకర్యంగానే ఉన్నారు. దీంతో ఆయా స్టాక్స్ వ్యాల్యూషన్ సరైనదేనన్న భావనతో ఉన్నారు. కానీ, కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా విశ్లేషణ చేస్తే అప్పుడు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. భారీ కరెక్షన్, ఆతర్వాత ఏకధాటిగా ర్యాలీని ఎవరూ ఊహించలేరు. కనుక అటువంటి ప్రశ్నలకు సమాధానం లభించదు. కాకపోతే మన పెట్టుబడులు, లాభాలను ఎలా కాపాడుకోవాలి? అంటే అందుకు మార్గముంది. అదే రీబ్యాలన్స్. మీరు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నట్టయితే స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్ ) పథకాలకు ఎంతో కొంత కేటాయింపులు చేసుకోవాలి. అది 25% లేదా 50 శాతమా అన్నది మీ ఎంపికే. ఒకవేళ మీ పెట్టుబడుల కేటాయింపులు ఈక్విటీ, డెట్కు 50:50 శాతం చొప్పున నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిపోయి మొత్తం పెట్టుబడుల్లో మీ ఈక్విటీ భాగం 50% నుంచి 60 శాతానికి చేరి.. డెట్ పెట్టుబడుల విలువ 40 శాతానికి తగ్గిందనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిందల్లా.. 60 శాతంగా ఉన్న ఈక్విటీని 50 శాతానికి తగ్గించుకోవాలి. అంటే 10% మేర ఈక్విటీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. దీన్ని లాభాల స్వీకరణగా చూడొచ్చు. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాంతో ఈక్విటీ, డెట్ మళ్లీ 50:50 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ మార్కెట్ పడిపోయి మీ 50% వాటా కాస్తా 40 శాతానికి తగ్గిపోయి, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు 60 శాతంగా ఉన్నాయనుకోండి. అప్పుడు మొత్తం పెట్టుబడిలో ఫిక్స్డ్ ఇన్కమ్ భాగం 50 శాతానికి తగ్గిపోయే విధంగా విక్రయాలు చేపట్టాలి. ఆ మొత్తాన్ని ఈక్విటీలోకి మళ్లించుకోవాలి. నూరు శాతం ఈక్విటీ లేదా నూరు శాతం డెట్ పెట్టుబడులు చాలా ప్రమాదకరం. మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి తరుగుదలను హెడ్జ్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు – రోణాక్ షా రూపాయి తరుగుదల అన్నది వాస్తవం. ఐదు, పదేళ్ల క్రితం డాలర్తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చిన్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. సామర్థ్యం, మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీయ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఒకవేళ మీరు ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి:జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి! -
ఆ వయస్సు దాటితే.. పన్ను మినహాయింపు ఉంటుందా?
నా వయస్సు 76 సంవత్సరాలు. రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తోంది. సంస్థ యజమాని పన్ను రికవర్ చేసి, చెల్లించేశారు. నేను ఇక రిటర్న్ వేయాల్సిన అవసరం లేదా? – ఎం. నీలకంఠం, హైదరాబాద్ వయో వృద్ధులకు (75 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి) ఈ తరహా మినహాయింపునిచ్చే దిశగా 2021 బడ్జెట్లో సెక్షన్ 194పి పొందుపర్చారు. 1–4–2021 నుండి ఇది అమల్లోకి వచ్చింది. అంటే ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం మొదలు.. (అసెస్మెంటు సంవత్సరం 2022–23) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. 2021 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వర్తించదు. దీన్ని పొందేందుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. ఆ విషయాన్ని వయో వృద్ధులు గమనించగలరు. ఇది ఎవరికి వర్తిస్తుందంటే.. - ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది - వారు కచ్చితంగా రెసిడెంట్ అయి ఉండాలి - ఈ ఆర్థిక సంవత్సరంలో 75 సంవత్సరాలు పూర్తి అవ్వాలి (మొదలై, పూర్తి అవకపోవడం కాదు) - వారి ఆదాయంలో రెండే రెండు అంశాలు ఉండాలి. పెన్షన్, నిర్దేశిత బ్యాంకు నుండి వడ్డీ - ఏదేని కారణం వల్ల జీతం ఉంది అనుకోండి. ఈ మినహాయింపు వర్తించదు. - ఇతరత్రా ఆదాయం, వ్యాపారం, వృత్తి, ఇంటి అద్దె, మూలధనం లాభాలు, డివిడెండ్లు .. ఇలా ఏ ఆదాయం ఉన్నా వర్తించదు బ్యాంకులకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. A) నిర్దేశిత బ్యాంకు .. అంటే బోర్డు నోటిఫై చేసిన బ్యాంకులకు రూలు 26డి ప్రకారం 12బీబీఏ ఫారం రూపంలో డిక్లరేషన్ ఇవ్వాలి B) డిక్లరేషన్లో ఈ అంశాలు ఉండాలి. పేరు, పాన్ లేదా ఆధార్ వివరాలు, ఆర్థిక సంవత్సరం, పుట్టిన తేదీ, నిర్దేశిత బ్యాంకు బ్రాంచి వివరాలు, పెన్షన్ చెల్లిస్తున్న యజమాని వివరాలు, పెన్షన్ పేమెంట్ నంబరు C) డిక్లరేషన్ తీసుకుని, ఆ నిర్దేశిత బ్యాంకు ట్యాక్సబుల్ ఇన్కం లెక్కించి, ట్యాక్స్ని నిర్ధారించి, పన్నుని డిడక్ట్ చేస్తుంది D) ఈ ప్రహసనం సక్రమంగా పూర్తయితే, రిటర్ను దాఖలు చేయనవసరం లేదు. ఇలాంటి ప్రయోజనం కల్పించేందుకు సంబంధిత సెక్షన్లలో కొన్ని మార్పులు చేశారు. అయితే, దీనివల్ల చాలా మందికి ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. పన్ను భారం తప్పదు. రిటర్ను వేసే బదులు ముందుగానే డిక్లరేషన్ ఇస్తే సదరు బ్యాంకు.. పన్ను చెల్లించి, ధృవీకరణ చేస్తారు. ఇదేం ఉపశమనం? ఆన్లైన్లో రిటర్న్ వేయడం తప్పుతుంది తప్ప ఇంకేమీ తప్పదు. కేవలం వడ్డీ ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఏదైతేనేం.. ఇది కేవలం కంటితుడుపు చర్యే కాని ఉపశమనం కాదు. నేతి బీరకాయలో నెయ్యిలాంటిది. అంతే! - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
వ్యాపారంపై జీఎస్టీ రిటర్న్! ఏ సందర్భాల్లో వేయాలంటే..
ప్రశ్న: నేను 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేశాను. రీఫండ్ వచ్చింది. 2022కి సంబంధించి ట్యాక్సబుల్ ఇన్కం లేదు. రిఫండ్ ఎంత వస్తుంది? – ఎం సౌదామిని, చిత్తూరు సమాధానం: మీరు ఆదాయం వివరాలు, చెల్లించిన పన్ను వివరాలు పూర్తిగా తెలియజేయాలి. ట్యాక్సబుల్ ఇన్కం లెక్కించిన తర్వాత కానీ పన్నుభారం లెక్కించలేము. 31–03–2021కి రిఫండు వచ్చిందంటే దాని అర్థం మీరు ఆ సంవత్సరంలో అవసరమైన మొత్తం కన్నా ఎక్కువ పన్ను చెల్లించారు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా చెల్లించిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే, మదింపు చేసి అధికంగా కట్టిన మొత్తాన్ని రిఫండుగా ఇచ్చి ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీరు పన్ను చెల్లించారా? టీడీఎస్ ఉందా? ట్యాక్సబుల్ ఇన్కం రూ. 5,00,000 లోపు ఉంటే మీకు పన్ను ఉండదు. కానీ టీడీఎస్/అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారా? అవి లేకపోతే ఎటువంటి రిఫండు రాదు. మీరు ముందుగా చెల్లించకపోతే మీకు రిఫండు ఎందుకు వస్తుంది. నగదు బదిలీ పథకం లాగా రిఫండు రాదు. ---------------------------------------------- ప్రశ్న: నేను వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలా జీఎస్టీ రిటర్నులు వేస్తున్నాను. ఇంటి మీద అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం వస్తోంది. పాన్ ఉంది. తలా ఒక మాట చెబుతున్నారు. రిటర్ను వేయాలా వద్దా? తికమకగా ఉంది? ఏం చేయాలి? – ఎన్.ఆర్. పంతులు, విశాఖపట్నం సమాధానం: జీఎస్టీ రిటర్నులు ప్రతి నెలా వేస్తున్నాం అంటున్నారు. అంటే ‘రెగ్యులర్‘ అన్న మాట. టర్నోవరు బాగా ఉన్నట్లు. అద్దెకు ఇళ్లు ఇచ్చారు. అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం ఉంది. పాన్ ఉంది. లావాదేవీలు నగదు రూపంలో చేస్తున్నారా? అలా చేస్తుంటే తప్పు. బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? వాటిలో జమలు ఉన్నాయా .. లేవా? ఎవ్వరి మాటా వినొద్దు. తికమక పడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే .. బ్యాంకు అకౌంట్లలో ’డిపాజిట్ల’ నిమిత్తం ఎంత మొత్తం వచ్చిందో రాసుకోండి. అద్దె ఎంత? వ్యవసాయం మీద ఆదాయం ఎంత? నగదులో వస్తే బ్యాంకులో జమ చేయండి? జీఎస్టీ రిటర్నుల ప్రకారం టర్నోవరు వివరాలు సిద్ధంగా ఉంటాయి. దానికి సంబంధించిన కొనుగోళ్ల వివరాలూ ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఒక పుస్తకంలో సక్రమంగా రాయండి. తెలుగులోనూ అకౌంట్లు రాయవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో అకౌంటింగ్ ప్యాకేజీలు ఉన్నాయి. త్వరగా అకౌంట్లు రాయవచ్చు. వ్యాపారం లాభనష్టాలను లెక్కించండి. అన్ని ఆదాయాలను లెక్కించి ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. మీకే తెలిసిపోతుంది. గందరగోళం .. గజిబిజి ఉండదు. ఆదరాబాదరా అసలే ఉండదు. చట్టప్రకారం మీరు రిటర్ను వేయాలి. వేయకపోవటం తప్పే. కుంటి సాకులు వద్దు. మీనమేషాల లెక్కించకండి. త్వరగా తప్పనిసరిగా వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. - కేసీహెచ్ ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిఫుణులు -
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతనిచ్చే 3 బకెట్ స్ట్రాటజీ వివరాలు
పదవీ విరమణ తర్వాత సమకూర్చుకున్న నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు 3బకెట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? – అనురాగ్ వివిధ కాలాల్లోని అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడమే మూడు బకెట్ల విధానం. రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలం పాటు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం పొందేందుకు సరిపడా నిధిని ఒక బకెట్గా ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వల్పకాలం కోసం కనుక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ రాబడులు అన్నది ద్వితీయ ప్రాధాన్యమే అవుతుంది. కనుక ఈ బకెట్కు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక వచ్చే మూడు, నాలుగేళ్ల కోసం ఉద్దేశించినది రెండో బకెట్ అవుతుంది. ఈ నిధి క్రమం తప్పకుండా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాబడులు మోస్తరుగా ఉంటే చాలు. అనవసర రిస్క్లు తీసుకోవడం సరికాదు. కనుక అధిక నాణ్యత డెట్ సాధనాలైన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ను ఎంపిక చేసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక దీర్ఘకాలం నిధికి ఉద్దేశించినదే మూడో బకెట్. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే రాబడులు అవసరం అవుతాయి. కనుక డెట్తోపాటు కొంత పెట్టుబడిని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపినదే 3బకెట్ స్ట్రాటజీ అవుతుంది. మొదటి ఏడాదిన్నర అవసరాల కోసం ఉద్దేశించిన నిధిని రెండు నాణ్యమైన లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. దాంతో ప్రతీ నెలా అవసరమైనంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తమ రిటైర్మెంట్ నిధిలో ఒక వంతును ఒకటి లేదా రెండు నాణ్యమైన మల్టీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడులను ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడిన షార్ట్ డ్యురేషన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా చక్కగా సరిపోతుంది. ఇలాంటి స్ట్రాటజీతో రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్ణీత కాలానికోసారి కేటాయింపులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏడాది ఆరంభంలో మొత్తం నిధిలో ఈక్విటీ పెట్టుబడుల వాటాను మూడింట ఒక వంతుకు మించకుండా మార్పులు చేసుకోవాలి. అంతకుమించి ఈక్విటీ పెట్టుబడుల విలువ ఉంటే ఆ మేరకు వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఆరంభంలో తమ నిధిపై వార్షికంగా 4–5% మించి ఉపసంహరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుమించితే మీ నిధి తొందరగా తరిగిపోతుంది. పదేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. ఇందుకు ఇండెక్స్ఫండ్ లేదా ఈటీఎఫ్ లేదా యాక్టివ్గా నిర్వహించే ఈక్విటీ ఫండ్ వీటిల్లో దేనిని ఎంపిక చేసుకోవాలి? పదేళ్ల కాలానికి ఎక్స్పెన్స్ రేషియో పాత్ర ఏ మేరకు ఉంటుంది? – రవి రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని నేను అయితే ప్రోత్సహించను. దీనికి కారణం ఇది వినియోగపరంగా అంత అనుకూలమైనది కాదు. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ విధానం మరింత సౌకర్యమైనది. ప్రతీ నెలా ఫలానా తేదీన రూ.10,000 మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. సరిగ్గా ప్రతీ నెలా అదే రోజున ఎంపిక చేసుకున్న పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. విశ్వసనీయమైన ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ప్రస్తుతానికి లార్జ్క్యాప్ విభాగంలోనే ఉన్నాయి. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నవి వాటి పనితీరును నిరూపించుకుంటే అప్పుడు వాటిని పరిశీలించొచ్చు. కానీ, ఇప్పటికైతే యాక్టివ్గా నిర్వహించే ఫ్లెక్సీక్యాప్ అనుకూలమైనది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక పథకం 50 శాతం రాబడి ఇచ్చి, 2 శాతం ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తున్నట్టయితే.. అదే సమయంలో 50 శాతం రాబడిని అందించే మరో పథకం 1 శాతం ఎక్స్పెన్స్ రేషియోను రాబడుతున్నట్టయితే.. అప్పుడు ఒక శాతం రాబడి పథకమే మెరుగైనది అవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
మార్కెట్లో దిద్దుబాటు కొనసాగవచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. నవంబర్ వాహన విక్రయాలు, సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు, తయారీ, సేవారంగ డేటా, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు తదితర కీలకాంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘ప్రస్తుతం నిఫ్టీ 17,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 17,200 కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణ, ఆర్థిక గణాంకాల నమోదును మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఆయా అంశాలు మార్కెట్ను ప్రభావితం చేస్తాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు కోవిడ్ కొత్త వేరియంట్ భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లను కోల్పోయాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(బి.1.1.529 వేరియంట్) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. మన దేశంలో ఈ రకం కేసులు దేశంలో ఇప్పటివరకు నమోదుకాలేదు. అయితే అంతర్జాతీయంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా శక్తివంతమైనదని, రెండు డోసుల టీకాలు వేసుకున్న వారికీ వ్యాధి సంక్రమించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అనేక దేశాలు సరిహద్దులను మూసేస్తున్నాయి. లాక్డౌన్ను విధిస్తున్నాయి. ఈ చర్యలతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు సెప్టెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు మంగళవారం విడుదల అవుతాయి. వార్షిక ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో 8.4 శాతం నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. బేస్ ఎఫెక్ట్ కారణంగా గతేడాది ఇదే క్వార్టర్లో 20.1% వృద్ధి రేటు కనిపించింది. నవంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ బుధవారం (డిసెంబర్ ఒకటిన) విడుదల అవుతుంది. అదేరోజున ఆటో కంపెనీలు నవంబర్ వాహన విక్రయాలను విడుదల చేయనున్నాయి. చిప్ కొరత సమస్యతో ప్యాసింజర్ వాహన అమ్మకాల వృద్ధిలో క్షీణత ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారాంతపు రోజు శుక్రవారం దేశీయ సేవారంగ డేటా వెల్లడి అవుతుంది. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టబడులు భారీగా తరలిపోవడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నవంబర్లో రూ.31,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల విలువలు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఎఫ్ఐఐల విక్ర యాలు కొనసాగితే మార్కెట్ మరింత పతనాన్ని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ప్రపంచ పరిమాణాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. కోవిడ్ కేసులు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించి డిమాండ్ క్షీణించవచ్చే అంచనాలతో ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పతనాన్ని చవిచూసింది. క్రూడ్ ధరల అస్థిరత మన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయ వచ్చు.జపాన్ రిటైల్ అమ్మకాల డేటా నేడు(సోమవారం) అవుతుంది. అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్ట్మోనీ(చట్టసభల్లో ఆర్థిక వ్యవస్థపై ప్రసంగం) మంగళవారం ఉంది. వీటితో పాటు చైనా, యూరప్ దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. రేపు గో ఫ్యాషన్ షేర్ల లిస్టింగ్ గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న గో ఫ్యాషన్ ఇండియా షేర్లు మంగళవారం(నవంబర్ 30న) లిస్ట్కానున్నాయి. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.655 – 690 గా నిర్ణయించి కంపెనీ రూ.1,013 కోట్లను సమీకరణ సమీకరించింది. ఈ ఐపీఓకు 135 రెట్ల స్పందన లభించింది. కంపెనీ 80,79,491 షేర్లను ఆఫర్ చేయగా.. 109,44,34,026 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఎల్లుండి లిస్ట్ కానున్న ఈ షేర్లు గ్రే మార్కెట్లో రూ.500(70%) ప్రీమియం ధర పలుకుతున్నాయి. గో ఫ్యాషన్ ఇండియా ‘గో కలర్స్’ పేరుతో సొంత స్టోర్లను దేశవ్యాప్తంగా పట్టణాల్లో నిర్వహిస్తోంది. చదవండి: ప్రభుత్వ సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడులు -
కొత్త వార్షిక సమాచార ప్రకటన ఇలా..
The new IT Annual Information Statement Form 26 A: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ సరికొత్త ‘‘వార్షిక సమాచార ప్రకటన’’ వివరాలను విడుదల చేశారు. దీన్నే ఫారం 26 అ అని అంటారు. ఇక నుంచి ఈ ఫారంలో అనేక విషయాలు పొందుపరుస్తున్నారు. ఇకపై ఇందులో కనబడే 50 అంశాలను కింద తెలియజేస్తున్నాము.. - జీతభత్యాలు, వేతనాలు, అలవెన్సులు మొదలైనవి - మీరు అద్దెకు ఇచ్చిన ఇళ్ల మీద మీకు వచ్చే అద్దె వివరాలు - అందుకున్న డివిడెండ్లు - బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో జమయ్యే వడ్డీ - ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ - ఇతరత్రా వచ్చే వడ్డీల వివరాలు - ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిఫండు మీద వడ్డీ (రిఫండు ఆదాయం కాదు, కాని వడ్డీ మాత్రం ఆదాయం) - ప్లాంటు, మెషినరీ మొదలైనవి అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం - లాటరీ / క్రాస్వర్డ్ పజిల్స్ మీద వచ్చే ఆదాయం - గుర్రపు పందాల మీద ఆదాయం - ప్రావిడెంట్ ఫండ్లో జమ అయ్యే దానిలో యజమాని ఇచ్చిన మొత్తం - ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ మీద వడ్డీ - నాన్ రెసిడెంట్లకు వచ్చిన వడ్డీ (115 అ (1) (్చ) (జీజ్చీ్చ) - గవర్నమెంటు సెక్యూరిటీల మీద, బాండ్ల మీద వడ్డీ - 13లో చెప్పిన ప్రకారం యూనిట్ మీద ఆదాయం - 115 అఆ (1) (b) ప్రకారం యూనిట్ మీద వచ్చే ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ - 115 అఇ ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్ల మీద, షేర్ల మీద ఆదాయం - 115 అఈ (1) (జీ) ప్రకారం విదేశీ సంస్థల నుంచి ఆదాయం - ఇన్సూరెన్స్ కమీషన్ - కొన్ని నిబంధనలకు లోబడి ఇన్సూరెన్స్ పాలసీల మీద వచ్చే మొత్తం - ఎన్ఎస్సీ నుంచి విత్డ్రాయల్స్ - లాటరీ టికెట్లు విక్రయించినందుకు వచ్చే కమీషన్ - సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ నుండి ఆదాయం - యూనిట్ల కొనుగోలు మీద ఆదాయం - గవర్నమెంటుకు ఇవ్వాల్సిన వడ్డీ - నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్కి చెల్లింపులు - స్థిరాస్తి – భూమి, బిల్డింగ్ల విక్రయాలు - స్థిరాస్తుల బదిలీల వల్ల వచ్చే మొత్తం - వాహనాల అమ్మకాలు - మ్యూచువల్ ఫండ్ యూనిట్ల అమ్మకాలు - ఆఫ్ మార్కెట్ డెబిట్లు - ఆఫ్ మార్కెట్ క్రెడిట్లు - వ్యాపారంలో వసూళ్లు - వ్యాపారంలోని ఖర్చులు - మీరు చేసిన అద్దె చెల్లింపులు - 16డి ద్వారా ఇతర చెల్లింపులు - బ్యాంకు అకౌంటులో నగదు జమలు - బ్యాంకు అకౌంటు నుంచి విత్డ్రాయల్స్ - నగదు చెల్లింపులు - విదేశాలకు పంపిన మొత్తం, కరెన్సీల కొనుగోలు - విదేశాల నుంచి వచ్చిన మొత్తం - విదేశీయానం వివరాలు - స్థిరాస్తుల కొనుగోళ్ల వివరాలు - వాహనాల కొనుగోళ్లు - టైం డిపాజిట్ల కొనుగోళ్లు - సెక్యూరిటీలు, యూనిట్ల కొనుగోళ్లు - డెబిట్ / క్రెడిట్ కార్డుల వ్యవహారాలు - బ్యాంకు అకౌంటు వివరాలు - వ్యాపార ట్రస్టులు ఇచ్చిన ఆదాయం - ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మీద ఆదాయం ఇంచు మించు ప్రతి విషయం మీద ఆరా తీసి సమాచారం సేకరిస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. పారదర్శకతే మీకు శ్రీరామరక్ష. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: విదేశాల్లో ఉన్నారు.. ఇన్కంట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా? -
స్మాల్క్యాప్ నుంచి పెట్టుబడుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మార్కెట్లు గణనీయంగా పెరిగి ఉన్నాయి. కనుక స్మాల్క్యాప్ఫండ్లో ఉన్న నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలా?– బీరేంద్ర శర్మ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేస్తాయని మార్కెట్లో ఎక్కువ అంచనాలున్నాయి. కానీ, అటువంటి అంచనాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయరాదు. ఒకరి పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో స్మాల్క్యాప్ ఫండ్స్కు కేటాయింపులు 10–15 శాతానికి మించి ఉండకూడదన్నది నా అభిప్రాయం. ఈ మేరకు కేటాయింపులతో రాబడుల రేటు పెంచుకోవచ్చు. దీర్ఘకాలంలో ఎనిమిదేళ్లు, పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలాల్లో స్మాల్క్యాప్ ఫండ్స్ పనితీరును పరిశీలించినట్టయితే.. ఫ్లెక్సీక్యాప్ లేదా లార్జ్క్యాప్ ఫండ్స్ కంటే చెప్పుకోతగ్గ అంతరంతో అధిక రాబడులు ఇచ్చాయని అర్థమవుతుంది. కనుక ఆ విధంగా చూసుకుంటే స్మాల్క్యాప్ కేటాయింపులతో పోర్ట్ఫోలియో రాబడులను అధికం చేసుకోవచ్చు. అయితే, స్మాల్క్యాప్ కంపెనీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అస్థిరతలతో ఉంటాయి. అందుకే స్మాల్క్యాప్ స్టాక్స్కు మరీ ఎక్కువ కేటాయింపులతో దూకుడుగా వెళ్లడం సూచనీయం కాదు. పోర్ట్ఫోలియోలో స్మాల్క్యాప్ కేటాయింపులను 10–15 శాతానికి పరిమితం చేసుకోవాలి. మీ పోర్ట్ఫోలియోను ఒకసారి విశ్లేషించుకుని ఇందుకు అనుగుణంగా మార్పులు చేసుకోండి. ఒకవేళ స్మాల్క్యాప్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకోండి.. ఒకవేళ మీ పెట్టుబడుల కాలవ్యవధి 8–10 ఏళ్లకంటే తక్కువే అనుకుంటే అప్పుడు స్మాల్క్యాప్ కేటాయింపులను తగ్గించుకోవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లు.. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – అంకిత్ జైన్ రెండింటిలోనూ భద్రత ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కాస్త అధిక భద్రత ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడుల పరంగా వైవిధ్య ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లో రిస్క్ ఉంటుందని కాదు. ఆర్బీఐ సూక్ష్మంగా వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొత్త నమూనా కింద వచ్చినవి. ఇంకా విశ్వసనీయతను సంపాదించుకోవాల్సి ఉంది. అంటే అవి భద్రత లేనివి అని కాదు. డెట్ ఫండ్లో మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం కూడా 30 డెట్ సాధనాల మధ్య విస్తరించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక్కటి అంచనాలు తప్పినా.. పెట్టుబడుల్లో 5–7 శాతం వాటా మించి ఉండదు. అంటే మీ పెట్టుబడులు మొత్తం రిస్క్లో పడినట్టు కాదు. మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తే డెట్ సాధనాల రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పైగా వీటిల్లో లిక్విడిటీ అధికం. విక్రయించిన రెండు రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. వీటి మధ్య ఉన్న ఒకే ఒక వ్యత్యాసం.. మెచ్యూరిటీ నాటికి ఎంత మొత్తం వస్తుందో డిపాజిట్స్లో తెలుస్తుంది. డెట్ ఫండ్స్లో రాబడులపై అంచనాకే పరిమితం కావాలి. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తయింది. నా కెరీర్ కూడా ప్రారంభమైంది. బ్లూచిప్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు మొదలుపెట్టాను. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. మరింత ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు ఏ సాధనాలను సూచిస్తారు? ప్రస్తుతానికి నా వేతనం నుంచి 10 శాతమే పెట్టబడులకు వెళుతోంది?– సాకేత్ ముందుగా పెట్టుడులను ప్రారంభించినందుకు అభినందనలు. ఇది మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. రానున్న సంవత్సరాల్లో ఈ ఫలితాలను చూస్తారు. పెట్టుబడుల విషయంలో సెక్షన్ 80సీ కింద పరిమితి మేరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. మూడు లేదా నాలుగు ఫండ్స్కు మించి ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. వైవిధ్యమైన పెట్టుబడులకు ఈ మాత్రం పథకాలు సరిపోతాయి. పెరుగుతున్న మీ వేతనానికి అనుగుణంగా ఆయా పథకాల్లో చేసే పెట్టుబడుల మొత్తాన్ని (సిప్ను) కూడా పెంచుకుంటూ వెళ్లండి. కొందరు సరైన వయసులోనే పెట్టుబడులు ప్రారంభిస్తారు. కానీ, క్రమానుగతంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడంలో వైఫల్యం చెందుతారు. దీన్ని నివారించాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
వ్యాపారంలో సొంత ఖర్చులా? అయితే చిక్కులు తప్పవు!
నేను చిరు వ్యాపారం చేస్తున్నాను. జీఎస్టీ నంబర్ ఉంది. స్వంత ఇంట్లోనే వ్యాపారం. నా స్వంత ఖర్చులను కూడా వ్యాపారపు ఖర్చుల్లో కలిపివేయవచ్చా. అలా కలపడం వల్ల లాభం తగ్గుతుంది కదా – ఆర్ చిట్టిబాబు, శ్రీకాకుళం చిరు వ్యాపారం అంటున్నారు.. కానీ జీఎస్టీ నంబరు ఉందంటున్నారు. సరే, సరిగ్గా అన్ని రికార్డులు నిర్వహించండి. స్వంత ఇంట్లోనే వ్యాపారం అన్నారు. ఇల్లు మీ పేరు మీదే ఉంటే అద్దె నిమిత్తం ఏ ఖర్చూ రాయకండి. ఇల్లు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అద్దె ఖర్చుగా రాయవచ్చు. అది కూడా మొత్తం ఇంట్లో ఎంత భాగం అయితే వ్యాపారానికి కేటాయిస్తున్నారో, అంతకు మాత్రమే ఖర్చు చేయండి. అలాగే కరెంటు, నీరు ఖర్చు కూడా . ఇక వ్యాపార నిర్వహణలో కేవలం వ్యాపారానికి సంబంధించిన ఖర్చును మాత్రమే పరిగణిస్తారు. వ్యక్తిగత ఖర్చులు, సొంత వాడకాలు, ఇతర ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు మొదలైనవి పరిగణించరు. ఇటువంటి ఖర్చులను వ్యాపార ఖాతాలో రాయకండి. సొంత వాడకాలని కూడా విడిగా రాయాలి. ఖర్చుల విషయంలో ‘‘సమంజసం’’, ‘‘ఉచితం’’, ‘‘సంబంధం’’ అన్న సూత్రాలు వర్తిస్తాయి. పుస్తకాలు సరిగ్గా రాయండి. ఆడిట్ అవసరం కాకపోతే ఖర్చులు రాయకుండా అమ్మకాల మీద 8 శాతం కన్నా ఎక్కువ లాభం చూపించవచ్చు. అప్పుడు లెక్కల బెడద ఉండదు. ఏది ఏమైనా సొంత ఖర్చులు కలపకూడదు. నేను ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నాను. ఒక కోర్టు కేసు వల్ల గతంలో జీతం చెల్లించలేదు. 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయీలు ఈ సంవత్సరం ఇస్తారు. దీని వల్ల నాకు పన్ను భారం పెరుగుతుందా? – యం. నాగమణి, రాజమండ్రి ఇలాంటి బకాయీలను ‘‘ఎరియర్స్’’ అంటారు. వీటిని ట్యాక్సబుల్ ఇన్కంగా పరిగణిస్తారు. అంటే ఈ అదాయం మీద పన్ను భారం ఉంది. అయితే, ఒక వెసులుబాటు కూడా ఉంది. ఏ సంవత్సరానికి తత్సంబంధమైన ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మీరు తక్కువ/చిన్న శ్లాబులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీలు, మినహాయింపులు తీసుకోవచ్చు. పన్నుభారం తక్కువ కావచ్చు. మీకు రెండు సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఎరియర్స్ని ప్రస్తుత సంవత్సరం ఆదాయంతో బాటు కలిపి పన్ను భారం లెక్కించండి. రెండో పద్ధతి ప్రకారంలో ఈ ఎరియర్స్.. ఆర్థిక సంవత్సరం ప్రకారం సర్దుబాటు చేయండి. గతంలో వచ్చిన జీతానికి ఈ ‘ఎరియర్స్’ భాగం కలిపి పన్ను భారం లెక్కించండి. అలా ఎన్ని సంవత్సరాలు వర్తిస్తుందో.. అన్ని సంవత్సరాలకు పన్నుభారం లెక్కించండి. ఆ తర్వాత అలా అన్ని సంవత్సరాల పన్ను భారం కలిపి మొత్తం పన్నుభారాన్ని కనుక్కోండి. ఇలా వచ్చిన మొత్తం పన్ను భారాన్ని ముందు/మొదట్లో లెక్కించిన పన్నుభారంతో పోల్చి చూడండి. ఏది తక్కువ ఉందో, అంతే చెల్లించండి. ఇలా తక్కువ చెల్లించడాన్ని 89 (1) రిలీఫ్ అంటారు. మీరే ఒక స్టేట్మెంట్ చేసుకుని ఫారం 10 ఉలో సమాచారాన్ని పొందుపర్చి, మీ యజమానికి ఇవ్వండి. రిలీఫ్ ఇస్తారు. ఒకవేళ ప్రస్తుత సంవత్సరంలోనే పన్నుభారం తక్కువగా ఉందనుకోండి. 10 ఉ ఇవ్వనవసరం లేదు. అన్ని రికార్డులు జాగ్రత్తగా భద్రపర్చుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూరి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
జీవిత బీమా పాలసీకి ఈ నాలుగూ ఎంతో కీలకం
ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమాది కీలకపాత్ర. ఇతర ఆర్థిక సాధనాలు, పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు దీనికి ప్రాధాన్యమివ్వాలి. కరోనా వైరస్ మహమ్మారిపరంగా ఏదైనా మంచి జరిగిందంటే.. అది చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా ప్రాధాన్యతలను గుర్తించడమే. వైవిధ్యభరితమైన ఆర్థిక సాధనంగా.. జీవితంలో వివిధ దశల్లో లక్ష్యాలను సాధించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతగానో అక్కరకొస్తుంది. జీవిత బీమా పాలసీలను ఆన్లైన్లో కూడా సులభతరంగా కొనుగోలు చేయడానికి వీలున్న ప్రస్తుత తరుణంలో.. పాలసీ ఎంపికలో గుర్తుంచుకోతగిన అంశాలు నాలుగు ఉన్నాయి. అవేంటంటే.. అంచనా వేసుకోవడం మీ జీవితంలో ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆకాంక్షలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉండవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు కావచ్చు.. రుణాలను తీర్చివేసేందుకు లోన్ తీసుకోవడం కావచ్చు, వైద్య చికిత్స ఖర్చులు.. రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు.. అవసరాలు అనేకం ఉండవచ్చు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు, మీ మీద ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితంగా కాపాడేందుకు వీలుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కావాలనుకుంటే టర్మ్ పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. అలాగే యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమానుగత ఆదాయం కోసం రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవడం వంటివి పరిశీలించవచ్చు. అధ్యయనం చేయడం నిర్దిష్ట ప్లాన్ను ఎంచుకునే ముందు మార్కెట్లో ఉన్న వివిధ పథకాలను అధ్యయనం చేయండి. పాలసీ రకాలు, అవి అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి. ఉదాహరణకు టర్మ్ ప్లాన్ తీసుకుంటే రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడేది కాగా.. పిల్లల భవిష్యత్తును భద్రపర్చేదిగా చైల్డ్ ప్లాన్ పనికి వస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే ఇటు జీవిత బీమా, అటు పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎంత కవరేజీ సరైన పథకం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. తగినంత స్థాయిలో సమ్ అష్యూర్డ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలసీదారు ఆర్థిక స్థితిగతులు బట్టి కవరేజీని లెక్కించడానికి వీలవుతుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, తీర్చాల్సిన రుణాలు, జీవితంలో వివిధ దశలకు సంబంధించి ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ అష్యూర్డ్ ఎంతకు తీసుకోవాలన్న దానికి ప్రామాణికమైన అంకె ఏమీ లేదు. కానీ వార్షిక జీతానికి కనీసం 15 రెట్లు అయినా ఎక్కువగా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పాలసీ ల్యాప్స్ కానివ్వొద్దు టర్మ్ పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లింపులను కొనసాగించాలి. ల్యాప్స్ కానివ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పాలసీ ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకుంటే, పాలసీ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి.. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఆర్థికమైన భరోసా లభించగలదు. - సంజయ్ తివారి, డైరెక్టర్ (స్ట్రాటజీ), ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదవండి:జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..? -
40 ఏళ్ల పాటు సిప్.. మార్గం ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్కు, డైరెక్ట్ ప్లాన్కు వేర్వేరు రేటింగ్ను ఎలా కలిగి ఉంటాయి?– ఆర్ణబ్ ఒక విభాగంలో పోటీ పథకాలతో పోలిస్తే రిస్క్ను సర్దుబాటు చేసుకుని ఇచ్చే రాబడులకు సంబంధించి పరిమాణాత్మక కొలమానమే రేటింగ్. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. డైరెక్ట్ ప్లాన్ను.. ఇతర పథకాల్లోని డైరెక్ట్ ప్లాన్లతోనే పోల్చి చూడడం జరుగుతుంది. అలాగే, రెగ్యులర్ ప్లాన్లను ఇతర పథకాల రెగ్యులర్ ప్లాన్లతోనే పోల్చి చూస్తారు. డైరెక్ట్ ప్లాన్కు, రెగ్యులర్ ప్లాన్కు మధ్య రేటింగ్ వేర్వేరుగా ఉండడానికి కారణం.. ఎక్స్పెన్స్ రేషియోనే. రెగ్యులర్ ప్లాన్లలో పోటీ పథకాలతో పోలిస్తే ర్యాంకు తక్కువగాను, సగటు కంటే తక్కువగా ఉండడం అన్నది అసాధారణం, అరుదైనదేమీ కాదు. అందుకనే మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపికలో ఎక్స్పెన్స్ రేషియోకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ డెట్ ఫండ్లో అయితే ఎక్స్పెన్స్ రేషియోకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. నా వయసు 20 ఏళ్లు. పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో 40 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? ఇందుకు అనుసరించే వ్యూహం ఎలా ఉండాలి? – శ్రీజన్సింగ్ కచ్చితమైన ప్రణాళిక గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడమే ఇప్పుడు కీలకమైనది. మీకు పన్ను చెల్లించే ఆదాయం ఉండి ఉంటే.. అప్పుడు ఒకటి లేదా రెండు మంచి ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పన్ను ఆదా సాధనాలు) ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఒకవేళ పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోతే కనుక మంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో సిప్ను మొదలు పెట్టొచ్చు. ఈ వయసులో ఎంతో క్రమశిక్షణగా మెలుగుతూ మార్కెట్లు పెరిగిన సమయాల్లో, పడిన సమయాల్లోనూ సిప్ను కొనసాగించడం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. సిప్ ప్రారంభంలో కొంత కాలం పాటు రాబడులు మీ అంచనాల స్థాయిలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ అది మీ పెట్టుబడులకు అవరోధంగా మారకుండా చూసుకోవాలి. పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. అదే విధంగా పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా ఏటేటా పెంచుకుంటూ వెళ్లాలి. నేను ఒకే ఈక్విటీ ఫండ్లో సిప్ రూపంలో రూ.20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. వివిధ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని వైవిధ్యం చేసుకోవాలా? లేదంటే ఇప్పటి మాదిరే కొనసాగాలా? ఇందులో ఉండే లాభ, నష్టాల మాటేమిటి? – హేమంత్ వైవిధ్యం అవసరం ఎంతో ఉంది. కనీసం మరొక మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించిన వేరొక పథకానికి అయినా మీ పోర్ట్ఫోలియోలో చోటివ్వాల్సిందే. అలా కాకుండా ఇప్పటి మాదిరే అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుంటే.. అప్పుడు ఆ పథకం విషయంలో ఏదైనా అనుకోని పరిణామం తలెత్తితే రాబడులన్నీ రిస్క్లో పడినట్టు అవుతుంది. వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకానికి (వేరే ఫండ్ సంస్థకు సంబంధించి) మీ పోర్ట్ఫోలియోలో చోటివ్వాలి. వైవిధ్యం విషయంలో అతిగా వ్యవహరించకుండా (మితిమీరిన వైవిధ్యం) ఉంటే ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న పథకం తర్వాతి కాలంలో అద్భుతమైన పనితీరును చూపించొచ్చు. అప్పుడు పెట్టుబడులను వైవిధ్యం చేసుకుని తప్పు చేశామా? అన్న సందేహం రావచ్చు. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకాన్ని ఎంపిక చేసుకోండి. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు
నేను ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. జీతం రూ. 8 లక్షలు. పాన్ ఉంది. రిటర్న్ వేయటం లేదు. ప్రతి సంవత్సరం మా యజమాని కొంత మొత్తం ఇన్కం ట్యాక్స్ నిమిత్తం కట్ చేస్తారు. వివరాలు ఇవ్వడం లేదు – ఎస్ రామచంద్ర నాయుడు, మెదక్ మీ తరఫు నుంచి ఆలోచిస్తే, మీరు స్వయంగా ఆదాయపు పన్ను చట్టప్రకారం ట్యాక్సబుల్ ఇన్కం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం రిటర్ను దాఖలు చేయాలి. మార్చి 21తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను దాఖలు చేయండి. ఆన్లైన్లో వేయవచ్చు. ఇక రిటర్ను వేయడానికి మీ జీతం వివరాలు, ఇతర ఆదాయపు వివరాలు, బ్యాంకు అకౌంటు వివరాలు, బ్యాంకులో జమ అయిన వడ్డీ, రెడీగా ఉండాలి. దీనితో పాటు మీ యజమాని మీకు ఫారం 16 ఇవ్వాలి. అడగండి. ఫారం 16లో అన్ని వివరాలు ఇవ్వాలి. పన్ను భారాన్ని మీ యజమాని మీ దగ్గర్నుండి ’కట్’ చేశారు కాబట్టి ఆ వివరాలు వారి దగ్గర ఉంటాయి. దీన్నే టీడీఎస్ అంటారు. అలా కట్ చేసిన మొత్తాన్ని మీ యజమాని సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలి,. ఆ తర్వాత ఆ వివరాలను అప్లోడ్ చేయించాలి. మొత్తం సమాచారం ఫారం ’26 అ ’లో కనిపిస్తుంది. ఇలా కనిపించిందంటే మీరేం గాభరా పడనక్కర్లేదు. ఆ వివరాలతో మీరు దాఖలు చేసుకోవచ్చు. అలా కాకుండా, మీ దగ్గర్నుంచి ’కట్’ చేసి, ఆ మొత్తాన్ని మీ తరఫున ప్రభుత్వానికి చెల్లించకపోవటం చట్టరీత్యా నేరం. చట్టరీత్యా శిక్ష పడుతుంది. కాబట్టి పూర్తిగా చెక్ చేసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే సరి. లేదంటే మీ ఉద్యోగస్తులందరూ కలిసి యజమానిని అడగండి. సమస్య సమసిపోతుంది. లేదంటే తగిన సాక్ష్యాధారాలతో ఆదాయపు పన్ను అధికారులకు తెలియజేయండి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని అంశాలు తెలియజేయగలరు – కేఆర్ రెడ్డి, ఏలూరు సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కేవలం రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్లకు వర్తించవు. 60 సం.లు దాటి, 80 సం.ల లోపు ఉన్న వారిని సీనియర్ సిటిజన్లు అంటారు. 80 సం.లు దాటిన వారిని వెరీ సీనియర్ సిటిజన్లు అంటారు. 31–3–2021 నాటికి ఈ రూలు వర్తింపచేస్తారు. చాలా మంది రిటర్నులు దాఖలు చేసిన తేదీకి వర్తిస్తుంది అని అనుకుంటారు. 60 సం. లోపు వారికి బేసిక్ లిమిట్ రూ.2,50,000, 60–80 సం.ల వారికి ఇది రూ. 3,00,000 కాగా, 80 సం.లు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 5,00,000గా ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపు ఉంది. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం లేకపోతే వారు ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం వచ్చే వారికి ఈ మినహాయింపు లేదు. 80 ఖీఖీఆ ప్రకారం రూ. 50,000 వరకు నిర్దేశిత వడ్డీ మీద మినహాయింపు ఉంది. టీడీఎస్ మినహాయింపు ఉంది. ప్రతి బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ (మొత్తం వడ్డీ కాదు) రూ. 50,000 దాటకపోతే టీడీఎస్ ఉండదు. 80 ఈఈఆ ప్రకారం వైద్య చికిత్స నిమిత్తం మినహాయింపులు ఉన్నాయి. అలాగే 80 ఈ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్, వైద్య చికిత్స కోసం మినహాయింపులు ఉన్నాయి. 75 ఏళ్లు దాటిన వారు రిటర్నులు వేయనవసరం లేదు. - కేసీహెచ్ ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
రూ. కోటితో రిటైర్.. ఆ మొత్తం ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచింది?
రూ.కోటి నిధితో పదవీ విరమణ తీసుకున్న వ్యక్తి.. ఆ మొత్తాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి? – రిషి ఎంత ఆదాయాన్ని మీరు కోరుకుంటున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే, మీకు పెన్షన్ లేదా అద్దె ఆదాయం వంటి ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా? అన్న విషయాలు కూడా ఇక్కడ ప్రధానం అవుతాయి. నెలవారీగా ఎంత ఆదాయం కావాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ నిధి నుంచి ఎక్కువ ఆదాయం కోరుకుంటుంటే అప్పు డు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టే అవుతుంది. వైవిధ్యమైన పెట్టుబడులతో వార్షికంగా 9–12 శాతం రాబడి సంపాదించుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే మీ నిధి నుంచి వార్షికంగా 6% మేర వినియోగించుకోవచ్చు. అప్పుడు నెలవారీ రూ.50,000 ఆదాయం పొందడమే కాకుండా.. మీ పెట్టుబడుల విలువ కాపాడుకోవడంతోపాటు.. భవిష్యత్తులో అధిక ఆదాయానికి వీలవుతుంది. జాగ్రత్తగా ప్రణాళిక రచించుకోవాలి. అత్యవసర నిధికి లిక్విడ్ ఫండ్స్కు అనుకూలమేనా? అత్యవసరం ఏర్పడకపోతే అదే నిధి దీర్ఘకాలం పాటు అందులోనే ఉంటుంది. కనుక మూడు నెలలకు మించిన కాలానికి లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – నిహార్ ఇన్వెస్ట్ చేసే ముందే వచ్చే ఏడాది అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ నిధితో అవసరం లేదనుకుంటే అప్పుడు లిక్విడ్ ఫండ్స్ తగిన ఎంపిక కావు. మీ పెట్టుబడుల కాలానికి అనుకూలమైన ఇతర డెట్ ఫండ్ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కానీ, అత్యవసర నిధి అనేది.. అవసరం ఎదురైనప్పుడు వెనువెంటనే పొందేందుకు అనుకూలంగా ఉండాలి. కనుక ఈ నిధికి ఎక్కువ భద్రతతోపాటు, వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం కూడా ఉండాలి. అత్యవసర నిధి కోసం చూడాల్సిన అంశాలివే. అయితే, ఈ నిధి సాధారణంగా ఎక్కువ కాలం పాటు పెట్టుబడిగా కొనసాగుతుంటుంది. సాధారణంగా అవ్యవసరం ఏర్పడి, ఈ నిధిని తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే కోరుకుంటారు. అత్యవసరం ఎప్పుడొస్తుందన్నది అస్సలు ఊహించలేము. కనుక దీర్ఘకాలం పాటు కొనసాగినప్పటికీ అత్యవసర నిధి కోసం లిక్విడ్ ఫండ్స్ అనుకూలమే. దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవాలి. కానీ, రాబడి లిక్విడ్ ఫండ్స్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కనుక అత్యవసర నిధి విషయంలో కాలాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు. - ధీరేంద్రకుమార్, సీఈవో, రీసెర్చ్ వ్యాల్యూ చదవండి : రేపటి నుంచే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సౌకర్యాలన్నీ బంద్ -
అత్యవసర నిధి ఎంత ఉండాలి? ఎలా మేనేజ్ చేయాలి?
పోర్ట్ఫోలియోలో ఈఎస్జీ ఫండ్స్కు చోటివ్వాలా? ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఈఎస్జీ ఫండ్స్ కూడా ఉండాలా? మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్కు ఇవి ఏ రకంగా భిన్నంగా ఉంటాయి? – రాజుగోపాల్ శ్రీధర్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ఈఎస్జీ) ఫండ్స్కు ఇప్పుడు ఆరంభదశ. ఇందులో విశ్వసనీయమైన ఎంపికలు ప్రస్తుతానికి లేవన్నది నా అభిప్రాయం. ప్రధాన ఫండ్స్లోనూ ఈఎస్జీకి చోటు కీలకంగా మారుతోంది. సమాజానికి, పర్యావరణానికి అనుకూలమైన కంపెనీలు వ్యాపారానికి కూడా మంచివే. భారత్లో దీర్ఘకాలంలో విజేతలైన కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ పరిపాలన ఎంతో కీలకంగా ఉంటోంది. మన దేశంలో ఈఎస్జీ ఫండ్స్ ఇంకా ప్రధాన విభాగంగా పరిణమించలేదు. ఈ దశలో ఇన్వెస్టర్లకు ఈ విభాగంలో విస్తృతమైన ఎంపికలు లేవు. ఈక్విటీల్లో పెట్టుబడులపై రాబడులను డెట్ ఫండ్స్కు మళ్లించడాన్ని మీరు సూచిస్తారా? ముఖ్యంగా స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్కు సంబంధించి ఇలా చేయవచ్చా? – మోతి రాజేంద్రన్ రక్షణాత్మక ధోరణితో ఉండే ఇన్వెస్టర్లు స్మాల్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు స్మాల్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి, వాటిపై మంచి లాభాలు కనిపిస్తుంటే, వాటిని కాపాడుకునేందుకు వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ పథకాలు) ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పూర్తి భద్రత లభించినట్టు కాదు. ఎందుకంటే మీరు కేవలం లాభాలను మాత్రమే వెనక్కి తీసుకుని, అసలు పెట్టుబడిని అందు లోనే కొనసాగిస్తారు కనుక.. మార్కెట్లు దిద్దుబాటుకు లోనయితే పెట్టుబడుల విలువ గణనీయంగా క్షీణించే అవకాశం లేకపోలేదు. మీదైన అస్సెట్ అలోకేషన్ విధానాన్ని అనుసరించండి. దీనికి బదులు వివిధ రకాల ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు కనిపిస్తుంటే.. కరెక్షన్ వచ్చినా లాభాలు కాపాడుకోవాలని భావిస్తుంటే మొత్తం పెట్టుబడుల్లో ఒక వంతును స్థిరాదాయ పథకాల్లోకి మార్చుకోవచ్చు. ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ పెట్టుబడుల కాలాన్ని అనుసరించి వచ్చిన లాభాలు వేర్వేరుగా ఉంటుంటాయి. ఉదాహరణకు 15–20 ఏళ్ల క్రితం నాటి పెట్టుబడులు కూడా నాకు కొన్ని ఉన్నాయి. ఈ పెట్టుబడుల విలువలో 90 శాతం లాభాల రూపంలో సమకూరిందే. ఒకవేళ మీరు ఒక నెల క్రితమే లేదా సంవత్సరం క్రితమే ఇన్వెస్ట్ చేసి, 50 శాతం పెరిగి ఉంటే.. అందులో మీ లాభం మూడింట ఒక వంతుగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే మొత్తం విలువలో మీ లాభాలు 75 శాతంగా ఉండొచ్చు. కనుక పెట్టుబడుల కాలాన్ని అనుసరించి ఈ లాభాల పరిమా ణం వేర్వేరుగా ఉంటుంది. మార్కెట్ల పట్ల ఆందోళనగా ఉంటే, గణనీయంగా పడిపోతాయని భావిస్తుంటే.. మీరు అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను విభజించడం)ను అనుసరించాలి. అత్యవసర నిధిగా ఎంత మొత్తం ఉండాలన్నది ఎలా నిర్ణయించుకోవాలి? అసలు ఎంత సరిపోతుంది?– కరణ్ అత్యవసర నిధికి సంబంధించి కచ్చితమైన, ప్రామాణిక సూత్రం అంటూ ఏదీ లేదు. మీ అంతట మీరే దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.. వారికి సంబంధించి వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు అధిక మొత్తంలో అత్యవసర నిధి అవసరం అవుతుంది. మీకు పిల్లలు ఉంటే అప్పుడు అత్యవసర నిధి అవసరం వేరుగా ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగానికి భద్రత ఎంత మేరకు? మీ ఆదాయంలో స్థిరత్వం ఏ మేరకు అన్నది కూడా అత్యవసర నిధిని నిర్ణయించుకోవడంలో ముఖ్య అంశాలు అవుతాయి. ఆదాయంలో స్థిరత్వం లేకపోతే అత్యవసర నిధి మరింత మొత్తం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత మేరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకునేందుకు ఈ అంశాలన్నీ కీలకమవుతాయి. - ధీరేంద్రకుమార్,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
ఉద్యోగాలు మారడాన్ని బట్టి పన్ను మినహాయింపు ఉంటుందా?
నేను 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారాను. మొదటి యజమాని దగ్గర 7 నెలలు, రెండో యజమాని దగ్గర 5 నెలలు పని చేశాను. ఇద్దరూ ఫారం 16 జారీ చేశారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఇచ్చారు. కానీ రిటర్ను నింపేటప్పుడు ఒక స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే చూపించాలంటున్నారు. ఇది కరెక్టేనా? – ఎ. సూర్యప్రకాశ్, హైదరాబాద్ మీరు అడిగిన ప్రశ్నకి మీ వయస్సుతో సంబంధం లేదు కానీ సాధారణంగా, వయస్సును బట్టి పన్నుభారం మారుతుంది. ఇక మీ సంశయానికి జవాబు ఏమిటంటే, ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలంలో ఎన్న ఉద్యోగాలు చేసినా, మారినా, ఆ ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ ఒక్కసారే .. ఒక మొత్తమే తగ్గించాలి. ఇది ఉద్యోగికి వర్తించే మినహాయింపే తప్ప యజమానులకు సంబంధించినది కాదు. రెండో యజమాని ఫారం 16 జారీ చేసేటప్పుడు, అంతకన్నా ముందు యజమాని ఇచ్చిన ఫారం 16ని చూడాలి. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ విషయంలోనూ ఇలాగే జరిగి ఉంటే రెండో యజమాని ఆ తప్పు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. మీకు మొత్తం మీద రూ. 50,000 మాత్రమే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రూ. 50,000 తగ్గింపు ఇవ్వరు. ఒకసారి మాత్రమే చూపించడం, క్లెయిం చేయడం కరెక్టు పని. ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగవు. నా వయస్సు 52 సంవత్సరాలు. నేను టీచర్ని. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. తను కూడా టీచరే. భువనగిరిలో చెరొక స్కూలులో పని చేస్తున్నాం. ఇది మా స్వస్థలం. మా నాన్నగారు (లేరు) కట్టించిన ఇంట్లో కలిసి కాపురం చేస్తున్నాం. అమ్మ మాతో ఉంటోంది. ఇంటద్దె క్లెయిం చేయవచ్చా? మీ ఇద్దరికీ వచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సు, ఇతరాలు మొదలైనవి ఉంటాయి. నిజంగా మీరు ప్రతినెలా అద్దె చెల్లించినట్లయితే, అలా చెల్లించినందుకు మీ ఆదాయపు లెక్కింపులో అర్హత ఉన్నంత మేరకు మినహాయింపుగా తగ్గిస్తారు. అలా తగ్గించినందు వలన ఆదాయం తగ్గి, పన్ను భారం తగ్గుతుంది. భార్యభర్తలు కలిసి ఒకే గూటి కింద కాపురం.. ఇద్దరూ అద్దె చెల్లించే ఉంటున్నారా? మీరు ఆ ఇంట్లో ఉంటున్నాం అంటున్నారు. అద్దె ఇవ్వడం లేదు. కాబట్టి మీ ఆదాయంలో నుంచి ఇంటద్దె అలవెన్స్కి క్లెయిం .. అంటే మినహాయింపు పొందకూడదు. ఇది సబబు కాదు. అయితే, ఒక విధంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. మీ నాన్నగారు కట్టించిన ఆ ఇంటికి వారసులెవ్వరు? మీ అమ్మగారు అనుకుందాం. అంటే మీ అమ్మగారు ఇంటి ఓనరు. ఆవిడ ఇంట్లో మీరు అద్దెకు ఉంటున్నట్లు చెప్పవచ్చు. మీ ఇద్దరిలో ఎవరి జీతం ఎక్కువో వారికి ఈ ప్లానింగ్ బాగుంటుంది. ఇద్దరి జీతం ఇంచుమించు సమానంగా ఉంటే ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు. అద్దె నెలకు రూ. 10,000 అనుకోండి. చెరి సగం మీ అమ్మగారికి ఇవ్వండి. పూర్తి బెనిఫిట్ రావడానికి తగినంతగా అద్దెను లెక్కించండి. మీ అమ్మగారి పాన్ తీసుకోండి. బ్యాంకు అకౌంటు తెరవండి. ఆ అకౌంటులో తూ.చా. తప్పకుండా ప్రతి నెలా అద్దెలు విడివిడిగా జమ చేయండి. ఇలా చేయడం వల్ల వ్యవహారానికి చట్టరీత్యా బలం ఏర్పడుతుంది. ఓనర్, అద్దె, బ్యాంకు ద్వారా చెల్లింపు, పాన్, ఇలా ఇవన్నీ గట్టి రుజువులే. 60 ఏళ్ల లోపు వారికైతే నెలసరి అద్దె రూ. 20,000 దాటితే తప్ప (మీ అమ్మగారికి ఇతరత్రా ఏ ఆదాయం లేదనుకుందాం), 60 సంవత్సరాలు దాటితే రూ. 25,000 వరకూ ఏ పన్ను భారం ఉండదు. మీరే ఆ ఇంటికి ఓనర్ అయితే ఇలా చేయవద్దు. మీరిద్దరూ మీ మొత్తం ఆదాయంలో ఇంటద్దె అలవెన్స్ని మినహాయింపుగా పొందవద్దు. తప్పుగా క్లెయిం చేసి ఎటువంటి కష్టాలు కొని తెచ్చుకోకండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు చదవండి : రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
యాప్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే.. మన డబ్బులు భద్రమేనా?
పెట్టుబడులకు నేడు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) కోసం ఈ యాప్స్ను నమ్ముకోవచ్చా?ఎందుకంటే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ల గురించి పెద్దగా తెలియదు కదా? – రాజేంద్ర ఈ యాప్స్ గురించి ఆందోళన చెందకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ పెట్టుబడులు నిజంగా ఎంపిక చేసుకున్న పథకంలోకి వెళ్లిందీ, లేనిదీ కూడా పరిశీలించుకోవచ్చు. గత వారమే ‘మ్యూచువల్ ఫండ్ సెంట్రల్’ ప్రారంభమైంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఆర్టీఏలు)గా పనిచేస్తున్న కేఫిన్ టెక్నాలజీస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థలు మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్ను ఏర్పాటు చేశాయి. మీరు ఏ యాప్ నుంచి ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్పై ఆ పెట్టుబడులను తనిఖీ చేసుకోవచ్చు. మీ పాన్, ఫోన్ నంబర్ సాయంతో మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ పోర్టల్ నుంచి పెట్టుబడుల వివరాలను ఎప్పుడైనా సరిచూసుకోవచ్చు. గ్రోవ్, ఈటీమనీ, పేటీఎం మనీ, జెరోదా కాయిన్ లేదా మరో యాప్ అయినా కానీయండి.. మీ పెట్టుబడులకు సంబంధించిన నిధులను అవి ఉంచుకోవు. ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఆ నిధి మొత్తాన్ని తిరిగి మీకు జమ చేయాల్సి ఉంటుంది. కనుక యాప్స్ నుంచి పెట్టుబడుల విషయమై మీరు ఆందోళన చెందక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ ప్లాన్లలో ఉన్న పెట్టుబడులను డైరెక్ట్ ప్లాన్లలోకి మార్చుకోవచ్చా? –కే ఘోష్ రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో వ్యయాలు తక్కువగా ఉంటాయి. సెబీ నిబంధనల ప్రకారం చూస్తే.. రెగ్యులర్ ప్లాన్లలో ఉండే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ను మినహాయించగా మిగిలిన మేర వ్యయాలు డైరెక్ట్ ప్లాన్లలో ఉంటాయి. నూతన పథకాల్లో రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో అంతరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫండ్స్ సంస్థలు డీలర్లకు ఎక్కువ కమీషన్ పంపిణీ చేయడం వల్లే ఇలా అధికంగా ఉండొచ్చు. డైరెక్ట్ ప్లాన్లలో ఉండే తక్కువ వ్యయాల ప్రయోజనం.. ఐదు, పదేళ్ల కాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. డైరెక్ట్ ప్లాన్లకు మారిపోవడం వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనం ఇది. కాకపోతే రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్లకు మారిపోయే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇలా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, తిరిగి ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. అదే పథకంలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాటిని కొత్త పెట్టుబడులుగానే పరిగణిస్తారు. కనుక అప్పటి వరకు వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈక్విటీ పథకాల విషయంలో 1–2 శాతం ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. కనుక డైరెక్ట్ ప్లాన్లకు మారిపోవాలనుకుంటే ఏడాది పూర్తికాని పెట్టుబడులను వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. వ్యాల్యూ ఫండ్, ఫోకస్డ్ ఫండ్ మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోని డిపాజిట్పై వడ్డీ ప్రతీ నెలా వస్తుందా లేక మూడే నెలలకు ఒక పర్యాయమా? – ఆశిష్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా డిపాజిట్పై వడ్డీని రోజువారీగా లెక్కిస్తారు. కానీ, ఆ వడ్డీని మూడు నెలలకు ఒకసారి జమ చేస్తుంటాయి బ్యాంకులు. ఇక మీరు అడిగిన మరో ప్రశ్నను చూస్తే.. ఫోకస్డ్ ఫండ్ అన్నది వైవిధ్యమైన ఈక్విటీ పథకం. పరిమితంగా ఎంపిక చేసుకున్న భిన్న రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ ఫండ్ పనితీరు వేరు. మార్కెట్ ర్యాలీలో పెద్దగా పాల్గొనని కంపెనీలు, అంతర్గత విలువతో పోలిస్తే తక్కువ ధరలకు లభించే కంపెనీల్లో వ్యాల్యూ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. - ధీరేంద్ర కుమార్, సీఈవో , వ్యాల్యూ రీసెర్చ్ చదవండి : ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
అప్పులపాలు కాకుండా కాపాడే మార్గం ఇది!
రమేశ్ ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నాడు. అప్పటిదాకా హాయిగా నడిచిపోతున్న బతుకు బండి.. కరోనాతో కుదేలు అయ్యింది. ఉద్యోగం పోయింది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పులవైపు అడుగులేశాడు. ఆశ్చర్యంగా రమేశ్ పరిస్థితే సురేష్కు ఎదురైనా.. అప్పులను ఆశ్రయించలేదు. మరో ఉద్యోగం దొరికేదాకా కుటుంబ అవసరాలను సజావుగా తీర్చుకుంటూ పోయాడు. అత్యవసర నిధి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే రమేశ్లా సురేష్ కష్టపడలేదు. అత్యవసర నిధి.. సింపుల్గా చెప్పాలంటే ఆకస్మిక నిధి. ఊహించని పరిస్థితులు, సంక్షోభాల ప్రభావం వచ్చేఆదాయంపై పడినప్పుడు ఉపయోగపడే సేవింగ్స్ అనుకోవచ్చు. వైద్య ఖర్చులు, తప్పనిసరి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవడం, యుద్ధాలు, కరోనా వైరస్ వంటి మహమ్మారులు, అంటువ్యాధులాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. అప్పులు చేయకుండా వ్యక్తుల్ని నిలువరించగలుగుతుంది. క్లిక్: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ అంటే.. ఎంత మొత్తం కావాలి? సాధారణంగా అత్యవసర పరిస్థితులు రోజులు, వారాలు, నెలలు కొనసాగొచ్చు. కాబట్టి ఆరు నుంచి ఏడాది ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్.. అందిరికీ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకనే ఉద్యోగంలో మొదలైనప్పటి నుంచే కొంత డబ్బును పక్కనపెట్టుకుంటూ వెళ్లాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు, భాద్యతలు పెరుగుతాయి. అలాంటప్పుడు దశల వారీగా ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి. రాబట్టుకోవచ్చు కూడా.. అవసరానికి అందుబాటులో డబ్బును ఇంట్లో ఉంచుకోవడం లేదంటే బ్యాంక్ అకౌంట్లో దాచుకోవడం చేస్తుంటారు. అలాగని దాచిన డబ్బు.. అలాగే మూలుగుతుంటే ఏం లాభం? అందుకే డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. ఇందుకోసం సేఫ్ సైడ్ అప్పులివ్వడం, పొదుపు ఖాతా లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంచొచ్చు. తద్వారా డబ్బు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా విత్డ్రా చేసుకునేందకు వీలుంటుంది. విత్డ్రా సమయంలో ఎటువంటి పెనాల్టీలు పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రాబడి తగ్గిపోతుంది. ఇక ఏటీఎంల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. డిజిటల్ పే తలనొప్పులు లేకుండా చూసుకోవాలంటే కొంత డబ్బును ఇంట్లోనే దాచుకోవడం ఉత్తమం. మ్యానేజ్ ముఖ్యం అత్యవసర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మతు ఖర్చులు వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఎందుకంటే హెల్త్, మోటారు వంటి వాటికి ఇన్సురెన్స్ (బీమా) ఉంటుంది. తిరిగి బీమా ద్వారా పొందే అవకాశం ఉన్నప్పుడు, అత్యవసర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఏముంది?. అందుకే అత్యవసర నిధిని ప్రాధాన్యం ఉన్న వాటికి, చాలా ప్లాన్డ్గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నాం.. ఖర్చు పెట్టేశాం అని కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించుకోవాలి. ఈ పునఃసమీక్ష ఏడాదిలో ఒకసారైనా ఉంటే మరీ మంచిది. అలాగే పిల్లలకు సేవింగ్స్ అలవాటు చేయడం ద్వారా.. భవిష్యత్లో ఎమర్జెన్సీ ఫండ్ ఆవశ్యకత తెలిసి వస్తుంది. -కేజీ, ఆర్థిక నిపుణుడు చదవండి: రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు
మోస్తరు రిస్క్ భరించే వారు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్పీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్క్యాప్లో స్థిరత్వం, మిడ్, స్మాల్క్యాప్లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్ పేరుతో కొనసాగడం గమనార్హం. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టుగానే లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్క్యాప్నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్ట్ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్ మార్కెట్లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్సైడ్ క్యాప్చర్ రేషియో 93గా, అప్సైడ్ క్యాప్చర్ రేషియో 103గా ఉన్నాయి. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్క్యాప్ స్టాక్స్లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్క్యాప్లో 27 శాతం, స్మాల్క్యాప్లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల కేటాయింపులు ఐసీఐసీఐ బ్యాంకు 8.26 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.02 ఇన్ఫోసిస్ 4.12 అల్ట్రాటెక్సిమెంట్ 3.79 బజాజ్ ఫైనాన్స్ 3.27 బజాజ్ ఫిన్సర్వ్ 3.16 అవెన్యూ సూపర్మార్ట్స్ 3.07 గుజరాత్ గ్యాస్ 2.93 యాక్సిస్ బ్యాంకు 2.78 మదర్సన్ సుమీ 2.34 చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
స్థిరాస్తి కొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపారాలు మొదలయ్యాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు కూడా క్రమంగా జుకుంటున్నాయనే చెప్పాలి. ఆదాయపు పన్నుకి సంబంధించి స్థిరాస్తుల క్రయవిక్రయ లావాదేవీల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ వారం కొనే వారికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. దానికన్నా ముందు రెండు పక్షాలూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. - అటు అమ్మేవారు, ఇటు కొనేవారు ప్రతిఫలం విషయంలో సరైన అవగాహనకి రావాలి. హెచ్చుతగ్గులు పనికి రావు. భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈ మేరకు ఒప్పందం .. అగ్రిమెంటు రాసుకోవాలి. - మొత్తం వ్యవహారం.. ప్రతిఫలం అంతా వైట్లోనే ఉండాలి. బ్లాక్ వ్యవహారం వద్దే వద్దు. మామూలు వస్తువులు, సేవల్లో నగదు లావాదేవీలు ఉండకూడదు. అలాగే, స్థిరాస్తి క్రయవిక్రయాలలో కూడా నిషేధం. - విక్రయించేటప్పుడు నగదు పుచ్చుకోకూడదు. ఇవ్వనూ కూడదు. - నగదు పుచ్చుకునే వ్యక్తికి, ఎంత మొత్తం నగదుగా పుచ్చుకుంటే అంత పెనాల్టీ ఉంటుంది. మిగతా అన్ని వ్యవహారాలనూ ఆరా తీస్తారు. అప్పుడు పాతవి, కొత్తవి బైటపడతాయి. కొండనాలుకకు మందు వేస్తే అసలు నాలుక బైటపడినట్లవుతుంది. కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - ఒప్పందంలో రాసుకున్న ప్రతిఫలాన్ని పూర్తిగా వైట్లోనే చెల్లించాలి. - చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా .. అంటే చెక్కు ద్వారా RTGS లేదా NEFT ద్వారా లేదా డీడీల ద్వారా చేయాలి. - నగదు ప్రశ్న తలెత్తకూడదు. - చెల్లించే ప్రతి రూపాయికి ‘సోర్స్‘ ఉండాలి. దీని గురించి మనం గత వారం తెలుసుకున్నాం. ‘సోర్స్‘ అంటే ఆదాయమే అయి ఉండాలనేమీ లేదు. ఆదాయమే అయితే లెక్కల్లో చూపించి, డిక్లేర్ చేయండి. - పన్నుకు గురికాని ఆదాయమే అయితే, సంబంధించిన కాగితాలు భద్రపర్చుకోండి. రిటర్నులలో డిక్లేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఒక ‘కాలం‘ ఉంటుంది. అందులో రాయండి. - గత సంవత్సరానికి సంబంధించి పన్నుకి గురి కాని వాటి వివరాలు ఉంచుకోండి. మినహాయింపు పొందిన ఆదాయాలు, పీఎఫ్ విత్డ్రాయల్స్, ఎన్ఎస్సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల మెచ్యూరిటీలు, జీవిత బీమా గడువు తీరాక వచ్చే చెల్లింపులు, గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటివెన్నో పన్ను భారం పడని వాటిల్లో ఉంటాయి. - మీ అబ్బాయి/అమ్మాయి విదేశాల నుంచి పంపే నిధులేమైనా ఉంటే వాటికి సంబంధించిన కాగితాలన్నీ భద్రపర్చండి. - బ్యాంకు అప్పులు,, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు, మిత్రులు ఇచ్చిన రుణాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఏదైనా సరే ప్రతీ దానికి ఒక కాగితం .. ఓ రాత.. ఓ కోత.. రుజువులు ఉండాలి. - ముందుగా ‘సోర్స్‘ మీ అకౌంటులో జమగా ఉండాలి. ఆ తర్వాతే ‘ఖర్చు‘ డెబిట్ జరగాలి. ఈ ‘సీక్వెన్స్‘లో రెండోది ముందు, మొదటిది తర్వాత జరగకూడదు. ‘షార్ట్ఫాల్‘ ఉండకూడదు. ఒకవేళ ‘షార్ట్ఫాల్‘ ఉంటే దాన్ని ఆదాయంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్త. చెల్లించే ప్రతిఫలం రూ. 50,00,000 దాటితే టీడీఎస్కి సంబంధించిన నియమాలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. - కేసీహెచ్ ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు చదవండి : రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
రుణ అర్హత పెంచుకోవడానికి మార్గలివే
దేశంలో సగం మంది స్వయం ఉపాధిలో ఉన్న వారే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడ్డవారే ఉంటారు. వీరు రెండు విభాగాలుగా ఉంటారు. ‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్’ అంటే ఏదో విభాగంలో నైపుణ్యం ఉన్న వారు. వీరికి ఏదో ఒక విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్స్, డెంటిస్ట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు ఇలాంటి వారిని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్గా పేర్కొంటారు. ప్రత్యేక నైపుణ్యాల్లేకుండా ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు నాన్ ప్రొఫెషనల్స్ విభాగంలోకి వస్తారు. ప్రధానంగా వీరు హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ట్రేడింగ్ తదితర పనుల్లో ఉంటుంటారు. రెండో విభాగం ఎక్కువగా అసంఘటిత రంగం కిందకే వస్తుంది. చిన్న పట్టణాల్లో వీరి ప్రాతినిధ్యం బలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్థుల వృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాయి. అయినప్పటికీ సొంత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు రుణం పొందాలంటే నిపుణులు కాని స్వయం ఉపాధిలోని వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి వారు రుణ అర్హతలను పెంచుకునే మార్గాలు చూద్దాం.. రుణానికి అడ్డంకులు.. - నెలవారీ అస్థిర ఆదాయం ఉండడం - క్యాష్ రూపంలో ఆదాయం చూపించే రుజువులు లేకపోవడం - వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లేకపోవడం. ఉదాహరణకు ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, వ్యాట్ రిజిస్ట్రేషన్, ఇతర లైసెన్స్లు - రుణ చరిత్ర లేకపోవడం లేదా పరిమితంగా ఉండడం. లేదంటే ప్రతికూల చరిత్ర ఉండడం. - పన్ను రిటర్నుల చరిత్ర లేకపోవడం - కేవైసీకి సంబంధించి అసంపూర్ణ డాక్యుమెంట్లు - ఖాతాల నిర్వహణ సజావుగా లేకపోవడం ఇటువంటివి రుణ అర్హతలకు ప్రతికూలతలుగా భావించాలి. దీంతో రుణాలిచ్చే సంస్థలకు.. రుణ గ్రహీత చరిత్రను సమగ్రంగా తెలుసుకుని, రుణ అర్హతను అంచనా వేయడం కష్టమవుతుంది. రుణాలిచ్చే సంస్థలకు ఈ విభాగం పెద్ద సవాళ్లతో కూడుకున్నదే. దీంతో రుణ పరపతి తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దరఖా స్తు ప్రాసెసింగ్ కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు దరఖాస్తు తిరస్కరణకు కూడా గురికావచ్చు. అందుకనే స్వయం ఉపాధిలోని వారు వ్యాపారం, ఆదాయానికి సంబంధించి వీలైనన్ని డాక్యుమెంట్లను సమర్పించడం మంచిది. తద్వారా వేగంగా రుణాలను పొందేందుకు మార్గం సులువవుతుంది. ఇందుకోసం చేయాల్సినవి ఏవిటంటే..? రుణ అర్హతలను పెంచేవి.. - వ్యాపార ఖాతాలను ఎటువంటి తప్పుల్లేకుండా, కచ్చితంగా నిర్వహించాలి. అంతేకాదు ఆయా అకౌంట్లను చార్టర్డ్ అకౌంటెంట్లతో ఆడిట్ కూడా చేయించుకోవాలి. - ఆదాయపన్ను రిటర్నులను సమయానికి కచ్చితంగా దాఖలు చేయాలి. - వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. - వ్యాపారంలో భాగంగా వచ్చే ఇతర ఆదాయానికి రుజువులను కూడా దగ్గర ఉంచుకోవాలి. రుణ దరఖాస్తు అధికారి కోరిన ప్రతీ సమాచారంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలి. దీనివల్ల మీ గురించి, మీ వ్యాపారం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు పడుతుంది. - మీకు సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి తీసుకునే ఏ రుణంలో అయినా చెల్లింపుల్లో వైలఫ్యం, జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల క్రెడిట్హిస్టరీపై ప్రభావం పడకుండా ఉంటుంది. చదవండి : బంగారం రుణాల్లోకి షావోమీ ! -
రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి
పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నాను. పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్, కార్పొరేట్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలకు అదనంగా.. నెలవారీగా స్థిరమైన ఆదా యం కోసం న్యూజీవన్ శాంతి మాదిరి యాన్యుటీ ప్లాన్లో రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేయనా? – నితిన్ ఇది మంచి ఆలోచన కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాన్యుటీ ప్లాన్లు సరైన నాణ్యత కలిగినవి కావు. యాన్యుటీల్లోనూ వివిధ రకాలున్నాయి. జీవించి ఉన్నంత కాలం హామీ మేరకు స్థిరమైన ఆదాయన్నిచ్చేవి ఒక రకం. మరొక రకంలో ముందుగా నిర్ణయించిన మేర క్రమం తప్పకుండా పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు కొనసాగుతాయి. పాలసీదారు మరణానంతరం అసలు పెట్టుబడి నామినీకి అందజేస్తారు. నిర్ణీత కాలానికోసారి చెల్లింపులు పెరిగే యాన్యుటీ పథకాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల యాన్యుటీల్లోనూ రాబడులు చాలా తక్కువగానే ఉన్నాయి. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు చేయాల్సిన రిస్క్ను బీమా కంపెనీలు తీసుకోవడమే రాబడులు తక్కువగా ఉండడానికి కారణం. ఎందుకంటే ఎవరు ఎంత కాలం పాటు జీవించి ఉంటారన్నది తెలియదు కనుక. కొందరు సుదీర్ఘకాలం పాటు జీవించి ఉండొచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐపీ), సీనియస్ సిటిజన్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అదనంగా మార్కెట్ ఆధారిత పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నది నా సూచన. కొంత భాగం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందుకోవచ్చు. స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసేట్టే అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్ తగ్గిపోతుంది. అయినా రక్షణాత్మకంగానే వ్యవహరించాలి. పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో పెట్టేయకూడదు. పెట్టుబడులన్నీ ఒకేసారి కాకుండా ఏడాది నుంచి 18 నెలల కాలంలో పెట్టే విధంగా చూసుకోండి. మూడేళ్ల క్రితం సిప్ మార్గంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. మార్కెట్ పడిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో పెట్టుబడులను డెట్ పథకాల్లోకి మళ్లించుకోవాలా? లేదంటే మార్కెట్ పతనాన్ని అవకాశంగా భావించి మరింత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలా? – సీహెచ్. సాగర్ మొదట ఆందోళన అన్నది అనవసరం. ఒకవేళ ఏడాది క్రితమే మీరు ఈ విషయమై ఆందోళన చెంది ఉంటే.. ఈక్విటీల నుంచి స్థిరాదాయ పథకాలకు (డెట్సాధనాలు) మళ్లిపోయి ఉండేవారు. గత 18 నెలల్లో చాలా మంది ఇలా ఆందోళన చెందినవారే. కానీ, మార్కెట్ ర్యాలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్కెట్ క్రమంగా పెరుగుతూనే వెళ్లింది. ఎవరైతే ఆందోళన చెంది ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారో.. దీర్ఘకాలంలో వచ్చే అరుదైన అవకాశాన్ని వారు కోల్పోయారు. అందుకే ఆందోళన అన్నది పనికిరాదు. రెండు అంశాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే 10–15 ఏళ్ల వరకు డబ్బులతో అవసరం లేదనుకుంటే ఈక్విటీల్లోనే పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. మీరు గడిచిన మూడేళ్ల నుంచే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ పెట్టుబడులు ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. మీ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలి తప్పిదే ఆందోళన వద్దు. మార్కెట్లో దిద్దుబాటు వచ్చినా.. అది ఎప్పుడన్నది ఎవరూ అంనా వేయలేరు? ప్రస్తుత పరిస్థితులే వచ్చే ఆరు నెలల పాటు కొనసాగొచ్చు. లేదంటే రెండేళ్లపాటు ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్లు పడితే ఎప్పుడు తిరిగి కోలుకుంటాయన్నది తెలియదు. ఒక నెల పాటు కొనసాగొచ్చు. లేదంటే 2020 మార్చిలో మాదిరిగా ఉండొచ్చు. ఆందోళన అన్నది తప్పుడు నిర్ణయానికి దారితీయవచ్చు. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలరు, ఎంతకాలం పెట్టుబడులను కొనసాగించగలరన్న అంశాల ఆధారంగా ప్రణాళిక ఉండాలి. ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి మూడేళ్లే అయింది కనుక పెద్ద మొత్తంలో ఇంకా సమకూరి ఉండకపోవచ్చు. అందుకే కనీసం పదేళ్లపాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. అది కూడా వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల సమతూకాన్ని (అస్సెట్ అలోకేషన్) నిర్ణయించుకుని అడుగులు వేయాలి. నిర్ణీత కాలానికోసారి ఈ పెట్టుబడులను మీ ప్రణాళికకు తగినట్టు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వాల్యూ రీసెర్చ్ చదవండి: జుపీ నిధుల సమీకరణ -
ఫ్లెక్సీ, హైబ్రిడ్ ఫండ్స్లో ఏది మెరుగు?
ఐదేళ్ల నా కుమారుని భవిష్యత్తు అవసరాల కోసం రూ.లక్షను ఇన్వెస్ట్ చేద్దామన్నది నా ఆలోచన. ఇందుకోసం ఫ్లెక్సీక్యాప్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఏ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి? ఒక్కటే పథకాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఎక్కువ పథకాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – సునీల్, వైజాగ్ రెండు రకాల విభాగాలూ మీ లక్ష్యానికి అనుకూలంగానే ఉంటాయి. గడిచిన మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. మార్కెట్లలో ఉద్దాన, పతనాలను చూసే ఉంటారు. ముఖ్యంగా గతేడాది మార్చిలో మార్కెట్లు సగానికి కుప్పకూలినప్పుడు ఆందోళన చెంది ఉండకపోవచ్చు. ఇదే నిజమైతే అగ్రెస్సివ్ ఫండ్ విభాగంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐదేళ్ల కుమారుని ఉన్నత విద్యావసరాలకు ఇన్వెస్ట్ చేయాలన్నది మీ లక్ష్యం. కనుక కనీసం 10–15 ఏళ్ల పాటు మీ పెట్టుబడులను కొనసాగించగలరు. మార్కెట్ల అస్థిరతలను జీర్ణం చేసుకోగల శక్తి ఉంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి అధిక రాబడులను అందుకోవచ్చు. అయితే, చాలా మంది ఇన్వెస్టర్లకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కొత్తగా వచ్చే చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వేగంగా తగ్గిపోతుంటే ఆందోళనకు గురికావడం సహజం. అటువంటి ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ను కూడా పరిగణనలోకి తీసుకోరాదు. అటువంటి వారు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్కే పరిమితం కావడం మంచిది. మీ ప్రశ్నను పరిశీలిస్తుంటే అనుభవం కలిగిన ఇన్వెస్టర్ మాదిరే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఫ్లెక్సీ క్యాప్ లేదా అగ్రెస్సివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలరు. అగ్రెస్సివ్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే కనీసం రెండు భిన్నమైన పథకాలను ఎంపిక చేసుకోండి. ఫ్లెక్సీక్యాప్ పథకం ఎంపిక చేసుకుంటే కనుక ఒక్క పథకం సరిపోతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ వైవిధ్యంతో ఉంటాయి కనుక మీ అవసరాలకు ఒక్కటి సరిపోతుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో యాక్సిస్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ పథకాల్లో డీఎస్పీ మిడ్క్యాప్ ఫండ్లేదా ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ లేదా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించొచ్చు. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో 45–60 ఏళ్లలోని వారు తమ పెట్టుబడుల కేటాయింపులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా? క్రమం తప్పకుండా ఆదాయం కోసం (రెగ్యులర్) నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను పరిశీలించొచ్చా? – పాయల్, కడప రిటైర్మెంట్ (ఉద్యోగ, వృత్తి జీవితానికి విరామం పలకడం)కు మీరు ఎంత సమీపంలో ఉన్నారనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అవుతుంది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటే పెట్టుబడులను స్థిరాదాయ పథకాలవైపు ఎక్కువగా మళ్లించాలి. అయితే ఇతర అంశాలు కూడా ఇక్కడ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడినట్టయితే భిన్నంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్థిరాదాయ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోతే అప్పుడు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఆదా యం కోసం పెట్టుబడులపై ఆధారపడరు కనుక ఈక్విటీల్లో పెట్టుబడుల గురించి ఆందోళన చెందా ల్సిన పరిస్థితి ఎదురుకాదు. అందుకే మీరు ఏ వయసులో ఉన్నారు, మీ అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థ లు విక్రయించే నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను మీరు పరిశీలిస్తున్నట్టయితే వద్దన్నదే నా సూచన. ఈ ప్లాన్లు బీమా, పెట్టుబడులతో కలసి ఉంటా యి. కనుక గొప్ప సాధనం కాదు. తక్కువ వ్యయాలతో కూడిన డెట్ ఫండ్ లేదా తక్కువ వ్యయాలతో కూడిన ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులను పెట్టుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులు అందుకోగలరు. బీమా, పెట్టుబడులతో కూడిన సాధనానికి దూరంగా ఉండి.. మీ పరిస్థితులకు అనుగుణంగా అనువైన సాధనాన్ని ఎంపిక చేసుకోండి. ::ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బంగారం ఫండ్లో సిప్ చేయొచ్చా?
స్టాక్మార్కెట్ పతనాల్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? – అమిత్ ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ ఫండ్స్పై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే స్థిరాదాయ పథకాల మార్కెట్ తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, ద్రవ్యోల్బణ రేట్లు డెట్ ఫండ్స్పై ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల బాండ్ల రేట్లపై ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న సందర్భాల్లో బాండ్లపై రాబడులు పెరుగుతాయి. క్రెడిట్ నాణ్యత లేదా ఆయా బాండ్ల క్రెడిట్ రేటింగ్లు కూడా ప్రభావం చూపిస్తాయి. బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కంపెనీలు సమస్యలను చూస్తున్నట్టయితే.. ఆయా కంపెనీలు బాండ్లపై వడ్డీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు నెలకొంటే క్రెడిట్ రేటింగ్ క్షీణించడానికి దారితీస్తుంది. అది డెట్ ఫండ్స్పై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత లిక్విడిటీ కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వ్యవస్థలో నగదు లభ్యత తగ్గినప్పుడు బాండ్లపై ప్రభావం ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్పై ఈ అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయిని తెలుసుకోవాలి. బాండ్లలో రాబడులు తక్కువగా ఉన్న సమయంలో.. రిస్క్ తీసుకోవడం వల్ల అధిక రాబడులకు ఈక్విటీల్లో అవకాశం ఉంటుంది. కనుక వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఐదేళ్ల కాలానికి బంగారం ఫండ్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – కౌశిక్ సాధారణంగా చెప్పుకోవాలంటే బంగారం ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలానికి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే నిల్వ ఉండే విలువే కానీ.. పెట్టుబడిని వృద్ధి చేసేది కాదు. బాండ్స్ లేదా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకరికి మీరు రుణం ఇచ్చినట్టు అవుతుంది. దానిపై మీకు ఊహించతగిన రాబడులు వస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీలో ఆ మేరకు వాటాలు పొందినట్టు అవుతుంది. కంపెనీ లాభాలు, డివిడెండ్లలో ఆ మేరకు వాటా లభిస్తుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. ఇది ఉత్పాదకత సాధనం కాదు. అందుకనే దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో బంగారానికి దూరంగా ఉండాలి. బంగారాన్ని ఈటీఎఫ్ల రూపంలో కలిగి ఉండడం మరో మార్గం. కానీ, దీనిపై ఎక్స్పెన్స్ రేషియో రూపంలో వ్యయాలను భరించాల్సి ఉంటుంది. పైగా డీమ్యాట్ ఖాతా లేకుంటే వీటిని కొనుగోలు చేసుకోవడం కుదరదు. సులభంగా కొనుగోలు చేసుకోవడానికి ఇదొక అడ్డంకి. గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసే బంగారం ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ, వీటిల్లో ఈటీఎఫ్ల కంటే ఎక్కువ చార్జీలుంటాయి. సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్జీబీలు) రూపంలో బంగారాన్ని కలిగి ఉండడం చక్కని మార్గం అవుతుంది. దేశీయ ఇన్వెస్టర్లకు ఇదొక ఆకర్షణీయమైన సాధనం. కొనుగోలు చేసుకోవడం సులభంగా ఉంటుంది. బ్యాంకు ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఎస్జీబీలపై.. వార్షికంగా 2.5 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. బంగారం ధరల వృద్ధి, క్షీణతతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బంగారం ధరల్లో మార్పునకు ఈ వడ్డీ రాబడి అదనం. కనుక దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అందుకు ఎస్జీబీ ఒక్కటే మెరుగైన సాధనం అవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వాల్యూ రీసెర్చ్ -
నిఫ్టీ పదహారువేల మార్క్ దాటేనా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు. పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. అందరి చూపు ఆర్బీఐ వైపు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్ ఆరున ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్బీఐ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వోడాఫోన్ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్బీ, ఎస్బీఐ, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నాలుగు ఐపీఓలు... ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. ఆగస్ట్ 6న గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ లిస్టింగ్... హెల్త్కేర్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ షేర్లు శుక్రవారం(ఆగస్ట్ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. నాలుగో నెలలో అమ్మకాలే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు -
స్టాక్స్లో సిప్ చేయడం మంచిదేనా?
ప్రతీ రంగంలోనూ 5–10 శాతం పెట్టుబడులు చొప్పున పూర్తి వైవిధ్యంతో కూడిన పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చా? లేదంటే కొన్ని రంగాల్లోకి కొన్ని స్టాక్స్కే పరిమితం కావాలా? ఇందులో మంచి విధానం ఏది? – విజయ్ జాదవ్ వైవిధ్యం పేరుతో అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం అన్నది అంత మంచి విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలను పరిశీలించినట్టయితే.. వందల నుంచి వేల కోట్ల రూపాయిలను నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ వారు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయరు. స్పష్టత, ఎంపికలన్నవి కీలకం అవుతాయి. ముందుగా పెట్టుబడులకు విలువైన స్టాక్స్ను గుర్తించడం సరైన విధానం అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్కు 10–15 స్టాక్స్తో కూడిన పోర్ట్ఫోలియో సరిపోతుంది. బలమైన ఆర్థిక మూలాలతో, చక్కగా వృద్ధి చెందుతున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలానికి ఆయా కంపెనీలు సరైన ఎంపిక అవ్వాలంటే.. ఆయా కంపెనీలు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటున్నాయి తదితర అంశాలు కూడా తెలిసి ఉండాలి. ఇలా ముందు కంపెనీలను ఎంపిక చేసుకున్న తర్వాత రంగాల వారీ కేటాయింపులు చేసుకోవాలి. ఒకే రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం అవుతాయి. స్టాక్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/నిర్ణీత కాలానికోసారి కొంత చొప్పున) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానమేనా? మ్యూచువల్ ఫండ్స్లో సిప్తో పోలిస్తే ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటి? – దుర్గేష్ చూడ్డానికి ఈ రెండూ ఒక్కటే. ఈక్విటీ ఫండ్లో సిప్ మాదిరే షేర్లలో నేరుగా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇందుకు మంచి కంపెనీని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కొంత కాల వ్యవధి వరకు విస్తరించడం వల్ల రిస్క్, ఆందోళన తగ్గుతుంది. అయితే, స్టాక్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ పెట్టుబడులపై ఎప్పుడూ దృష్టి సారించి ఉండాలి. క్రమానుగతంగా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ కొంత వరకు చురుకైన నిర్వహణ విధానం అవసరమవుతుంది. సరైన సమయం, ఉత్సాహం ఉండి, వీటిన్నింటిని ఆస్వాదించేట్టు అయితే స్టాక్స్లో పెట్టుబడులకు మొగ్గు చూపొచ్చు. లేదంటే మంచి మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. పైగా ప్రతి నెలా మీ పెట్టుబడులు రూ.5,000–10,000 మధ్యే ఉంటే యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండడం వల్ల పెద్దగా వచ్చే లాభం ఉండదు. ఇటువంటి వారు మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేవారు బ్యాలెన్స్డ్ ఫండ్ లేదా పన్ను ఆదా ఫండ్ (ఈఎల్ఎస్ఎస్)తో ప్రయాణాన్ని ప్రారంభించాలి. కనీసం రెండు, మూడేళ్ల పాటైనా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించాలి. దాంతో అస్థిరతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు వైవిధ్యంతో కూడిన ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులను ప్రారంభించొచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్లోని పెట్టుబడులను వీటిల్లోకి మళ్లించాలి. ఆ తర్వాత మరో రెండు, మూడేళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇలా ఐదేళ్ల తర్వాత మార్కెట్లలో ఉద్దాన, పతనాలను అర్థం చేసుకుని, సర్దుబాటు చేసుకోవడం తెలిస్తే.. అప్పుడు కంపెనీ వార్షిక నివేదికలను అధ్యయనం చేయడం, మంచి స్టాక్ను ఎంపిక చేసుకోవడం ఎలా అన్నది తెలుస్తుంది. స్టాక్ పడిపోయినా కానీ, మీకున్న కచ్చితమైన అవగాహన, విశ్వాసంతో పెట్టుబడులను కొనసాగించగలరు. అప్పుడే నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ మాత్రం నైపుణ్యాలు, అవగాహన అవసరం. పైగా ఇదంతా ఒకే విడత చేయకూడదు. నేరుగా స్టాక్స్లో పెట్టుబడులను 20–25 శాతంతో మొదలుపెట్టాలి. అలా ఏడాది పాటు చూడాలి. అంతా సక్రమంగానే ఉంటే అప్పుడు పెట్టుబడులను 50 శాతానికి పెంచుకోవాలి. అలా మరో ఏడాది పాటు కొనసాగించాలి. ఆ తర్వాత పెట్టుబడులను 75 శాతానికి పెంచుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులను అర్థం చేసుకునేందుకు ఇదొక క్రమానుగత విధానం అవుతుంది. దీనివల్ల పెట్టుబడుల నిర్వహణ ఫీజులను (మ్యూచువల్ ఫండ్స్లో వసూలు చేసేవి) ఆదా చేసుకోవచ్చు. ఇలా ఐదేళ్ల ప్రణాళికకు బదులు వేగంగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తే.. అంతే వేగంగా నష్టాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగం కూడా ఆకర్షించొచ్చు. కానీ, అందులోకి ప్రవేశించొద్దు. చాలా రిస్క్ ఎక్కువ. ఒకవేళ అంతగా ఆకర్షిస్తే చాలా స్వల్పమొత్తానికే పరిమితం అవ్వాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో , వాల్యూ రీసెర్చ్ -
రిటైరైన వారు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించొచ్చా?
నా వయసు 53 సంవత్సరాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సలహా సంస్థ సూచనల ఆదారంగా రూ.15 లక్షలను నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను. మరో రూ.15 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. పీపీఎఫ్, ఈపీఎఫ్ల్లోనూ రూ.50లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 2026లో నేను పదవీ విరమణ తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించొచ్చా? -ఆర్కే గుప్తా, హైదరాబాద్ ఒక పెట్టుబడి సాధనంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు. మీరు ఈక్విటీల్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ మొత్తం నిధి రూ.80 లక్షల్లో ఈక్విటీ పెట్టుబడులు 35–37 శాతంగా ఉన్నాయి. రిటైర్ అయిన వారు స్థిరమైన ఆదాయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి దీర్ఘకాలిక రాబడుల కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు చేసుకోవాలని మేము సాధారణంగా భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈక్విటీలకు మీరు చేసిన కేటాయింపులు చక్కగానే ఉన్నాయి. వాటిని కొనసాగించొచ్చు. కాకపోతే ఈక్విటీ కేటాయింపులు ఏ విధంగా చేశారన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఒకవేళ మీ ఈక్విటీ కేటాయింపులు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్క్యాప్లో ఉంటే వెంటనే తగ్గించేసుకుని.. అధిక నాణ్యతతో కూడిన లార్జ్క్యాప్ కంపెనీలకే పరిమితం కావాలని నా సూచన. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విధంగా చేసి ఉంటే సరైన నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (ఎల్టీసీజీ) లెక్కించే సమయంలో ఇండెక్సేషన్ ప్రయో జనం అన్నది కేవలం డెట్ ఫండ్స్కే వర్తిస్తుందా..? ఈక్విటీలకు ఉండదా? -శివనందన, బెంగళూరు మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం ఇండెక్సేషన్ ప్రయోజనం అన్నది డెట్ ఫండ్స్పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలోనే అందుబాటులో ఉంది. ఈక్విటీలకు లేదు. ఈక్విటీ పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్పై ఎల్టీసీజీ అంటే కనీసం మూడేళ్లు, అంతకుమించి పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో డెట్ ఫండ్స్పై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) మినహాయించిన తర్వాత మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ అన్నది మీ కొనుగోలు వ్యయాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరొక సెక్యూరిటీని రూ.100కు కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు కొనసాగించారనుకుంటే.. ఆ పెట్టుబడి కొనసాగించిన అన్నేళ్లలో రూ.100 విలువ కాస్తా ద్రవ్యోల్బణ ప్రభావం కలసి రూ.125కు చేరిందనుకుంటే.. అప్పుడు ఇండెక్సేషన్ వల్ల మీ కొనుగోలు వ్యయం రూ.100 కాకుండా రూ.125 అవుతుంది. కనుక ఇది మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈక్విటీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకపోయినప్పటికీ.. డెట్ ఫండ్స్తో పోలిస్తే పన్ను రేటు తక్కువ. ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు అనుకూలిస్తుందా లేదా అన్నది ఎంత మేర మూలధన లాభాలు వచ్చాయి, ద్రవ్యోల్బణం రేటు, కొనసాగించిన కాలం వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్)లో సిప్ ప్రారంభించాను. మూడేళ్ల కాలం అన్నది 2021 మార్చితో ముగిసింది. ఇప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చా? అలాగే, నా వద్ద రూ.1.5లక్షలు ఉన్నాయి. వీటిని ఈఎల్ఎస్ఎస్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక ఏక మొత్తంలో చేసుకోవాలా? -రత్నాకర్, మెదక్ సిప్ రూపంలో ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. అప్పుడు ప్రతీ సిప్కు 36 నెలల కాలం (సిప్ పెట్టిన తేదీ నుంచి) లాకిన్ అమలవుతుంది. కనుక మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోదలిస్తే అది మొదటి సిప్ వరకే అలా చేసుకోగలరు. ఆ తర్వాతి సిప్లకు 36 నెలల కాలం ఇంకా ముగిసిపోలేదు కనుక వాటిని ఉపసంహరించుకోలేరు. మీ వద్ద ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోతగిన మొ త్తం ఉన్నప్పటికీ.. సిప్ వల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. దీంతో మార్కె ట్లు ప్రతికూలంగా మారినా ఆందోళన ఉండదు. సిప్ ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. -
కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు
సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. అపోహ: విటమిన్ ‘సి’లేదా జింక్ కరోనా నుంచి రక్షిస్తుంది.. వాస్తవం: సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటిని ఏ రూపంలో తీసుకున్నా వాటిలోని విటమిన్ ‘సి’ ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే జింక్ను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అపోహ: శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చు. వాస్తవం: వేడి నీటిని తాగడం, పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినడంద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుకొని తద్వారా కరోనాను ఎదుర్కోవచ్చనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కరోనా వ్యాధి రాకుండా శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అయితే ఈ అపోహపై కాస్త హాస్యాస్పదంగా స్పందించింది. ఇలా వేడినీటిని అధికంగా తాగడం వలన తమను తాము కాల్చుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అపోహ: వెల్లుల్లిని తరచూ తింటే కరోనా వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. వాస్తవం: వెల్లుల్లిలో శరీరానికి ఉష్ణాన్నిచ్చే కారకాలు ఉంటాయి. అలాగే కొన్ని యాంటిమైక్రోబియల్ గుణాలున్న కారకాలూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది. లవంగంలోనూ ఇలాంటి యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలుంటాయి. కానీ ఇవి కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొంటాయని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ డేటా లేదు. అపోహ: సెలైన్తో ముక్కును కడిగితే కరోనా వైరస్ను బయటకు తీయొచ్చు. వాస్తవం: మన నాసికా రంధ్రాలను సెలైన్తో కడగడం వల్ల కరోనా వైరస్ను బయకు పారదోలవచ్చనేది మరికొంత మంది నమ్మే అపోహ. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి సెలైన్ను అధికంగా ఉపయోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: శరీరంపై మందుల పిచికారీతో కరోనా దరిచేరదు! వాస్తవం: చేతులను తరచూ శానిటైజ్ చేసుకుంటే చాలు కరోనా దరి చేరదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, కేవలం చేతులనే కాదు.. శరీరం మొత్తం క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసుకున్నా కరోనా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అంతేకాదు, ఈ క్రిమిసంహారక స్ప్రే, శానిటైజర్లను అతిగా వాడితే కరోనా కంటే ముందు వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే, ఇలాంటి క్రిమిసంహారక మందులను అధికంగా వాడే బదులుæ శుభ్రత, సామాజిక దూరంలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అపోహ: మినరల్స్ ప్రయోగాలతో కరోనా మాయం! వాస్తవం: యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆహార నిపుణులుగా మారిపోతున్నారు. ‘ఫలానా వాటిలో ఫలానా.. వాటిని కలిపి తింటే మీ దగ్గరకు కరోనా దరిచేరదని’ కొంతమంది కల్లబొల్లి కబుర్లు చెబుతుంటారు. ఆహార పదార్థాలన్నింటిలోనూ విటమిన్స్, మినరల్స్ ఉండటం నిజమే. అయితే కొన్ని కొన్ని ఆహారపదార్థాల కలయిక ఔషధం కంటే విషాన్ని తయారు చేయగలదు. ఉదాహరణకు ఆపిల్ గింజల పొడి విషఫూరితమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. వివిధ మసాలా దినుసుల వాసన కూడా శ్యాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. తెలిసీ తెలియక చేసే ఇలాంటి మినరల్స్ ప్రయోగాలు ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి, యాట్యూబ్ చానల్స్ చెప్పే అన్నింటినీ నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపోహ: వేడి వాతావరణం వైరస్ను చంపేస్తుంది! వాస్తవం: మనిషి శరీరం నీరు, నిప్పులకు స్పందించినట్లే ఈ కరోనా వైరస్ కూడా స్పందించగలదని చాలా మంది భావన. దీంతో, చాలా మంది ‘ఈ వేసవిలో మనుషులే ఎండదెబ్బ తగిలి చనిపోతుంటే.. వైరస్ ఎంత?’ అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి వేడి, తేమతో సహా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రదేశాల్లోనూ కరోనా కేసులను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించింది. అంతేకాదు, ఈ స్థితిగతులకు కరోనా ఏ విధంగానూ స్పందించలేదని కూడా ప్రకటించింది. కాబట్టి, ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అపోహ: యాంటీ బయోటిక్స్తో కరోనా దూరం! వాస్తవం: సహజంగానే ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగానే జలుబు వంటి కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఎలాంటి మందులూ వాడకుండానే నయమవుతుంటాయి. ఇలాగే కొన్ని వ్యాధులను ఎదుర్కొనేందుకు మనలోని శక్తిని పెంపొందించేలా మార్కెట్లో వివిధ రకాల యాంటీబయోటిక్స్ లభ్యమవుతున్నాయి. అలాగని, ప్రతి వ్యాధికీ ఇవి పనిచేయవు. ఈ విషయం తెలియక చాలామంది కరోనాను ఎదురించేందుకు, వారిలోని శక్తిని కృత్తిమంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా యాంటీబయోటిక్స్ మందులను వాడటం ద్వారా కరోనాను అరికట్టలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేయాల్సిందేంటంటే.. కరోనా వైరస్ మహమ్మారి కథ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడం కంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి. శక్తి : సహజంగా రోగనిరోధక వ్యవస్థను బాగా పనిచేసేలా చూసుకోవడం. దీనికోసం చక్కని ఆహార, జీవన అలవాట్లను పాటించడం అవసరం. ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. అలాగే తగినంత నిద్ర పోవాలి, కాబట్టి ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా చూసుకోవాలి. శుభ్రత : రోజూ స్నానం చేయడం, తినే ముందు, తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు ఇతర వ్యక్తులను, వస్తువులను తాకినపుడు లేదా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులను, కాళ్లను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కేవలం మిమ్మల్నే కాదు, చుట్టూ ఉండే పరిసరాలను, వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. సామాజిక దూరం : కరోనా ఒక అంటువ్యాధి. అందుకే, వ్యక్తులతో తగినంత దూరం పాటించడం ముఖ్యం. అంతేకాదు, తినేటపుడు, తాగేటపుడు, మినహా అన్నివేళలా మాస్క్ ధరించాలి. అలాగే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఈ మూడు దశలను చక్కగా పాటిస్తూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బట్టలు, బూట్లు వైరస్ను తెస్తే.. ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా
కరోనా సెకండ్వేవ్ ఆరంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క టీకా కార్యక్రమం కొనసాగుతున్నా సమాజంలో కేసులు పెరగడంపై ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యేందుకు సమయం పడుతుంది, ఈలోపు వారు భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ఛాన్సులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక నష్టానికి భయపడి ప్రభుత్వాలు లాక్డౌన్ ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన. కరోనా రూపుమార్చుకొని కొత్త స్ట్రెయిన్ల రూపంలో పంజా విసురుతుంది కాబట్టి తొలిదశ కన్నా మరింతగా అప్రమత్తత అవసరమంటున్నారు. కొత్త స్ట్రెయిన్లు, సెకండ్వేవ్ ఆరంభం సందర్భంగా కరోనా, దానిపై వినిపించే రూమర్లు, నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.. తదితర అంశాలపై పునరావలోకనం ఈవారం ప్రత్యేకం.... సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్వేవ్ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. కరోనా విపత్కర కాలంలో ‘ఇందుగలదందు లేదని’ అన్నట్లు ఈ వైరస్ ఏ వస్తువుపై ఉందో... వాటి ద్వారా ఎప్పుడు? ఎలా? ఒంట్లోకి, ఇంట్లోకి చొరబడుతుందోనని జనంలో భయం... ఏదో ఒక పని మీద బయటకెళ్లి తిరిగి వచ్చినప్పుడు తమతోపాటే వైరస్ను మోసుకొచ్చామేమో అనే కలవరపాటు.. మాస్క్ వేసుకొని ఉన్నా, భౌతిక దూరం పాటించినా, చేతులను శానిటైజ్చేసినా, ఇంటికి రాగానే ముట్టుకున్న డోర్, తాళం వంటి వాటిని, మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులను రసాయనాలతో క్రిమిరహితం చేసినా ఇంకా ఎక్కడో ఏదో అనుమానం.. ఇందులో ఒక కారణం దుస్తులు, బూట్లు. వీటి ద్వారా వైరస్ ఇంట్లోకి వచ్చిందేమో అనే సందేహం. ఈ ఆందోళనలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. వాహకాలే.. కానీ.. ప్లాస్టిక్, ఇనుము, రాగి వస్తువులు కొవిడ్ వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. అలాగే దుస్తులు, బూట్లు సైతం ఈ వైరస్కు ఆశ్రయమిస్తాయి. కానీ వీటి ద్వారా వైరస్ వ్యాపించిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నారు వైద్య నిపుణులు. ‘ఈ వైరస్ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుస్తులు, బూట్ల ద్వారా ఇతరులకు వ్యాపించినట్లు ఆధారాలు లేవు’ అని అమెరికాలోని ఓర్లాండోలో ఉన్న అడ్వాంట్హెల్త్ కేంద్రం నిపుణులు చెప్పారు. వాస్తవానికి వస్తువు ఉపరితలాన్ని బట్టి వైరస్ కొన్ని గంటల నుంచి రోజుల వరకు వాటిపై మనగలుగుతుంది. ఇందులో ఇనుము, ప్లాస్టిక్పై అత్యధికంగా 2 నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అలాగే దుస్తులు, బూట్లపైనా కొన్ని గంటల పాటు జీవిస్తుంది. అంటే కఠిన ఉపరితలం ఉండే వస్తువులతో పోలిస్తే దుస్తులపై వైరస్ ఎక్కువ సేపు మనలేదు. కారణం.. వైరస్ ఎక్కువ రోజులు ఉండడంలో వాతావరణం, తేమ, ఆర్ధ్రతది కీలకపాత్ర. దుస్తుల స్వభావం దీనికి విరుద్ధం కాబట్టి ఎక్కువ సేపు బతకలేదు. తరచూ ఉతకడం.. దుస్తుల వల్ల వైరస్ వ్యాపించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, కచ్చితంగా రాదు అనీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కొవిడ్ రోగులకు సేవలు చేసే వాళ్లు.. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తమ దుస్తులను తరచూ డిటర్జంట్లతో ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం మేలంటున్నారు. అయితే, మార్కెట్కో, సరకుల దుకాణానికో వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. భౌతిక దూరం పాటించడం కష్టమైనప్పుడు, లేదా ఎవరైనా దుస్తుల మీద పడేలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రం ఇంటికి రాగానే వాటిని ఉతికి, ఇస్త్రీ చేయాలని సూచిస్తున్నారు. షూ సంగతి? సాధారణంగా దుస్తులతో పోలిస్తే బూట్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. అలాగే వీటిపైనా కరోనా వైరస్ చేరుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సర్వేలో తేలింది. దీనికోసం పరిశోధకులు చైనాలో కొవిడ్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన కొంత మంది వైద్యుల బూట్లను పరిశీలించినప్పుడు వాటి కింది భాగంలో వైరస్ ఉండడాన్ని గుర్తించారు. అయితే, సాధారణంగా బూట్లను ఇంట్లోకి తీసుకురావడం అరుదు. ఇంటిబయట తలుపు వద్దనే వదులుతారు. ఒకవేళ వాటిని ఇంట్లోకి తీసుకురావాల్సి వస్తే బయటే మొదట డిజర్జంట్ నీళ్లు లేదా రసాయనాలతో శుభ్రం చేయాలి. లేదా వాటిని ఇంటి బయట ప్రత్యేక స్థలంలో వదలాలి. దుస్తులు, షూ ద్వారా వైరస్ రావడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే, అన్నింటికంటే ముఖ్యం మార్కెట్కు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం. వీటిని మాత్రం కచ్చితంగా పాటించాలనేది వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పేమాట. -దుర్గరాజు శాయి ప్రమోద్ చదవండి: (కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు) -
వడ్డీరేట్లు పెరుగుతాయా?
కరోనా కల్లోలం కారణంగా ఈక్విటీ ఫండ్స్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్స్ను బ్యాంకింగ్, పీఎస్యూ, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్కు మళ్లించాను. ఈ ఏడాది మార్చి తర్వాత వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సమంజసమైన రాబడులు రావాలంటే నేను ఏ రకమైన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? –స్రవంతి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం కష్టం. అలాగే వడ్డీరేట్ల గమనం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. వడ్డీరేట్లు తగ్గుతాయని, లేదు పెరుగుతాయని ఎవరికి వారు బలమైన వాదనలతో ఇన్వెస్టర్లను గందరగోళ పరుస్తున్నారు. అవసరాన్ని బట్టి రేట్లపై నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ అంటోంది. బహుశా ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడుతోంది. ఇన్ని అంశాల మధ్య వడ్డీరేట్ల తీరు ఎలా ఉంటుందో అంచనాలు వేయడం కొంచెం కష్టమైన విషయమే. అందుకని ఏ ఇన్వెస్టరైనా తన నియంత్రణలో లేని ఇలాంటి విషయాల కంటే తన నియంత్రణలో ఉండే ఇతర విషయాలపైననే దృష్టి సారించాలి. మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ప్రస్తుతమున్న ఆర్థిక అవసరాలు ? మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలరు. ఇప్పుడు మీకు ఉన్న ఆదాయ, వ్యయ వివరాలు....ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏ విధమైన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయాలు తీసుకోండి. సాధారణంగా పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం దీర్ఘకాలం (కనీసం ఏడేళ్లు... అంతకు మించి)ఇన్వెస్ట్ చేయడానికి ఈక్విటీ ఫండ్స్ను మించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం మరొకటిలేదు. ఇన్కమ్ పోర్ట్ఫోలియోల్లో ఈక్విటీ ఫండ్స్ కూడా ఉండాల్సిందేనని మితృలంటున్నారు. అది సరైనదేనా? –వివేక్, విశాఖపట్టణం ఒక ఇన్వెస్టర్ ఇన్కమ్ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఫండ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల కంటే ఈక్విటీ సాధనాలే మెరుగైన రాబడులు ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన అవసరాలకు ఫిక్స్డ్–ఇన్కమ్ ఆధారిత పోర్ట్ఫోలియోపైననే ఆధారపడి ఉంటాడనుకుందాం. నెలకు రూ.50,000 వచ్చేట్లుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ప్రస్తుతానికి ఈ రూ.50,000 మొత్తం ఆ వ్యక్తి అవసరాలకు సరిపోతుంది. ఐదేళ్ల తర్వాత చూసుకుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు, సేవల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ 50,000 సరిపోవు. ఈ రాబడిని పెంచుకోవలసి ఉంటుంది. పూర్తిగా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే రాబడులు పొందే వ్యక్తి..... పెరుగుతున్న ధరలతో సమానమైన రాబడులను పొందలేడు. అందుకని ఆ వ్యక్తి పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా ఈక్విటీ ఫండ్స్ ఉండాల్సిందే. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందవచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలతో ఈక్విటీ ఫండ్స్ను కూడా కలిపితే మంచిది. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం నిలకడైన రాబడిని ఇస్తుంది. ఇక ఈక్విటీ పోర్ట్ఫోలియో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిస్తుంది. -
సొంత ఇంటికి సరైన వ్యూహం ఏది?
సొంత ఇంటిని సమకూర్చుకోవడమనేది నా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో ఒకటి. అయితే వీలైనంత త్వరగా దీనిని నెరవేర్చుకోవడానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి? – కిరణ్, హైదరాబాద్ వీలైనంత ఎక్కువగా డౌన్ పేమెంట్ ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా మీరు ఇంటి కోసం చెల్లించే ఈఎమ్ఐ(ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) మీ జీతంలో మూడో వంతు మించకుండా ఉండాలి. మీరు చెల్లించే ఈఎమ్ఐ మీ జీతంలో మూడో వంతుకు మించి ఉన్నప్పుడు ఆర్థికంగా మీపై భారం పడుతుంది. మీరు నివసించాలనుకునే చోటే ఇల్లు కొనుక్కోండి. మీరు నివసించని చోట ఇల్లు కొనుక్కోవాలనుకోవడం అర్థం లేని చర్య. అంటే మీరు వేరొక ఇంట్లో అద్దెకు ఉంటూ, ఇంకొకచోట ఇల్లు కొనాలనుకోవడం సరైనది కాదు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఇటీవల కాలంలో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎమ్పీ) రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో పనితీరు బాగా ఉంది కదాని మూడు ఎఫ్ఎమ్పీల్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం పరిస్థితులు బాగా లేవు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? – పల్లవి, విజయవాడ డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభం బయటపడిన తర్వాత ఎఫ్ఎమ్పీల రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకప్పుడు ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్లాన్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్కు ఇవి మంచి సాధనాలే. నిర్దేశిత కాలానికి నిర్ణీత మొత్తంలో రాబడులను ఆశించే వారికి ఇవి ఉపయుక్తం. కొంతమంది ఫండ్ మేనేజర్ల అజాగ్రత్త, అతి జాగ్రత్తల కారణంగా ప్రస్తుతం ఎఫ్ఎమ్పీలు ఆశించిన రాబడులను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఎఫ్ఎమ్పీలు కూడా రావడం లేదు. ఎఫ్ఎమ్పీ వంటి క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఎక్సే్చంజ్ ట్రేడ్ కావలసి ఉంటుంది. మీరు ఎఫ్ఎమ్పీల నుంచి వైదొలగాలంటే ఇదొక్క మార్గం ఉంది. అయితే స్టాక్ ఎక్సే్చంజ్ల్లో ట్రేడింగ్ లావాదేవీలు చాలా స్వల్పంగా ఉంటాయి. లేదంటే ఈ ప్లాన్లు మెచ్యూర్ అయ్యేదాకా వేచి చూడడం తప్ప మరో మార్గం లేదు. ఇటీవలనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి నవనీత్ మునోత్ వైదొలగారని వార్తలు వచ్చాయి. ఆయన నిష్క్రమణ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పనితీరుపై ఏమైనా ప్రభావం చూపుతుందా? – తమీమ్, హైదరాబాద్ నవనీత్ మునోత్ వైదొలగడం వల్ల ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పనితీరుపై ఏమైనా ప్రభావం పడుతుందనే విషయమై వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యే అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫండ్స్ పనితీరు బాగానే ఉంది. ఎస్బీఐలో ఉన్న ఇతర ఫండ్ మేనేజర్లు–ఆర్.శ్రీనివాసన్, అనుప్ ఉపాధ్యాయ్, సోహిని అందాని... తదితరులు కూడా మంచి సామర్థ్యం గలవారే. అయితే ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ టీమ్లో నవనీత్ మునోత్ కీలకమైన వ్యక్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన నిష్క్రమణ వల్ల ఎస్బీఐ ఫండ్స్ పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి కీలకమైన వ్యక్తులు వైదొలగిన సందర్భాల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫండ్స్ పనితీరును సమీక్షిస్తుండాలి. సంవత్సరం, లేదా సంవత్సరన్నర కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్స్ పనితీరును మదింపు చేయాలి. మీరు ఆశించిన స్థాయిల్లో ఈ ఫండ్స్ పనితీరు లేని పక్షంలో ఆయా ఫండ్స్ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించవచ్చు. (చదవండి: 2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?) -
14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత బలపడే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని చెబుతున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగవచ్చని భావిస్తున్నారు. గత వారం(21-24) సైతం మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూశాయి. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. సోమవారం(21న) కుప్పకూలిన మార్కెట్లు మిగిలిన మూడు రోజులూ బలపడ్డాయి. వెరసి సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు పుంజుకుని 46,974 వద్ద ముగిసింది. వారం చివర్లో మరోసారి 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అయితే నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్లు క్షీణించి 13,749 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 0.5 శాతం స్థాయిలో బలహీనపడటం గమనార్హం! (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) ప్రభావిత అంశాలు వచ్చే వారం మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 సంబంధ వార్తలు ప్రభావితం చేసే వీలుంది. ఇటీవల సెకండ్వేవ్లో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కేసులు, ఇదేవిధంగా పలు కంపెనీల వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ అనుమతులు వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇవికాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇటీవల దేశీ స్టాక్స్లో ఎఫ్పీఐలు నిరవధికంగా పెట్టుబడులకు దిగుతుండటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికంగా ఇలా ఇటీవల కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో కనిపిస్తున్న హుషారు వచ్చే వారంలోనూ కొనసాగవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆటుపోట్లు తప్పకపోవచ్చని తెలియజేశారు. వచ్చే వారం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 13,800 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఈ స్థాయి దాటితే 14,000 పాయింట్ల మార్క్కు చేరవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 13,400 పాయింట్ల వద్ద, తదుపరి 13,100 స్థాయిలోనూ మద్దతు(సపోర్ట్) లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
1992 స్కామ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా?
నా పోర్ట్ఫోలియోలో ఒక బ్యాంకింగ్ ఫండ్ (ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్), ఒక ఐటీ ఫండ్ (టాటా డిజిటల్ ఇండియా ఫండ్)లు ఉన్నాయి. వీటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐదేళ్ల పాటు సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీటిల్లో అనూహ్య లాభాలే వస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ లాభాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? వీటిల్లో సిప్లు కొనసాగించమంటారా ? - పరశురామ్, విజయవాడ ఈ ఫండ్స్లో ర్యాలీ కొనసాగే వరకూ మీ సిప్లు కూడా కొనసాగించవచ్చు. అయితే మీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నారనుకుంటున్నాను. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడం కోసమే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పెద్దగా లభించవు. మీరు ఇన్వెస్ట్ చేసిన రెండు సెక్టోరియల్ ఫండ్స్ ప్రస్తుతం మంచి రాబడులను ఇవ్వడం...ఒక విధంగా మీ అదృష్టమేనని చెప్పాలి. మార్కెట్లో కరెక్షన్ మొదలైతే మాత్రం ఇతర ఫండ్స్తో పోల్చితే ఈ ఫండ్స్ బాగా పతనమవుతాయి. ఈ ఫండ్స్ రాబడులను మదింపు చేస్తే, మార్కెట్ అధ్వానంగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడులనివ్వలేకపోయాయి. మీరు ఇప్పటికే భారీగా లాభాలను కళ్లజూస్తే, ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. భవిష్యత్తులో ప్రస్తుత లాభాలు కరిగిపోయి, నష్టాలు వచ్చినా భరించగలను అని మీరు భావిస్తే, ఈ ఫండ్స్ల్లో సిప్లను కొనసాగించండి. ఇటీవలే 1992 స్కామ్ వెబ్ సిరీస్ను చూశాను. 1992 నాటి పరిస్థితులే(ఫండమెంటల్స్ మెరుగుపడకపోయినా, షేర్ల వేల్యుయేషన్లు అధికంగా ఉండటం, సూచీలు గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండటం) నేడు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? -భవానీ, విశాఖపట్టణం 1992కు, ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పుడు హర్షద్ మెహతా బ్యాంక్ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్ల విలువలను బాగా పెంచేశాడు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారి పోయాయి. 1992కు ముందు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, యూటీఐ మినహా ఇతర మ్యూచువల్ ఫండ్స్...లేవు. అసలు 1992 స్కామ్ కారణంగానే సెబీని ఏర్పాటు చేశారు. అప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఇన్వెస్టర్ల సంఖ్య, మ్యూచువల్ ఫండ్స్ సంఖ్య బాగా పెరిగాయి. ఈ ఫండ్స్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు, ఫండ్స్ భారీగా డబ్బులను వెనక్కి తీసుకుంటే తప్ప స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలు లేవు. ప్రస్తుతం నియంత్రణా వ్యవస్థలు, నిఘా యంత్రాంగం పటిష్టంగా ఉన్నాయి. సబ్ప్రైమ్ సంక్షోభం వచ్చినప్పుడు 2008లో, కరోనా వైరస్ కల్లోలం వెలుగు చూసినప్పుడు ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ కొన్ని సెషన్లలోనే 40 శాతం మేర పతనమయ్యాయి. ఇలాంటి పతనాలు చాలా అరుదు. ఈ రెండు సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్ త్వరగానే రికవరీ అయింది. 1992లో వచ్చిన పతనం కారణంగా చాలా ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ స్తబ్దుగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరినా, బ్యాంక్లు, కొన్ని తయారీ కంపెనీల షేర్లు ఇంకా అండర్ వేల్యుయేషన్లలోనే ఉన్నాయి. కొన్ని షేర్లు మాత్రమే మీరు చెప్పినట్లుగా అధిక వేల్యుయేషన్లతో ఉన్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉండి, ఇంకా పుంజుకోని షేర్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆత్మనిర్భర్ - డిఫెన్స్ షేర్లు కొనొచ్చా?
కేంద్ర రక్షణ శాఖ వారాంతాన 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధాన్ని విధించేందుకు వీలుగా ముసాయిదాను సిద్ధం చేయడంతో డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలు వెలుగులో నిలుస్తున్నాయి. 2020-24 మధ్య కాలంలో దశలవారీగా పలు డిఫెన్స్ పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధాన్ని విధించాలని రక్షణ శాఖ భావిస్తోంది. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి ప్రోత్సాహాన్నివ్వాలని చూస్తోంది. ఇప్పటికే నిషేధిత జాబితాలోని కొన్ని ప్రొడక్డులను దేశీ కంపెనీలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో డిఫెన్స్ ఉత్పత్తులను సొంతంగానే రూపొందించుకునే సామర్థ్యాలను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్రణాళికలకు అనుగుణంగా దేశీయంగా డిఫెన్స్ ప్రొడక్టుల తయారీలో స్వయంసమృద్ధిని సాధించాలని రక్షణ శాఖ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ విభాగంపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.. రూ. 4 లక్షల కోట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రూపొందించిన తాజా నిషేధ జాబితాలో ఆర్టిలరీ గన్స్, ఎసాల్ట్ రైఫిల్స్, కార్వెటీస్, ఎల్సీహెచ్, రవాణా విమానాలు, రాడార్లు తదితర పలు ప్రొడక్టులు చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత 5ఏళ్ల కాలంలో వీటి దిగుమతులపై రూ. 3.5 ట్రిలియన్లను వెచ్చించినట్లు యస్ సెక్యూరిటీస్కు చెందిన ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నిపుణులు ఉమేష్ రౌట్ చెబుతున్నారు. వచ్చే 5ఏళ్ల కాలంలో డిఫెన్స్ తయారీలో రూ. 4 లక్షల కోట్లమేర అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులకు ఊతం రక్షణ రంగ ఆయుధాలు, పరికరాలు, సాఫ్ట్వేర్ తదితర పలు విభాగాలలో దేశీ కంపెనీలకు ఇకపై భారీ అవకాశాలు లభించనున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. విదేశీ ప్రొడక్టులకు చెక్ పెట్టడం ద్వారా దేశీయంగా మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేందుకే తాజా పాలసీని రూపొందించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2020 ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ప్రమోషన్, ఎస్ఎంఈలకు దన్ను, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం వంటి అంశాలకు బూస్ట్ లభించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో దేశీయంగా డిఫెన్స్ రంగ ఉత్పాదకతను రెట్టింపునకు పెంచే యోచనలో ప్రభుత్వమున్నట్లు పేర్కొంటున్నారు. బీఈఎల్, సోలార్.. తాజా డిఫెన్స్ పాలసీల ద్వారా పలు పీఎస్యూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు లబ్డి చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎస్యూలు.. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్కు ఎయిర్ఫోర్స్, మిలటరీ విభాగాల నుంచి ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు ఆషికా ఇంటర్నేషనల్ డెస్క్ నిపుణులు సంతోష్ యెల్లపు పేర్కొన్నారు. గ్రెనేడ్స్, మైన్స్ తదితర విభాగాలలో సోలార్ ఇండస్ట్రీస్కు పలు అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా సిమ్యులేటర్స్ విభాగంలో జెన్ టెక్నాలజీస్ లబ్ది పొందే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. సెంట్రమ్, ఆస్ట్రా.. పలు పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధం కారణంగా దేశీయంగా సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్ తదితర చిన్న కంపెనీలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు యస్ సెక్యూరిటీస్ నిపుణులు ఉమేష్ పేర్కొన్నారు. బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైమిక్స్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ వంటి భారీ కంపెనీలతో పోలిస్తే చిన్న సంస్థలు ఆర్ అండ్ డీపై అధికంగా దృష్టి పెట్టగలుగుతాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారీకి ఊతం లభిస్తే ఈ కంపెనీలన్నిటికీ ప్రొక్యూర్మెంట్ వంటి వ్యయాలు తగ్గేందుకు వీలుంటుందని తెలియజేశారు. డిఫెన్స్ రంగంలో వివిధ విభాగాలు, విభిన్న కంపెనీలు కార్యకలాపాలను విస్తరించాయని ఇన్వెస్టర్లు పెట్టుబడి విషయంలో యాజమాన్యం, బ్యాలన్స్షీట్, ప్రొడక్టులపై పట్టు తదితర పలు అంశాలను పరిగణించవలసి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బీఈఎల్, హెచ్ఏఎల్, సోలార్ ఇండస్ట్రీస్ తదితర పలు కంపెనీల షేర్లు ర్యాలీ చేసినట్లు తెలియజేశారు. ఎల్అండ్టీ, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజాలతోపాటు.. వాల్చంద్నగర్ తదితర విభిన్న కంపెనీలకు అవకాశాలు పెరిగే వీలున్నదని తెలియజేశారు. అయితే షేర్ల ధరలు దిద్దుబాటుకు లోనైనప్పుడు.. నిపుణుల సలహాలమేరకు దీర్ఘకాలిక ధృక్పథంతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సూచిస్తున్నారు. -
రిటైరైన తర్వాత అధిక రిస్క్ వద్దు!
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇవి ఈక్విటీ ఫండ్స్కంటే మంచి రాబడులనే ఇవ్వగలవా? ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చంటారా? –సుచరిత, హైదరాబాద్ ఇండెక్స్ ఫండ్స్కు ఉండే ప్రధాన ప్రయోజనం.... వ్యయాలు తక్కువగా ఉండటం. ఇవి సూచీలను ప్రతిబింబిస్తాయి. సెన్సెక్స్ లేదా నిఫ్టీల రాబడులను మించి రాబడులను సా«ధించడమనేది ప్రతి ఇన్వెస్టర్ ఆశించే లక్ష్యాల్లో ప్రధానమైనది. ఈ లక్ష్యాన్ని అయితే ఇండెక్స్ ఫండ్స్తో సాధించలేం. ఇండెక్స్ ఫండ్స్కు ఉన్న ప్రధాన అవరోధం ఇదే. 2018లో గానీ, 2019లో గానీ ఏ ఫండ్ కూడా ఇండెక్స్ ఫండ్ను మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. అయితే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్కు మించిన రాబడులనిచ్చాయి. సూచీల స్థాయి రాబడులు చాలు, వ్యయాలు తక్కువగా ఉండాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయదల్చుకున్నా, ఇండెక్స్ ఫండ్స్ను మించి రాబడులు రావాలనుకున్నా, ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోవడమే మేలు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే అవసరాల కోసం ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ప్రీమియమ్ను వెనక్కి ఇచ్చే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ అవసరాలను తీర్చుకోవచ్చా? ఇది సరైన నిర్ణయమేనా? –సూరి, విశాఖపట్టణం ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు. బీమా వేరు. ఇన్వెస్ట్మెంట్ వేరు. ఈ రెండింటి అవసరాలు కూడా వేర్వేరుగా ఉన్నట్లుగానే, మదుపు కూడా విడివిడిగానే ఉండాలి. ఎప్పుడూ ఈ రెండింటిని కలపకూడదు. ప్రీమియమ్ వెనక్కి ఇచ్చే బీమా పాలసీలు ఒక విధంగా చెప్పాలంటే ఎరల్లాంటివే. బీమా అవసరాల కోసం పూర్తిగా టర్మ్ ప్లాన్లనే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్, తగిన ఆరోగ్య పాలసీలు తీసుకుంటే ఇక వేరే బీమా ప్లాన్ల కోసం ఆలోచించాల్సిన పని లేదు. ఇక రిటైర్మెంట్ అవసరాల కోసం కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగేలా ఉంటే, ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోండి. ఈ ఫండ్స్లో నెలకు కొంత మొత్తం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ప్రతీ ఏడాది ఈ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీ పోర్ట్ఫోలియోను సమీక్షిస్తూ ఉండండి. నేను ఇటీవలనే రిటైరయ్యాను. క్రమం తప్పని ఆదాయం కోసం మాలాంటి రిటైరైన వ్యక్తులకు అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఏంటి? –ప్రభాకర్, విజయవాడ రిటైరైన తర్వాత పెన్షన్ తప్ప మరో ఆదాయం ఉండదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. క్రమం తప్పని ఆదాయం వచ్చేలా ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకోవాలి. గతంలో జీవితం సాఫీగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. గతంలో డిపాజిట్లు, బాండ్లు, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, లేదా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే, ఈ సాధనాలన్నీ ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసే రాబడులనిచ్చేవి. భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్మెంట్స్ సాధనాలకు ఇంత సీన్ ఉంటుందనుకోవడం లేదు. వీటిపై రాబడులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి. రిటైరైన తర్వాత అధిక రిస్క్ తీసుకోకూడదు. అధిక రిస్క్ తీసుకుంటే, అధిక రాబడులు వచ్చే విషయం వాస్తవమే అయినప్పటికీ, ఒక వేళ నష్టాలు వస్తే, దానిని భరించడం కష్టసాధ్యమే. అయినప్పటికీ, రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే. రిటైరైన వాళ్లకు వేరే సంపాదన ఉండదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్పైననే ఆధారపడి ఉండాలి. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. కోటి వచ్చాయనుకుందాం. 8 శాతం రాబడి లెక్కన నెలకు రూ.66,000 వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల గడవడానికి ఈ మొత్తం సరిపోతుంది. కానీ ఐదేళ్ల తర్వాత? ద్రవ్యోల్బణం 10 శాతం చొప్పున లెక్కేసుకుంటే, మీకు ఇంకా ఎక్కువ మొత్తమే అవసరం. ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు వృద్ధిని కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ సాధించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డెట్ ఫండ్స్ వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు మీ పెట్టుబడికి రక్షణ నిస్తాయే కానీ, పెద్దగా రాబడులను ఇవ్వలేవు. మీ పెట్టుబడి వృద్ధి చెందేలాగా, భవిష్యత్తు అవసరాలు తీరేలాగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. దీనికి అసెట్–అలకేషన్ విధానాన్ని అనుసరించవచ్చు. మీ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతాన్ని ఈక్విటీలో, మిగిలింది డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
నష్టాలొస్తున్నాయి.. సిప్లు ఆపేయాలా?
నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్ఫోలియోలో సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్–క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్లు ఉన్నాయి. ఈ ఫండ్స్లో 2017 నుంచి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్ నష్టాలు చూపడంతో 2018లో సిప్లు ఆపేశాను. ఈ ఏడాది కూడా ఈ ఫండ్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే నా ఇన్వెస్ట్మెంట్స్ను వేరే ఫండ్స్కు మళ్లించమంటారా ? –కళ్యాణి, విజయవాడ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నవన్నీ మంచి ఫండ్సే, పైగా ఇది మంచి కాంబినేషన్ కూడా. ఒక్కొక్క ఫండ్ది ఒక్కొక్క ప్రత్యేకమైన థీమ్. సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్.. ప్రామిసింగ్ సెక్టోరియల్ ఫండ్. సాధారణంగా సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవద్దని చెప్తుంటాను. కానీ సుందరమ్ ఫండ్ దానికి మినహాయింపు. 2017లో మార్కెట్ మంచి స్థాయిలో ఉంది. ఇలాంటప్పుడు ఫండ్స్ పనితీరు బాగా ఉంటుంది. 2018లో మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా దాదాపు ఫండ్స్ అన్నీ ఆశించిన స్థాయి పనితీరు కనబరచలేకపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్ బాగా ఉన్నాయి. వీటన్నింటి పనితీరు పూర్తిగా మార్కెట్ పనితీరును బట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు నష్టాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్నా మీ ఇన్వెస్ట్మెంట్స్ను సిప్ల రూపంలో కొనసాగించండి. మార్కెట్లో పరిస్థితులు కుదుటపడితే, ఈ ఫండ్స్ మీకు లాభాలను చూపిస్తాయి. అసలు సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న పరమార్థం కూడా ఇదే. మార్కెట్ పెరుగుతున్నప్పుడే కాకుండా మార్కెట్ పతనబాటలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు. ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్కు మధ్య తేడా ఏమిటి? వేటిల్లో రాబడులు అధికంగా వస్తాయి.? –దామోదర్, విశాఖపట్టణం ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్లు రెండు వేర్వేరు రకాలు. వీటి మధ్య చాలా సన్నని విభజన రేఖ మాత్రమే ఉంటుంది. చట్ట ప్రకారం, లిక్విడ్ ఫండ్... 91 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది లిక్విడ్ ఫండ్ మేనేజర్లు 55 రోజుల నుంచి 60 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మూడు నుంచి ఆరు వారాల మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక తాజా సెబీ నిబంధనల ప్రకారం, లిక్విడ్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 20 శాతం వరకూ నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల వంటి లిక్విడ్ అసెట్స్ల్లో ఇన్వెస్ట్ చేయాలి. డిజైన్ పరంగా చూస్తే, ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ ఒకింత సురక్షితమనైవని చెప్పవచ్చు. తాజా సెబీ నిబంధనల కారణంగా లిక్విడ్ ఫండ్స్ మరింత సురక్షితంగా మారాయి. ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్తో పోల్చితే లిక్విడ్ ఫండ్స్ రాబడులు ఒకింత తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మదుపు మొదలు పెట్టడానికి ముందుగా మ్యూచువల్ ఫండ్స్నే పరిగణించాలా? నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేయకూడదా? –అబ్దుల్లా, హైదరాబాద్ మదుపు మొదలు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి. ఇక నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. తగిన అనుభవం, అవగాహన లేకపోతే నష్టాలు వస్తాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఏ షేర్ను ఎంచుకోవాలి ? ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ? తదితర అంశాలపై సాధారణ ఇన్వెస్టర్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్కు అధిక అవగాహన ఉంటుంది. మార్కెట్ సంబంధిత సాధనాల్లో గతంలో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకుంటే, ముందుగా మ్యూచువల్ ఫండ్స్నే ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరిగణించండి. మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తే, ముఖ్యంగా రెండు ప్రయోజనాలు లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి అనుభవం మంచి ఫలితాలనిస్తుంది. ఇక రెండవది...మ్యూచువల్ ఫండ్స్లో చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. మీరు కనీసం నెలకు రూ.1,000తో మీ ఇన్వెస్ట్మెంట్స్ను మొదలు పెట్టవచ్చు. కనీసం ఐదు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్కు మించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం మరొకటి లేదు. ఫండ్స్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. మీకు జీతం పెరిగినా, ఇంక్రిమెంట్ వచ్చినా ఈ పెరిగిన మొత్తంలో కొంత మొత్తాన్ని సిప్లకు జత చేయండి. ఒకవేళ మీరు స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేస్తున్నట్లయితే, ఏడాదికి సిప్ మొత్తాన్ని కనీసం 5–10 శాతం చొప్పున పెంచండి. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్ఫోలియోలోని ఫండ్ల పనితీరును సమీక్షించి, వాటి పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. -
ఇలా చేస్తే మీ పొదుపు పండినట్టే
ఎంత సంపాదించినా పొదుపు తెలియకపోతే నెల చివరికొచ్చేసరికి రూపాయి కనిపించదు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు, మదుపు చేశామన్నదే వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో కీలకం. ఖర్చులను నియంత్రించుకుని, తగినంత ఇన్వెస్ట్ చేయడం ద్వారానే అన్ని ఆర్థిక పరమైన లక్ష్యాలను చేరడం సాధ్యపడుతుంది. అందుకు ఏం చేయాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేస్తున్న కథనం ఇది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారానే ఆర్థిక భద్రత సమకూరుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయినా, మనలో చాలా మంది అవసరమైనంత పొదుపు చేయరు. కొందరికి అవసరమైనంత మిగులు ఉండదు. కొందరు పొదుపు వాయిదా వేస్తుంటారు. భవిష్యత్తు సంగతి తర్వాత, ముందు ఈ రోజు గడిస్తే చాలనుకుంటారు. పనుల్లో ఆలస్యం జరగకూడదన్న సంకల్పంతో తమ గడియారాన్ని 10–15 నిమిషాలు అధికంగా సెట్ చేసే వారున్నారు. దాంతో నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయగలమని, సమయ పాలన పాటించొచ్చని భావిస్తారు. గడియారం 10 నిమిషాలు వేగంగా నడుస్తుందని వారికి తెలుసు. కాకపోతే క్రమశిక్షణ కోసం వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ తరహా విధానాలు పొదుపు, మదుపులకు కూడా అవసరం. ఇక్కడున్నవి అటువంటివే. ఎంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ఇవి సాయంగా ఉంటాయి. వేతన పెంపు ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనానికి అనుగుణంగా ఖర్చులు, వ్యయాల్లోనూ పెరుగుదల ఉంటుంది. అయితే, ఎంతో కొంత మిగులు ఉంటుంది. దాన్ని సైతం ఖర్చు చేసేయకుండా పెట్టుబడులకు మళ్లించాలి. వేతనం పెరిగిన నెల నుంచే ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. మీరు ఖర్చు చేసేందుకు చాన్స్ తీసుకునే అవకాశం లేకుండా ముందే పెట్టుబడులకు వెళతాయి. పెరిగే వేతనానికి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా రికరింగ్ డిపాజిట్ను ఎంచుకోవాలి. వార్షికంగా వచ్చే బోనస్కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోనస్ను లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు ఖాతాలు బ్యాంకు ఖాతాలు అధిక సంఖ్యలో ఉన్నా గందరగోళంగా ఉంటుంది. పొదుపు, పెట్టుబడులకు ఓ బ్యాంకు ఖాతాను ప్రత్యేకించడం మంచిది. అయితే, పెట్టుబడుల ఖాతాకు డెబిట్ కార్డును తీసుకోవద్దు. ఇక్కడ ఓ ఉదాహరణ చూస్తే రఘురామ్ తన ఆదాయాన్ని నెలవారీ తప్పనిసరి ఖర్చులు (రుణ వాయిదా తదితర), కిరాణ, ఇంటి వ్యయాల కోసం, పొదుపు, మదుపుల కోసం అంటూ మూడు భాగాలు చేయడం అలవాటు. దీంతో ఒక నెలలో ఖర్చులు ఎన్ని ఎదురైనా గానీ, అతడి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఆగడం లేదు. ఈ తరహా స్ట్రాటజీలను అనుసరించేవారు ఎందరో ఉన్నారు. ఇలా చేయడం సరికాదు అభినవ్ మిశ్రా ఏటా పన్ను ఆదా కోసం తన పెట్టుబడుల వివరాలను కంపెనీకి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే అలవాటు లేదు. దాంతో కంపెనీ అతడి వార్షికాదాయం ప్రకారం టీడీఎస్ను నెలవారీ అమలు చేస్తోంది. నిజానికి మిశ్రా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటి అద్దె కూడా భారీగానే చెల్లిస్తున్నాడు. అయితే, ఈ వివరాలను డిసెంబర్ నెలలోనే కంపెనీకి సమర్పిస్తున్నాడు. దీంతో కంపెనీ తర్వాతి మూడు నెలలు (జనవరి–మార్చి) టీడీఎస్ అమలు చేయడం లేదు. దాంతో మిశ్రా చేతికి ఏటా చివరి మూడు నెలలు పూర్తి వేతనం అందుతోంది. కానీ, ఈ విధమైన విధానం సరికాదంటున్నారు నిపుణులు. అంచనాలు తప్పితే మరింత పన్ను చెల్లించాల్సి వస్తుంది. మరో కోణంలో టీడీఎస్ వెనక్కి వచ్చేందుకు నెలల సమయం పడుతుంది. పైగా టీడీఎస్ రిఫండ్ అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. మరోవైపు జనవరి నుంచి మార్చి వరకు పూర్తి వేతనం వస్తుంది. ఈ అధికంగా వచ్చే నిధుల్ని అర్థవంతంగా ఇన్వెస్ట్ చేసినప్పుడే ప్రయోజనం నెరవేరుతుంది. లేక ఆ మొత్తం ఖర్చులకు వెళ్లిపోతే నష్టపోయినట్టే. లగ్జరీకి పోతున్నారా...? ప్రతీ ఒక్కరికీ లైఫ్స్టయిల్ కోరికలు ఉండడం సహజంగా మారింది. హాలిడేటూర్కు వెళ్లాలని, బయట డిన్నర్ చేయాలని, స్టయిల్గా ఉండే డ్రెస్ తీసుకోవాలి, మంచి ఫీచర్లతో కూడిన సెల్ఫోన్ చేతిలో ఉండాలని ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటుంటాయి. అయితే, వీటిని త్యాగం చేయాలని చెప్పడంలేదు. కానీ, వీటిని కొనుగోలు చేసేవారు అదేసమయంలో అంతే మొత్తం నగదును పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. రెండు ఖర్చులకు తగ్గ స్థాయిలో ఆదా చేయగలగడం. ఈఎంఐ మంచిదే! పొదుపు చేయలేకపోతున్నవారు పర్సనల్ లోన్ తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. రెండు, మూడేళ్ల పాటు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో వేతనం నుంచి రుణం చెల్లించడం చేస్తారు. దీనివల్ల పొదుపు అలవడినట్టే. అయితే, రుణం తీరిన తర్వాత కూడా ఈఎంఐ ఎంత అయితే చెల్లించారో అంతే మొత్తాన్ని పెట్టుబడులకు ఆటోమేటిగ్గా వెళ్లేలా సెట్ చేసుకోవాలి. దీనివల్ల పొదుపు అలవడుతుంది. అప్పటి వరకు ఈఎంఐగా చెల్లించి ఉంటారు కనుక ఆ తర్వాత అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం భారంగా అనిపించదు. పర్సనల్ లోన్ కింద తీసుకున్న మొత్తాన్ని అధిక రాబడులను ఇచ్చే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. సాయం తీసుకోండి... మీకు అత్యంత సన్నిహితులను మీ పొదుపు, మదుపులను పరిశీలించేందుకు అనుమతించొచ్చు. ఆర్థిక విషయాలపై పట్టు సాధించలేని పరిస్థితుల్లో వారి సాయం పొందడంలో తప్పులేదు. వారు మీ ఖర్చులు, పొదుపులపు పరిశీలించి ట్రాక్లోనే ఉన్నదీ, లేనిదీ చూస్తారు. ట్రాక్ తప్పితే అప్రమత్తం చేస్తారు. ఇక మీకు సన్నిహితులైన వారితో కలసి ఆర్థిక విషయాల్లో, ప్రణాళిక, పెట్టుబడుల్లో పోటీ వాతావరణం ఉండేలా చూసుకోవడం కూడా తెలివైన యోచనే. ఖర్చుకు ముందు ఒక్క నిమిషం ప్రతీ ఖర్చు కూడా మీ బడ్జెట్కు చిల్లు పెట్టేదే. అందుకే కొనుగోలుకు ముందు కాస్తంత సమయం ఇవ్వడం (తాత్కాలికంగా ఆగడం) ద్వారా అది నిజంగా అవసరమా, లేక కోరికా అన్నది తేల్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. నిజంగా అవసరమే అయితే కొనుగోలుకు ముందుకు వెళ్లొచ్చు. లాక్ చేయడం దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కోరుకున్నప్పుడు వెనక్కి తీసుకోలేం. ఇది ఒకింత ఇబ్బందే. అయితే, దీనిలో ప్రయోజనమూ ఉంది. ఇలా అయినా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు. పీపీఎఫ్ 15 ఏళ్ల కాల వ్యవధితో కూడినది. అయితే, ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు వీలు కల్పిస్తుంది. ఎన్పీఎస్ రిటైర్మెంట్కు ముందు విత్డ్రా చేసుకోవడానికి లేదు. అయితే, ఈ మధ్య కొన్ని ప్రత్యేక అవసరాల్లో విత్డ్రాకు వీలు కల్పిస్తామని ఎన్పీఎస్ ప్రకటించింది. బీమా పాలసీలు అయితే 15–30 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే ల్యాప్స్ అయిపోతుందని, సరెండర్ చేస్తే తక్కువగా రావడం వల్ల నష్టపోవాల్సి ఉంటుందన్న భయంతో కచ్చితంగా పాలసీని నిర్ణీత కాలం వరకు కొనసాగిస్తారు. భవిష్యత్తుపై స్పష్టత 20–30 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి రిటైర్మెంట్ పెద్ద ప్రాముఖ్యం అనిపించకపోవచ్చు. అలా అని రిటైర్మెంట్కు ఇన్వెస్ట్మెంట్ను ఆలస్యం చేయడం సరికాదు. ఎందుకంటే చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయో జనంతో దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుంది. అందుకని మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతలు, మీ ఆదాయం, అవసరాలకు అనుగుణంగా తగిన ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. ప్రతీ లక్ష్యానికి ఎంత వ్యవధి ఉంది, ఎంత మొత్తం సమకూరాలి, అందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ సాధనంలో అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే నిపుణుల సాయం తీసుకునేందుకు వెనుకాడరాదు. -
తొలి జీవితం అడుగులు ఇలా..
పెళ్లి... వ్యక్తి జీవితంలో సంతోషం, సౌభాగ్యంతో పాటు ఆశావహ దృక్పథాన్నీ తీసుకువస్తుంది. ఇదే సమయంలో మూడుముళ్లతో ఒక్కటైన జంట కాలక్రమంలో ఆర్థిక ఒడిదుడుకులను, పలు బాధ్యతలను ఎదుర్కోక తప్పదు. జీవిత భాగస్వాములుగా పరస్పర విశ్వాసంతో ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ జాగ్రత్తగా బతుకు బండిని నడుపుకుంటూ రావాల్సిందే. పిల్లలు.. వారి చదువులు.. జీవిత లక్ష్యాలు.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను ఎదుర్కొనడం.. ఇవన్నీ జీవితంలో ఒక భాగమైపోతాయి. వీటన్నింటితో ఒక వివాహం విజయవంతమై... సమాజంలో ఆదర్శప్రాయమవుతుంది. ప్రతి వివాహ బంధం ఈ స్థాయికి చేరుకునే బాటలో అనుసరించాల్సిన ఐదు ఆర్థిక సూత్రాలు... పెళ్లైన కొత్తలో ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక ప్రణాళికను రచించి అమలు పర్చడానికి ఇదే సరైన సమయం. నవ దంపతులు ఆర్థిక ప్రణాళికలో ఈ ఐదు అంశాలను మరచిపోకూడదు. పరస్పరం మాట్లాడుకోవాలి... భార్యాభర్తలు ఇరువురు తమ జీవన ప్రయాణానికి ముందు ఒకరికొకరు తమ ఆర్థిక అవసరాలు, రాబడులు, వ్యయాల వంటి అంశాలపై చర్చించుకోవాలి. పరస్పరం అర్థం చేసుకోవాలి. తమ జీవితానికి అనుగుణమైన ప్రణాళికలు వేసుకోవాలి. ఈ ప్రణాళికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ప్రాతిపదికన, భవిష్యత్కు భరోసాను ఇచ్చేవిగా ఉండాలి. రుణాలు, బిల్లుల చెల్లింపులు, ఇంటి అద్దెలు, పెట్టుబడులు, నెలవారీ ఖర్చులు... ఇత్యాధి అంశాలన్నీ మీ చర్చల్లో భాగం కావాలి. జీవిత బీమా ధీమా కావాలి... భవిష్యత్ భద్రత, ఆర్థిక అవసరాల నుంచి అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేంత వరకూ పలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఒక జీవిత బీమా పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం. భార్యాభర్తలు వారివారి జీవిత అవసరాలకు అనుగుణంగా ఒక బీమా పాలసీని ఎంచుకోవాలి. వివాహానికి ముందే పాలసీ ఉంటే... దానిని అనంతరం మీ తాజా అవసరాలకు, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా మలచుకోవాలి. ఆ మేరకు పాలసీ ప్రయోజనాలను పెంచుకోవాలి. రైడర్లను వినియోగించుకోవాలి. ఆర్థిక అవసరాలు ఇక్కడ ముఖ్యంకాదు. కొన్ని దురదృష్ట ఘటనలను సైతం ఎదుర్కొనేలా జీవిత బీమా పాలసీలు దోహదపడతాయన్నది ఇక్కడ గమనించాల్సిన అవసరం. ఆరోగ్య బీమా కూడా అవసరమే.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి నేడు నూటికి నూరుపాళ్లూ నిజం. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఎంతటి వారైనా ఈ సమస్యను ఎదుర్కొనక తప్పదు. ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా ప్రణాళిక ఎంతో దోహదపడుతుంది. ఈ పాలసీ కొనుగోలు తప్పనిసరి. అయితే ఉద్యోగస్తులుగా వారి యాజమాన్యం ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ వంటి సౌలభ్యతలను కల్పిస్తుంది. అయితే ఈ మొత్తం బీమా మీ అవసరాలకు భరోసాను ఇస్తుందా? లేదా? అన్న అంచనాలను వేసుకోవాలి. వైద్య ఖర్చులు 15 నుంచి 20 శాతం వరకూ ప్రతి యేడాదీ పెరుగుతున్నాయన్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా నిర్ఱయం తీసుకోవాలి. పదవీ విరమణపై ఆలోచన ఇలాంటి ఒక ఆలోచన ఆర్థికంగానే కాదు... జీవిత భాగస్వాముల మధ్య మంచి సెంటిమెంట్లను, భావోద్వేగాలను సైతం సానుకూల రీతిలో పటిష్ట పరుస్తుంది. ‘ఇప్పుడేగా వివాహమైంది..? అప్పుడే పదవీ విరమణ వరకూ ఎందుకు?’ వంటి ఆలోచనలను పక్కనపెట్టి... ఆర్థికంగా ఆయా అంశాలకూ భవిష్యత్తు ప్రణాళికల్లో చోటివ్వడం ముఖ్యం. సంయుక్త ఆర్థిక అవసరాలు, కోరికలు... వంటి అంశాలకు అనుగుణంగా భార్యా భర్తలు ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం మదుపుచేసుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ఇలాంటి విధానం మీ రిటైర్మెంట్ అనంతర జీవితానికి ప్రశాంతతను అందిస్తుంది. సలహాలు తీసుకోవాలి... అన్ని అంశాల్లోనూ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో నిపుణుల సలహాలూ తీసుకోవాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణం, దాని పెరుగుదల తీరు, పొదుపులు, పెట్టుబడులు వంటి అంశాలపై నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. ప్రతి వ్యక్తి జీవితంలో పిల్లల పెంపకం కీలకం. వీరి విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ సముపార్జన వరకూ తల్లిదండ్రులుగా నుంచి సలహాలు, సూచనలు, ఆర్థిక భరోసా అన్నీ ముఖ్యమే. ఆయా అంశాలపై ప్రతి సందర్భంలోనూ నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడమూ కీలకమే. తగిన ప్రణాళిక ద్వారా జీవితంలో పటిష్ట ఆర్థిక నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్!! -
శిక్షణ.. కాకూడదు శిక్ష
న్యూస్లైన్ , మంచిర్యాల సిటీ, వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటే ఇటు విద్యార్థులు.. అటు యువత వివిధ శిక్షణలు తీసుకోవాలనుకుంటారు. ఇది శారీరక, మానసిక ఉల్లాసానికి, దృఢత్వానికి మంచిదే. అయితే జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంత వేడిని తట్టుకుంటూ క్రీడా శిక్షణ పొందడం అంత సులువు కాదు. వేడిమితో శరీరంలోని నీటి శాతం తగ్గడంతో వడదెబ్బ తగలి అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అందుకే ఆర్యోగాన్ని కాపాడుకునేందుకు పిల్లలు, విద్యార్థులు, యువత.. వారి తల్లిదండ్రులు, శిక్షకులు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు శిక్షణ శిక్షగా మారకుండా సాఫీగా సాగుతుంది. - వేసవిలో క్రీడా శిక్షణ.. ఆరోగ్యంపై ప్రభావం - జాగ్రత్తలు పాటిస్తే సరి.. లేకుంటే ఇబ్బందికరం దుస్తులు శిక్షణ పొందే క్రీడాకారులు మందం దుస్తులు ఉపయోగించరాదు. అప్పర్, లోయర్ దుస్తులు, కాటన్ దుస్తులు ఉపయోగించడం శరీరానికి మంచిది. ఒకరోజు వాడిన దుస్తులను మరుసటి రోజు వేసుకోరాదు. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు ఏ రోజుకారోజు దుస్తులు ఉతికినవే ధరించాలి. వాతావరణం మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మిగితా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు దాటి ఉంటోంది. రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కూడా వాతావరణం వేడిగానే ఉంటోంది. ఇంతటి అత్యధిక వేడిలో ఆటలు ఆడటం, ఈత కొట్టడం, నృత్యం నేర్చుకోవాలంటే జాగ్రత్తలు కూడా అవసరమే. ఉదయం పదకొండు గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఉదయం శిక్షణ పొందిన వారు మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రిస్తే శరీరానికి హాయి కలుగుతుంది. గ్లూకోజ్ గ్లూకోజ్ పొడిని నీటిలో కలుపుకొని తాగితే శరీరానికి అదనపు శక్తి సమకూరుతుంది. కొందరు తింటారు. ఇలా చేస్తే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్లాసెడు నీటిలో ఒక చెంచా పొడి కలిపి ఉదయం, సాయంత్రం తాగితే సరిపోతుంది. ఆహారం ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం మేలు. వీటితో పాటు నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మరువరాదు. తాగునీరు ఉదయం పూట శిక్షణకు వెళ్లే క్రీడాకారులు తగినంత నీరు తాగాలి. వెంట తప్పనిసరిగా నీరు ఉండాలి. ఉదయం పూట అరటి పండు తింటే శరీరంలో విటమిన్ లోపం తలెత్తదు. శిక్షణ ముగిసే వరకు ప్రతి రోజు పుచ్చకాయ తినడం శరీరానికి చాలా మంచిది. దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. సామర్థ్యాన్ని మించరాదు శరీరం శక్తి సామర్థాలకు మించి శిక్షణ పొందరాదు. సామర్థ్యానికి మించి సాధన చేయకుండ ఆటలో నైపుణ్యం పెంచుకోవాలి. పోటీ పడి అధిక బరువులు ఎత్తడం, ఎక్కువ దూరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం వలన శరీరంలోని నీటి శాతం తగ్గి కోలుకోలేని స్థితికి చేరుకుంటాం. అతి వేగంగా ఆటలు ఆడి వెంటనే నీరు తాగడం శ్రేయస్కరం కాదు. నాట్యంలో శిక్షణ పొందే వారికి శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరులో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రతి రోజూ ఉండాలి. చల్లని నీటితో స్నానం శిక్షణ పొందిన క్రీడాకారులు ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎండలో చల్లని నీటితో స్నానం చేయరాదు. నీడ వసతి ఉన్న చోటనే చల్లని నీటితో ఎక్కువ సేపు స్నానం చేయాలి. చెరువుల్లో ఎండ పూట ఈత కొట్టరాదు. ఉదయం పదకొండు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఈత కొలనులో శిక్షణ పొందాలి. నిపుణుల సలహాలు పాటించాలి వేసవిలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందడం మంచి అవకాశం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి. సాధన ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెంచాలి. అధిక ఉష్ణోగ్రతలో సాధనను ఒకేసారి వేగవంతం చేయరాదు. శరీర సామర్థ్యం ఆసరాతోనే క్రీడల్లో శిక్షణ పొందాలి. బలహీన క్రీడాకారులు వేసవిలో శిక్షణకు దూరంగా ఉండటమే మేలు. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు శిక్షణలో నిపుణుల సలహాలు తప్పక పాటించాలి. - కనపర్తి రమేశ్, క్రీడా శిక్షకుడు