government schemes
-
ఉద్యోగులకు వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ రెసిడెన్సీ హోటల్లో వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వివి«ద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ఫెడరేషన్ను కాపాడుకుంటామని ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రకటించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదన్నారు.పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలుకు పెంచుతామన్న హామీని తుంగలోకి తొక్కి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గత సర్కారు ఇచ్చిన జీవోలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి సారించి సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వీఆర్ఏలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కరువు.. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎంను కోరిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేవారని, నేరుగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చి చాలా వరకు పరిష్కరించామని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కరువైందని, అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తెస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్క సమస్యనుగానీ, హామీనిగానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఉద్యోగులను మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..
మనమంతా కొద్దిరోజుల్లో 2025లోకి ప్రవేశించబోతున్నాం. ఈ ముగియబోతున్న 2024 కొన్ని రంగాల్లో భారత్కు దిశానిర్దేశం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త పథకాలను అమలుచేశాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న భారతదేశ కలలను కలలను సాకారం చేసేందుకు దోహదపడనున్నాయి.ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలోని యువతను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. 2024లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో దేశంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో 2024లో కేంద్ర ప్రబుత్వం ఏయే పథకాలను ప్రారంభించిందో తెలుసుకుందాం.పీఎం విద్యా లక్ష్మీ యోజనప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన కింద ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఫీజులు, ఇతర ఖర్చులకు హామీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందుతారు. నవంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు.ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అదే సమయంలో రూ. 7.5 లక్షల వరకు రుణాలపై, విద్యార్థులు ప్రభుత్వం నుండి 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని పొందుతారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు వడ్డీపై పూర్తి సబ్సిడీ లభిస్తుంది. ఇదేకాకుండా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు.బీమా సఖీ పథకంఈ పథకం లక్ష్యం ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసీ అందించే బీమా సఖీ పథకం నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలను బీమా ఏజెంట్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మూడేళ్ల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ, గౌరవ వేతనం అందించనున్నారు.పీఎం సోలార్ హోమ్ స్కీమ్ప్రధాని నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీని అందిస్తారు.సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ పథకాన్ని మరింతకాలం పెంచారు. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ అందించనున్నారు. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి!
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు. పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.ఈదర గోపీచంద్ వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494 -
ట్రోలింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతగా లబ్ధి చేకూరిందీ, వారి పిల్ల లకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా విధానం ఎంతగా ఉపయోగ పడనున్నదో సంతోషంగా తెలియ పరిచింది. కానీ ఆమె అభిప్రాయంపై కొందరు వ్యక్తులు (ప్రతి పక్షాల కార్యకర్తలు) అనుచిత, అన్పార్ల మెంటరీ పదాలతో కూడిన కామెంట్లు చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ మధ్యకాలంలో ‘సోషల్ ట్రోలింగ్’ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజ కీయాలలో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఒక పార్టీనీ, ఒక వ్యక్తినీ, ఒక నాయకుణ్ణీ, ఒక విధానాన్నీ సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే సామాజిక మాధ్యమాల్లో పలు పార్టీలకు సంబంధించిన వారు అదే పనిగా వారిని విమర్శించడం కనిపిస్తోంది. అయితే ఇందులో మహిళలను కించపరచడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, అనరాని మాటలు అనడం బాధాకరం. రాజకీయ చర్చల్లో సాధారణంగా చిన్న పిల్లల్నీ, మహిళలనూ కించపరచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేవలం రాజకీయ వర్గాలే కాదు సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు మాట్లా డిన ఇంగ్లీష్పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి వారు ముందుకు దూసుకువెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటువంటి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్పై వ్యంగ్యా స్త్రాలను ఆ యా వర్గాలకు చెందిన వారే కొందరు ట్రోల్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న మహిళలూ, బడిపిల్లలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వారిని క్షోభ పెట్టడం ప్రతిపక్ష కార్యకర్తలకు తగదు. ఇలా చేస్తే వారు అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు... ట్రోల్ చేసేవారిని గుర్తించి, నియంత్రించడానికి ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా తమ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా తగిన నియంత్రణా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటువంటి వారికి జరిమానాలు విధించాలి. భావస్వేచ్ఛ ఉందికదా అని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదుకదా? ఇటువంటి వారి ప్రవర్తన సామాజిక మాధ్య మాల్లో చురుగ్గా ఉండే యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ట్రోలింగ్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం ఇందుకు నిదర్శనం. గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు గురు వారం ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని గుంటూరు ఎస్పీ తుషార్ ప్రకటించారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ట్రోలింగ్ను అరికట్టడం సాధ్య మవుతుంది. – డా‘‘ శ్రవణ్ కుమార్ కందగట్ల sravankuc@gmail.com -
టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర
ఈ నైచ్యానికి అంతులేదు. ఈ మానవ మృగాలకు బుద్ధి రానే రాదు. ప్రభుత్వ పథకాలు తమ కుటుంబానికి మేలు చేశాయన్నందుకు.. బీసీ మహిళ గీతాంజలిని వీధి కుక్కల్లా వెంటాడారు. వేధించారు. థర్డ్డిగ్రీకి పదింతల ఆన్లైన్ టార్చర్కు గురిచేశారు. తట్టుకోలేక ఆమె రైలు కింద పడి తనువు చాలించినా ఈ దరిద్రులకు సిగ్గురాలేదు. రైల్వేస్టేషన్ దగ్గర ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో ఎవరో తీసిన రెండు నిమిషాల వీడియోలో మాటల్ని ఎడిట్ చేసి మరీ.. చనిపోయాక కూడా ఆమెను చిత్రవధ చేయడం మొదలెట్టారు. ‘ఎవరో ఇద్దరు నెట్టేశారంట’ అనే మాటల్ని వీడియోకు కొత్తగా జోడించి దాన్ని ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్లోనే పోస్ట్ చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు సిగ్గూ.. లజ్జా.. ఏమైనా ఉన్నాయా? పైపెచ్చు అవే ఎడిటెడ్ మాటల్ని వైరల్ చేస్తూ.. నెట్టేసిన ఇద్దరూ ఎవరు? ఆమెతో ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా మాఫియా పలు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తోందంటే ఏమనుకోవాలి? గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే.. ఆమెపై చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించి తప్పించుకోవాలని చూస్తున్న ఈ రాక్షసుల్ని ఏం చేయాలి? వీళ్లదసలు మనిషి పుట్టుకేనా? వీళ్లకు కుటుంబాలున్నాయా? సాక్షి, అమరావతి/రేపల్లె రూరల్/తెనాలి రూరల్/ సాక్షి నెట్ వర్క్:‘పురాణాల్లో దుశ్శాసనుడు కూడా ఇంతదారుణంగా వ్యవహరించి ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఆయనే ఉంటే మానమృగాలైన టీడీపీ–జనసేన సైకో మూకల తీరు చూసి సిగ్గు పడేవాడు.. ట్రోలింగ్తో వెంటపడి, వేటాడి గీతాంజలి మృతికి కారణమైన ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆడబిడ్డ అన్యాయంగా చనిపోయిందనే కనికరం కూడా లేని ఆ పార్టీల అధినేతలు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతుంటే తట్టుకోలేని ఈ మానవ మృగాల టార్గెట్తో ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమ కోల్పోయి దిక్కుతోచని వారయ్యారని, ఇందుకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబు, పవన్లేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా సైతం స్పందించింది. మితిమీరిన ట్రోలింగ్లకు ముకుతాడు వేయాలని వార్తలు ప్రసారం చేసింది. సర్వత్రా ఆగ్రహం ♦ టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. ఈ ఘటనను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్గౌడ్, వైఎస్సార్సీపీ నెల్లూరు నాయకురాలు మోయిళ్ల గౌరి, విశాఖపట్నం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ♦ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ శిఖామణి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఐడీసీ ఛైర్పర్సన్ బండి నాగేంధ్ర పుణ్యశీల, మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఇది టీడీపీ, జనసేన సైకోల హత్య ‘గీతాంజలిది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు చిన ఆడబిడ్డలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడమే పాపమైపోయిందా? సీఎం జగన్ను మళ్లీ గెలిపించుకుంటామని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా? టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? మీ సోషల్ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా? తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే టీడీపీ, జనసేన సైకోలు సోషల్మీడియా ట్రోల్స్తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని.. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్ మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని గీతాంజలి భర్త చెబుతుంటే బాధేస్తోంది. ఐటీడీపీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మహిళను బలితీసుకునే అధికారం ఎక్కడిది? టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాల కోసం మహిళను బలితీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఆ పార్టీల సోషల్ మీడియా రాబంధుల వికృత చేష్టలతో ఒక మహిళ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ–జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మనుషులా? మృగాలా? తన కూతురికి అమ్మ ఒడి వచ్చిందని, అత్తకు చేయూత, తన మామకు పింఛన్తో కలిపి మొత్తం ఇంటిలో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడంతో పచ్చ మందకు కళ్లు కుట్టాయి. ఇలాంటి ఘటనలతో పైశాచిక ఆనందాన్ని పొందేందుకేనా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు రూ.కోట్లు వెచ్చించి సోషల్ మీడియాను నడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. మహిళల సంక్షేమానికి ఏం చేశారు. ఆయన హయాంలోనే బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ వేదికల్లో ఇంగ్లిష్లో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా ట్రోలింగ్తో నీచపు రాజకీయం చేశారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ కక్షగట్టి ట్రోలింగ్ గీతాంజలి మృతికి కారణమైన బాధ్యులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని గీతాంజలి గట్టిగా చెప్పడం టీడీపీ, జనసేనకు నచ్చలేదు. అందుకే పనిగట్టుకుని, కక్షతో ట్రోలింగ్కు గురిచేశారు. మానసిక చిత్రహింస తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఒక సామాన్య మహిళపై అసభ్యకరంగా పోస్ట్లు పెట్టేవారిని సభ్యసమాజంలోని ప్రతి వ్యక్తి ఖండించాలి. తాము పొందిన లబ్ధి గురించి తెలియజేస్తున్న ప్రజల స్వేచ్ఛను హరించేలా టీడీపీ–జనసేనల సోషల్ మీడియాల్లో వికృతంగా వ్యవహరించడం దారుణం. – మోపిదేవి వెంకట రమణారావు, ఎంపీ మనిషిని బతికించేలా మాట ఉండాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బతికించేలా ఉండాలి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్కు బలైన గొల్తి గీతాంజలి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం ప్రశంసనీయం. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడేవారిని శిక్షించాలి. – జి.శాంతమూర్తి, వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు దోషులను వదిలేది లేదు: ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసు విచారణ వేగవంతం చేశామని, దోషులను వదిలేది లేదని గుంటూరు ఎస్పీ తుషార్డూడీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు తెనాలికి చెందిన గీతాంజలి(32) తెనాలి ఐదో నంబర్ ఫ్లాట్ఫాం సమీపంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఆమె 11వ తేదీ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించిందన్న సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు 174 సెక్షన్ కింద కేసునమోదు చేశారని చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి తెనాలి వన్టౌన్కు బదిలీ చేశారని, రైల్వే పోలీసుల విచారణ నివేదిక ఆధారంగా కేసును సెక్షన్ 174 నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306కి మార్పు చేయడం జరిగిందన్నారు. గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిందన్న ఉత్సాహంలో చేసిన వీడియోను పోస్టు చేసినందుకు ఆమెను చనిపోయేలా కించపరిచారన్నారు. ఇప్పటికే ట్రోల్ చేసిన వారి హ్యాండిల్స్ను గుర్తించామని, ఇందులో కొంతమంది తమ పేరుతోనే అకౌంట్ నడుపుతుంటే మరికొందరు ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారు. వీరందరిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు. మానవత్వం లేని నాదెండ్ల తెనాలి పట్టణం వహాబ్చౌక్ ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ప్రారంభంలోనే ఉన్న గీతాంజలి ఇంటి ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడి జరిగిన ఘటన గురించి చర్చించుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల తీరు విమర్శలకు దారితీసింది. గీతాంజలి ఇంటికి కూత వేటు దూరంలోనే ఆయన నవ్వుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ‘ఈయనేం లీడర్.. మానవత్వం లేదా?’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసింది ఉద్యోగులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటు లో, పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగానే సాగిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసునని చెప్పా రు. వారి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు. ఉద్యోగుల జీతాల మొత్తం భారీగా పెరిగినప్పటికీ, వేతనాలు పెంచామని, కొత్త ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం రాలేదని, అదనంగా డబ్బు ఖర్చయిందని తెలిపారు. చంద్రబాబు దిగిపోతూ ప్రభుత్వంపై రూ.2.90 లక్షల కోట్లఅప్పులు పడేశారన్నారు. ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా, ఆదాయం రాకుండా చంద్రబాబు రోజూ అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అన్న పెద్ద మనిషి.. ఈరోజు 18 ఏళ్లు దాటిన అ మ్మాయిల దగ్గర నుంచి పథకాలు ప్రకటించారని, 50 ఏళ్లు దాటగానే బీసీలకు పెన్షన్ ఇస్తానంటున్నారని అన్నారు. అర్హత ఉన్న వారిని తీసేసీ పథకాలు ఇవ్వడం చంద్రబాబు దగ్గర ఉన్న ట్రిక్కని చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం జల్లెడపట్టి అర్హత ఉన్న వారిని గుర్తించి మరీ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయకుండా అమ్మ ఒడి ఇచ్చి వదిలేసి ఉంటే నిధులు మిగిలేవన్నారు. కానీ సీఎం జగన్ ఎంత కష్టమైనా స్కూళ్లను అభివృద్ధి చేయాల్సిందేనని గట్టి పట్టుదలతో పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఆస్పత్రులకు కోటాను కోట్లు ఖర్చు చేశారని, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తెచ్చారని తెలిపారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టులు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇది అని వివరించారు. కోవిడ్ రెండేళ్లు తీసేస్తే మిగిలిన తక్కువ కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బ్రాహ్మణులలో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సీఎం జగన్ బ్రాహ్మణులకు రాజకీయంగా, ఇతరత్రా సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. 2014 –19 మధ్య రాష్ట్రంలో అరాచకం నడిచిందని, తిరిగి ఆ పాలన వస్తే ప్రజలు కష్టాల పాలవుతారని అన్నారు. అన్ని వర్గాలకు అర్ధమయ్యేలా చెప్పగలిగినది బ్రాహ్మణ సామాజిక వర్గమే కనుక సీఎం జగన్ ప్రకటించినట్లు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కామేశ్వరరావు (పీకేరావు), ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్, జ్వాలాపురం శ్రీ కాంత్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు అమ్మ ప్రసాద్, ద్రోణంరాజు రవికుమార్, పి. పురుషోత్తమ శర్మ, జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు. -
రేపటి నుంచి 'కులగణన'
అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే రోజు రెండు చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ని ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కుల గణనకూ నాంది పలుకుతున్నారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా అడుగులు వేస్తున్నారు. బాబా సాహెబ్ ఆశయాలను నెరవేరుస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. -
మన ప్రభుత్వం ప్రజలకు తోడుగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా... వివిధ పథకాల కింద 68,990 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్ల రూపాయలు జమ ...ఇంకా ఇతర అప్డేట్స్
-
TS: రేషన్కార్డులిస్తూనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ‘తెల్ల రేషన్కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్కార్డులు కూడా ఇస్తాం. రేషన్కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రేషన్కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల చెంతకు పాలన ‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం. వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్ ఇచ్చి డిజిటలైజ్ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు ‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుబందు సీలింగ్పై అసెంబ్లీ చర్చ రైతుబంధుపై సీలింగ్ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్ తెలిపారు. తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. గవర్నర్తో సత్సంబంధాలు కొనసాగిస్తాం ‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్మార్ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
నవరత్నాలు పొందిన కుటుంబం
-
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్కు ఫైనాన్షియల్ మార్కెట్స్కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్షాప్లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
మహా శక్తివంత దేశంగా భారత్
తిరుపతి సిటీ/తిరుమల: ప్రపంచంలో భారత్ మహా శక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య, ఆర్థిక సేవలు, పేదలకు పక్కా గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ప్రధాని మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకు లభించే ప్రయోజనాలు, వివిధ సౌకర్యాలను మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ.5 లక్షలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన, పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్, రైతుల కోసం పీఎం కిసాన్, పీఎం కిసాన్ సమ్మాన్, పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ్ అభియాన్, పేదరిక నిర్మూలన కోసం దీన్దయాల్ అంత్యోదయ యోజన, ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం జన్ధన్, పీఎం జన్ఔషధి యోజన, పీఎం స్వామిత్ర, పెన్షన్ యోజన, ముద్ర యోజన, డిజిటల్ ఇండియా, పీఎం ఫజల్ యోజన, విశ్వకర్మ యోజన, ఉపాధి కల్పన కోసం స్టార్టప్ ఇండియా, అంకుర భారత్, స్వదేశీ దర్శన్, ఉడాన్ పథకం వంటి పథకాలను అందిస్తోందన్నారు. ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్ర«థమ ఉద్ధేశమన్నారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు. తిరుమల చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద గవర్నర్కు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. -
చిన్న నగరాలే కీలకం
న్యూఢిల్లీ: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు. మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్ర లీడ్ బ్యాంక్గా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ చెప్పారు. రిటైల్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా రిటైల్ రుణాలకు డిమాండ్ బాగుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల మెగా రిటైల్ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించి పలువురికి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నితేష్ రంజన్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ప్రశ్న: స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో లీడ్ బ్యాంకర్గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతోంది? జవాబు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. లీడ్ బ్యాంకర్గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిర్దేశించిన వారికి సక్రమంగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. రాష్ట్రంలో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పండుగల సీజన్ కోసం సత్వరం రుణాలను మంజూరు చేసేలా విజయవాడలో మెగా రిటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం. 25 మంది బిల్డర్లు, 12 మంది వాహన డీలర్లు, 7 ఎడ్యుకేషన్కన్సల్టెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టైలర్ మేడ్ రుణ పథకాలను ఆఫర్ చేసి, అక్కడిక్కడే తక్షణం రుణాలు మంజూరు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రశ్న: ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రుణ మార్కెట్పై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతుందా? జవాబు: వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న మాట వాస్తవమే. కానీ దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆటో, ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్ వంటి రుణాలకు డిమాండ్ బాగుంది. గతేడాది యూనియన్ బ్యాంక్ రిటైల్ రుణాలు 17.19 శాతం పెరిగి రూ.1,60,595 కోట్లకు చేరాయి. ఈ ఏడాది కూడా రిటైల్ రుణాల్లో 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రశ్న: వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి? జవాబు: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. మరో రెండు మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్న: ఇతర బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందా? జవాబు: ప్రస్తుతం అన్ని బ్యాంకులకంటే తక్కువ రేటుకే రుణాలు అందిస్తున్నాం. అంతేకాకుండా పండుగుల సీజన్ దృష్టిలో పెట్టుకొనిఅన్ని రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాం. విదేశాల్లో విద్య కోసం రుణాలు తీసుకునే వారికి రూ.40 లక్షల వరకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలిస్తున్నాం. ఆన్లైన్, యాప్ల ద్వారా క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్రశ్న: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రుణాల మార్కెట్పై ఎటువంటి ప్రభావం చూపుతాయి? జవాబు: ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం కనిపించడం లేదు. రుణాల మార్కెట్పై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పటికే పండుగుల సీజన్ మొదలైంది. ఇది నాలుగో త్రైమాసికం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. -
బీఆర్ఎస్కు ఓటేసే వారికే దళితబంధు, ప్రభుత్వ పథకాలు
చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి, తమకు ఓటు వేసే వారికే దళితబంధు, ఇత ర ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి స్సంపల్లిలో దళితబంధు రాలేదని స్థానిక దళితులు ఎమ్మెల్యేను అడిగేందుకు వచ్చారు. అయితే బీఆర్ ఎస్ నాయకులు అడ్డుపడటంతో ఇరువురికి వా గ్వాదం జరిగింది. అనంతరం జరిగిన సభలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 దళి తబంధు యూనిట్లు వస్తే అందులో 80 విస్సంపల్లి గ్రామానికి మంజూరు చేశామన్నారు. ‘గతంలో ఈ గ్రామం నుంచి ఓట్లు పడలేదు. ఎవరు ఓటు వేస్తారో, వేయరో మాకు తెలుసు. మా పార్టీలో పని చేసే వారికే, మాకు ఓటు వేసే వారికి మాత్రమే దళితబంధు, ప్రభుత్వ పథకాలు ఇస్తాం’అని అనడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
ఎస్బీఐ బ్యాంక్ : ఆధార్ ఉంటే చాలు, ఇక ప్రభుత్వ పథకాల్లో సులభంగా చేరొచ్చు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకాలలో ఆధార్ సాయంతో పేర్ల నమోదుకు వీలు కల్పిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీలు) వద్ద ఈ సేవలకు సంబంధించి సదుపాయాన్ని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రారంభించారు. ఎస్బీఐ కస్టమర్లు సీఎస్పీ వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. అకౌంట్ పాస్బుక్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక భద్రత పొందేందుకు ఉన్న అడ్డంకులను ఈ నూతన సదుపాయం తొలగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. -
TS Election 2023: 'లక్ష' సాయానికి అర్హుల జాబితాలో.. కార్పొరేటర్ భర్త పేరు!
పెద్దపల్లి: ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంటతో అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా కుల, చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో శ్రీబీసీబంధుశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చే రూ.లక్ష సాయంతో ఆయా కులవృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది. అయితే క్షేత్రస్థాయిలో తొలివిడత సాయం పంపిణీలో నేతల అనుచరుల కమీషన్లతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. కమీషన్ ఇవ్వనిదే చెక్కు ఇవ్వని పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొందని సాయం పొందినవారే ఆరోపిస్తున్నారు. మలివిడతలోనైనా కమీషన్లు, నేతల సిఫారసులు లేకుండా పూర్తి సాయం అందేలా చూడలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రూ.10వేలు ఇవ్వాల్సిందే.. విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర 14 కులాలు, ఏంబీసీ కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు జూన్ 6నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారులకు తెల్లరేషన్కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది నిబంధన. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలకు లోబడి ఉన్న వారిని గుర్తించాలి. ఇలా జిల్లాలో మొత్తం 10,759మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,765 మందిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 8,683 మందిని అర్హులుగా తేల్చారు. అందులో తొలివిడుతలో భాగంగా పెద్దపల్లి, రామగుండంలో 300 మందికి, మంథనిలో 180, ధర్మారంలో 65 మందిని తొలివిడత ఎంపిక చేశారు. అయితే తొలివిడతలోనే తమ అనుచరులకు చోటుకల్పించాలనే ఆలోచనతో నేతలు, వారి అనుచరుల సిఫారసుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే అదునుగా తమ బంధువులు, అనుచరులు, లేదా రూ.10నుంచి 15వేలు కమీషన్ ఇచ్చిన వారికే తొలివిడతలో చోటు కల్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా లేనివారి పేర్ల స్థానంలో ఆర్థికంగా బాగున్న వారి పేర్లతో జాబితా ఉండటంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి వివరణ కోరగా నిబంధనల మేరకే.. మంత్రి ఆమోదంతోనే ఎంపికచేశామని తెలిపారు. దళారులకు డబ్బులు ఇవ్వద్దొని, అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. అభివృద్ది నేను చూసుకుంటా.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ నిత్యం తిరిగే ఓ ఎంపీపీ భర్త ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తులకు అందించే రూ.లక్ష సాయం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. సాయానికి ఎంపికై న ఓ లబ్ధిదారుడు కమీషన్ ఇవ్వకపోవడంతో అతడి చెక్కు పంపిణీ కాకుండా అడ్డుకోవడంతో అతడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెక్కు ఇచ్చాడన్న ఆరోపణలు వస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.లక్ష సాయానికి అర్హుల జాబితాలో ఏకంగా కార్పొరేటర్ భర్త పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో రామగుండం పరిధిలో కొంతమంది కార్పొరేటర్లు వారి బంధువులకే దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈ లక్ష రూపాయల సాయంలోనూ బంధువులు, లేదా కమీషన్ ఇచ్చినవారికే ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. -
Andhra Pradesh: ‘పల్లె’కు కొత్త రూపు!
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని పాతమల్లంపేట పంచాయతీలో 18 గిరిజన కుటుంబాలు మాత్రమే ఉన్న కుగ్రామం చంద్రయ్యపాలెం. ఇక్కడి ప్రజలకు నాలుగేళ్ల క్రితం వరకు పక్కా ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. పేదరికానికి మారుపేరుగా ఉన్న వీరు పగలంతా కాయకష్టం చేయడం, కొద్దిపాటి పొలంలో జీడి మామిడి పంట సాగు చేసుకోవడం, రాత్రయితే గుడిసెల్లో బతుకులీడ్చడం.. ఎన్నో తరాలుగా ఇదే వారి జీవన విధానం. గుడిసెల్లోకి వచ్చే విష సర్పాల బారి నుంచి పిల్లలను పంచకు కట్టిన ఊయల్లోనే ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి ఈ కుగ్రామం పరిస్థితి వైఎస్ జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఆ 18 కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు వివిధ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.91,40,000 వీరి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బుతో గొర్రెలు, మేకలు, పాడె గేదెల పెంపకం చేపట్టి కూలి/ వ్యవసాయానికి అనుబంధంగా ఆదాయం పొందుతున్నారు. వీరి ఇళ్ల వద్దకే రేషన్, 104 ద్వారా వైద్యం అందుతోంది. ► ఈయన పేరు కురచ అప్పారావు. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన ఈయన నాలుగేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.5,85,285 లబ్ధి పొందారు. రైతు భరోసా నుంచి ఇంటి స్థలం వరకు 12 ప్రభుత్వ పథకాలను అందుకున్నారు. ‘ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారు.. అధికారంలోకి రాగానే ఒక్కటీ చేయరు. 2019 ఎన్నికల్లోనూ అలాగే అనుకున్నాను. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు. అందుకు నేనే ఉదాహరణ. మా అబ్బాయికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించాను. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపించారు. ఇంత గొప్ప పాలన ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని సంబరపడుతున్నాడు. ► ఇతను అనకాపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న బుడ్డోడుపాడు గిరిజన గ్రామానికి చెందిన సెగ్గే రాజబాబు. దాదాపు 15 సంవత్సరాలు టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పని చేశారు. పాతమల్లంపేట పంచాయతీ పరిధిలో 42 కుటుంబాలున్న ఈ గ్రామానికి రోడ్డు కోసం దశాబ్దాలపాటు శ్రమించారు. ‘మా గ్రామం చుట్టూ కొండ వాగులే, నడిచే మార్గం ఉండేది కాదు. వర్షాకాలంలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీల్లో వాగులు దాటించే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కోసం స్థానిక టీడీపీ నాయకుడిగా ఎంతో పోరాడాను. ఎమ్మెల్యేకు వినతి ఇస్తే పక్కన పడేసేవారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఎమ్మెల్యేను ఒక్కసారి కలిసి అడగ్గానే హామీ ఇచ్చారు. కానీ రోడ్డు వేయకుండా మా టీడీపీ నాయకులు అడ్డుపడితే పట్టుబట్టి రోడ్డు వేయించారు. మోటారు సైకిలు చూడని మా ఊరికి ఇప్పుడు 104, 108 వాహనాలు నేరుగా వస్తున్నాయి. మా తాత, తండ్రుల కాలంలో ఊరికి రోడ్డు ఉంటే బాగుండు అని ఆశ పడ్డారు. నా తరంలో కూడా రోడ్డు చూస్తానన్న ఆశ పోయిన తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అది సాకారమైంది’ అని తెలిపాడు. ►టీడీపీకి కంచుకోటలాంటి పాతమల్లంపేట పంచాయతీలోని 18 కుటుంబాలున్న చంద్రయ్యపాలెం గిరిజన గ్రామానికి చెందిన రుత్తల పెంటయ్య.. ఇప్పటిదాకా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఈయన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో గొర్రెలను కొనుక్కొని రైతుగా మారాడు. ‘ఎకరం పొలం ఉంది, కొన్ని రోజులే వ్యవసాయ పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లో కూలి చేసుకోవాలి. ఇప్పుడు పాపకు అమ్మ ఒడి ఇస్తున్నారు. అమ్మకు పెన్షన్ వస్తోంది. ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులతో గొర్రెలు పెంచుతూ ఆదాయం పొందుతున్నా. ఇల్లు కూడా మంజూరైంది. సంతోషంగా బతుకుతున్నాం’ అని ఆనందంగా చెబుతున్నాడు. నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా ఉన్న గ్రామాలు నాలుగేళ్లుగా కొత్త మార్పు దిశగా పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. దాదాపు 26 సంక్షేమ పథకాల్లో వ్యక్తిగతంగా ప్రజలు సగటున నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారు. ‘కులం, మతం చూడం, ఏ పార్టీ అని చూడం, అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తాం, ఆ ప్రాతిపదికనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి’ అని సీఎం వైఎస్ జగన్ తరచుగా చెప్పే మాట మారుమూల పల్లెల్లో సాక్షాత్కరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఊళ్లన్నీ మారిపోతున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యమైందో ఆయా ఊళ్లలోని ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారు. 1850 కుటుంబాలకు రూ.22.62 కోట్ల లబ్ధి ఇది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, ఆరి్థక మంత్రిగా పని చేసిన నాయకుడు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలోని ఈ గ్రామం పరిస్థితి నాలుగేళ్ల క్రితం వరకు దయనీయం. మూడు కి.మీ రోడ్డు కోసం పదేళ్లకు పైగా ఎదురుచూపు.. శిథిలమైన ప్రభుత్వ బడులను బాగుచేసే నాథుడే కరవు.. డ్రైనేజీ వ్యవస్థే లేదు.. పథకాల కోసం నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు.. ఏ కొందరికో అరకొర ఇచ్చే పింఛన్లలోనూ కోతలు.. ఇలా సవాలక్ష సమస్యలు. 2019 ఎన్నికల తర్వాత 1850 కుటుంబాలు, 5,010 జనాభా ఉన్న ఈ ఊళ్లో ఎవరూ ఊహించని విధంగా మార్పు మొదలైంది. రూ.కోటి నిధులతో మండల కేంద్రాన్ని కలుపుతూ రోడ్డు వేశారు. శిథిలమైపోయిన ఉన్నత పాఠశాలను నాడు–నేడు రెండో విడతలో పునర్ నిర్మిస్తున్నారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు వచ్చాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇదే ఊళ్లోనే ఇస్తున్నారు. రెండు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ఏర్పాటయ్యాయి. 17 మంది ఉద్యోగులు రోజూ స్థానికంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. 35 మంది వలంటీర్లు ప్రతి ఇంటికీ అందుబాటులో ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఉదయాన్నే 777 మందికి పెన్షన్లు అందిస్తున్నారు. 373 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో రోడ్డు, డ్రైనేజీలు, అంతర్గత సీసీరోడ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మిస్తున్నారు. రెండు ఎంపీపీ స్కూళ్లు, ఒక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా పుస్తకాలు, బ్యాగు వంటి సమస్త వస్తువులు అందుతున్నాయి. దాదాపు 400 మంది తల్లులు అమ్మ ఒడి అందుకుంటున్నారు. మరో 152 మంది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారు. మొత్తంగా గ్రామ ప్రజలు వివిధ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.22,62,25,944 లబ్ధి పొందారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప కనిపించని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా రెండు, మూడు పర్యాయాలు గ్రామానికి వచ్చి బాగోగులు కనుక్కుంటున్నారు. ‘ప్రభుత్వం అంటే రేషన్ కార్డులు ఇవ్వడం, రోడ్లు వేయడం మాత్రమే చేస్తుందనుకున్నాం. ఇలా ఇన్ని మంచి పనులు చేయొచ్చని నాలుగేళ్లుగా సీఎం నిరూపించారు’ అని గ్రామస్తులు కితాబిస్తున్నారు. మరో ప్రపంచాన్ని చూస్తున్న బుడ్డోడుపాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాత మల్లంపేట పంచాయతీ చుట్టూ 14 చిన్న చిన్న వాడలున్నాయి. ఇందులో బుడ్డోడుపాడు ఒకటి. 42 గిరిజన కుటుంబాలున్న ఈ వాడకు 70 ఏళ్లుగా రోడ్డు మార్గం లేదు. ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే దాదాపు 12 కి.మీ మేర వాగులు, వంకలు, డొంకలు దాటి రావాలి. జబ్బు చేస్తే డోలీలో తరలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. సైకిల్ తప్ప ఇతర ద్విచక్ర వాహనాన్నే చూడని ప్రజలు, పండించిన పంటను సైతం మంచి ధరకు అమ్ముకోలేని దుస్థితి. కనీసం పిల్లలను చదివించుకుందామన్నా రోజూ ఇద్దరు మనుషులు పిల్లలకు రక్షణగా ఉండి వాగులు దాటించి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాల్సిన స్థితి. వర్షం వస్తే పొంగుతున్న వాగులు దాటలేక ఎక్కడో చోట తలదాచుకోవాల్సిన పరిస్థితులు. వాడంతా టీడీపీకి అనుకూలమే. కానీ ఏరోజూ ఏ నాయకుడూ ఇటు ౖవైపు కన్నెత్తి చూసేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ఈ వాడకు మంచి రోజులు వచ్చాయి. ‘టీడీపీ సానుభూతిపరులమన్న మాటేగాని గత టీడీపీ ప్రభుత్వంలో మేం పొందిన మేలు లేదు, మా కష్టాలు విన్న నాయకులూ లేరు. మమ్మల్ని మనుషులుగా గుర్తించింది మాత్రం జగన్ ప్రభుత్వమే’ అని 60 ఏళ్ల సెగ్గే రాజబాబు ఆవేదన వెలుబుచ్చాడు. ఇప్పుడు స్థానికంగా ఉండే వలంటీర్ ప్రతినెలా 21 మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. 18 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. గతంలో చదువు కోసం పిల్లలను 9 కి.మీ దూరంలోని వేరే ఊరికి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడే ఐదవ తరగతి వరకు పాఠశాల ఏర్పాటైంది. 22 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఏడుగురు విద్యార్థులు పై చదువుల కోసం వేరే ఊళ్లకు వెళ్లి వస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో 1,87,7000 జమ అయింది. ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.1.52 కోట్ల మేర ఇక్కడ అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ వాడకే నేరుగా వాహనాలు వస్తుండడంతో పండించిన జీడిమామిడి పంటను స్థానికంగా అమ్ముకున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక నర్సీపట్నం ఎమ్మెల్యే మూడుసార్లు గ్రామానికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో మా పెద్దలు ఎప్పుడూ ఎమ్మెల్యే ఎలా ఉంటారో చూడలేదు. సచివాలయాలు వచ్చాక అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి. ఎన్నో దశాబ్దాల కల అయిన రోడ్డు కూడా జగనన్న ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీ. – తూబిరి రాజబాబు, మాజీ వైస్ సర్పంచ్, బుడ్డోడుపాడు నాలుగేళ్లలో రూ.4 లక్షల సాయం మా ఇంట్లో ఇద్దరికి వికలాంగుల పెన్షన్ వస్తోంది. వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం కూడా ఇచ్చారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే విశాఖపట్నం ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చారు. వలంటీర్లు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏమన్నా సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. ఇప్పటి దాకా వివిధ పథకాల ద్వారా మాకు రూ.4,05,500 వచ్చింది. – చింతకాయల మంగాయమ్మ, అల్లిపూడి గ్రామం ఇంత మంచి పాలన చూడలేం మా పెద్దబ్బాయికి మూడేళ్లు వసతి దీవెన వచ్చింది. చిన్నబ్బాయికి నాలుగేళ్లు జగనన్న అమ్మ ఒడి కూడా తీసుకున్నాం. ఏడు ప్రభుత్వ పథకాల ద్వారా నాకు రూ.2,51,250 నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగోలేని మాలాంటి కుటుంబాలు బతికేదే కూలి పనుల పైన. భర్త చనిపోయిన నాకు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి వద్దే బడ్డీ కొట్టు పెట్టుకున్నా. జగనన్న వల్ల అందరం చక్కగా బతుకుతున్నాం – వడ్డి సత్యవతి, అల్లిపూడి గ్రామం నా బిడ్డ ఇంజనీర్ అవుతోంది.. మా బాబు చదువుకునేటప్పుడు ఇన్ని ప్రభుత్వ పథకాలు లేవు. ఎలాంటి సాయం కూడా అందలేదు. మా పాప మాత్రం ప్రభుత్వ పథకాలతోనే ఇంజినీరింగ్ చదువుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు కొద్దిపాటి పొలానికి రైతు భరోసా వచ్చింది. మా ఆయనకు వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పటి దాకా మా కుటుంబానికి రూ.3,75,089 సాయం అందింది. – చింతకాయల నాగరత్నం, అల్లిపూడి పిల్లల చదువు కష్టాలు తీరాయి మా పెద్దబ్బాయి చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా చిన్నబ్బాయికి అమ్మ ఒడి వస్తోంది. మాకు రైతు భరోసా, చేయూతతో పాటు పెద్ద వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఏడాదికి అన్ని పథకాల రూపేణా రూ.70 వేలకు పైనే సాయం అందింది. గతంలో ఊరు దాటి బయటకు వెళ్లాలంటే బతుకుపై ఆశ వదులుకునేవారం. ఇప్పుడు చక్కటి రోడ్డు వేయడంతో ఏ సమయంలోనైనా బయటి ప్రాంతానికి నిర్భయంగా వెళ్లగలుగుతున్నాం. – బోయిన చినతల్లి, వెంకటేశ్వర్లు దంపతులు, బుడ్డోడుపాడు -
జాబితా సిద్ధం..! గ్రీన్సిగ్నల్ కోసం ఆరాటం..!!
వరంగల్: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్సిగ్నల్ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు. మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు. మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున.. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్ఘన్పూర్కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్ లేదా ప్లస్ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు. వారంలో పంపిణీకి సిద్ధం జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు. రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దళారులను నమ్మొద్దు.. రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -
గూడేనికి కొత్త గుర్తింపు
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి. వేర్వేరు కమిషన్ల ఏర్పాటు.. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్ ప్రసాద్ను 2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ పనితీరులో మైలు రాళ్లు.. ► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్ ఆరా తీస్తోంది. ► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది. ► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్ఓఎఫ్ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్సింగ్ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. –వడిత్యా శంకర్ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నీటి తిప్పలు తీర్చారు గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. –ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. –టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. –గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి బాక్స్లో హైలెట్ చేయగలరు ► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 ► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్ కార్డులిచ్చారు. ► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు. ► ఆధార్ కార్డులు రావడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు. -
అభాగ్యులకు అండగా..
సాక్షి, నెట్వర్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమస్యకు పరిష్కారం ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయ్యింది. దీంతో ఆమె పింఛన్ ఆగిపోయింది. ‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్ మెహరున్నీసా, వలంటీర్లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్ను తొలగించారు. ఆ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నిరక్షరాస్యులకు ఎంతో మేలు ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్ ఇతని పేరు శర్మాస్ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డు పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్ ఇంటికి వచ్చినపుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్.. సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా -
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపు ఏళ్లు గడుస్తున్నా కదలని ఫైళ్లు
వికారాబాద్: జిల్లాలోని అనేక మంది అర్హులకు ఆహార భద్రత కరువైంది. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత ఒకేసారి కొత్త కార్డులు జారీచేసింది. ఈ సమయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో మిగిలిన వారంతా రేషన్తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా కార్డుల్లో కొత్త పేర్లను చేర్చే విషయంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఆహార భద్రతపథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు ఆరు వేలకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఆయా కుటుంబాల్లో పెళ్లిళ్లు, ప్రసవాలు జరిగి సభ్యులసంఖ్య పెరిగింది. మృతి చెందిన వారి పేర్లను కార్డుల్లోంచి తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా వచ్చిన వారి వివరాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. 35,000 పెండింగ్ ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాను ఆన్లైన్లో పెట్టింది. కానీ వీరికి కార్డులు జారీ చేయకుండా ఏడాదికి సరిపడే కూపన్లు అందజేసింది. ఆతర్వాత బయోమెట్రిక్ విధానంలో బియ్యం సరఫరా చేస్తోంది. కానీ కొత్తగా ఆయా కుటుంబాల్లోకి వచ్చిన వారిని చేర్చడంపై మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉన్నారు. వీరందరూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకోని వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటికీ మోక్షం కలిగితే జిల్లాకు మరో 210 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరగనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్పై రాష్ట్ర సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నష్టపోతున్నారు. 2,41,622 కార్డులు జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరలదుకాణాలు, 2,41,622 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 2,14,853 ఎఫ్ఎస్సీ, 26,730 అంత్యోద య, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో లబ్ధిదారులందరికీ సబ్సిడీపై చక్కర పంపిణీ చేయగా ప్రస్తుతం అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేశాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. – రాజేశ్వర్, డీఎస్ఓ -
23 నుంచి ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా, పటిష్టంగా అమలు చేసేందుకు దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు. జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్కమ్, మ్యారేజీ, డెత్ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి. సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి. గ్రామాలకు రెండు బృందాలు మండల స్ధాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక బృందంగా, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఈవో కలసి రెండో టీమ్గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. వార్డులకు మున్సిపల్ బృందాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్గా ఉంటారు. జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. సేవల్లో ఉన్నత ప్రమాణాలు.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్ధంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. 99.35 శాతం వినతులు పరిష్కారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్వోడీలతో పాటు రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది. సీఎంవో, సచివాలయం, విభాగాధిపతుల దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది. తిరస్కరిస్తే ఇంటికెళ్లి వివరించాలి ఒకవేళ గ్రీవెన్స్ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి. ఈమేరకు ఎస్వోపీలో మార్పులు తేవాలి. రిజెక్ట్ చేసిన గ్రీవెన్స్ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి. గడప గడపకూ పనులకు నిధుల కొరత లేదు గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం. ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు ఈ డబ్బులు మంజూరు చేయాలి. వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి. ఆగస్టు 1న అర్హులకు పథకాలు జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్ఓడీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి. -
ఫ్యాక్ట్ చెక్ : తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తు తరానికి పెట్టుబడి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద సంక్షేమ కేలండర్ ప్రకారం విద్యా సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పేదింటి పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అంగన్వాడీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్తోపాటు విదేశాల్లో చదువుకునేందుకూ ఈ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థినీ ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 45 నెలల్లో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.57,642.36 కోట్లు ఖర్చుచేసింది. ఉన్నత సంకల్పంతో అమలుచేస్తున్న పథకాలతో వచ్చిన మార్పులు, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పచ్చ గంతలు కట్టుకున్న ‘ఈనాడు’ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. సంక్షేమ కేలండర్ ప్రకారమే నిధులు విడుదల విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఫీజుల ఒత్తిడి లేకుండా ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తోంది. అక్టోబరు–నవంబర్–డిసెంబరు–2022 త్రైమాసికానికి 9,86,092 మంది విద్యార్థులకు రూ.684.52 కోట్లను మార్చి 19న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి మే 24న రూ.702.99 కోట్లు అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ముందుగా నిర్దేశించిన సంక్షేమ కేలండర్ ప్రకారమే, క్రమం తప్పకుండా ఇలా నిధులు విడుదల చేస్తున్నా.. వాస్తవాలను కప్పిపుచ్చి పచ్చ పత్రిక రోత రాతలు రాస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న 9,55,662 మంది పిల్లలకు ‘వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను ఏప్రిల్ 26న జమచేసింది. అయినప్పటికీ ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘జగనన్నా ఇదేనా విద్యా దీవెన’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనం వండి వార్చింది. అప్పట్లో అరకొర చెల్లింపులు.. అనేక కొర్రీలు గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు కాలేజీ స్థాయిని బట్టి రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం రూ.35 వేలకే పరిమితం చేసి, అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పైగా ఏళ్ల తరబడి బకాయిలు. అప్పట్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆవేదను కనీసం పట్టించుకోని ఈనాడు.. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నా బురద జల్లుతోంది. చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు (2017–18, 2018–19) రూ.1,778 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అలాగే, విద్యార్థుల వసతి కోసం అనేక కొర్రీలూ పెట్టింది. కుల ప్రాతిపదికన, కోర్సుల ప్రాతిపదికన రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే తక్కువ మందికి ఇచ్చింది. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లల్లో ఈబీసీ, కాపు విద్యార్థులకు చోటులేకుండా చేసింది. అంతేకాక.. బాబు జమానాలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలని నిబంధన పెట్టి ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. ఇవేవీ ఆ పచ్చ పత్రికకు పట్టవు. ఈ నాలుగేళ్లలో విద్య, వసతి దీవెనకు రూ.14,210 కోట్లు.. కానీ, ప్రసుత్త ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు చేరువ చేసింది. ఏ విద్యార్థి చదువూ ఆగిపోరాదని ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా సగటున రూ.3,311 కోట్లు చొప్పున రూ.9,934 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ‘జగనన్న వసతి దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకైతే రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు చొప్పున ఏడాదిలో రెండుసార్లు తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా విద్యార్థులకు రూ.4,275.76 కోట్లు చెల్లించింది కూడా. అంటే ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 2019–20 నుంచి 2022–23 వరకు (మే 24న విద్యా దీవెన కింద చెల్లించే రూ.702.99తో కలిపి) సుమారు రూ.14,210 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసింది. ఇదేదీ ‘ఈనాడు’కు కనిపించదు. విద్యార్థులకు అండగా ‘1902’ టోల్ఫ్రీ నంబర్.. ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎవరైనా యాజమాన్యలు వినకపోతే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు 1902 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఈ నంబర్కు ఫిర్యాదు చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయమే (సీఎంఓ) నేరుగా కాలేజీలతో మాట్లాడుతోంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారు వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. కానీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిధులు చెల్లించిందంటూ ఈనాడు నిరాధార ఆరోపణులు చేయడం సిగ్గుచేటు. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
ఆసరా, చేయూత పథకాల తోడ్పాటుతో చేయూత మహిళా మార్ట్ ల ఏర్పాటు
-
ఫలితమిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు
-
అదిరిపోయే ఐడియాలు..ప్రతి నెలా ఆదాయం కావాలా?
ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్థిరమైన ఆదాయం ఉండాలి కానీ, ఇక్కడ రిస్క్ దాదాపు ఉండకూడదనుకునే వారి ముందున్న ఏకైక మార్గం డెట్ సాధనాలే. ఉద్యోగ విరమణ చేసిన వారికి.. అప్పటి వరకు నెల నెలా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. పింఛను ఏర్పాటు ఉన్న వారికి, ఆ తర్వాత కూడా ఎంతో కొంత మొత్తం ప్రతి నెలా చేతికి అందుతుంటుంది. కానీ, ఆ విధమైన ఏర్పాటు లేని వారు ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సిందే. క్రమం తప్పకుండా ఆదాయం కోసం అందుబాటులో ఉన్న సాధనాల గురించి తెలిపే కథనం ఇది... ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్లు ప్రతి నెలా వడ్డీని చెల్లించే ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం ఆఫర్ చేస్తాయి. వడ్డీ ఆదాయం సేవింగ్స్ అకౌంట్లోనే జమ అవుతుంది. కనుక కావాల్సినప్పుడు ఆ మొత్తాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. త్రైమాసికం వారీగా, ఏడాదికోసారి వడ్డీని చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాంక్ల్లో నెలసరి ఆదాయం (మంత్లీ ఇన్కమ్) చెల్లించే డిపాజిట్లపై వడ్డీ రేటు 10 ఏళ్ల కాల వ్యవధికి గరిష్టంగా 6.5 శాతం వరకు ఉంది. బ్యాంక్ల మధ్య ఈ రేటు వేర్వేరుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు నిండిన) బ్యాంకులు అర శాతం అధికంగా ఆఫర్ చేస్తున్నాయి. అనుకూలం/ప్రతికూలం బ్యాంక్ల్లో డిపాజిట్లు ఎంతో సౌకర్యం. బ్యాంకు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు లేదంటే ప్రముఖ ప్రైవేటు బ్యాంకులను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. మరీ చిన్న బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల్లో కొంత అదనపు రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ, ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక డిపాజిటర్కు రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాంకు సంక్షోభంలో పడితే ఈ మొత్తం రావడానికి సమయం పట్టొచ్చు. అందుకని ముందే పటిష్ట బ్యాంకులను ఎంపిక చేసుకుంటే సరి. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వృద్ధులు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల ఆదాయంపై పన్ను లేదు. ఇంతకుమించిన ఆదాయం వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్ అమలు చేస్తుంటాయి. కనుక ఆదాయపన్ను వర్తించని వారు ఫామ్ 15జీ/హెచ్ సమర్పిస్తే సరిపోతుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ ఇది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే, ప్రతి నెల వడ్డీ ఆదాయాన్ని పోస్టల్ సేవింగ్ అకౌంట్లో జమ చేయడం జరుగుతంది. దీనిపై 6.6 శాతం రేటు ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక్కరు అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. జాయింట్గా అయితే ఈ పరిమితి రూ.9 లక్షలుగా ఉంది. అనుకూలం/ప్రతికూలం బ్యాంకులతో పోలిస్తే కాస్తంత వడ్డీ రేటు ఇందులో ఎక్కువ. పైగా ఇందులో పెట్టుబడులకు భారత ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. కాకపోతే, బ్యాంకు డిపాజిట్ల మాదిరి సౌకర్యం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఉండదు. పోస్టాఫీసుకు వెళ్లే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉపసంహరణకు కూడా వెళ్లాలి. వృద్ధులు, చిరునామా మారే వారికి ఇది అసౌకర్యం. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయంలో చూపించి చెల్లించాలి. ఐదేళ్లలోపు క్లోజ్ చేస్తే పెనాల్టీ పడుతుంది. బ్యాంకుల్లో ఎలాంటి పెనాల్టీలు ఉండవు. కంపెనీల ఎన్సీడీలు కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి కంపెనీల ఎన్సీడీలను షేర్ల మాదిరే కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. వడ్డీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటిల్లో వడ్డీ రేటు 6–11 శాతం మధ్య ఉంటుంది. ఎన్సీడీల కాల వ్యవధి 3–8 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏఏఏ రేటెడ్ కలిగిన ఎన్సీడీల్లో పెట్టుబడులు పెట్టడం వరకే పరిమితం కావాలి. అనుకూలం/ప్రతికూలం బ్యాంకుల కంటే వడ్డీ రేటు ఎక్కువ. కానీ, ఎటువంటి హామీ ఉండదు. డీమ్యాట్ ఖాతా ఉంటే సులభంగా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజ్ల ద్వారా కొనుగోలు చేస్తే టీడీఎస్ పడదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ఎన్సీడీల కొనుగోలు, విక్రయాల పరంగా లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ డెట్ లేదా ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుని, ప్రతి నెలా నిర్ణీత మొత్తం లభించేలా సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై రాబడి బ్యాంకు డిపాజిట్ల స్థాయిలోనే 5–6 శాతం (వార్షిక) మధ్య ఉంటుందని అనుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, పథకం పనితీరు ఆధారంగా స్వల్ప మార్పులు ఉండొచ్చు. కావాల్సిన ఆదాయం ప్రతి నెలా వచ్చేలా ఇన్వెస్టర్లు తమ స్వేచ్ఛకొద్దీ ఎస్డబ్ల్యూపీని నిర్ణయించుకోవచ్చు. రాబడి మేరకు తీసుకుంటే ఫర్వాలేదు. అది చాలదనుకుంటే పెట్టుబడి నుంచి కూడా కొంత మొత్తం తీసుకున్నట్టు అవుతుంది. అనుకూలం/ప్రతికూలం ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పన్ను పరంగా ఇది మెరుగైన సాధనం. అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి అనుకూలం. పెట్టుబడి, ఉపసంహరణ అంతా సులభంగా ఉంటుంది. ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ అన్నవి డెట్, ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ కొన్ని సందర్భాల్లో తప్పించి దాదాపుగా ఉండదు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు యాన్యూటీ ప్లాన్లను ఆఫర్ చేస్తుంటాయి. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత రేటుపై ప్రతి నెలా ఇవి చెల్లింపులు చేస్తాయి. 60 ఏళ్లు దాటిన వారికి అయితే పెట్టుబడి పెట్టిన మరుసటి నెల నుంచి చెల్లింపులు చేసే ఇమీడియట్ యాన్యూటీ ప్లాన్లు, ఇంకా రిటైర్మెంట్కు సమయం ఉన్నవారి కోసం డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్లు ఉన్నాయి. పెన్షన్ కోరుకునే వారు ఇమీడియట్ యాన్యూటీలను ఎంపిక చేసుకోవాలి. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసే వారు సైతం 60 ఏళ్లు వచ్చిన తర్వాత సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతమే వెనక్కి తీసుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యూటీ ప్లాన్ను తీసుకోవడం తప్పనిసరి. ఎల్ఐసీలో జీవన్ అక్షయ్ పెన్షన్ ప్లాన్, జీవన్ శాంతి యూన్యూటీ ప్లాన్లే. వీటిల్లో రాబడి 4–7 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం యాన్యూటీ ప్లాన్ల కొనుగోలు సులభం. బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా ఆదాయం జమ అవుతుంది. ఇందులో ఆదాయానికి, పెట్టుబడికి పూర్తి గ్యారంటీ ఉంటుంది. యాన్యూటీ ప్లాన్ ఒక్కసారి కొనుగోలు చేశామంటే జీవితాంతం కొనసాగించాల్సిందే. బ్యాంకు ఎఫ్డీల కంటే రాబడి తక్కువ. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇదేమంత ఆకర్షణీయమైన సాధనం కాదు. రియల్ ఎస్టేట్ అద్దెలు అద్దెలు కూడా క్రమం తప్పకుండా ఆదాయ మార్గమే. నివాసం అయితే రాబడి 1–4 శాతం మధ్యే ఉంటుంది. వాణిజ్య ప్రాపర్టీ అయితే రాబడి 5–12 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం ఏటేటా ఎంతో కొంత చొప్పున అద్దె ఆదాయం పెరుగుతుంది. కనుక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కేవలం ఆదాయం కోణంలోనే ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టలేము. ఎందుకంటే కావాల్సినప్పుడు వేగంగా అమ్ముకునే వెసులుబాటు అంతగా ఉండదు. ప్రాపర్టీ కొనుగోలుకు అధిక పెట్టుబడి అవసరం అవుతుంది. పన్ను ఆదా బాండ్లు.. అధిక ఆదాయపన్ను పరిధిలోని వారికి ఇవి మరింత అనుకూలం. పన్ను లేని ఆదాయాన్ని అందుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత కాలవ్యవధికి ముందు బాండ్లలోని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే కనుక, అప్పుటి వరకు పొందిన లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. గతంలో ఏటా ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసేది. గత కొన్నేళ్లుగా వీటి జారీ లేదు. సెకండరీ మార్కెట్ నుంచి (డీమ్యాట్ ఖాతా ఉన్నవారు) కొనుగోలు చేసుకోవచ్చు. రాబడి 6–6.50 శాతం శ్రేణిలో వస్తుంది. అనుకూలం/ప్రతికూలం వడ్డీ ఆదాయంపై పన్ను లేకపోవడం సానుకూలం. బ్యాంకు ఎఫ్డీలకు తగ్గకుండా ఆదాయం ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో వస్తుంది. అదే బ్యాంకు ఎఫ్డీల ఆదాయం అయితే పన్ను పరిధిలోకి వస్తుంది. దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడులు కొనసాగించాల్సి రావడం అందరికీ అనుకూలం కాకపోవచ్చు. ముందే తీసుకుంటే వడ్డీ ఆదాయంపై పన్ను పడుతుంది. ఈ బాండ్లలో ఎక్కువ వాటికి వార్షికంగా చెల్లింపులు చేసే ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ప్రతికూలం. సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొంత రిస్క్ తీసుకునే వారికి రిస్క్ తీసుకునే వారు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో వీటిల్లో రాబడులు వార్షికంగా 12 శాతం వరకు ఉన్నాయి. దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వీటిల్లో ఏకమొత్తంలో కాకుండా.. ఆరు నుంచి 12 నెలసరి వాయిదాల్లో తమవద్దనున్న కార్పస్ను ఇన్వెస్ట్ చేసుకుని, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. అనుకూలం/ప్రతికూలం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 25% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఈ మేరకు అధిక రాబడికి అవకాశం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు సమయాల్లో పెట్టుబడిని కాపాడుకునేందుకు ఉపసంహరణను కొంత వరకు తగ్గించుకోవాల్సి రావచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎంతో పాపులర్ పథకం. 60 ఏళ్లు నిండిన వారు ఇందులో డిపాజిట్ చేసుకోగలరు. 55 ఏళ్లు నిండి, పదవీ విరమణ తీసుకున్న వారు కూడా అర్హులే. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇది బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ. ఈ రేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు (ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో) వడ్డీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయన్ని ఇచ్చే సంప్రదాయ సాధనాల్లో ఇది మెరుగైనది. అనుకూలం/ప్రతికూలం ఇందులో పెట్టుబడికి ఎటువంటి రిస్క్ లేదు. భారత ప్రభుత్వం హామీనిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టుబడిని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కోరొచ్చు. భార్యా, భర్త వేర్వేరు ఖాతాలను తెరవొచ్చు. పోస్టాఫీసులే కాకుండా బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడమే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవడం సులభం. ఇందులో ఆదాయంపై టీడీఎస్ అమలవుతుంది. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఫామ్ 15జీ/హెచ్ ఇస్తే టీడీఎస్ మినహాయించరు. ప్రధానమంత్రి వయవందన యోజన 2017 మే నుంచి అందుబాటులోకి వచ్చిన పథకం ఇది. ఎల్ఐసీ దీన్ని నిర్వహిస్తోంది. ఒకే విడత ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు ఆదాయం అందుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో నెలవారీ చెల్లింపు ఆప్షన్పై 7.40 శాతం వార్షిక రేటు చెల్లిస్తున్నారు. 2023 మార్చి 31 వరకు ఇన్వెస్ట్ చేస్తే, పదేళ్ల పాటు ఇదే రేటు అమల్లో ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం బ్యాంకు సాధనాలతో పోలిస్తే ఇందులో అధిక రేటు అమల్లో ఉంది. పదేళ్ల కాలానికి ఒక్కటే రేటు ఉండడం వల్ల ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లతో పోల్చినా ఇందులోనే రాబడి ఎక్కువ. యాన్యుటీ ప్లాన్లతో పోలిస్తే నూరు శాతం ఇదే మెరుగైనది. ప్రభుత్వం తరఫున ఎల్ఐసీ దీన్ని నిర్వహిస్తోంది కనుక ఇందులో పెట్టుబడికి రిస్క్ ఉండదు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం చెల్లించే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే దీన్ని స్వాధీనం చేసి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో పెట్టుబడి విలువపై 75 శాతానికి సమానంగా రుణాన్ని ఎప్పుడైనా పొందొచ్చు. దీంతో అత్యవసరాల్లో సాయపడుతుంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై ప్రతి నెలా రూ.9,250 పెన్షన్ వస్తుంది. కంపెనీల డిపాజిట్లు బజాజ్ ఫైనాన్స్ తదితర ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థలు, కంపెనీలు సైతం ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి. వీటిల్లో అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. 6–9 శాతం మధ్య వీటిల్లో వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్కు సహజంగా అర శాతం అధిక రేటు లభిస్తుంది. ఈ డిపాజిట్ల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. కొన్ని ఎన్బీఎఫ్సీలు 10 ఏళ్ల డిపాజిట్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అనుకూలం/ప్రతికూలం సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే అదనపు రేటును ఇవి ఆఫర్ చేస్తుంటాయి. ఇవి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే 9 శాతానికి పైనే చెల్లించాల్సి వస్తుంది. అందుకుని ప్రజలకు సైతం మెరుగైన రేటును ఆఫర్ చేస్తాయి. వీటిల్లో డిపాజిట్ పూర్తిగా రిస్క్తో కూడినదే. ఎందుకంటే పెట్టుబడికి, వడ్డీకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఇందులో వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 మించితే 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. పన్ను పరిధిలో లేని వారు ఫామ్ 15జీ/హెచ్ సమర్పించి టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. కాల వ్యవధిలోపు తీసుకుంటే పెనాల్టీ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు పెనాల్టీ నిబంధన చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రివర్స్ మార్ట్గేజ్ ఇంటిని తనఖా పెట్టి పొందే రుణం ఇది. ఈ మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. ప్రతి నెలా నిర్ణీత మొత్తం మీకు లభించేలా బ్యాంకుతో ఒప్పందం చేసుకోవచ్చు. ఇది ఈఎంఐకి రివర్స్ మాదిరి పనిచేస్తుంది. బ్యాంక్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. కోరుకున్నప్పుడు తీసుకున్న మొత్తం, దానిపై వడ్డీ చెల్లించి మార్ట్గేజ్ను ఉపసంహరించుకోవచ్చు. లేదంటే తమ తదనంతరం వారసులకు దీన్ని బదిలీ చేయవచ్చు. అనుకూలం/ప్రతికూలం రూ.50 లక్షల నుంచి కోటి వరకు పొందడానికి ఉంటుంది. ఎక్కువ బ్యాంక్లు 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ను అందిస్తున్నాయి. 60 ఏళ్లు నిండిన వారికే ఈ సదుపాయం. మార్ట్గేజ్ కింద ఇంటిని బ్యాంకుకు తనఖా పెట్టి రుణం పొందుతున్నా కానీ, అదే ఇంట్లో నివసించొచ్చు. తమ తదనంతరం వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి బ్యాంకుల నుంచి ఇల్లు తమ పేరిట స్వాధీనం చేసుకోవచ్చు. వద్దనుకుంటే బ్యాంకు సదరు తనఖాలో ఇంటిని విక్రయించి, అప్పటి వరకు చెల్లించిన మొత్తం, దానిపై వడ్డీని మిహాయించుకుంటుంది. ఇది పోను మిగులు ఏమైనా ఉంటే వారసులకు ఇస్తుంది. రుణంపై జీవించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే బ్యాంకు నుంచి అప్పటి వరకు పొందిన మొత్తంపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంటుంది. రిటైలర్ల కంటే ఎక్కువగా ఇనిస్టిట్యూషన్స్ ఈ సాధనంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ బాండ్ల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది. వడ్డీని ప్రతి ఆరు నెలలకు చెల్లిస్తారు. రాబడి 5–7 శాతం మధ్య ఉంటుంది. అనుకూలం/ప్రతికూలం పెట్టుబడికి, రాబడికి ఏ మాత్రం రిస్క్ ఉండదు. ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ప్రారంభించి ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకోవచ్చు. టీడీఎస్ అమలు కాదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. -
ఏపీ ప్రభుత్వ పథకాలు భేష్
పెనమలూరు/పెదకాకాని: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ బృందం ప్రశంసించింది. పథకాలు అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అభినందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అండర్ సెక్రటరీలు తారాచందర్, అవినాష్ చందర్ మంగళవారం కృష్ణా జిల్లా వణుకూరు, పెదపులిపాక గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా నంబూరులోని ప్రభుత్వ సచివాలయాలు, ఆర్బీకేలు తదితరాలను సందర్శించారు. వణుకూరు సచివాలయంలో లబ్ధిదారుల వివరాలు, వారికి అందజేస్తున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను స్వయంగా పరిశీలించారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన చేబ్రోలు బుజ్జి నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని సందర్శించారు. వణుకూరు జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను కూడా పరిశీలించారు. పెదపులిపాకలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పింఛన్ల పంపిణీ విధానాన్ని ప్రశంసించారు. ఆర్బీకేలోని ఏటీఎంను పరిశీలించారు. 14, 15 ఆర్థిక సంఘాల నిధుల వినియోగం గురించి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్ర బృందం వెంట కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. అందుకే ఇందులో లబ్ధిదారుడిగా ఉన్న రైతులు కేవైసీ చేసుకున్నప్పటికీ మళ్లీ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలా చేసిన ప్రతి లబ్ధిదారునికి రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు అనగా సంవత్సర కాలానికి రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు అధికారులు.ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు. అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ( e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది. e-KYC నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి: African Parrot: మా రుస్తుమా ఎటో వెళ్లిపోయింది.. మీకు కనిపిస్తే చెప్పండి.. రూ.50వేలు ఇస్తాం.. -
మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఎన్పీసీఐ ఈ మాట సచివాలయాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు సొమ్ము పడలేదంటూ సచివాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వార్డు వలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులు బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న ఖాతాలకే సొమ్ము పడుతుందని చెప్పడంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు. అటువంటి సమయంలో లబ్ధిదారులు సదరు బ్యాంకులకు వెళ్లి ఏ ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం జరిగి ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు తమకు నచ్చిన బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం కోరుకుంటే సంబంధిత బ్యాంకులో ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంప్రదించాల్సి ఉంటుంది. తరువాత ఎన్పీసీఐ అనుసంధానం గల బ్యాంకు ఖాతా జెరాక్స్ మాత్రమే ఆయా పథకాలకు దరఖాస్తు సమయంలో సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది. -
సామాన్యునికి ప్రభుత్వ పథకాలు మరింత చేరువ
న్యూఢిల్లీ: సామాన్యునికి ఇక ప్రభుత్వ పథకాలు మరింత సులభతరంగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న వివిధ పథకాల పంపిణీ కోసం ‘జన్ సమర్థ్’ పేరుతో ఒక ఉమ్మడి పోర్టల్ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనిష్ట ప్రభుత్వ జోక్యం– గరిష్ట పాలన ప్రయోజనాలకు సంబంధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతలో భాగంగా, కొత్త పోర్టల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రారంభంలో 15 క్రెడిట్–లింక్డ్ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలలో కొన్ని బహుళ సంస్థల ప్రమేయం ఉన్నందున, అనుకూలతలు, అవకాశాలను బట్టి అందించే ప్రయోజనాలు, పథకాల సంఖ్యను విస్తరించడం జరుగుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఉదాహరణకు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్సీఎస్ఎస్) వంటి పథకాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత పోర్టల్ ఈ పథకాలను ఒకే ప్లాట్ఫారమ్పై తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు ఎక్కువ ఇబ్బంది లేకుండా పొందవచ్చు. పోర్టల్ అమలుపై పైలట్ టెస్టింగ్ జరుగుతోందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇతర రుణదాతలు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రారంభానికి ముందే ఎటువంటి సమస్యలూ లేకుండా ఈ పోర్టల్ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఈ వేదికపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా తమ పథకాలను అందించడానికి వీలుగా పోర్టల్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సూత్రప్రాయ ఆమోద పొందిన తర్వాత తాజా ప్రతిపాదిత పోర్టల్ ద్వారా కేవలం 7–8 పని దినాలలో రుణం పంపిణీ జరుగుతుందని భావిస్తున్నారు. ‘59 నిముషాల పోర్టల్’తో బహుళ ప్రయోజనాలు కాగా, రుణగ్రహీతలకు సౌకర్యాన్ని అందించడానికి వీలుగా ప్రభుత్వం 2018లో సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, గృహాలు, ఆటో వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల క్రెడిట్ సౌలభ్యత కోసం జ్టి్టp:// pటb ్చౌnటజీn59 ఝజీnu్ట్ఛట. ఛిౌఝ పోర్టల్ను ప్రారంభించింది. తద్వారా రుణగ్రహీతల కేవలం 59 నిమిషాల్లో వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తగిన రుణ ఆమోదాలను పొందే సౌలభ్యత ఏర్పడింది. అంతక్రితం 20–25 రోజుల టర్నరౌండ్ సమయంతో పోలిస్తే 59 నిముషాలకు సంబంధించిన పోర్టల్ రుణ గ్రహీతలకు ఎంతో ప్రయోజనం కల్పించింది. ఈ ప్రక్రియలో మంజూరు దశ వరకు పోర్టల్ మానవ ప్రమేయం లేకుండా రుణ దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయి. సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏదీ సూత్రప్రాయ ఆమోదం కోసం భౌతికంగా ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు, జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లు మొదలైన అనేక మూలాల నుండి డేటా పాయింట్లను విశ్లేషించడానికి పోర్టల్ అధునాతన అల్గారిథమ్లపై ఆధారపడి పనిచేస్తుంది. రుణగ్రహీతల అర్హతను తనిఖీ చేయడానికి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్తో తాజా ప్లాట్ఫామ్ అనుసంధానమై ఉంటుంది. పోర్టల్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చెందిన 1.12 లక్షల రుణ దరఖాస్తులకు ప్రభుత్వ బ్యాంకులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. మొత్తం రూ.37,412 కోట్లు మంజూరయ్యాయి. -
Andhra Pradesh: ఊరు మారింది
సాక్షి, అమరావతి: అప్పట్లో ‘ఆయన’ వస్తే బాగుండు అని ఊదరగొట్టారు. సీన్ కట్చేస్తే.. ఆయన వచ్చాడు. వచ్చాక ఏమైందంటే.. ఊళ్లలో అడుగడుగునా జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలు. ఏమైనా సమర్పించుకుంటేనే పనులయ్యేవి. అదికూడా పచ్చపార్టీ వారికే. పెన్షన్లు ఎప్పుడిస్తారో దైవా‘దీనం’.. ఎండలో, వానలో గంటలతరబడి ఎదురుచూడాల్సిందే. ఇలా సవాలక్ష ఇక్కట్లు ఆ ఐదేళ్లలో. కానీ, ఇప్పుడో.. జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాల్లేవు. సంక్షేమ పథకాలు ఠంఛనుగా చెప్పిన టైముకి వచ్చేస్తున్నాయి. ఇందుకు ఒక్కపైసా ఎవ్వరికీ ఇవ్వక్కర్లేదు. ఈ మూడేళ్లలో రూ.1.41 లక్షల కోట్లు పేదలకు నేరుగా అందించినా అందులో దుర్వినియోగమైంది నిల్. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి, అర్హత ఉంటే వారే పైసా ఖర్చుకాకుండా దరఖాస్తు పూర్తిచేస్తున్నారు. కులం, మతం, పార్టీ అన్నది చూడకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరినీ ఎంపిక చేస్తున్నారు. అర్హత లేకపోయినా వారికి మరోసారి తన అర్హత నిరూపించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోంది. ఇక ఆర్బీకేలు రైతులకు ఆత్మీయ నేస్తాలు. అన్ని సదుపాయాలు ఆ గొడుగు కిందే ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఊరు మారింది. పల్నాడు జిల్లా కొప్పుకొండ, చింతలచెరువు గ్రామాలను ‘సాక్షి’ పరిశీలించగా ఇది స్పష్టంగా కనిపించింది. కొప్పుకొండలో.. ‘ఇంతమాత్రం మా ఊరు బాగుచేయించిన వారు ఎవరులేరులే. ఈ రెండేళ్లలోనే మా ఊరు బాగా మారింది’.. గతంలో ఐదేళ్లపాటు టీడీపీ తరఫున పల్నాడు జిల్లా కొప్పుకొండ గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన పసుపులేటి చిన అంజయ్య వాళ్ల ఊరు గురించి ఇప్పుడు గొప్పగా చెప్పిన మాటలివి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీడీపీకే మెజార్టీ వచ్చిన ఆ ఊరిలో ఇప్పుడు పార్టీలకతీతంగా ఎవరిని కదిలించినా గత రెండు మూడేళ్లలో ఆ ఊరిలో జరిగిన అభివృద్ధి గురించి గొప్పగా చెబుతున్నారు. ► ఇక ఇదే ఊరిలో 270 ఎకరాల విశాలమైన చెరువు ఉంది. మూడేళ్ల క్రితం వరకు ఈ చెరువులో చేపల పెంపకం ద్వారా గ్రామ పంచాయతీకి ఏటా లక్షన్నరకు మించి ఆదాయం వచ్చేదికాదు. కానీ, ఇప్పుడు అదే చెరువు మీద ఏటా రూ.20 లక్షలు వస్తున్నాయి. ఇన్నాళ్లు టీడీపీ నియోజకవర్గ నాయకుల ఆధీనంలో ఉండే ఆ చెరువును ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొత్తగా వేలం పాట నిర్వహించగా, ఆదాయం పెరిగిపోయింది. దీంతో రూ.10లక్షలు పెట్టి శ్మశానానికి రెండెకరాల పొలం కొన్నారు. రూ.3లక్షలతో దానిచుట్టూ కంచె ఏర్పాటుచేస్తున్నారు. ► గతేడాది ఆ చెరువు డబ్బులు పెట్టి గ్రామంలో 13 కిలోమీటర్ల పొడవున పొలాలకు వెళ్లడానికి విశాలమైన రోడ్లు వేసుకున్నారు. ‘ఇంతకుముందు పొలాలకు దారేలేదు. మందుకట్టలు తీసుకుపోవాలన్నా మోసుకుపోవాలి. కొత్తగా మూడురోడ్లు వేసుకున్నాం’ అని ప్రస్తుత గ్రామ సర్పంచి కోలా వీరాంజనేయులు చెప్పారు. ఇలా రోడ్లు వేయడంతో ఆ ఊరి పొలాల రేట్లు రెట్టింపయ్యాయి. రెండేళ్ల క్రితం నాలుగైదు లక్షలు ఉండే ఎకరా ధర ఇప్పుడు ఏడెనిమిది లక్షలకు పెరిగిపోయింది. చెరువు ఆదాయం పెరగడంతో కొత్తగా ఊళ్లో పది మందికి ఉపాధి కూడా దొరికింది. చింతలచెరువులో.. నూజెండ్ల మండలంలో చింతలచెరువు చాలా చిన్న గ్రామ పంచాయతీ. ఆ ఊరి జనాభా 1,500లోపే. ఆ ఊళ్లో ప్రజలకు ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేదిప్పుడు. ఆ ఊరి గ్రామ సచివాలయంలోనే వారి పనులు పూర్తవుతున్నాయి. ► రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 44 ఇళ్లను ఈ ఊరికి మంజూరు చేసింది. గతంలో ఇల్లు మంజూరు కావాలంటే లబ్ధిదారుడు పనులన్నీ మానుకుని నెలల తరబడి పట్టణాల్లోని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లే వెళ్లి పనులు కానిచ్చేస్తున్నారు. ► ఇటీవల కొత్తగా పొలం కొనుక్కొని పట్టాదారు పాసు పుస్తకం కోసం వచ్చిన నూర్బాషా.. ఇన్సూరెన్స్ పథకం నిమిత్తం బయోమెట్రిక్ కోసం వచ్చిన కాశమ్మ.. ఇంటి కోసం దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన నాగూర్వలి వంటి వారితో మంగళవారం మధ్యాహ్నం కూడా గ్రామ సచివాలయం కళకళలాడుతూ కనిపించింది. చింతలచెరువు లోని ఆర్బీకే వద్ద పశు వైద్య సేవలు బడి మానేసిన రవిశంకర్ మళ్లీ స్కూల్కి.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం గ్రామాల్లో చాలా పేదింటి కుటుంబాల పిల్లల చదువుకు వరంగా మారింది. చింతలచెరువు గ్రామంలోనే పదిహేను ఏళ్ల వయస్సుండే మేకల చిన్నకృష్ణమూర్తి, అనంతలక్ష్మీల రెండో కుమారుడు రవిశంకర్ రెండేళ్ల క్రితం తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి పనిలో చేరాడు. 2019–20లో అమ్మఒడి ద్వారా సర్కారు రూ.15 వేలు ఇవ్వడం చూసి ఆ కుటుంబం రవిశంకర్ను తిరిగి బడిలో చేర్పించింది. ఈ ఏడాది అతను టెన్త్ పరీక్షలు బాగా రాశానని.. ఇంటర్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ‘సాక్షి’కి చెప్పాడు. రవిశంకర్ అమ్మ అనంత లక్ష్మీ కూడా ఏడాదిన్నర క్రితం తాను కొత్తగా పొదుపు సంఘంలో చేరినట్లు తెలిపారు. నాడు–నేడుతో బడికి మహర్దశ చింతలచెరువు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.27 లక్షలతో అభివృద్ధి చేసింది. కొత్తగా మరో రెండు అదనపు తరగతుల భవనాలను కూడా నిర్మించింది. ఆ చిన్న పల్లెలోని ప్రాథమిక పాఠశాలలో ఫ్యానులు, బల్లలు వంటివి ఏర్పాటుచేయడంతో.. 2019–20లో 101 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య రెండేళ్లలోనే 133కు పెరిగింది. పశువైద్యం కూడా అందుబాటులోనే.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున పశు సంవర్థక అసిస్టెంట్ను ప్రభుత్వం నియమించడంతో ఈ చిన్న గ్రామంలోనూ పశువైద్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో పశువులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పొరుగు గ్రామం వైపు చూసే పరిస్థితి. కానీ, ఇప్పుడు అర్ధరాత్రి పశువులకు ఏ ఆపదొచ్చినా చికిత్సకు ఆ ఊరిలోనే పశు వైద్య నిపుణుడు అందుబాటులో ఉన్నారు. అన్నదాతలకు తోడుగా.. చింతలచెరువు గ్రామ సచివాలయంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్.. ఆర్బీకేకి అనుసంధానంగా పంటల వారీగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి వారికి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాగుకు సలహాలు అందజేస్తున్నారు. ఇక ఈ గ్రామంలోనూ సీఎం జగన్ ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్తో కొత్తగా ఇద్దరు ఉద్యోగాలు పొందారు. ఆ గ్రామం పుట్టాక ఊరిలో ప్రభుత్వోద్యోగం వచ్చిన వారు మొత్తం ఐదుగురేనని.. అందులో ఇద్దరు ఈ మూడేళ్లలో వచ్చిన వారని గ్రామస్తులు తెలిపారు. -
ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ భావోద్వేగం అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్ పటేల్ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో కోవిడ్–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా పాల్గొన్నారు. -
PM Kisan: గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి
దేవరకొండ (నల్గొండ): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పది విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యసాయ అధికారులు రైతులకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి👉🏼 ‘పరువుహత్య’ విచారణపై ఒవైసీకి అభ్యంతరం ఎందుకు? నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి👉🏾 India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు -
ఏపీ మోడల్ భేష్
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది రాష్ట్రంలో ప్రభుత్వ తీరు. కానీ ఇంటిని రచ్చ రచ్చ చేయాలనేది ప్రతిపక్షం తీరు. సచివాలయాలను గ్రామాల్లోకి తీసుకెళ్లినా.. వలంటీర్ల సైన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులుగా ఊళ్లలో నిలబెట్టినా.. ఇంగ్లిష్ మీడియాన్ని సర్కారీ స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చినా.. ఇవన్నీ విపక్షానికి నచ్చనివే. న్యాయస్థానాలక్కూడా వెళ్లి రచ్చ చేసినవే. కాకుంటే ఈ వ్యతిరేకత ప్రభుత్వ సంకల్పానికన్నా బలమైనదేమీ కాదు. కాబట్టే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతే కాదు. ఇతర రాష్ట్రాలక్కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ‘రోల్ మోడల్’గా మారింది. ఆర్బీకేలు, నాడు–నేడు, రేషన్ డోర్ డెలివరీ, సంచార వైద్యశా లలు... ఇలా అన్నింటా ఏపీ ఒక మోడల్గా మారింది. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి చూడటమే కాదు... తమ తమ రాష్ట్రాల్లో అమలుకు కసరత్తు కూడా మొదలెట్టారు.కొన్ని అంశాలనైతే ఏకంగా కేంద్రమే దేశమంతటా అమల్లోకి తేవాలనుకుంటోంది. అదీ.. ఏపీ!! డ్రగ్స్, శ్రీలంక... అంటూ ఏదోలా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం కూడా ఒక రోల్ మోడలే!! ఎక్కడా ఇలాంటి పక్షం ఉండకూడదని చెప్పటానికి. సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్కాల్ దూరంలో ప్రభుత్వం!. ఏ పథకాన్నయినా ఇంటిదాకా తెచ్చే ప్రభుత్వ వారధులు!!. ఆదేశిస్తే రాష్ట్రంలో ఇంటింటినీ ఒకే రోజులో చుట్టుముట్టేయాలన్న విజన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సేవా సైన్యమిది. కోవిడ్ మహమ్మారి కొత్తగా ప్రవేశించిన రోజుల్లో మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితులు రాజ్యమేలాయి. మృతులు సొంతవారైనా కడచూపులూ దక్కని పరిస్థితి. అలాంటి సమయంలో రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ట్రేస్–టెస్ట్–ట్రీట్ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది మన వలంటీర్లే. అందుకే ఇతర రాష్ట్రాలూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్రం కూడా సచివాలయాల్ని దేశమంతా ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు దీనిపై ఇప్పటికే ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసివెళ్లాయి. సర్వత్రా ఆసక్తి రాష్ట్రంలో అమలవుతోన్న పలు పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేసేందుకు ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ప్రియాంక మేరీ ప్రాన్సిస్ నేతృత్వంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరో పది మంది రాష్ట్ర స్థాయి అధికారుల బృందం 2020 నవంబర్లో అనంతపురం జిల్లాలోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది. మహారాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారుల బృందం నెల రోజుల క్రితం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు రాష్ట్ర రిటైర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్ నేతృత్వంలో ‘కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం)’ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో పర్యటించిన అనంతరం మన సచివాలయ, వలంటీర్ల తరహా వ్యవస్థలు దేశమంతటా అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) విభాగాల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో.. మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యునిసెఫ్ సైతం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. యునిసెఫ్ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి తమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించడానికి రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక ఐఏఎస్ అధికారుల బృందం (ఫైల్) 17 ఏళ్లుగా కేంద్రం ప్రయత్నం.. కేంద్రంలో పంచాయతీ రాజ్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2005లో మొదటి సారిగా ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశమంతటా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. దేశమంతటా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస స్థాయిలో ఫర్నిచర్, ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటోంది. కంప్యూటర్ నిర్వహణకు కనీసం కాంట్రాక్టు పద్దతిలోనైనా ఉద్యోగుల నియమాకం చేయాలనుకుంది. ప్రతి గ్రామంలో ‘కామన్ సర్వీసు సెంటర్లు’ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తీరణ అభియాన్ (ఆర్జీపీఎస్ఏ), ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ)’ పేర్లతో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే 2.78 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం గ్రామ పంచాయతీ భవనం లేని చోట్ల వాటి నిర్మాణం, ఉన్న చోట మరమ్మతులకు ఈ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ గత 17 ఏళ్లుగా అనుకున్న రీతిలో ఫలితాలు సాధించ లేదు. ఆర్జీఎస్ఏ కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు 2026 వరకు కొనసాగించాలని ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2015–17 మధ్య కాలంలో ఆర్జీఎస్ఏ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పరిపాలనను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీల్లో పరిమిత కాలానికి దాదాపు 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం నిధులు మంజూరు చేసినా, పరిమిత కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించాల్సి వస్తుందనే భయంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం సమ్మతించలేదు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించింది. నాలుగు నెలల్లో వ్యవస్థకు రూపం ► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల్లో గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరి చొప్పున వలంటీర్లను నియమించారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ► 2019 అక్టోబర్ 2 తేదీ నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, ఒక్కో చోట 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల కోసం 1.34 లక్షల మంది కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మొత్తంగా నాలుగు నెలల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సరిపడా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారు. ► అన్ని గ్రామాల్లో ప్రతి రోజు సాయంత్రం 3 – 5 గంటల మధ్య ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 545 రకాల ప్రభుత్వ సేవలు 2020 జనవరి 26 నుంచి అన్ని సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండున్నర ఏళ్లలో 3.70 కోట్ల ప్రజా వినతులను ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించింది. ► అవినీతికి తావులేకుండా బయోమెట్రిక్ ద్వారా గత 34 నెలల్లో రూ.1.34 లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నేరుగా పంచి పెట్టింది. కరోనా వేళ వేలాది మంది ప్రాణాలకు అడ్డుకట్ట ► రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23.19 లక్షల మందికి కరోనా సోకితే, ఇందులో 14,730 మంది మరణించారు. పంజాబ్ రాష్ట్రంలో 7.59 లక్షల మందికి కరోనా సోకితే, అందులో 17,743 మరణించారు. 18 లక్షల మందికి కరోనా సోకిన ఢిల్లీ వంటి రాష్ట్రంలో సైతం 26 వేల మందికి పైబడి చనిపోయారు. ► 20 లక్షల మంది చొప్పున కరోనా సోకిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 26 వేల మంది చొప్పన మరణించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో సైతం తక్షణమే సమర్థవంతంగా అమలు చేసి చూపించే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్లే ఈ రెండేళ్ల కాలంలో కనీసం పది వేల మంది ప్రాణాలను ప్రభుత్వం కాపాడగలిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ► 2020 మార్చిలో రాష్ట్రంలో కరోనా మొదలయ్యాక ఈ 24 నెలల కరోనా సమయంలో వలంటీర్ల ద్వారా 44 విడతలుగా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఎప్పటికప్పుడు పాజిటివ్ రోగులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణమే వైద్య సహాయం అందేలా చూశారు. తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో మరణాల సంఖ్య బాగా తక్కువకు పరిమితమైంది. కేసుల సంఖ్యలో ఐదవ స్థానం, మరణాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏపీ అనుకూలం దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెంచేందుకు తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తోంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తప్పనిసరి. ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మినహా మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ పరిస్థితులలో కేంద్రం అనుకుంటున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆంధ్రప్రదేశ్ చాలా అనుకూలంగా ఉంది. – మహ్మద్ తఖియుద్దీన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ) సీనియర్ కన్సల్టెంట్. అందుబాటులో 540కి పైగా ప్రభుత్వ సేవలు ప్రభుత్వ సేవలు పెరిగినప్పుడే ప్రజల ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగు పడుతుంది. ఉదాహరణకు.. ఎవరైనా ఏదైనా పని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పూర్తయితే అతనికి తక్కువలో తక్కువ రూ.500 అయినా మిగిలినట్టే. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలకు 540కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకునే పరిస్థితి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల ఆశయాలు పెరుగుతాయి. – ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
మే నెలలో గడపగడపకు ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం మే లో ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈలోపు సచివాలయాల పరిధిలో సమస్యలను, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుంటుందన్నారు. గడపగడపకు కార్యక్రమం పునాది వలంటీర్ల సత్కారసభలోనే పడాలన్నారు. ప్లీనరీ తర్వాత పార్టీ కార్యక్రమాలు బాగా పెరుగుతాయని చెప్పారు. సచివాలయాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలన ద్వారా పార్టీ శ్రేణుల పనితీరు, అసంతృప్తులు, గ్యాప్ ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్లాలనే అంశాలపై పూర్తి అవగాహన రావచ్చన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల డెలివరీ మెకానిజం ఏ విధంగా జరుగుతోందో తెలుసుకునేందుకు వలంటీర్లకు పురస్కారాలు అందించి సత్కరించే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సచివాలయాల సంఖ్యను బట్టి ఈ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసుకోవాలన్నారు. సీఎం జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా సిన్సియారిటీ, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు అందే సేవల విషయంలో లోపాలుంటే సరిదిద్దుకోవచ్చన్నారు. వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాల ద్వారా లోపాలను గుర్తించి పరిష్కారాలు కనుగొనవచ్చని చెప్పారు. నియోజకవర్గాల్లో భవిష్యత్తు కార్యక్రమాలకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. ఇక నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అసంతృప్తులు ఉంటే వారిలో స్తబ్ధత తొలగించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు. వారికి ప్రేరణ కలిగించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలదేనని పేర్కొన్నారు. బూత్ కమిటీలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 20 రోజుల్లో సమాచారం పంపాలని ఆయన కోరారు. -
గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం
సాక్షి, అమరావతి/విజయవాడ రూరల్: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళుతున్న మన గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల వైపు పలు రాష్ట్రాలు ఆకర్షితమవుతున్నాయి. ఈ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు, తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు 500 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వా రా అందజేస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు మహారాష్ట్ర అధికారుల బృందం బుధవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేతృత్వంలో అధికారుల బృందం 7నెలల కిందట రాయలసీమలో పర్యటిం చి సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్ అధికారులు సుధీర్ భగవత్ నాయకత్వంలో బుధవారం విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామ సచివాలయం–3ను పరిశీలించారు. అనంతరం అంబాపురంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వానపాముల ద్వారా ఎరువులను తయారుచేసే విధానాన్ని తిలకించారు. చివరిగా గొల్లపూడిలో వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు. పంచాయతీరాజ్ కమిషనర్తో భేటీ.. మహారాష్ట్ర అధికారులు బుధవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు గురించి కోన శశిధర్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, వాటి భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును కూడా నియమించినట్లు తెలిపారు. -
ప్రత్యేక ఆకర్షణగా సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాల ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో శకటాలపై ఉన్న చిన్నారుల అభివాదానికి చిరునవ్వుతో తిరిగి అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. ముందుగా అక్కడికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వస్తున్నారని తెలిసి కారు దగ్గరే వేచి ఉండి, గవర్నర్ను సాదరంగా ఆహ్వానించి కార్యక్రమానికి తోడ్కోని వచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసన మండలి చైర్మన్ మోషేన్రాజు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నరసాపురం రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ మండల కన్వీనర్ దొంగ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని వేములదీవి ఈస్ట్, వేములదీవి వెస్ట్, బియ్యపుతిప్ప గ్రామాల్లో పార్టీ నూతన గ్రామ కమిటీల నియామక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీలను ప్రకటించారు. వేములదీవి ఈస్ట్ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షునిగా తిరుమాని వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా తిరుమాని అర్జునరావు, ఉపాధ్యక్షునిగా తిరుమాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దాసరి సువర్ణరాజు, కార్యదర్శులుగా తిరుమాని రాంబాబు, కొల్లాటి వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శిగా తిరుమాని కనకరాజులతో పాటు పలువురు సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే వేములదీవి వెస్ట్ పంచాయతీ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులుగా మురాల సోమయ్య, ఆకుల పెద్దిరాజు, తిరుమాని వెంకటేశ్వర్లు, జక్కంశెట్టి పల్లయ్య ఎంపిక కాగా అధ్యక్షునిగా మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఒడుగు రాంబాబు, ఈవన నాగరాజు, కారిపల్లి దాసు, జి నర్శింహమూర్తి ఎంపికయ్యారు. బియ్యపుతిప్ప గ్రామ కమిటీ అధ్యక్షునిగా చింతా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఒడుగు శ్రీను, కార్యదర్శులుగా సంగాని ఆంజనేయులు, ఒడుగు వీర్రాజులతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరందరినీ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అభినందించారు. -
అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది!
All About Kisan Vikas Patra Saving Scheme: పోస్టాఫీస్కు చెందిన సేవింగ్ స్కీమ్లలో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్లో మీ సొమ్మును మదుపుచేశారంటే (బ్యాంకు కంటే) 124 నెలల్లో అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. వడ్డీ రేటు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం 6.9 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతీ యేటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది. ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే రూ.1000ల నుంచి ఎంతైన మదుపు చేయవచ్చు. ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు? కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు. మెచ్యురిటీ పీరియడ్ సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది. ఖాతా బదిలీ చేసే సందర్భాలు ►ఈ పథకం కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుండి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తుంది.. ►ఖాతాదారు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది. ►ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్కు బదిలీ చేయవచ్చు. ►కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు. ►అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. -
సంక్షేమ పథకాలకు నేతల పేర్లు చట్ట విరుద్ధం కాదు
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఆయా నేతల పేర్లతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయంది. ప్రభుత్వ పథకాల పేర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, ఆయా పథకాలకు అవి పెట్టిన పేర్లు తదితర వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పథకాలకు రాజకీయ నేతల పేర్లు పెడుతున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెడుతున్నారని, తద్వారా ప్రజలను ఆకర్షించడంతో పాటు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమరావతి జేఏసీ నేత డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్బాబు వాదనలు వినిపిస్తూ, హోదా పేరుతో కాకుండా వ్యక్తిగత పేర్లను పథకాలకు పెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన పేరును పథకాలకు పెడుతూ వ్యక్తిగత ప్రచారం పొందుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపింది. సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ ఏ పార్టీకి చెందిన వారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండరాదంది. సదుద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశామని ప్రసాద్ బాబు తెలిపారు. వ్యక్తిగతంగా పేర్లు పెట్టడంపైనే తమ అభ్యంతరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లు పెట్టుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ లేఖలోని వివరాలను కూడా తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. -
ఆదివాసీ బాలలకు ‘ఆధార్’ దొరికింది
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రజల ఆప్యాయతను జీర్ణించుకోలేని ప్రతిపక్షం
అంతా నావాళ్లే.. అన్ని ప్రాంతాలు నావే.. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే.. అన్న భావనతో రెండున్నరేళ్ల పరిపాలన సాగుతూ వచ్చింది. మీరిచ్చిన అధికారంతో ఇప్పటికే సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా వివక్ష, అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి నగదు వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా) చర్యలు తీసుకున్నాం. కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారన్న మాట కూడా అడగకుండా అర్హులందరికీ మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ జీర్ణించుకోలేని ప్రతిపక్షం విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దారుణం. సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వం పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణను ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేశారన్నారు. దీంతో ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిడుతూ విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన జగనన్న తోడు లబ్ధిదారులైన చిరు వ్యాపారులకు బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వడ్డీని జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనను బూతులు తిట్టడం, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు స్పందించడం, ఎల్లో మీడియా వక్రీకరణ రాతలపై ఆయన స్పందించారు. వాడరాని భాషతో బూతులు తిట్టడంతో వాటిని వినలేక, భరించలేక అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఖండిస్తే కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి.. అన్యాయమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రాజకీయ లబ్ధికి ఆరాటం ► దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చింది కాబట్టే పంచాయతీ ఎన్నికలు మొదలు.. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్కా, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు కూడా నన్ను సొంత బిడ్డగా, అన్నగా భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడుతున్నారు. ► మీరు ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపుతుండటాన్ని జీర్ణించుకోలేని విధంగా ప్రతిపక్షం తయారైంది. దీనికి తోడు ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా తయారయ్యిందో మీరే చూస్తున్నారు. ఈ ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా మాట్లాడలేని విధంగా అన్యాయమైన మాటలు మాట్లాడతారు. దానికి ఈ ఎల్లో మీడియా వంత పాడుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా.. ఏ రోజు కూడా ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు. ► అంతగా బూతులు తిట్టినప్పుడు.. ఆ టీవీల్లో ఆ దృశ్యాలు చూడలేక, ఆ తిట్లు వినలేక మనల్ని అభిమానించే వాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్ల రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ రకంగా కావాలని తిట్టించి, వైషమ్యాలను సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ ఈ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. అబద్ధాలు, అసత్యాలు.. ► అబద్ధాలు ఆడతారు.. అసత్యాలు ప్రచారం చేస్తారు.. వంచనా కనిపిస్తుంది.. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి ఏ మాత్రం వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ► పేదవాడికి మంచి జరగకూడదు. అలా జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమోనని ఆ మంచి పనులు ఆపడం కోసం రకరకాలుగా కోర్టులో కేసులు వేయిస్తారు. ► ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పరిపాలనను మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. -
ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గడిచిన 53 మాసాల్లో 34.87 లక్షల బర్త్ సర్టిఫికెట్లు, 19.86 లక్షల డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. పుట్టిన తర్వాత చట్టబద్ధమైన గుర్తింపు కోసం జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందులో శిశువు జన్మించిన తేదీ, సమయం, ప్రాంతం, లింగం తదితర వివరాలుంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడానికి మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో జనన మరణ ధ్రువీకరణ విధిగా చేయాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో సైతం జనన మరణాల ధ్రువీకరణకు సంబంధించిన పర్యవేక్షణ ఉంటోంది. అందుకే కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ రికార్డు స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలు తీసుకున్నారు. కేవలం 2020లోనే 7,14,017 మంది జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోగా, 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 4,39,402 మంది పుట్టినట్టు జనన ధ్రువీకరణ పత్రాలను బట్టి తేలింది. పుట్టిన 7 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్, మృతి చెందిన మూడు రోజుల్లో డెత్ సర్టిఫికెట్ జారీ అవుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో శిశు ఆధార్ ప్రాజెక్టు అమలు కావాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ రోజుల్లో ప్రతీ ప్రభుత్వ పథకానికి, అవసరానికి ఆధారం తప్పనిసరిగా మారింది. అందుకే చిన్నారికి 1 రోజు వయస్సు ఉన్నా కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యుఐడీఏఐ తెలిపింది. ఇందు కోసం శిశువు జనన ధ్రువీకరణ పత్రం అవసరం. అందుకే అటు బర్త్ సర్టిఫికెట్, ఇటు ఆధార్ వెనువెంటనే వచ్చేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. చిన్నారుల నుంచి ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ తీసుకోకుండా మొదట ఆధార్ జారీ చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే నెలవారీ హెచ్ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం), ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ ఛైల్డ్ హెల్త్) పోర్టల్కు అనుసంధానించే వారి పేర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. జీవనశైలి జబ్బుల వివరాలు కూడా హెచ్ఎంఐఎస్ పోర్టల్కు అనుసంధానించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో.. గత ఏడాది అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకూ అత్యధికంగా కర్నూలు జిల్లాలో 90,450 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 72,775 మందికి జారీచేసి రెండో స్థానంలో నిలిచింది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 2020లో ఆ జిల్లాలో 55,656 పత్రాలు జారీచేశారు. 48,965 డెత్ సర్టిఫికెట్లు జారీచేసి గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 20,509 మాత్రమే డెత్ సర్టిఫికెట్లు జారీచేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 30 వరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 50,116 బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 48,742 డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇవి పక్కాగా నమోదు అయినవి మాత్రమే అని, కొన్ని నమోదు కావాల్సినవి కూడా ఉంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం వల్లే శెట్టిబలిజల అభ్యున్నతి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్ల తమకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తోందని శెట్టి బలిజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ సొంత కాళ్లపై నిలబడగలుగుతున్నట్టు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ హయాంలో పెద్ద సంఖ్యలో పదవులు కూడా పొందగలుగుతున్నామని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా శెట్టి బలిజ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు చిల్లర హామీలతో బీసీలను మోసం చేస్తే.. సీఎం జగన్ బీసీలను సమాజానికి బ్యాక్ బోన్గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. శెట్టిబలిజలను గౌరవ ప్రదమైన పదవుల్లో ఉంచిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. తనను మంత్రిని చేసి, చంద్రబోస్ను రాజ్యసభకు పంపిన విషయాన్ని ప్రస్థావించారు. జగన్ హయాంలోనే రెట్టింపు పింఛన్లు.. మూస రాజకీయాల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన కనుసన్నల్లో నడిచే మీడియా పింఛన్లపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులను నిర్ణయించేది ప్రజా ప్రభుత్వాలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు చాలా పరిమితమని తెలిపారు. ఓ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయాలు ప్రభుత్వాల పరిధిలోనివని వివరించారు. 60 ఏళ్లు దాటిన వారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులని, అయితే అలాంటి వారు పెన్షన్ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల వయో పరిమితి ఎంత ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయాలను న్యాయస్థానాలు ఎంతమాత్రం నిర్ణయించజాలవన్నారు. ఇలాంటి పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషనర్లలో వైఎస్సార్ చేయూత కింద ఎంతమందికి చెల్లింపులు చేశారు? చెల్లించకుంటే ఎందుకు చెల్లించలేదు? పిటిషనర్లలో ఎవరికైనా షోకాజ్ నోటీసులు ఇచ్చారా? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదుద్దేశంతో ప్రవేశపెడుతున్నా.. వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్ధి పొందేందుకు తాము అర్హులైనప్పటికీ అధికారులు ఆ ప్రయోజనాలను వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన వేల్పుల విమలమ్మ, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వారికి ఆ పథకం కింద ప్రయోజనాలను వర్తింప చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఫించన్ చెల్లింపుల నిలుపుదలపై మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తాజాగా విచారణ జరిపారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పథకాలను ప్రవేశపెడుతున్నా కొందరు అధికారుల తీరు వల్ల వాటి ఫలాలు అర్హులకు అందడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందక 90 శాతం మంది అర్హులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒకసారి ఓ పథకానికి అర్హులుగా నిర్ణయించిన తరువాత మధ్యలో ఆ పథకం ప్రయోజనాలను నిలుపుదల చేయడం సరికాదన్నారు. అధికారుల అలసత్వం వల్ల పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదన్నారు. అర్హులందరికీ దక్కాలన్నదే సీఎం సంకల్పం.. దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ పథకం అర్హతలు, అర్హులను న్యాయస్థానాలు నిర్ణయించజాలవన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి కృత నిశ్చయమన్నారు. ఆ దిశగానే పథకాల రూపకల్పన జరుగుతోందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టనన్ని వాటిని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి పత్రికా కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుకు అధికారులతో మాట్లాడతామని తెలిపారు. ఈ కేసులో అర్హులకు వైఎస్సార్ చేయూత ప్రయోజనాలను వర్తింప చేశామన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..!
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి. కనీసం అంబులెన్స్ వచ్చేందుకు కూడా వీలుండేలా రహదారి సౌకర్యం లేకపోవడంతో జిల్లాలోని చిత్రకొండ సమితి, కటాఫ్ ఏరియలోని కునిగూడ గ్రామ గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జిమ్మ ఖిలో నిండు గర్భిణి. మంగళవారం ఉదయం ఈమెకి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశ కార్యకర్త సహాయంతో అంబులెన్స్కి ఫోన్ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో అక్కడి వరకు రాలేమని, గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని పక్కా రోడ్డు వరకు గర్భిణిని తీసుకువస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లవచ్చని సిబ్బంది సూచించారు. దీంతో వేరే దారి లేకపోవడంతో గర్భిణి భర్త బోందు ఖిలో, కొంతమంది గ్రామస్తులు కలిసి, గర్భిణిని మంచంపై ఉంచి, అంబులెన్స్ దగ్గరకు మోసుకుని వెళ్లారు. అక్కడి నుంచి చిత్రకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంచె ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం అని.. ఇటువంటి తరచూ జరుగుతున్నా అధికారులు, నేతలు స్పందించకపోవడం చాలా దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: సుకుమా అడవుల్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి -
బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వచ్చేశారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయం కార్యరూపం దాలుస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రతీ ఆర్బీకే పరిధిలో ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్ను ఆయా బ్యాంకులు కేటాయించాయి. నగదు జమ, ఉపసంహరణలతో పాటు సాగు ఉత్పాదకాల కొనుగోళ్లు.. కూలీలు, యాంత్రీకరణకు నగదు బదిలీతో సహా కొత్త రుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ వంటి సేవలను కూడా ఈ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్నారు. రైతుల విలువైన సమయం ఆదాకు.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ, 10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవలందిస్తున్నాయి. సీజన్లో రుణాల మంజూరు, రీషెడ్యూళ్లతో పాటు వివిధ రకాల బ్యాంకింగ్ సేవల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. పంటకాలంలో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా బ్యాంకులు కూడా అడుగులు వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 24 ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సేవలందిస్తున్నాయి. నిజానికి శాఖలులేని ప్రాంతాల్లో వాటి కార్యకలాపాల కోసం ఆయా బ్యాంకులు గతంలోనే 10,916 మంది కరస్పాండెంట్లను నియమించుకున్నాయి. వీరిలో 503 మంది చురుగ్గాలేరు. ప్రస్తుతం 10,413 మంది సేవలందిస్తున్నారు. ప్రధానంగా.. ఎస్బీఐ పరిధిలో 3,289 మంది, యూనియన్ బ్యాంక్ పరిధిలో 1,320 మంది, ఏపీజీవీబీ పరిధిలో 1,091, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కు 990, కెనరా బ్యాంకుకు 831, ఇండియా ఫస్ట్ బ్యాంకుకు 686 మంది ఉన్నారు. మరికొన్నింటిలో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వీరిలో 9,160 మంది గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరినీ సమీప ఆర్బీకేలతో మ్యాపింగ్ చేశారు. అలాగే, వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లోని ఆర్బీకేలకు నూరు శాతం కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లు గుర్తించగా.. 1,618 ఆర్బీకేలకు కరస్పాండెంట్లు లేరు. ఈ ప్రాంతాల్లోని ఆర్బీకేలను సమీప కరస్పాండెంట్లతో మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆర్బీకేల బాధ్యతలు చూసేవారు రోజు విడిచి రోజు ఆయా ఆర్బీకేల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలిచ్చారు. ఇక పూర్తిస్థాయిలో కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్న ఆర్బీకేల్లో వారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. ఆర్బీకేల్లో అందుతున్న బ్యాంకింగ్ సేవలివే.. ► మొబైల్ స్వైపింగ్ మిషన్ ద్వారా విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రతీ బ్యాంకింగ్ కరస్పాండెంట్ పరిధిలో గరిష్టంగా రూ.25వేల వరకు ఉంచుతున్నారు. ► ఖాతాల్లేని రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, నగదు జమ చేయించడం, పంట రుణాల మంజూరు కోసం దగ్గరుండి డాక్యుమెంటేషన్ చేయించడం చేస్తున్నారు. ► బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ► ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ (డిజిటల్ పేమెంట్లు) కార్యకలాపాలపై శిక్షణనిస్తున్నారు. ► ప్లాస్టిక్ మనీ వినియోగాన్ని పెంచే దిశగా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ కరస్పాండెంట్ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల మేరకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని బ్యాంకులన్నింటికీ ఆదేశాలిచ్చాం. ఆర్బీకేలున్న ప్రతీచోట సమీప బ్యాంకులకు చెందిన కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఆర్బీకేల ద్వారానే అందించేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కడప కార్పొరేషన్: ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మున్సిపల్, పంచాయతీల ఎన్నికల ఫలితాల కంటే మిన్నగా ఉంటాయన్నారు. కడపలో ఆయన మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబులతో కలిసి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. 95 శాతం ఎన్నికల హామీలను ఇప్పటికే అమలు చేయడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ను ఇతర దేశాలతో పోల్చే విధంగా ప్రపంచ చిత్రపటంలో పెట్టారన్నారు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న సీఎంకు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయం ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. త్వరలో జరగనున్న బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ పరంగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందు రాతలు, తర్వాత అధికారులు.. వాహ్ క్యా ప్లాన్
ముందు రికార్డుల్లో రాతలు మార్చాలి. తర్వాత అధికారులను ఏమార్చాలి. ఇదీ ప్లాన్. కానీ అంతా అనుకున్నట్టు జరగదు కదా.. సంపూర్ణ పోషణ పాల అక్రమ రవాణా కేసులో కొందరు అంగన్వాడీ సిబ్బంది తప్పు మీద తప్పు చేస్తున్నారు. పాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తప్పులు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనమవుతున్న దశలో రికార్డుల రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు. వీరి తీరు అధికార వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల దిద్దుబాట్లు జోరుగా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్ల సరఫరాలో తేడాలు స్పష్టంగా కనిపించడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డుల్లో అంకెలు మార్చుతున్నారు. రెండు రోజులుగా సెక్టార్ మీటింగ్లని చెప్పి, కార్యకర్తలను పిలిచి, సూపర్వైజర్లు దగ్గరుండి ఈ తంతు జరిపి స్తున్నారు. ఈ నెల 3వ తేదీన భామిని మండలం బత్తిలి చెక్పోస్టు వద్ద పాలప్యాకెట్ల అక్రమ రవాణా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒకవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ఆ చర్యల నుంచి తప్పించుకునేందుకు, న్యాయపరంగా దొరకకుండా ఉండేందుకు రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. ఇదే విషయమై సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేసరికి రికార్డులు మూసేయండంటూ కార్యకర్తలు సైగలు చేశారు. కానీ లాభం లేకపోయింది. ఏం జరిగిందంటే..? ►ఇటీవల భామిని మండలం బత్తిలి చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన పాల ప్యాకెట్లలో తేడాలపై రికార్డులు దిద్దుబాట్లు జరపాలంటూ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ పట్టుబట్టారు. ►ఐసీడీఎస్ స్టాక్ పాయింట్ నుంచి డెలివరీ చేసిన రికార్డులకు, అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు నిల్వల రికార్డులకు వ్యత్యాసం ఉంది. ►ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సరఫరా చేసిన పాల నిల్వల్లో వ్యత్యాసం ఉండడం, అవే నెలలకు సరఫరా చేసిన పాల ప్యాకెట్లు పోలీసు లు పట్టబడడంతో దర్యాప్తు చేస్తున్నారు. ►వీరఘట్టం ఐసీడీఎస్ పీఓ, సూపర్వైజర్లు స్టాక్ పాయింట్ వద్ద పర్సంటేజీ రూపంలో పాల ప్యా కెట్లు మినహాయించి మిగిలిన పాలను నెలల వా రీగా అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీడీపీఓ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే..? వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ ఆధ్వర్యంలో వంగర, వీరఘట్టం మండలాల సెక్టార్ పరిధి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం గురు, శుక్రవారాల్లో జరిగింది. ►ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రికార్డులను అంగన్వాడీ కార్యకర్తలు దిద్దుబా టు చేసేశారు. వాటిలో కూడా తేడాలుండటంతో సెక్టార్ సమావేశంలో సూపర్ వైజర్ జె.జ్ఞానమ్మ ఒత్తిడి మేరకు పీఓ కార్యాలయం వద్ద ఉన్న రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. తొలుత కార్యకర్త లు సతాయించినా.. ఈ గండం నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న రికార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నా రులు పేర్లు కొన్ని చోట్ల(ఏప్రిల్, మే, జూన్) నెలలకు సంబంధించి తొలగించడం, కొన్ని తప్పుడు పేర్లు యాడ్ చేయడంతో నిల్వలకు సరిపడినట్లు కాగితాలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ►కొంత మంది అంగన్వాడీ కేంద్రాల్లో లొసుగులు ఉండడంతో కార్యకర్తలంతా ఏమీ చేయలేక ఐసీడీఎస్ అధికారులు మాటలకు తలొగ్గి దిద్దుబాటే శరణ్యంగా భావించి రికార్డులు తారుమారు చేస్తున్నారు. ►అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రతి నెల నిల్వ ఉన్న పాలను ఆ తదుపరి నెలకు లెక్క చూపిస్తారు. అ యితే పాల రికార్డులు తప్పుల తడకగా ఉండడంతో ఆ పాలను సూపర్వైజర్లు ఓపెనింగ్ బ్యాలెన్స్లో నమోదు చేయడం లేదు. దీని కారణంగా దర్యాప్తులో గుర్తించిన పాలతోపాటు ఓపెనింగ్ బ్యాలెన్స్లో షార్టేజీ చూపించారు. దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దిద్దుబాటు సరికాదు సెక్టార్ సమావేశాల్లో రికార్డులు దిద్దుబాటు చేయకూడదు. సీడీపీఓ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి పా లనలో ఉంది. అక్కడేం జరిగిందో తెలుసుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శనివారం ఆ ప్రాజెక్టుకు వెళ్తాం. రికార్డులన్నీ పరిశీలిస్తాం. – జి.జయదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
రెండేళ్లలో ఖాతాల్లోకి నేరుగా రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.35 కోట్లను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసి రికార్డు సృష్టించింది. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు 6,53,12,534 ప్రయోజనాలను పొందారు. రెండేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అర్హులైన పేదల బ్యాంకు ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేసినప్పటికీ పైసా కూడా పక్కదోవ పట్టకపోవడం విశేషం. ఎక్కడా పైసా అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా దుర్వినియోగం అనే మాట వినపించకుండా ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు వేలెత్తి చూపలేని స్థితిలో ఉన్నాయంటేనే ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితో వాటిని అమలు చేశారో ఇట్టే స్పష్టం అవుతోంది. ప్రజల ముంగిటకే ప్రభుత్వ పథకాలు వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను స్వయంగా చూసి, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న కీలక నిర్ణయాలు కోట్లాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, పేదరికమే కొలమానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ స్థాయిలోకి పాలనను తీసుకెళ్లేందుకు విప్లవాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, లక్షల సంఖ్యలో సేవాసైన్యం (వలంటీర్ల)ను సిద్ధం చేసి, ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చారు. అర్హతే ప్రామాణికత.. సంతృప్త స్థాయిలో అమలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సీఎం జగన్ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలను చేరువ చేశారు. వలంటీర్లు.. సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తులను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియగా మార్చారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు. ప్రతి పథకం ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నారు. గతంలో పాలకులు ప్రభుత్వ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో, ఎంత మందికి ఇస్తారో స్పష్టంగా ప్రకటించిన దాఖలాలు లేవు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరు చేసేవారు. అర్హత ఉన్నా, రాజకీయ సిఫారసులు లేకపోవడం వల్ల అనేక మంది లబ్ధి పొందే పరిస్థితి ఉండేది కాదు. ఈ మొత్తం పరిస్థితిని మారుస్తూ, కేవలం అర్హత మాత్రమే ప్రాతిపాదికన సీఎం జగన్ ప్రభుత్వ పథకాల అమలులో సంస్కరణలు తీసుకువచ్చారు. కోవిడ్ సమయంలోనూ చెక్కు చెదరని సంకల్పం కోవిడ్ సంక్షోభంతో ప్రపంచమంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సీఎం జగన్ సంకల్పం చెక్కు చెదరలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా పథకాల అమలులో తన చిత్తశుద్దిని చాటుకుంటున్నారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి మార్పు లేకుండా అమలు చేస్తుండటం విశేషం. కోవిడ్ లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలను ఆదుకునేందుకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్స్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,35,05,338 మందికి 1,350.53 కోట్ల రూపాయలు అందచేశారు. మహిళలకే అధిక ప్రాధాన్యత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను పాఠశాలలకు పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా రూ.13,022.93 కోట్లు జమ చేశారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మంది తల్లుల ఖాతాలకు రూ.2,269.93 కోట్లు, విద్యా దీవెన కింద 18,80,934 మంది తల్లుల ఖాతాలకు రూ.4,879.30 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాల మహిళలు 98,00,626 మందికి రూ.2,354.22 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 24,55,534 మంది మహిళలకు రూ.8943.52 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద 77,75,681 మంది మహిళలకు రూ.6,310.68 కోట్లు, వైఎస్సార్ కాపునేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకుని లక్షలాది మంది మహిళలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. -
గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న ఊరు దాటకుండానే ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందించి రికార్డు సృష్టించారు. రెండేళ్లు దాటక ముందే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 2.22 కోట్ల సేవలను ప్రజలకు అందించారు. ఇది దేశంలోనే రికార్డు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇలా గ్రామ, వార్డు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందిస్తున్న దాఖలాలు లేవు. 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేశారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవస్థ ద్వారా ఉన్న ఊరు, వార్డు దాట కుండా అక్కడి ప్రజలకు 544 ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమానికి గత ఏడాది జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పథకాలు, సేవల కోసం 2.27 కోట్ల దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటి వరకు 2.22 కోట్ల దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని నిరూపించారు. అర్హతే ప్రామాణికంగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉన్న ఊరు, వార్డుల్లోనే ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువీకరణపత్రం నుంచి బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు, ఇంటి స్థలం పట్టా, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రైతులకు అవసరమైన భూ రికార్డులు, విద్యుత్, మంచినీటి కనెక్షన్ వంటి మొత్తం 544 సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1.29 కోట్ల వినతులను గ్రామ, వార్డు సచివాలయాలు తీర్చాయి. పౌర సరఫరాల శాఖకు చెందిన 37.02 లక్షల వినతులను, ఇంధన శాఖకు చెందిన 15.62 లక్షల వినతులను, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన 7.61 లక్షల వినతులను, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన 7.48 లక్షల వినతులను ఈ వ్యవస్థ తీర్చింది. గతంలో ప్రభుత్వ సేవలతో పాటు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీలతో పాటు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసినా మంజూరు అయ్యేవి కావు. పైగా లంచాలు ఇచ్చిన వారికి, పార్టీకి చెందిన వారికే అరకొర మంజూరు అయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా సేవలు అందుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్ గడువులోగా వచ్చింది ఇదివరకు ఉద్యోగ విషయమై బర్త్ సర్టిఫికెట్ కోసం కళ్యాణదుర్గంలోని తహసీల్దార్ కార్యాయానికి వెళ్లాను. పట్టణ వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్ నివేదికలు ఇచ్చాకే సర్టిఫికెట్ వస్తుందని, ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నారు. నాకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం సర్టిఫికెట్ వెంటనే అవసరం అయ్యింది. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. నానా తిప్పలు పడినా సర్టిఫికెట్ రాలేదు. చివరికి వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇటీవల పాస్పోర్ట్ కోసం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. 9వ వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశాను. 15 రోజుల్లోనే సర్టిఫికెట్ వచ్చింది. – అరుణ్కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా సచివాలయ వ్యవస్థతో ఆధారం నేను 20 సంవత్సరాల క్రితం ఆర్డీసీ డిపోలో శ్రామిక్ (కూలీ)గా పని చేసి, రిటైరయ్యాను. ప్రస్తుతం రూ.1,100 మాత్రమే పింఛన్ వస్తోంది. వృద్ధాప్యంలో నేను, నాభార్య జీవనోపాధి లేక ఇబ్బందులు పడేవాళ్లం. ఆధార్ కార్డు నమోదు చేసిన కొత్తలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేశారు. దీంతో నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా రాని పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల పుణ్యమా అని ప్రస్తుతం నా భార్య నాగమణికి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ మంజూరు అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. – విల్లా కృష్ణ, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా ఆరేళ్ల ఎదురు చూపు.. సచివాలయంతో నెరవేరింది నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాం. ఊరూరా గాజులు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాను. నాకు పెళ్ళై ఆరేళ్లు అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్కార్డుకు దరఖాస్తు చేసుకుంటే నా భార్య పేరు లేకుండా నా ఒక్కడికే వచ్చింది. పేరు చేర్చాలని ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఐదు కిలోల బియ్యంతోనే సరిపెట్టుకున్నాం. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్ కార్డులో నా భార్య, ఇద్దరు పిల్లల్ని చేర్చాలని రమణయ్యపేట గ్రామ సచివాలయం–1లో దరఖాస్తు చేశాను. రెండు రోజుల్లోనే కార్డు మంజూరు అయ్యిందని వీఆర్వో సత్యనారాయణ ఫోన్ చేశారు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించాం. సచివాలయం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. – బత్తుల శ్రీనివాస్, రమణయ్యపేట, తూర్పుగోదావరి జిల్లా ఉన్న ఊరిలోనే సేవలకు సచివాలయ వ్యవస్థ కేంద్ర బిందువు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందుతున్నాయి. ప్రతి సేవకు ముఖ్యమంత్రి నిర్ధిష్ట గడువు విధించారు. ఆ గడువులో 85.36 శాతం ప్రజల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. సచివాలయాల వ్యవస్థతో గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలు, సేవలు అందుతున్నాయి. గతంలో రేషన్ కార్డు పొందడానికే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా నిర్ణీత గడువులోనే గ్రామ సచివాయాల్లో కార్డు మంజూరు చేస్తున్నారు. ఉన్న కార్డుల్లో సభ్యుల సంఖ్య పెంచడం గతంలో జరిగేది కాదు. ఇప్పుడు అలాంటి 21.70 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ తిప్పలు తప్పాయి గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల ప్రతి చిన్న పనికి మండల కేంద్రాలకు వెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. నాకు 70 ఏళ్ల వయసు ఉండటంతో పింఛన్ కోసం గతంలో అనేక సార్లు మా గ్రామానికి 13 కిలో మీటర్ల దూరంలోని పుట్లూరుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఇప్పుడు మా గ్రామానికి ఆనుకొని ఉన్న తక్కళ్లపల్లిలో ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అక్క డికి వెళ్తే రేషన్కార్డుతోపాటు పింఛన్ అందే లా వలంటీర్లు, సచివాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. – ఎస్. రామాంజులు, తిమ్మాపురం, అనంతపురం జిల్లా -
‘స్పందనే’ ప్రామాణికం
సాక్షి, అమరావతి: స్పందన వినతుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు. పౌరుల గ్రీవెన్స్లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులు.. పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలన్నారు. పటిష్టంగా నవరత్నాల అమలు ► నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెల రోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. తర్వాత నెలలో వెరిఫికేషన్ చేసి, మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ► దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారికి కచ్చితంగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు. నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే అని చెప్పారు. పింఛన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇతరత్రా అన్నీ కూడా నిర్ణీత వ్యవధిలోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► సుమారు లక్ష వరకు ఇంటి స్థలాల కోసం మళ్లీ దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన కూడా పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► ఇంటి స్థలాల పట్టాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, వచ్చే నెలలో ఈ దరఖాస్తులకు సంబంధించి రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ► ఈ కార్యక్రమంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐటీ, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున, ఆరీ్టజీఎస్ సీఈఓ జే విద్యాసాగర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన నూతన పోర్టల్ పనితీరు ఇలా ► పాత పోర్టల్లో 2,677 సబ్జెక్టులు, 27,919 ఉప సబ్జెక్టులు ► అప్డేషన్ చేసిన పోర్ట్ల్లో 858 సబ్జెక్టులు, 3,758 ఉప సబ్జెక్టులు ► దీనివల్ల చాలా వరకూ సమయం ఆదా. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా రూపకల్పన. పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం. ► గ్రామ సచివాలయాలు, కాల్ సెంటర్, వెబ్ అప్లికేషన్, మొబైల్ యాప్, ప్రజా దర్బార్ల ద్వారా వినతులు ఇచ్చే అవకాశం. ► స్వీకరించిన వినతుల్లో అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ. ► వినతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్లు. వెబ్ లింక్ ద్వారా, 1902కు కాల్చేసి, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం. ► వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్ చేసి జిల్లా స్థాయిలో లేదా విభాగాధిపతి స్థాయిలో విజ్ఞప్తి చేయవచ్చు. ► సేవల పట్ల ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు. థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరుగుతుంది. -
గూగుల్లో ఇవి వెతికితే మీ పని అంతే!
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేస్తుంది. దీనికి తోడు ఏం కావాలన్నా వెతికి పెట్టే గూగుల్ తల్లి.. ఇంకేముంది..? యువత ఇష్టారీతిన ఏ అంశం పడితే ఆ అంశాన్ని గూగుల్లో శోధన చేసేస్తున్నారు. అయితే, మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి గూగుల్ శోధన చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఫోన్ ద్వారా వినియోగించే వారు నేరుగా ఆ మాధ్యమం సైట్ నుంచే లాగిన్ అవ్వాలని సూచిస్తున్నారు. పోర్న్ సైట్లు అసలు ఓపెన్ చేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. 1. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వాలు అందించే పథకాలను గూగుల్లో శోధన చేయొద్దు. పథకాలు అందుతాయన్న భావనతో అందించే వివరాలు తీసుకొని నకిలీ సైట్ నిర్వాహకులు సులభంగా మీ ఫోన్లోకి ప్రవేశిస్తారు. తద్వారా సమాచారం తస్కరించడంతోపాటు ఇతరత్రా ఇబ్బందులూ సృష్టించే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు ఈ హెచ్చరిక చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి ఆ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలే కానీ నేరుగా పథకం పేరుతో గూగుల్ శోధన చేయొద్దని వారు చెబుతున్నారు. 2. కస్టమర్ కేర్ నంబర్లు వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులపై ఏదైనా సమాచారం కావాలనుకుంటే కస్టమర్ కేర్ సెంటర్కు ఫోన్ చేయడం పరిపాటిగా మారింది. రుణాల విషయంలోనూ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. కొంతమంది నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు సృష్టించి వాటి ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు. దీంతో, మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు నేరుగా ఫలానా కస్టమర్కేర్ నంబరు అని కాకుండా సదరు సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ కేర్ నంబరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే నకిలీ నంబరుకు ఫోన్ చేసి అడిగిన వివరాలన్నీ చెప్పడం వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు. 3. యాంటీ వైరస్, సాఫ్ట్వేర్లు అధికారిక గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారానే యాప్లు, యాంటీవైరస్లు డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నేరుగా యాంటీవైరస్లు శోధన చేసి డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్లో వైరస్ రావడంతోపాటు సమాచారం కూడా పొగొట్టుకోవాల్సి వస్తుంది. యాంటీ వైరస్ యాప్ల్లో నకిలీ ఉత్పత్తులను గుర్తించలేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 4. ఆన్లైన్ బ్యాంకింగ్ గూగుల్లో నకిలీ బ్యాంకుల వెబ్సైట్లు ఎక్కువగా వస్తున్నాయని, మొబైల్ ద్వారా బ్యాంకింగ్ వెబ్సైట్లు వెతికే క్రమంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల అధికారిక యూఆర్ఎల్ నుంచి లాగిన్ అవడం శ్రేయస్క రం అంటున్నారు. దీనివల్ల ఐడీ, పాస్వర్డ్లు తస్కరించడం అసాధ్యమని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకింగ్ సైట్లు చూడక తప్పనిసరి పరిస్థితి అయితే ఇన్కాగ్నిటో మోడ్లో వాటిని చూడాలని సూచిస్తున్నారు. 5. షాపింగ్ ఆఫర్లు, కూపన్కోడ్లు ఇటీవల కాలంలో ఆఫర్లు ఎక్కువ కావడంతో సైబర్ మోసగాళ్లు ఆ దిశగా వినియోగదారులను వలలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. షాపింగ్ ఎక్కడ చేస్తే ఆఫర్లు బాగా ఉంటాయి, కూపన్ కోడ్లు ఎలా పొందాలని వినియోగదారులు మొబైల్ ద్వారా శోధన చేయడంతో మోసగాళ్ల పని మరింత సులభం అవుతోందంటున్నారు. నకిలీ ఆఫర్లు, కూపన్లు ఆశ చూపి బ్యాంకుల సమాచారం లాగేసుకుంటున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: సామాన్యుడిపై మరో పిడుగు ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! -
దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘క్రికెట్లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్ సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యం. నాకు మీలాంటి టీమ్ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 20 నెలలుగా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’అని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులనుద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు చేసిన పనులు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ.. రిలాక్స్ అయితే వెనకబడతాం పరిపాలనలో 20 నెలలు.. అంటే దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయింది. క్రికెట్లో మాదిరిగా ఇప్పుడు మిడిల్ ఓవర్ల కాలం వచ్చింది. సహజంగా ఈ సమయంలో బ్రేక్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు రిలాక్స్ అయితే వెనుకబడిపోతాం. మనం మళ్లీ దృష్టిని కేంద్రీకరించుకోవాలి. శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలి. చేసిన పనులను సమీక్షించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి. లక్ష్య సాధన కోసం కలసి కట్టుగా పనిచేయాలి. అప్పుడే మరింత ముందుకు వెళ్లగలుగుతాం. మన సమర్థతకు నిదర్శనం.. నిజం చెప్పాలంటే... అలాంటి ఆలోచనలు (వివిధ కార్యక్రమాలు, పథకాలను ప్రస్తావిస్తూ) చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో, గట్టి సంకల్పంతో చేసి చూపించింది. ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం ఏటా ఉగాది పర్వదినం రోజు వలంటీర్లకు సత్కారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తే వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టినట్లు అవుతుంది. వలంటీర్లు మహోన్నత సేవలందిస్తున్నారన్న భావన అందరిలో కలిగించినట్లు అవుతుంది. సచివాలయాలు, వలంటీర్ల మధ్య పూర్తి సమన్వయం ఉంటే ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా, సమర్థంగా ప్రజలకు అందుతాయి. సమష్టి కృషితోనే సాధ్యం.. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. సమష్టి కృషి వల్లే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ నుంచి దిశ చట్టం దాకా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఎన్నో ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రం కూడా ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అవి మిగిలిన రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించాయి. పాలనలో నిబద్ధతకు ప్రతిరూపం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మార్పులు అంతటితోనే ఆగిపోలేదు. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం టెండర్ల జ్యుడీషియల్ ప్రివ్యూ చేపట్టాం. రివర్స్ టెండరింగ్ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాలనలో నిబద్ధతకు ప్రతిరూపంలా నిల్చింది. ఇంగ్లిష్ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, గత వందేళ్లలో ఏనాడు జరగని భూముల సమగ్ర రీసర్వే లాంటి కార్యక్రమాలను చేపట్టాం. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ను అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా నగదు బదిలీ.. వీటన్నింటికి మించి వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానం తెచ్చాం. దళారీలు, అవినీతికి ఎక్కడా తావులేకుండా కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. ఆ విధంగా దాదాపు రూ.90 వేల కోట్లు ఇచ్చాం. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా.. నాడు–నేడుతో విద్య వైద్య రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. 30.92 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో.. బహుశా దేశ చరిత్రలోనే ఐదేళ్లలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చు. కేవలం ఇళ్ల స్థలాల పంపిణీ మాత్రమే కాకుండా గృహ నిర్మాణాలను ప్రారంభించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని మన రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్ట పాలు చేసిన ఎందరో నాయకులను నేను చూశా. వందల హామీలతో, వందల పేజీలతో రూపొందించి ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకునే వారే కాదు. మేనిఫెస్టోను కనీసం మళ్లీ చూసేవారు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో మేం నవరత్నాలతో మేనిఫెస్టోను తెచ్చాం. చదవడానికి చాలా సులభంగా ఉండడమే కాకుండా నిత్యం కళ్ల ముందు కనిపించేలా, కర్తవ్యాన్ని గుర్తు చేసేలా కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని ప్రతి శాఖ కార్యదర్శికి, ప్రతి విభాగాధిపతికి, ప్రతి కలెక్టర్కు అందజేశాం. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పని చేశాం. కార్యక్రమాలు నిర్వహించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం వరకు అమలు చేశాం, చేస్తున్నాం. ఒక్కొక్కటీ చక్కదిద్దుకుంటూ.. నేను అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక మాట చెప్పారు. దాదాపు రూ.60 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిల్లో రూ.21 వేల కోట్లు కేవలం విద్యుత్ బిల్లుల బకాయిలు కాగా మిగిలిన రూ.39 వేల కోట్ల బిల్లులు వివిధ శాఖలకు సంబంధించినవి. ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్ల బకాయిలున్నాయి. కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో కూడా ఏమాత్రం సయోధ్య లేని పరిస్థితి ఉంది. మేం అధికారం చేపట్టినప్పుడు ఉన్న దుస్థితి అది. ఆ పరిస్థితి నుంచి అన్నీ చక్కదిద్దుకుంటూ ఇంత దూరం వచ్చామని గర్వంగా చెప్పగలుగుతా. గ్రామాలకే పాలన.. గతంతో పోలిస్తే పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. మండల స్థాయి నుంచి పరిపాలనను గ్రామ స్థాయికి చేరువ చేశాం. గతంలో ప్రతిదీ మండల స్థాయిలో జరగడం వల్ల అన్నీ ఆలస్యమయ్యేవి. అవినీతి కొనసాగేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిపాలన అందుతోంది. ఒక్కో గ్రామంలో సగటున 700 ఇళ్లు ఉన్నాయనుకుంటే దాదాపు 10 మంది అధికారులు పని చేస్తున్నారు. ఇలా ఒక పరిధిలోనే సేవలందించడం వల్ల ఏ అధికారీ లంచం ఆశించే వీలు లేదు. కార్యదర్శులు, విభాగాధిపతులు చొరవ చూపాలి.. గ్రామస్థాయికి పరిపాలనను చేరవేసేందుకు మనం తెచ్చిన సచివాలయాల వ్యవస్థను ప్రతి కార్యదర్శి, ప్రతి విభాగాధిపతి తమదిగా భావించాలి. లేదంటే శాఖల మధ్య సమన్వయం కొరవడి సేవలు సక్రమంగా అందవు. గ్రామాల నుంచి అందే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలి. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలి. అలా జరగకపోతే ప్రజలకు ప్రభుత్వంపైనా, కార్యదర్శులపైనా నమ్మకం, విశ్వాసం పోతుంది. అందువల్ల గ్రామాల నుంచి వస్తున్న వినతులపై అధికార యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో స్పందన ఉండాలి. ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. అలాంటి చొరవ కార్యదర్శులు, విభాగాధిపతులకు ఎంతో ముఖ్యం. సీఎస్కు అభినందనలు... ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నా. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి. తద్వారా శాఖల సమన్వయం పెరుగుతుంది. పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోగలుగుతా. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన విధంగా నిర్దేశించగలుగుతాం. ఇవన్నీ ఒకవైపు కాగా మరోవైపు ఇలాంటి సమావేశాల వల్ల మన ముందున్న పనులు, లక్ష్యాలపై దృష్టి పెట్టే వీలుంటుంది. ఎక్కడైనా సమాచార లోపం ఉంటే అధిగమించవచ్చు. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎంతోమంది అనుభవజ్ఞులైన అధికారులున్నారు. మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా ఫలానా శాఖలో ఇలాంటి మార్పు చేస్తే మరింత మెరుగైన పాలన అందుతుందని భావిస్తే ఏమాత్రం సంకోచించకుండా చెప్పండి. నిస్సందేహంగా సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. వాటి అమలులో ప్రభుత్వం సంకోచించదు. ఉగాదికి వలంటీర్లకు అవార్డులు, రివార్డులు.. కొందరు వలంటీర్లు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి చాలా బాధ కలిగింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమే కదా? వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం మొత్తం వ్యవస్థనే నీరుగారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వలంటీర్లను ప్రోత్సహిద్దాం. ఆ ప్రక్రియలో నాకు ఇవాళే ఒక ఆలోచన వచ్చింది. ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో వలంటీర్లకు సత్కారం, సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులు ప్రదానం చేయడం వల్ల వారి సేవలను గుర్తించి ప్రోత్సహించినట్లు అవుతుంది. వచ్చే ఉగాది రోజు ఈ కార్యక్రమం ప్రారంభించాలి. ఉదాహరణకు కడపలో పది నియోజకవర్గాలున్నాయి. అంటే అది 10 రోజుల కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లాలో 19 రోజులు, గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు వలంటీర్ల సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. కలెక్టర్, ఎస్పీ, సచివాలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాయింట్ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలి. తద్వారా వారు తమ బాధ్యతలను ఒక ఉద్యోగంగా భావించకుండా సేవా ధృక్పథంతో పని చేస్తారు. -
వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ
సాక్షి, అమరావతి: ‘‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గత సర్కారు ప్రతి సేవకూ రేటు కట్టి లంచాలు గుంజి, జన్మభూమి కమిటీలు లాంటి వాటితో పౌర సేవలను భ్రష్టు పట్టించడంతో అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. లంచాలు, వివక్ష లేని విశ్వసనీయ పరిపాలన కోసం ప్రతి 50 ఇళ్లకు సేవాభావంతో పౌర సేవలను డోర్ డెలివరీ చేసే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ. అందుకే సమాజంలో ప్రజలంతా మిమ్మల్ని ఆత్మీయులుగా చూస్తున్నారు’’ అని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది వలంటీర్లనుద్దేశించి మంగళవారం రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. లేఖ సారాంశం ఇదీ... నా ఆత్మీయ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు.. గ్రామ వలంటీర్ల జీతాలు పెంచాలని కొద్ది మంది డిమాండ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది. గ్రామ, వార్డు వలంటీర్లుగా రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఉదాత్తమైన బాధ్యతలు అప్పగించాం. ప్రతి 50 ఇళ్లకు పౌర సేవలను డోర్ డెలివరీ చేసే వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. సేవాభావం ఉన్న చెల్లెళ్లు, తమ్ముళ్లతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశాం. మనందరీ ప్రభుత్వం అందించే పథకాలన్నీ కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అందాలన్న ఉద్దేశంతో వీరిని ఎంపిక చేశాం. చివరకు నాకు ఓటు వేయని వారికి కూడా, ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసిన వారికి కూడా వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించాం. నా అంచనాలకు అనుగుణంగా 2.6 లక్షల మంది వలంటీర్లలో 99 శాతం మంది తాము చేస్తున్నది సేవ అని, అది ఉద్యోగం కాదని మనసావాచా కర్మణా నమ్మారు కాబట్టి ఈ వ్యవస్థకు మన సమాజంతోపాటు దేశంలో పలు రాష్ట్రాలు సలాం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ, ప్రతి మనిషి వారికి అందుకే ఆ గౌరవం ఇస్తున్నారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది జీతం కాదు. అది గౌరవ భృతి. వలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవభృతి ఇస్తున్నాం. ఖర్చు ఎక్కువ అయినా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పౌర సేవల డోర్ డెలివరీకి ఇంత ఖర్చు చేయటానికి ముందుకు రాకపోయినా, ప్రజలకు లంచాలు, వివక్ష లేని సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి వలంటీర్కు ఏడాదికి రూ.60 వేలు చొప్పున 50 ఇళ్లకు ఒకరిని నియమించి గౌరవ భృతి అందజేస్తున్నాం. అపార్థాలు, అనుమానాలకు తావు లేకుండా.. వలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాలు కానివ్వండి, మీ అందరి దగ్గర ఉన్న వలంటీర్ల హ్యాండ్ బుక్లో కానివ్వండి, ఎటువంటి అపార్థాలు, అనుమానాలకూ తావు లేకుండా వలంటీర్లను, వారికి ఇచ్చే గౌరవ భృతిని డిఫైన్ చేశాం. స్పష్టంగా చెప్పాం. ఆ హ్యాండ్ బుక్లో ఏముందో మీరే చూడండి. లేదా ఆ రోజు నేను అన్న మాటల్ని గుర్తు తెచ్చుకోండి. హ్యాండ్ బుక్లో నేను రాసిన సందేశంలో ‘‘ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా ధృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్గా నియమిస్తాం. వారు గ్రామ/ వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, నవరత్నాల ద్వారా అందించే పథకాలు లాంటివి ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తారు. వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు’’ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. వలంటీర్ల సేవల ప్రారంభం రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పా. పని గంటల నిబంధనలు లేవు.. ‘వలంటీర్’ అనే పదానికి అర్థమే ‘‘స్వచ్ఛందంగా సేవలు అందించడం’’. ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ. వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. గ్రామ, వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ అటెండెన్స్ ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లేందుకు నెలలో పని ఉన్న కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది. మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ అనుబంధాన్ని పెంచేందుకు, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. వివక్ష, లంచాలు లేని ఒక మంచి వ్యవస్థను తెచ్చేందుకు, మంచి మార్పులు తెచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని గతంలోనే స్పష్టం చేశా. ఒక్కసారి ఆలోచన చేయండి.. సేవాభావంతో, ప్రతిఫలాపేక్ష లేకుండా వలంటీర్ అనే పదానికి అర్థం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవలు అందించారు కాబట్టి సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తుంటే ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. స్వచ్ఛదంగా కాకుండా ఇదే పనిని మీరు జీతం కోసమే చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా? వలంటీర్ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా? రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి.. గొప్పగా సేవలందిస్తున్న వలంటీర్లకు సమాజం నమస్కరిస్తోంది. ప్రభుత్వమూ వారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలందించిన వారికి నియోజకవర్గం ప్రాతిపదికగా ఏటా ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జేసీ సమక్షంలో శాలువా కప్పి అవార్డుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేసేందుకు, మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. -
మరింత పారదర్శకత.. జవాబుదారీతనం
సాక్షి, అమరావతి: సాగు సేవలన్నీ రైతు ముంగిటకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుతున్న సేవల్లో మరింత పారదర్శకతను, సిబ్బందిలో మరింత జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వైఎస్సార్ యాప్లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 660 మండలాల్లో 10,641 ఆర్బీకేలున్నాయి. వీటికి అనుసంధానంగా 65 హబ్లు, 13 జిల్లా రిసోర్స్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆర్బీకేల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. గతేడాది మే 30 నుంచి అందుబాటులోకి వచ్చిన ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,850 విత్తన, 12 వేల ఎరువులు, 1.21 లక్షల పురుగుల మందుల డీలర్షాపులను ఈ కేంద్రాలకు అనుసంధానించారు. వైఎస్సార్ యాప్లో సమగ్ర వివరాలు విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతిదీ నమోదు, రియల్ టైం ఫలితాలు రాబట్టడం వైఎస్సార్ యాప్ ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ద్వారా సిబ్బంది తాము పనిచేసే ఆర్బీకే వివరాలను రిజిస్టర్ చేసిన తర్వాత అసెట్ ట్రాకర్లో ఆర్బీకే భవనం, ఆస్తులు, ఆధునిక సాంకేతిక పరికరాలు, ఇతర సామగ్రి వివరాలను డిజిటల్ స్టాక్ రిజిస్టరులో నమోదు చేయాలి. పరికరాల వినియోగంలో సమస్యలు ఎదురైతే తక్షణం పరిష్కరించేలా ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ కింద నమోదు చేసిన పంటల వివరాలు, డాక్టర్ వైఎస్సార్ పొలంబడి, పంట కోత ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ వంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్లో నమోదు చేస్తారు. సేవల్లో పారదర్శకత, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ యాప్లో మరిన్ని ఫీచర్లు జోడిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్కుమార్ చెప్పారు. జవాబుదారీతనం కోసం జియోఫెన్స్ ఈ యాప్లో కొత్తగా తీసుకొచ్చిన జియోఫెన్స్ ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం తీసుకురానున్నారు. ప్రతిరోజు ఆర్బీకేకి ఐదు కిలోమీటర్ల పరిధిలో రైతులకు అందించిన సాగుసేవలు, అమలు చేసిన కార్యక్రమాలపై సమగ్ర విశ్లేషణ, చిత్రాలు అప్లోడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్బీకే పనితీరుపై అంచనా వేసి గ్రేడింగ్ ఇస్తారు. తద్వారా ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పనితీరుకు రాష్ట్రస్థాయిలో స్కోరింగ్ ఇస్తారు. ఆర్బీకేల్లో సేవలు, సిబ్బంది పనితీరుపై ‘చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు’ అనే నాలుగంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. పంట ఆరోగ్యం, ఉత్పాదకాల లభ్యత, రైతులకు శిక్షణ ఇతర అవసరాల కోసం కూడా అభిప్రాయాలు సేకరిస్తారు. తదనుగుణంగా సేవలను మరింత మెరుగుపర్చే దిశగా చర్యలు చేపడతారు. -
మా మంచి వలంటీర్
గుమ్మఘట్ట: పనిచేస్తే ఫలితం తప్పక దక్కుతుందనేందుకు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డిలో సోమవారం జరిగిన సంఘటన నిదర్శనంగా ఉంది. నిరంతరం తమ అవసరాలు గమనిస్తూ తమకు సేవ చేస్తున్న వలంటీరును 50 ఇళ్ల ప్రజలు కలిసి సత్కరించారు. సిరిగేదొడ్డి గ్రామ సచివాలయ పరిధిలో భూతయ్యదొడ్డి క్లస్టర్–7 విభాగంలో నాయకుల రాజేష్ గ్రామ వలంటీర్గా పనిచేస్తున్నారు. తన పరిధిలోని 50 కుటుంబాలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. రోజూ ఇంటింటికీ తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనదిగా భావించి పరిష్కారానికి చొరవ చూపేవారు. ఫలితంగా రాజేష్ను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. రాజేష్ వలంటీర్గా ఉద్యోగంలో చేరి సోమవారం నాటికి సంవత్సరం పూర్తికాగా ఆయన పరిధిలోని 50 కుటుంబాల వారు పార్టీలకు అతీతంగా సచివాలయం వద్దకు వచ్చి ఘనంగా సత్కరించారు. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, తోటి వలంటీర్లు అభినందనలు తెలిపి ప్రశంసించారు. ప్రతి వలంటీర్ రాజేష్ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీవో శివరామ్ప్రసాద్రెడ్డి కోరారు. కార్యక్రమంలో సిరిగేదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. -
మిగిలిన అర్హులకూ అందిన ‘జగనన్న చేదోడు’
సాక్షి, అమరావతి: ‘జగనన్న చేదోడు’ పథకం కింద అర్హులైన మిగిలిన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంలో భాగంగా.. గతంలో వివిధ కారణాలతో అవకాశం కోల్పోయిన 51,390 మంది టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం రూ.51.39 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా ‘సంక్షేమం’ ఆగదు.. మంత్రి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలెదురైనా, కరోనా వంటి విపత్తులు వచ్చినా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులు వారి వృత్తి పనులకు ఉపయోగించుకునేందుకు ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు 2,47,040 మంది లబ్ధిదారులకు రూ.247.04 కోట్లను సీఎం అందించారన్నారు. అయితే ఆ సమయంలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సీఎం జగన్ నెల రోజులు అవకాశం కల్పించారని చెప్పారు. ఇప్పుడు వారందరికీ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలయితే ఒక్కసారి కూడా సరిగ్గా సాయమందించేవి కావన్నారు. కానీ వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ సాయమందించేందుకు మళ్లీ నెల రోజులు అవకాశమిచ్చిందన్నారు. దీనివల్ల మరో 51,390 మందికి లబ్ధి జరిగిందన్నారు. ఇంత పారదర్శకంగా ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. తాజాగా సాయం అందుకున్న వారిలో టైలర్లు 24,336 మంది, నాయీబ్రాహ్మణులు 6,317 మంది, రజకులు 20,737 మంది ఉన్నారని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1,48,168 మంది రజకులు, నాయీబ్రాహ్మణులకు 148.16 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం టైలర్లను కూడా కలిపి కేవలం ఏడాదిలోనే ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 2,98,430 మందికి రూ.298.43 కోట్లు అందించిందన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులు తమ మనోగతాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు. -
మరో 51,390 మందికి ‘జగనన్న చేదోడు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికీ (సంతృప్త స్థాయిలో)అందించాలన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న చేదోడు’ పథకం కింద మరో 51,390 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నగదు బదిలీ చేయనుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ కంప్యూటర్ బటన్ నొక్కి బదిలీ చేస్తారు. గతంలోనే 2,47,040 మంది రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు రూ.247.04 కోట్లను సీఎం జగన్ అందించారు. పొరపాటున ఇంకా ఎవరైనా మిగిలిపోతే పేర్లు నమోదు చేసుకునేందుకు నెల గడువు ఇస్తున్నామని, సాయం అందని అర్హులు కంగారుపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధి పొందని వారి నుంచి మరోమారు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను వలంటీర్ల ద్వారా పరిశీలన జరిపించి అర్హులైన 51,390 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.51.39 కోట్లు బదిలీ చేయనున్నారు. -
పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : నాడు-నేడు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కచ్చితంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనుల పరిశీలన కోసం విద్యాశాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్ బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్యాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు-నేడు ‘మనబడి’పై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాడు నేడు’ లో పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని పేర్కొన్నారు. చదవండి: సోమశిల రెండో దశకు సీఎం జగన్ శంకుస్థాపన జూనియర్ కళాశాలలు రాష్ట్రంలోని ప్రతి మండలంలో తప్పనిసరిగా ఒక జూనియర్ కళాశాల ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవని, అందువల్ల ఆయా చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. మనం ఏం కోరుకుంటామో.. మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ కూడా అన్ని హాస్టళ్లలో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలని, వాటిని బాగా నిర్వహించాలని అన్నారు. మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మెటీరియల్ వాడాలన్నారు. అన్ని బాత్రూమ్లలో హ్యాంగర్స్ కూడా ఉండాలని, గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు. అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉండగా, బాత్రూమ్లపై కూడా యాప్ డెవలప్ చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలని, కాబట్టి నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దని హెచ్చరించారు. ఆ విధంగా పెయింటింగ్తో సహా మెయింటెనెన్స్ ఉండాలని, భవిష్యత్తులో అంగన్వాడీలలో కూడా నాడు–నేడు కొనసాగుతుందన్నారు. కాబట్టి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ వద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. చదవండి: బాధితులకు వరం.. జీరో ఎఫ్ఐఆర్ జగనన్న విద్యా కానుక: ‘ఈ కిట్లో ప్రతి ఒక్కటి కూడా నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ. వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి. జగనన్న గోరు ముద్ద–హాస్టళ్లు: హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండాలి, ఆ మేరకు ప్లాన్ చేయండి. మార్పు చేసిన మెనూ ప్రకారం పక్కాగా సరఫరా జరుగుతోందా? లేదా? అన్నది కూడా ఎంతో ముఖ్యం. ఆ ప్రకారం డిజైన్ చేసిన దాని ప్రకారం పెడుతున్నామా? లేదా? అన్నది మొదటి ప్రమాణం అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాగా, కార్యక్రమంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. నాడు నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయని, అయితే పనులు మాత్రం అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయన్నారు. పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్ట్స్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా సోషల్ ఆడిటింగ్ జరుగుతోందన్నారు. తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయని, స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు కేటగిరీలలో కిచెన్ల నిర్మాణం. రూ.5లక్షలు. రూ.15 లక్షలతో రెండు రకాల కిచెన్లు నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9323 అంగన్వాడీలు స్కూళ్ల భవనాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 5735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.287 కోట్లు, 1668 హైస్కూళ్లలో రూ.15 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.250 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కమిషనర్ విజయ్కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడుతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వాహన మిత్ర లబ్ధిదారులకు నేడు నగదు బదిలీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను (సంతృప్త స్థాయిలో) అర్హత గల ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంలో భాగంగా వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఎంపిక చేసింది. సొంతంగా నడుపుకునే ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం మరో 11,501 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద తొలి ఏడాది 2,39,957 మందికి సాయం అందించారు. రెండో ఏడాది అక్టోబరులో అందించాల్సిన నగదును కోవిడ్ కారణంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే లక్ష్యంతో నాలుగు నెలలు ముందుగానే సీఎం వైఎస్ జగన్ రెండో విడతగా ఈ ఏడాది జూన్లో 2,62,493 మందికి సాయం అందించారు. పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయించి మరో 11,501 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. వారందరికీ సోమవారం రూ.11.50 కోట్లు నగదు బదిలీ చేయనుంది. ఇప్పటివరకు రెండు విడతల్లోనూ రూ.502.43 కోట్ల సాయాన్ని లబ్ధిదారులకు అందించింది. -
మరో 4.39 లక్షల మంది అర్హులకు నేటి నుంచి సాయం
సాక్షి, అమరావతి: వివిధ పథకాల కింద అర్హత ఉండీ ఇప్పటివరకు సాయం అందని వారికి శనివారం నుంచి ఆయా పథకాల కింద సాయం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్ కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వైఎస్సార్ చేయూత పథకాలకు అర్హులై ఉండీ లబ్ధి కలగని 4.39 లక్షల మందికి ఈనెలలో వాటిని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం (నేడు) కాపునేస్తం, 9న వాహనమిత్ర, 10న జగనన్న చేదోడు, 11న నేతన్న నేస్తం, 12న చేయూత పథకాల కింద 4.39 లక్షల మందికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వలంటీర్ వ్యవస్థ ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో 28,19,000 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. సీఎం జగన్ ప్రజాసేవ అనే తపస్సులో భాగమే ప్రజా సంకల్పయాత్ర అని పేర్కొన్నారు. జగన్లాగా ఇచ్చినమాట నిలుపుకొనే వ్యక్తులు అరుదన్నారు. కష్టపడ్డ నాయకుడు కనుకే కష్టాలు తెలిసి, కష్టపడ్డవారికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా విపత్తులోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా సాగుతున్నాయన్నారు. నాడు చంద్రబాబుది పథకాలు ప్రకటించి ఎగ్గొట్టాలనే లక్ష్యం ఉన్న ప్రభుత్వమని విమర్శించారు. -
అనర్హులకు ఇచ్చేదెలా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనర్హులని కళ్లెదుటే కనిపిస్తున్నా ప్రభుత్వ పథకాలను అందించాలా? అర్హత లేకున్నా లబ్ధి చేకూర్చాలా?.. కళ్లు మూసుకుని కూర్చోవాలా? ఒంటరి మహిళలకు పింఛన్ల వ్యవహారంలో అధికారులకు ఎదురవుతున్న ‘ధర్మ’ సందేహం ఇదీ! అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో అర్హులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఒకటికి రెండుసార్లు క్షేత్రస్థాయి సర్వేలతో నిర్థారించుకుని నేరుగా ఇంటివద్దే పథకాల లబ్ధిని అందచేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో అర్హులు మిగిలిపోయే అవకాశం లేదు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒంటరి మహిళలకు పింఛన్లు నిలిపివేసిన వ్యవహారంలో 145 మంది నిజంగానే అనర్హులని క్షేత్రస్థాయి విచారణలో తేలింది. దీనికి సంబంధించి 175 మంది కోర్టును ఆశ్రయించడంతో... ఏ మహిళా భర్త ఉండగా వితంతువునని చెప్పదని, ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వారికి 15 రోజుల్లోగా తిరిగి పింఛన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో మరోసారి లబ్ధిదారుల అర్హతలను పరిశీలించారు. ఈనెల 8వ తేదీన హైకోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేయగా మరుసటి రోజే గ్రామంలో విచారణ చేపట్టారు. ఈనెల 15న నిర్వహించిన గ్రామసభకు ఒక్కరు మినహా ఎవరూ హాజరు కాకపోవడంతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. వారెవరూ ఒంటరి మహిళలు కాదని.. అనర్హులుగా నిర్ధారణ కావడంతోనే పింఛన్లు నిలిపివేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారికి పింఛన్లు ఎలా ఇవ్వాలని అధికారులు తల పట్టుకుంటున్నారు. అనర్హులని పక్కాగా తేలినప్పటికీ పింఛన్లు ఎలా ఇవ్వాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. క్షేత్రస్థాయి సర్వేతో... ► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం బిర్లంగి పంచాయతీలో కోర్టును ఆశ్రయించిన వారిలో 27 మంది ఇప్పటికే వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా మరో ముగ్గురు తాజాగా అర్హత పొందినట్టు నిర్ధారించారు. మిగతా 145 పింఛన్లు అనర్హమైనవని తేల్చేశారు. ► రాజుల సాహు అనే మహిళ తన భర్త నర్సింగ జీవించి ఉన్నప్పటికీ వితంతు పింఛను తీసుకుంటున్నారు. ఆ దంపతులిద్దరూ కలిసే ఉంటున్నారు. ► టరిని బడిత్య అనే మహిళ ఒంటరి మహిళ పింఛను పొందుతోంది. అయితే ఆమె భర్త రఘునాథ్ బడిత్యాతో కలిసి జీవిస్తోంది. మ రోవైపు రఘునాథ్ బడిత్యా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటుండటం గమనార్హం. ► ఒంటరి మహిళ పింఛను తీసుకుంటున్న శశిమణి పాత్రో అనే మహిళ తన భర్త కృష్ణతో కలిసే ఉంటోంది. ► దూపాన మోహిని అనే మహిళ తన భర్త ఉమాపతి లేరని ఒంటరి మహిళ పింఛను తీసుకుంటోంది. వాస్తవానికి ఆయన జీవించే ఉండగా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నారు. ► ప్రతిమ అనే మహిళ ఒంటరి మహిళ పింఛను పొందుతున్నారు. కానీ అప్పటికే ఆమె అభ య హస్తం పింఛను కూడా తీసుకుంటోంది. ► లక్ష్మీ బడిత్యా అనే మహిళ వితంతు పింఛను తీసుకుంటూ భర్త చనిపోయినట్లు చూపించారు. కృష్ణ అనే వ్యక్తితో ఆమె కలసి జీవిస్తున్నారు. ► ఒంటరి మహిళ పింఛను తీసుకుంటున్న దడ్డ జ్యోతి తన భర్త బలరాం గణపతితో కలిసే ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ ఉపా«ధ్యాయు డిగా పని చేస్తున్నారు. గ్రామసభకు ఆమె ఒక్కరే హాజరయ్యారు. తాను కోర్టుకు వెళ్లలేదని అధికారులకు వివరణ ఇచ్చారు. నా పేరు మార్చి ఫిర్యాదు.. ఇటీవల జగనన్న మాకు రూ.పది వేలు సాయం అందచేశారు. నేను ఉంటుండగానే నా భార్య ఒంటరి మహిళా ఎలా అవుతుందో అర్థం కావడంలేదు. మాకు పింఛన్ కావాలని ఎవరినీ అడగలేదు. భర్తగా నా పేరు తొలగించి ‘రాజు’ అని మార్చి కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు నోటీసు ఇచ్చారు. – లోకనాథం శెట్టి, (దమయంతి శెట్టి భర్త), బిర్లంగి ఊరందరితో పాటు మాకూ.. నాకు భర్త (అప్పన్న శెట్టి) ఉన్నందున పింఛన్ తొలగించారు. కానీ నా భర్త చనిపోయినట్లు నోటీసులో ఉంది. పొలం పనులు ఉన్నందున గ్రామ సభకు హాజరు కాలేదు. – శ్యామల శెట్టి, ఫిర్యాదుదారు, బిర్లంగి మా చెల్లి ఒంటరి కాదు.. గతంలో మా చెల్లికి వివాహానికి ముం దు పింఛన్ వచ్చేది. పింఛన్ కోసం ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. – నెయ్యిల ఘనశ్యామ్, (కున్నీ బెహరా అన్న), బిర్లంగి -
ఇంజినీర్లు.. ప్రజాధనం లూటీ!
సాక్షి, కరీంనగర్: ‘పట్టణ ప్రగతి’ పనుల పేరిట ప్రజల సొమ్ము కాజేసేందుకు కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు స్కెచ్ వేశారు. ఇందుకోసం వాహనాల నంబర్లనే తారుమారు చేశారు. జేసీబీ నంబర్ల స్థానంలో తమకు తోచిన ద్విచక్రవాహనాల నంబర్లు.. ట్రాక్టర్ల నంబర్ల స్థానంలో కనిపించిన ఆటో నంబర్ రాసి బిల్లుల కోసం ఫైళ్లు పెట్టారు. అన్నీ సరిచూసుకుని సంతకం చేయాల్సిన కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా సంతకం చేసేశారు. చివరకు ఆడిటింగ్ అధికారుల వద్ద అసలు బాగోతం బయటపడింది. ఖాళీ స్థలాల చదును పేరిట.. పట్టణాల్లోని మురికివాడలు, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రతీనెల నిధులు కేటాయిస్తోంది. పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం కావాలని, పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. 5.9 ఎకరాలు శుభ్రం చేశామని.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పలు సమస్యలు గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా చెత్త, మురికినీరు నిలిచిన ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 60 డివిజన్లలో కలిపి 5.9 ఎకరాల విస్తీర్ణంలోని మూడువేలకుపైగా ఖాళీ స్థలాలను గుర్తించినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. వీటిని శుభ్రం చేసేందుకు నిత్యం 25పైగా జేసీబీలు, 40కుపైగా బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు వినియోగించామని రికార్డులు నమోదు చేశారు. జేసీబీ స్థానంలో బైక్.. ట్రాక్టర్ల స్థానంలో ఆటోల నంబర్లు.. పది రోజులు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఖాళీ స్థలాలు శుభ్రం చేసేందుకు 150 జేసీబీలు, 200 ట్రా క్టర్లు ఉపయోగించినట్లు లెక్క తేల్చారు. 60 డివిజన్లలో 5.96 ఎకరాల ఖాళీ స్థలాల క్లీనింగ్కు రూ.40 లక్షలు ఖర్చయినట్లు లెక్కలు వేశారు. వాహనాల బిల్లుల కోసం రూ.5 లక్షలకు ఒక ఫైల్ చొప్పన 8 ఫైళ్లు సిద్ధం చేశారు. ఇందులో జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు ఏ రోజు ఎన్ని వినియోగించారు. ఎక్కడెక్కడ పనులు చేయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో వివరాలు నమోదు చేశారు. ఇక్కడే అధికారులు ‘తప్పు’లో కాలేశారు. జేసీబీ, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో తమ కంటికి కనిపించిన బైకులు, ఆటోలు నంబర్లు నమోదు చేశారు. 150 జేసీబీల స్థానంలో 10 బైక్ నంబర్లు నమోదు చేసి వాటితో మళ్లీమళ్లీ పనులు చేయించినట్లు రికార్డులు రూపొందించారు. అలాగే 200 బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో సుమారు 25 ఆటోలు, బైక్ రిజిస్ట్రేషన్ నంబర్లు వేశారు. విధుల్లో లేని అధికారుల సంతకాలు.. ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులు నిర్వహించే సమయంలో అసలు విధుల్లో లేని ఇద్దరు అధికారులు రూ.40 లక్షల బిల్లులకు సబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. పట్టణ ప్రగతి సమయంలో సంతకాలు చేసిన ఏఈలు ఇతర మున్సిపాలిటీల్లో ఇన్చార్జీలుగా విధులు నిర్వర్తించారు. అయినా బిల్లుల ఫైళ్లపై సదరు ఏఈలతో సంతకాలు చేయించారు. నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అంతా తామై నడిపించారని తెలిసింది. తర్వాత వివరాలు సరిచూసుకోకుండానే డీఈలు, ఈఈలు సంతకాలు చేసి ఫైళ్లను కమిషనర్కు పంపించారు. గుడ్డిగా సంతకం చేసిన కమిషనర్.. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కరీంనగర్ కార్పొరేషన్కు నెలకు రూ.2.44 కోట్లు మంజూరు చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.17.09 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో 5.96 ఏకరాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేసినందుకు ఈ నిధుల నుంచి రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేయాలని వచ్చిన 8 ఫైళ్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎన్ని వాహనాలు వాడారు. ఎన్ని గంటలు పనిచేశాయి. వాహనాలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు. నమోదు చేసిన వివరాలన్నీ సరైనవా కావా అని క్రాస్ చెక్ చేయాలి. అనుమానం వస్తే క్షేత్రస్థాయిలో కూడా పరిశీ లించాలి. కానీ కరీంనగర్ కమిషనర్ ఇవేవీ పట్టించుకోలేదు. గుడ్డిగా బిల్లుల మంజూరుకు వచ్చిన ఫైళ్లపై వేగంగా సంతకం చేసి బిల్లుల మంజూరుకు అకౌంట్ అధికారులకు అటునుంచి ఆడిటింగ్ అధికారులకు పంపించారు. ఆడిటింగ్లో గుట్టు రట్టు.. ఆడిటింగ్ సమయంలో ఫైళ్లు తనిఖీ చేస్తున్న అధికారులకు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లపై అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టారు. రవాణా శాఖ పోర్టల్లో జేసీబీ, ట్రాక్టర్ల నంబర్లు సరిచూసుకుని కంగుతిన్నారు. జేసీబీ, బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల నంబర్ల స్థానంలో బైక్, ఆటోల నంబర్లు దర్శనం ఇచ్చాయి. బైకులు, ఆటోలతో పనిచేయించారా అని ఆడిటింగ్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి న కమిషనర్ ఫైళ్లను తిప్పి పంపమని సూచించడంతో ఆడిటింగ్ అధికారులు అకౌంట్ అధికారులకు అటు నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఫైళ్లు రిటర్న్ చేశారు. ఆ ఫైళ్లు.. ఆగమేఘాలపై.. కరీంనగర్ కార్పొరేషన్లో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బిల్లులకు సబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వీటిలో చాలా వరకూ చిన్నచిన్న కారణాలతో పెండింగ్లో పెట్టారని సమాచారం. పట్టణ ప్రగతిలో పనిచేసిన వాహనాల బిల్లుల ఫైళ్లు మాత్రం ఆగమేఘాలపై రూపొందించారు. అంతే వేగంగా ఏఈలు, డీఈలు, ఈఈలు ఫైళ్లపై సంతకాలు చేశారు. కమిషనర్ కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా సంతకం చేసి అకౌంటింగ్, ఆడిటింగ్ అధికారులకు పంపించారు. చిన్నచిన్న కారణాలతో కోట్లలో బిల్లులు ఉన్న ఫైళ్లు పెండింగ్లో ఉండగా, రూ.40 లక్షల బిల్లుల ఫైల్ వేగంగా కదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఫైళ్లు వేగంగా అకౌంటింగ్ అధికారుల వరకు చేరినట్లు తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లే తప్పుగా నమోదు చేసి తప్పుడు ఫైలింగ్ చేసినా ఇప్పటి వరకు కనీసం విచారణ చేపట్టకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా సదరు ఫైళ్లలో తప్పులను సరిచేసి మళ్లీ బిల్లులు డ్రా చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. -
ఒక అన్నగా.. తమ్ముడిగా.. చేయి పట్టి నడిపిస్తా
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని, వైఎస్సార్ చేయూత ద్వారా నాలుగేళ్లూ కచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదును ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.4,687 కోట్లు వ్యయం కానుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. మీ ఇబ్బందులను పాదయాత్రలో చూశా.. –ప్రతి అక్కచెల్లెమ్మకు మేలు చేసే వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించడాన్ని ఒక అన్నగా, తమ్ముడిగా నా అదృష్టంగా భావిస్తున్నా. 45 – 60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలు ఏవీ లేవని నా పాదయాత్ర సమయంలో గమనించా. గతంలో కార్పొరేషన్ల ద్వారా గ్రామంలో ఒకరికో ఇద్దరికో మాత్రమే అరకొరగా రుణాలు ఇచ్చేవారు. అది కూడా లంచం ఇస్తేనే సాయం అందేది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు చెక్ అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ రోజు... వెటకారం చేశారు – నాడు అక్క చెల్లెమ్మల ఇబ్బందులను గమనించి వారికి పెన్షన్ రూపంలో డబ్బులు ఇద్దామనుకున్నా. 45 ఏళ్లకే పెన్షన్ ఏమిటని అప్పుడు చాలామంది వెటకారం చేశారు. అక్కచెల్లెమ్మలకు పెన్షన్ రూపంలో ఏటా రూ.12 వేలకు బదులుగా అంతకంటే ఎక్కువగా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ పథకాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చి అధికారంలోకి వచ్చాక రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నా. ఈ సాయాన్ని బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. ఈమేరకు బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఈ సాయంపై ఏ ఆంక్షలూ లేవు – వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం అందచేసే డబ్బులను దేనికి వాడుకోవాలన్నది పూర్తిగా అక్క చెల్లెమ్మల ఇష్టం. ఇదే చేయాలని ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో ఈ డబ్బులు పెడితే వారికి మేలు జరుగుతుందని భావించి నాలుగు అడుగులు ముందుకు వేశాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే? –ఇవాళ 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు వచ్చే నెలలో పథకాన్ని వర్తింపచేస్తాం. పలు సంస్థలతో ఎంవోయూ – అక్క చెల్లెమ్మలు వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహించేందుకు దిగ్గజ కంపెనీలు అముల్, రిలయన్స్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ యూని లీవర్ తదితర సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. వలంటీర్ల ద్వారా 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. మెప్మా, సెర్ప్ ప్రతినిధులు మిమ్మల్ని కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తారు. అక్క చెల్లెమ్మలు ఒక వేళ పాల వ్యాపారం చేయాలనుకుంటే అముల్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది. గేదెలు కొనివ్వడంతో పాటు పాలు కూడా కొనుగోలు చేస్తుంది. – మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్సార్ యాప్తో ఆర్బీకే సేవల పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వైఎస్సార్ యాప్’ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రైతులకు అందే సేవలు, సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్, ఆర్బీకేల్లోని పరికరాల నిర్వహణ, క్షేత్ర స్థాయిలో రైతుల అవసరాలు, మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను రియల్ టైంలో ఉన్నత స్థాయి వరకు తెలుసుకునే అవకాశం వుంటుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. యాప్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు ► రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ► రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం ఉంటుంది. కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ను కూడా రియల్ టైంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది. ► ఈ–క్రాప్ కింద నమోదు చేసిన పంటల వివరాలు, పొలం బడి కార్యక్రమాలు, సీసీ (క్రాప్ కటింగ్) ఎక్స్పరిమెంట్స్, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ యాప్లో నమోదు చేస్తారు. ఈ వివరాలను అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. -
ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగానికి దశ, దిశ చూపుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలపై జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ప్రశంసల జల్లు కురిపించారు. న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) మహిళా చైర్పర్సన్ గీతా పాండే (ఉత్తర్ప్రదేశ్) అధ్యక్షతన శనివారం “్ఙకోవిడ్–19–బాలికా విద్యపై దాని ప్రభావం, ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు’’ అనే అంశంపై జాతీయస్థాయిలో వీడియో ఆధారిత చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ (ఆప్టా) మహిళా చైర్పర్సన్ అనపర్తి పద్మావతి (బొబ్బిలి), వైస్ చైర్పర్సన్ ఎస్.వి.ఎల్ పూర్ణిమ (శ్రీకాకుళం) పాల్గొన్నారు. వీరితో పాటు 25 రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా చైర్పర్సన్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. లాక్డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు, పాఠశాలల్ని పునఃప్రారంభించేందుకు చేపడుతున్న చర్యలతో పాటు ఆన్లైన్ తరగతులు, పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని పాఠశాలలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, సంఘాల పాత్ర, మధ్యాహ్న భోజన పథకం అమలు, గ్రామీణ, కొండ ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి శానిటైజర్లు, మందులు, మాస్్కల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై అనపర్తి పద్మావతి, ఎస్.వి.ఎల్. పూర్ణిమ మాట్లాడుతూ మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు జరుగుతున్న కృషిని వివరించారు. ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభమైన తరువాత విద్యార్థులకు జగగన్న విద్యాకానుక పేరుతో అందించనున్న కిట్ల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రాంపాల్ సింగ్, సెక్రటరీ జనరల్ కమల్ కాంత్ త్రిపాఠీ అభినందించారని పేర్కొన్నారు. వెబినార్లో చర్చించిన అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.జి.ఎస్. గణపతిరావు, కె. ప్రకాశరావు తెలిపారు. వెబినార్లో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మహిళా ఆప్టా ప్రతినిధులు ఏపీ నుంచి చర్చలో పాల్గొన్న పద్మావతి, పూరి్ణమ -
మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీలకు వివిధ పథకాల ద్వారా భారీగా ఆర్థిక సాయం అందించారు. గత చంద్రబాబు సర్కారు రంజాన్ తోఫా అంటూ మైనార్టీలను మభ్యపెట్టడానికే ప్రయత్నించింది తప్ప ఇతరత్రా ఏ విధంగానూ ఆదుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా నవరత్నాలతో పాటు ఇతర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కల్పించి మైనార్టీలను పేదరికం నుంచి బయట పడేలా చేసింది. ► అసలు మైనార్టీలంటేనే చంద్రబాబుకు చిన్నచూపు. తన మంత్రివర్గంలో ఒక మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఫరూక్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ► ఇక్కడే గత సర్కారుకు ఈ సర్కారుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారుకు భిన్నంగా జగన్ సర్కారు ఏడాదిలోనే మైనార్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా నవరత్నాలు, ఇతర పథకాలను అందించింది. ► మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్ బాషాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఏడాదిలో నవరత్నాల ద్వారా 19.05 లక్షల మంది మైనార్టీలకు రూ.1,722 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ► గత సర్కారులో మైనార్టీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవీ కూడా గత సర్కారులో పెద్దలు తమకు కావాల్సిన వారికి సిఫార్సు చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ విడుదలయ్యేది. వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇలా సాధ్యమైంది.. ► ఎటువంటి వివక్ష, సిఫార్సులు లేకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు పని చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలకు అతీతంగా అర్హులైన మైనార్టీలందరినీ వైఎస్సార్ నవశకం పేరుతో ఇంటింటి సర్వే ద్వారా వలంటీర్ల ద్వారా గుర్తించింది. ► మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు జోక్యం లేకపోవడంతో అర్హులైన మైనార్టీలందరికీ ఆర్థిక ప్రయోజనం లభించింది. ► ఏడాదిలో ఏకంగా 19.05 లక్షల మంది మైనార్టీలకు ఆర్థిక ప్రయోజనం కలగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలకు ఆర్థిక సాయం జరగలేదు. ► వైఎస్సార్ రైతు భరోసా కింద 60,915 మంది మైనార్టీ రైతులకు రూ.75.86 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద మే నెలాఖరు వరకు 2.28 లక్షల మందికి రూ.564.39 కోట్లు, జగనన్న అమ్మ ఒడి కింద 3.06 లక్షల మంది మైనార్టీ తల్లుల ఖాతాల్లో రూ.459.12 కోట్ల నగదు జమ అయింది. -
మట్టి బాట మాయం.. మురుగు నీరు దూరం
(జి. రాజశేఖర్నాయుడు, కర్నూలు): కర్నూలు జిల్లా మండల కేంద్రం దేవనకొండకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐరన్బండ బీ సెంటర్ గ్రామం. ఉదయం 7 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరితే రెండు గంటల ప్రయాణం. 9 గంటల ప్రాంతంలో దారిలో ఉల్లి నాట్లు వేయిస్తున్న మద్దిలేటి అనే రైతును ‘సాక్షి ’పలుకరించింది. గత ఏడాది రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, ధర బాగా ఉండడం వల్ల క్వింటాల్ రూ.4,800కు అమ్ముడుపోగా మొత్తం రూ.8 లక్షలు చేతికొచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఈ ఏడాదీ ధరలు బాగా ఉంటాయనే రెండు ఎకరాల్లో తిరిగి ఉల్లి సాగు చేస్తున్నానన్నాడు. గ్రామంలోకి అడుగుపెట్టగా బందే నవాజ్, ప్రకాశం అనే యువకులు ఎదురయ్యారు. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, మినరల్ వాటర్ ప్లాంట్ పాడైనందున నాలుగు కిలోమీటర్లు నడచి వెళ్లి తాగునీటిని తెచ్చుకునేవారమని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ► గ్రామ సచివాలయం సమీపంలో చెట్టు కింద కొందరు వృద్ధులు కూర్చొని ఉన్నారు. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా దేవనకొండకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు. అన్ని పనులు ఊర్లోనే జరిగిపోతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా కంకర తేలిన రోడ్డుపై ప్రయాణంతో ఇబ్బంది పడేవాళ్లం.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన అనంతరం రోడ్డు కోసం ఇచ్చిన అర్జీపై వెంటనే స్పందన లభించింది. రూ.3.50 కోట్లతో నేడు కరివేముల మెయిన్ రోడ్డు నుంచి తమ గ్రామం వరకు 6 కి.మీ. మేర రోడ్డు నిర్మించినట్లు చెప్పారు . ► పుట్టుకతోనే దివ్యాంగుడైన కొడుకు(11) పింఛన్ కోసం తల్లి బోయ రంగమ్మ గతంలో ఆరేళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడాలని కూలీనాలీ చేసిన సొమ్ము రూ.10 వేల వరకు ఖర్చు చేసింది. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామ వలంటీరుకు చెప్పగానే సమస్య పరిష్కారమైంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయించి నెలకు రూ.3 వేలు పింఛన్ ఇంటికే తెచ్చి ఇస్తున్నారని రంగమ్మ చెప్పింది. ► వర్షాకాలంలో గ్రామంలోని అంతర్గత రోడ్లు మురుగు నీటితో నిండిపోయేవి. ప్రస్తుతం రూ.18 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ► ఇంకా స్ధానికులు ఏమన్నారంటే...రేషన్కార్డు లేదని, ప్రభుత్వ పథకం మంజూరు కాలేదని చెబితే, వెంటనే సచివాలయంలో కారణం వివరిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారమార్గాన్ని చూపుతున్నారు. రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలు, అడంగల్ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరు ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందింది కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా గత ఏడాది నుంచి ఆర్ధిక సాయం అందిస్తున్నారు.ఇçప్పుడు అందిన సాయంతో వ్యవసాయానికి మందులు, విత్తనాలు తెచ్చుకున్నాను. – పెద్ద శేషన్న, రైతు అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇచ్చారు నా కొడుకు దావీదు 2వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బును పొదుపుగా కొడుకు చదువుకు వినియోగిస్తాను. పేద పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు రుణపడి ఉంటాం. – రంగవేణి, గృహిణి మా ఊరు రోడ్డు బాగుపడింది ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని రోడ్డు బాగుపడింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చేయాల్సి వచ్చేది. కొత్త రోడ్డు వేయాలని కోరిన వెంటనే తారురోడ్డు వేశారు. – నాయక్ సుభాన్ -
కొండలు.. గుట్టలు దాటుకుంటూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థ విశాఖ మన్యంలో పటిష్టంగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల గడప వద్దకు చేర వేసేందుకు వలంటీర్లు ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రధానంగా పింఛన్ సొమ్ము పంపిణీలో వీరి పాత్ర కీలకం. రహదారులుండవు.. ఉన్నా ఎక్కడ కిందపడతామో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితిలో వలంటీర్లు ఎంతో శ్రమకోర్చి పింఛన్లు పంపిణీ చేస్తుండటం ‘సాక్షి’ పరిశీలనలో కనిపించింది. రానుపోను 10 కి.మీ. పాడేరు రూరల్: పాడేరు మండలం దేవాపురం పంచాయతీ పరిధిలోని పందిగుంట మూరు మూల ఉంటుంది. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్లు.. పంచాయతీ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన పాంగి కొండమ్మ అనే గిరిజన మహిళ వితంతు పింఛన్ తీసుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కేంద్రమైన దేవాపురం గ్రామానికి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వచ్చి వెళ్లేది. ప్రస్తుతం కొమ్మ రాంబాబు అనే గ్రామ వలంటీర్ పింఛన్ సొమ్మును నేరుగా ఆమె ఇంటి వద్దే అందజేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలో టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని అక్కడే ఉంచి, సుమారు 3 కిలోమీటర్లు నడిచి ఆ గ్రామానికి వెళ్లాడు. ఆమె ఇంటి వద్ద లేదు. పొలానికి వెళ్లిందని తెలుసుకుని.. అక్కడికే వెళ్లి పింఛన్ అందజేశాడు. వచ్చే నెల నుండి పింఛన్ రూ.2,500 అందుతుందని వలంటీర్ రాంబాబు చెప్పడంతో కొండమ్మ సంతోషం వ్యక్తం చేసింది. మా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చే రోజు వస్తుందని ఊహించలేదంది. వలంటీర్ రాంబాబు తిరుగు ప్రయాణంలో బండిని కొంత దూరం తోసుకుంటూ వచ్చి, పంక్చర్ వేయించుకుని ఇంటికి వచ్చే సరికి సాయంత్రం 4 గంటలైంది. గిరి శిఖరాలపై ఉన్నా.. సీతంపేట : ఆ ఊరు పేరు రాజన్నగూడ. కొండ అంచున ఉన్న గ్రామమది. మధ్యాహ్నం వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గిరిజనులంతా కొండపోడు పనులకు వెళ్లిపోయారు. గ్రామంలో వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో ‘అమ్మా.. నీకు పింఛన్ వచ్చింది తీసుకో’ అంటూ మంచంపై పడుకున్న బామ్మ సింగమ్మిని లేపారు వలంటీర్ సవర ఆనంద్. ఇంతకు ముందు పింఛన్ తీసుకోవడానికి ఆ బామ్మ కొండ దిగి వెళ్లడానికి నానా అవస్థలు పడేది. ఇప్పుడా కష్టం తప్పింది. వలంటీరు కొండ మీద ఉన్న తన ఇంటికి వచ్చి మరీ పింఛన్ ఇస్తున్నాడు. దీంతో ఆమె సంబరపడిపోతున్నారు. మరో గ్రామమైన కానంగూడను సందర్శించగా అక్కడ సవర బాపడు అనే వృద్ధుడు కదలలేని స్థితిలో ఉంటే అక్కడి గ్రామ వలంటీర్ రామారావు.. పింఛన్ ఇవ్వగానే ఎంతో ఆనందించాడు. కర్రగూడ గ్రామంలో వృద్ధుడు తోటయ్యకు వలంటీర్ పింఛన్ ఇవ్వగానే నిత్యావసర సరుకులు కొనుక్కుంటానంటూ బయలుదేరాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలోని ప్రతి గిరిజన గ్రామంలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో సుమారు 470 గిరిజన గ్రామాలున్నాయి. కొండలపై ఉన్న గ్రామాలు సుమారు 350 వరకు ఉంటాయి. ఇక్కడ ఉంటున్న పింఛన్దారులందరికీ వలంటీర్లు ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లోనే విధులకు.. అమడగూరు: అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని గోపాల్నాయక్ తండాలో వలంటీర్ రాజశేఖర్నాయక్ పెళ్లి పీటల నుంచి నేరుగా వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాడు. గోపాల్నాయక్ తండాకు చెందిన వలంటీర్ రాజశేఖర్ నాయక్కు కదిరి సమీపంలోని తండాకు చెందిన ఇందిరతో ఈనెల 1న వివాహం జరిగింది. అయితే అదే రోజు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండటంతో ఉదయం 6 గంటలకు తాళి కట్టగానే పెళ్లి పీటల పైనుంచి నేరుగా వెళ్లి 50 మంది లబ్ధిదారులకు పింఛన్ను అందజేశాడు. కొండ పైకే పెన్షన్ సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, రంపచోడవరం/కూనవరం: ఒకవైపు శబరి, మరోపక్క గోదావరి.. మిగిలిన రెండు దిక్కులూ ఎల్తైన కొండలే. మధ్యలో కూనవరం మండలం. రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాలతో చింతూరు ఐటీడీఏ ఏర్పాటైంది. దీని పరిధిలో ఉన్న 4 మండలాల్లో కూనవరం ఒకటి. ఈ మండలంలో 56 చిన్నా, పెద్దా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల జనాభా 26,800. మండలంలోని కొండలపై 10 ఆదివాసీ పల్లెల్లో 70 మంది (గతంలో 36 మందే) పింఛన్దారులు ఉన్నారు. ఇందులో గబ్బిలాల గొంది అనే పల్లెలో పింఛన్ల పంపిణీ ఇలా సాగింది. ► మంగళవారం ఉదయం 6 గంటలు కావస్తోంది. కూనవరం మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వలంటీర్ సూట్రు లక్ష్మారెడ్డి టేకులొద్ది చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి సమయం 7 గంటలు అయింది. ► టేకులొద్ది నుంచి ముందుకు వెళ్లాలంటే దారి కనిపించలేదు. అక్కడి నుంచి కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. కనిపిస్తోన్న చిన్న కాలిబాట పట్టుకుని రెండు కొండలు ఎక్కి.. దిగడానికి మూడు గంటల సమయం పట్టింది. అంటే గబ్బిలాలగొంది గిరిజన ఆవాసం చేరుకునే సరికి ఉదయం 10 గంటలు అయింది. ► అలా సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన కొండలు ఎక్కుతూ దిగుతూ ప్రయాణించాక గబ్బిలాలగొంది గ్రామం వచ్చింది. ► గ్రామంలో తొమ్మిది మంది పింఛన్ దారులున్నారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు. వారందరికీ వలంటీర్ పింఛన్ పంపిణీ చేశాడు. ఇలా కొండపైకి వచ్చి ఇంటి పట్టునే పింఛన్ ఇత్తారని కలలో కూడా అనుకోలేదయ్యా.. అంటూ వారు చాలా సంతోషపడ్డారు. గతంలో అష్టకష్టాలు పడి రెండు కొండలు ఎక్కి దిగి ఎల్లాల్సిందేనయ్యా అని చెప్పారు. చేతికి పిండికట్టుతోనే.. ఒంగోలు టౌన్: ఒంగోలు 29వ డివిజన్లోని వార్డు వలంటీర్ తోట లక్ష్మీవరప్రసాద్ పదిరోజుల క్రితం బైక్పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఎడమ చేయి విరగడంతో వైద్యులు పిండికట్టు వేసి 40 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. లక్ష్మీ వరప్రసాద్ క్లస్టర్ పరిధిలో 25 మంది పింఛన్లు పొందుతున్నారు. జూన్ 1న వారికి పింఛన్లను ఎలాగైనా అందించాలని అనుకున్న లక్ష్మీవరప్రసాద్ తన కుమార్తె వర్షిత సాయంతో 25 మందికీ పింఛన్లు అందించి వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు. -
ఏడాదిలో ఎంత తేడా!
‘అవినీతికి తావులేకుండా, పైసా దారి మళ్లకుండా ఏడాదిలో 3.58 కోట్ల మంది ప్రజలకు రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. పింఛన్ల కోసం గత ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మేం నెలకు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం విస్మరించిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు చెల్లించడంతో పాటు ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకాన్ని ప్రారంభించాం. విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా, కంటి వెలుగు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్దతోపాటు అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నాం’ జగన్ అనే నేను.. మీ బిడ్డగా, సీఎంగా ఏడాది క్రితం చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నా. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధి, నిజాయతీ, నిబద్ధతతో సాగిందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత సర్కారు పాలనకు, ఏడాదిగా తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ఒకసారి చూడాలని, మేనిఫెస్టో హామీల అమలులో వ్యత్యాసాన్ని మనస్సాక్షిగా గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను ఏడాదిలోనే అమలు చేశామని గర్వంగా చెప్పగలనని, ఈ విషయాన్ని ప్రజలే లెక్క తేల్చాలని కోరారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే 77 హామీలను అమలు చేశామని, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్ ప్రకటించామని, ఇంకా 16 హామీలు మాత్రమే మిగిలాయని, వాటిని కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని 40 అంశాలను అమలు చేశామని వివరించారు. వలంటీర్ల ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిస్తామని, అందులో ఏమేం అమలు చేశామో మీరే లెక్క తేల్చాలని ప్రజలను కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 10,641 రైతు భరోసా కేంద్రాలను శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏడాది పాలన పూర్తి చేసిన తాను మలి ఏడాదిలో చేస్తున్న తొలి సంతకంగా దీన్ని అభివర్ణించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది రైతులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సీఎం ప్రసంగం వివరాలివీ.. ఎంతో సంతోషంగా ఉంది.. ఈరోజుతో మన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఇవాళ రైతులతో గడపడం ఎంతో ఆనందంగా ఉంది. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మాది. తొలి ఏడాదిలోనే రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చి సుమారు 49 లక్షల మంది రైతు కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.10,200 కోట్లు జమ చేశాం. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, విపత్తు వస్తే ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేశాం. ఆ దిశగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 11 ఏళ్ల ప్రయాణంలో నలుమూలలా తిరిగా.. నా రాజకీయ జీవితం ప్రారంభమై 11 ఏళ్లు అవుతోంది. 2009లో ఎంపీగా ఎన్నికయ్యా. కోట్ల మంది ప్రజలను కలిసి ఉంటా. ప్రతి ప్రాంతం సమస్యను తెలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలలా అడుగులు వేశా. 3,648 కి.మీ పాదయాత్రతో ప్రతి జిల్లాలో తిరిగా. నా రాజకీయ జీవితంలో దాదాపు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉంటా. స్థోమత లేక కొంతమంది చదువుకోలేకపోయారని తెలిసి బాధపడ్డా. వైద్యం కోసం అప్పుల పాలు కావడం చూశా. క్యాన్సర్ వస్తే అరకొర చికిత్స అందించడం చూశా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు, రైతుల కష్టాలను చూశా. కనీస ధర లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడుతున్న వారిని చూశా. అక్క చెల్లెమ్మల బాధలు చూశా. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వారి కన్నీరు తుడిచి జీవితాలను మార్చాలనే ఆలోచన చేశా. ► ప్రజల సమస్యలన్నింటినీ చాలా దగ్గరగా చూశా. వాటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో రూపొందించాం.కులం, మతం, పార్టీలు చూడకుండా, మాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని తలిచా. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశాం. ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చానని గర్వంగా చెబుతున్నా. ‘గత ప్రభుత్వం 650కి పైగా వాగ్దానాలు చేసి పేజీల కొద్దీ మేనిఫెస్టోను విడుదల చేసి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియా ముఠాలుగా మారి ప్రతి పనికి లంచం దండుకున్నాయి. ఇప్పుడు ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పూర్తి పారదర్శకతతో అమలవుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి’ ‘‘చెప్పింది చేయడమే తప్ప ఏడాదిగా మరో ఆలోచన చేయలేదు. అవ్వాతాతల మీద గుండె నిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల పట్ల మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అన్ని వర్గాల ఆరోగ్యంపై శ్రద్ధతో ఏడాదిగా పనిచేస్తున్నాం’’ విత్తనాలకూ భరోసా.. ► గతంలో కల్తీ విత్తనాలు, పురుగు మందులు అన్నీ టీడీపీకి చెందిన వారే సరఫరా చేశారు. ఇవాళ ప్రభుత్వం నాణ్యతను నిర్ధారించి సరఫరా చేస్తోంది. 18వ తేదీ నుంచి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్లిప్లు, సమయం సూచిస్తూ పంపిణీ చేస్తున్నారు. నాడు అధికార పార్టీ నాయకులకే ప్రాసెసింగ్ యూనిట్లు, కంపెనీలు.. ఒకటి గల్లా. మరొకటి శ్రీని ఫుడ్స్. ► ఈ ఏడాదిలో రూ.2200 కోట్లతో రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ అమలు చేశాం.టమాటా, ఉల్లి, మొక్కజొన్న, అరటి, బత్తాయిలు, బొప్పాయి కొంటున్నాం. గుంటూరులో సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పూలాభిషేకం చేస్తున్న అమ్మఒడి, పింఛను లబ్ధిదారులు, ఆటో డ్రైవర్లు ఇలాంటి విపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. మేం రాజధాని ప్రాంతంలో పేదలకు భూములిస్తామంటే డెమొగ్రఫిక్ బ్యాలెన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని కోర్టులో వాదించారు. భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్లిన విపక్షాలను చూశాం కానీ ఇక్కడ పేదలకు ప్రభుత్వ భూములు ఇస్తుంటే కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం. నాడు మాఫీ మాయ.. నేడు రైతన్నకు భరోసా గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. రూ.87,612 కోట్లకు గానూ ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మేం ఏడాది తిరగక ముందే రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. తొలిసారిగా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా జూలైలో రూ.2 వేల కోట్లు వడ్డీ కింద ఇవ్వబోతున్నాం. ఇదీ తేడా... గతంలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల మాఫియా సంతకాలు, లంచాలు కావాలి. ఇవాళ ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ, గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారైనా సరే ఇంటి తలుపు తట్టి ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నాం. మీ కళ్ల ముందే గ్రామ సచివాలయాల ద్వారా గడువు విధించి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నాం. దరఖాస్తు మొదలు లబ్ధిదారుల జాబితా వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఒకటో తారీఖునే పండగైనా, ఆదివారం అయినా సరే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు వలంటీర్లు చిరునవ్వుతో పెన్షన్ ఇస్తున్నారు. ► గతంలో స్కూళ్లు దారుణంగా ఉండేవి. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నెలల తరబడి పెండింగ్ పెట్టేవారు. ఆయాలకు ఇచ్చే రూ.1000 గౌరవ వేతనం కూడా ఇచ్చేవారు కాదు. ఇవాళ ప్రతి స్కూల్లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్ఛానల్లో పెట్టడమే కాకుండా, ఆయాల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచాం. పేద బిడ్డల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు తెచ్చాం. విద్యా సంస్థలపై నియంత్రణ కోసం స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరుగా రెండు రెగ్యులేటరీ సంస్థలు తెచ్చాం. ► గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించలేదు. రూ.686 కోట్లు బకాయిలు పెట్టింది. అవన్నీ చెల్లించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చేశాం. దీంతో తిరిగి చక్కటి చికిత్స అందిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స అందుతోంది. నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. లబ్ధిదారులు 3.58 కోట్ల మంది ఏడాదిలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3.58 కోట్ల మంది కాగా వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశాం. వీరిలో 1.78 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు అందించాం. 61.28 లక్షల మంది ఎస్సీలకు రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం. 18.40 లక్షల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఇచ్చాం. 19.05 లక్షల మంది మైనారిటీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు రూ.1,722 కోట్లు ఇచ్చాం. 77.84 లక్షల మంది ఇతరుల కోసం రూ.10,768 కోట్లు ఖర్చు చేశాం. . ► గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.39 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. రూ.2.60 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది. దీనికి వడ్డీతో పాటు విద్యుత్ సంస్థలకు మరో రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టింది. ► మేం రివర్స్ టెండర్ల ద్వారా దాదాపు రూ.2,200 కోట్లు ఆదా చేశాం. అవినీతికి తావు లేకుండా జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ను ఏర్పాటు చేశాం. పోలీసులకు వీక్లీ ఆఫ్.. గతంలో పోలీసులతో బండ చాకిరీ చేయించుకునేవారు. ఏనాడూ వారి కుటుంబాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు వారికి వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో పోలీసు మిత్రలను ఏర్పాటు చేశాం. మద్యానికి కళ్లెం.. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. దాదాపు 43 వేల బెల్టు షాపులు, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడంతో అక్కాచెల్లెమ్మలు ఇబ్బంది పడ్డారు. ఇవాళ 43 వేల బెల్టు షాపులు రద్దు చేయడంతోపాటు 33 శాతం దుకాణాలు తగ్గించాం. ధరలు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు 55 శాతం తగ్గాయి. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు 24 శాతం తగ్గాయి. గతంలో వారానికి 5 నుంచి 6 బాటిళ్ల మద్యం తాగితే ఇప్పుడు 2 మాత్రమే తాగుతున్నారు. సామాజిక న్యాయం.. గత ప్రభుత్వానికి మాటలు తప్ప బీసీలపై ప్రేమ లేదు. సామాజిక న్యాయం అసలే లేదు. మా మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఈ వర్గాలకే ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాలలో 82.5 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశాం. ఎస్సీలకు మూడు వేర్వేరు కమిషన్లతోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం.. పేదలకు ఇళ్ల స్థలాలు.. వైఎస్సార్ జయంతి రోజు 29 లక్షల ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం అందిస్తాం. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలతోపాటు చేపల వేటపై నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేశాం. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు ఇబ్బంది పడకుండా సాయమందించాం. అందరి సంక్షేమం కోసం.. అవ్వాతాతల మీద గుండెనిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నా. -
ఊరునుమారుద్దాం
ఎవరైనా గ్రామంలోకి అడుగుపెడితే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, ఇంగ్లిష్లో బోధించే పాఠశాల, వచ్చే ఏడాది నుంచి జనతా బజార్ ఇవన్నీ కనిపిస్తాయి. చరిత్రలో ఎప్పుడూ కూడా గ్రామాల మీద ఇంతగా దృష్టి పెట్టలేదు. మొత్తం గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నాం. సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాల పంపిణీతో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ నెల 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏపీ చరిత్రలో మొదటి సారిగా రైతుల వద్దకే విత్తన పంపిణీని తీసుకెళ్లామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్వరూపాన్నే మార్చి.. విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. స్పందన కార్యక్రమంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్, ఖరీఫ్ సీజన్కు సన్నద్ధత, జాతీయ ఉపాధి హామీ పథకం, ఆర్బీకేలు, వైఎస్సార్ గ్రామ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, తాగునీరు.. వేసవిలో కార్యాచరణ ప్రణాళిక, పాఠశాలల్లో నాడు – నేడు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, మద్యంలో అక్రమాల నివారణ, జిల్లాకు ముగ్గురు జేసీలు, వారి విధులు తదితర అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఖరీఫ్ సన్నద్ధత ► రైతు భరోసా కింద మే నెలలో దాదాపు రూ.2,800 కోట్లు ఇచ్చాం. అంతకు ముందు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ఏప్రిల్ నెలలో రూ.875 కోట్లు ఇచ్చాం. మొత్తంగా రూ.3,675 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా మొట్ట మొదటి అడుగుగా మే 15న ఈ డబ్బులు ఇచ్చాం. ► మే 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏపీ చరిత్రలో మొదటి సారిగా గ్రామ స్థాయిలో విత్తనాలను పంపిణీ చేశాం. 8.43 లక్షల క్వింటాళ్ల విత్తనాలను గ్రామాల్లో అందుబాటులో పెట్టాం. వరి, వేరు శనగ తదితర విత్తనాలను జిల్లాలకు పంపించాం. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి. ► ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు విత్తన పంపిణీ కార్యక్రమం కొనసాగాలి. ఇందువల్ల రైతులకు ఎండ తీవ్రత ఉండదు. ► జూన్ 1 నుంచి ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ముందుగానే గుర్తించాలి. గ్రామ సచివాలయాల స్థాయికి కూడా ఈ సమాచారం వెళ్లాలి. ► 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే సిద్ధం చేశాం. మీ మీ జిల్లాల్లో ఎరువులకు సంబంధించి నిల్వలపై పర్యవేక్షించాలని కలెక్టర్లకు చెబుతున్నా. ప్రతి జిల్లాల్లో బఫర్ స్టాక్ ఉండాల్సిన అవసరం ఉంది. రైల్వే స్టేషన్లలో ర్యాక్ మూవ్మెంట్పైనా కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కంటైన్మెంట్ జోన్ల వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిని కూడా అధిగమించేలా చూడాలి. అడ్వైజరీ బోర్డు సమావేశాలు తప్పనిసరి ► ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశమై నీళ్ల విడుదలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి. జిల్లా, మండల స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. బుధవారానికి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయి. ► ఆర్బీకే ద్వారా ఆ ఊళ్లో ఎలాంటి పంటలు వేయాలి? ఎలాంటి పంటలు వేస్తే ధరలు వస్తాయి? మార్కెటింగ్ ఉంటుంది? అన్నదానిపై అడ్వైజరీ బోర్డులు సలహాలు ఇస్తాయి. ► రైతులకు రుణాలు అందేలా.. జిల్లా బ్యాంకర్ల సమావేశాలను కలెక్టర్లు వెంటనే నిర్వహించాలి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రుణాలు అందించాలి. రైతు భరోసాకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకోలేని ఖాతాల్లో వేశాం. వాళ్లు జమ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. విలేజ్ క్లినిక్స్కు స్థలాలు గుర్తించాలి ► గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్ క్లినిక్స్, ఆర్బీకేల భవనాల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటిపై రోజూ సమీక్ష నిర్వహించాలి. ► జూన్ 15 నాటికి స్థలాల గుర్తింపు పూర్తి కావాలి. ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ను ఇందుకు పూర్తిగా వినియోగించుకోండి. తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు ► రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. 3,021 ఆవాసాలకు 14,861 ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పశువులకు కూడా తాగునీరు అందిస్తున్నారు. 403 బోర్ వెల్స్ కూడా పని చేస్తున్నాయి. ► పట్టణ ప్రాంతాల్లో 120 చోట్ల తాగునీటి కొరతను తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులన్నింటినీ కలెక్టర్లు పర్యవేక్షించాలి. తాగునీటికి కొరత ఉందనే మాట రాకూడదు. ఈ సమస్యపై ప్రతి రోజూ దృష్టి పెట్టాలి. ఇసుక, మద్యం అక్రమాలపై దృష్టి ► వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలి. తప్పనిసరిగా నిల్వలు పెంచాలి. ఇందుకు సంబంధించి ప్రత్యేక జేసీని కూడా పెట్టాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలి. ► మద్యం అక్రమాలకు చెక్ చెప్పడానికి యువ ఐపీఎస్ అధికారులను పెట్టాం. తొలిసారిగా మనం ఈ బాధ్యతలను పోలీసు విభాగానికి అప్పగించాం. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేశాం. అక్రమంగా మద్యం తయారు కావడం, అక్రమంగా రవాణా చేయడం ఎక్కడా కనిపించకూడదు. ► ఎస్పీలు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. అక్రమ ఇసుక, మద్యం వెనుక ఎవరున్నా కూడా ఖాతరు చేయడకూడదు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేసేలా చూడండి. చెక్పోస్టులు కూడా సరైన విధంగా పనిచేయాలి. ఇవన్నీ సక్రమంగా పని చేయించాల్సిన బాధ్యత జేసీలదే. ► మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. బెల్టుషాపులు, పర్మిట్ రూంలు ఎత్తివేశాం. మద్యం అమ్మే వేళలు కూడా తగ్గించాం. ఇంకా రేట్లు పెంచి.. ఇంకా దుకాణాలు తగ్గించి.. వినియోగాన్ని బాగా తగ్గించాం. ఇళ్ల స్థలాల పట్టాలు ► మే 31లోగా భూ సేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడం తదితర అన్ని పనులు కూడా పూర్తి కావాలి. 99 శాతం భూ సేకరణ పూర్తయ్యింది. 90.8 శాతం లే అవుట్ల పని, మార్కింగ్ 80.09 శాతం పూర్తయ్యింది. 12,66,253 మంది లబ్ధిదారులకు లాటరీ కూడా పూర్తయ్యింది. ► మే 31లోగా మిగిలిన పనులన్నీ పూర్తి కావాలి. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. అర్హత ఉండీ ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదు. ఎవరైనా మిగిలిపోతే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి మే 21 వరకు సమయం ఇచ్చాం. మే 30 కల్లా వెరిఫికేషన్ పూర్తి కావాలి. ► ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్ 7న ప్రకటించాలి. అదనంగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ల్యాండ్ సమీకరణ, అభివృద్ధి జూన్ 30 నాటికి పూర్తి కావాలి. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశాం. పద్ధతి ప్రకారం అన్నీ జరిగేట్టుగా చూడాలని కలెక్టర్లను కోరుతున్నా. జిల్లాకు ముగ్గురు జేసీలు ► ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ► పారదర్శకంగా.. సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్స్లో 24 గంటలూ ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. ఆశా కార్యకర్తలకు అదే రిపోర్టింగ్ పాయింట్ అవుతుంది. ► గ్రామాల స్వరూపాన్ని మార్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర వహిస్తాయి. రైతులు ఉత్పత్తి చేసిన దాంట్లో కనీసం 30 శాతం స్థానిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి జనతా బజార్లను ఏర్పాటు చేస్తున్నాం. ► జేసీలందరి పనితీరుపై మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. మీరంతా యువ ఐఏఎస్ అధికారులు. మీరు బాగా పని చేస్తే.. మంచి ఎలివేషన్ పొందుతారు. నాకు ఓటు వేయని వారు అయినా పర్వాలేదు.. అర్హత ఉంటే పథకాలు అందాలని చెబుతున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు, వివిధ శాఖల ఉన్నతా«ధికారులు పాల్గొన్నారు. వలస కూలీలందరికీ ఉపాధి కల్పించాలి ► కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. ► ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్యను ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు చేయాల్సి ఉంది. విత్తన పంపిణీలో సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోండి. జిల్లాల్లో ఎక్కడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు కనిపించకూడదు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కారణంగా నష్టపోతున్నామనే మాట వినిపించకూడదు. ఈ విషయంలో అధికారులు దూకుడుగా ఉండాలని కోరుతున్నా. కలెక్టర్లు, ఎస్పీలు సీరియస్గా తీసుకోవాలి. మద్యం నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. పక్క రాష్ట్రాల్లో మద్యాన్ని ఎలా తాగించాలని చూస్తున్నారు. మనం మద్యాన్ని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాం. లిక్కర్, శాండ్ మీద కొందరు యువ ఐపీఎస్లను పెట్టాం. నిజాయితీగా పని చేయాలి. తప్పు చేస్తే ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన పని లేదు. దీన్ని ఎలా డీల్ చేస్తామన్న విషయం మీద రాష్ట్రం, దేశం మనవైపు చూస్తున్నాయి. 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం ఈ నెల 30వ తేదీన 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 27న రైతు భరోసా కేంద్రాలపై డ్రైరన్ నిర్వహించాలి. ఆర్బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం. ► గ్రామంలో ఒక రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే.. అదే గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్.. ప్రతిరోజూ పంపిస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెటింగ్ శాఖ యాక్టివ్ అవుతుంది. ఆర్బీకేలను చూస్తున్న జేసీ, మార్కెటింగ్ శాఖ అధికారులు.. కలెక్టర్ మార్గదర్శకాలతో రైతుకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. ► ఆర్బీకేల ద్వారా ఇ క్రాపింగ్ జరుగుతుంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా లభ్యం అవుతాయి. ► ఆధార్ సీడింగ్ కారణంగా రైతు భరోసా డబ్బులు అందని 4 శాతం రైతులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ నెల 30న 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 27న రైతు భరోసా కేంద్రాలపై డ్రై రన్ నిర్వహించాలి. ఆర్బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం. ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలందించాలి. కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. అవసరమైన చోట ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. మండు టెండలో పెద్ద క్యూలో రైతులు నిలబడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి రైతుకూ టోకెన్లు ఇచ్చి గ్రామ స్థాయిలోనే పంపిణీ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఎక్కడా గుమిగూడాల్సిన అవసరం లేదు. రైతులకు కూపన్లు ఇచ్చే వ్యవస్థను కలెక్టర్లు పర్యవేక్షించాలి. -
పశువులకూ 'ఆధార్'
సాక్షి, అమరావతి: మనకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ తరహా కార్డులు ఇవ్వనుంది. రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు సర్కారు 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించబోతోంది. ఈ సంఖ్యతో పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్ వేస్తారు. దీంతో భవిష్యత్లో ట్యాగ్ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. అవిలేనివి ప్రమాదంలో చనిపోయినా రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరు. రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న రూ.వెయ్యి కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది. ఇవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ‘ఇనాఫ్ ట్యాగ్’ (ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్)ను వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్తోపాటు ఇనాఫ్ ట్యాగ్ను వేయనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నాయి. రెండు నెలల వ్యవధిలో వీటన్నింటికీ వాక్సిన్తోపాటు ట్యాగ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్ ట్యాగ్లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు. -
గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం
తన భూమికి సంబంధించిన 1బీ ధ్రువపత్రాన్ని చూపుతున్న ఈ రైతు పేరు కురబ మంజునాథ్. ఇతడిది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి. గ్రామంలో సర్వే నం.90లో 3 ఎకరాల భూమి ఉంది. భూమి 1బీ ధ్రువపత్రం, అడంగల్ కోసం ఆదివారం గ్రామ సచివాలయానికి వచ్చాడు. రైతు అడిగిన ధ్రువపత్రాలను అక్కడి సిబ్బంది వెంటనే అందించారు. దీంతో మంజునాథ్ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో కల్యాణదుర్గం వెళ్లి గంటల తరబడి వేచి చూసినా జరగని పనులు ఇప్పుడు తమ గ్రామంలోనే వెంటనే జరగుతుండటంతో సంతోషంగా ఉందని చెప్పాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెంకట్రాజుపురం ప్రజలు ఏ పనులు కావాలన్నా 32 కిలోమీటర్ల దూరంలోని గ్రామ పంచాయతీకి, లేదంటే 42 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు వెంకట్రాజుపురంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. సొంత గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్కార్డు కోసం ఆదివారం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందజేశారు. సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా విప్లవాత్మకమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం రోజునే రాష్ట్ర ప్రజలకు వారి సొంత గ్రామాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఆదివారం నుంచి 14,487 సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా ప్రభుత్వ సేవలు అందుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పిందని చెబుతున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతోందని పేర్కొంటున్నారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో కోటిన్నర దాకా కుటుంబాలు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే కోటి కుటుంబాలు నివసిస్తున్నాయి. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందిన దాఖలాలు లేవు. పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే అధికార యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సామాజిక సూచికలు.. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే పరిపాలనను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే గ్రామ, వార్డు స్థాయిలో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. వాటి భర్తీ ప్రక్రియను సైతం స్వల్ప వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలన్న లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.80 లక్షల మంది వలంటీర్లను నియమించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ సచివాలయంలో దరఖాస్తుదారుడికి సదరం సర్టిఫికెట్ అందజేస్తున్న సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 80 శాతానికి పైగా ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలని.. ప్రజలు మండల, జిల్లా కేంద్రాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇక వారి గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులను అధికారులు ఏ మేరకు పరిష్కరించారన్న దానిపై ప్రభుత్వం ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మహిళా రక్షణకు పెద్దపీట రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాలన వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒకరు చొప్పున మహిళా పోలీసులను నియమించింది. ప్రతి 2,000–5,000 మంది జనాభాకు ఒక మహిళా పోలీసు నిత్యం అందుబాటులో ఉంటారు. గ్రామ, వార్డు స్థాయిలో స్థానిక మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపుతారు. లంచాల బెడదకు అడ్డుకట్ట పడినట్టే.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ప్రజలు విసుగెత్తిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలతో లంచాల బెడదకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. ఎవరైనా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్దకు వెళ్లి పని చేసి పెట్టాలని దరఖాస్తు అందజేస్తే కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారులు వాళ్లు చేయాల్సిన పనిని మరింత సమర్థవంతంగా చేసే వీలుంటుంది. – చంద్రమౌళి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు కమిషనర్ గ్రామాల రూపురేఖలే మారిపోతాయి గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులే ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల వద్దకొచ్చి సమాచారం తీసుకుంటున్నారు. కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అవినీతికి ఆస్కారమే లేదు. అధికార వికేంద్రీకరణ దిశగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గొప్ప ముందడుగు. – చిత్తరవు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ గ్రామ స్వరాజ్యం వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల వద్దకే నిజమైన పాలన తెచ్చారు. గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చింది. సచివాలయాలతో ప్రజల కష్టాలు తీరాయి. ఇక్కడ మా సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం కల్పించడం సంతోషకరం. – శ్యామసుందర్రెడ్డి, యు.రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా సమయం, డబ్బు ఆదా మా ఊళ్లో గ్రామ సచివాలయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1బీ అండగల్, 1బీ సవరణ, వెబ్ల్యాండ్తోపాటు ప్రతి పనికీ మండల కేంద్రమైన కణేకల్లుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. సమయం వృథా కాదు. బస్సు, ఆటో చార్జీలు, భోజనాల ఖర్చులు తప్పుతాయి. మా గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. – అనంతమ్మ, బెణికల్లు అనంతపురం జిల్లా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట ప్రభుత్వ పథకాలు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతి పనికీ డబ్బులు వసూలు చేసేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుంది. వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రతి పనినీ ఉచితంగా చేయించుకోవచ్చు. – దారంశంకర్, గుంటూరు కష్టాలు తప్పుతాయి ఇంతకుముందు ఏ పని కావాలన్నా పంచాయతీ, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేం ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే సచివాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. రేషన్ కార్డు కావాలన్న, పింఛన్ కావాలన్న మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి. – జొన్నాడ వెంకటరమణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నిజమైన ప్రజా పాలనకు నాంది గ్రామ సచివాలయాలు నిజమైన ప్రజా పాలనకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – ఎన్ నాగప్రసాద్, బందరు మండలం, కృష్ణా జిల్లా మంచి విధానమిది ఇంతకుముందు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దళారులు దోచేసేవారు. సచివాలయాల వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు చేయించుకోవచ్చు. చాలా మంచి విధానమిది. – బర్మా వెంకట లలిత కుమారి, బందరు మండలం, కృష్ణా జిల్లా చారిత్రక నిర్ణయం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావడం చారిత్రక నిర్ణయమే. ఇక ఏ ఒక్క లబ్ధిదారుడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు శ్రమకోర్చి వెళ్లాల్సిన పని లేదు. సేవలను ప్రజలకు దగ్గరకు చేర్చిన సచివాలయ వ్యవస్థ చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. – డాక్టర్ వడిశెట్టి గాయత్రి, మహిళా సైంటిస్ట్, పిఠాపురం, తూ.గోదావరి కలలో కూడా ఊహించలేదు ఇలాంటి గొప్ప పాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా సామాన్యుల బాధలు పట్టించుకునేవారు కాదు. వ్యయప్రయాసలకోర్చి 10 కిలోమీటర్లు దూరంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తగ్గాయి. – ఈశ్వర్రెడ్డి, రైతు, గోపిదిన్నె, చిత్తూరు జిల్లా -
ప్రతిష్టాత్మకం.. వైఎస్సార్ నవశకం
అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి కొత్త కార్డులను ముద్రించి, పంపిణీ చేయాలి. వైఎస్సార్ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే పంపించండి. అర్హులైన ప్రతి వారూ లబ్ధి పొందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్గా పని చేయాలి. సంక్షేమ పథకాల వర్తింపులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడొద్దు. కేవలం అర్హతే ప్రామాణికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండాలి. అధికారులందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫలానా కలెక్టర్ హయాంలో ఇళ్ల పట్టా ఇచ్చారన్న పేరు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేలా పని చేయాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా రూ.5 వేలు ఇస్తాం. ఆ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్గా తీసుకోవాలి. మనసా, వాచా, కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాజిక తనిఖీల కోసం డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు ఆయా పథకాల అర్హుల జాబితాను అక్కడే ప్రదర్శించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రారంభమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం సాగుతున్న ప్రక్రియ తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి రోగులకు ఆర్థిక సాయం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద నిర్ధారించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకునే సమయంలో దేశంలో తొలిసారిగా ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం ఆరోగ్య మిత్రలకు అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పని తీరు ఉండాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. సికిల్సెల్ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోపీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం స్పందనపై సమీక్షలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని ఉన్నతాధికారులతో ప్రమాణం చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్ 45.82 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లతో సమావేశమై మిగిలిన రైతులకు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అన్ ఇంకంబర్డ్ అకౌంట్ కింద మాత్రమే భరోసా మొత్తాన్ని రైతులకు చెందేలా జమ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. ‘ఉపాధి’తో వర్క్షాపుల అనుసంధానం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్షాపులపై కలెక్టర్లు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో వర్క్షాపులను కచ్చితంగా తెరవాలని.. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని రైతులకు విక్రయించాలని చెప్పారు. ఈ వర్క్షాపుల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, జనవరి 1 నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 22.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని అధికారులు వివరించారు. 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవినీతిని తగ్గించడం, ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యమని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని స్పష్టీకరించారు. ఇది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో, సెక్రెటరీలు సచివాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారని సీఎం పేర్కొన్నారు. 21న వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారులను గుర్తించారని, మగ్గమున్న ప్రతి ఇంటికీ ఈ పథకం వర్తించాలని చెప్పారు. అర్హత ఉండీ పథకం వర్తించని వారు ఉండకూడదన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని ఈ పథకానికి దూరం చేయరాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ వాహన మిత్రకు నేటితో గడువు ముగిసిందని, అర్హులైన లబ్ధిదారులందరకీ చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు 92 శాతం చెక్కులు పంపిణీ జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి నూరు శాతం చెక్కులు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని సీఎం అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక.. రెండింటిలోనూ అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి వారం ఇసుక ధరలు, లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటు చేసిన 439 చెక్ పోస్టుల్లో నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా అదే రోజుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తోందని, రోజుకు 80 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 95 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఆన్లైన్లో ఇవాల్టికి (మంగళవారం) అందుబాటులో ఉంచామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సీఎం సూచించారు. ‘స్పందన’ కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 4న అనంతపురం, కర్నూలులో ఆఖరి విడతగా ఓరియెంటేషన్ తరగతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవినీతిపరుల భరతం పట్టాలి - 14400 కాల్ సెంటర్కు ఫోన్ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఒక్క ఫోన్ కాల్తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించాలి. - ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలి. - ప్రతి దశలోనూ అట్టడుగు స్థాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి. - నా (సీఎం) స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకూ పోతుంది. మిగిలిన 50 శాతం అవినీతి పోయినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఇందుకోసం ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పని చేస్తాయి. - ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే. సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గదర్శకాలు - నిబంధనలను సరళతరం చేయాలి. - 52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయాలి. - డిసెంబర్ 3న వరల్డ్ డిజేబుల్డ్ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలి. - డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించాలి. - అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్ అందించడమే లక్ష్యంగా పని చేయాలి. -
నవశకం.. నేడు శ్రీకారం
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాల్లో బుధవారం నుంచి ముందస్తుగా సంక్రాంతి సందడి సంతరించుకోనుంది. వైఎస్సార్ నవశకం పేరుతో అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు నేటి నుంచి ఇంటింటి సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, పట్టణ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి దాదాపు 4 లక్షల మంది ఇంటింటి సర్వేలో భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. గతప్రభుత్వంలో రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు జన్మభూమి కార్యక్రమాల్లో అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు పడిన ఆ వెతలను పాదయాత్రలో స్వయంగా చూడటమే కాకుండా అదే యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యచరణను ప్రకటించారు. ప్రక్రియ.. అవినీతి రహితం, పారదర్శకం కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా ఈ పక్రియ సాగనుంది. పేదలకు మరింత న్యాయం చేసేందుకు వార్షిక ఆదాయ పరిమితిని భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వార్షిక ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా మరింత మందికి సంక్షేమ, ఆరోగ్య ఫలాలు చేరవేయాలనేది సీఎం ఉద్ధేశం అని ఉన్నతాధికారులు తెలిపారు. బియ్యం కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు వైఎస్సార్ కాపు నేస్తం, మిగతా పథకాలన్నింటికీ అర్హతలు, ఎంపిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. వాటికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లకు ప్రత్యేక ప్రొఫార్మాలను అందజేయడమే కాకుండా ఇంటింటి సర్వేలో పాల్గొనే యంత్రాంగానికి మంగళవారం వరకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అర్హుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు గ్రామ వలంటీర్లు తమ పరిధిలో రోజుకు ఐదు ఇళ్లలో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు వలంటీర్లు రోజుకు పది ఇళ్లలో మాత్రమే సర్వే నిర్వహిస్తారు. సర్వే ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ ముసాయిదా జాబితాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులను ఆహ్వానిస్తారు. ఇది పూర్తి కాగానే గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల తుది జాబితాలకు ఆమోదం పొందుతారు. ఆ తర్వాత వాటిని సచివాలయాల వద్ద బోర్డుల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా సచివాలయ అధికారులు, మండల, మున్సిపాలిటీల స్థాయి అధికారులకు, సంబంధిత శాఖలకు చేరవేయడమే కాకుండా వివరాలను కంప్యూటీకరించనున్నారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాగా, ప్రతి పథకం అర్హతలు, మార్గదర్శకాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రదర్శన బోర్డుల్లో ఉంచుతారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్నీ ప్రదర్శిస్తారు. ఇవి సచివాలయాల్లో శాశ్వతంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
రాష్ట్రంపై ప్రేమాభిమానాలు చాటండి..
సాక్షి, అమరావతి: ‘కనెక్ట్ టు ఆంధ్రా’ కింద రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ను ఆయన ఆవిష్కరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ప్రత్యేకించి ఈ వెబ్ పోర్టల్ను రూపొందించారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్గా, సీఎస్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని.. రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ‘మీరు ఎంత సాయం చేస్తారన్నది ముఖ్యం కాదు.. మీ గ్రామంలో.. లేదా మీ నియోజకవర్గంలో.. లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమమైనా చేపట్టొచ్చు.. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సాయం చేయొచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాంతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన కమిషనర్ విజయ్కుమార్, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ పాల్గొన్నారు. -
లబ్ధిదారుల ఎంపికకు ఏటా 8 గ్రామ సభలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రజల మధ్యే చర్చ జరిపేందుకు ఇక గ్రామాల్లో ప్రతి ఏటా తప్పనిసరిగా 8 విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సచివాలయ విధులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. దశల వారీగా మద్య నియంత్రణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ అమలు కోసం సంబంధిత శాఖతో సచివాలయ ఉద్యోగులు కలిసి పని చేయనున్నారు. బాల కార్మికుల నియంత్రణ చట్టం, కుటుంబ వేధింపుల చట్టం, బాల్య వివాహాలు నిషేధ చట్టం, వాల్టా చట్టం వంటివి కూడా సంబంధిత శాఖ సహకారంతో గ్రామ పరిధిలో పటిష్టంగా అమలు చేయడంలో సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయనున్నారు. సచివాలయం మొత్తం చేపట్టాల్సిన విధులతో పాటు అందులో పనిచేసే ఒక్కో రకమైన ఉద్యోగికి ఒక్కో రకం జాబ్ చార్టును విడుదల చేశారు. -
శతశాతం.. చరిత్రాత్మకం!
రాష్ట్ర చరిత్రలోనే ఇది అపూర్వ ఘట్టం. రేషన్ కార్డుపై నాణ్యమైన బియ్యాన్ని అందించడమే ఓ ఘనత అనుకుంటే.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సరుకు చేర్చడం మరో గొప్ప విషయం. వృద్ధులు, దివ్యాంగులు, అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలపై నివసించే గిరిజనుల ఆనందానికి అవధులు లేవు. 8.32 లక్షల ఇళ్లకు బియ్యం పంపిణీ చేసే బృహత్కార్యాన్ని కేవలం రెండు రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి, సిబ్బంది అంకిత భావానికి నిదర్శనం. గ్రామ/వార్డు వలంటీర్ల సహకారంతో జిల్లా యంత్రాంగం ఈ చారిత్రక ఘట్టాన్ని పూర్తి చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిజం చేసింది. సాక్షి, శ్రీకాకుళం : పేదలకు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనేది ప్రజా ముఖ్యమంత్రి ఆకాంక్ష. దుర్వినియోగానికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ముంగిటకే సరుకు పంపిణీ చేయాలని తలపెట్టారు. ఇందుకు గ్రామ/వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. చిత్తశుద్ధి ఉండాలే గానీ సాధించలేనిది ఏముంది? కేవలం రెండు రోజుల్లో ఈ మహా క్రతువును పూర్తి చేశారు. జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ శతశాతం పూర్తయింది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బియ్యం ప్యాకెట్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఈనెల నుంచి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించగా.. శనివారమే బియ్యం పంపిణీ 92 శాతం పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాన్ని ఆదివారం ముగించారు. తెల్ల రేషన్ కార్డు గల 8.32 లక్షల కుటుంబాలకు నాణ్యమైన బియాన్ని పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. స్వయంగా ఇంటికే డెలివరీ చేయడం, నాణ్యమైన బియ్యం కావడంతో లబ్ధిదారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వర్షంలో తడిసిన కారణంగా కొన్ని చోట్ల 30 వరకు బియ్యం బస్తాలు పాడవడంతో వారికి మంచి సరుకును సరఫరా నాణ్యమైన బియ్యంతో వంట చేశా.. మాది హడ్కో కాలనీ. తెలుపు కార్డు ద్వారా 20 కేజీల బియ్యం ప్యాకెట్ ఇచ్చారు. బియ్యం నాణ్యత చాలా బాగుంది. వీటినే వంట చేశా.. అన్నం బాగుంది. ఇంటందరం ఆనందంగా తిన్నాం. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. – మరువాడ సుధారాణి, హడ్కోకాలనీ, నరసన్నపేట అసూయతోనే టీడీపీ నేతల ఆరోపణ జగనన్న పథకాలను చూసి టీడీపీ నేతలు అసూయపడుతున్నారు. మాకు నాణ్యమైన బియ్యం వచ్చాయి. మా దగ్గరకి వచ్చి అడిగితే మేమే సమాధానం చెబుతాం. జగనన్న పాలనను చూసి టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. – బంటు కళావతి, లబ్ధిదారు, . పకడ్బందీ ప్రణాళిక నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేయడానికి గాను 6,146 వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే అవసరం ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల ఈ వాహనాలను పెంచారు. జిల్లాలో 8.32 లక్షల కుటుంబాలకుగాను 2015 ఎఫ్పి షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టరుగా విడదీసి, మొత్తం 15,212 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికీ గాను ఒకొక్క క్లస్టరుకు ఒక వాలంటీరును ఈ పంపిణీకి కేటాయించారు. దీంతో వారంతా రెండు రోజులపాటు సజావుగా ఈ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేశారు. గత నెలలో బియ్యం అందిన ప్రతి కార్డుదారునికి ఈ నెలలో కూడా బియ్యాన్ని అందజేశారు. ఈకేవైసీ, ఆధార్ వంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకొన్నారు. ముందుగానే కార్డుదారులకు, వలంటీరుకు మ్యాపింగ్ చేసిన ప్రకారం ఈ బియ్యాన్ని సరఫరా చేశారు. కొన్ని చోట్ల వాలంటీర్లు లేని వలన అక్కడ వీఆర్వోల తో ఈ పంపిణీ చేసి, లబ్ధిదారులకు ఇంటింటికీ సరుకు సరఫరా చేశారు. రెండో రోజు ఆది వారం కూడా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను కొనసాగించారు. తడిసిన బియ్యం స్థానంలో మంచి సరుకు సరఫరా తొలి రోజు పంపిణీలో తడిసిన బియ్యం వచ్చాయని కొన్నిచోట్ల ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఆ ఫిర్యాదులపై కలెక్టర్ జె.నివాస్, జేసీ కె.శ్రీనివాసులు వెంటనే స్పందించి, తడిసిన బియ్యం స్థానంలో అందరికీ కొత్తగా వేరే నాణ్యమైన బియ్యాన్ని అందజేశారు. ఇటీవల వారం రోజులుగా వర్షాలు కురవడం వలన లోడింగ్, రవాణా ఇతర ప్రాం తాల్లో ఇబ్బందుల వలన ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది కావాలనే దుష్పచారంకోసం ఈ బియ్యం బాగులేవని చేస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ సానుకూల డీలర్లు ఉన్నచోట ఇటువంటి తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. ఎక్కడైనా బియ్యంలో నాణ్యత కొరవడితే సరుకు మార్పు చేశారు. ఇటువంటి మార్పులు జిల్లాలో 30 బ్యాగుల వరకు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. రెండో రోజు పంపిణీలో ఒక్క ఫిర్యాదు కూడా కంట్రోల్ రూంకి రాలేదు. -
పేదింటి వేడుక.. ‘వైఎస్సార్ పెళ్లి కానుక’
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : ప్రస్తుతం ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంత తక్కువ ఖర్చుతో వేడుక నిర్వహించాలన్నా పెళ్లికి బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం ఇలా పెళ్లి భజంత్రీ మోగే వరకూ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చలేక జీవితాంతం సతమతమవుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాల రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. ముఖ్యంమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి మండల మహిళా సమాఖ్యలు, మెప్మా కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకానికి మార్గదర్శకాలు.. ► వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ► వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. ► ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి. ► వివాహం ఏపీలోనే చేసుకోవాలి. ► ఇద్దరికీ ఆధార్కార్డు, వధువు తప్పనిసరిగా తెల్లరేషన్కార్డు కలిగి ఉండాలి. ► వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి. ► వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ► తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు. ► వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే. నమోదు ఇలా.. మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్లి కానుక దరఖాస్తును నమోదు చేస్తున్నారు. నమోదుచేసిన వెంటనే అప్లికేషన్ ఐడీ నంబర్ అభ్యర్థుల మొబైల్ నంబర్కు వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి, దర్యాప్తుచేస్తారు. ఆ తర్వాత ముందుగా రావాల్సిన 20శాతం నగదును పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు ♦ మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, జనన ధ్రువీకరణ పత్రం. ♦ వయస్సు నిర్ధారణకు పదో తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ–సేవా సర్టిఫికెట్. ♦ కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ♦ తెల్లరేషన్ కార్డు లేదా మీ–సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం. ♦ పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్ను ఇవ్వాలి. ♦ దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం కలిగిఉండాలి). ♦ భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు. ♦ ‘వెలుగు’లోనే దరఖాస్తు చేయాలి జగనన్న భరోసా ఇలా.. కేటగిరి గత ప్రభుత్వం ప్రస్తుతం ఎస్సీ రూ. 40 వేలు రూ.లక్ష ఎస్టీ రూ. 50 వేలు రూ.లక్ష బీసీ రూ. 35 వేలు రూ.లక్ష మైనార్టీలు రూ. 50 వేలు రూ.లక్ష భవన నిర్మాణ కార్మికులకు రూ. 20వేలు రూ. 20వేలు ఎస్సీ కులాంతర వివాహం రూ. 75 వేలు రూ. లక్ష ఎస్టీ కులాంతర వివాహం రూ. 50 వేలు రూ. లక్ష బీసీ కులాంతర వివాహం రూ. 50 వేలు రూ. 50 వేలు దివ్యాంగులకు రూ. లక్ష రూ. లక్ష వైఎస్సార్ పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నేరుగా మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించాలి. మా వద్దకు దరఖాస్తు వచ్చిన వెంటనే ఐడీ నంబర్ ఇస్తాం. ఈ నంబర్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్ కూడా లబ్ధిదారునికి సకాలంలో తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు మండలంలో 47 వివాహాలు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే వధువుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ పెళ్లి కానుక నగదు జమ చేస్తాం. – వి నాగేశ్వరరావు, ఏపీఎం వెలుగు కార్యాలయం, యడ్లపాడు -
77 వేల మందికి ఒక్కటే ఆధార్ కేంద్రం!
ఎర్రగుంట్ల: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు జనం త్వరపడుతున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తుండగా వారికి సరిపోయే సంఖ్యలో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో గంటల తరబడి క్యూలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం, ఎర్రగుంట్ల మున్సిపాల్టీ పరిధిలో 77 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వీరందరికీ ఎర్రగుంట్లలోని ముద్దనూరు రోడ్డు ఎస్బీఐలో ఉన్న ఆధార్ కేంద్రం మాత్రమే ఆధారం. పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు కావాలన్నా, మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఇదొక్కటే దిక్కు. దీంతో కొద్దిరోజులుగా జనం రాత్రీ పగలనక ఇక్కడ నిరీక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆధార్ టోకెన్ల కోసం భారీగా క్యూ కట్టారు. జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా టోకెన్లు తీసుకునేందుకు గొడుగులు పట్టుకొని మరీ బారులు తీరారు. 500 మందికి పైగా అక్కడ నిరీక్షిస్తూ కనిపించారు. ఉదయం పది గంటల తరువాత జనం మరింత పెరిగారు.దీంతో కొద్దిపాటి తోపులాట జరిగింది. రద్దీని నియంత్రించేందుకు సీఐ సదాశివయ్య నలుగురు కానిస్టేబుల్స్ను పంపించారు. అయినా చాలా మంది మహిళలు, పిల్లలు తోపులాటలో ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు సెలవు పెట్టి మరీ పిల్లలు టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. టోకెన్లు ఇవ్వడం ప్రారంభించాక మరింత తోపులాట జరిగింది. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ సిబ్బంది సైతం లోనికి వెళ్లలేక బయటే నిలబడిపోయారు. గర్భవతులు, బాలింతలు ఈ తోపులాటలో ఇబ్బందులు పడ్డారు. -
ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి
ఇది మీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలతో రండి. మీ తల్లిదండ్రుల్ని, అవ్వాతాతల్ని, స్నేహితుల్ని చూడ్డానికి సంవత్సరానికి కనీసం ఒకట్రెండు సార్లయినా రండి. ఆ తర్వాతే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. మీ గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్టాప్స్ మార్చాలనే ఆరాటం ఉండేవాళ్లు ముందుకు రండి. మీ సహాయంతో వాటిని పునరుద్ధరిస్తాం. వాటికి మీ పేరే పెడతాం. మీకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుంది. కలిసి గ్రామాలు బాగు చేసుకుందాం రండి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డాలస్ (అమెరికా): ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. ఇది మీ ప్రభుత్వంగానే భావించాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చెందేలా, ఇనుమడించేలా పరిపాలనలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లోని ఆసుపత్రులు, స్కూళ్ల పునర్నిర్మాణంలో, బస్టాపుల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాలస్లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు వేలాది మంది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. ఇటీవలి ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు, 151 అసెంబ్లీ సీట్లు దక్కించుకుని చరిత్రాత్మక విజయం సాధించిన రెండున్నర నెలల తన పాలనలో తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలను ప్రవాసుల ముందుంచారు. సామాజిక న్యాయం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్న తన తపనకు ప్రవాసులు కదలి రావాలని, మీరు, మనము అందరమూ కలిసి ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని వారందరినీ కోరారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది. ఈ విజయంలో మీ పాత్రా కీలకం ‘‘ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడి (అమెరికా) తెలుగు వారు పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు గెలిచాం. 25 లోక్సభ స్థానాల్లో 22 చోట్ల గెలిచాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓటు బ్యాంకును సాధించాం. ఇందులో అమెరికా నుంచి తెలుగు వారు చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేనే మాత్రం సంకోచించడం లేదు. మీరు ఖండాలు దాటి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మన దేశం మీద, అన్నింటికీ మించి నాన్న మీద, నామీద చెక్కు చెదరని మీ ప్రేమాభిమానాలకు మరొక్కసారి జగన్ సెల్యూట్ చేస్తున్నాడు. అమెరికాతో పాటు వారికి మించి కూడా ఎదుగుతున్న మీ అందర్నీ చూసి మన రాష్ట్రంలో అక్కడ మేం ఎంతో గర్వపడుతున్నాం. మా దేశానికి భారతీయులు ఎంతో సేవ చేశారని, అమెరికా అధ్యక్షుడు స్వయంగా మన తెలుగువారి గురించి, మన భారతీయుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా భావిస్తుంటాం. అమెరికాలో ఉన్న దాదాపు 41 లక్షల మంది భారతీయుల్లో 4 లక్షల మంది తెలుగువారే ఉన్నారు. మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ స్థిరపడి, రాణిస్తున్నారంటే నిజంగా ఈ ప్రతిభను చూసి ముచ్చట వేస్తోందని గర్వంగా చెబుతున్నాను. కన్నతల్లిని, మాతృ భూమిని, మీ మూలాల్ని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో.. ఎంతగా ప్రేమిస్తున్నారో ఇక్కడ మిమ్మల్నందర్నీ చూస్తుంటే అర్థం అవుతుంది. మీ అందరికీ డల్లాస్ వేదిక మీద నుంచి ఒకటే చెప్పదలచుకున్నా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం గౌరవం పెంపొందించేలా.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండున్నర నెలల్లోనే చర్యలు తీసుకుందని మీ అందరి ప్రతినిధిగా గర్వంగా ప్రకటిస్తున్నాను. ఏ దేశ చరిత్ర చూసినా.. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని శ్రీశ్రీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఇక్కడో మనిషి గతంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన చరిత్రనూ మనం చూశాం. గాంధేయ మార్గం, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మన దేశభక్తుల్ని నిరంతరం ప్రభావితం చేస్తే, అమెరికాలో మానవ హక్కులు, సమాన హక్కుల కోసం, వర్ణ వివక్షలేని సమాజం కోసం పోరాటం చేసిన యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయన్ను మనదేశంలో కూడా అనేక మంది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. ఐ హేవ్ ఎ డ్రీమ్.. అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. 56 సంవత్సరాల క్రితం 1953 ఆగస్టు 27న ఆయన చేసిన ఈ ప్రసంగం అమెరికా ప్రజల్లోనే కాకుండా అమెరికాలోని ప్రభుత్వ విధానాల్లో కూడా ఎంతో గొప్ప మార్పు తీసుకు వచ్చిందని చరిత్ర చెబుతోంది. అమెరికాలోని డాలస్ నగరంలో ఉన్న హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభకు అశేషంగా హాజరైన ప్రవాసాంధ్రులు. కారణం ఒక్కటే. అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా, ఆయన భావాలే వారికి వేదాలు అయ్యాయి కాబట్టి ఆ మార్పును తీసుకురాగల పరిస్థితి వచ్చింది. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే పాలకులు ధ్యాసపెడితే మార్పు అనేది తీసుకురావడం సులభం అవుతుంది. చెడు నుంచి మంచికీ, పేదరికం నుంచి సంపన్నతకీ, అవినీతి నుంచి నీతికీ, మొరటుతనం నుంచి మానవత్వానికి మార్పు తీసుకు రావడం సులభం అవుతుంది. అరాచకం నుంచి చట్టబద్ధత ఉన్న ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి, వివక్షలేని సమానత్వానికి, రక్తపాతం నుంచి శాంతియుత సహజీవనానికి, దోపిడీ నుంచి మానవ కారుణ్యానికి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థం ఉంటుంది. ప్రతిదేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పును తీసుకు రావాలంటే నాయకత్వం నుంచి ఆ మార్పు మొదలు కావాలి. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రం నిర్మించాలన్నది నా కల ‘ఐ హేవ్ ఏ డ్రీమ్ ...’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం. నాకూ ఓ కల ఉంది. బ్రిక్స్ దేశాలతో మనం ఎప్పుడూ పోల్చుకుంటుంటాం. బ్రిక్స్లో మన దేశం కూడా ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వాళ్లు కాలేజీల్లో ఎంత మంది చేరుతున్నారని లెక్కగట్టేది. బ్రిక్స్ దేశాల్లో దీన్ని చూస్తే రష్యా 81 శాతం, బ్రెజిల్ 50 శాతం, చైనా 48 శాతం అయితే మన దేశం కేవలం 25 శాతం మాత్రమే. దీన్ని మన రాష్ట్రంలో 95 శాతానికి తీసుకెళ్లాలన్నది నా కల. పల్లెలు కళ కళ లాడాలని, అక్కడి ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది నాదొక కల. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలన్నది నాదొక కల. జబ్బు ఎలాంటిది అయినా, ఏ ఒక్క పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది నాదొక కల. ఏ ఒక్క పేదవాడు సొంత ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా అందరికీ సొంతిల్లు నిర్మించాలన్నది నా కల. ఏ తల్లీ తన పేదరికం వల్ల తన బిడ్డలకు చదువు చెప్పించలేని పరిస్థితి ఉండకూడదన్నది నా కల. ఎంత పెద్ద చదువైనా చెప్పించగలిగితే.. తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న కులాల వారి బతుకులు సంపూర్ణంగా మారుతాయని, దాన్ని మార్చాలనేది నా డ్రీం. ఏ ఒక్కరూ నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది నా కల. ఏ ఒక్క కుటుంబం మద్యం కారణంగా విచ్చిన్నం కావడానికి వీల్లేదన్నది, ఆంధ్రప్రదేశ్ను ఆనందాల రాష్ట్రంగా మార్చాలన్నది నా కల. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రం నిర్మించాలన్నది నా కల. పెన్షన్స్ కావాలన్నా, రేషన్కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఆరోగ్య శ్రీ కావలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఇలా ఏ గవర్నమెంట్ పథకమైనా గ్రామాల్లోనే.. ప్రభుత్వ సేవలన్నీ కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుబాటులోకి రావాలన్నదే నా కల. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలు వీటిలో ఏదానికీ తావు లేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది నా కల. గ్రామ స్థాయిలో విప్లవం నేను పెట్టుకున్న ఈ లక్ష్యాలు, నవరత్నాలు, నేనిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో.. వీటన్నింటికీ ప్రేరణ మన ప్రజలే. వారి కష్టాలను చూశాక, వారి బాధలను విన్నాక వారందరికీ కూడా నేను చెప్పిన మాట ఒక్కటే. నేను విన్నాను అని చెప్పాను. ఈ రోజు అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత.. నేను ఇది వరకే చెప్పాను. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏమీ ఉండదని. ఆ మనసుపెట్టి మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో కచ్చితంగా మంచి చేస్తానని, సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఉన్నాయని కచ్చితంగా ఈ వేదిక మీద నుంచి చెబుతున్నాను. ఈ దిశగానే అడుగు వేస్తూ రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశాం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకు వచ్చాం. పెన్షన్లకు గతంలో సంవత్సరానికి ఇచ్చే సొమ్మును లెక్కవేస్తే, మూడింతలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. మొదటి రెండున్న నెలలల్లోనే అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఇల్లులేని నిరుపేదకు సంతృప్తికర స్థాయిలో ఏకంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఏడాదిలోగా ఇవ్వబోతున్నామని చెబుతున్నాను. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, బెల్టుషాపులన్నవి ఎక్కడా కూడా లేకుండా చేస్తూ మద్య నిషేధానికి నాంది పలికామని చెబుతున్నా. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలతో గ్రామ స్థాయిలో విప్లవం తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అణగారిన వర్గాలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు గతంలో ఎన్నడూ జరుగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఇచ్చేలా చట్టం తీసుకు వచ్చి అమలుకు పూనుకుంటున్నామని గర్వంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్నే తీసుకు వచ్చామని సగర్వంగా చెబుతున్నాను. పారదర్శకతకు పెద్దపీట రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పిల్లలకు హైదరాబాద్ వంటి మహానగరం లేదు. ఉద్యోగాల కోసం వారు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పిల్లలను దారి పొడవునా నా పాదయాత్రలో చూశాను. వారి బాధలను విన్నాను కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు తిరక్క ముందే వీరందరికీ న్యాయం చేసేందుకు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టం తెచ్చాం. ఎక్కడా అవినీతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో పారదర్శకత అనే పదానికి దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూడాలన్న ఆరాటంతో మొట్టమొదటి సారిగా, దేశ చరిత్రలోనే తొలి సారిగా జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని కూడా తీసుకు వచ్చాం. ఏ కాంట్రాక్టు అయినా, ఏ టెండర్ అయినా రూ.వంద కోట్ల విలువ దాటితే, ఒక జడ్జి దగ్గరకు ఈ టెండర్లను పంపిస్తున్నాం. ఆ జడ్జి వాటిని వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక మరో 8 రోజుల్లో ఆ జడ్జి మార్పులు చేసి ఖరారు చేసిన తర్వాతే టెండర్లు పిలవడానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా తెస్తున్నాం. ఎవరైతే తక్కువకు కోట్ చేస్తారో ఆ ప్రైస్ను ఆన్లైన్లో పెడతాం. ఆ మరుసటి రోజు ప్రైస్ను యాక్షన్లోకి తీసుకు వెళతాం. గతంలో టెండర్లో ఎల్1గా నిలిచిన వారిని కూడా రివర్స్ ఆక్షన్లో పాల్గొనేలా పోటీ పెట్టి అతి తక్కువకు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్లకే ఇచ్చేలా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకు వచ్చాం. నిస్సహాయులైన మన రైతన్నలు, వ్యవసాయ ఆధార రంగాలపై తరతరాలుగా ఆధారపడి జీవిస్తున్న కులాలు, కుటుంబాలు, నేతన్నలు, జాలర్లు, కుమ్మరులు, కమ్మరులు, దర్జీలు, రజకులు, క్షురకులు, ఆటో ట్యాక్సీ డ్రైవర్లు, బడుగు బలహీన వర్గాలు, చిన్న వ్యాపారస్తుల బాగోగుల గురించి ఎవ్వరూ పట్టించుకోలేని వ్యవస్థలను పూర్తిగా మార్చడానికి మీ సోదరుడిగా నేను అక్కడ అడుగులు ముందుకు వేస్తున్నాను. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మొన్న జరిగిన మంత్రివర్గ కూర్పును మీరు చూసే ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రివర్గంలో 60 శాతానికి పైగా చోటు ఇవ్వడం ఇంతకు ముందెన్నడూ జరుగని పరిణామం. నలుగురిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా చేయడం కూడా ఇంతకు ముందెప్పుడూ జరుగలేదు. కీలకమైన హోం, సాగునీరు, రెవెన్యూ, విద్య ఇలాంటి శాఖలన్నీ ఈ వర్గాలకే ఇవ్వడం కూడా ఎప్పుడూ కనీ వినీ ఎరుగని పరిస్థితి అని ఈ వేదికపై నుంచి సగర్వంగా చెబుతున్నాను. దేశం అంటే మట్టి కాదు.. మనుషులే అని నమ్మాం కాబట్టే మీ సొంత గ్రామాల్లో మనుషులందరికీ మంచి చేసేందుకు మన అధికారాలను వినియోగిస్తున్నాం. ప్రాంతాల మధ్య అసమానతలు, కరువు ఒక పక్క, సముద్రంలో కలుస్తున్న నీరు మరో పక్క.. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది కాబట్టి ఈ పరిస్థితులను మార్చాలి అనే ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సఖ్యత కుదుర్చుకుంటూ.. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు.. కృష్ణా ఆయకట్టు ప్రాంతాలకు తీసుకెళ్లడానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. బ్రిక్స్ దేశాల్లో మన స్థానం పై భాగంలో ఉండాలన్న దిశగా దేశానికే మార్గనిర్దేశం చూపుతూ అడుగులు వేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియం చేస్తున్నాం. ఇవాళ స్కూళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నయో ఫొటోగ్రాఫ్లు చూపిస్తున్నాం. ఆ పాఠశాలలు, ఆసుపత్రులను దశల వారీగా ప్రతి సంవత్సరం కొన్ని స్కూళ్ల చొప్పున, కొన్ని ఆసుపత్రుల చొప్పున మూడు సంవత్సరాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆ తర్వాత ‘నాడు–నేడు’ అని ఆ ఫొటోగ్రాఫ్లు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పారిశ్రామికాభివృద్ధికి రెడ్ కార్పెట్ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడంతో బాటు, పారిశ్రామికాభివృద్ధికి రెడ్ కార్పెట్ వేసే దిశగా నిజాయితీతో అడుగులు వేస్తున్నాం. సస్టెయినబుల్ మోడల్స్ను తీసుకుంటున్నాం. విశ్వసనీయ విధానాలకు పెద్ద పీట వేస్తున్నాం. వ్యవస్థలో ఈ మార్పులు తీసుకు రాకపోతే ఎక్కడా కూడా పరిశ్రమ అనేది రాదు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు, నేను అధికారంలోకి వచ్చే సమయానికి 13 నెలల బకాయిలు, అక్షరాలా రూ.20 వేల కోట్లు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెప్పారు. డిస్కంల పని తీరు అంత దారుణంగా ఉంటే.. మరో వైపు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏలను) కుదుర్చుకుంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏడాదికి అక్షరాలా రూ.3 వేల కోట్లు అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలోనే పీపీఏలు కుదుర్చుకున్న అదే కంపెనీలకు అదే ప్రభుత్వం 13 నెలలుగా డిస్కంలు బిల్లులు కట్టలేని పరిస్థితి. ఏకంగా రూ.20 వేల కోట్లు బకాయి పడ్డాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు డిస్కంల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కరెంటు కొనుగోళ్ల అగ్రిమెంట్లను కూడా మార్చడానికి సన్నాహాలు చేశాం. కరెంట్ను మనం తక్కువ రేటుకు కొనుగోలు చేయగలిగితే పారిశ్రామికవేత్తలకు తక్కువ రేటుకు కరెంటును ఇవ్వగలుగుతాం. అప్పుడే వారిని ఆకర్షించగలుగుతాం. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసే ధరే ఎక్కువైనప్పుడు ఇక పరిశ్రమలకు తక్కువ ధరకు కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏ పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి ఉండదనేది వాస్తవం. ఈ వాస్తవాలన్నీ చెప్పే ప్రయత్నం చేశాం. ఇందులో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని ఈ వేదికపై నుంచి గర్వంగా చెబుతున్నా. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఇలా.. – రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్రతీరంతో పాటు నాలుగు నౌకాశ్రయాలు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. రైలు, రోడ్డు మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. ఐదేళ్లలో మరో ఐదు నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. పూర్తిగా పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉంది. – పాలనలో పారదర్శకతను తెస్తున్నాం. అవినీతికి తావు లేకుండా చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా, ఎవరైనా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సానుకూల వాతావరణం ఉన్నదని ఈ వేదికపై నుంచి చెబుతున్నాను. – మన ప్రభుత్వం, మన రాష్ట్రాభివృద్ధి సౌధాన్ని నాలుగు పునాదులపై నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం. రాష్ట్ర ప్రజల జీడీపీయే కాదు, మానవ అభివృద్ధి సూచికలను మెరుగు పర్చాలని కూడా నిర్ణయించాం. – పట్టణ వాసులకే కాకుండా పల్లెల్లో ఉండే వారికి కూడా సేవలను, సంక్షేమాన్ని వారి దగ్గరకే, వారి గడప దగ్గరకే తీసుకెళ్లేలా చర్యలను చేపట్టాం. దీని వల్ల పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలు తగ్గుతాయి. – మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడిన నిర్ణయాలను తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నాం. వీటి ద్వారా వచ్చే పరిశ్రమలతో 75 శాతం స్థానిక రిజర్వేషన్లతో మన పిల్లలకు మంచి జరుగుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నాను. – పరిపాలనలో సంస్కరణలు తీసుకు రావడం ద్వారా పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను తీసుకు రావడంలో మన ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. వీటన్నింటి ద్వారా జరిగే మేలు ఏమిటంటే.. రాష్ట్రానికి ఒక పారదర్శక వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రంలో చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేసే వ్యవస్థ ఉందనే ఒక సందేశం వెళుతుంది. మన రాష్ట్రానికి రండి.. మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కు రండి అని మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి ముందడుగులు వేస్తూ రండి. మేం అన్ని రకాలుగా చూసుకుంటాం, తోడుగా ఉంటామని చెబుతున్నాను. మీ గ్రామాల బాగును కోరుకున్న వాళ్లు, మీ గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాట పడే వారు, మీ గ్రామాల్లో మీ వైద్యశాలలు మార్చాలి అని తపన ఉన్న వాళ్లు, మీమీ గ్రామాల్లో బస్టాపులు మార్చాలనుకునే వాళ్లు, అందరూ రావాలని కోరుతున్నాను. మీ సహాయంతోనే అభివృద్ధి చేసి వాటికి మీ పేరు పెడతాము. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఇద్దరమూ కలిసి మన గ్రామాలను బాగు పర్చుకుందామని అందరినీ కోరుతున్నాను. గ్రామాలను అభివృద్ధి చేయాలనుకున్న వారు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారందరికీ అనుకూలంగా ఉండేలా ఒక వెబ్ పోర్టల్ను తెరవబోతున్నాం. ఆ పోర్టల్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. నేరుగా ఒక అధికారి దానిని పర్యవేక్షిస్తారు. ఆ పోర్టల్లోకి వచ్చి ఎవరైనా నేను పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నానని రిజిస్టర్ చేసినా, లేదా మా గ్రామంలో ఫలానా పనికి సాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరేదైనా ఫీడ్ చేస్తే.. వెంటనే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మా అధికారులు మీకు టచ్లోకి వస్తారని, మీకు అన్ని రకాలుగా సహకరిస్తారని ఇదే వేదిక నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఇక్కడ స్థిర పడక పోయినా, స్థిరపడినా.. అక్కడి ప్రజలతో చిరకాల అనుబంధాలు కోరుకునే వారెందరో ఉన్నారు. మీరంతా మేం చేస్తున్న ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతు ఇవ్వండని కోరుతున్నాను. మీ కుటుంబాల్లో పసిపిల్లల నుంచి, అవ్వాతాతల వరకూ అందరినీ నేను ఆప్యాయంగా పలకరించానని చెప్పండి. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు నాపై ఉంచమని, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనవడు అని ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతున్నా. చెరగని చిరునవ్వులతో ఆత్మీయతలను, ఆప్యాయతలను పంచి పెట్టినందుకు పేరు పేరునా.. ఇక్కడకు చేరుకున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, స్నేహితుడికీ, అవ్వాతాతలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. అన్నా బాగున్నారా? అక్కా బాగున్నారా? చెల్లెమ్మా.. తమ్ముడూ బాగున్నారా? అవ్వా, తాతలు అందరూ బాగున్నారా? ఖండాలు దాటినా మీ ప్రేమను, మీ అభిమానాన్ని ఇక్కడ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో ఉన్నా.. నాన్న గారిని, నా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికీ జగన్ అనే నేను నిండుమనసుతో ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది మీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలతో రండి. మీ తల్లిదండ్రుల్ని, అవ్వతాతల్ని, స్నేహితుల్ని చూడ్డానికి సంవత్సరానికి కనీసం ఒకట్రెండు సార్లయినా రండి. ఆ తర్వాతే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. మీ గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్టాప్స్ మార్చాలనే ఆరాటం ఉండేవాళ్లు ముందుకు రండి. మీ సహాయంతో వాటిని పునరద్ధరిస్తాం. వాటికి మీ పేరే పెడతాం. మీకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుంది. మీతో కలిసి గ్రామాలు బాగు చేసుకుంటాం రండి. రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశాం. అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లుల్ని తీసుకొచ్చాం. గతంలో ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచాం. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాల అమలుతో పాటు.. ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాల్ని ఏడాదిలోగా ఇవ్వబోతున్నాం. వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది. అక్టోబర్ 2 నాటికి గ్రామ సెక్రటరీల్ని కూడా తీసుకొస్తాం. 3 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నాను. అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తీసుకొచ్చాం. నాకు కూడా ఓ లక్ష్యం ఉంది. నాకు కూడా ఓ కల ఉంది. మహానేత నాన్నగారి పాలన చూశాం. డాక్టర్ వైఎస్సార్ తనయుడిగా, 50 శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్న నాయకుడిగా, అన్నింటినీ మించి 3,648 కిలోమీటర్ల మేర కాలినడకన 13 జిల్లాల ఏపీలో పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేది నా డ్రీమ్. అన్నం పెట్టే రైతన్నలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదనేది నా డ్రీమ్. రాష్ట్రంలో 33 శాతం ఉన్న నిరక్షరాస్యతను (దేశంలో 26 శాతం) జీరోకు తీసుకురావాలనేది నా డ్రీమ్. పల్లెలు కళకళలాడాలని, అక్కడి స్కూల్స్, హాస్పిటల్స్ మెరుగ్గా ఉండాలనేది నా డ్రీమ్. ప్రభుత్వ పథకాలు, సేవలన్నీ లంచాల్లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలనేది నా డ్రీమ్. (చదవండి: అమెరికాలో అద్భుత స్పందన) -
అలా అయితే గ్రీన్కార్డ్ రాదు!
వాషింగ్టన్: అమెరికా గ్రీన్కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు. అలా పబ్లిక్ చార్జ్గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. -
పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు. 16–25 తేదీల మధ్య డేటా సేకరణ వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కొత్త పింఛన్, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ కొత్తగా పింఛన్లు, రేషన్కార్డుల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లకు అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు
సాక్షి, చిత్తూరు రూరల్: గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియలో కీలకమైన ఇంటర్వ్యూల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో ఉన్నత విద్యావంతులు పెద్దసంఖ్యలో పాల్గొంటుండడం గమనార్హం. అధికారులు మండల కేంద్రంలో రోజుకు 40 నుంచి 50 మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో చిత్తూరులో రెండు వారాలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వేతనం తక్కువైనా.. భవిష్యత్తుకు భరోసా లభిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలన్నింటనీ వలంటీర్ల ద్వారానే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ బియ్యం, పింఛన్లు తదితర పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. చిత్తూరు మండలంలోని గ్రామాల పరి ధిలో 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున 141 మందికి నియమించే అవకాశం ఉంది. 574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 500 దరఖాస్తులు ఆమోదం పొందాయి. పెద్దసంఖ్యలో పట్టభద్రులు.. గ్రామ వలంటీర్ ఉద్యోగానికి ప్రభుత్వం ఇంటర్మీ డియట్ను అర్హతగా నిర్ణయించింది. దీంతో చిత్తూరు మండలంలోని వలంటీరు పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకుని మౌఖిక పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో పీజీలు, డీగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 320 మంది ఉన్నారు. కాగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ప్రభుత్వం రూ. 5 వేల వేతనం అందించనుంది. పారదర్శకంగా.. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సైతం ఇంటర్వ్యూలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రజాసేవలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకే గ్రామ సేవలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇష్టంతో దరఖాస్తు చేశాను.. నేను ఎంబీఏ చేశా. చదువు పూర్తి చేసి మూడేళ్లవుతోంది. కానీ ఉద్యోగం లేదు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గుర్తించి వలంటీర్ల నియామకానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుకు కూడా పోటీ అధికంగా ఉంది. పీజీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నేను ఇష్టపడే దరఖాస్తు చేశాను. ఎంపికైతే ప్రజా సేవలో ఉంటా. – వరలక్ష్మి, శెట్టిగారిపల్లె ఉపాధి కోసం.. నేను కూడా ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుత్తం గ్రామ వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు వచ్చాను. రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం అందరికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలి. యువతకు బాసటగా నిలవాలి. ఆ దిశగా వైఎస్సార్ ప్రభుత్వం అడుగులు వేస్తుందనే నమ్మకం ఉంది. – శివకుమార్, చెర్లోపల్లి పట్టభద్రులే అధికం.. వలంటీర్ల పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 9 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇవి సజావుగా సాగుతున్నాయి. ఆదివారంతో కార్యక్రమం ముగుస్తుంది. 65 నుంచి 75 శాతం మంది పట్టభద్రులే దరఖాస్తు చేసుకున్నారు. వారంతా పోటాపోటీగా ఎంతో ఉత్సాహంతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. – వెంకటరత్నం, ఎంపీడీఓ -
అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి.. నేరుగా లబ్ధిదారులకు అందజేసి.. పారదర్శకమైన పాలన అందించాలన్న లక్ష్యంతో నూతన ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా జిల్లాలో 2వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికి ఎంతమంది ఉద్యోగులను నియమించాలి.. ఏయే శాఖల నుంచి నియమించాలి.. అన్న అంశాలపై పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్కు ఉత్తర్వులు జారీచేశారు. అందుకనుగుణంగా ఓవైపు వలంటీర్ల నియామకాలు చేపడుతూనే.. మరోవైపు కొత్త సచివాలయాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లా సమాచారం జిల్లా మొత్తం జనాభా - 41.74 లక్షలు పురుషులు- 20.90 లక్షలు మహిళలు- 20.84 లక్షలు గ్రామీణ జనాభా- 29.43 లక్షలు అర్బన్ జనాభా- 12.31 లక్షలు ఎస్సీ జనాభా- 18.82 లక్షలు ఎస్టీ జనాభా- 3.81 లక్షలు రెవెన్యూ గ్రామాలు- 1,540 గ్రామ పంచాయతీలు- 1,372 పట్టణాలు- 14 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు - 8 సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 1,372 గ్రామ పంచాయతీలున్నాయి. ఆ పంచాయతీల్లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం 2వేల మందికి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఆ విధంగా జిల్లా మొత్తం 1,096 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఒక్కో గ్రామ సచివాలయంలో పంచా యతీ కార్యదర్శి ఆధ్వర్యంలో 11 మంది ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండేచోట మరికొంతమందిని నియమించే అవకాశముందని అధికారులు అంటున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ, బాధ్యతలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పశుసంవర్థక, మహిళా, శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించనున్నారు. ఉద్యోగంలో నియమించే మొదటి రెండేళ్ల సమయం ప్రొబెషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు. కేవలం సంబంధిత శాఖల వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయాల పరిధిలో ఏపని అప్పగించినా చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి బాధ్యతలు అప్పజెబుతారు. అధునాతన నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటును అమలులోకి తీసుకురానున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజలకు సులభంగా అందజేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు ఉన్న పంచాయతీలను ఇప్పుడు కొత్తగా సచివాలయంగా ఏర్పాటుచేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలకు, సామాన్యులకు కచ్చితంగా అందుతాయి. గ్రామ సచివాలయాల్లో 8 శాఖలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల్లో 8 శాఖలను 11 మంది ఉద్యోగులను నియమించనున్నారు. 1. వ్యవసాయ శాఖ, 2. పశుసంవర్థక శాఖ, 3. రెవెన్యూ శాఖ, 4. వైద్యశాఖ, 5. ఉద్యానవన, 6. మహిళా, శిశు సంక్షేమశాఖ, 7. సంక్షేమ శాఖ, 8. పంచాయతీరాజ్ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికీ అనుసంధానకర్తగా గ్రామ వలంటీర్ వ్యవహరిస్తారు. వలంటీర్ తనకు కేటాయించిన కుటుం బాల్లో ఉన్న సమస్యలపై సచివాలయంలో ఫిర్యాదు చేస్తారు. ఈ ప్రజా సమస్యలను 72 గంటల్లో గ్రామ సచివాలయాల్లోని ఆయా శాఖల ఉద్యోగులు పరిష్కారించాల్సి ఉంటుంది. జిల్లాలో అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో చేరేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. కసరత్తు ప్రారంభించాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో గ్రామసచివాలయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాం. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఉత్తర్వులను అనుసరించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీఓలతో రెండు రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ఏయే నియమాలు పాటించాలి అనే అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. –నారాయణ భరత్గుప్త, కలెక్టర్, చిత్తూరు గ్రామ వలంటీర్ విధులు ఇవే.. జిల్లాలో గ్రామాలకు గ్రామ వలంటీర్, నగరాల్లో వార్డులకు వార్డు వలంటీర్లను నియమిస్తారు. వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నేరుగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు చేరవేయాల్సి ఉంటుంది. వలంటీర్ గ్రామ సచివాలయానికి, తనకు కేటాయించిన కుటుంబాల మధ్య వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. గౌరవవేతనంగా రూ.5 వేలను ప్రభుత్వం అందజేస్తుంది. 1. వలంటీర్ తనకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు చేరవేయాలి. 2. కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి. 3. తన పరిధిలోని కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి. 4. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలి. 5. ఉన్నతాధికారులు అప్పగించే ఇతర విధులను నిర్వహించాల్సి ఉంటుంది. 6.ప్రాథమిక సర్వే నిర్వహించడం, కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం, ప్రజల అవసరాలను, సమస్యలను తెలుసుకోవడం చేయాలి. 7. ప్రజల ఇళ్ల ముంగిటకే సేవలు అందించాలి. 8. ప్రజా సమస్యలు, వినతుల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. 9. వలంటీర్లు విధులు సరిగ్గా నిర్వహించకున్నా, పనితీరు సంతృప్తికరంగా లేకున్నా విధుల నుంచి తొలగిస్తారు. -
మహిళలకు సగం కోటా!
సాక్షి, అమరావతి: గ్రామ– వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే. వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లో పేర్కొంటారు. జూలై ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరుగుతుంది. వలంటీర్ల నియామకానికి అర్హతలు - కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి. - 18–35 ఏళ్ల మధ్య వయస్సు వారే దరఖాస్తుకు అర్హులు - ఏ గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు. - ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు. బేస్లైన్ సర్వే ఆధారంగా 50 ఇళ్ల గ్రూపుల ఏర్పాటు బేస్ లైన్ సర్వే ఆధారంగా గ్రామం, వార్డులో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది. పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, మరొక సీనియర్ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తారు. ఎంపిక విధానం.. - వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్ వార్డును ఒక యూనిట్గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. - ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది. - అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు. - వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్గా, తహసీల్దార్, ఈవోపీఆర్డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. - మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. - వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది. - ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ–వార్డు వలంటీర్ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది. వలంటీర్ల విధులు - తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి. - వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ– వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి. - తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ–వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి. - తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి. - 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి. - గ్రామ– వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. - ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి. - తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి. - తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి. -
ప్రతీ పైసా నేరుగా అందాలి
-
పథకాల నగదు లబ్ధిదారులకే అందాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ డబ్బుల్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు, డ్వాక్రా సభ్యులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. సున్నా వడ్డీ కింద లబ్ధిదారుల తరఫున చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. రుణాల వసూళ్ల విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు రావడంతో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని, రుణభారంతో కుంగిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా మారతాయన్నారు. ఈ విషయాన్ని గమనించే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, నిలదొక్కుకునేలా చూసేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నట్లు బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో రైతు వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, ఇలాంటి రైతులందరికీ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇస్తున్న ఈ సొమ్మును, ఇంతకుముందు వారికి ఉన్న అప్పులకు జమ చేసే వీలే ఉండకూడదని బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రైతు భరోసా కింద గానీ, నవరత్నాల్లో భాగంగా అమలు చేయబోతున్న మరే సంక్షేమ పథకాల్లో గానీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే నగదును జమ చేసుకోవడానికి వీల్లేని విధంగా ఖాతాలను తెరవాలని స్పష్టం చేశారు. ప్రతీ పైసా నేరుగా అందాలి అలాగే రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉందన్నారు. ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే ‘అమ్మ ఒడి’ కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నిజంగా ఈ రుణ మొత్తం ఇస్తున్నారా? ఎస్ఎల్బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు పెరుగుతున్నట్టు చూపిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీషెడ్యూల్ చేయడం వల్ల పెరుగుతున్నాయా అంటూ బ్యాంకర్లను ప్రశ్నించారు. కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడం వల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంగీకరించారు. దీనివల్ల రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడకుండా మరింత అప్పుల పాలైనట్లు ఎస్ఎల్బీసీ సమావేశంలో తేలింది. గత ప్రభుత్వం సున్నా వడ్డీ కోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా అని సీఎం ఆరా తీయగా బ్యాంకర్ల నుంచి లేదన్న సమాధానం వచ్చింది. రైతులకు సున్నా వడ్డీ లభించకపోవడం, రుణమాఫీ రూ.87,612 కోట్లు చేస్తానని చెప్పి చివరకు రూ.15 వేల కోట్లు కూడా చేయకపోవడంతో రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని పాదయాత్రలో స్వయంగా చూసినట్లు సీఎం తెలిపారు. రూ.87,612 కోట్ల రుణాల మీద ఏటా రైతులు రూ.7 వేల నుంచి 8 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయలేదని, దీనివల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. శనగ రైతులకు ప్రభుత్వ అండ రాయలసీమలో ఎక్కువగా శనగ రైతులు మద్దతు ధర సమస్యను ఎదుర్కొంటున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చేతికొచ్చిన పంటకు తగు మద్దతు ధర రానప్పుడు కలిగే రుణ భారం నుంచి ఉపశమనం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ధర పడిపోయినందున సరకుపై రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సరకు వేలంను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకర్లను కోరారు. అప్పటికీ ధర రాకపోతే శనగ రైతులకు క్వింటాల్కు రూ.1700 ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేసి ఆదుకుంటుందని ప్రకటించారు. బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు జె.పకీరస్వామి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ శుభ్రత్ దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.శెల్వరాజ్ పాల్గొన్నారు. 2019-20 పంట రుణాల లక్ష్యం.. రూ.1,15,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం వల్ల రైతులకు లాభం జరగకపోగా వారు మరింతగా అప్పులు పాలయ్యారని స్పష్టమైంది. 2014, మార్చి 31 నాటికి రూ.87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 2019, మార్చి 31 నాటికి అంటే ఐదేళ్ల తర్వాత రూ.1,49,264 కోట్లకు పెరిగాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడంతో 2014, మార్చి 31న రూ.14,204 కోట్లు ఉంటే, 2019, మార్చి 31న అవి రూ.27,451 కోట్లకు పెరిగాయి. 2018–19లో మొత్తంగా రూ.1,01,564 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయిస్తే రూ.1,06,560 కోట్లు రైతులకు అందించామని, 2019–20లో రూ.1,15,000 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచింది. ఇందులో స్పల్పకాలిక పంట రుణాల కింద రూ.84,000 కోట్లు, టర్మ్ రుణాలు రూ.24,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యంలో రూ.8,400 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర రంగాల రుణాలను కూడా కలుపుకుంటే 2019–20 సంవత్సరానికి మొత్తం రూ.2,29,200 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. -
టీడీపీ సేవలో సీఎంఓ!
‘మీ విభాగంలో గత ఐదేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేర్లతో సహా మొత్తం వివరాలు సాఫ్ట్ కాపీలో పెట్టి పంపండి. ఎవరెవరికి ఏమేం లబ్ధిచేశామో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఫలానావి చేస్తామంటూ సీఎం చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతి లబ్ధిదారునికి లేఖలు తయారుచేసి సమాచార పౌరసంబంధాల శాఖ/రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్)కు పంపిం చండి. గత ఐదేళ్లలో మీ శాఖ/ విభాగం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలపై రెండు నుంచి నాలుగు పేజీలతో బుక్లెట్స్/ కరపత్రాలు తక్షణమే రూపొందించి పంపండి’. – సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసే అన్ని శాఖలకు సీఎంఓ మౌఖిక ఆదేశాలు లబ్ధిదారులకు పంపేందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన లేఖలు, ప్రచారం కోసం వచ్చిన సమాచారంతో చక్కటి డిజైన్లు, ఫొటోలతో కరప త్రాలు, బుక్లెట్లను రూపొందించండి. వాటిని పెద్దఎత్తున ముద్రించి విస్తృత ప్రచారానికి రూపకల్పన చేయండి. టీడీపీకి అనుకూలంగా విజువల్ మీడియాలో ప్రచారానికి మంచి డిజైన్లతో వీడియోలు, ప్రకటనలు కూడా రూపొందించండి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వినియోగించుకోండి. సమయం ఎక్కువ లేనందున త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. – సమాచార పౌర సంబంధాల శాఖ, ఆర్టీజీఎస్కు సీఎంఓ మౌఖిక సందేశం సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఈ ఆదేశాలతో అన్ని సంక్షేమ శాఖల కార్యాలయాల్లో రోజువారీ కార్యక్రమాలు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. వివిధ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల సమర్పణ, సందేహ నివృత్తి కోసం వచ్చే లబ్ధిదారులతో కనీసం మాట్లాడకుండానే సిబ్బంది వారిని వెనక్కు పంపుతున్నారు. ‘తన దరఖాస్తులో చిన్న తప్పు ఉందని, దానిని సవరించాలని ప్రసాదరావు అనే ఓ నిరుపేద విద్యార్థి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి ఇటీవల వెళ్లగా.. ‘నెట్ పనిచేయడంలేదు. నాలుగు రోజుల తర్వాత రండి’.. అని తిప్పి పంపారు. ఆయన అక్కడే తనకు తెలిసిన ఉద్యోగి దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే.. ‘సీఎంఓ ముఖ్యమైన సమాచారం అడిగింది. అందువల్ల అందరూ ఆ పనిలో ఉన్నారు. ఇతర పనులేవీ చూడరు. నాలుగు రోజుల తర్వాత వస్తే మాట్లాడతా..’ అని చెప్పి పంపించారు. ఇది ఒక్క ప్రసాదరావు పరిస్థితే కాదు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. ముందు నుయ్యి.. వెనక గొయ్యి ఇదే విషయమై ఒక ఐఏఎస్ అధికారి వద్ద ప్రస్తావించగా.. ‘ఏం చేస్తాం. మేం అశక్తులుగా మారాం. కార్యాలయాలకు వచ్చిన వారి సమస్యలు తీర్చాల్సిందిపోయి టీడీపీ సేవలో తరించాల్సి వస్తోంది. ఐదేళ్లలో ఏయే పథకాల కింద ఎంతమంది లబ్ధిపొందారో గణాంకాలు చెప్పమంటే చెప్పగలం కానీ.. ఎవరెవరు ఎంతెంత ప్రయోజనం పొందారో పేర్లతో సహా ఇవ్వాలంటే పాత డేటా అంతా వెతకాలి. కంప్యూటర్లలో ఉన్నా అంతా ఇంగ్లిష్లోనే ఉంటుంది. సీఎంఓ వారు తెలుగులో పంపాలని ఆదేశించారు. దీనిని ట్రాన్స్లేట్ చేయాలి. సిబ్బంది కొరతతో ఇప్పటికే అల్లాడుతుంటే ఇప్పుడు ఈ సంబంధంలేని పని పెట్టారు. మా పరిస్థితి ముందు గొయ్యి.. వెనక నుయ్యి అన్నట్లుగా ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి బరితెగింపు ఎన్నడూ చూడలేదు ‘అధికార పార్టీకి సీఎంఓ అధికారులు అనుకూలంగా ఉండటం సహజమే. అయితే, ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకునేంత బరితెగింపు గతంలో ఎన్నడూలేదు. ఆర్టీజీఎస్లో కొంతమంది కన్సల్టెంట్లు కూర్చుని ప్రచార సామగ్రికి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పట్లా ప్రభుత్వ ఆఫీసులను ప్రైవేటు సంస్థలుగా, అధికార పార్టీ ప్రచార కార్యాలయాలుగా మార్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు’.. అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. సర్కారు సొమ్ముతో టీడీపీ ప్రచారమా!? ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పేరు, ఫొటోతో ప్రభుత్వం లేఖలు పంపించరాదు. ఇలా పంపడం ఎన్నికల నిబంధనావళిని తుంగలో తొక్కడమే. అయితే, సీఎంఓ మౌఖిక ఆదేశాల మేరకు ఈ ఐదేళ్లల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారికి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలతో కూడిన లేఖలను ఇంటింటికీ పంచుతున్నారు. దీనిని అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
‘‘పచ్చ’’ ఇసుకాసురులు
సాక్షి, వెల్దుర్తి: మండలంలో టీడీపీ నాయకుల సహజవనరుల యధేచ్ఛ దోపిడి ఆ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కిన కాలం నుంచి కొనసాగుతోంది. అరికట్టాల్సిన అధికారులు అధికారం మందు తలవంచేశారు. మండల పరిధిలోని టీడీపీ నాయకుడు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు చెరుకులపాడు, కొసనాపల్లె గ్రామాల పరిధిలోని పాలహంద్రీలో, నార్లాపురం, బొమ్మిరెడ్డిపల్లె, మల్లెపల్లె వంకల్లోని ఇసుక రవాణాను ఐదేళ్లుగా తన అనుచర, బంధు గణంతో చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తినట్లు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్గౌడ్ స్థానిక ఈరన్న గట్టు కొండను కరిగిస్తూ గ్రావెల్ అక్రమ తరలింపులో రికార్డు కెక్కాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఎర్ర చెరువు పూడిక మట్టిని ఉలిందకొండ ఇటుకల బట్టీలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక, గ్రావెల్, పూడిక మట్టి తరలింపులో ఈ నాయకులు పాత్రధారులు కాగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు, ఎంఎల్సీ కేఈ ప్రభాకర్ సూత్రధారులనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలు, పర్సెంటేజీలతో పాటు సహజవనరులను కొల్లగొట్టి టీడీపీ నాయకులు బాగానే సంపాదించారని, ఈ దఫా ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసి నియోజకవర్గంలో గెలుపు సాధించాలనే దిశగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మట్టిని కూడా వదలడంలేదు టీడీపీ నాయకులు ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలతో పాటు కొండ మట్టి, చెరువు మట్టిని కూడా వదలడం లేదు. మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్గౌడ్ ఇదే తరహాలో అక్రమంగా రూ.లక్షలు కూడబెట్టుకుంటున్నాడు. డబ్బే ప్రధానమైన ఇతను ప్రజలకు, రైతులకు అవసరమయ్యే మట్టిని వ్యాపారులకు తరలింపజేస్తూ అన్యాయం చేస్తున్నాడు. ఇలాంటి వారు నేడు తమ పార్టీకి ఓటేయాలని అడిగితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. – వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ వెంకట్నాయుడు, వెల్దుర్తి ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు మా గ్రామ, కొసనాపల్లె, బొమ్మిరెడ్డిపల్లె ఇలా ఏ వంక, వాగు, హంద్రీలలోనైనా ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు. ఈ మాఫియా చెరుకులపాడు నారాయణరెడ్డిని సైతం బలిగొన్నది. ఈ మాఫియాకు పాత్రధారులు, సూత్రధారులు అందరూ బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు అనుచరులు, డిప్యూటీ సీఎం కుటుంబీకులే. రూ.కోట్ల సంపాదనతోనే నేడు ఎన్నికలలో ఓట్లను కొనేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నది వాస్తవం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. – శివ, చెరుకులపాడు -
రేషన్కార్డులు లేక..పథకాలకు నోచుకోక
సాక్షి, చీపురుపల్లి రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్కార్డు ఎంతో అవసరం. అలాంటి రేషన్కార్డు లేకపోతే ప్రభుత్వం ప్రతీ నెలా అందజేస్తున్న రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా దూరమవ్వాల్సిందే. ఇది ఏ ఒక్క రూ కాదనలేని నిజం. ప్రజలకు ఏవేవో చేసేశాం, ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్కార్డులను మంజూరు చేయడంలో ఎంతో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేందుకు పీకే పాలవలస ఒక ఉదాహరణ. ఈ గ్రామానికి చెందిన గవిడి గొల్లబాబు గత మూడున్నర ఏళ్లుగా రేషన్కార్డు కోసం దరఖాస్తు చేస్తునే ఉన్నాడు. కొత్త రేషన్కార్డు రావాలంటే భార్య, భర్తల పేర్లు ఏ ఒక్క కార్డులో కూడా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో కొత్త కార్డు వస్తుందనే ఆశతో తల్లిదండ్రుల కార్డులో ఉన్న పేరును గొల్లబాబు తొలగించాడు. అదే విధంగా భార్య పేరును కూ డా ఆమె తల్లిదండ్రుల కార్డులో నుంచి తొలగించా డు. ప్రతీ జన్మభూమి సభలో దరఖాస్తు చేసుకోవడమే తప్ప రేషన్కార్డు మాత్రం రావడం లేదు. దీంతో భార్య, భర్తలతో పాటుగా పిల్లలు సైతం ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఇది ఈ ఒక్కడి సమస్య కాదు నియోజకవర్గంలోని వందలాది మంది సమస్య. రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. కార్డులు లేక పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ప్రయోజనం లేని జన్మభూమి సభలు ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన జన్మభూమిలో వందల సంఖ్యలో రేషన్కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరైన దాఖలా లు లేవు. గత నాలుగేళ్లుగా జరిగిన జన్మభూమి సభల్లో కూడా వందల సంఖ్యలో రేషన్కార్డులు దరఖాస్తు చేస్తే పదుల సంఖ్యలో మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులందరికీ నిరాశ తప్పడం లేదు. పేద ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఈ ఒక్క రేషన్ కార్డు విషయంలోనే స్పష్టమవుతోందని పలువురు మండిపడుతున్నారు. 55 మంది ఎదురు చూపు మండలంలోని ఒక్క పీకే పాలవలస గ్రామంలోనే 55 మంది అర్హులు రేషన్కార్డుల కోసం ప్రతీ సారి దరఖాస్తు చేసుకొని మోసపోతున్నారు. గ్రామానికి విచ్చేసిన రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను నిలదీస్తే మేమేమీ చేయలేం, మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని స్థానిక విలేకర్లతో తమ గోడు చెప్పుకుంటున్నారు. రేషన్కార్డు కోసం 1100కి ఎప్పుడు ఫోన్ చేసినా, ప్రోసెస్లో ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ గ్రీవెన్సెల్లో కూడా ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఏ ఒక్క అధికా రి కూడా గ్రామంలోకి రాలేదని వారు వాపోతున్నారు. రెండోసారి గ్రీవెన్సెల్లో అడిగితే మండ ల రెవెన్యూ అధికారులకు వివరాలంతా పంపిం చామని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావిస్తే కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. -
కేంద్ర పథకాలపై సర్వే..!
నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మున్సిపల్ పట్టణాల్లో ‘సహరి సమృద్ధి యోజన’ సర్వే చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు సర్వే చేపట్టి పూర్తి నివేదిక తయారు చేయాలని మెప్మా అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర పథకాల సర్వేపై ఇప్పటికే రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు అవగాహన కల్పించారు. అన్ని పట్టణాల్లో కచ్చితమైన నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఇవి క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయనే సంక్షిప్త సమాచారం సేకరించే పనిలో మెప్మా సిబ్బంది పడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వాటిలో 23 పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లబ్ధిదారుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. పొదుపు సంఘాల మహిళల్లో ఈ పథకాలు ఎంతమందికి అందుతున్నాయనే వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి సీడీఎంఏ అధికారులకు పంపించాల్సి ఉంది. ఎంత మందికి పథకాలు అందాయి ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంతమంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు ... జన్ధన్ యోజనలో బ్యాంకు ఖాతాలు అందరూ తీసుకున్నారా ... ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజనలో ఎంతమంది చేరారు ... ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎంత మందికి గ్యాస్ కనెక్షన్లు అందాయి ... అటల్ పెన్షన్ యోజన, జాతీయ నూట్రిషన్ మిషన్ తదితర పథకాలపై పొదుపు సంఘాల మహిళలనుంచి వివరాలు తీసుకుంటారు. ఎంతమంది ఈ పథకాలను వినియోగించుకుంటున్నారు, ఇంకా ఎంతమందికి ఈ పథకాలు చేరాలి, అర్హులైన వారుంటే ఈ పథకాలు ఎందుకు చేరడం లేదు, పొదుపు సంఘాల సభ్యులందరికీ ఈ పథకాలు చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు నమోదు ... జిల్లాలోని పాత మున్సిపాలిటీలు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ తో పాటు కొత్త మున్సిపాలిటీలైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలలో ఈ సర్వే చేపడుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆర్పీల ద్వారా కేంద్ర పథకాల లబ్ధిదారుల పేర్లను ఓ ఫార్మట్లో నమోదు చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత పథకాలు అందని వారి వివరాలతో ప్రత్యేకం జాబితా తయారు చేస్తారు. కేంద్ర పథకాలలో ఎక్కువ శాతం పథకాలు బ్యాంకులతో సంబంధించినవి కావడంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు ఈ జాబితాలు అందజేస్తారు. ప్రతి మున్సిపల్ కమిషనర్ బ్యాంకర్లతో సమావేశమై లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, జీరో బ్యాంకు ఖాతాలు, బీమా యోజన, పెన్షన్ తదితర వాటిని అమలు చేయించాల్సి ఉంటుంది. అదే విధంగా మున్సిపల్ పట్టణాల్లో మురుగుదొడ్లు లేని వారికి సత్వరమే స్వచ్ఛభారత్ కింద మంజూరు చేసి నిర్మాణం చేసేందుకు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. 15 వరకు సర్వే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై మున్సిపాలిటీ పట్టణాల్లో సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాశాం. ఈనెల 15 వరకు ప్రొఫార్మాలో సూచించిన ప్రకారం వివరాలు సేకరించాలి. సర్వే పూర్తికాగానే పూర్తి నివేదికను సీడీఎంఏకు పంపిస్తాం. – వెంకన్న, మెప్మా పీడీ, నల్లగొండ -
కేసీఆర్ పథకాలను బాబు కాపీ కొడుతున్నారు
హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శిం చారు. కేసీఆర్ చేసినవన్నీ తాను కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే భ్రమలో బాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబు చేసే పనుల్లో చిత్తశుద్ధి ఉండదన్నారు. ఏపీ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైనవారు, చైతన్యవంతులని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. నాంపల్లి పబ్లిక్గార్డెన్స్లో బుధవారం తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంస్థ ఆధ్వర్యం లో జరిగిన ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అభినందన సత్కార సభకు కేటీఆర్ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే అందులో తెలంగాణ వార్తలు ఉండవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనిపించవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను అక్కడున్న ఓ వ్యక్తిని అడిగితే.. అది ఆంధ్రా ఎడిషన్ అని చెప్పిండని, మరి ఆంధ్ర ఎడిషన్లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణ ఎడిషన్లో ఆంధ్రా వార్తలు ఎందుకని నిలదీశారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు న్యాయపరమైన చిక్కులు, వివాదాలు రాకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే హెల్త్కార్డులను కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టులను సంస్థాగతంగా గౌరవించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయిం చేందుకు సీఎంతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ... జర్నలిస్టులు ఎవరూ అధైర్యపడవద్దని, దశలవారీగా సమస్యలను పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. మీడియా అకాడమీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ భూమి పూజకు హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిలతో పాటుగా పలువురు సంపాదకులు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నేతలు పాల్గొన్నారు. -
ఇదేం ఆదరణ?
ఒంగోలు టూటౌన్: జరుగుమల్లి కొండలరావు నాయిబ్రాహ్మణ యువకుడు. ఈయన గత 15 ఏళ్లకు పైగా ఒంగోలు సంతపేటలో వెంగమాంబ సెలూన్ షాపు పెట్టుకోని జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం–2 కింద మీసేవలో హెయిర్ కటింగ్ సెలూన్ చైర్కు దరఖాస్తు చేసుకున్నాడు. యూనిట్ విలువ రూ.19,500 కాగా లబ్ధిదారుని వాటాగా రూ.1850 చెల్లించారు. ఇటీవల ప్రభుత్వం ఆదరణ పథకం కింద కొండలరావుకు సెలూన్ చైర్ను అందించారు. కానీ, అది ఒక్క రోజు కూడా పని చేయలేదని, నాసిరకం కుర్చీ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరణ పథకం కింద మంజూరు చేసిన నాసిరకం వస్తువులలో ఇది ఒకటిగా బయటపడింది. ఇలా తీసుకున్న వివిధ రకాల పరికరాల్లో అధిక శాతం నాసిరకంగానే ఉన్నాయని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఆదరణ పథకం కింద ఇటీవల మంజూరు చేసిన నసిరకం పరికరాలపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందించిన పరికరాలు 70 శాతానికిపైగా ఒక్క రోజు కూడాపనిచేయలేదని మండిపడుతున్నారు. నాసిరకం కంపెనీల పరికరాలు అంటగట్టి తీవ్ర వేదన మిగిల్చారని నిరాశే వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదరణ పథకం–2 కింద 2018–19 ఆర్థిక సంవత్సరాలంలో చేతి వృత్తిదారులైన వెనుకబడిన తరగతుల (బీసీలకు) వివిధ పరికరాలు అందించాలని నిర్ణయించింది. మొత్తం 12,710 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 వేల యూనిట్ల నుంచి రూ.30 వేల విలువైన యూనిట్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 90 శాతం సబ్సిడీ కాగా 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. మొత్తం రూ.35.13 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం కింద ఒకసారి రుణం తీసుకుంటే మరో పథకం కింద రుణం తీసుకునే వీలులేదన్న నిబంధనలతో బీసీలు దరఖాస్తుచేసుకోకుండా వెనుకంజ వేశారు. సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే నిబంధనలను సడలించారు. దరఖాస్తు చేసుకునే గడువు కూడా పొడిగించారు. దాదాపు 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడతలుగా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. తొలివిడతగా 5,176 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నవంబర్ 12న జిల్లాలో మెగా రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రితోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గోని బీసీలతో పాటు ఇతర కార్పొరేషన్ల లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను పంపిణీ చేశారు. బీసీలకయితే సన్నాయి, డోలు, హర్మోనియం, ఇస్త్రీ పెట్టెలు ఇలా పలు రకాల వస్తువులను కొద్దిమందికి అందించి చేతులు దులుపుకున్నారు. రుణమేళా విజయవంతమయిందని సంబర పడ్డారు. వస్తువులను వెనక్కు తీసుకున్న అధికారులు.. రుణమేళాలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొన్ని పరికరాలను వెనక్కు తీసుకున్నట్లు సభ దగ్గరే చర్చలు మొదలయ్యాయి. కేవలం పబ్లిసిటీ కోసమే కొన్ని పరికరాలను తేవడం జరిగిందని, తిరిగి వాటిని తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తరువాత మీ పరికరాలను పిలిచి ఇవ్వడం జరుగుతుందని లబ్ధిదారులను అక్కడ నుంచి పంపించడంతో చాలా మంది నిరాశేతో వెనుదిరగాల్సి వచ్చింది. అందులో భాగంగానే వెంగమాంబ సెలూన్ షాపు యజమాని జరుగుమల్లి కొండలరావుని ఒంగోలులోని మార్కెట్ యార్డుకు పిలిపించి హెయిర్ కటింగ్ చైర్ను అందించారు. తీసుకున్న వస్తువు తొలిరోజు నుంచే పనిచేయలేదని లబ్ధిదారుడు æపనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ చుట్టు ప్రదక్షిణలు.. లబ్ధిదారుడు కొండలరావు తనకు జరిగిన అన్యాయంపై బీసీ కార్పొరేషన్ చుట్టూ పలుమార్లు తిరిగాడు. తనకు ఇచ్చిన చైర్ (కుర్చీ) విషయాన్ని విన్నవించాడు. రేపు చూద్దాం.. మాపు చూద్ధాం అంటూ నేటికి సమస్య పరిష్కరించలేదని బాధితుడు వాపోయాడు. ఒకాయన మరీ వెటకారంగా ‘సీఎం దగ్గరకు వెళ్లు ఆయన కొత్త చైర్ ఇస్తాడు’ అంటూ మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తనకు మంజూరు చేసిన కుర్చీపై కంపెనీ పేరు, ఊరు, ఇలా ఎలాంటి అడ్రస్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. తనలాగా చాలమంది లబ్ధిదారులకు అందించిన వస్తువులు చాలా వరకు నాసిరకమైనవేనని తెలిపారు. ఈ విషయాన్ని చెప్పుకోలేక చాలా మంది వదిలేశారని తెలిపారు. 10 ఏళ్ళ నాటి కుర్చిలు నేటికీ చెక్కు చెదరలేదు బాధితుడు జరుగుమల్లి కొండలరావు పదేళ్లకు ముందు కొన్న చైర్లు నేటికి చెక్కు చెదరలేదని తాను షాపు ప్రారంభించిన నాడు కొన్న సెలూన్ చైర్లను చూపించాడు. ఒరిజినల్ కంపెనీ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన చైర్ ఒక్క రోజకే విరిగిపోయిందన్నాడు. అన్ని నాసిరకం వస్తువులే.. ప్రభుత్వం ఆదరణ పథకం కింద అందిస్తున్న వస్తువులన్నీ నాసిరకం వస్తువులేనని బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంకా చిరంజీవి తెలిపారు. కేవలం నాలుగు వేలు కూడా చేయని చైర్లను రూ.19,500 కొనుగోలు చేసి బీసీలకు అంటగడుతున్నారని మండిపడ్డారు. పైగా ఈ డబ్బులు మూడేళ్ల నాడు కేంద్రం రూ.150 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచుకోని, దానిపై వచ్చే వడ్డీతో నాసిరకం వస్తువులు కొనుగోలుచేసి బీసీలను ఆదుకుంటున్నామని చెప్పడం దుర్మార్గామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నయూనిట్ విలువ రూ.30 వేలకు మరో రూ. 20 వేలు కలిపి మొత్తం రూ.50 వేలుగా లబ్ధిదారునికి మంజూరు చేస్తే సొంతంగా తనకు కావాల్సిన వస్తువులను లబ్ధిదారులే కొనుగోలు చేసుకుంటారని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆ కుటుంబానికి సీఎం క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం భర్త ఫోటోను మార్చి వేరొకరి ఫోటోతో ఓ మహిళ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి డి.కె.అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా భర్త ఫోటో మారి పత్రికల్లో ప్రచురితమయిన కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నాయకుల పద్మావతి కుటుంబంతో కలసి అరుణ గురువారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయికైనా దిగజారుతుందనేందుకు ఇది తార్కాణమన్నారు. రుణాలిస్తామని ఫోటోలు తీసుకెళ్లి వాటిని సంబంధం లేని అనేక పథకాల్లో ఉపయోగించడం దారుణమన్నారు. సెంటు భూమి లేని ఈ కుటుంబానికి రైతుబంధు కింద మేలు కలిగిందని, రైతు బీమా వచ్చిందని చెప్తూ పచ్చి అబద్ధాలను ప్రభుత్వం ఎలా ప్రచారం చేసుకుంటుందో గమనించాలన్నారు. తన భర్త స్థానంలో వేరొక వ్యక్తిని మార్చి పత్రికల్లో ప్రచురించడం భారత స్త్రీకి జరిగిన ఘోరమైన అవమానంగా భావించాలన్నారు. పద్మను మానసిక క్షోభకు గురిచేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, యాడ్ ఏజెన్సీపై చర్యలతో సరి అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని, రైతు బంధు, రైతుబీమాతో పాటు అన్ని ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.అలాగే టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసానికి పరాకాష్టే ఈ ఘటన అని అన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం తమను ఆశ్రయించిందని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. గోడు వెళ్లబోసుకున్న పద్మ దంపతులు విలేకరుల సమావేశంలో పాల్గొన్న పద్మ దంపతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఈ ఫోటోలు తీసుకుని వెళ్లారని చెప్పారు. పద్మ మాట్లాడుతూ గుడుంబా తాగని తన భర్త ఫోటో పెట్టి అప్పుడు పరువుతీశారని, ఇప్పుడు తన పక్కన మరో వ్యక్తి ఫోటో పెట్టి పరువు తీసి రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతమయ్యారు.ప్రభుత్వ రుణాలు వస్తాయని చెప్పి ఫోటోలు తీశారని చెప్పారు. నాగరాజు మాట్లాడుతూ తన భార్య పక్కన ఇంకో వ్యక్తి ఫోటో పెట్టి ప్రకటనల్లో ప్రచురించడంతో తనకు అవమానకరమన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్..!
చండీగఢ్ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్, వికలాంగ ఫింఛన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధ లైసెన్స్లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది. ఇంకా ఖట్టర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్టీజింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్టీజింగ్ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. -
అభివృద్ధిలో ముందున్నాం...!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని, దీంతో అభివృద్ధి పనుల్లో జిల్లా ముందంజలో ఉందని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఎంపీ అధ్యక్షతన కటెక్టరేట్లోని ప్రగతిభవన్లో జిల్లా డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత సమీక్షల్లో చర్చకు వచ్చిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో యాక్షన్ టేకెన్ రిపోర్టును ఎంపీ అడిగి తెలుసుకున్నారు. మొదటగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చ జరిగింది. ఎంపీ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని డీఆర్డీఓను ఆదేశించారు. అలాగే సామాజిక తనిఖీల్లో బయటపడిన రూ.358 కోట్లలో కేవలం ఇప్పటి వరకు రూ.155 కోట్లు మాత్రమే రికవరీ చేశారని, ఇంకా రూ.203 కోట్లు రికవరీ చేయాల్సి ఉందన్నారు. గ్రామాల్లో 1,622 సీసీ రోడ్ల పనులకు గాను రూ.88 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ఒక్కోదానికి రూ.2 లక్షల వరకు వెచ్చించిన నిర్మిస్తున్న కిచెన్ షెడ్లు 77 ప్రోగ్రెస్లో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది హరితహారంలో వెదురు మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, జిల్లాలో ఐదెకరాల్లో ఈ మొక్కలను నాటడం ద్వారా సంబంధిత వృత్తిదారులకు ఉపాధి కల్పించినట్లుగా ఉంటుందన్నారు. డ్వామా ఆధ్వర్యంలో 45 నర్సరీల్లో 40 లక్షల టేకు మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లాకు మంజూరైన వైకుంఠధామాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. వితంతు పెన్షన్ రావడం లేదని చాలా మంది వస్తున్నారని, ఎందుకు వారికి మంజూరు కావడం లేదో కారణాలు తెలుపాలని డీఆర్డీఓకు సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లబ్ధిరులకు అందడంలో ఎదురవుతున్న చిన్నపాటి అడ్డంకులను తొలగించి ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. మూడు పీహెచ్సీల్లో షెడ్ల నిర్మాణం పీహెచ్సీలకు వచ్చే రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం డిచ్పల్లి, బాల్కొండ, నవీపేట్ పీహెచ్సీల్లో షెడ్ల నిర్మాణానికి రూ.17లక్షల చొప్పున మొత్తం రూ. 51 లక్షలను ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరు చేస్తున్నట్లు ఎంపీ కవిత సమావేశంలో ప్రకటించారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలతో పాటు సౌకర్యాలు కల్పించడానికి చర్య లు తీసుకుంటున్నామన్నారు. భగీరథ ఏజెన్సీపై సీరియస్... జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై చర్చ జరుగుతున్న సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేల బిగాల గణేష్ గుప్తా నగరంలో జరుగుతున్న పనుల జాప్యతపై ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తున్నందున నగరంలో ముందుగా భగీరథ పనులు పూర్తి చేసి నగరాన్ని దాటించాలని గత రెండు సమావేశాలతో పాటు ఏడాది కాలంగా చాలా సార్లు చెప్పినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారని వాపోయారు. తద్వారా చాల సమస్యలు ఎదురవుతున్నాయని, వేసిన రోడ్లను మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎంపీ కవిత... సంబంధిత ఏజెన్సీ దారులను పిలిచి పనులు చేస్తారా..? లేదా..? అనే విషయం గట్టిగా నిలదీయాలని కలెక్టర్ రామ్మోహన్ రావును ఆదేశించారు. పనులు చేయకపోతే ఏజెన్సీని తొలగించి వేరే వారిని నియమించుకోవడానికి కూడా వెనుకాడవద్దని సూచించారు. జిల్లాలో పసుపు సెల్ ఏర్పాటు... జిల్లాకు పసుపు బోర్డు కోసం ప్రయత్నించగా జాతీ య కామర్స్ డిపార్ట్మెంట్ ఇవ్వలేమని చెప్పిందని, అయితే జిల్లాలో పసుపు సెల్ ఏర్పాటుకు ఆ శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు ఎంపీ వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, సుధాకర్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జేసీ రవీందర్ రెడ్డి, దిశా కమిటీ సభ్యులు ఎంపీపీలు, సర్పంచ్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘సర్వే’ షాకులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలకు ప్రజాసాధికార సర్వేలో వివరాల నమోదును తప్పనిసరి చేయటంతో పలువురు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్యూమరేటర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 2016 జూలైలో ప్రజాసాధికార సర్వేను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, ఫించన్లు, పేదల ఇళ్లు, డ్వాక్రా రుణాలు తదితరాలు పొందేందుకు వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఎన్యూమరేటర్లు వచ్చిన సమయంలో కొంత మంది ఇంట్లో లేకపోవడంతో సర్వేలో పేర్లను నమోదు చేయలేదు. మరికొన్ని చోట్ల ఎన్యూమరేటర్లే వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. సర్వేలో పేర్లు నమోదు కానివారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. పట్టణాల్లో ప్రజల తిప్పలు మున్సిపల్ కార్యాలయాల సర్కిళ్లు, డివిజన్ కార్యాలయాల వద్ద ఒకరిద్దరు మాత్రమే ఎన్యూమరేటర్లు అందుబాటులో ఉండటంతో పట్టణాల్లో వివరాలు నమోదు కోసం వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులు కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లకు నెట్ కనెక్షన్ సరిగా ఉండక వివరాలు నమోదు కావటం లేదు. ఫించన్లకూ సర్వేతో లంకె సర్వే సమాచారం అసంపూర్తిగా ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవని అధికారులు చెబుతున్నారు. సర్వే జరిగిన తర్వాత జనన, మరణాల కారణంగా తేడా వచ్చినా అసంపూర్తి సర్వేగానే పరిగణిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదిక ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఫించన్లకు కూడా సర్వే వివరాలతో ముడిపెట్టటంతో పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 4.35 కోట్ల మంది వివరాల నమోదు ప్రజాసాధికార సర్వే పూర్తయిందని, 4,35,19,037 మంది పేర్లను నమోదు చేసుకున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామాల్లో 3,19,85,700 మంది, పట్టణాల్లో 1,15,33,337 మంది సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వేలో ఇంకా నమోదు చేయించుకోని వారు మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వాలని సూచించారు. చనిపోయిన వారి వివరాలూ నమోదు చేయాలట నా భర్త రంగారావు ఏడాది క్రితం చనిపోయాడు. కొత్తగా మంజూరైన రేషన్కార్డు తీసుకునేందుకు వెళ్తే ప్రజాసాధికార సర్వే వివరాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. భర్త చనిపోయిన విషయాన్ని సాధికార సర్వేలో నమోదు చేయించాలన్నారు. సత్యనారాయణపురం సర్కిల్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగి ఎన్యూమరేటర్ వద్ద వివరాలు నమోదు చేయించుకున్నా. నవనిర్మాణ దీక్ష అంటూ అధికారులు ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. ఇక కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో? – నారాయణమ్మ (సింగ్నగర్, విజయవాడ) -
కేంద్రమంత్రిపై ఐఏఎస్ల గుర్రు
భువనేశ్వర్: పెట్రోలియం, సహజవనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదంలో చిక్కుకున్నారు. భువనేశ్వర్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన్ ఐఏఎస్ అధికారులతో పాటు ఒడిశా ఐటీ కార్యదర్శి అశోక్ మీనాను విమర్శించారు. దీంతో మంత్రి వ్యవహారశైలిపై మండిపడ్డ ఒడిశా ఐఏఎస్ అధికారుల సంఘం.. ముఖ్యమంత్రి పట్నాయక్ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఐటీ మంత్రి రవిశంకర్, ప్రధాన్లు భువనేశ్వర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రజలకోసం కేంద్రం అమలుచేస్తున్న పథకాలను ఒడిశాలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా రంగుపులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఓఏఎస్) అధికారులదే కీలకపాత్ర’ అని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్ర పథకాలను అమలు చేయడం అసాధ్యం. అంతమాత్రాన సోషల్మీడియాలో ఒకరి(కేంద్రం) పేరుకు బదులు మరొకరి(రాష్ట్రం) పేరును చేర్చడం సరికాదు. మీనాజీ.. ఇలాంటి పనుల్ని ఇకపై చేయకండి’ అని ప్రధాన్ అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మీనా పేరును ప్రధాన్ మూడుసార్లు ప్రస్తావించారు. కాగా, ఓ ఐఏఎస్ అధికారిని మంత్రి లక్ష్యంగా చేసుకోవడంపై తమ నిరసన తెలియజేసినట్లు ఐఏఎస్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ దేవ్ తెలిపారు. ప్రధాన్ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువల్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. -
15వ ఆర్థికసంఘం నిర్ణయాలపై చంద్రబాబు ఆసంతృప్తి
-
ప్రగతిశీల రాష్ట్రాలకు చేటు
సాక్షి, అమరావతి: ‘‘2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం ప్రకటించడం దారుణం. దీనివల్ల దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం చేయడమే అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని పూర్తిగా మటుమాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘క్షేత్రస్థాయి పర్యటనలు, పల్లె నిద్రల ద్వారా ప్రత్యక్షంగా జనంతో మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాలు అధికారులకు తెలుస్తాయి. అందుకే పర్యటనలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 47 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. మరో 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించాం. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన వల్ల మనకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాలుగేళ్లు కష్టపడి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని సాధించాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా సమానంగా దృష్టి పెట్టాం. 6,000 వర్చువల్ తరగతి గదులు ఈ ఏడాది 6,000 వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నాం. ఐఐటీలో మన పిల్లలకు 12 శాతం ర్యాంకులు వచ్చాయి, ఇది మనకు గర్వకారణం. జీఎస్డీపీలో వెనుకబడి ఉన్నా, తెలివితేటల్లో శ్రీకాకుళం జిల్లా ముందుంది. అక్టోబర్ 2 నాటికి నూరు శాతం గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలి. తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలతో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. యువత టెక్నాలజీ ద్వారా ప్రయోజనం పొందాలే గానీ చెడిపోయే పరిస్థితి రాకూడదు. టెక్నాలజీ వల్ల మంచితోపాటు చెడు కూడా ఉంటుంది. మనం మంచినే వినియోగించుకోవాలి. లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కాలానుగుణంగా మార్చుకోవాలి. స్థూలంగా చూస్తే మనమంతా బాగానే పనిచేశాం. మన పనితీరును సూక్ష్మస్థాయిలో ఇంకా మెరుగు పర్చుకోవాల్సి ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమల్లో నిర్లక్ష్యం వద్దు సాధించాలనే తపన, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధ్యమే. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూసినట్లే మనం ప్రతి మూడు నెలలకోసారి పనితీరును సమీక్షించుకుని ముందుకెళుతున్నాం. జూన్ 2వ తేదీకి నవ్యాంధ్రప్రదేశ్లో పాలనకు నాలుగేళ్లు నిండుతాయి. ప్రతిఏటా అదేరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదు’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి: మంత్రి యనమల రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు రెండంకెల స్థాయికి చేరిందని, టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుకుంటేనే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంది. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. అయినా ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి సమర్థంగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు’’ అని వివరించారు. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు: కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చినా అధికారులు ప్రభుత్వ ఆశయాల మేరకు పని చేయడం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం కోసం వచ్చిన చాలా అర్జీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. వివాదం లేని ప్రైవేట్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలన్న ఆదేశాలను కూడా అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని కేఈ కృష్ణమూర్తి సూచించారు. ఎస్సీలు, మహిళలపై దాడులు ఆందోళనకరం: సీఎస్ రాష్ట్రంలో ఎస్సీలు, మహిళలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలపై నేరాల విషయంలో దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. మహిళలపై నేరాల విషయంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. 2017–18లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 7,910 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ప్రాంతంలో భూగర్భ జలమట్టం కలుషితం కావడం ఆందోళనకర పరిణామమని వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్చంద్ర పునేత ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సంక్షేమం తదితర శాఖల ప్రగతిని సంబంధిత అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ జరిగింది. పిల్లల్లో కొందరు పోషకాహార లోపంతో తక్కువ బరువు, ఎదుగుదల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో అల్లాడుతుంటే మరికొందరు ఊబకాయంతో బాధ పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా పాలిష్డ్ బియ్యం బదులు బ్రౌన్ రైస్, రాగులు, కొర్రలు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల్లో ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతుండటం సరైన పరిణామం కాదన్నారు. ఉద్దానం బాధితులకు ఉచితంగా మందులు ఇస్తామని ప్రకటించి ఆరు నెలలైనా ఇవ్వడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరణ పోర్టల్, విద్యాశాఖ యాప్, ఆర్టీజీఎస్ మొబైల్ యాప్, స్మార్ట్ ఆంధ్రతోపాటు పలు పుస్తకాలను, క్యాలెండర్లను ఆవిష్కరించారు. -
బెంగపుత్రులు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): వారికి గంగమ్మ తల్లే జీవనాధారం.. చేపల వేటకు వెళితేగాని పూట గడవదు.. సముద్రంలోకి వెళ్లిన వారు ఇంటికొస్తారన్న గ్యారంటీ లేదు.. పోనీ ప్రాణాలకు తెగించి పట్టుకున్న చేపలకు గిట్టుబాటు ధర వస్తుందా అంటే అదీ లేదు. చేపల వ్యాపారులు సిండికేట్గా మారి మత్స్యకారుల శ్రమను దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.జీవీఎంసీ పరిధి 17వ వార్డు పెదజాలారిపేటలో 4 వేల వరకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 1984లో జిల్లా గృహనిర్మాణ సంస్థ పక్కా ఇళ్లు కట్టించింది. ఇదిలా ఉండగా ఇదే గ్రామం నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతవడం, ఒకరి మృతదేహం లభ్యం కావడం తెలిసిందే. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం కోస్ట్గార్డు సిబ్బంది గాలిస్తున్నా ఫలితం కానరావడం లేదు. వారి కోసం బాధిత కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తొలి పోస్టుమార్టం ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి వేటకు వెళ్లిన చనిపోయిన మత్స్యకారులను పోస్టుమార్టం చేసింది లేదు. వీరి ఆచారం ప్రకారం మృతదేహంపై కత్తిగాటుకు కుటుంబ సభ్యులు ససేమిరా అనే వారు. అయితే మత్స్యకార నాయకులు నచ్చజెప్పడంతో తొలిసారిగా కేజీహెచ్లో బుధవారం పోలిరాజు మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. కాగా.. సముద్రంలో గల్లంతయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ పరిహారం అందడం లేదు. కేవలం గల్లంతు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని నాయకులు మండిపడుతున్నారు. కుల వృత్తినే నమ్ముకుని.. : పెదజాలారిపేటలో జీవీఎంసీ పాఠశాల ఉంది. చాలామంది పదో తరగతి వరకు చదువుతున్నారు. సరైన ఉపాధి దొరకకపోవడంతో వీరు కూడా చేపల వేటనే వృత్తిగా స్వీకరిస్తున్నారు. ఏడాదిలో వీరు 200 రోజులు చేపల వేటకు వెళతారు. చేపలు దొరక్కుండా వెనక్కి వచ్చేస్తున్న రోజులు చాలానే ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డులు లేవు: పెదజాలారిపేటలోని మత్స్యకారుల్లో 70 శాతం మంది మత్స్యకారులకు మాత్రమే గుర్తింపు కార్డులు ఉన్నాయి. మిగిలిన వారి కార్డులు మత్స్యశాఖ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల గల్లంతుపై కేసు నమోదు పెదవాల్తేరు(విశాఖతూర్పు):పెదజాలారిపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని వారి కుటుంబ సభ్యులు బుధవారం ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులు తెడ్డు పరసయ్య (43), తెడ్డు పెంటయ్య (48) మంగళవారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వెళ్లి వర్షానికి గల్లంతు కావడం తెలిసిందే. దీంతో పరసయ్య భార్య పోలి, పెంటయ్య భార్య పోలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఎంవీపీ సీఐ మళ్ల మహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతయినా పరిహారం ఇవ్వాలి సముద్రంలో గల్లంతయిన వారి మృతదేహం దొరికితేనే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామనడం అన్యాయం. గల్లంతయిన వారిని చనిపోయిన వారుగా పరిగణించి పరిహారం అందించాలి. పరిహారం అందకపోవడంతో వారి కుటుంబాలకు ఆసరా ఉండటం లేదు.– తెడ్డు సత్యరాజు, మత్స్యకారుడు, పెదజాలారిపేట -
బహిరంగ చర్చకు సిద్ధమా? : తలసాని
సాక్షి, జనగామ : కొంత మంది షోకాల్డ్ నాయకులు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడంలేదని అంటున్నారు, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు ఉనికి కోసమే బస్సుయాత్రలు చేపట్టారని ఆరోపించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ కోనసీమ లాగా అకుపచ్చ తెలంగాణగా మారుతుందన్నారు. గురుకులాలతో విద్యావ్యస్థను పటిష్టం చేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. -
27న కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో నిర్వహించనున్నట్లు మండలిలో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న నిర్వహించే ప్లీనరీకి సంబంధించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 150 మంది చొప్పున 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ రంగాలపై చర్చ, తీర్మానాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చ, తీర్మానాలు ఉంటాయని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిగతా కమిటీలను కూడా త్వరలో ప్రకటిస్తారని, అక్టోబర్ లేదా నవంబర్లో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని, ఈ సభకు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరూ హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. -
'కేసీఆర్ క్షమాపణ చెప్పాలి'
సాక్షి, ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరిచే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. అంతే కాకుండా కేసీఆర్ సొంత జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఫసల్ భీమా యోజన, ఇన్ పుట్ సబ్సిడీ పధకాలను సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ రైతు జపం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్పై రైతులు తిరగబడటం ఖాయమని.. 2019 లో కేసీఆర్కు రైతులు బుద్ధి చెబుతారన్నారు. -
కౌలు రైతుకు చేయూత ఏది?
బజార్హత్నూర్(బోథ్) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరి కోసం చట్టాలున్నా అమలుకాని పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల ‘పెట్టు బడి’ సాయం కూడా పట్టాదారుడికే ఇస్తామని ప్రకటించింది. కనీసం రుణ అర్హత కార్డులు సైతం లేక కౌలు రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే పరిహారం సైతం భూయజమానికే వస్తుండడంతో కౌలు రైతు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం మొండి చేయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సొంతంగా సాగుభూమి లేకపోవడంతో పట్టదారుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు వీరంతా. 2011లో కౌలు రైతుల కోసం రూపొందించిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలు రైతుకు భూయజమాని పత్రం ఇవ్వాల్సి ఉంది. కానీ హామీ పత్రం ఇస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పట్టాదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి. మూడేళ్ల కింద పత్తి సాగు కోసం ఎకరం చేను రూ.8వేల లోపు ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తాంసీ, తలమడుగు, జైనథ్, బేల మండలాల్లో ఈ మొత్తం రూ.15వేలు దాటింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర రాక ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. దరఖాస్తులు బుట్టదాఖలు... కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులును ఇవ్వాలని మూడేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 60వేల మంది గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. అప్పులు తెచ్చి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయడం తప్ప సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి రుణ అర్హత కార్డులు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం రూ.4వేలు సాగు చేస్తున్న కౌలు రైతులకే అందివ్వాలని కోరుతున్నారు. అప్పుల పాలవుతున్నాం.. బలన్పూర్ శివారులో ఇద్దరి పొత్తులో రూ.80వేలకు ఏడెకరాల చేను కౌలుకు తీసుకున్నాం. నాలుగెకరాల్లో పత్తి , మూడెకరాల్లో సోయ పంట వేశాం. కౌలు కాక రూ.1లక్ష 95వేల పెట్టుబడి అయింది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సోయా దిగుబడి 18 క్వింటాళ్లు వచ్చింది. పత్తికి రూ.4,700 చొప్పున రూ.1,17,500, సోయకు రూ.2,800 చొప్పున రూ.50,400 రెండు కలిపి రూ.1,67,900 ఆదాయం వచ్చింది. 2,75,000 ఖర్చుచేస్తే 1,07,100 నష్టం వాటిల్లింది. తాండ్ర శ్రీనివాస్, కౌలురైతు, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేలను కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరిత్యాల వల్ల కౌలు రైతు నష్టపోతే పరిహారం పట్టా రైతులకు ఇస్తున్నారు. కౌలు డబ్బులు తీసుకునే పట్టాదారు సాగుకు దూరంగా ఉంటాడు. పరిహారం కౌలు రైతుకే ఇవ్వాలి. ప్రభుత్వం త్వరగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలి. సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు -
మత్స్య రహస్యం!
‘‘ అధికారి గారు.. జిల్లాలో ఏ పథకం అమలవుతుంది..వాటి వివరాలు ఏమైనా చెబుతారా’’ అని అడిగితే..అన్ని పథకాలు అమలవుతున్నాయి’’ అన్న సమాధానం వస్తోంది. ‘‘ఏయే పథకాలో వివరంగా చెబుతారా’’..అని మళ్లీ అడిగితే..‘‘అన్ని పథకాలు అని చెప్పాముగా..ఇంకేం కావాలి.’’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఇదండీ జిల్లా మత్స్యశాఖ పరిస్థితి. ఇక్కడ అంతా రహస్యమే. ఏ పథకం కింద ఎవరు లబ్ధిపొందుతున్నారో సమాచారం ఇవ్వరు. అసలు పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారో..చేయడం లేదో తెలియని పరిస్థితి. నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టి వారికి అన్ని విధాలా మేమున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు భిన్నంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న మత్స్యకార్మికులకు తెలియజేయకుండా ఏ ఒక్క పథకంపైనా సంబంధిత అధికారులు నోరు విప్పకుండా వింత పోకడపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏయే పథకాలు వస్తున్నాయన్న వివరాలను కూడా మత్స్యకారులకు తెలియనీయకుండా కార్యాలయంలోని కొంతమంది అధికారులు తమకు నచ్చినవారికి మాత్రమే సమాచారం ఇచ్చి ‘చేతులు చాచుతున్నారు’ అనే విమర్శలు ఉన్నాయి. ఫలానా పథకం మంజూరైంది..ఇన్ని యూనిట్లు ఉన్నాయి..అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అన్న సమాచారాన్ని కనీసం పత్రికల ద్వారా కూడా ప్రకటన జారీ చేయకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ శాఖలో ప్రభుత్వ పథకాలు గడప దాటడంలేదు. ఎందుకింత రహస్యం? ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో కా ర్మికులందరికి తెలియజేసే బాధ్యతను మత్స్యశాఖ అధికారులు విస్మరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పథకం గురించి మీడి యా ద్వారా ప్రచారం కల్పించాల్సి ఉన్నా ఆ విధంగా చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా సభ్యులు 25 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య సుమారు 90 వేల పైబడే ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి సంక్షేమానికి ప్ర భుత్వం టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్ బైక్లు, చేపలు పట్టే వలలు, మహిళా సభ్యులకు స బ్సిడీ రుణాలు, ఐస్ బాక్సులు, త దితర వా టిని సబ్సిడీపై అందజేస్తుంది. ఆయా పథకాలపై సంబందిత అధికారులు మ త్స్యకారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు అ నుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త మకు నచ్చిన వారికి మాత్రమే తె లి సేలా సంఘం అధ్యక్షుడికి, లేదంటే వా రికి అనుకూలంగా ఉండే సభ్యులకు మాత్రమే సమాచారం చేరవేస్తున్నారనే పలువురు మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు. మూలన పడిన బడ్జెట్ ... 2016–17 సంవత్సరానికి సంబంధించి మత్స్యకార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. దాదాపు రూ.కోటికి పైగా బడ్జెట్ ఉన్నా అర్హులైన వారికి నేటికీ పథకాలు అందించలేదు. చేపల విక్రయానికి టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్లు కార్మికులకు ఎంతో అవసరం ఉన్నా వాటి గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు దాటినా పథకాలు అబ్ధిదారులకు ఇవ్వడానికి అధికారులకు తీరిక లేదా, వారికి కావాల్సినవి ముట్టలేదా అనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించడానికి లబ్ధిదారుల జాబితా తయారు చేశామన్నారు. 2016–17 సంవత్సరంలో మాత్రమే వాహనాల బడ్జెట్ వచ్చిందని, సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందిస్తామని తెలిపారు. -
‘చుక్క’ని లేని నావ..!
సాక్షి, జనగామ: చుక్క సత్తయ్య.. ఒగ్గు కథ పితామహుడు. తన సృజనాత్మకతతో ఒగ్గుకళను విశ్వవ్యాప్తం చేశారు. ఒగ్గు కళాసామ్రాట్ చుక్క సత్తయ్య కన్నుమూతతో ఆ కళపై ఆధారపడిన వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఒగ్గు కళను నమ్ముకున్న వారి ఉపాధిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒగ్గు కళపై ఆధారపడి రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది జీవిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, సిద్దిపేట, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, హుస్నాబాద్, మహబూబ్నగర్, యాదాద్రి జిల్లాలో ఒగ్గు కళాకారులున్నారు. ఎవరైనా ఒగ్గు కథ చెప్పడానికి పిలిస్తే వెళ్లి.. కథ చెప్పి వారిచ్చింది తీసుకొని వస్తున్నారు. లేని రోజుల్లో ఇతర పనులు చేసుకుంటున్నా జీవనం భారమవుతోందని ఒగ్గు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి చూసి ఔత్సాహికులెవరూ ఈ కళ వైపు దృష్టి సారించటం లేదని అంటున్నారు. సాంస్కృతిక సారధి దక్కని చోటు.. చుక్క సత్తయ్య తన కళతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. ముఖ్యంగా 20 సూత్రాల పథకం ప్రచారం చేయటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని చుక్క సత్తయ్య కళను మెచ్చుకోవటంతో పాటు ఢిల్లీకి పిలిపించి.. స్వర్ణకంకణం బహూకరించారు. నాటి నుంచి ఒగ్గు కళకు ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఒగ్గు కళాకారులకు చోటు కల్పించకున్నా.. చుక్క సత్తయ్యకు జీవన భృతి కింద నెలకు రూ. 10 వేల చొప్పున అందించింది. తమకు సాంస్కృతిక సారధిలో చోటు కల్పించాలని రాష్ట్రంలోని ఒగ్గు కళాకారులు కోరుతున్నారు. -
2018లో మీ లైఫ్ను నిర్ణయించేది అదే!
12 అంకెల ఆధార్ నెంబర్.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ. 2017లో పలు వివాదాలు. ఈ నెంబర్నే అన్నింటికీ ఆధారం చేస్తూ వెళ్తోంది ప్రభుత్వం. అయితే ఆధార్ వివరాల సేకరణతో వ్యక్తిగత గోప్యతకు కలుగుతుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే 2018లో సుప్రీంకోర్టు నిర్ణయం ఎటువైపు వస్తుంది? అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సర్వీసులకు ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విధంగా నమోదైన పిటిషన్లను సుప్రీంకోర్టు 2018లో విచారించనుంది. వీటిపై ఓ స్పష్టతను కూడా వచ్చే కొత్త ఏడాదిలోనే ప్రకటించనుంది. గోప్యత ప్రజల హక్కుగా పేర్కొన్న సుప్రీంకోర్టు.. ప్రభుత్వం చేపడుతున్న ఆధార్ అనుసంధాన ప్రక్రియను మాత్రం ఫ్రీజ్ చేయలేకపోయింది. ప్రస్తుతం స్టేటస్ క్వోనే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆధార్ అనుసంధానాన్ని మరిన్ని సర్వీసులకు పెంచుతూ పోతుంది. ప్రస్తుతానికైతే ఆధార్ అనుసంధాన తుది గడువును మాత్రం 2018 మార్చి 31 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఒకవేళ కోర్టు, ప్రభుత్వం తప్పనిసరి అంటున్న ఈ ఆధార్ లింకేజీకి ఆమోదం తెలిపితే, భారత్లో ఆధారే అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణగా పరిగణలోకి రానుంది. ఈ ఒక్క నెంబర్తోనే అన్ని ప్రభుత్వ పథకాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క ప్రభుత్వ పథకాలు మాత్రమే కాక, ప్రైవేట్ రంగం కూడా ఆధార్నే అన్నింటికీ ఆధారం చేసేస్తుంది కూడా. ఇదే క్రమంలో ఆధార్ వివరాలు సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. హ్యాకర్ల బారిని పడకుండా పెద్ద మొత్తంలో ఈ డేటాను భద్ర పరిచేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సిస్టమ్ లేదు. ప్రభుత్వంతో తేలికగా ఆన్లైన్లో కనెక్ట్ అవడానికి, డిజిటల్ ఇండియా డ్రీమ్ను సాకారం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. పలు స్థాయిల్లో అవినీతి స్థాయిలను తగ్గించవచ్చు. కానీ హ్యాకర్ల ముప్పు ప్రభుత్వానికి సవాలే. అదే ఒకవేళ కోర్టు, ప్రభుత్వ సర్వీసులకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని ప్రకటిస్తే... ఆధార్ గుర్తింపు పొందడానికి ప్రభుత్వం ప్రజలను ఒప్పించడానికి నూతన మార్గాలను కనుగొని, స్వచ్ఛందంగా లింక్ చేయడాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సర్వీసులకైనా ఆధార్ను తప్పనిసరి చేయొచ్చు అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఇన్కమ్ ట్యాక్సీ అసెసీలకు ఆధార్ తప్పనిసరి చేయడాన్ని జూన్లో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ సెక్షన్ కింద ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఇలా కొన్ని సర్వీసులకు ఆధార్ తప్పనిసరి అన్నా కూడా సందేహించాల్సినవసరం లేదు. ప్రైవేట్ రంగం కూడా ఆధార్ వివరాలను ఇవ్వాలని కోరుతోంది. ప్రైవేట్ కంపెనీల రిక్రూటర్లు ఉద్యోగులను నియమించుకోవడానికి ఆధార్ వివరాలను అడుగుతున్నారు. ఇలా 2018లో ఓ వ్యక్తి జీవితం ఆధార్పై ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది. -
మీకెందుకు ప్రభుత్వ పథకాలు!?
బొబ్బిలి: జిల్లాలో ఈ రెండు కుటుంబాలే కాదు...వేల సంఖ్యలో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులంటూ సుమారు 300 మందికి, భూములున్నాయని 3500 మందికి, వాహనాలు, ఇతర ఆస్తులున్నాయని మరో 11వేల మందికి కార్డులను తొలగించారు. వీరిలో కొందరికి పునరుద్ధరించగా సుమారు 4,600 మంది కార్డులు, పింఛన్ల కోసం తిరుగుతునే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, రేషన్కార్డు దారుల్లో నిజంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా రేషన్ కార్డులు జారీ చేశారు. మరికొంత మందికి అసలేమీ లేకుండానే తొలగించారు. సర్వే సిబ్బంది కొంత, అధికారుల నిర్వాకం మరికొంత! గతంలో జరిగిన పల్స్ సర్వే ప్రకారం నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్ద ఎత్తున ఆస్తులున్నట్టు నమోదు జరిగింది. ఇందులో కార్లు, భవనాలు, ఇతర ఆస్తులున్నట్టు నమోదు చేసేశారు. ఇవో రకం తప్పిదాలయితే భూముల తప్పుల తడకల్లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు మరికొన్ని! దీని వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న ప్రయోజనాలే కాకుండా పలు సంక్షేమ పథకాలకు కూడా దూరమవుతున్నారు. ఈ చిత్రంలోని మహిళ బాడంగి మండలం వీరసాగరానికి చెందిన డోకల సింహాచలమమ్మ. రోజు వారి కూలి చేసుకునే ఈ కడుపేదకు పింఛను లేదు. భర్త అప్పలనాయుడు చనిపోయి ఏడాదైంది. పెళ్లయిన కొడుకు కోడలు ఆదుకుంటారనుకుంటే కోడలు చనిపోయింది. కుమారుడు ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఈ వయసులో ఇద్దరు మనవలను పెంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వితంతు పింఛను ఇవ్వాలని కోరితే మీకు 20 ఎకరాల పల్లం మాగాణి ఉందని రికార్డుల్లో నమోదై ఉండటంతో పింఛను ఇవ్వడం కుదరదని చెప్పేశారు అధికారులు. మనవల్ని చూసి కుమిలిపోతూ కూలి పనికి వెళ్తోంది. ఆ డబ్బులతో పిల్లలకో ముద్ద పెట్టి తనో ముద్ద తింటోంది. కూలి పని లేని రోజు ఆ ముద్దా లేదు. ఈ చిత్రంలోని కుటుంబాన్ని చూ డండి! కుటుంబ యజమాని పేరు బంకురు శంకరరావు, ఆటో డ్రైవర్. రోజూ వాహనానికి కట్టాల్సిన ఫైనాన్స్, ఆయిల్ డబ్బులు, వడ్డీ డబ్బులు తీసేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే భార్య నాగమణి, కుమారుడు గౌతమ్లను పెంచుకుంటున్నాడు. రేషన్ కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకుంటే ఇచ్చారు. కానీ ఒక్క బియ్యం గింజయినా ఇవ్వక ముందే ఇతను ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొంటూ రేషన్ కార్డు డిలీట్ చేశారు. ఏడాదిగా ఇతను తహసీల్దార్ కార్యాలయానికి, కలెక్టరాఫీసుకు తిరుగుతునే ఉన్నాడు. కానీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. జనం తిప్పలు ! జిల్లాలోని ఇటువంటి తప్పుడు ఆన్లైన్ నమోదుల కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరమవుతుంటే మరో పక్క జన్మభూమి కమిటీల పరంగా అర్హులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జన్మభూమి కమిటీల చేతుల్లో ఓ వైపు నలిగిపోతూ ప్రభుత్వ పథకాలంటే అర్రులు చాసేలా చూస్తున్న జనం మరో పక్క అధికారులు, ప్రభుత్వ సిబ్బంది తప్పుడు నమోదు కారణంగా సాఫ్ట్వేర్ స్కానింగ్లో అనర్హులైపోతున్నారు. వాస్తవానికి వారికి తిండి బట్టాలేని వారైనా ఐశ్వర్యవంతులుగా చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి ఇలా అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకూ సబబని జిల్లాలోని పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనేది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సచివాలయంలోని అన్ని జిల్లాల గొర్రెల పెంపకందారుల సొసైటీల డైరెక్టర్లు, సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.5 వేల కోట్ల ఖర్చు తో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్న కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు మార్చిలో పెద్దఎత్తున గొల్ల, కురుమల బహిరంగసభను హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గొల్ల, కురుమల సంక్షేమ భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్ వద్ద 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ఇందులో సంక్షేమ భవనం, హాస్టల్ను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతులు తమ భూముల్లో గడ్డి పెంపకం చేపట్టేందుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలకు పాలు విక్రయిస్తున్న రైతులకు 50 శాతం సబ్సిడీపై పాడి గేదెలను పంపిణీ చేసేందుకు ప్రభు త్వం సుమారు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మేత సరఫరాకు రెండు కమిటీలు.. గొర్రెల మేతను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలను నియమించింది. మేత సరఫరా కోసం సాంకేతిక కమిటీ టెండర్ ప్రక్రియను నిర్వహించాలని, ఆర్థిక కమిటీ, సాంకేతిక కమిటీ నిర్ణయాలను పరిశీలించి అమలు చేయాలని సూచించింది. యాదవులంతా ఐక్యంగా ఉండాలి...మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్: యాదవులంతా ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్ నాగోలులోని శుభం కన్వెన్షన్ సెంటర్లో యాదవ, గొర్రెల కాపరుల సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ యాదవులు, గొర్రెలకాపరుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిం దన్నారు. సీఎం చేపడుతున్న సంక్షేమ పథకాలతో గొల్ల, కురుమలు ఎంతో సం తోషంగా ఉన్నారని, త్వరలోనే గేదెల పంపిణీ ఉంటుందని, ఒక్కో గేదెకు రూ.80 వేలు ఖర్చు పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఫిష్ ఫెడరేషన్ చైర్మన్ రాజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, కృష్ణ యాదవ్, గొర్రెలకాపరుల, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్తో వీడియో కాన్ఫరెన్స్: సీఎం
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావడానికి నిర్ణీత ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు ఎక్కడుంటే అక్కడి నుంచే సెల్ఫోన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని, అందులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ మందిరాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా నిరంతర పర్యవేక్షణకు ఈ రియల్టైమ్ గవర్నెన్స్ కేంద్ర కార్యాలయం దోహదపడుతుందన్నారు. ప్రజలు, మీడియా, సోషల్ మీడియాల ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందన్నారు. -
కొత్తగా 40 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు పరిపాలనా సౌలభ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలో పురపాలక సంస్థల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిపి రాష్ట్రంలో ఉన్న 74 నగర, పురపాలక సంస్థలకు అదనంగా మరో 40 పురపాలక సంస్థలను ఏర్పాటు చేసే అవకాశముందని వెల్లడించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్ వంటి అనేక మేజర్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించాలని విజ్ఞప్తులొస్తున్నాయని తెలిపారు. పురపాలక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని చాలా పట్టణాల మధ్యలో మేజర్ గ్రామ పంచాయతీలున్నాయని, దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అనుమతులు, పరిపాలన పద్ధతుల్లో భిన్నత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు గ్రామ పంచాయతీలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో పట్టణీకరణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం కలుగుతుందని చెప్పారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనం అవకాశాలపై నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శివారు గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసి పట్టణీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాధ్యమైనన్ని ఎక్కువ పట్టణాలు కొత్త పురపాలికల ఏర్పాటుకు 15 వేల జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలను గుర్తించాలని కలెక్టర్లకు కేటీఆర్ ఆదేశించారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల వివరాలు అందజేయాలని సూచించా రు. ప్రస్తుతమున్న మున్సిపాలిటీల పరిధి పెంచేందుకు 3 నుంచి 5 కి.మీల పరిధిలోని గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. గ్రామ పంచాయతీల పాలక మండలిల కాలపరిమితి వచ్చే ఏడాది జూలైలో ముగుస్తుందని, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చట్టపరమైన చర్యలను ఆ వెంటనే ప్రారంభించాలని పురపాలక శాఖను ఆదేశించారు. పంచాయతీల హోదాను ఉపసంహరించడంతో పాటు మున్సిపాలిటీల హోదా కల్పించేందుకు ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వాస్తవాన్ని మరిపిస్తున్న భ్రమలు
జాతిహితం ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశ రాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్లీ అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి. పరిమితి, వేగంపై మనకున్న భయం అనేది సామూహిక రోగ భ్రమను తలపిస్తుంది. ఇలాంటి స్థితిలోనే మనం ఆధునిక వైద్యం గురించి భయపడుతూ రుచికరమైన, తీపికలిగిన, పనిచేయని గుళికలను వేసుకోవడం వైపు కొట్టుకుపోతుంటాం. సాపేక్షికంగా ఆధునిక వైద్యమైన హోమియోపతిని జర్మనీలో శామ్యూల్ హానెమన్ 1976లో కనిపెట్టారు లేదా ఊహించారు. ఆనాటినుంచి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతించారు, ప్రశ్నించారు, పరిశోధించారు, తిరస్కరించారు కూడా. ఎలాంటి శాస్త్రీయ పునాదిని ఏర్పర్చకపోవడంతో ఇప్పుడు ఈ వైద్యవిధానాన్ని నకిలీ విజ్ఞానశాస్త్రంగా తోసిపుచ్చారు. హోమియోపతి కలిగించే ప్రభావం ఏదైనా ఉంది అంటే అది ఉత్తుత్తిమాత్ర ప్రభావం (ప్లాసెబో ఎఫెక్ట్) మాత్రమే. అంటే ఖాళీ మాత్రలు తీసుకున్న రోగి మానసికంగా తాను మెరుగ్గా ఉన్నట్లు భావిస్తాడు లేదా వ్యాధి సహజంగానే తగ్గిందని భావిస్తాడు. ఇది అర్థం పర్థం లేని వ్యవహారంగా రుజువైనప్పటికీ, హోమియోపై నమ్మకమున్న రోగభ్రమ కలవారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేరకు హోమియోపతి ఔషధాలను కొంటూనే ఉన్నారు. ఈనాటికీ ఈ వైద్యవిధానం ప్రధానస్రవంతి ప్రజల ఆదరణ పొందుతున్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. దేశంలోని ప్రతి నగరం సరే తనదైన హోమియోపతి వైద్యులను కలిగి ఉంటోంది. వీరిలో ‘డాక్టర్ బెనర్జీ’ అనే పేరు బహుళ ప్రాచుర్యం పొందింది. హోమియోపతి అనే వేలంవెర్రి వ్యామోహం అది పుట్టిన జర్మనీ దేశంలో దాదాపుగా అంతరించిపోయింది. కానీ దానికి ఎంతో దూరంలో ఉన్న భారత్లో అది వృద్ధి చెందుతుండటమే కాకుండా గణనీయ సంఖ్యలో కేంద్రప్రభుత్వ నిధులను కూడా పొందుతోంది. కేంద్రమంత్రివర్గంలో ఒకటైన ఆయుష్ అనే ఇంగ్లిష్ పదంలోని హెచ్ అక్షరం హోమియోపతిని సూచి స్తుంది. (ఆయుర్వేదం, యోగ–నాచురోవతి, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్ అంటున్నారు). ఆరోగ్య సమస్య ఉందని మీరు ప్రస్తావించే ప్రతి వ్యక్తీ ఒక ఔత్సాహిక హోమియోపతి అభిమాని అయి ఉంటారు. అది పుట్టిపురిగిన పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు దాన్ని అర్థం పర్థంలేని వైద్యంగా కొట్టిపడేయవచ్చు కానీ, హోమియోపతికి భారత్ ఇప్పుడు నిలయంగా మారింది. చివరకు దీనిని దేశీయ వైద్య వ్యవస్థల్లో ఒకటిగా అధికారికంగా ప్రకటించారు కూడా. హోమియోపతి గురించి జోక్ చేసినా మన దేశంలో ప్రమాదమే. ఈ కథనంలోని మూడో పేరా చదివిన పాఠకులు ఇప్పటికే నిరసనలు, బూతులతో నన్ను సత్కరిస్తుంటారు కాబోలు. భారతీయులు హోమియోపతిని ఆరాధించడం, విశ్వసించడమే కాకుండా దాన్ని పూర్తిగా సమర్థిస్తూ, దాసోహమవడానికి కారణం ఉంది. బహుశా అది రోగ భ్రమ లేదా రోగ భయం ఉన్నవారి కోసం రూపొంది ఉండవచ్చు. రోజు వారీ జీవితంలో చిన్న ఆరోగ్య సమస్య, లేదా సందేహం ఏర్పడినా సరే చాలామంది తియ్యటి, స్పిరిట్ వాసన వేసే హోమియో గుళికలను వేసుకుంటుం టారు. ఈ గుళికల వల్ల ఏ ప్రభావమూ లేదని మీరు భావించడానికి చాలా కాలం అంటే నెలలు కూడా పట్టవచ్చు. కానీ ఈ క్రమంలో మీకు మెరుగైందని, స్వస్థత చేకూరిందని మీరు నమ్ముతారు కూడా. ముఖ్యంగా హోమియో గుళికల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆధునిక వైద్యం అందిస్తున్న ఔషధాలు కలిగించే దుష్ప్రభావాలు, మన ఆరోగ్య వ్యవస్థకు అది కలిగించే నష్టం గురించి మనం బాగా భయపడుతుంటాం. ఇక శస్త్రచికిత్స అంటే ఎవ్వరినైనా వణికిస్తుంది. ఇలాంటప్పుడు పరిపాలన, మరీ ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లోనూ చొచ్చుకుని వస్తున్న హోమియో మానసిక స్థితి కల దేశంగా భారత్ను మనం గుర్తించవచ్చా? మీరు ఎలాంటి పరిమాణంలోని ప్రాజెక్టునైనా సరే ప్రస్తావించారనుకోండి.. భౌతికపరంగా, ఆర్థికపరంగా ఉత్పాతం జరగబోతోందని చిత్రిస్తూ లక్షలాది మంది మీపైకి విరుచుకుపడిపోతారు. భారత, జపాన్ ప్రధానులు నరేంద్రమోదీ, షింజో అబేలు అహ్మదాబాద్–ముంబై బుల్లెట్ రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా చాలావరకు ఇలాంటి స్పందనలే వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి స్పందన కీలకమైంది. షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ నాటి భారత్ను ఆర్థికంగా కుప్పకూల్చివేసిందని, కరువులు, ఆకలి చావులకు కారణమైందని అభిషేక్ చెప్పారు. ఇక మన దేశంలో బుల్లెట్ రైలు కూడా పరుగెడుతుంది కానీ తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ఊహించుకోవలసిందే అన్నారాయన. ఇలాంటి వ్యాఖ్యలు చాలానే వచ్చాయి. వీటన్నింటిలో వ్యక్తమైన ఉమ్మడి అభిప్రాయం ఏదంటే, భారత్ ఇంత ఖర్చు భరిస్తుందా? ఇది స్వావలంబనను కలిగిస్తుందా, ఆర్థికపరంగా ఇది అర్థవంతమైనదేనా అనేదే. దేశంలో ఇప్పటికీ 17 వేల కాపలా లేని క్రాసింగులు ఉంటూండగా, రైళ్లు నిత్యం పట్టాలు తప్పుతుం డగా బుల్లెట్ రైలు వంటి భారీ నిర్మాణాన్ని దేశం తట్టుకోలేదన్నది వీరి భావం. అదే సమయంలో 1971 నుంచి మన దేశ రైళ్ల గరిష్ట వేగం పెద్దగా మారలేదని కూడా వీరే ఆరోపిస్తుంటారు. ఇలా విమర్శిస్తున్నవారిలో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటుంటారని మర్చిపోవద్దు. బుల్లెట్ రైలు కోసం తీసుకుంటున్న లక్ష కోట్ల రూపాయల అప్పును అతి తక్కువ వడ్డీకే జపాన్ అందిస్తూ 50 ఏళ్ల వ్యవధిలో అప్పు తీర్చే వెసులుబాటు కల్పించిప్పటికీ దేశంలోని కోట్లాది సామాన్య ప్రయాణికులకు అది చేసే మేలు ఏదీ లేదు. పైగా బుల్లెట్ రైలు నైతికంగా అవరోధంగా నిలుస్తుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే దేశంలో ఏ ప్రాజెక్టుకోసం పథకాలు రచించినా ఇదే బాగోతం నడుస్తుంటుంది. భారీ డ్యాములు, నదుల అనుసంధానం వంటి ఆలోచనలను మనం వదులుకుంటున్నాం. 1995–99 కాలంలో మహారాష్ట్ర యువ రవాణా మంత్రిగా ఉండిన నితిన్ గడ్కరీ ముంబై–పుణే ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణంకోసం పూనుకున్నప్పుడు అది పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందని, సాంకేతి కంగా అసాధ్యం అని, ఆర్థికంగా చెల్లదని విమర్శించారు. కానీ ఎక్స్ప్రెస్ రహదారులు లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించుకోండి మరి. దేశవ్యాప్తంగా భారీ రహదారుల కోసం బీవోటీ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నగరాల్లోని విమానాశ్రయాల ప్రైవేటీకరణపై చర్చను గమనించండి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ జరిగితే తమ యూనియన్లకు స్థానం ఉండదనే కారణంతో వామపక్షాలు ఎన్ని విమర్శలు చేశాయో అందరికీ తెలుసు. అలాగే నగరాల్లో అవసరానికి మించి భవనాలు కడుతున్నారని కూడా విమర్శించేవారు. కానీ ఈరోజు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు జనాభాతో కిక్కిరిసిపోయాయి. మన మహానగరాలు ఇప్పుడు విస్తరణకోసం పాట్లుపడుతున్నాయి. ఈ వృద్ధి వికాసం లేకుండా మన విమానయాన పరిశ్రమ ఇంత స్థాయికి ఎదిగి ఉండేది కాదు. స్వల్ప స్థాయి సంస్కరణలను కోరుకునేవారు లేదా హోమియోపతిపై నమ్మకం ఉన్నవారు ఇక్కడే గెలుపొందుతున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలే. దశాబ్దకాలంగా ఇలాంటి ఊగిసలాటల కారణంగానే కొత్త ప్రాజెక్టులు, పథకాలు విశ్లేషణా పక్షవాతానికి గురైనాయి. ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశరాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటినే మళ్లీ అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి. కాబట్టి హోమియోపతి మార్గంలో ప్లాన్ చేయడం నిజంగానే ప్రమాదరహితమైంది కానీ ఈ వైద్యం రోగాన్ని మరింత ఘోరంగా మారుస్తుంది. బుల్లెట్ ట్రైన్లో ఉన్న మంచి అంశం ఏమిటంటే, మొత్తం ప్రాజెక్టును, డబ్బును జపానీయులే నియంత్రిస్తారు. మోదీ ప్రభుత్వం పట్ల, భారీ ప్రాజెక్టులపై దానికి ఉన్న అనురక్తి పట్ల మీకు ఎన్ని డొంకతిరుగుడు వ్యవహారాలు ఉన్నా సరే.. పని పరిధి, వేగానికి సంబంధించి సాంక్రమిక భారతీయ భీతి మోదీ ప్రభుత్వానికి ఉందని మీరు ఆరోపించలేరు. హోమియోపతితో సహా ప్రత్యామ్నాయ వైద్యచికిత్సా వ్యవస్థల పట్ల తన నిబద్ధతను మోదీ పెంచుకున్నట్లయితే అది వేరే విషయం. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఆధార్ అనుసంధానంపై ఊరట
-
ఆధార్ అనుసంధానంపై ఊరట
న్యూఢిల్లీ: ఆధార్ లింకింగ్ అంశంపై సుప్రీంకోర్టు మరో ఊరట కల్పించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది. ఆధార్లింక్పై బుధవారం విచారించిన సుప్రీం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఈ విషయంపై వాదనలు వినడానికి అంత తొందర ఏమీలేదని ధర్మాసనం పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్ను గడువును పొడిగించాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా బెంచ్, జస్టిస్ అమితావ రాయ్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం ఆధార్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘింఘనపై తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. నవంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ ఉంటుందని ఖాన్విల్కర్ చెప్పారు. కాగా వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వివిధ పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు .కేంద్రం ప్రభుత్వం గతంలోజారీ చేసిన ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువు డిసెంబర్ 31వరకు పొడిగించినట్టయింది. -
‘ఆధార్’ను బాగా వాడండి
► పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించండి ► రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని మోదీ సూచన న్యూఢిల్లీ: మెరుగైన పాలన, ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. అలాగే పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు మరింతగా కృషిచేయాలని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో సోమవారం ప్రధాని ప్రసంగిస్తూ.. సుపరిపాలనతోనే ప్రభుత్వ పథకాల లక్ష్యాల్ని అందుకోగలమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ‘దేశ నవ నిర్మాణంలో రాష్ట్రాలే చోదక శక్తులు’ అన్న నినాదంలో భాగంగా నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహించింది.‘ప్రపంచం మొత్తం భారత దేశాన్ని విశ్వసిస్తోంది. మనతో కలసి నడిచేందుకు ముందుకు వస్తుంది. ఈ సువర్ణావకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకోసం పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు మొదటి ప్రాధాన్యమివ్వాలి. పరిపాలన ప్రతి స్థాయిలో ఆధార్ను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి. ఆగస్టు 15 నాటికి ‘ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్’(జీఈఎం)ను సమర్థంగా వాడుకునే స్థితికి చేరాలి. పంట సేకరణలో పారదర్శకత, సామర్థ్యం పెరిగేందుకు జీఈఎం మనకు సాయపడుతుంది. చురుగ్గా వ్యవహరించాలి రాష్ట్రాల్లోని యువ అధికారులు చురుగ్గా వ్యవహరించాలి. అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తే.. సమస్యలు, సవాళ్ల పరిష్కారంలో రాష్ట్రాలు అనురిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పడుతుంది. సవాళ్లను అధిగమించాలంటే ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమష్టి ముందుచూపు, సామర్థ్యం అవసరం. అందుకోసం పాలనానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకోవాలి. రాష్ట్రాలు ఒంటరిగా సాగకుండా.. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వంతో కలిసి పనిచేయాల’ని సీఎస్ల భేటీలో మోదీ సూచించారు. పరిపాలనలో తాము అనుసరించిన ఉత్తమ విధానాల్ని ప్రసంగానికి ముందు ప్రధాన కార్యదర్శులు ప్రధానికి వివరించారు. గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పంటల బీమా, శిశు మరణాల్ని తగ్గించడం, గిరిజన సంక్షేమం, వ్యర్థ్యాల నిర్వహణ, సౌర శక్తి వంటి అంశాలపై సీఎస్లు అనుభవాల్ని పంచుకున్నారు. రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. సదస్సులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి ఇందర్జిత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, సీఈవో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. -
3,500 మందితో గులాబీ దండు!
సార్వత్రిక ఎన్నికల కోసం అధికార పార్టీ వ్యూహం - ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను జనంలోకి తీసుకెళ్లేలా శిక్షణ - త్వరలో పార్టీ నియోజకవర్గ కమిటీలు.. ఒక్కోదానిలో 22 మంది! - ఇతర సంస్థాగత కమిటీల నియామకం కూడా.. సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువే ఉండడంతో అధికార టీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే సమయంలో నియోజక వర్గాల్లో రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కనీసం 3,500 మంది నేతలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సమయం దగ్గరపడుతుండడంతో.. రెండేళ్ల కింద నాగార్జునసాగర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వివిధ అంశాల్లో నిపుణులతో తరగతులు నిర్వహించారు. రాజకీయ అంశా లపై స్వయంగా సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం శిక్షణ ఉంటుందని ప్రకటిం చినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఎన్నిక లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లా ల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సంస్థాగత నియామకాల తర్వాత.. టీఆర్ఎస్ మూడేళ్లుగా ప్రధాన కమిటీలు లేకుండానే కొనసాగుతోంది. గ్రామ, మండల కమిటీలు మినహా ఏ కమిటీలూ లేవు. అయితే రెండు నెలల కింద 16వ ప్లీనరీ సమయంలో అన్ని పార్టీ కమిటీలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఇరవై రోజులుగా ఆయన కసరత్తు చేపట్టారని తెలుస్తోంది. మరోవైపు తొలిసారిగా టీఆర్ఎస్లో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయను న్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల సారథ్యంలో కమిటీలు ఉంటాయి. స్థానిక ఎంపీ సభ్యుడిగా ఉంటారు. ఇక కమిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మరో 20 మందిని నియమించనున్నారని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సగటున ఐదు మండలాలు ఉంటాయనుకుంటే.. ఒక్కో మండలం నుంచి కనీసం నలుగురికి సభ్యులుగా అవకాశం దక్కనుంది. ఇక నియోజకవర్గ కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీ, పోలిట్ బ్యూరోలను కూడా ఈ నెలాఖరుకు నియమించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కమిటీల నియామకం పూర్తయ్యాక అన్ని కమిటీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో కలిపి మొత్తంగా 3,500 మందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రతిపక్షం బలాబలాలపై ఆరా ఒకసారి శిక్షణ పూర్తయితే నాయకులు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి కూడా వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తారన్న ఆలోచనలో పార్టీ ఉంది. దాంతోపాటు కమిటీల ద్వారా నియోజకవర్గాల్లో తమ పార్టీ, ఎమ్మెల్యేల పరిస్థితి, బలహీనతలపై సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల పరిస్థితి, బలాబలాలను అంచనా వేయడం కూడా సాధ్యమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
లెక్క తేలింది..
► ముగిసిన రైతు సమగ్ర సర్వే ► జిల్లాలో 81.5 శాతం నమోదు ► పూర్తి కాని లక్ష్యం.. ► సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు ► నమోదు చేసుకోనివారికి నష్టమే జిల్లాలో రైతుల సంఖ్య 1,32,268 నమోదు చేసుకున్న రైతులు 1,07,888 నమోదు శాతం 81.57 మండలాలు 18 గ్రామాలు 510 సర్వేలో పాల్గొన్న సిబ్బంది 109 ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే గురువారం ముగిసింది. జిల్లాలో కొంతమంది రైతులు ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతీ అన్నదాతకు ఎకరానికి రూ.4 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి ఈ నెల 15 వరకు రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టారు. ఈ నెల 10 వరకు గడువు ముగిసినప్పటికీ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఐదు రోజులపాటు గడువు పెంచింది. అయినా ఒక శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,32,268 మంది రైతులు ఉండగా, ఇందులో 1,07,888 మంది సర్వేలో నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 24,380 మంది రైతులు సర్వే చేయించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 81.57 శాతం నమోదు కాగా, 18.43 శాతం సర్వే చేసుకోలేదు. కొంతమంది రైతులు ఉపాధి రీత్యా వారి సొంత గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నందున వారి వివరాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. లెక్క పక్కా.. రైతుల సమగ్ర సర్వేతో భూములు సాగు విస్తీర్ణం పక్కాగా తెలుస్తోంది. గతంలో రైతులు ఎక్కడ, ఏ పంటలు, ఎంత మేరకు వేశారనేది రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పూర్తి స్థాయిలో సమాచారం ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో వేసిన పంటలకు అధికారుల లెక్కలకు ఎలాంటి పొంతన ఉండేది కాదు. ప్రభుత్వం ప్రతి ఎకరం సాగుకు రూ.4 వేలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. మండలాల్లో ఏవోతోపాటు ఏఈవో అందుబాటులో ఉండడంతో రైతుల వివరాలు సమగ్రంగా సేకరించారు. సర్వేలో 79 మంది ఏఈవోలు, 18 మంది ఏవోలు, ఆరుగురు హెచ్ఈవోలు, ఆరుగురు ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు. 24 అంశాలతో వివరాలు.. ప్రభుత్వ ఆదేశాలతో రైతుల సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. వ్యవసాయ శాఖ రూపొందించిన నమూనా పత్రంలో రైతులకు సంబంధించిన 24 అంశాలు ఉన్నాయి. నమూనా ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో రైతు పేరు, తండ్రి పేరు, సామాజిక వర్గం, ఆధార్ కార్డు, వరుస సంఖ్య, బ్యాంక్ ఖాతా, భూముల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, నీటి సౌకర్యం ద్వారా భూమి, వర్షాధారం కింద సాగయ్యే భూమి సాగు చేసే పంటల రకాల వివరాలు, ఫోన్ నంబరుతో సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఏఈవోలు తమ గ్రామాల పరిధిలో కంప్యూటర్లో నమోదు చేశారు. ప్రస్తుతం సేకరించిన వివరాలతోనే ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించే వీలుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వేలో నమోదు చేసుకోనివారికి ప్రభుత్వం నుంచి రైతులకు అందజేసే సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు వర్తించబోవని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గురువారంతో గడువు ముగిసింది. 10వ తేదీ వరకు 80 శాతం సర్వే పూర్తి కాగా, ఐదు రోజులు గడువు పెంచినప్పటికీ ఒక శాతం కంటే ఎక్కువ రైతులకు సంబంధించిన వివరాలు లభ్య కాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో ఉండే భూ యాజమానులు వివరాలు నమోదు చేసుకోలేదు. గడువు దాటితే తామేమీ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు గతంలో చెప్పినప్పటికీ ఇంకా కొంతమంది సమగ్ర భూ సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేదు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి రూ.4 వేలు సాగు ఖర్చుకు ఇస్తుంది. ఖరీఫ్, రబీ పంటలు రెండింటికీ ఏడాదికి రూ.8 వేలు రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో.. జిల్లాలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు పట్టాలు లేవు. దీంతో సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు. సర్వే ఆధారంగా ప్రభుత్వం అందజేసే రూ.4వేలు అందవని గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఎళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న చాలా మంది గిరిజనుల భూములకు కూడా పట్టాలు లేవు. దీంతో వారి పేర్లు కూడా నమోదు చేసుకోలేదు. జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సమగ్ర సర్వే ముగిసింది జిల్లాలో 94 క్లస్టర్లో 510 రెవెన్యూ గ్రామాల్లో లక్షా 7,888 మంది రైతులు సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నారు. 81.57 శాతం నమోదైంది. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు జారీ చేస్తాం. సర్వే చేయించుకోని రైతులకు ప్రభుత్వం నుంచి అందజేసే రాయితీ, తదితర పథకాలు వర్తించవు. జిల్లాలో అత్య«ధికంగా బోథ్ మండలంలో 89 శాతం సర్వే చేసుకోగా, ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 63 శాతం నమోదు అయ్యింది. – రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి -
‘ఉపాధి’ చూపే వర్సిటీలకే రాయితీలు
- వేరే పనుల వల్లే ‘పాఠాలు’ చెప్పలేకపోతున్నారు - ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: గవర్నర్ నరసింహన్ అనంతపురం టౌన్ : ఉపాధి అవకాశాలు చూపించే విశ్వవిద్యాలయాలకే ప్రభుత్వ రాయితీలు అందాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యాన్ని అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అనంతపురం చేరుకున్న ఆయన రాత్రి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాలు కల్పించేలా నేటి విద్యా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ఎన్ని యూనివర్సిటీలు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయో పరిశీలించుకోవాలని అన్నారు. పాఠశాలల్లో నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు ఉండేలా చూడాలన్నారు. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు సాగాలని చెప్పారు. ఉపాధ్యాయులను ఎక్కువ శాతం ఎన్నికలు, ఇతర పనులకు వినియోగించడం వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడం తగ్గిపోతోందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రత పాటించాలని అలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని, గోదాముల సౌకర్యం కల్పించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం లేకుండా ముందు నుంచే ప్రత్యేక డివైజ్ను రూపొందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ రూపొందించిన ‘యాప్’ బాగుందని, దాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవాలని ఎస్పీకి సూచించారు. -
‘ఆధార్ తప్పనిసరి’పై మే 17న విచారణ
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాలకు కేంద్రం ఆధార్ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మే 17న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయం చాలా ముఖ్యమని, అత్యవసరంగా విచారించాలన్న సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ అభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఏకీభవించింది. ఆధార్ స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసినా, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆహార హక్కు లాంటి పథకాలకు కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేసిందని దివాన్ అన్నారు. దీని విచారణకు ఇద్దరు జడ్జీలతో బెంచ్ను ఏర్పాటుచేయాలని అత్యున్నత ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తరుఫున హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, దివాన్ వాదనలతో విభేదించారు. ఆధార్ వ్యవహారంలో ఐదుగురు జడ్జీల బెంచ్ ఇది వరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, మళ్లీ దీన్ని ఇద్దరు జడ్జీల బెంచ్కు నివేదించడం సరికాదని అన్నారు. -
వందేళ్ల వృద్ధురాలు.. సంక్షేమ పథకాలకు అనర్హురాలు
వందేళ్ల నిరుపేద వృద్ధురాలు.. కన్న కొడకులు లేరు, కళ్లు కనబడవు, చెవులు వినబడవు.. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు, కూర్చునచోటే కూర్చోవాలి, పడుకున్నచోటే పడుకోవాలి ఇన్ని అగచాట్లు పడుతున్న వృద్ధురాలిని అధికారులు కరుణించకపోవడంతో ఆమె సంక్షేమ పథకాలకు అనర్హురాలిగా మారింది. బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీకి చెందిన దాసరి మద్దమ్మకు చెందిన ఇద్దరు కుమారులు మరణించడంతో ఆమె మనవళు్ల కూలీ పనులు చేస్తూ ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నారు. 2014 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చే రూ. 200 పింఛన్ ఆమెకు అందేది. ప్రస్తుతం పింఛన్కు ఆధార్కార్డు, రేషన్కార్డు లింక్ పెట్టడంతో ఆమె అనర్హురాలిగా మిగిలిపోయింది. ఆధార్ కార్డు కోసం వెలితే వేలి ముద్రలు, కళ్లకు సంబంధించిన ఐరీస్ ఫొటోలు తీసుకోవడం లేదు. దీంతో ఆధార్కార్డు లేదనే సాకుతో అధికారులు పింఛన్, రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. కనిపించిన వారికల్లా వృద్ధురాలు దండం పెట్టి తనకు పింఛను, రేషన్ బియ్యం ఇప్పించాలని వేడుకుంటుంది. - బేతంచెర్ల -
నిధుల వినియోగంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం
- కేంద్ర నిధులను మళ్లిస్తున్నారంటూ మండిపాటు - ప్రతి పనిలో జన్మభూమి కమిటీలతో పనేంటి? - దిశా సమావేశంలో సభ్యుల ధ్వజం కర్నూలు(హాస్పిటల్): నిరుపేదల అభ్యున్నతి కోసం వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ(దిశా) అధ్యక్షురాలు, ఎంపీ బుట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగంపై ఎంపీతోపాటు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద గత ఏడాది రూ.588కోట్లతో 196లక్షల పనిదినాలు లక్ష్యం కాగా రూ.435కోట్లతో 164లక్షల పనిదినాలే కల్పించారని చెప్పిన ఎంపీ.. లక్ష్యసాధనలో లోపాలను డ్వామా పీడీ పుల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో పనేంటని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద మంజూరైన నిధులు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంచి రెండు నెలల్లోనే రూ.180కోట్ల పనులు మంజూరు చేయడంపై ఆరా తీశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 105రోడ్ల మరమ్మతుల నిర్వహణకు సంబంధించి నివేదికలు అందజేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడిని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పేదల ఇళ్లకు సంబంధించి వెయ్యి దరఖాస్తులిచ్చారని, అవి ఏఏ దశలో ఉన్నాయని ప్రశ్నించగా పరిశీలించి కలెక్టర్కు ప్రతిపాదనలు పంపిస్తామని హౌసింగ్ పీడీ హుసేన్సాహెబ్ నివేదించారు. ‘ఉపాధి’ కింద లక్ష్యాన్ని మించి మంజూరు : కలెక్టర్ నీటి సంరక్షణ విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాన్ని మించి మంజూరు ఇచ్చామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఉపాధి పనుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. నగరానికి తాగునీటి విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని వివరణ కోరగా గాజులదిన్నె ప్రాజెక్టులో 0.51టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ప్రస్తుతం ఇస్తున్న విధానంలో నీటిని విడుదల చేస్తే జూన్ చివరి వరకు సరిపోతాయన్నారు. పల్లెల్లో తాగునీటి విషయమై చర్చకు రాగా డీపీఓ సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీకి ఆదేశాలిచ్చారు. తన ఆదర్శ గ్రామాల్లో ఒక్క పని మొదలు కాలేదంటూ జెడ్పీ సీఈఓ ఈశ్వర్ను ఎంపీ ప్రశ్నించగా టెండర్ దశలో ఉన్నాయని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాలన్నా జన్మభూమి కమిటీని అడగాలా? – బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పెళ్లి చేసుకోవాలన్నా తమను అడగాలనే ధోరణిలో జన్మభూమి కమిటీలు వ్యవహరిస్తున్నాయి. ఏ స్కీమ్ వచ్చినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పారని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తీసేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకునేందుకు వారితో పనేంటి? ఎమ్మెల్యేగా ఉన్నా మరుగుదొడ్డి, ఇళ్లు, బోరు మంజూరు చేయించే అధికారం నాకు లేకుండా పోయింది. డీఆర్డీఏ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఎందుకు నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సరిగ్గా అందించాలన్నారు. కల్లూరు వార్డులపై వివక్ష.. –గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 14 వార్డులపై వివక్ష చూపుతున్నారు. నగరంలో రెండురోజులకోసారి నీరు వస్తే కల్లూరు 14 వార్డుల్లో వారం, పదిరోజులకు కానీ విడుదల చేయడం లేదు. గత కలెక్టర్.. జిల్లాలో నీటి కరువే లేనట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కరువు పనుల బిల్లులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. యాపర్లపాడు రోడ్డు ఇప్పటి వరకు ఎందుకు మంజూరు కాలేదు? కర్నూలు నగరానికి మంత్రులు వస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకుండా వివక్ష చూపుతున్నారు. పిన్నాపురం, కందికాయ, ఉప్పలపాడు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చండి. ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వండి.. –ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఉపాధి కూలీలకు మూడు నెలలుగా నిలిచిన వేతనాలను వెంటనే ఇవ్వండి. రోజుకు రూ.197 ఇవ్వాల్సి ఉండగా రూ.120 నుంచి రూ.130 మాత్రమే ఇస్తున్నారు. ఎండలు మండుతున్నా సరైన సౌకర్యాలు లేవు. వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారిని పక్కన పెట్టి వారికి అనుకూలమైన వారికి పింఛన్లు వెంటనే మంజూరు చేస్తున్నారు. వంద శాతం వికలత్వం ఉన్నా వికలాంగుల కోటాలో పింఛన్ రావడం లేదు. వయసు ఎక్కువ నమోదు చేయించుకుని పింఛన్లు స్వాహా చేస్తున్న కేసులు అనేకం ఉన్నాయి. -
ప్లీనరీ సక్సెస్
పార్టీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం - తీర్మానాల రూపంలో ప్రభుత్వ ప్రగతి నివేదిక - వేదికపై మాట్లాడేందుకు అమాత్యులకు నో చాన్స్ - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే తీర్మానాల బాధ్యత - ఇక వరంగల్ బహిరంగ సభపై నేతల దృష్టి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంతో కీలకంగా భావించిన పదహారో ప్లీనరీ విజయవంతం కావడం తో పార్టీ నాయకత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్లీనరీని విజయవంతం చేసేందుకు గడచిన 15 రోజులుగా పార్టీ యంత్రాంగం శ్రమించింది. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల శాఖల కమిటీల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఇలా.. వరుసగా పార్టీ యంత్రాంగం బిజీబిజీగా గడిపింది. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభతో పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ముగిసినట్టే. ప్లీనరీలో గడిచిన మూడే ళ్లలో ప్రభుతం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలు, కార్యక్రమాల ప్రగతి నివేదికను తీర్మానాల రూపంలో సమర్పించారు. ప్రభుత్వ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పార్టీ నాయత్వం భావిస్తున్న నేపథ్యంలో.. వాటికి తీర్మానాల రూపం ఇచ్చి చర్చకు పెట్టారు. అలాగే ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు ప్రభుత్వ పనితీరు, పథకాలపై అవగా హన కల్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్ల పాలన ప్రగతి నివేదికను ప్రకటించిన టీఆర్ఎస్.. భవిష్యత్ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రానున్న రెండేళ్లలో ఏం చేయనున్నారన్న అంశాన్ని రేఖా మాత్రంగానే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు చేయనున్న ఆర్థిక సాయం అంశాన్ని ప్రత్యేక అంశంగా చేపట్టింది. ఈ ఒక్క అంశానికే ప్రాధాన్యం ఇచ్చి చర్చకు పెట్టింది. ప్రతిపక్షాలపై విమర్శలు.. తమ ప్రభుత్వ పనితీరు, విజయాలను వివరిస్తూనే పార్టీ నేతలు విపక్షాలపైనా విరుచుకుపడ్డారు. సాగునీ టి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షా లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనపైనా సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. కాగా ప్లీనరీలో మం త్రులంతా మౌనంగానే ఉన్నారు. ఒక్క మంత్రికి కూడా మాట్లాడే అవకాశం రాలేదు. తీర్మానాలను ప్రతిపాదించడం, బలపర చడం వంటి బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకే ఇవ్వడం తో మంత్రులు వేదికపై కూర్చోవడానికే పరిమిత మయ్యారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న అయి దుగురు మహిళల్లో.. ఇద్దరికి ప్లీనరీలో మాట్లాడే అవకాశం దక్కింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపు ష్టం–వృత్తులు అంశంపై ఎమ్మెల్యే కొండా సురేఖ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లా డారు. ఆమె చేసిన ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. 15 లక్షల మందితో సభ! ప్లీనరీ విజయవంతం కావడంతో ఇక వరంగల్ బహిరంగ సభపై దృష్టి పెడతామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న నిర్వహించే ఈ సభకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉద్యమ పార్టీగా ఇదే వరంగల్లో 10 లక్షల మందితో సభ జరిపామని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో బహిరంగ సభను 15 లక్షల మందితో జరిపేందుకు శ్రమిస్తున్నామని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. -
సంక్షేమ పథం.. ప్రగతి రథం
- బంగారు తెలంగాణే మా ధ్యేయం - ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ ఏడు తీర్మానాలు - ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరణ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 16వ ప్లీనరీ సందర్భంగా పార్టీ సాధించిన విజయాలు.. చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ సాధనకు తీసుకుంటున్న చర్యలపై ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. శుక్రవారం కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణం వేదికగా పార్టీ నేతలు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో ఆమోదించారు. వీటిలో ‘సంక్షేమంలో స్వర్ణయుగం’ తీర్మానాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా.. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్బేగ్ బలపరిచారు. ‘నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో నూతనాధ్యాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం’ తీర్మానాన్ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్.నిరంజన్రెడ్డి ప్రవేశపెట్టగా.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ బలపరిచారు. ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం..వృత్తి పనులకు ప్రోత్సాహం’ తీర్మానాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రవేశపెట్టగా.. టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బలపరిచారు. ‘విద్యుత్ రంగంలో విజయం–పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన–ఐటీ రంగ అభివృద్ధి’ తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు బలపరిచారు. ‘వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు’ తీర్మానాన్ని ఎంపీ బి.వినోద్కుమార్ ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ బాల్క సుమన్ బలపరిచారు. ‘తాగునీటి వ్యథతీర్చే మిషన్ భగీరథ’ తీర్మానాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బలపరిచారు. ఏడో తీర్మానంగా ‘సామాజిక రుగ్మతలపై సమరం’ను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. 1.సంక్షేమంలో స్వర్ణయుగం రాష్ట్రంలో 90 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సంక్షేమ రంగానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.35 వేల కోట్లు కేటాయిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా 35.87 లక్షల మందికి ఆసరా పింఛన్ల కోసం ఏటా ప్రభుత్వం రూ.5,330 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందజేస్తోంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు నేరుగా అందజేస్తోంది. ఎస్సీల సంక్షేమానికి రూ.14,375 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,156 కోట్లు కేటాయించింది. మానవీయతే అభిమతంగా రాజీలేని కార్యాచరణ రూపొందించింది. బీసీ సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.5,070 కోట్లు కేటాయించింది. ఎంబీసీల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మైనార్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 470 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు కేటాయించి వారిని ఆదుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 20 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటుంది. విద్యుత్ శాఖలో 24 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. సైనికులు, సింగరేణి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 2.6 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. 1,426 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. విద్యార్థులకు మెస్చార్జీల పెంపుతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యార్థులకు సన్నబియ్యం అన్నంతో ఆకలి తీర్చిన ఘనత మా ప్రభుత్వానిదే. 2.80 కోట్ల మందికి రేషన్ బియ్యానికి బడ్జెట్లో రూ.2,200 కోట్లు కేటాయించింది. కార్మికులకు జీవిత బీమా, బీడీ కార్మికుల సంక్షేమం, ఒంటరి మహిళల సంక్షేమం, వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను రద్దు, కళాకారుల సంక్షేమం, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి–కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్, అంగన్వాడీల సంక్షేమం, షీటీమ్స్, జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, పేదల మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు పరమపద వాహనాల ఏర్పాటు వంటి అంశాలను ఈ తీర్మానంలో పేర్కొన్నారు. 2.సాగు, నీటిపారుదల రంగాల్లో నూతనాధ్యాయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువుల్లో ప్రభుత్వం గత రెండేళ్లలో 19,500 చెరువులను బాగు చేసింది. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ చేపట్టింది. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు మొదటిసారి నీళ్లందించాం. ఇప్పటివరకు రూ.35,200 కోట్లు ఖర్చుతో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 11 నెలల రికార్డు కాలంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. పాలమూరు– రంగారెడ్డి, డిండి, ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, మిడ్మానేరు, మిషన్ కాకతీయ పనుల పూర్తికి బడ్జెట్లో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశాం. 3.గ్రామీణ ఆర్థికం పరిపుష్టం..వృత్తులకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.5 వేల కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. విశ్వకర్మలు, కుమ్మరి, గౌడ వృత్తుల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. నేత కార్మికులను ఆదుకునేందుకు తాజా బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించింది. 4.విద్యుత్లో విజయం.. ఐటీలో అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక చేపట్టి విజయం సాధించింది. రాష్ట్రం ఆవిర్భాం సమయంలో స్థాపిత విద్యుత్ సామ ర్థ్యం 6,574 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 11,689 మెగావాట్ల సామర్థ్యం. 2019 నాటికి 27,187 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చింది. టీఎస్ఐపాస్ ద్వారా 2,929 పరిశ్రమలకు అనుమతులు మంజూరుతో రూ.49,463 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో ప్రత్యక్షంగా 1.95 లక్షలు, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి లభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు టీఎస్ప్రైడ్, టీఎస్ప్రైమ్ ఏర్పాటు చేసింది. ఆపిల్ నుంచి అమెజాన్ వరకు దిగ్గజ ఐటీ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. ఈ రంగంలో ఏటా రూ.75,070 కోట్ల పెట్టుబడులతో 4.07 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. 5.వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రభుత్వం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్ పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీల కోసం 134, ఎస్టీలకు 54, బీసీలకు 124, మైనార్టీలకు 201 రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 804కు చేరుకుంది.రాష్ట్రంలో 33 శాతం మేర హరితాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తోంది. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్ పరిధిలో రూ.2247 కోట్ల వ్యయంతో 14,689 కి.మీ మేర బీటీ రహదారులకు మరమ్మతులు చేశాము. రాష్ట్రంలో 2,776 కిలోమీటర్ల నిడివిగల 19 జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సాధించింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. 6.తాగునీటి వ్యథ తీర్చే మిషన్ భగీరథ ఈ పథకానికి ప్రభుత్వం రూ.43 వేల కోట్లు వెచ్చించనుంది. 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాసాలు, 65 పట్టణ ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 19 ఇన్టేక్ వెల్స్ నిర్మాణాలు, 50 నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 596 ఓహెచ్బీఆర్, 547 జీఎల్బీఆర్, 18,500 ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు 1,69,700 కి.మీ. మార్గంలో పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకంలో ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో తెలంగాణ ఆడపడచుల కన్నీటి కష్టాలు దూరం కానున్నాయి. 7. సామాజిక రుగ్మతలపై పోరు.. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, ఈవ్ టీజింగ్ను అరికట్టేందుకు షీటీమ్స్, ఆహార పదార్థాల కల్తీ నివారణ, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, అనవసర ఆపరేషన్లకు అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలను ఇందులో వివరించారు. -
10 లక్షల మంది లబ్ధిదారులు
-
10 లక్షల మంది లబ్ధిదారులు
ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయండి: కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన అధికారాలు, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం ఎక్కువగా కలెక్టర్లపైనే ఆధారపడుతుంది. అందుకే చిత్తశుద్ధితో మీరందరూ బాధ్యతలు నిర్వర్తించాలి. మీ విలువైన సమయంలో ప్రతిరోజు ఒక కార్యక్రమంపై ఒక గంట వెచ్చించాలి. వారానికో పథకంపై దృష్టి సారించాలి...’’అంటూ కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో గొర్రెల పెంపకం, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు.. మొత్తంగా 10 లక్షల మంది అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి. రాజకీయ పైరవీలకు తావు లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి’’అని సూచించారు. సోమవారమిక్కడ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన అన్ని జిల్లాల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, కె.తారక రామారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ‘డబుల్’లో పారదర్శకత పాటించాలి.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్ల సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని, పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. గ్రామ సభలోనే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అవసరమైతే ఆధార్ కార్డును అనుసంధానం చేయాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఏ గ్రామంలో ఎన్ని ఇళ్లను కట్టాలనేది ఎమ్మెల్యేలు సూచిస్తారని చెప్పారు. మాంసం ఎగుమతులకు హబ్గా మారాలి రాష్ట్రాన్ని మాంసం ఎగుమతుల హబ్గా మార్చాలని సీఎం ఆకాంక్షించారు. ‘‘గొర్రెల పెంపకం కార్యక్రమం భవిష్యత్తులో తెలంగాణకు శాశ్వత ఆర్థిక ప్రక్రియగా నిలుస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచే గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుంది. రూ.1.25 లక్షల విలువైన యూనిట్ ధరలో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. మిగతా 25 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. నాలుగున్నర లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. త్వరలోనే సొసైటీలలో కొత్త సభ్యులను చేర్పించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు దాటిన గొల్ల కుర్మలు రూ.51 రుసుముతో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీల్లోనే కొత్త సభ్యులను చేర్పించాలా? కొత్త సభ్యులకు కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలా? అనేది కలెక్టర్లే తేల్చాలి. ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు కొనేందుకు సొసైటీ సభ్యులను కూడా తీసుకెళ్తే మంచిది’’అని సూచించారు. జూన్ 2 న ఒంటరి మహిళలకు భృతి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఒంటరి మహిళలకు భృతి, కేసీఆర్ కిట్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ‘‘ఒంటరి మహిళలను గుర్తించడం క్లిష్టమైన అంశం. ఏడాదికి పైగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళను ఒంటరి మహిళలుగా గుర్తించాలి. వారిలో ఎక్కువ మంది పేదలే ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే భృతి వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించడం తేలిక. పట్టణ ప్రాంతాల్లోనూ సమర్థవం తంగా గుర్తించాలి. రాష్ట్రంలో రెండున్నర నుంచి మూడు లక్షల మంది వరకు ఒంటరి మహిళలు ఉం టారని అంచనా. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వెంటనే చేపట్టాలి’’అని సీఎం ఆదేశించారు. పేద గర్భిణుల కష్టాలు తీరాలి.. నెలలు నిండిన పేద గర్భిణీలు కూలీ పనులకు వెళ్తూ కష్టాలు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలని సీఎం అన్నారు. ‘‘వారికి ప్రసవ సమయంలో జీవనోపాధిగా ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం. గర్భిణుల పేర్ల నమోదుకు ఏఎన్ఎంల సేవలను ఉపయోగించుకోవాలి. 12వ వారం ప్రవేశించిన వెంటనే నమోదు ప్రక్రియ చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి. రూ.12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.2 వేల కేసీఆర్ కిట్ వారికి అందిస్తాం. ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా ఇస్తాం. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి సేవలు మెరుగుపరుస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఉన్నట్లు కలెక్టర్లు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందిం చాలి. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కోరాలి. అవసరమైనచోట కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. ఆశా వర్కర్లను కూడా కేసీఆర్ కిట్స్ కార్యక్రమంలో వినియోగించుకోవాలి’’అని సీఎం చెప్పారు. బీడీ కార్మికులను గుర్తించండి.. ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో ఉన్న 81 వేల మంది బీడి కార్మికులను పెన్షన్లకు అర్హులుగా గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఎంతో బాగుంది. 2016–17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్ర సొంత పన్నుల వాటా 21 శాతం వృద్ధి సాధిం చింది. 19.5 శాతం వృద్ధిరేటు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి రేటు 15 శాతానికి తగ్గే అవకాశం లేనే లేదు’’అని వివరించారు. ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీస్ ఆఫీసులు ఏడాదిలోగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ సముదాయాల నిర్మాణం, వచ్చే ఏడాది నుంచి వాటిలో పని జరగాలని సీఎం ఆదేశించారు. పోలీస్ కార్యాలయాల సముదాయాలను పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా నిర్మిస్తామని చెప్పారు. పట్టణాలపై దృష్టి పెట్టండి: కేటీఆర్ రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కలెక్టర్లకు వివరించారు. బడ్జెట్కు అతీతంగా రూ.5 వేల కోట్లు కేటాయించగా, అందులో రూ.1000 కోట్లు జీహెచ్ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీలకు వెచ్చిస్తామన్నారు. కలెక్టర్ల అధ్వర్యంలో ఈ నిధులను ప్రజారోగ్యశాఖ ఖర్చు చేస్తుందని చెప్పారు. పారిశుధ్యం, డంప్ యార్డులు, పబ్లిక్ టాయ్లెట్లు, చెత్త బుట్టల పంపిణీ, కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల వెడల్పు, బస్ బేలు, మార్కెట్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. సాదా బైనామాలపై పర్యవేక్షణ సాదా బైనామాల క్రమబద్ధీకరణను అకారణంగా తిరస్కరించవద్దని సీఎం కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రస్థాయి నుంచి సీనియర్ అధికారుల బృందం ఏదో ఒక జిల్లాకు వెళ్లి సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించాలని ఆదేశించారు. రెవెన్యూ విధానాలను మరింత సులభతరం చేసేందుకు అధ్యయనం జరగాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించిన నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీలు ప్రతి జిల్లాలో పర్యటి స్తాయని, నిధులు వినియోగించిన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. -
'సమాజ్వాదీ' పదాన్ని తీసేసిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి 'సమాజ్వాదీ' అనే పదాన్ని తీసేశారు. దానికి బదులు 'ముఖ్యమంత్రి' అనే పదాన్ని చేర్చారు. ఈ విషయాన్ని కేబినెట్ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ విలేకరులకు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలేష్ ప్రభుత్వం ఇంతకుముందు సమాజ్వాదీ పెన్షన్ యోజన, సమాజ్వాదీ అంబులెన్స్ సేవ, సమాజ్వాదీ స్మార్ట్ఫోన్ యోజన లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీటన్నింటి పేర్లలో ఉన్న పార్టీ పేరు తీసేసి వాటికి బదులు 'ముఖ్యమంత్రి' అని పెట్టనున్నారు. దాంతో ఏ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా ఆ పథకాలను కొనసాగించేందుకు వీలుంటుంది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ముద్రించిన 60 లక్షల రేషన్ కార్డులను ప్రజలకు పంపణీ చేయకూడదని కూడా ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటన్నింటి మీద అఖిలేష్ ఫొటోను అప్పట్లో ముద్రించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ కార్డులను సిద్ధం చేశారు. దాంతో వాటన్నింటినీ రద్దుచేసి, కొత్త కార్డులు ఇవ్వాలని యోగి నిర్ణయించారు. జిల్లా కేంద్రాలన్నింటిలో రోజుకు 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగిలిన గ్రామాలు, తహసీళ్లలో కనీసం 18 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ఈ విషయమై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్తో యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జెవార్ విమానాశ్రయ ప్రాజెక్టుకు కూడా యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడో మాయావతి ప్రభుత్వ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టినా, అఖిలేష్ ప్రభుత్వం జెవార్ కంటే ఆగ్రాలో పూర్తిస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని అఖిలేష్ సర్కారు భావించి దీన్ని పక్కన పెట్టింది. యూపీలో కూడా గుజరాత్ తరహా అభివృద్ధిని తీసుకురావాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు, ఇతర విధానాలతో కూడిన ఒక యాప్ తేవాలని కూడా అనుకుంటున్నారు. బుందేల్ఖండ్ సంబంధిత అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. -
30 శాతం నిధులను కోతపెడుతున్నారు
పంచాయతీరాజ్ కమిషనర్కు సర్పంచుల ఐక్యవేదిక ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: గ్రామాలకు కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 10% నిధులనే పాత విద్యుత్ బకాయిలకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అధికారులు 30% నిధులను కోత పెడు తున్నారని సర్పంచుల ఐక్యవేదిక ఆరోపిం చింది. ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్కృష్ణ ఆధ్వర్యంలో పలు జిల్లాల సర్పంచులు శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్ను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కాకపోవడం, సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తెచ్చారు. సమస్యలపై దృష్టి సారిస్తానని, ప్రభుత్వ ఆదేశాలు అమల య్యేలా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. కమిషనర్ను కలసిన వారిలో సర్పంచుల ఐక్యవేదిక ప్రతినిధులు బుచ్చి రాములు, సుమంగళి, బాలగౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఎం.బాబు, వి.సత్యం తదితరులున్నారు. -
టీడీపీ వారికే ప్రభుత్వ పథకాల లబ్ధి
గడప గడపకూ వైఎస్సార్లో ప్రజల ఆవేదన పట్నంబజారు (గుంటూరు): ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయిందని, టీడీపీకి చెందిన వారైతేనే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పొన్నూరు నియోజవర్గం పెదకాకాని మండలం కొప్పరావూరు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించగా ఆయన ఎదుట సమస్యలు ఏకరువు పెట్టారు. పింఛన్లు, రేషన్కార్డులు, రుణాలు టీడీపీకి చెందినవారైతేనే అందుతున్నాయన్నారు. జిల్లాలోని పొన్నూరు, సత్తెనపల్లి, గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గాల్లో శనివారం గడప గడపకూ వైఎస్సార్ జరిగింది. నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారానికి పాటుపడతామనే భరోసా ఇచ్చారు. ప్రజా బ్యాలెట్ను అందజేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. పింఛను అందక ఇబ్బందులు.. సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గడప గడపకూ వైఎస్సార్ నిర్వహించారు. ఇంటి కోసం ఒకటికీ పదిమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయటం లేదని, గూడు లేక అవస్ధలు పడుతున్నామని గ్రామానికి చెందిన ఎలుకా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్లు నిండినా వృద్ధాప్య పింఛన్ అందడం లేదని సూర్యదేవర భానుమతి అనే వృద్ధురాలు వాపోయింది. సొంతింటి కల నెరవేరేదెప్పుడు..? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ బ్రాడీపేట 14వ అడ్డరోడ్డు పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గడప గడపకూ వైఎస్సార్ చేపట్టారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కా>ర్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. రేషన్ కార్డు కోస దరఖాస్తు చేసుకుంటే పట్టించుకునే నాథుడే లేరని మరికొందరు వాపోయారు. -
ప్రధాని కావాలన్న కోరిక లేదు: అఖిలేశ్
లక్నో: తనకు దేశ ప్రధాని కావాలన్న కోరిక లేదని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. శనివారం ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారని సరదాగా అన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి రాబోయే ఎన్నికల్లో 300కు పైగా సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వారిలో కనీసం 50 శాతం మంది ఓటేసినా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. -
అదనపు విధులతో అవస్థలు
► రెండురకాల పనులతో అంగన్వాడీలకు ఇబ్బందులు లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలోని అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.మండలంలో17 గ్రామ పంచాయతీలు 23 గ్రామాలు ఉండగా వాటిలో మొత్తం 44 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం 28 అంగన్ వాడి కేంద్రాలకు మాత్రమే ఆయాలు ఉన్నారు. మిగతా 16 అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో ఆయాలు లేని అంగన్ వాడీ కేంద్రాలలో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చామన్ పెల్లి, కూచన్ పెల్లి, బోరిగాం, నర్సాపూర్, కనకాపూర్, కాశిగూడా, ధర్మారం, రాచాపూర్, లక్ష్మణచాంద1,4,5, మొదలగు గ్రామాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రకాల విధులతో ఇబ్బందులు మండలంలోని 12 గ్రామాల అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో విధులు నిర్వహించటం తలనొప్పిగా తయారైంది. కేంద్రాలలో ప్రీ ప్రైమరి స్కూల్ కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాల్సిన అంగన్ వాడీ కార్యకర్తలు ఆయాలు లేకపోవడంతో వంటచేయడం , వడ్డించటం, పౌష్టికాహారం పంపిణిచేయడం, చిన్నారులను కేంద్రాలకు తీసుకురావండం, వారిని మళ్లీఇంటికి పంపించడం, కేంద్రాలను శుభ్రం చేయడం వంటి ఆయా విధులు కూడా నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురవుతున్న సమస్యలు అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేక పోవడంతో ఆయలు చేసే కార్యక్రమాలను కార్యకర్తలు చేయడంతో ప్రీ స్కూల్ కార్యక్రమాల సంబంధించిన షెడ్యూల్ నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రీ స్కూల్ కార్యక్రమాలతో పాటు 15 రకాల రికార్డులు రాయటం, సెక్టార్ సమావేశాలకు, ప్రాజెక్టు సమావేశాలకు హాజరు కావలసిన అవసరం ఉంటుంది. ఇట్టి సమావేశాలకు హాజరైన సందర్భాలలో అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీరు చేస్తున్న పనులు చాలనట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రచారంలోను, సర్వేలలోను భాగస్వాములను చేయటంతో మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది. ఇన్ని రకాల విధులు నిర్వహిస్తున్న కారణంగా చిన్నారుల ప్రీ విద్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవే కాకుండా చిన్నారులకు వేసే టీకాలు ఇప్పించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సలహాల కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం వంటి విధులు కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మండలంలో ఖాళీగా ఉన్న ఆయాల పోస్టులను భర్తీ చేయాలని అంగన్ వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. -
సర్పంచ్ అధికారాలకు తప్పని కత్తెర
జన్మభూమి కమిటీలకు మరింత పెత్తనం ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పోటీగా ఉంచే యోచన జేబీ కమిటీల ముందు డమ్మీలుగా మారిన అధికారులు నేటినుంచి ప్రారంభం కానున్న జన్మభూమి గ్రామసభలు పలమనేరు: జన్మభూమి కమిటీల పేరిట చంద్రన్న ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులతో పాలన చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వీరి కారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ఈ కమిటీల ప్రోద్బలంతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా డమ్మీలుగా మారారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్లకు ఏమాత్రం అధికారాలు లేకుండా చేయడంపై పలమనేరు నియోజకవర్గంలోని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పథకానికి కమిటీలే కీలకం ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా, రాష్ట్ర, ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సుల్లో సైతం అధికారులతో పాటు వీరు పాల్గొంటున్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల సమాచారం తదితర వివరాలను వీరికి తప్పకుండా తెలియజేస్తున్నారు. వీరు సిఫారసు చేస్తే గానీ పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులతో పాటు లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూర్చొబెట్టారు. ఇక రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి విచారణలు, తప్పులు సరిదిద్దుకునే అవకాశంలోనూ వీరిదే హవా. ఇలా ప్రతి అంశంలోనూ జేబీ కమిటీ సభ్యులే కీలకంగా మారారు. నేటినుంచి సాగే జన్మభూమి గ్రామసభల్లో వీరికి మరింత పెత్తనం కట్టబెట్టడం మరింత వివాదంగా మారింది. స్థానికసంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్ల అధికారాలకు కత్తెర వేయడంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నేటి నుంచి జరిగే గ్రామసభల్లో వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం
వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలపై షెడ్యూల్డు కులాల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ ఎస్సీ వలంటీర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు, ఎస్సీ కార్పొరేషన్ అందించే పథకాలపై అవగాహన కల్పించారు. వయోజన విద్య కింద అందిస్తున్న పథకాలను వివరించారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు వీవీ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డు కులాల వారి కోసం ప్రభుత్వం అనేక రారుుతీలను ప్రకటించిందన్నారు. గతంలో మత్స్యశాఖ నుంచి తీసుకున్న సామగ్రిపై 50 శాతం రారుుతీ ఉండగా ప్రస్తుతం 90 శాతం రారుుతీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల యూనిట్కు కేవలం లక్ష రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఎస్సీ మత్స్యకారులకు మూడు చక్రాల వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను యూనిట్లుగా మంజూరుచేస్తామని వెల్లడించారు. ఐస్బాక్స్లు, సీడ్ ట్రాన్సపోర్టు వాహనాలు, సైకిల్ విత్ నెట్, టు వీలర్ విత్ ఐస్ బాక్స్, ఇన్సులేటెడ్ వెహికల్, మరబోట్లు వంటివి 90 శాతం రారుుతీపై మంజూరుచేస్తామని వివరించారు. ఎస్సీ మత్స్యకారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కేవీ ఆదిత్యలక్ష్మి మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువత కోసం ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దానిలో ప్రతి ఎస్సీ నిరుద్యోగి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వీరికి ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ ట్రైనింగ్, కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జనరల్ ఎంప్లాయ్ మెంట్ స్కిల్స్, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ, హోర్ సర్వీస్, బ్యూటీషియన్, ఫిట్నెస్, మాన్యుఫ్యాక్చరింగ్, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం గృహనిర్మాణ, ఉద్యానవన శాఖల ప్రతినిధులు ఆయా శాఖలు అందిస్తున్న పథకాలను తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, వలంటీర్లు, ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. -
‘బాండ్ల’తో బకాయిల చెల్లింపు!
- ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలకు నిధులపై ప్రభుత్వం దృష్టి - పెరిగిన ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితితో వెసులుబాటు - మార్కెట్లో బాండ్ల వేలానికి ప్రణాళిక సిద్ధం - రూ.4 వేల కోట్లకుపైగా బడ్జెట్కు కోత! - శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సహా వివిధ పథకాల కింద బకాయిల చెల్లింపు కోసం బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించనుంది. కేంద్రం రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన రుణ పరిమితి మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.3,122 కోట్ల అదనపు రుణాలు తెచ్చుకునే వెసులుబాటు లభించింది. ఇలా తీసుకునే అదనపు రుణాలను కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర వాటా సమకూర్చేందుకు వినియోగించాలని కేంద్రం సూచించింది. కానీ తక్షణ అవసరాల దృష్ట్యా అదనపు రుణంతో బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నెల రోజుల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ పథకాల బకాయిలు చెల్లించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు అమల్లోకి రావడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు దాదాపు రూ.2,000 కోట్లు బకాయిలున్నాయి. రుణమాఫీ మూడో విడత బకాయిలు రూ.2,020 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూ.720 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.5,140 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ విభాగాల్లో దాదాపు రెండు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక తక్షణ ప్రాధాన్యమైన ధాన్యం కొనుగోళ్ల కోసం సైతం ఆర్థిక శాఖ ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే బకాయిలకు నిధులు సర్దుబాటు చేసేందుకు నవంబర్లో ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. శుక్రవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ రాజీవ్శర్మ సమక్షంలో ఆర్థికశాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిం చినట్లు తెలిసింది. ఇప్పటికే మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.9,900 కోట్లు సమీకరిం చింది. వచ్చే రెండు నెలల్లో మరో రూ.2,600 కోట్లు సమకూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బడ్జెట్కు కోత ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యాలు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా 2016-17 బడ్జెట్లో రూ.4 వేల కోట్లకు పైగా కోత వేయాలని ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్మిట్టల్ దీనిపై కసరత్తు ప్రారంభించారు. శాఖలవారీగా వాస్తవ ఆదాయ వ్యయాలు, బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టిందెంత, రాబోయే ఐదు నెలలకు ఎంత ఖర్చు పెట్టే అవకాశముందనే లెక్కలు తీస్తోంది. స్పెషల్ సీఎస్లకు మూడు నాలుగు శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించి... రాబోయే ఐదు నెలల్లో ఎంత ఖర్చు చేయగలిగే వీలుంది, బడ్జెట్ కేటాయింపుల్లో ఎంత మిగులు సాధించే వీలుందనే అంశాలపై అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మొత్తం 1.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించింది. అందులో మొదటి ఏడు నెలల్లో అంటే అక్టోబర్ నెలాఖరు వరకు దాదాపు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ లెక్కన మిగతా ఐదు నెలల్లో రూ.78 వేల కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలు గుర్తించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది. మొత్తంగా కనీసం రూ.4,000 కోట్లకు తగ్గకుండా బడ్జెట్లో కోత పెట్టే దిశగా కసరత్తు సాగుతోంది. -
అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలు
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: పార్టీ నేతలు అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై నేతలు అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు వాటిద్వారా ఎలా లబ్ధి చేకూర్చాలో ఆలోచించాలన్నారు. అప్డేట్ కానివారు అవుట్డేట్ అవుతారన్నారు. పార్టీ ముఖ్యనేతల కార్యగోష్టి రెండోరోజున గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ జరిగింది. ఆరోగ్యం, అవగాహన, నియోజకవర్గాలవారీగా అభివృద్ధి సూచికలు, ప్రభుత్వ పథకాల అమలు, సమ్మిళిత అభివృద్ధి, నియోజకవర్గాలవారీగా డ్యాష్బోర్డ్ నిర్వహణ తదితరఅంశాలపై బృందాలవారీ అవగాహన నిర్వహించారు. కార్యగోష్టికి హాజరైనవారు లేవనెత్తిన సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధిలో తమ పాత్ర ఏమిటని ఓ నేత ప్రశ్నించగా అభివృద్ధిని అడ్డుకోకుంటే చాలని వ్యాఖ్యానించారు. -
ఉత్తమ కలెక్టర్గా డాక్టర్ యోగితా రాణా
నేడు గోల్కొండ కోటలో సీఎం చేతుల మీదుగా అవార్డు ఏడాది పరిపాలనలోనే లక్ష్యాలు పూర్తి ఉపాధిహామీ, హరితహారంలో రాష్ట్రంలో మొదటి స్థానం ఇందూరు :జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణాను రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏడాది కాలంలోనే నిజామాబాద్ కలెక్టర్గా పని చేసిన యోగితారాణా ప్రభుత్వంతో, ప్రజలతో, ప్రజాప్రతినిధులతో భేష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు విధించిన లక్ష్యాన్ని చేధించి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారు. జిల్లాకు నిర్దేశించిన 3.35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఈ నెల 13 నాటికే 3.36 కోట్ల మొక్కలు నాటించారు. ఇంకా మొక్కలు నాటింపజేస్తున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల కలెక్టర్ల పనితీరుతో పోలిస్తే కలెక్టర్ యోగితా రాణా అన్ని విధాలుగా ముందంజలో ఉన్నారని, పనితీరు, తపనను గుర్తించిన ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ కలెక్టర్గా ఎంపిక చేసింది. సోమవారం హైదరాబాద్లోని గోల్కొండ కోటలో నిర్వహించే స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యోగితా రాణా అవార్డును అందుకోనున్నారు. అయితే ఉత్తమ జిల్లా కలెక్టర్గా నిజామాబాద్ కలెక్టర్కు అవార్డుకు రావడం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. ఉత్తమ కలెక్టర్గా ఎంపిక కావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏడాది పూర్తయిన కానుకగా... గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ తరువాత జిల్లాకు కలెక్టర్గా యోగితా రాణా వచ్చారు. 2015 ఆగస్టు 14న బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఏడాదిలోనే కాలంలోనే ఆమె జిల్లా పరిపాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వ పథకాల అమలు, అధికారులచే పనులు వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. ఉపాధిహామీలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టి అవార్డును అందుకున్న యోగితా రాణా, ప్రస్తుతం హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లాను మరో సారి రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టారు. విద్య, వైద్యం, సంక్షేమం పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి పనుల్లో, పథకాల్లో పురోగతి తీసుకువచ్చారు. మాతా,శిశు మరణాల రేట్లను తగ్గించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో గతంలో కంటే భిన్నంగా మంచి ఫలితాలు రాబట్టారు. సుడిగాలి పర్యటనలు, తనిఖీలతో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను, ఉద్యోగులను మందలించి, పలువురిపై వేటు కూడా వేశారు. ఏడాది పరిపాలన, పని తనానికి రాష్ట్రం ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్గా అవార్డును ఇవ్వడం కానుకగానే అనుకోవచ్చు. -
పంచాయతీలకు ప్రోత్సాహకాలు
♦ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ ♦ బహిరంగ మలవిసర్జన నిర్మూలన ప్రాంతంగా గజ్వేల్ ♦ అధికారికంగా ప్రకటించిన మంత్రి ♦ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సన్మానం గజ్వేల్: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్రావు అన్నారు. హరితహారంతోపాటు ఇంకు డు గుంతల నిర్మాణం, పారిశుద్ధ్యలోప నివారణలో శ్రద్ధ చూపే పంచాయతీలకు వీటినిఅందిస్తామన్నా రు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నిర్మూలన(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నా రు. గురువారం సాయంత్రం మెదక్ జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు డోలు వాయించి... బహిరంగ మలవిసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) ప్రాంతంగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నంబర్వన్ నియోజకవర్గంగా గజ్వేల్ను తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించడంతో సంబరపడిపోకుండా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా చొరవచూపాల న్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి చొరవ చూపే పంచాయతీలకు నిధులు కేటాయించే విషయంలో ప్రాధాన్యతనిస్తామన్నారు. గజ్వేల్ను పొగరహిత నియోజకవర్గంగా ప్రకటిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందేలా చూస్తామన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారి జాబితాను పంచాయతీల వారీగా రూపొందించి ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుకు అందించాలన్నారు. మారుతున్న గజ్వేల్ రూపురేఖలు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువనుందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఖర్చు పెడుతున్న పైసా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ రోనాల్డ్రోస్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అందరి దృష్టి గజ్వేల్పైనే కేంద్రీకృతమైందన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడి ప్రజలు ప్రతి అంశంలోనూ బాధ్యతాయుతంగా మెలగాలని ఆకాంక్షించారు. పంచాయతీలకు కొత్తరూపు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ అన్నారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జేసీ వెంకట్రాంరెడ్డి, ఎమ్మె ల్సీ ఫారూక్ హుస్సేన్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణభూపాల్రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పంచాయతీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ను సాధించిన ప్రజాప్రతినిధులందరినీ సన్మానించారు. -
ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయూలి
కలెక్టర్ నీతూ ప్రసాద్ ముకరంపుర : ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రం నంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో క్లోరినేషన్, హరితహారం, ఆరోగ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, కల్యాణలక్ష్మి, ఆసరా పథకాలతోపాటు జిల్లా, మండలాల విభజన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేరుుంచాలన్నారు. సీజనల్వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం మెరుగుపర్చాలనానరు. జిల్లాలో 76శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా వాటిని పూర్తి చేయూలన్నారు. గ్రామాల్లో చేపట్టిన హరితహారం, ఈజీఎస్, ఐఎస్ఎల్పై ప్రత్యేకాధికారులు సమీక్షించాలని సూచించారు. వీటిలో గ్రామస్తులను భాగస్వాములను చేయూలని చెప్పారు. ఇందుకోసం గ్రామ, మండలస్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, చెరువులు, పాఠశాలలు, కుంటలు, రహదారులకిరువైపులా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మండలాల విభజనకు గల కారణాలు, ఇతర అంశాలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారం నివేదికలను మ్యాపులతో సహా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి : ముస్లింలకు ప్రభుత్వ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని పేద ముస్లింలకు ప్రభుత్వం అందించే దుస్తులను మంత్రి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు, మతాలకు, పండగలకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రంజాన్ పండగను ముస్లింలు ఆర్థిక తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పేద ముస్లింల పిల్లల చదువుల కోసం నియోజకవర్గానికో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26,27 తేదీల్లో ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడ్త్యి రాంచంద్రునాయక్, సర్పంచ్ బారి వెంకటమ్మ, ఎంపీటీసీ బారి శ్రీనివాస్, తహసీల్దార్ కిషోర్కుమార్, ఎంపీడీఓ విద్యాచందన, మసీదు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రఫిక్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిలో పెద్దపల్లిదే అగ్రస్థానం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. మిషన్కాకతీయ పెద్దపల్లిలో కమీషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. పెద్దపల్లిలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎడెల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు పక్కన పెట్టిన స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయల మిషన్ కాకతీయ పనులను బినామీలకు అప్పగిస్తూ కాంట్రాక్టర్ అవతారమెత్తారని ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచే గోదావరిజలాలు హైదరాబాద్ తీసుకెళ్తానన్న సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గానికి నీటిని తరలించుకుపోతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. సుల్తానాబాద్లో పైపును తొలగించి చెరువు నింపింది తానేనని చెప్పినా.. కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. తాము పైపులను ధ్వంసం చేయడం వల్లే అప్పన్నపేట వద్ద సంపులోకి గోదావరి జలాలు వదిలే ఏర్పాట్లు చేస్తున్నారని విజయ్ అన్నారు. 42 కిలోమీటర్ల పైపులైన్ ఇక్కడి భూముల నుంచే వెళ్తోందని, ఎల్లంపల్లి నీటిని అప్పన్నపేట, పెద్దపల్లి, గర్రెపల్లి, సుల్తానాబాద్ చెరువుల్లోకి వదలాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉందంటూ తెలంగాణ ఆర్టీసీని మూసేస్తామని సీఎం ప్రకటించడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని, డ్రైవర్, కండక్టర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, నాయకులు ఉప్పురాజు, బొడ్డుపల్లి శ్రీను, సంపత్, అశోక్, కుమారస్వామి, కోనేరు వినాయకరావు, జగదీశ్, అక్కపాక తిరుపతి, రంగయ్య, కొమ్ము శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
గిరిజనుల దరిచేరని ప్రభుత్వ పథకాలు
కనీస వసతులకు నోచుకోని గిరిజన గ్రామాలు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి భుజంగ్రావు ఉట్నూర్ రూరల్ : గిరిజనుల దరికి ప్రభుత్వ పథకాలు చేరడం లేదని, కనీసం మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించడం లేదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగ్రావు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని బీర్సాయిపేట పంచాయితీ పరిధిలోని లేండిగూడ, నర్సాపూర్-జే గ్రామాల్లో ఆయన పర్యటించారు. నిజ నిర్దారణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా లేండిగూడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు లేక గ్రామవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాలకు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ కరెంటు సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేక గిరిజన చిన్నారులు పౌష్టికాహారానికి నోచుకోవడం లేదని, దీంతో రక్త హీనతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కనీసం తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. అదే విధంగా నర్సాపూర్-జే గ్రామంలో సందర్శించగా గ్రామంలో 300 జనాభా ఉన్నప్పటికీ కనీసం రోడ్డు సౌకర్యం , మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపారు. నీటి కోసం ఊరి పొలిమెరల్లో ఉన్న వాగు నుంచి చెలిమెలు ఏర్పాటు చేసుకొని నీటిని తీసుకువచ్చి తాగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం గ్రామాల వైపు దృష్టి సారించి వారికి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ,హెచ్ఆర్సీలకు పంపిస్తామన్నారు. ఆయన వెంట ప్రజా సంఘాల నాయకులు నేతావత్రాందాస్, రామారావు, సుగుణక్కలు తదితరులు ఉన్నారు. -
చలివేంద్రాల్లో సొంత వ్యాపారం
ప్రభుత్వ చలివేంద్రాలకు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి మజ్జిగ కొనుగోలు సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ పథకాల్లోనూ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట. మండే ఎండల్లో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చలివేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మజ్జిగను ముఖ్యమంత్రి సొంత కంపెనీ హెరిటేజ్ నుంచే కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఎండల ధాటికి జనం అల్లాడిపోతుండడంతో అన్ని జిల్లాల్లో చలివేంద్రాలను నెలకొల్పి 45 రోజులపాటు ప్రజలకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఏప్రిల్ 18న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించా రు. ఇందుకుగాను ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున 13 జిల్లాలకు మొత్తం రూ.39 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 25న జీవో జారీ చేసింది. మజ్జిగ పంపిణీని ముఖ్యమంత్రి సంస్థకు మేలు చేసే పథకంగా మార్చేసినట్లు తేటతెల్లమవుతోంది. నిధులు హెరిటేజ్ ఖాతాలోకే... హెరిటేజ్ కంపెనీ నుంచి పెరుగును కొనుగోలు చేసి, చలివేంద్రాలకు సరఫరా చేయాలని జిల్లా అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ప్రభుత్వ చలివేంద్రాల్లో హెరిటేజ్ కంపెనీ పెరుగుతో చేసిన మజ్జిగనే వినియోగించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి పెరుగును కొనుగోలు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎమ్.ఎమ్.నాయక్ పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, సాలూరు, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, చీపురుపల్లి తహసీల్దార్లకు లేఖలు రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరీ ఇంత బరితెగింపా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార డెయిరీల్లో పెరుగు తక్కువ ధరకే లభిస్తున్నా.. హెరిటేజ్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార డెయిరీలకు ఊతమివ్వాల్సింది పోయి ముఖ్యమంత్రి తన సొంత కంపెనీకే కాంట్రాక్టులను కట్టబెడుతుండడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చలివేంద్రాలకు ప్రభుత్వం కేటాయించిన రూ.39 కోట్లలో సింహభాగం నిధులు హెరిటేజ్ సంస్థ ఖాతాలోకే వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. ఈ నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రన్న సంక్రాంతి కానుకలో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు జాతీయస్థాయిలో చర్చ జరిగింది. చలివేంద్రాల్లోనూ చేతివాటమేనా! మండే ఎండల్లో బాటసారుల గొంతు తడపాల్సిన చలివేంద్రాలు అధికార పార్టీ నేతల జేబులు నింపుతున్నాయి. ప్రతీ జిల్లాలో దాదాపు 3 వేల చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. వాటిలో మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్ల జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ నిధులు భారీగా దారి మళ్లుతున్నట్లు క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో తాటాకు పాకలు వేసి రెండు కుండలు పెట్టి, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను తామే ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలాప్రాంతా ల్లో ప్రచార ఆర్భాటమే తప్ప నీళ్లు పోసే దిక్కులేదు. బాటసారులే నీళ్లు పోసుకుని తాగి వెళ్లాల్సి వస్తోంది. చలివేంద్రాల ముసుగులో సర్కారు సొమ్మును తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా లూటీ చేస్తున్నా.. ఇదేమిటని అడిగే దిక్కు లేకపోవడం గమనార్హం. -
ప్రభుత్వ పథకాలకు ‘కార్పొరేట్’ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి, శాంతిభద్రతల అంశంలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ కోసం రూ. 1,200 కోట్లతో నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగరంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష సీసీ కెమెరాల ప్రాజెక్టుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద విరివిగా విరాళాలు అందజేయాలని మంత్రి కోరారు. నగరంలో నేరాల సంఖ్య తగ్గుముఖం ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో నేరస్తులు నగరంలో అడుగు పెట్టేందుకు సాహసించడం లేదని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్తో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతిభద్రతల కోసం రూ. వేల కోట్ల నిధులను కేటాయించి పోలీసు శాఖకు సహకరిస్తోందన్నారు. పాతబస్తీలోని కామాటిపూర పోలీసు స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సీఎస్ఆర్ పథకం కింద రూ. కోటి విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ యాజమాన్యం.. తొలి విడతగా రూ. 25 లక్షల చెక్కును మంత్రి ఈటల సమక్షంలో సంస్థ హెచ్ఆర్ డెరైక్టర్ యూపీ పానీ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యూపీ పానీ మాట్లాడుతూ తమ విద్యుత్ కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కోసం సీఎస్ఆర్ గతేడాది రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.450 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ చెర్మైన్ నృపేందర్రావు, ఎన్టీపీసీ దక్షిణ భారత విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేట నెం.1
♦ జాతీయ ఖ్యాతి ♦ ‘పంచాయతీ స్వశక్తికరణ్’ పేరిట మూడు అవార్డులు ♦ 24న ప్రధాని చేతుల మీదుగా ప్రదానం ♦ మండలంలో హర్షాతిరేకాలు ♦ క్రెడిట్ అంతా మంత్రిదేనని స్పష్టీకరణ సిద్దిపేట రూరల్: సమష్టి కృషితో సిద్దిపేట పరుగులు తీస్తోంది. అభివృద్ధితోపాటు పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల అమలులో దూసుకుపోతోంది. ఓవైపు మంత్రి హరీశ్రావు సహకారం.. మరోవైపు ప్రజాప్రతినిధుల ఉత్సాహం.. ఇంకోవైపు అధికారులు, సిబ్బంది చురుకుదనం కలగలసి సిద్దిపేట అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. సిద్దిపేట మండలం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పంచాయతీ స్వశక్తికరణ్’ అవార్డులను మూడింటిని దక్కించుకుని రికార్డు సృష్టించింది. మూడు కేటగిరీల్లోనూ సిద్దిపేటకు స్థానం లభించింది. ప్రభుత్వ కార్యకలాపాల సక్రమ నిర్వహణకు గాను సిద్దిపేట మండలం, పారిశుద్ధ్య విభాగంలో ఇబ్రహీంపూర్, పథకాల అమలు (సోషల్ సెక్టార్)లో లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉత్తమంగా ఎంపికయ్యాయి. ఇందులో ఇబ్రహీంపూర్ మంత్రి హరీశ్రావు దత్తత గ్రామం కావడం గమనార్హం. ఈ అవార్డులను ఈనెల 24న ప్రధాని చేతుల మీదుగా అందుకోనున్నారు. అవార్డుల పంట పండడంతో మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మండలంతోపాటు ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చేసిన కష్టానికి ఫలితం లభించిందని వ్యాఖ్యానించారు. తామెంత చేసినా ఇందులో మంత్రి హరీశ్రావు చొరవే అధికమని వారు చెబుతున్నారు. ఈ అవార్డుల ఫలితం కూడా మంత్రికే దక్కుతుందని వారు భావిస్తున్నారు. ఐక్యతే ముందుకు నడిపించింది... ఇబ్రహీంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా ఐక్యంగా కదిలారు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాం. ప్రతి ఇంటిముందు ఐదు మొక్కలు నాటించాం. వాటి సంరక్షణ బాధ్యత ఆ ఇంటి యజమానికే అప్పగించాం. గ్రామంలో జరుగుతోన్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పారిశుద్ధ్యంలో నంబర్ వన్గా నిలిచాం. - కుంబాల లక్ష్మి, సర్పంచ్, ఇబ్రహీంపూర్ అందరి సహకారంతో... ప్రజలందరి సహకారంతో లింగారెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పాలకవర్గంతోపాటు గ్రామస్తులతో చర్చించి అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకుంటాం. ప్రధానంగా తడి,పొడి చెత్త వేరు చేయడం మంచి సత్ఫలితాలనిచ్చింది. మంత్రి హరీశ్రావు సంపూర్ణ సహకారంతో గ్రామంలో అన్ని పథకాలు ప్రజల దరికి చేరవేరుస్తున్నాం. - బొండ్ల రామస్వామి, సర్పంచ్, లింగారెడ్డిపల్లి మంత్రి సహకారంతోనే అవార్డులు... మంత్రి హరీశ్రావు సహకారంతో మండలం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో సిద్దిపేట మండలానికి మూడు పురస్కారాలు రావడం వెనుక మంత్రి కృషి ఎంతో ఉంది. మండలంలో అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయి. పథకాల అమలుపై కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట మండలంతోపాటు, ఇందులోని ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలు అవార్డులకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. - ఎర్ర యాదయ్య, ఎంపీపీ సిద్దిపేట -
ఇది మోసకారి ప్రభుత్వం..
♦ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు ♦ రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం రూ.లక్షన్నరేనా? ♦ కుటుంబ పోషణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరా.. ఇదేం న్యాయం? ♦ బాధితుల తరఫున సర్కారుపై న్యాయ పోరాటం చేస్తాం ♦ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా సాక్షి ప్రతినిధి, కడప: ‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలు అందవు. జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారులపై వేటు వేస్తారు. వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబ పోషణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం మరెక్కడా ఉండదు. రాష్ట్రంలో పచ్చి మోసకారి ప్రభుత్వం పాలన చేస్తోంది’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బిజీబిజీగా గడిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల వివాహం చేసుకున్న మూడు జంటలను ఆశీర్వదించారు. వివిధ కారణాలతో మృతి చెందిన 8 కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వృద్ధులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఇది వరకు పింఛన్ వచ్చేది నాయనా.. ఇప్పుడు రావడం లేదు. ఎనిమిదేళ్లు పింఛన్ తీసుకున్నా... జన్మభూమి కమిటీలు వచ్చాక పింఛన్ తొలగించారు’’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరుఫున అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాం. సిగ్గుమాలిన ప్రభుత్వం అర్హులందరికీ న్యాయం చేయడం లేదు. ఇదే విషయమై మీ తరుఫున న్యాయ పోరాటం చేస్తాం’’ అని ప్రతిపక్ష నేత వారికి అభయమిచ్చారు. టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ‘‘పక్కా గృహాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇప్పుడేమో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే ఇల్లు ఇస్తారట. వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం చేయాలి సార్’’ అంటూ గండికొవ్వూరు కాలనీ వాసులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొర పెట్టుకున్నారు. ‘‘అర్హులందరినీ సమానంగా చూడడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి. రాష్ట్రంలో నీతిలేని ప్రభుత్వం పాలన చేస్తోంది’’ అని జగన్ దుయ్యబట్టారు. రైతు కుటుంబానికి ఆసరా ఏదీ? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామనడం మినహా ఆచరణలో లేదని జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘సిద్ధారెడ్డిగారిపల్లెలో మోహన్రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ.లక్షన్నరే ఇస్తామని ప్రకటించారు. అప్పులు ఇచ్చిన వాళ్లకు రూ.50 వేలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని అధికారుల వద్దే ఉంచుకున్నారు. పరిహారం కుటుంబ పోషణకు ఆసరాగా ఉండాలి. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారు. ఇదేం న్యాయం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలిస్తేనే ప్రజల గుండెల్లో పాలకులకు సుస్థిర స్థానం దక్కుతుందన్నారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఆయన వెంట కడప ఎంపీ అవినాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు ఉన్నారు.