Forgery
-
మతి మరవండి.. మంచిదే!
రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పుమరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్డేషన్కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే. -
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎల్ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్కుమార్ గోయెల్తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ను ని ర్మించాలని టీఎస్ఎల్ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. -
JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్రెడ్డి గుర్తించారు. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
సీఎం రమేష్ పై కేసు
-
బీజేపీ ఎంపీ సీఎం రమేష్పై ఫోర్జరీ కేసు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్పై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేశారు. కాగా, వేణు తరఫున కావూరి భాస్కర్రావు స్టేట్మెంట్ ఇచ్చారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్ రావు తెలిపారు. ‘‘ఈ ఫోర్జరీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు క్రైమ్ ఏసీపీ నా స్టేట్మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిచారు. అరగంట పాటు నా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. కేసుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. వేల కోట్ల స్కాంకి సీఎం రమేష్ పాల్పడ్డాడు సీబిఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని కావూరి భాస్కర్రావు పేర్కొన్నారు. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్గా నిలుస్తున్న మార్గదర్శి చిట్ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
జర్నలిజం ముసుగులో ఫోర్జరీ..టీవీ5 సాంబపై కేసు నమోదు
-
IAS vs IPS అసలు తప్పు ఎవరిది ?
-
ఐపీఎస్ అధికారి ఫోర్జరీ..మాజీ ఐఏఎస్ కే కుచ్చుటోపీ..
-
సూపర్ స్టార్ భార్యకు బెయిల్ మంజూరు..ఆ సినిమా కేసులోనే!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్కు బెయిల్ మంజూరైంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెకు తాజాగా బెంగళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే లభించింది. అయితే డిసెంబర్ 1, 2023న కోర్టు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే.. కొచ్చాడయాన్ సినిమాను భారీ ఖర్చుతో పెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్టైన్మెంట్లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్గా లతా రజనీకాంత్ సంతకం చేశారు. మురళి అప్పు తీర్చకపోవడంతో హామీదారుగా ఉన్న లత ఈ కేసులో చిక్కుకుపోయారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు... రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు
సాక్షి, అమరావతి: ‘మీ షేర్లను బదిలీ చేస్తున్నట్లు సంతకాలు పెడతారా లేదా!?’.. ఓ గదిలో తలకు తుపాకి గురిపెట్టి మరీ ఇలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణభయంతో సంతకాలు చేసేస్తారు కదా. ఈ ఉదంతంలోనూ బాధితులు అదే పనిచేశారు. కానీ, ఇక్కడ తలకు తుపాకి పెట్టి బెదిరించింది ఎవరో కాదు.. చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. ఆ బాధితులు మరెవరో కాదు.. రామోజీరావుతో కలిసి మార్గదర్శి చిట్ఫండ్స్ స్థాపించిన జీజే రెడ్డి కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. ఇలా.. తుపాకితో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్లోని 288 షేర్లను తన కోడలు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు రామోజీ. ఆ ఒక్క సంతకమే కాకుండా మరికొన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో తతంగం కానిచ్చేశారు. ఆ విధంగా 2016 నాటికి రూ.1,59,69,600 మూలధన విలువ ఉన్న 288 షేర్లను అక్రమంగా కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈనెల 13న ఫిర్యాదు చేయడంతో రామోజీరావు అక్రమాల బండారం బట్టబయలైంది. జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. భారత్లో నివసిస్తూ తన కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన రెండో కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో రామోజీరావు, శైలజ కిరణ్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ కిరణ్లను నిందితులుగా చేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసు వివరాలివీ.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్ట్గా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ను 1962లో నెలకొల్పారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి 1985లో చెకోస్లోవేకియాలో చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. ఆ తర్వాత.. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీరావును చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయనేమీ చెప్పలేదు. పత్రికల ద్వారా తెలుసుకుని సంప్రదిస్తే.. మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మార్టిన్రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2016, సెప్టెంబరు 29న రామోజీరావు తనను కలిసేందుకు ఆ సోదరులు ఇద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన ఏళ్లకు సంబంధించిన డివిడెండ్ మొత్తాన్ని కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. తుపాకి పెట్టి బెదిరించి మరీ.. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద మార్టిన్రెడ్డిని సంతకం చేయమన్నారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016, అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీలేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు’ అని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందనిగానీ, తేదీగానీ ఆ ఫామ్పై లేవు. రామోజీరావు తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి వారు బయటకొచ్చారు. చెక్కు మార్చలేదు.. షేర్ల బదిలీకి అంగీకరించలేదు.. మరోవైపు.. ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ.. తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వారు నగదుగా మార్చుకోలేదు. ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకంచేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. అలాగే, రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. కానీ, ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో.. 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ.. మరోవైపు.. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మార్గదర్శి చిట్ఫండ్స్లో వాటాదారు అయిన యూరి రెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే రామోజీరావు కుతంత్రం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. మూలధన నిధి సేకరించింది ఏపీలోనే కాబట్టి.. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్ లెటర్లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్ ప్రీత్ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్ బోర్డర్ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్ఏ) విచారణలో తేలింది. దీంతో జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్ ప్రీత్ సింగ్తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు. రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది. -
ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ పై ఫోర్జరీ కేసు
-
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్కు మరోసారి చుక్కెదురైంది. భారత్పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్టెక్ యునికార్న్ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్పే ఫౌండర్ ట్యాగ్ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
టీటీడీ విజిలెన్స్ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ
తిరుమల/సాక్షి ప్రతినిధి ఏలూరు: ఫోర్జరీ ఆధార్ కార్డులతో తన సిఫార్సు లేఖలపై వేరే రాష్ట్రాలకు చెందినవారికి తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం టీటీడీ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆయనే స్వయంగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్రావు వెల్లడించిన వివరాలు... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇతర మతస్తుడైనా తరచూ శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు జారీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు లోతుగా ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీ సాబ్జీ 19సార్లు సిఫార్సు లేఖలు జారీ చేశారని వెల్లడైంది. ఇందులో మూడుసార్లు ఎమ్మెల్సీయే స్వయంగా తిరుమలకు వచ్చారు. తన సిఫార్సు లేఖలపై దర్శనానికి పంపిన భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్సీ సాబ్జీ స్వయంగా తిరుమలకు వచ్చారు. 14 మందికి బ్రేక్ దర్శనాలు కావాలని దరఖాస్తు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో టీటీడీ నిబంధనల మేరకు 10 మందికి అధికారులు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చారు. అయితే అనుమానంతో ఆయనతోపాటు దర్శనానికి వెళ్తున్నవారిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. భక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులపై దర్శనానికి వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బెంగళూరుకి చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి హైదరాబాద్కు చెందినవారిగా సృష్టించారని వెల్లడైంది. అంతేకాకుండా ఆరుగురు భక్తులకు దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమయ్యాయి. దీంతో వీరిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్తో పాటు ఎమ్మెల్సీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అధికార హోదాను అడ్డుపెట్టుకొని దర్శనాల్లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ఆ పార్టీ నేతలు భానుప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి వేర్వేరుగా డిమాండ్ చేశారు. -
ఫోర్జరీ కేసు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశ్చిమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. -
వీఆర్వో, తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ.. పక్కా ప్లాన్తో భూమి దొంగ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీఆర్వో, తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి విలువైన స్థలాన్ని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. తీరా స్థల యజమానికి విషయం తెలిసి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన తమ్మా వినోద్రెడ్డికి ఆర్ఎస్ నంబర్ 64–3లో 25 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఆ స్థలం తన తల్లికి వీలునామా ద్వారా సక్రమించింది. మచిలీపట్నానికి చెందిన స్థలాల బ్రోకర్ అలీ.. తమ్మా వినోద్రెడ్డికి చెందిన స్థలాన్ని అమ్మి పెడతానని చెప్పాడు. అయితే రేటు వద్ద తేడా రావడంతో స్థలానికి సంబంధించిన డీల్ ఆగిపోయింది. అయితే ఆ స్థలంపై కన్నేసిన అలీ.. దాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పామర్రు, గుడివాడలోని ఇద్దరు విలేకరుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించాడు. వారికి అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లు సమాచారం. దీంతో వారు వీఆర్వో, తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి స్థలం అలీదేనని, సర్టిఫికెట్లు తయారు చేశారు. పిత్రార్జితం, ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం చేతులు తడిపాడు. పామర్రుకు చెందిన స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకుండా గుడివాడలో చేయించారు. పామర్రు రిజిస్ట్రార్ సైతం ఓకే చెప్పడంతో గుడివాడ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు ముగిసింది. తర్వాత ఆ స్థలాన్ని అలీ మళ్లీ పామర్రుకు చెందిన ఇద్దరికి కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడు. స్థలం కొనుగోలు చేసిన వారు సంబంధిత స్థలంలో పూజలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న స్థల యజమాని.. ఆరా తీయగా, రెండు నెలల కిందటే తమ పేర్న రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ డాక్యుమెంట్లు చూపారు. దీంతో ఉలిక్కిపడ్డ వినోద్రెడ్డి పామర్రు ఎస్ఐ అవినాష్కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. స్థలం యజమాని తనకు ఫిర్యాదు చేయగానే సంతకాన్ని పరిశీలించి.. ఫోర్జరీ చేశారని నిర్థారించుకుని వెంటనే పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పామర్రు తహశీల్దార్ భరత్రెడ్డి చెప్పారు. -
సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్
సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పని చేసిన అతడు సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. అంతేగాక ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు నవీన్ రూ.55 కోట్ల మేర మోసం చేశాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. కాగా నవీన్ రెడ్డి హీరోగా 'నో బడీ' అనే సినిమా తీసినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా అని చెబుతున్నారు. చదవండి: సడన్గా రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఫోర్జరీ కేసులో కౌంటరు దాఖలు చేయాలని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఈ మల్లికార్జునరావు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సమయంలో జారీ చేసిన నోటీసులు రెండు రోజుల క్రితమే అందాయని అయ్యన్న పాత్రుడు తరపు న్యాయవాది తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అయ్యన్నకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా పడింది. చదవండి: (ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ
-
నందకుమార్కు బెయిల్ మంజూరు.. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది. ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేలతో సహా! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్లో తలెత్తుతున్నాయి. -
మోసగాళ్లతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: హైకోర్టుతోపాటు దిగువ కోర్టుల్లో భారీగా పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దానిని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రంగంలోకి దిగారు. డబ్బు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ... అంటూ అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు. కొన్నిచోట్ల హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల పేర్లు వాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటీవల నకిలీ ఉద్యోగ నియామకపత్రాలను జారీ చేసిన మోసగాళ్లతోపాటు వారి నుంచి నియామకపత్రం పొందిన ఒక వ్యక్తిపై కూడా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన 15మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లకు, వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హెచ్చరికలు చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దంటూ అభ్యర్థులను హైకోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులు, అధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు, వారికి సహకరించేవారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల విషయంలో తప్పుడు వార్తలను, పోస్టులను వ్యాప్తి చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్సైట్ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపు మాటలు చెప్పే వ్యక్తులు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చే వారు తారసపడితే వారి గురించి హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. -
‘అయ్యన్న’ అరెస్టు
నర్సీపట్నం/ఆరిలోవ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ఫోర్జరీ కేసులో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్ను సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన నివాసానికి సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు, స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇద్దరు కుమారుల పేరుపై ఐదేళ్ల కిందట ఇళ్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు గతంలో దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేందుకు సిద్ధంకాగా అయ్యన్న కుటుంబం, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో.. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు తప్పుడు ఎన్ఓసీ సర్టిఫికెట్ సృష్టించి ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తీయకపోవడంతో కొద్దిసేపు పోలీసులు నిరీక్షించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో అయ్యన్న తనయుడు రాజేష్ బయటకు రావడం.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను ముందుగా అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు. ఇంతలో అయ్యన్నపాత్రుడు బయటకొచ్చి.. నన్ను అరెస్టుచేసేందుకు ఇంతమంది రావటం అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టుగల కారణాలు తెలియజేస్తూ నోటీసును అయ్యన్నపాత్రుడికి పోలీసులు అందజేశారు. దీనిపై అయ్యన్న, సీఐడీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు నోటిసుపై సంతకం చేశారు. అరెస్టుచేసి ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తుండగా నోటీసును తన చేతికిస్తేనే వస్తానని అయ్యన్నపాత్రుడు మెలిక పెట్టారు. పోలీసులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి విశాఖకు తరలించారు. మరోవైపు.. శాంతియాత్ర పేరుతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా ఇక నర్సీపట్నంలో అరెస్టుచేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్లను పైనాపిల్ కాలనీలో ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని కొంతసేపు హైడ్రామా నడిపారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్గోపాల్తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక మధ్యాహ్నం వరకు అక్కడే విచారించిన సీఐడీ అధికారులు 2.30 గంటలకు అయ్యన్నతో పాటు కుమారుడు రాజేష్ను వైద్య పరీక్షలు నిమిత్తం సింహాచలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సా.4.30 గంటలకు విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించిన కోర్టు సా.5.40 గంటలకు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వారిని పోలీసులు హాజరుపరిచారు. అయ్యన్న, అతని కుమారుడు రాజేష్లపై రిమాండ్ రిపోర్టును ఏపీపీ ఆదినారాయణ ద్వారా సీడీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన కేసుతో పొంతనలేదని జడ్జి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41ఎ నోటీసులు అందజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈఈ ఫిర్యాదుతో ‘ఫోర్జరీ’ వెలుగులోకి.. ఇక చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబీకులు 2017లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి కోసం అదే ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో (సెటిల్మెంట్ డీడ్ నెం–3660 ఆఫ్ 2017) సర్వే నెంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరారు. దక్షిణం, పశ్చిమం వైపునకు పంట కాలువ ఉన్నట్లు ప్లాన్లో చూపించారు. అయితే, నిర్మాణ సమయంలో ఈ కాలువను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్ఓసీని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్జికార్జునరావు సంతకంతో ఇచ్చినట్లుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన సదరు ఈఈ.. ఎన్ఓసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాక.. దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదన్న సంగతి ఆయనకు స్పష్టమైంది. అదే విధంగా కోర్టుకు సమర్పించిన ఎన్ఓసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాకపోవడంతో ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఈఈ మల్జికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు. ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనే అని తెలిపారు. మరోవైపు.. కార్యాలయం సీల్ కూడా తమది కాదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెప్టెంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్ఓసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. ఫోర్జరీ కారణంగానే అరెస్టు చేశాం : సీఐడీ డీఐజీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి నకిలీ ఎన్ఓసీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్లను గురువారం అరెస్టుచేసినట్లు సీఐడీ విభాగం డీఐజీ సునీల్నాయక్ వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ స్థలం కబ్జా, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్లపై నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.మల్లికార్జునరావు ఫిర్యాదు చేశారని చెప్పారు. దాంతో సెక్షన్లు 464, 467, 471, 474, 120 (బి), 34 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఫోర్జరీ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సునీల్నాయక్ తెలిపారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్లను అరెస్టుచేశామన్నారు. మిగిలిన నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. -
పార్టీ యాక్టివ్గా లేకపోయేసరికి వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నార్సార్!
పార్టీ యాక్టివ్గా లేకపోయేసరికి వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నార్సార్! -
ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్లోని ఖరీదైన అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్నగర్ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్ రిసిప్ట్లను కూడా తయారు చేశారు. 2020లో సిటీ సివిల్ కోర్టులో స్పెషల్ పర్ఫార్మాన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ పిటిషన్ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్ కొటేచా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్ కొటేచా జూలైలో హైదరాబాద్కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా వాటిల్లో రోనక్ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు తనను అరెస్ట్ చేయకుండా నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్కు జేసీ ప్రభాకర్రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
సాక్షి, ఏలూరు: నకిలీ గ్యారంటీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు, జనసేన నేత గుండా జయప్రకాష్నాయుడు చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తోంది. తప్పుడు గ్యారంటీలతో తెలంగాణ మత్స్యశాఖలో చేపల, రొయ్య పిల్లల సరఫరా టెండర్లను ఆయన దక్కించుకోగా పరిశీలన సమయంలో ఫిర్యాదులు రావడంతో క్షుణ్ణంగా విచారిస్తే ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఈ ఉదంతంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రే గింది. మార్పు కోసం, ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ అంటూ హడావుడి చేసే జనసేన నేతల్లో కొందరు పార్ట్టైంగా ఇలా ఫోర్జరీ వ్యవహారాలు సాగిస్తున్నారు. టెండర్ల కోసం అడ్డదారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు అతని అనుచరులపై తెలంగాణ ప్రభు త్వం సీరియస్గా దృష్టి సారించింది. తెలంగాణ మత్స్యశాఖ రెండు నెలల క్రితం ఆ రాష్ట్రంలోని చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి రూ.113 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. ఈ క్ర మంలో జయప్రకాష్నాయుడు జనసేన స్థానిక నే తలు, అతని అనుచరులు కరింశెట్టి వీరవెంకట సత్యనారాయణ, మద్దాల గణేష్, గంధం కేశవరావు తదితరులు 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేశారు. టెండర్లు ఖరారు అయిన క్రమంలో బ్యాంకు గ్యారంటీ, పెర్ఫార్మెన్స్ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్లు తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: (ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ) అయితే వీరు పాలకొల్లులోని ఓ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకుని వాటి విలువలను భారీగా పెంచి, బ్యాంకర్ల సంతకాలు, బ్యాంకు స్టాంపులు అన్ని వారే సొంతంగా తయారు చేసుకుని నకి లీ పత్రాలను తెలంగాణ మత్స్యశాఖకు సమర్పించా రు. వీటిపై అక్కడ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయా దవ్ విచారణకు ఆదేశించడంతో వ్యవహారం బయటపడింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని మోసం చేయడంపై మత్స్యశాఖ సీరియస్ అయి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. జనసేన నేతల్లో కలకలం జయప్రకాష్నాయుడు వ్యవహారం జనసేన నేతల్లో కలవరం పుట్టిస్తోంది. టెండర్ రద్దయి క్రిమినల్ కేసులుగా వ్యవహారం మళ్లిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. 12 జిల్లాల్లో టెండర్లు దక్కించుకుని సుమారు రూ.8 కోట్ల మేర నకిలీ బ్యాంకు గ్యారంటీలను సృష్టించడం కలకలం రేపింది. స్థానికంగా తోటి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేపీ నాయుడుపై గతంలోనూ స్థానికంగా చెక్బౌన్స్, భూకబ్జా, సెంటున్నర భూమికి సంబంధించి వివాదం, వీరవాసరంలో ఓ అధ్యాపకుడిపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి కేసులు నమోదైనట్టు సమాచారం. క్రిమినల్ కేసుల దిశగా.. పాలకొల్లులో జేపీ నాయుడు అండ్ టీం తీసుకున్న బ్యాంకు గ్యారంటీలను, వివరాలను తెలంగాణ అధికారులు సేకరించారు. బ్యాంకర్ల నుంచి తీసుకున్న మొత్తం లక్షల్లో ఉండగా కోట్లల్లో గ్యారంటీ సమర్పించారు. దీనిపై తె లంగాణ ప్రభుత్వం సదరు పాలకొల్లులోని బ్యాంకు నుంచి వివరాలు తీసుకుని నకిలీగా నిర్ధారించారు. ఫోర్జరీ, చీటింగ్ ఘటనలు ఉండటంతో క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీలుగా ఫిర్యాదు చేశారు. -
ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జన సేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. -
నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ యజమాని తల్లిదండ్రుల పేరుతో ఉన్న ఇంటిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ అధికారులు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెల్లాపూర్కు చెందిన విజయ్కుమార్ సాఫ్ట్వేర్ సంస్థ నిర్వహిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులకు నల్లకుంటలో ఇల్లు ఉంది. దానికి ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను, ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే నివసించిన విజయ్ తల్లిదండ్రులు కోవిడ్ నేపథ్యంలో కుమారుడి వద్దకే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇంటిపై కన్నేసిన నాగ నాయక్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ముఠా కట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.2 కోట్ల విలువైన ఆ ఇంటిని రూ.75 లక్షలకు అమ్మేశారు. ఇంటిని ఖరీదు చేసుకున్న వారు జీహెచ్ఎంసీలో మ్యూటేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేసుకున్నారు. ఇవేమీ తెలియని విజయ్ ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ను ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నించారు. దీనికోసం పీటిన్ ఎంటర్ చేయగా... ఆ ఇల్లు బత్తిని భాస్కర్గౌడ్, బత్తిని భువనేశ్వరీ పేర్లతో ఉన్నట్లు కనిపించింది. వెబ్సైట్లోనే లభించిన నెంబర్కు ఫోన్ చేయగా భాస్కర్ మాట్లాడారు. తమకు కొడవత్ నాగ నాయక్ అనే వ్యక్తి ఇంటిని విక్రయించాడంటూ అతడి నెంబర్ ఇచ్చారు. అతడికి ఫోన్ చేయగా తన తండ్రి కొడావత్ సూక్య ద్వారా వచ్చిన ఆ ఆస్తిని భాస్కర్కు విక్రయించానని, 1978లో మీ తల్లి మాకు అమ్మిందంటూ చెప్పాడు. దీంతో బాధితుడు ఇదంతా అవాస్తవమని, మా తల్లి ఎవరికీ విక్రయించలేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ దామోదర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నాగ నాయక్ సూత్రధారని, మరికొందరు సహకరించినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నాగ నాయక్పై వాడపల్లి పోలీసుస్టేషన్ ఓ డబుల్ మర్డర్ కేసు ఉందని, అందులో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: హీటెక్కిన స్టేట్..!) -
పోలీసులకు చిక్కిన హుండీల దొంగ
అచ్యుతాపురం(అనకాపల్లి): చిన్న చిన్న ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అచ్యుతాపురం పోలీసులకు గురువారం చిక్కాడు. ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా సంచరిస్తున్న అప్పలరాజును పోలీసులు విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. విశాఖ జ్ఞానపురానికి చెందిన అప్పలరాజుపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న అచ్యుతాపురం మండలంలోని ఉప్పవరం ఆంజనేయస్వామి ఆలయంలో రూ.9వేలు, ఫిబ్రవరి 23న మునగపాక మండలం టి.సిరసపల్లి వీరభద్రస్వామి ఆలయంలో రూ.6వేలు, మే 21న పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేలు, మే 25న సబ్బవరం మండలం జోడుగుళ్లు ప్రాంతంలో బంగారమ్మతల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు విచారణలో రాబట్టారు. అప్పలరాజు రాత్రి వేళల్లో మద్యం సేవించి చిన్న ఆలయాల్లో హుండీలు లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇతనిపై విశాఖనగరంలో 20 కేసులు ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. నాపై తప్పుడు కేసు... విచారణ చేయండి’ మాకవరపాలెం : తనపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కొత్తపాలెం గ్రామానికి చెందిన యాకా లోవరాజు పోలీసులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశాడు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ లోవరాజుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం లోవరాజు విలేకరులతో మాట్లాడాడు. తహసీల్దార్ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని తెలిపాడు. నిర్వాసిత కాలనీలో పట్టా కోసం అధికారులను కోరగా అప్పట్లో పనిచేసిన వీఆర్వో రూ.80వేలు అవుతుందని చెప్పడంతో మొదట రూ.10 వేలు ఇచ్చానన్నాడు. అనంతరం రూ.70వేలు సిద్ధం చేసుకోవాలని చెప్పగా నగదు పట్టుకుని వెళ్లానన్నాడు. వీఆర్వో తహసీల్దార్ ఇంటికి తీసుకెళ్లి నగదు తీసుకుని పట్టా ఇచ్చినట్టు తెలిపాడు. తీరా ఇప్పుడు ఈ పట్టా నకిలీదని, తానే సృష్టించానని తహసీల్దార్ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్ రాణీ అమ్మాజీని వివరణ కోరగా నగదు తీసుకున్నట్టు చెబుతున్న వీఆర్వో కన్నయ్య మరణించాడని, పట్టా తాను ఇవ్వలేదన్నారు. అది నకిలీ పట్టా కావడంతోనే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినట్టు తెలిపారు. (చదవండి: హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్) -
ఫోర్జరీ కేసు కీలక మలుపు
అనంతపురం క్రైం: కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసు కీలక మలుపు తిరిగింది. పుట్టపర్తికి చెందిన ప్రధాన నిందితుడు మహబూబ్బాషా గురువారం అనంతపురంలోని అడిషినల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాక్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వన్టౌన్ పోలీసులు మహబూబ్బాషాను రిమాండ్కు తరలించారు. అలాగే కమ్మూరు వీఆర్ఓ లక్ష్మీనారాయణచౌదరిని కూడా పోలీసులు రిమాండ్కు పంపారు. 11 రోజుల తర్వాత ప్రత్యక్షం : కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసులో కీలక నిందితుడు మహబూబ్బాషా 11 రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. గత నెల 23న కూడేరు తహసీల్దార్ శ్రీనివాసులు కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసిన మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వన్టౌన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్గా పరిగణించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులను ఆదేశించారు. ఈ క్రమంలో డీఎస్పీ పార్టీతో పాటు వన్టౌన్ తదితర బృందాలు అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆఖరికి నిందితుడే పక్కా ప్లాన్తోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. కస్టడీకి కోరే అవకాశం : కీలక నిందితుడైన మహబూబ్బాషాను వన్టౌన్ పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. మహబూబ్బాషా గతంలోనూ ఇలాంటి ఫోర్జరీ సంతకాలు చేశారని, ఈ కేసులో అతనికి రెవెన్యూ సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. (చదవండి: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
నా సంతకం ఫోర్జరీ చేశారు.. పోలీసులకు రామ్గోపాల్ వర్మ ఫిర్యాదు
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా ఇష్టం’సినిమాకు సంబంధించిన లెటర్ రేట్పై నట్టి ఎంటర్టైన్మెంట్కు చెందిన క్రాంతి, కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. \ ‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ పోర్జరీ కేసుకు సంబంధించిన వివరాలను చెప్పి..పంజాగుట్ట పోలీసు స్టేషన్లో వారిపై రిటన్ కంప్లైంట్ ఇచ్చాను’ అని ఆర్జీవీ చెప్పారు. -
కలెక్టర్, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాల ఫోర్జరీతో భూములకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన వ్యవహారంలో కూడేరు పోలీసులు తీగ లాగితే డొంక కదులుతోంది. అనుమానితులను పుట్టపర్తి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కూడేరు మండలం కమ్మూరుకు చెందిన బోయ నారాయణప్ప పేరిట సర్వే నంబరు 525, 526లో 34.86 ఎకరాల భూమిని ఇటీవల అనంతపురం, ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాగార్జునరెడ్డి, శ్రీనాథ్రెడ్డి, మరో ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఎకరా రూ.54 లక్షల ప్రకారం అగ్రిమెంటు చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు అగ్రిమెంటు మీద ఎక్కువ ధరతో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ భూమిలో కొంత భాగానికి 1954లో మంజూరైన డీ–పట్టా భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగింస్తే మరింత ఎక్కువ ధర దక్కుతుందన్న ఆశతో ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూడేరు తహసీల్దార్, అనంతపురం ఆర్డీఓ కార్యాలయాల్లో సంతకాలు పూర్తయిన తర్వాత ఫైలు కలెక్టర్ కార్యాలయానికి చేరి ఆగిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. గతంలో కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన మహబూబ్బాషాను ఆశ్రయించారు. రూ.10 లక్షలు ఇస్తే త్వరగా చేయించి ఇస్తానని వారితో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారు కొంత మొత్తాన్ని ముట్టజెప్పడంతో వారికి మహబూబ్బాషా ఎన్ఓసీ తెచ్చిచ్చారు. దానిని చూపి వ్యాపారులు అధిక ధరకు భూమిని విక్రయించేందుకు తోటి రియల్టర్లను కలిశారు. భూమి పత్రాలతో పాటు ఆ సర్టిఫికెట్ను వాట్సాప్లో షేర్ చేశారు. అలా చక్కర్లు కొట్టిన ఆ పత్రాలు ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చేతికి చేరాయి. రెండు రోజుల క్రితం లేదన్న ఎన్ఓసీ ఇప్పుడు ఎలా వచ్చిందని ఆరా తీసిన ఆ ప్రజాప్రతినిధి చివరకు కలెక్టర్కు సమాచారం అందజేశారు. దీంతో కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్ అని నిర్ధారణ అయింది. కలెక్టరేట్లో సహకరించిందెవరు? కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్తో ఎన్ఓసీ సృష్టించిన వైనంపై కలెక్టరేట్లో మహబూబ్బాషాకు ఎవరు సహకరించారనే అంశంపై విచారణ మొదలైంది. సంబంధిత సెక్షన్లోని సిబ్బందిని పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో కీలక నిందితుడు కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్తో ఎన్ఓసీ సృష్టించిన కీలక నిందితుడు మహబూబ్బాషా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూడేరు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మహబూబ్బాషాపై అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో 420, 421, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. (చదవండి: ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...) -
పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఏకంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. వాటి ఆధారంగా నకిలీ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సృష్టించారు. దానిపై ఓ ప్రజాప్రతినిధికి అనుమానం రావడం, ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు. ప్రజాప్రతినిధికి అనుమానం రావడంతో.. సదరు ఎన్ఓసీ ఓ ప్రజాప్రతినిధి చేతికి వెళ్లింది. అంత త్వరగా ఎన్ఓసీ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ పరిశీలించి నకిలీదిగా నిర్ధారించారు. దీని సృష్టికర్తలెవరో తేల్చాలంటూ అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించారని ఆర్డీఓ కూడా నిర్ధారించారు. కంప్యూటర్ ఆపరేటర్ పనేనా? అనంతపురంలో పనిచేస్తున్న పుట్టపర్తి ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ ఎన్ఓసీని తయారు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సదరు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ హయాంలోనూ ఇలాంటి పని చేసి అప్పటి జేసీ చేతికి చిక్కినట్లు సమాచారం. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో విషయం బయటకు రాలేదు. (చదవండి: సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి) -
భూ బకాసురులు! రూ.50 కోట్ల స్థలం పై కన్ను
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలో భూ బకాసురులు మరోసారి రెచ్చిపోయారు. ఫోర్జరీ పత్రాలు, బోగస్ సర్వే నంబర్లతో బంజారాహిల్స్లోని రూ.50 కోట్ల విలువైన స్థలం కైంకర్యం చేయడానికి యత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా గుట్టురట్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి, మరికొందరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రవాస భారతీయుడైన న్యావనంది పూర్ణచందర్కు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని సర్వే నంబర్ 129/40/1లో 2,538 చదరపు గజాల స్థలం ఉంది. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ఈ స్థలంపై రేవ ఇన్ఫ్రా ఎండీ బాలా ప్రవీణ్ కన్నుపడింది. తొలుత కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి.. టి.ప్రతాప్ అనే వ్యక్తి ద్వారా నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ కొనుగోలుదారులను సృష్టించాడు. ఖదీర్ బేగం అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని వీళ్లు కొనుగోలు చేసినట్లుగా బోగస్ పత్రాలు చేశాడు. వీటితో అడ్డా కూలీలను యజయానులుగా చూపించి ఈ ప్లాట్ను రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. విషయం తెలిసిన అసలు యజమాని పూర్ణచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలీ యజమానులకు రూ.10వేలు ఈ కేసులో ఖదీర్ బేగం, ఎండీ మొయినుద్దీన్, పరాంకుశం సురేందర్, దొంతుల సుధాకర్, బాలా ప్రవీణ్, టి.ప్రతాప్, సింగిరెడ్డి వీర హనుమరెడ్డి, బూరుగు సత్యనారాయణగౌడ్, కె.హరికృష్ణారెడ్డి, దీపక్ దేశ్ముఖ్ తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చి అభియోగాలు నమోదు చేశారు. ఖదీర్ బేగం కొన్నేళ్ల క్రితమే చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. యజమానుల అవతారమెత్తిన అడ్డా కూలీలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించారని తేలింది. పి.సురేందర్, దొంతుల సుధాకర్, మొయినుద్దీన్, ముజాహిదీన్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బాలా ప్రవీణ్తోపాటు టి.ప్రతాప్ కోసం గాలిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఈ వ్యవహారం నడవడం, ఈ స్థలం నకిలీ యజమానుల పేరుతో రిజిస్ట్రేషన్ కావడం తదితర పరిణామాల నేపథ్యంలో తెర వెనుక పెద్దలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు.. రంగంలోకి దిగిన సీఎం) -
అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్పై చీటింగ్ కేసు
ఛత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన హర్ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టులో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. తాను బుందేల్ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించలేదు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా! -
భార్యకు యూట్యూబ్ చానల్.. రూ.4 కోట్ల ఆదాయం.. ఆ భర్త ఏంచేశాడంటే?
నరసరావుపే టౌన్(పల్నాడు జిల్లా): ఛీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు మంగళవారం తెలిపారు. వివరాలు.. బరంపేటకు చెందిన పోతుల విక్రమ్, లక్ష్మీజ్యోతి భార్యాభర్తలు. విక్రమ్ ఆదిత్య పేరిట లక్ష్మీజ్యోతి యూట్యూబ్ చానల్ను 2014లో నుంచి నిర్వహిస్తోంది. సుమారు ఈ చానల్కు 10 లక్షల మంది సబ్ స్క్రెబర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మీజ్యోతి హైదరాబాద్కు చెందిన వ్యాకుడ్ ఆవుట్ కంపెనీతో తన యూట్యూబ్ చానల్ ద్వారా యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భర్త విక్రమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా.. అయితే లక్ష్మీజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి వ్యాకుడ్ అవుట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భర్త విక్రమ్ రద్దు చేశాడు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతినెల వచ్చే ఆదాయాన్ని తన రెండో భార్య తమ్ముడు వావిళ్ళపల్లి సంతోష్ అకౌంటుకు మళ్లించాడు. రెండేళ్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసి దారి మళ్లించినట్లు లక్ష్మీజ్యోతి గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ను అరెస్టు చేసి అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. -
ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా
బంజారాహిల్స్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎమ్మార్పీఎస్ ముసుగులో ఓ ప్లాట్ను కబ్జా చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య, ఆమె కుమార్తెను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం జిల్లా, సుజాత నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య(96) కరోనాతో గత ఏడాది మృతి చెందాడు. అంతకుముందే ఆయన తన ఆస్తులను మొదటి భార్య వరమ్మ, ఇద్దరు కుమార్తెలకు, రెండో భార్య రుక్మిణి, మూడో భార్య దాక్షాయణికి, ఆమె కుమార్తెకు వీలునామా రాశాడు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో బీఎస్ఆర్ గోల్డెన్ ఎన్క్లేవ్లో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లో డెవలప్మెంట్లో భాగంగా రెండు ఫ్లాట్లు రాగా అందులో ఒకటి మొదటి భార్య వరమ్మ కుమార్తెలు ఉషారాణి, మంగమ్మలకు, రెండో ఫ్లాట్ను రెండో భార్య రుక్మిణమ్మకు చెందేలా వీలునామా రాశారు. మూడో భార్య దాక్షాయణికి పలుచోట్ల ఆస్తులు రాశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఏడాది వరకు ఇంట్లో ఉండటం మంచిది కాదని సిద్ధాంతి చెప్పడంతో ఉషారాణి, మంగమ్మతో పాటు ఆయన రెండో భార్య రుక్మిణమ్మ ఫ్లాట్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళారు. ఇదే అదనుగా వాటిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే మూడో భార్య కోనేరు దాక్షాయణి, ఆమె కుమార్తె ఉషారాణికి కేటాయించిన ఫ్లాట్కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. గత నెల 2న పథకం ప్రకారం ఎమ్మార్పీఎస్ అనుబంధం సంఘం రాష్ట్ర కార్యాలయం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి ఫ్లాట్ తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించారు. అదే రోజు ఫ్లాట్ యజమానురాలు ఉషారాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టి నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్ను కబ్జా చేసినట్లుగా గుర్తించి తల్లీ కూతుళ్లపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. (చదవండి: పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్సీఐ) -
పత్రాలు మార్చి..జనాన్ని ఏమార్చి..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్నాళ్లుగా సాగుతున్న భూమాఫియా అక్రమాలకు ఇదో ఉదాహరణ. అమాయకులు, స్థానికంగా లేనివారి, వివాదాలున్న స్థలాలను గుర్తించడం.. నకిలీ ఆధార్కార్డులు, తప్పుడు వ్యక్తులను చూపించి, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తూ.. స్థలాలను కాజేయడం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకులు, అడ్వొకేట్లు, అధికారులు కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. బాధితులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా లాభం ఉండటంలేదని వాపోతున్నారు. భూములపై ఆశలు వదిలేసుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో భూమాఫియా ఆగడాలు మరింతగా పెరుగుతున్నాయి. గతంలో మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో నకిలీ ఆధార్కార్డులు, వ్యక్తులతో గుట్టుచప్పుడు కాకుండా భూములను కాజేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సదరు నిందితులపై కఠిన చర్యలేమీ తీసుకోకపోవడంతో భూమాఫియా మరింతగా రెచ్చిపోతోందని.. నారాయణపేట జిల్లాలో అదే తరహా అక్రమాలకు పాల్పడిందని స్థానికులు చెప్తున్నారు. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లపై బాధితులు ఫిర్యాదులు చేస్తుండటంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ భూమి వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు అసలు యజమానులు గుర్తించేలోగా అక్రమార్కులు అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వి విధ శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. డబ్బు, రాజకీయ పలుకుబడితో అసలు యజమానులను బెదిరించి తప్పుకునేలా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సరిహద్దుల్లోని భూములే టార్గెట్.. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని జడ్చర్ల కేంద్రంగా ఓ భూ మాఫియా ముఠా తెరపైకి తీసుకొచ్చిందని.. తర్వాత ఈ ముఠా కార్యకలాపాలు మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించాయని బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీ, కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని భూములను, ముఖ్యంగా స్థానికంగా ఉండని వారి భూములను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఈ ముఠా పలువురు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ తంతు ముగిస్తోందని తెలిసింది. నారాయణపేట జిల్లాలో ఈ ముఠాకు కృష్ణా మండలం హిందూపూర్కు చెందిన ఓ దళారి అన్నీ తానై సహకరిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ, అసైన్మెంట్, కోర్టు కేసుల్లో ఉన్న భూముల రికార్డులు ఆ దళారీ వద్ద ఉన్నాయని.. వాటి ఆధారంగానే అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒకటొకటిగా వెలుగులోకి.. ∙నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా భూమిని ఇతరులకు అమ్మినట్టు భూమాఫియా రికార్డులు సృష్టించింది. దాదాపు వందేళ్లుగా సాగు చేసుకుంటున్న సదరు కుటుంబానికి తెలియకుండా.. ఇతరుల పేర్లపై భూమి రిజిస్ట్రేషన్ కావడం విస్మయం కలిగిస్తోంది. ∙గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గతంలో కొనుగోలు చేసి ఖాళీగా ఉంచిన భూములపై భూమాఫియా ముఠా కన్నేసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉ న్న భూముల వివరాలు సేకరించిన అక్రమార్కులు.. స్థానికంగా లేని వారిని గుర్తించి, వారిని పోలిన పేర్లతో ఉన్నవారితో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిం చుకున్నట్టు సమాచారం. వేర్వేరు చోట్ల సుమారు 12 ఎకరాల భూమి నలుగురి పేరిట చేతులు మారినట్టు తెలిసింది. ∙మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మసిగండ్ల శివారులో నార్య పేరు మీద సర్వే నంబర్ 180లో మూడెకరాల భూమి ఉంది. కొన్నేళ్ల కిందే ఆయన చనిపోయారు. కానీ మూడు నెలల క్రితం కొందరు ఆయన పేరుతోనే ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యవహారంలో ç రూ.30 లక్షల వరకు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అధికారులు ఆ రిజిస్ట్రేషన్ను పెండింగ్లో పెట్టినా.. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరుకి చెందిన దళిత రైతు కర్కు వెంకమ్మ (భర్త కర్కు బస్వరాజ్)కు మాగనూరు మండలం లక్ష్మీపూర్ గ్రామశివారులో మూడు సర్వే నంబర్ల పరిధిలో దాదాపు ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన ముఠా.. 2020లో సర్వే నంబర్ 55/ఈ/1లోని 2.38 ఎకరాలు, సర్వే నంబర్ 56/ఈలోని 2 ఎకరాలు కలిపి 4.38 ఎకరాల భూమిని కాజేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ అంగన్ వాడీ టీచర్ను భూయజమానిగా, నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం మల్లెపల్లికి చెందిన లింగప్పను కొనుగోలుదారుగా సృష్టించింది. నకిలీ ఆధార్కార్డులను తయారు చేసి, ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించేసింది. సర్వే నంబర్ 55/ఈ/2/1లో ఉన్న ఒక గుంట భూమి మాత్రమే వెంకమ్మ పేరిట మిగిలింది. అయితే ఇటీవల తమకు రైతుబంధు డబ్బులు రాకపోవడంతో.. వెంకమ్మ 2021 జూన్ 26న మాగనూరు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. రికార్డులను పరిశీలించిన తహసీల్దార్.. భూమిని అమ్మేశాక రైతుబంధు ఎలా వస్తుందనడంతో హతాశురాలైంది. పాములతో కరిపిస్తామని బెదిరిస్తున్నారు మక్తల్కు చెందిన ఓ అడ్వొకేటు, ఓ ప్రజాసంఘం నాయకుడు, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి మా భూమిని మాకు కాకుండా చేశారు. నా పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా లింగప్ప పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేమిటని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నరు. ఆఫ్రికా కోబ్రాలను తీసుకొచ్చి మమ్మల్ని కరిపిస్తమని భయపెడుతున్నరు. వెంటనే కలెక్టర్ పట్టించుకుని లింగప్ప పేరుతో ఇచ్చిన పట్టాదారు పాసుబుక్ రద్దు చేయాలి. మాకు న్యాయం చేయాలి.– కర్కు వెంకమ్మ–బస్వరాజ్, బాధిత రైతు దంపతులు, గుడెబల్లూరు, కృష్ణా, నారాయణపేట నన్ను కొట్టి.. పంట నాశనం చేశారు.. మాకున్న 11 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని ఏడాది క్రితం నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అప్పటి తహసీల్దార్కు డబ్బులిచ్చి పట్టా చేసుకున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన. ఇంకా తీర్పు రాలేదు. ఇటీవల నా పొలంలో వరి నాట్లు వేసుకుంటే.. కొందరు వచ్చి నన్ను కొట్టి, ట్రాక్టర్తో పంటను నాశనం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – కుర్వ బస్వరాజ్, బాధిత రైతు, తంగిడి, కృష్ణా, నారాయణపేట చీటింగ్ కేసు నమోదైంది లక్ష్మీపూర్లో కర్కు వెంకమ్మకు సంబంధించిన 4.38 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు భూయజమాని ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో దాసరి వెంకటమ్మ, లింగప్పలపై చీటింగ్ కేసు నమోదైంది. – తిరుపతి, తహసీల్దార్, మాగనూర్ -
విలువైన భూమిపై ‘సూరి’ కన్ను
సాక్షి, పుట్టపర్తి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం నగరంలో రూ. 129 కోట్ల విలువైన 6.35 ఎకరాల స్థలంపై కన్నేశారు. నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఈ స్థలం ఉంది. ఇక్కడ సెంటు రూ.20 లక్షలకు పైనే. అత్యంత విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో భూమి తనదని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తన కుమారుడు, అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సూరి అనుచరులు భూమి అసలు హక్కుదారులను ఖాళీ చేయాలంటూ బెదిరించారు. కబ్జాకు యత్నించారు. హక్కుదారుల ఫిర్యాదు మేరకు సబ్రిజిస్ట్రార్ను అధికారులు సస్పెండ్ చేశారు. సూరి కుమారుడు నితిన్సాయి, అనుచరుడు రాజుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప 1929లో గుండూరావు నుంచి 301 సర్వే నంబర్లో 7.77 ఎకరాలు కొని, పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు ఇచ్చారు. 1935లో బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే.. దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అంటూ 1985 నవంబర్ 19 తేదీతో అన్రిజిస్టర్డ్ వీలునామా సృష్టించారు. 1929 నాటికే గుండూరావు పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయస్సు 116 సంవత్సరాలు. ఇంత వయస్సు ఉన్న వ్యక్తితో అన్ రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారన్నది ప్రశ్నార్థకం. 2018లో 301–3 సర్వే నంబర్తో 4.46 ఎకరాలు మాలతేష్ పేరిట వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. దీనిపై రాళ్లపల్లి వంశస్తులు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. మాలతేష్ సమర్పించిన వీలునామా ఫోర్జరీ అని ఆర్డీవో ధ్రువీకరించారు. వెబ్ల్యాండ్ నుంచి మాలతేష్ పేరు తొలగించారు. రాళ్లపల్లి వంశస్తుల పేర్లు నమోదు చేశారు. 1933లో రాళ్లపల్లి వంశస్తులు ఆస్తి పన్ను చెల్లించిన పత్రాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ మాలతేష్ సర్వే నంబర్ 301ను 301–3గా చూపించి నితిన్ సాయి ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వరదాపురం సూరి కుమారుడు గోనుగుంట్ల నితిన్సాయి పేరు మీద 4.30 ఎకరాలు, సూరి అనుచరుడు, ధర్మవరానికి చెందిన యంగలశెట్టి రాజు పేరిట 2.05 ఎకరాల స్థలాన్ని 2021 డిసెంబర్ 23న రిజిస్ట్రేష¯Œ చేశారు. నితిన్సాయి రూ.6 కోట్లు, రాజు రూ.1.50 కోట్లకు కొన్నట్లు చూపారు. వాస్తవానికి రాళ్లపల్లి వంశస్తుల వద్ద ప్రస్తుతం 3.57 ఎకరాలే ఉంది. వారి భూమిలో కొంత గతంలోనే వేరే వారికి అమ్మారు. 1982లో కొంత లేఅవుట్ వేశారు. మునిసిపాలిటీకి ఆస్తిపన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ సూరి కుమారుడు, అనుచరుడి పేరిట 6.35 ఎకరాలు మాలతేష్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో మునిసిపల్ కార్పొరేషన్ 80 అడుగుల రోడ్డుకు సేకరించిన 0.66 ఎకరాల స్థలం, వార్డు సచివాలయమూ ఉన్నాయి. వెబ్ల్యాండ్లో మాలతేష్ పేరుపై భూమి లేకపోయినా, అన్ రిజిస్టర్డ్ వీలునామాకు ఎలాంటి విశ్వసనీయత లేనప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్, వరదాపురం సూరిది ఒకే ఊరని, అందువల్లే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే విమర్శలున్నాయి. అనంతరం సూరి అనుచరులు ఆ భూమి తమకు అప్పగించాలని రాళ్లపల్లి వంశస్తులను బెదిరించారు. ఈ వ్యవహారంపై రాళ్లపల్లి వంశస్తులు ఫిర్యాదు చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఆదివారం అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డీఆర్వో నేతృత్వంలో విచారణకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చర్యలు తీసుకుంటాం – గాయత్రీదేవి డీఆర్వో, అనంతపురం ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యుల్లో ఒకరు నివేదిక ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వెబ్ల్యాండ్లోకి ఎక్కించారని, వెంటనే తొలగించామని ఆర్డీవో చెప్పిన విషయాలను నివేదికలో పొందుపరిచారు. మరొక అధికారి నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. -
లోను కోసం వెళితే.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యి..
సాక్షి,హిమాయత్నగర్: అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో..లోను తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన నగర వాసికి దిమ్మతిరిగే నిజం తెలిసింది. మీ పేరుపై, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్పై ఆల్రెడీ లోను ఉంది మళ్లీ ఇంకొకటి ఎలా ఇస్తారనడంతో..నగర వాసికి తేరుకోవడానికి గంట సమయం పట్టింది. గుర్తు తెలియని వ్యక్తుల తన పేరుతో రూ. 11.70 లక్షల రుణం పొందారంటూ.. తనకు న్యాయం చేయాలని బుధవారం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు చాదర్ఘట్ వాసి రాము. వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండటంతో.. రాము చాదర్ఘట్లోని ఎస్బీఐకి వెళ్లాడు. పాన్కార్డ్, ఇంటిపత్రాలు, తదితర డాక్యుమెంట్స్ను లోను సెక్షన్ వారికి ఇచ్చాడు. వారి వెరిఫికేషన్లో గత ఏడాది లోను తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం రాముకు లోను సెక్షన్ వాళ్లు చెప్పడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ప్రమేయం లేకుండా అంత డబ్బు లోను ఎవరు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆ«ధారాలతో సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
కోవిడ్ బీమాలో కేటుగాళ్లు’.. సర్టిఫికెట్ల ఫోర్జరీ నిజమే!
కారేపల్లి: కోవిడ్ బీమా సొమ్ము స్వాహా చేసేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు, నకిలీ చికిత్స బిల్లులు సమర్పించిన కేటుగాళ్ల బండారం బయటపడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండా, మేకలతండా గ్రామాల్లోని 800 మంది కి బీమా చేయించాక సుమారు 500 మందికి కరోనా సోకినట్లు సమీప మహబూబాబాద్ జిల్లా గార్ల సీహెచ్సీ నుంచి తీసుకున్నట్లు ఉన్న సర్టిఫికెట్లు సమర్పించగా, 90 మందికి బీమా క్లెయిమ్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ విషయమై ‘కోవిడ్ బీమాలో కేటుగాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఎస్బీఐ లైఫ్ కోవిడ్ రక్షక్ బీమా పథకంలో వందలమంది పేర్లను ఆన్ లైన్ చేసిన స్థానిక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడిని మంగళవారం కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై బీమా సంస్థ ప్రతినిధు లుకానీ, దళారుల చేతిలో మోసపోయినవారు కానీ ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కుశకుమార్ తెలిపారు. గార్ల సీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రాణాప్రతాప్ ను వివరణ కోరగా, తమ సీహెచ్సీ నుంచి జారీ అయినట్లుగా చెబుతున్న సర్టిఫికెట్లపై ఆస్పత్రి నకిలీ స్టాంప్, ఫోర్జరీ సంతకం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 30కిపైగా సర్టిఫికె ట్లతో బీమా సంస్థ ప్రతినిధులు సంప్రదించగా, తన సంతకం ఫోర్జరీ అయినట్లు చెప్పానని వివరించారు. పత్రికలకథనాలతో పదిమంది ముఠాసభ్యులు పరారయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ట్యాంపరింగ్.. బీ'కామ్'గా మార్చేశాడు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికెట్తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రికార్డులను ట్యాంపర్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ ఆయన తప్పుడు విద్యార్హతను పేర్కొన్నారు. ఈయన విద్యార్హతపై అభ్యంతరాలు తెలుపుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది. గతంలో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. అంతేకాదు.. అశోక్బాబును ఎమ్మెల్సీగా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బి. మెహర్కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆయన బండారం బట్టబయలైంది. లోకాయుక్త ఆదేశాలతో అశోక్బాబుపై సెక్షన్–477ఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. సర్వీసు రిజిస్టర్లో ట్యాంపర్ చేసింది ఇలా.. నిజానికి.. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్బాబు విద్యార్హత ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. లోకాయుక్తలో వేసిన కేసులోని వివరాల ప్రకారం.. అశోక్బాబు డి.కాం (డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేశారు. ఆ అర్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా చేరి సీనియర్ అసిస్టెంట్ అయ్యారు. అనంతరం ఆయన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్పై కన్నేశారు. కానీ, అక్కడ పోస్టింగ్ పొందాలంటే డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. దాంతో తన సర్వీసు రిజిస్టర్లోని విద్యార్హత కాలమ్లో ఉన్న డీ.కాం.ను ట్యాంపర్ చేసి బీ.కాం.గా దిద్ది బురిడీ కొట్టించారు. ఇంగ్లీష్ అక్షరం ‘డీ’ని ట్యాంపర్ చేసి ‘బీ’గా మార్చారు. ఆ విధంగా తప్పుడు సమాచారంతో ఆయన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారు. దీనిపై ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కేసులు సుదీర్ఘకాలం పెండింగ్లోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్బాబు సహచర ఉద్యోగుల ప్రయోజనాలకంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. 2013–14లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ మద్ద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇక అదే ఏడాదిలో నాటి సీఎం చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో అశోక్బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు పెండింగ్లో లేవని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ, విద్యార్హత విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన కేసు అప్పటికే పెండింగ్లో ఉంది. దీనివల్ల స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం అనుమతించకూడదు. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అశోక్బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ అఫిడవిట్లోనూ అసత్యాలే.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్లోనూ అశోక్బాబు అసత్య సమాచారాన్నే పేర్కొన్నారు. తన విద్యార్హత బి.కాం.గా పేర్కొన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సమయంలో తనపై కేసులు పెండింగ్లో లేవన్న ఆయన.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు సమయంలో మాత్రం తనపై పెండింగ్లో ఉన్న కేసులను చెప్పడం గమనార్హం. దీంతో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన డొంక ఈ నేపథ్యంలో.. బి. మెహర్కుమార్ ఫిర్యాదుతో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి లోకాయుక్త సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. సమగ్రంగా విచారించేందుకు ఈ కేసును సీఐడీకి అప్పగించాలని 2021 ఆగస్టులోనే ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అశోక్బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని కోరింది. లోకాయుక్త ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ శాఖ జాయింట్ కమిషనర్ గీతా మాధురి ఈ అంశంపై అధికారికంగా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త తీర్పును అనుసరించి పూర్తి సాక్ష్యాధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడంతో ఈ కేసులో పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే
కొవ్వూరు: ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే అప్పుల ఊబిలో ముంచేసిన వ్యవహారం.. ఇందుకు పలువురు బ్యాంకు అధికారుల సహకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన ఘటన ఇది. ఈ బాగోతంలో రూ.15 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందులో పాత్రధారులుగా అనుమానిస్తున్న ముగ్గురు బ్యాంకు మేనేజర్లు, ఒక ఫీల్డ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాధితుడు గద్దె జయరామకృష్ణ గత డిసెంబర్ 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఇది వెలుగుచూసింది. ఈయన చెప్పిన వివరాల ప్రకారం.. కథ ఇలా మొదలైంది.. 2018లో జయరామకృష్ణ ఢిల్లీలోని తన కుమార్తె వద్దకు వెళ్లే సమయంలో తన వద్దనున్న బంగారు ఆభరణాలు, పలు దస్తావేజులను బ్యాంకు లాకర్లో పెట్టాలని భావించారు. కానీ, స్నేహితుడైన కవల వెంకటనరసింహంతో ఈ విషయమై చర్చించగా ఆయనిచ్చిన భరోసాతో వాటిని వెంకటనరసింహం దగ్గరే భద్రపరిచారు. పదిరోజుల్లో తిరిగొచ్చాక నిందితుడు ఆభరణాలు తిరిగి ఇచ్చేయగా దస్తావేజులను మాత్రం లాకర్లో ఉన్నాయంటూ కాలయాపన చేశారు. ఈలోగా 2018 చివరి నుంచి 2019 వరకు పలుమార్లు ఎస్బీఐకి చెందిన వివిధ బ్రాంచ్ల నుంచి జయరామకృష్ణ ప్రమేయం లేకుండా ఆయన దస్తావేజులు పెట్టి ఆయన పేర్లతోను, వివిధ వ్యక్తుల పేరుతోను వెంకటనరసింహం రుణాలు తీసుకున్నారు. కొన్ని రుణాలను జయరామకృష్ణ, ఆయన భార్య శ్రావణిని గ్యారంటీగా పెట్టి కూడా తీసుకున్నారు. మరికొన్ని వారి సంతకాలు ఫోర్జరీచేసి రుణాలు తీసుకున్నారు. ఇదే విధంగా కొవ్వూరు సమీపంలోని ప్రక్కిలంక ఎస్బీఐ శాఖలోనూ రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఆస్తుల విలువను మార్కెట్ ధర కంటే ఎక్కువగా చూపించి రుణాలు పొందారు. ఇలా మొత్తం మీద రూ.15కోట్లకు పైగా పక్కదారి మళ్లించినట్లు సమాచారం. చివరికి ఈ రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. వారు రాజమండ్రిలోని బాధితుడి ఫ్లాటుని సీజ్ చేసి స్థలాల వద్ద నోటీసులు పెట్టారు. కానీ, వెంకటనరసింహానికి, తమకు ఏ వ్యాపార లావాదేవీలు లేవని.. కేవలం స్నేహంతో నమ్మకం మీద దస్తావేజులు ఆయనకిస్తే ఇలా మోసం చేశారని జయరామకృష్ణ అన్నారు. ఈ రుణాలకు, తమకు ఏ విధమైన సంబంధంలేదని ఆయన చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు కొవ్వూరు పట్టణ పోలీసులు 564/2021 అండర్ సెక్షన్–406, 419, 420, 465 ఐపీసీ కింద వెంకటనరసింహంపై కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కవల వెంకటనరసింహం అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు స్వయానా అల్లుడు. కానీ.. ఈ కేసుకు, తన తండ్రి సోము వీర్రాజుకు ఎలాంటి సంబంధంలేదని ఆయన పెద్ద కుమార్తె సూర్యకుమారి స్పష్టంచేశారు. రాజకీయ దురుద్దేశంతో తన తండ్రి పేరును ఈ కేసులో ప్రస్తావిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల నుంచి డాక్యుమెంట్లతో కూడిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ చెప్పారు. అప్పట్లో పనిచేసిన బ్యాంకు అధికారులకు నోటీసులు పంపి విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3.60 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే మొత్తం రుణాల మొత్తం తెలుస్తుందన్నారు. -
మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో సంచలనం రేపిన ఫోర్జరీ ఎఫ్ఐఆర్ (సృష్టించిన కాపీ) కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. 255/2020 నంబరుతో రెండు ఎఫ్ఐఆర్లు బయటికి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ రోజు స్టేషన్లో జరిగిన మరో ఆసక్తికర పరిణామం పోలీసుల అనుమానాస్పద వైఖరిని బలపరిచేలా ఉందని తెలిసింది. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఎస్సై వ్యవహరించిన తీరు అనుమానాలకు బీజం వేసిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2020 సెప్టెంబరు 9వ తేదీన స్టేషన్కు వచ్చిన నల్లగొపు శ్రీనివాస్పై ఎఫ్ఐర్ నంబరు 255/2020తో ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని బాధితునికి ఇచ్చారు. అది చూసి కంగారుపడిపోయిన బాధితుడికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు అరెస్టు చేస్తున్నామని, వైద్యపరీక్షలకు సిద్ధంగా ఉండాలని అప్పటి ఎస్సై, సీఐ బాధితుడిని భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరిపోయిన శ్రీనివాసరావు ఇల్లు విక్రయించేందుకు సమ్మతించాడు. దీంతో అరెస్టు చేయడంలేదని, పిలిచినపుడు కోర్టుకు రావాలని ఎస్సై, సీఐలు సూచించడంతో ఎఫ్ఐఆర్ కాపీతో బాధితుడు ఇంటిదారిపట్టాడు. మళ్లీ స్టేషన్కి పిలిపించి.. వాసన చూసి బాధితుడు కాపీతో సహా ఇంటికి వెళ్లడంతో కంగారుపడిపోయిన ఎస్సై అతన్ని, ఎఫ్ఐఆర్కాపీని తీసుకురావాల్సిందిగా ఓ వ్యక్తిని పురమాయించాడు. అతడు శ్రీనివాస్ని వెంటబెట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చాడు. అక్కడ బాధితుడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని హడావుడిగా తీసుకున్న ఎస్సై దాన్ని ముక్కువద్ద పెట్టుకుని వాసన చూశాడు. ఇది చూసి శ్రీనివాసరావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో ఎస్సై... ఏరా..? దీన్ని కార్బన్కాపీ (జిరాక్స్) తీశావా? అని అరిచాడు. ‘అలాంటిదేమీ లేదు’’ అని శ్రీనివాస్ సమాధానమిచ్చాడు. ఆ జవాబు విని ఊపిరిపీల్చుకున్న ఎస్సై.. ఒకవేళ ‘జిరాక్స్ తీసి ఉంటే కొంపలు అంటుకుపోయి ఉండేవి’’ అని వ్యాఖ్యానించాడు. ఎస్సై మాటలతో శ్రీనివాసరావు మనసులో అనుమానం బీజం నాటుకుంది. కానీ, అప్పటికే అతను ఒక కాపీని జిరాక్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఎస్సై కోపం చూసి.. ఆ విషయం అతనితో చెప్పలేకపోయాడు. వాస్తవానికి జిరాక్స్ తీసిన కొద్దిసేపటి వరకు ఆ కాగితాలపై కార్బన్పౌడర్ అంటి ఉంటుంది. తీసిన కొద్దిసేపటి వరకు దాని వాసన చూసి ఆ విషయాన్ని గ్రహించవచ్చు. కానీ, అప్పటికే జిరాక్స్ తీసి చాలాసేపు అవుతుండటంతో ఎఫ్ఐఆర్ కాపీపై కార్బన్ వాసనను ఎస్సై గ్రహించలేకపోయాడు. ఏడాది దాటుతున్నా.. తనను కోర్టుకు పిలవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు శ్రీనివాసరావు ఇటీవల ఓ లాయరును ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఇది చాలా తీవ్ర ఆరోపణ: సీపీ సత్యనారాయణ ఈ కేసులో వచ్చిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఒకే నంబరుపై రెండు ఎఫ్ఐఆర్లు ఉండనే ఉండవు. అందులోనూ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ రద్దు అనేది పూర్తిగా అవాస్తవం. ఆ హక్కులు పోలీసులకు ఉండవు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ఫిర్యాదుదారులు, నిందితులు, సిబ్బందిని పిలిపించాం. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
అభ్యర్థి సంతకాలు ఫోర్జరీ చేశారంటూ టీడీపీ నాటకాలు
-
అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు ఛేదించారు. నకిలీ పత్రాలతో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములను తన తండ్రి పేరుతో ఆన్లైన్ చేయించిన మాజీ వీఆర్వో బాగోతాన్ని బట్టబయలు చేశారు. 13 మండలాల్లోని 18 గ్రామాల్లో భూములను దర్జాగా స్వాహా చేసిన వైనాన్ని బయటపెట్టారు. అక్రమాలకు పాల్పడిన 184 గొల్లపల్లికి చెందిన మాజీ వీఆర్వో మోహన్ గణేష్ పిళ్లైని, మరో నలుగురిని అరెస్టు చేశారు. సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. యాదమరి మండలం 184 గొల్లపల్లికి చెందిన మోహన్ గణేష్ పిళ్లై వారసత్వ రీత్యా 1977లో 184 గొల్లపల్లి కరణంగా విధుల్లో చేరాడు. 1984లో గ్రామాధికారుల వ్యవస్థ రద్దు కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి 1992లో అదే గ్రామంలో వీఏవోగా ఉద్యోగం సంపాదించిన ఆయన అక్కడే 2010లో వీఆర్వోగా ఉద్యోగ విరమణ చేశాడు. ఎన్నెన్ని నకిలీ పత్రాలో.. ఈ భూముల స్వాహాకు మోహన్ గణేష్ పిళ్లై ఎన్నో నకిలీ పత్రాలు సృష్టించాడు. పుంగనూరు, బంగారుపాళెం, గుర్రంకొండ, సత్యవేడు, ఏర్పేడు, చంద్రగిరి, చిత్తూరు, సోమల, పెద్దపంజాణి, యాదమరి, కేవీపల్లె, రామచంద్రాపురం, తంబళ్లపల్లి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి కాజేశాడు. నిందితులు అక్రమంగా తయారు చేసిన రబ్బరు స్టాంప్, నకిలీ దస్తావేజులు ► తన తల్లి అమృతవల్లి యావదాస్తిని మరణానంతరం మనుమలు, మనమరాళ్లకు చెందేలా 1985 ఆగస్టు 16న వీలునామా రాసి చనిపోయినట్లు బంగారుపాళెం సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్టర్ చేయించాడు. ► 2005 నుంచి 2010 వరకు గ్రామ అడంగళ్లను కంప్యూటరీకరణ చేసే సమయంలో చిత్తూరు కలెక్టరేట్ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) ద్వారా 18 గ్రామాలకు సంబంధించిన అడంగళ్లలోని భూముల వివరాలను ఎల్ఆర్ఎంఐఎస్ (ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదు చేయించాడు. 13 మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో తన తండ్రి శ్రీనివాస పిళ్లైకి 2,320 ఎకరాల భూములు ఉన్నట్లు తన కుమారుడు మధుసూదన్ సహకారంతో 2009 జూలై 1న ఆన్లైన్ చేయించాడు. ► ఆ భూ హక్కులను ఆయన తల్లి అమృతవల్లి పేరిట 1981లో బదిలీ చేస్తున్నట్లుగా ఒక హక్కు విడుదల పత్రం సృష్టించాడు. ► ఆ పత్రం అసలైనదేనని నమ్మించేందుకు పుంగనూరు జమీందారు నుంచి ఖాళీగా ఉన్న పట్టా కాగితాన్ని సేకరించి అందులో తమ పూర్వీకుల పేర్లు నమోదు చేశాడు. ► ఆ భూములకు పన్ను చెల్లించినట్లు నకిలీ రసీదులు తయారు చేయించాడు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఖాళీ రసీదులను సేకరించి, వాటిపై పన్ను చెల్లించినట్లు సృష్టించాడు. ► చిత్తూరు కలెక్టరేట్లోని రెవెన్యూ రికార్డులు (అడంగల్) తెప్పించి కంప్యూటరీకరణ చేయించుకున్నాడు. ► కొట్టేసిన భూములను విక్రయించేందుకు టీడీపీ నాయకుడు అడవి రమణ సహకారం తీసుకున్నాడు. ► మీ సేవ ద్వారా 1బి, అడంగల్ను తీసుకుని ఆయన పిల్లలు రాజన్, ధరణి, మధుసూదన్ సోమల తహసీల్దార్ శ్యాంప్రసాద్రెడ్డిని కలిశారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామ సర్వే నంబరు 459లో తమకు ఉన్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ► రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అధికారులు 459 సర్వే నంబర్లో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని గుర్తించారు. 160.09 ఎకరాల భూమి ఆన్లైన్లోకి ఎలా వచ్చిందని కూలంకషంగా పరిశీలించడంతో అడ్డగోలు రికార్డులు బయటపడ్డాయి. ► దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు గత ఏడాది మే 29న సోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ డీఎస్పీ జి.రవికుమార్ విచారణ కోసం ఎస్ఐ అన్సర్ బాషా, ప్రభాకర్, పుష్పలత, రవిచంద్రలను నియమించారు. సీఐడీ దర్యాప్తులో మాజీ వీఆర్వో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులైన మోహన్ గణేశ్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్టు చేశారు. -
రెవెన్యూలో ఫోర్జరీ కలకలం
వికారాబాద్: ఓ ఫోర్జరీ కేసు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గుపల్లి వద్ద సర్వే నంబర్ 18లో హైదరాబాద్కు చెందిన ఇంతియాజ్కు 7.12 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన ఖలీల్ అనే వ్యక్తికి విక్రయించినట్లు కొందరు రియల్టర్లు, బ్రోకర్లు ఆర్డర్ కాపీ తయారు చేయించారు. గతంలో వికారాబాద్లో పనిచేసి వెళ్లిన తహసీల్దార్ అప్పలనాయుడు ఈ ఆర్డర్ ఇచ్చినట్లు ఫోర్జరీ కాపీ సృష్టించారు. తహసీల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తించే మజ్జు అనే ఉద్యోగికి వారు ఈ కాపీ అందజేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్ రవీందర్ కళ్లుగప్పి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో.. ఆధార్ సీడింగ్లో తన పేరు మారడాన్ని గమనించిన బాధితుడు ఇంతియాజ్, కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్, తహసీల్దార్ రవీందర్ను ఆదేశించటంతో ఆయన పాత ఫైళ్లను పరిశీలించారు. అందులో గత తహసీల్దార్ ఆర్డర్ జారీ చేసినట్లు లేకపోవడంతో ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. తన కళ్లుగప్పి కంప్యూటర్ ఆపరేటర్లు భూమిని వేరే వ్యక్తుల పేర్లమీదకు మార్చారని తహశీల్దార్ రవీందర్ నిర్ధారణకు వచ్చారు. నెలరోజుల క్రితం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన వికారాబాద్ పోలీసులు ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లు మజ్జు, పరశురాం, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి రవి, బ్రోకర్ రాజు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. గత శనివారం మజ్జు, రవి, పరశురాంలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ భూమి విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని, అక్రమ రిజి్రస్టేషన్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. గతంలో కూడా వికారాబాద్లో తహసీల్దార్కు తెలియకుండా ఆర్డర్ కాపీ అప్లోడ్ చేసిన విషయంపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయంపై ఆర్డీఓ వెంకట ఉపేందర్రెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్కు తెలియకుండా పట్టామారి్పడి జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల విచారణలో కూడా కంప్యూటర్ ఆపరేటర్లు తప్పు చేసినట్లుగా తేలటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించామని తెలిపారు. కాగా, బ్రోకర్ రాజు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటే దీనివెనక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
జేపీ గ్రూప్ ఇసుక రీచ్ల ఫోర్జరీ కేసులో వ్యక్తి అరెస్ట్
-
ఇసుక రీచ్ల ఫోర్జరీ కేసు: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, విజయవాడ: జేపీ గ్రూప్ ఇసుక రీచ్ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం. ఇరిగేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని స్టీల్ప్లాంట్ ఉద్యోగికి రూ.25 లక్షలు టోకరా వేసినట్లు తెలిసింది. విశాఖలో ఉడా భూములు లీజుకు ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధవళేశ్వరం వద్ద ఇసుక ట్రెడ్జింగ్ కాంట్రాక్ట్ పేరిట రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు కస్టడీ కోరనున్నారు. చదవండి: ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. -
ఇసుక రీచ్ల సబ్ లీజుల దందాలో మోసగాడి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో ఇసుక రీచ్లను సబ్ లీజుకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించి కోట్ల రూపాయలను దండుకున్న నిందితుడు రామకృష్ణ చంద్రశేఖర్ని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్ లు, రూ.40 వేల నగదు, సెల్ఫోన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, మూడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.95 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇసుక రీచ్ల్లో తవ్వకాలను ప్రభుత్వం న్యూఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్కు అప్పగించిన సంగతి తెలి సిందే. అయితే ఆ సంస్థ నుంచి తాము సబ్ కాం ట్రాక్ట్ పొందినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు కాంట్రాక్ట్ కాపీలను చూపుతూ కృష్ణా జిల్లాలోని వివిధ రీచ్ల వద్ద హల్చల్ చేస్తున్నట్లు జేపీ గ్రూప్ కు తెలిసింది. దీనిపై ఆరా తీసేందుకు జేపీ గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ గొల్లపూడి మైలు రాయి సెంటర్ సమీపంలోని పంట కాలువ రోడ్లో ఒక ఇంట్లో ఉంటున్న కొప్పురావూరి ప్రవీణ్కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావును కలిశారు. తాము హైదరాబాద్కు చెందిన సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని విశ్వనాథన్ సతీష్తో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఇసుక రీచ్ల్లో తవ్వకాలకు జేపీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్లు రెండు జిరాక్స్ కాపీలను ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన విశ్వనాథన్ సతీష్ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి ఈ నెల 3న విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 420, 465, 467, 471 రెడ్ విత్ 120(బి) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పశ్చిమ మండల ఏసీపీ కె.హనుమంతరావు, భవానీపురం ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ డీకేఎన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ (29)ని అరెస్ట్ చేశారు. నిందితుడు 2016 నుంచి 18 వరకు హైదరాబాద్లో ఒక ఫార్మాసూ్యటికల్ కంపెనీలో పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీకి రావాల్సిన సొమ్మును తెలం గాణ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాహా చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. రామకృష్ణ చంద్రశేఖర్ మరికొన్ని మోసాలు.. హైదరాబాద్కు చెందిన కె.సురేంద్రనాథ్, వెలంపల్లి రఘు నరసింహరాజు ఇసుక రీచ్ల కాంట్రాక్టులు తీసుకోవాలని భావించి తమ మిత్రుడు తిరుమలరెడ్డిని సంప్రదించారు. తిరుమలరెడ్డి తన స్నేహితుడు లోకాభిరాముడుకు విషయం చెప్పారు. దీంతో లోకాభిరాముడు.. రామకృష్ణ చంద్రశేఖర్ ఈ పనిచేయించగలడని తెలిపారు. ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకున్న చంద్రశేఖర్ వారందర్నీ బురిడీ కొట్టిం చాడు. సురేంద్రనాథ్, నరసింహరాజుల నుంచి రూ.5.40 కోట్లు వసూలు చేశాడు. తెలంగాణలో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందుల సరఫరా కాంట్రా క్టు ఇప్పిస్తానని చెప్పి ఫార్మా కంపెనీలను నమ్మించి రూ.12 లక్షలు కొల్లగొట్టాడు. విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ఉద్యోగి లోకాభిరాముడి కుమారుడికి భారత్మాల ప్రాజెక్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు దండుకున్నాడు. లోకాభిరాముడికి ప్రభుత్వ భూములను లీజుకు ఇప్పిస్తానని చెప్పి రూ.45 లక్షలు వసూలు చేశాడు. -
ఇసుక రీచ్ల సబ్ లీజుల పేరిట భారీ మోసం
సాక్షి, అమరావతి/ భవానీపురం (విజయవాడ): రాష్ట్రంలో ఇసుక రీచ్లను సబ్ లీజుకు ఇస్తామని బురిడీ కొట్టిస్తూ రాష్ట్రంలో భారీ దందాకు పన్నాగం పన్నిన ముఠా గుట్టురట్టైంది. ఇప్పటికే ఆ ముఠా పలు జిల్లాల్లో ఇసుక రీచ్లు సబ్ లీజుకు ఇస్తామని చెప్పి ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు కొల్లగొట్టిందని వెలుగు చూసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇసుక రీచ్ల తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ (జేపీ) గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్ల సబ్ లీజు కాంట్రాక్టు తాము పొందామని సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ ముఠా ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాద్ చిరునామాతో ఆ కంపెనీని ఏర్పాటు చేసినట్టు చెబుతూ విజయవాడ గొల్లపూడిలోని ఓ ఇంటి నుంచి దందా మొదలుపెట్టింది. ఇందుకోసం రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ డాక్యుమెంట్లు సృష్టించింది. ఇసుక రీచ్లు కావాలంటే రూ.40 కోట్లు చెల్లించాలంటూ.. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీకి సబ్ లీజుకు కోట్ల రూపాయలు చెల్లించిన కొందరు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రీచ్లలో తవ్వకాలకు ప్రయత్నించగా జేపీ గ్రూప్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ నుంచి సబ్ లీజుకు తీసుకున్నామని చెప్పడంతో జేపీ గ్రూప్ సిబ్బంది నివ్వెరపోయారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఈబీ అధికారులు, జేపీ గ్రూప్ ప్రతినిధులు కలిసి ఈ ఇసుక సబ్ లీజుల అక్రమ బాగోతాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. జేపీ గ్రూప్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ విజయవాడ భవానీపురంలోని సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులు ఉన్న ఇంటికి వెళ్లి ఇసుక రీచ్ల సబ్లీజు కోసం వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు తమను తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడేళ్లపాటు ఇసుక రీచ్లు సబ్ లీజుకు ఇచ్చేందుకు రూ.40 కోట్లు చెల్లించాలని చెప్పారు. తమ కంపెనీ జేపీ గ్రూప్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్లను సబ్ లీజుకు తీసుకున్నట్టు సృష్టించిన ఫోర్జరీ పత్రాలు చూపించారు. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధి కె.సురేంద్రనాథ్ తమ కంపెనీ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్లను సబ్ లీజుకు ఇచ్చే అధికారాన్ని నీలాపు తిరుమలరెడ్డి (విశాఖపట్నం), వెలంపల్లి రఘు నరసింహరాజు (హైదరాబాద్)లకు అప్పగించినట్టు మరో ఫోర్జరీ పత్రాలను చూపారు. వారిని నమ్ముతున్నట్టుగానే వ్యవహరించిన జేపీ గ్రూప్ ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి వచ్చేశారు. అనంతరం తమ కంపెనీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురిపై భవానీపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగ మల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలరెడ్డి, వెలంపల్లి రఘు నరసింహరాజు, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇసుక రీచ్లను సబ్లీజుకు ఇస్తామని చెప్పి రూ.3.50 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గతంలో తెలంగాణలో కూడా ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష
డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. చదవండి: గూగుల్కు భారీ జరిమానా -
ఫోర్జరీ చేసి రూ. 5కోట్ల భూ విక్రయానికి యత్నం
జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చి అమ్మేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. నకిలీ పట్టా పాసు పుస్తకాలను సృష్టించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూమి పట్టా కాదని, ప్రభుత్వ భూమి అని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీనగర్ గ్రామ పరిధిలోని 27 సర్వే నంబర్గల 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిని భూపంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన ర్యాకం సుశీలకు గతంలో కేటాయించారు. 2005లో ఈ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాగా గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన శివశంకర్యాదవ్ అనే వ్యక్తి ర్యాకం సుశీల నుంచి 1.23 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలను తయారు చేశాడు. 2018లో తహసీల్దార్గా ఇక్కడ విధులు నిర్వహించిన శివకుమార్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పాసుపుస్తకాలను సృష్టించాడు. ఈ భూమిని విక్రయించేందుకు శివశంకర్యాదవ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక్కడ ఎకరం స్థలం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని విక్రయించి డబ్బులు సంపాదించొచ్చని భావించాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తహసీల్దార్ దశరథ్ ఆదేశాల మేరకు గురువారం ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దశరథ్ మాట్లాడుతూ శివశంకర్యాదవ్ అనే వ్యక్తి అప్పటి తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించాడని స్పష్టం చేశారు. బొల్లారం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
-
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు, ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్టు చెన్నై ఎస్బీఐ డీజీఎం ఎస్.రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ ఎస్పీ అశోక్కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలను సీబీఐ కార్యాలయం గురువారం విడుదల చేసింది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె, ఇంకా పలువురిపై కేసు నమోదైంది. తమిళనాడులోని తూత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జెన్కం లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఫోర్జరీ పత్రాలు పెట్టి రుణంగా పొందిన రూ.237.84 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 467, 468, 471తోపాటు పీసీ యాక్ట్–1988 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశపూర్వకమైన నేర స్వభావంతోనే పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా పొందినట్టు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేద్కర్ రాజ్కుమార్ గంటా, దుంపల మధుసూదనరెడ్డి, నారాయణప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ బాలకృష్ణ.. మరికొందరిని నిందితులుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. చదవండి: ‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’ -
యనమల పాత్రపై అనుమానాలు
తుని రూరల్: తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి సొసైటీలో 61 మంది తొండంగి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పాస్పుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లను రుణాలుగా మంజూరు చేయడం వెనుక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం ఎస్.అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చనిపోయిన 9 మంది సహా 61 మంది రైతుల పేర్లతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, పోర్జరీ సంతకాలతో 2016–17లో ఈ సొసైటీలో రూ.11 కోట్లు కాజేశారన్నారు. ఈ కుంభకోణం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై మాజీ మంత్రి యనమల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఓ గ్రామంలోనే ఇంతపెద్ద మొత్తంలో అక్రమాలు జరిగితే ఇతర గ్రామాల్లో ఎంతమేరకు అక్రమ రుణాలు పొందారో నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్టు చెప్పారు. -
‘దేవుడు చనిపోయాడు.. ఇక ఆ భూమి మాదే’
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని లక్నోలో ఉన్న ఓ ఆలయం, అది ఉన్న భూమిని ‘‘దేవుడి’’ పేరిట రిజిస్టర్ చేసిన ట్రస్ట్కు చెందుతుందని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలయం, భూమి హక్కుదారైన ‘‘దేవుడు’’ మరణించాడని చెప్పి.. వాటిని ఆక్రమించారు కొందరు వ్యక్తులు. అసలు హక్కుదారు ఫిర్యాదు చేయడంతో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. లక్నో మోహన్లాల్గంజ్ ప్రాంతంలో కుష్మౌరా హలువాపూర్లో 100 ఏళ్ల నాటి ఆలయం ఒకటి ఉంది. దీని బాగోగులు చూడటం కోసం శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ఓ ట్రస్టును నమోదు చేశారు. సదరు ఆలయం, భూమి ట్రస్ట్కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గయా ప్రసాద్ అనే వ్యక్తి తాను శ్రీక్రిష్ణ-రామ తండ్రిని అంటూ వచ్చాడు. ఏకీకరణ ప్రక్రియలో భాగంగా 1987లో ‘‘దేవుడైన’’ శ్రీకృష్ణ-రామ మరణించాడని వెల్లడించి.. సదరు ట్రస్ట్ని గయా ప్రసాద్ పేరు మీదకు మార్చారు. ఈ క్రమంలో 1991లో గయా ప్రసాద్ మరణించాడు. దాంతో ఈ ట్రస్ట్ను అతడి సోదరులు రామ్నాథ్, హరిద్వార్ పేర్ల మీదకు మార్చారు. ఈ విషయం కాస్తా ఆలయ ఒరిజినల్ ట్రస్టీ సుశీల్ కుమార్ త్రిపాఠి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ఈ వ్యవహారం గురించి 2016 నాయిబ్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అలా ఈ ఫిర్యాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ క్రమంలో యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఈ ఫిర్యాదును ఎస్డీఎం ప్రఫుల్లా త్రిపాఠికి బదిలీ చేశారు. ఇక దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 0.730 హెక్టార్ల ఆలయ భూమిని ఆక్రమించుకోవడం కోసం ఓ వ్యక్తి అసలు ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్డీఎం సదర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘నిజమైనా ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తి శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ట్రస్ట్ రిజిస్టర్ చేసి.. సదరు ఆలయం, భూమి ట్రస్ట్కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ‘‘దేవుడి’’ తండ్రిని అని చెప్పుకుని గయా ప్రసాద్ ట్రస్ట్ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆ తర్వాత అతడి సోదరులు దీన్ని ఆక్రమించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన భూమిని గ్రామసభ బంజరు భూమిగా ప్రకటించింది. ప్రసుతం ఈ ఫిర్యాదు ఎస్డీఎం కోర్టు విచారణలో ఉంది’’ అని తెలిపారు. చదవండి: యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ -
కూకట్పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం!
సాక్షి, కేపీహెచ్బీ కాలనీ: నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్ డాక్టర్గా అవతారమెత్తిన ఓ ఆర్ఎంపీని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న మెడికల్ కౌన్సిల్ ధ్రువీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసి ఫోర్జరీ సంతకాలతో పత్రాలను సృష్టించడంతో పాటు పలు ఆస్పత్రులు, రోగులను మోసం చేసిన నకిలీ డాక్టర్ బాగోతాన్ని అసలు డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మినారాయణ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, అల్లవరంకు చెందిన మంగుం కిరణ్కుమార్ (48) ఆయుర్వేద క్లీనిక్లో కాంపౌండర్గా చేరి, ఆర్ఎంపీగా మారి విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద 2013 – 2015లో హైమవతి క్లీనిక్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. అంతాగా లాభం రాకపోవడంతో మూసేశాడు. ఇంటర్నెట్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిష్టర్ అయిన డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తుండగా అతని పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న కిరణ్కుమార్ ఎం (ముక్కు) ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పత్రం కంటపడింది. వెంటనే దానిని డౌన్లోడ్ చేసి కలర్ ప్రింట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ అనే పేరుతో నకిలీ స్టాంపును తయారు చేయించి రిజిస్ట్రార్ సంతకాన్ని తానే ఫోర్జరీ చేశాడు. ఆ సర్టిఫికెట్లను చూపించి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఆస్పత్రిలో డాక్టర్గా చేరి నెలకు రూ. 80 వేల జీతం పొందాడు. ఆ తర్వాత కిరణ్కుమార్ పనితీరుపై ఆసుపత్రి వర్గాలకు అనుమానం రావటంతో చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి అమలాపురంలోని శ్రీనిధి ఆస్పత్రిలో రెండు నెలల పనిచేశాడు. ఆ తర్వాత భీమవరంలోని ఇంపీరియల్ ఆస్పత్రిలో చేరాడు. వారికి కూడా అనుమానం రావడంతో 2019లో ఆస్పత్రులకు వెళ్లటం మానేసి హైదరాబాద్కు మకాం మార్చాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో యూనివర్సిల్ క్లీనిక్లో, కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్న అసలైన డాక్టర్ కిరణ్కుమార్ ముక్కు, తన ఇన్కంటాక్స్ రిటర్న్ల కోసం ఐటి శాఖను సంప్రందించగా, అక్కడ అతని పేరుతో అప్పటికే రెండు పాన్ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదుతో నకిలీ డాక్డర్ కిరణ్కుమార్ మంగుంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
దోమకొండ: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరి చేసి ఖాళీ స్థలాన్ని డాక్యుమెంట్ చేసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్గౌడ్ సోమవారం తెలిపారు. పంచాయితీ కార్యదర్శి తన సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు. గ్రామానికి చెందిన నందాల ఈశ్వరవ్వ అనే మహిళకు చెందిన 130 గజాల స్థలాన్ని ఆగస్టు 24న బొడపుంటి రవి అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో పంచాయతీ ధ్రువీకరణ పత్రంతో పాటు, కార్యదర్శి స్టాంప్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు సదరు డాక్యుమెంట్ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రర్ స్వామిదాస్ తెలిపారన్నారు. నిందితుడ బొడపుంటి రవితో పాటు నందాల ఈశ్వరవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
చనిపోయిన పినతల్లి చెక్కుల ఫోర్జరీ
మదనపల్లె టౌన్: చనిపోయిన పినతల్లి చెక్కులపై సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్న సస్పెండెడ్ మెజిస్ట్రేట్ రామకృష్ణ, ఆయన తనయుడు వంశీకృష్ణను మదనపల్లె టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. బి.కొత్తకోటకు చెందిన సస్పెండెడ్ మెజిస్ట్రేట్ రామకృష్ణకు పినతల్లి అయిన సుచరిత గతేడాది మరణించారు. అయితే ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్ చెక్కులను ఫోర్జరీ సంతకాలతో రామకృష్ణ, వంశీకృష్ణలు డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గుర్తించిన సుచరిత కుటుంబసభ్యులు బి.కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ సునీల్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్ను విచారించగా.. ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసింది వాస్తవమేనని తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హార్సిలీహిల్స్ వద్ద ఉన్న రామకృష్ణ, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరుపరచగా 24 వరకు రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు. -
ఐజీ సంతకం ఫోర్జరీపై విచారణాధికారిగా సురేశ్కుమార్
సాక్షి, హైదరాబాద్: నార్త్జోన్ ఐజీ కార్యాలయంలో వెలుగుచూసిన ఫోర్జరీ గ్యాంగ్ బాగోతంపై డీజీపీ కార్యాలయం స్పందించింది. కోవిడ్–19 కాలంలో ఐజీ కార్యాలయం నుంచి వెలువడిన 191 అధికారిక ఉత్తర్వుల్లో మొత్తం ఐదు ఉత్తర్వులను ఐజీ కిందిస్థాయి సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సురేశ్కుమార్ను విచారణాధికారిగా నియమించారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐజీ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. బదిలీలకు సంబంధించి సంబంధిత ఎస్పీలు, కమిషనర్లతో సంప్రదించాకే ముందుకెళతామని పేర్కొన్నారు. పిల్లల చదువు, అనారోగ్యం తదితర కారణాలకు మాత్రమే బదిలీలను పరిగణనలోకి తీసుకుంటామని, ఎలాంటి మధ్యవర్తిత్వాలు, లంచాలు డిమాండ్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్లో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి రూ.117 కోట్లు కొట్టేసేందుకు చేసిన ప్రయత్నంలో పలు రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ స్కామ్ సూత్రధారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ప్రధాన సూత్రధారి బీహార్కు చెందిన సింగ్ను పట్టుకుని విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. బీహారే కాకుండా కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లింకులు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. సింగ్తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్న సీఐడీ మొత్తం 30 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసింది. మిగతావారి కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయి. రూ.117 కోట్లు కొట్టేసేందుకు యత్నం గత సెప్టెంబర్లో పశ్చిమబెంగాల్, కర్ణాటకలోని బ్యాంకుల్లో మూడు చెక్కులతో మొత్తం రూ.117 కోట్లు డ్రా చేసేందుకు అగంతకులు ప్రయత్నించారు. ఆ చెక్కులు ఏపీ సీఎంఆర్ఎఫ్కు చెందినవి కావడంతో అనుమానం వచ్చిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి బ్రాంచి అధికారులను సంప్రదించారు. అవి ట్యాంపరింగ్ చేసిన నకిలీ చెక్కులుగా నిర్ధారించిన ఎస్బీఐ అధికారులు వాటి చెల్లింపులు నిలిపివేశారు. ఆ తర్వాత కడపలోనూ ఫోర్జరీ చెక్కుతో సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.9.95 లక్షలు డ్రా చేసే ప్రయత్నాన్ని బ్యాంకు అధికారులు నిలువరించారు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. చెక్కుల విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న మొత్తాలతో కూడిన చెక్కులను పెద్ద మొత్తాలుగా ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 22 మందిని విచారించిన సీఐడీ! తొలుత కర్ణాటకలోని మంగళూరులోను, పశ్చిమబెంగాల్లోని కొల్కతా బ్యాంకుల్లో రికార్డులను సీఐడీ అధికారులు తనిఖీ చేశారు. ఫోర్జరీ చెక్కులు మార్చేందుకు ప్రయత్నించిన రోజుల్లో ఆయా బ్యాంకుల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే బీహార్కు చెందిన సింగ్ను పట్టుకున్నారు. అతను ఇచ్చిన కీలక సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు పలు రాష్ట్రాలకు చెందిన 22 మందిని పట్టుకుని విచారించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా నిందితులకు ఏపీకి చెందిన కొందరు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. -
పరిటాల సునీత అనుచరుడి భూ బాగోతం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడి భూ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత, రామగిరి మాజీ ఎంపీపీ బాలరంగయ్య ధర్మవరంలో 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో 8.5 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న బాలరంగయ్య, పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు. బాలరంగయ్య ఇచ్చిన నకిలీ పత్రాలతో మున్సిపల్ స్థలాన్ని అప్పటి సబ్ రిజిస్టర్ చేశారు. కాగా ఈ అక్రమాలను గుర్తించిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. బాల రంగయ్య, సబ్ రిజిస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’ -
సచివాలయం నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్
తాడికొండ: ఏపీ సచివాలయంలో నకిలీ పత్రాలను ఫోర్జరీ చేసి మోసం చేసిన నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంత్రి కొడాలి నాని పేషీలో ఔట్ సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్న సతీష్ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ యాగయ్య అనే వ్యక్తి వద్ద రూ. 3.30 లక్షలు తీసుకున్నాడు. ఈ నగదును మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆరుగురు వ్యక్తులు పంచుకుని.. ఉద్యోగం ఇస్తానని చెప్పిన వ్యక్తికి నకిలీ డాక్యుమెంట్ ఇచ్చారు. బాధితుడు యాగయ్య ఆ డాక్యుమెంట్ను తీసుకొని తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ సచివాలయంలోని సివిల్ సప్లయిస్ పేషీలో కలవగా, అధికారులు అది నకిలీదని గుర్తించి అదే విషయం అతనికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి సతీష్ వర్మ, షేక్ బాజీ, మేడా వెంకట రామయ్య, వంశీకృష్ణ అనే నలుగురిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సౌజన్య, ఒంగోలుకు చెందిన క్రాంతి కుమార్ పరారీలో ఉన్నందున వారి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు. -
నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు
ఒంగోలు: రెండేళ్లుగా 11 రాష్ట్రాల్లో 200కుపై బ్రాంచీలతో నడుస్తున్న టెక్నికల్ కోర్సుల నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఛేదించారు. నకిలీ సంస్థ ఏర్పాటు సూత్రధారితోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని హనుమాన్ ఫెర్టిలైజర్స్ షాపుపై ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. షాపులో సరుకుతోపాటు వ్యాపారి జంపని వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లను పరిశీలించారు. అవి నకిలీవని నిర్ధారణ కావడంతో ఆ వ్యాపారిపై ఏవో సీహెచ్ ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకొల్లు సీఐ దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా.. షాపు యజమాని రూ.10వేలకు నకిలీ సర్టిఫికెట్ను కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేశారు. వైజాగ్ కేంద్రంగా.. జేఎన్టీసీ పేరుతో... వైజాగ్కు చెందిన సిలారపు బాల శ్రీనివాసరావు సంపాదనపై ఆశతో 2017లో జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ సెంటర్(జేఎన్టీసీ) పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించాడు. ఇందులో ఆయన సతీమణి సుజాత కూడా భాగస్వామి. మన రాష్ట్రంతో పాటు మొత్తం 11 రాష్ట్రాల్లో 200కుపైగా బ్రాంచీలు ప్రారంభించి నకిలీ దందా మొదలుపెట్టారు. ఒక్కో బ్రాంచి నుంచి రూ.లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేశారు. మన రాష్ట్రంలో 1,855, మిగిలిన 10 రాష్ట్రాల్లో 382 మొత్తం 2,237 నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారు. హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏవియేషన్ హాస్పిటాలిటీ, ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డెకరేషన్, ఫైర్ సేఫ్టీ, ప్రైమరీ టీచింగ్, హెల్త్కేర్ అనుబంధ రంగాలు, క్రిటికల్ విభాగమైన అనస్తీషియా, కార్డియాలజీ, ఈసీజీ, ఆప్తల్మాలజీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, వెటర్నరీ అసిస్టెంట్, ఫిట్నెస్, యోగా వంటి అనేక టెక్నికల్ కోర్సుల్లో 3 నెలల డిప్లొమా మొదలు మూడేళ్ల కోర్సు వరకు నకిలీ సర్టిఫికెట్లను రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు తీసుకుని అందజేసేవారు. నిందితులు జంపని వెంకటేశ్వర్లు (చింతలపూడి– యద్దనపూడి మండలం), సిద్ది శ్రీనివాసరెడ్డి (మర్లపాలెం–కురిచేడు), కోడూరి ప్రదీప్కుమార్ (ఈపూరుపాలెం–చీరాల), అనపర్తి క్రిస్టాఫర్ (ఇందుర్తినగర్–ఒంగోలు), బట్టపోతుల వెంకటేశ్వర్లు (యర్రగొండపాలెం), సిలారపు బాల శ్రీనివాసరావు, సిలారపు సుజాత (శంకరమఠం రోడ్– విశాఖ)లను పోలీసులు అరెస్టు చేశారు. సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్, ప్రింటర్, హార్డ్ డిస్క్, స్టాంపులు, హోలోగ్రాం, రిజిస్టర్లతోపాటు సంస్థ పేరుపై బ్యాంకులో ఉన్న రూ.5,47,537లను సీజ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లో ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులు అల్తాఫ్ హుస్సేన్, ఎస్.చౌదరిలను ఎస్పీ అభినందించారు. -
దళిత సీఐని పబ్లిక్గా బెదిరించిన జేసీ
సాక్షి, అనంతపురం: అక్రమ వాహనాల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోపే వాళ్లిద్దరిపై మరో కేసు నమోదైంది. జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ, అస్మిత్లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. (వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం ) ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా కండీషన్ బెయిల్లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లు శుక్రవారం అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఐతో దురుసుగా ప్రవర్తించడంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. ఆయనపై మరో నాలుగు కేసులు నమోదయ్యే అవకాశాలున్నందున ఎలాంటి అవాంచనీయ ఘర్షణలు చోటు చేసుకోకుండా తాడిపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మెహరించారు. (జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు) -
దళిత సీఐని పబ్లిక్గా బెదిరించిన జేసీ
-
తండ్రి పేరుతో తనయుడి దందా!
కుత్బుల్లాపూర్: తండ్రి పేరుతో తాత్కాలిక వీఆర్ఏగా పనిచేస్తూ అమాయకులను బెదిరించడమే కాకుండా ప్రభుత్వ ఆక్రమణల విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పరి వాసు కోసం జగద్గిరిగుట్ట పోలీసులు గాలింపు చేపట్టారు. గత నెల చివరి వారంలో వాసుపై కేసులు నమోదైనా పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సదరు వీఆర్ఏ ఆక్రమణలపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. ఖదిర్ అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేయడమే కాకుండా అతడి ఇంటిని కూల్చి వేసిన విషయంపై గత నెల 23న సీఐ గంగారెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వాసు జాడ కనుక్కోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎస్సై సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం వాసు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ వాసుపై పలు ఆరోపణలు రాగా సదరు ఎస్సై సెటిల్మెంట్ చేసినట్లు దేవేందర్నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. తండ్రి స్థానంలో తాత్కాలిక వీఆర్ఏగా కొనసాగుతూ ఓ డ్రైవర్, ఓ అసిస్టెంట్ను నియమించుకుని ఖరీదైన కారులో తిరుగుతూ ఫోర్జరీ నోటరి డాక్యూమెంట్లను సృష్టిస్తూ ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న వీఆర్ఏ ఉప్పరి బాలయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక వీఆర్ఏ గా కొనసాగిన వాసు వ్యవహార శైలి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ను ఆదేశించారు. -
సంతకాలు ఫోర్జరీ చేసిన భార్యాభర్తలు
మంచిర్యాలక్రైం: భార్యాభర్తలిద్దరూ పోలీస్ కానిస్టేబుల్లే... భార్యకు ఆరోగ్యం బాగాలేక సిక్లీవ్ పెట్టి ఏకాధాటిగా 19 నెలలు విధులకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు వేతనం రాకపోవడంతో సదరు కానిస్టేబుల్ భర్త వక్ర బుద్దికి తెరలేపాడు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి 19నెలల వేతనం కాజేసేందుకు ప్రయత్నించిన సంఘటన పోలీస్శాఖలో చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది.... మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఐడీ పార్టీ కానిస్టేబుల్గా పని చేస్తున్న జయచందర్తో పాటు ఆయన భార్య వనిత స్థానిక మహిళా పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. 2018 ఆగస్టు 18న అనారోగ్యంతో సిక్లీవ్ పెట్టింది. అప్పటి నుంచి పోలీస్స్టేషన్కు రాకుండా దూరంగా ఉంది. 19 నెలల అనంతరం ఈ ఏడాది మార్చి 8న డ్యూటిలో చేరింది. సీఐ వెంకటేశ్వర్లు ఆమెను సిక్లీవ్ పాస్పోర్టులు అడగడంతో సమాధానం చెప్పలేదు. దీంతో వనిత సిక్లీవ్ ప్రోసీజర్ ఫాలో కాలేదని రామగుండం పోలీస్ కమిషనర్కు రిపోర్ట్ చేశాడు. ఇద్దరు సీఐల సంతకాలు ఫోర్జరీ.. 19 నెలల వేతనం కాజేసేందుకు వనిత భర్త కానిస్టేబుల్ జయంచందర్ సిక్లీవ్ పాస్పోర్ట్లపై గతంలో పనిచేసిన సీఐ చంద్రమౌళి, ప్రస్తుతం పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాస్పోర్ట్లు తయారు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు క్లియరెన్స్ లెటర్ ఇచ్చినట్లు, కవరింగ్ లెటర్తో çస్టాంపింగ్ చేసి మరీ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వేతనం కోసం ధరఖాస్తు చేశాడు. బయటకు తెలిసిందిలా.. సీఐ వెంకటేశ్వర్లు వనిత సిక్లీవ్ ప్రొసిజర్ ఫాలో కాలేదని కమిషనర్కు రిపోర్టు చేసిన క్రమంలో విచారణ ముందుకు సాగలేదు. అయితే ఇదే విషయమై మరోసారి అడ్మినిస్ట్రేటివ్ అధికారికి సీఐ గుర్తు చేశాడు. అప్పుడు ఫోర్జరీ చేసిన విషయం వెలుగుచూసింది. ఈ మేరకు జయచందర్, వనితపై చీటింగ్ కేసుతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. రామగుండం సీపీ సత్యనారాయణను వివరణ కోరగా ఇద్దరు సీఐల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. కేసు నమోదు చేశాం. పూర్తి విచారణ అడిషనల్ డీసీపీ అశోక్కుమార్కు అప్పగించినట్లు తెలిపారు. -
దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (కర్నూల్ పీఎస్లో ముగిసిన జేసీ విచారణ) కరోనా కట్టడికి చర్యలు రవాణాశాఖలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశాము. ఎక్కువ మంది బయోమెట్రిక్ తాకటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓటీపీ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చు. అందుకోసమే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లు,పర్మిట్లు జారీ వంటి 18 రకాల సేవలను ఓటీపీ ద్వారా అందించున్నట్లు శివరాంప్రసాద్ తెలిపారు. (నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్రెడ్డి!) -
యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా
సాక్షి, గుంటూరు/మంగళగిరి: ఓ మహిళ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఎలాగైనా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆమె బతికుండంగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మరో మహిళను స్థల యజమాని కూతురుగా సృష్టిస్తూ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందారు. రూ.70 లక్షలకు పైగా విలువ స్థలాన్ని కబ్జా చేయడానికి అక్రమార్కుల వేసిన పన్నాగం స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే 1980 మే 31న విజయవాడకు చెందిన కాగిత సత్యవతి మంగళగిరి మండలం నవులూరు పశువుల ఆసుపత్రి వద్ద సర్వే నెంబర్ 795/1, ప్లాట్ నెంబర్ 22లో 436 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంపై కన్నేసిన కొందరు సత్యవతి 1993 మే 4వ తేదీన మృతి చెందినట్లు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అదే విధంగా సత్యవతితో ఏ సంబంధం లేని శైలజ అనే మహిళను కుమార్తెగా చూపిస్తూ మంగళగిరి తహసీల్దార్ మంజూరు చేసినట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ను పొందారు. వీటిని అడ్డంపెట్టుకుని మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 623/2020తో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె మురళీకృష్ణ పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇతను విలేకరి(సాక్షి కాదు)గా పని చేస్తున్నాడు. ఈ ధ్రువపత్రాలతో స్థలం అమ్మకానికి పెట్టగా విషయం స్థల యజమాని సత్యవతికి తెలిసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ నెల తొమ్మిదో తేదీన కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఏ1 గాదె మురళీకృష్ణ, ఏ2 శైలజలుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏ2 శైలజను అరెస్టు చేసిన అధికారులు విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి సంతకాలు పెట్టిన నవులూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించినట్లు సమాచారం. ఆ ముగ్గురే కీలకం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలం కబ్జా చేయడంలో టీడీపీకి చెందిన యర్రబాలెంకు చెందిన ఓ రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన ఓ విలేకరి(సాక్షి కాదు), మంగళగిరికి చెందిన మరో వ్యక్తి కీలకమని సమాచారం. ఈ ముగ్గురే పెట్టుబడి పెట్టి నకిలీ పతకం ప్రకారం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గాదె మురళీ సహా యర్రబాలెంకు చెందిన టీడీపీకి చెందిన రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. రూ.20 వేలు ఇచ్చి నమ్మించి తన పేరిట ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసుల ఎదుట శైలజ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసు రాజీకి యత్నం కబ్జా వ్యవహారంలో కీలకం పాత్ర పోషించిన ఈ ముగ్గురు ఫిర్యాదుదారులను భయబ్రాంతులకు గురిచేసో, డబ్బు ఇస్తామనో కేసు రాజీ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి ప్రాంతాల్లో రౌడీ షీటర్లు, కొందరు వైట్ కాలర్ నేరస్తులు ఈ తరహాలో భూకబ్జాలకు పాల్పడటం ఇది మొదటి సారి ఏమీ కాదు. గతీడాది మంగళగిరిలో జరిగిన ఓ మాజీ రౌడీషీటర్ హత్యకేసులో కీలక నిందితుడు రౌడీషీటర్ సుమారు రెండు నెలల క్రితం పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో స్థల వివాదం దౌర్జాన్యానికి దిగాడు. తన బావ పేరిట అక్రమ స్థల రిజిస్ట్రేషన్ చేయించి ఎదుటి వారి స్థలాన్ని కబ్జా చేసేందుకు సదరు రౌడీషీటర్ తన అనుచరుల పంపి స్థల యజమానులు వేసుకున్న సరిహద్దు కంచెలను తొలగించారు. ఈ వ్యవహారంలో రౌడీషీటర్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని అప్పట్లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయం కోసం బాధితులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రౌడీషీటర్ను తప్పించి కేసు నమోదు చేశారని విమర్శలున్నాయి. -
నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్రెడ్డి!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కస్టడీలో వారు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి నేర అంగీకారపత్రం.. ‘సాక్షి’ చేతికి చిక్కింది. అందులో ఏముదంటే.. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభాకర్రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్ను సంప్రదించారు. నాగాలాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్కు తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్ చేయించారు.(మాకేం తెలీదప్పా..అంతా బ్రోకర్లే జేసినారు..) ఇలా బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా నమోదు చేయించారు. ఇందుకోసం ముత్తుకుమార్, సంజయ్లకు ప్రభాకర్రెడ్డిలకు భారీగా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత జేసీ అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్ఓసీ తీసకున్నారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ నేరం అంగీకరించారు. ఇలా ఫోర్జరీ చేసిన పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. మొత్తం అశోక్ లేలాండ్కు చెందిన 154 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి.. వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు మార్చిన తీరు విస్మయం కలిగిస్తోంది.(మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్) ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన ఆయన.. వారి రిమాండ్ను ఈ నెల 27 దాకా పొడిగించారు. కాగా, ప్రస్తుతం ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాకర్రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి బెయిల్ పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. -
వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం
‘జేసీ’....తన బస్సులాగే రూట్ మార్చాడు. తుక్కు వాహనాల కొనుగోలులో నకిలీలు జేసి జైలులో ఉన్న తండ్రీ, తనయులు జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారు. అయితే తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని..తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుక్కు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్రెడ్డిలు కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. కేవలం బ్రోకర్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని బుకాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం 154 బీఎస్–3 వాహనాలను తప్పుడు రిజి్రస్టేషన్లతో బీఎస్–4 వాహనాలుగా రిజి్రస్టేషన్ చేయించడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్రెడ్డిలతో పాటు మరో నలుగురిపై 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. స్క్రాబ్ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగాలాండ్ కేంద్రంగా బీఎస్–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. అయితే, ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్ రెడ్డి (జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వీరి పాత్రకు తగిన ఆధారాలతో పాటు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని...బుకాయింపులతో కేసు నుంచి తప్పించునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది..! వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాల రిజి్రస్టేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను...నాగాలాండ్లో జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలను బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో ఇష్టారాజ్యంగా తిప్పారు. కొద్ది మందికి కూడా కొత్త బీఎస్–4 వాహనాల కంటే కొంచెం తక్కువ ధరకు విక్రయించారు. అయితే, వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు కాస్తా అనుమానాలు, ఫిర్యాదులు రావడంతో నాగాలాండ్కు వెళ్లి విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదలగా... అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్ చేశారు. ఈ క్రమంలోనే జేసీ మరో ఎత్తుగడ వేశారు. విలువైన సామానులను తీసేసి.. కేవలం ఛాసీస్ మాత్రమే ఉంచి వాహనాలు అప్పగిస్తున్నారు. మరోవైపు తమను మోసం చేసి వాహనాలను విక్రయించారని పలువురు తాడిపత్రిలో ధర్నా చేయడంతో పాటు జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసులు కూడా పెట్టారు. పక్కాగా ఆధారాలు ! వాస్తవానికి ఈ విధంగా బీఎస్–3 వాహనాలను...బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు రిజి్రస్టేషన్ జరిగిన వాహనాలకు ఎన్ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వాహనాలను తాము రిజి్రస్టేషన్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని, అందువల్ల తాము ఈ పనిచేయలేమని తేలి్చచెప్పినట్లు సమాచారం. అయితే, నాగాలాండ్లో రిజి్రస్టేషన్ చేసిన తర్వాత ఆర్సీలో బీఎస్–4 వాహనాలు అని పేర్కొన్నారని.. మీకేమీ ఇబ్బంది ఉండదంటూ వివిధ రకాలుగా రవాణాశాఖ అధికారులకు ఆశపెట్టి, బెదిరించి ఎన్ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఎన్ఓసీ ఇచ్చిన రవాణాశాఖ అధికారులది తప్పంటూ జేసీ బ్రదర్స్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా తాము నేరుగా ఈ వాహనాలను కొనుగోలు చేయలేదని.. తప్పంతా బ్రోకర్లదేనని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండటంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆర్టీవో బ్రోకర్ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ బ్రదర్స్ అక్రమాల్లో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిషేధిత వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ వాహనాలను బ్రోకర్ రవికుమార్ ద్వారా జేసీ ట్రావెల్స్ విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లపై రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ కాగా, తండ్రీ కొడుకులు కడప సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. (జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. నకిలీ ఇన్ వాయిస్, ఫేస్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల చెలామణి పై పోలీసులు విచారణ చేపట్టారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన జేసీ ట్రావెల్స్ .. 154 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి బీఎస్-4 గా మార్చింది. వాహనాలన్నీ జేసీ ఉమారెడ్డి, చవ్వాగోపాల్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డికి జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ అనంతపురం కోర్టు ఆదేశించించిన సంగతి తెలిసిందే. -
జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని కడప జైలుకు తరలించారు. ఆదివారం వన్టౌన్లో సీఐ ప్రతాప్రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట) పోలీసు కస్టడీలో తండ్రీకొడుకులు కీలక విషయాలు వెల్లడించినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలను ఎలా బీఎస్-4 గా మార్చి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారో ప్రశ్నించామని తెలిపారు. ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు? నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎలా తయారు చేసి చలామణి చేశారన్న దానిపై చాలా వివరాలు రాబట్టామన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్మాల్)