Harry Brook
-
అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: కేకేఆర్ స్టార్
హ్యారీ బ్రూక్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు మొయిన్ అలీ (Moeen Ali) సమర్థించాడు. రెండేళ్ల పాటు ఈ ఇంగ్లండ్ యువ బ్యాటర్పై నిషేధం విధించడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అకస్మాత్తుగా ‘తప్పుకోవాలనే’ నిర్ణయం తీసుకోవడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు.ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురుదెబ్బకాగా ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతడు రాబోయే రెండు సీజన్ల పాటు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈ నిషేధం అమలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంపికైన బ్రూక్.. మార్చి 22 నుంచి జరిగే ఐపీఎల్ 18వ సీజన్ (IPL 2025)లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.ఐపీఎల్లో ఈ ఏడాది సవరించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో తన పేరు నమోదు చేసుకొని అమ్ముడైన తర్వాత సీజన్కు అందబాటులో ఉండాల్సిందే. గాయం తప్ప ఇతరత్రా కారణాలను సాకులుగా చెబితే కుదరదు. నిబంధన ప్రకారమేఇలా సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ఆటగాళ్లను రెండు సీజన్ల పాటు వేలంలో.. అలాగే లీగ్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ నియమావళిలో నిబంధనలు పొందుపరిచారు. తాజా నిబంధన ప్రకారమే హ్యారీ బ్రూక్పై చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా 2025, 2026 సీజన్లలో బ్రూక్ పాల్గొనేందుకు వీలుండదు. ఈ మేరకు సదరు క్రికెటర్తో పాటు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు సమాచారం ఇచ్చారు. నిజానికి బ్రూక్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. నానమ్మ మృతి కారణం చూపుతూగతేడాది కూడా తన నానమ్మ మృతి కారణం చూపుతూ ఏకంగా లీగ్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ క్రికెట్కే తన ప్రాధాన్యత అని స్వదేశంతో భారత్ (జూన్లో)తో జరిగే సిరీస్కు ముందు పూర్తిస్థాయి ఉత్తేజంతో అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తాఈ పరిణామాల నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ కఠిన నిర్ణయం కాదు. బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరించిందో నేను అర్థం చేసుకోగలను. బ్రూక్ ఒక్కడే కాదు.. చాలా మంది గతంలో ఇలాగే చేశారు.తమకు నచ్చినపుడు తిరిగి వచ్చి ఆర్థికంగా లబ్ది పొందారు. అయితే, వారికి ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఆటగాళ్లను కొన్న ఫ్రాంఛైజీలకు నష్టం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక్క ఆటగాడి వల్ల జట్టు కూర్పు, వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అకస్మాత్ మార్పుల వల్ల అంతా గందరగోళమైపోతుంది. హ్యారీ బ్రూక్ను కొనుక్కున్న జట్టు అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేయాలనే చూస్తుంది. కానీ అది సాధ్యం కావచ్చు.. కాకపోవచ్చు. కాబట్టి వారు తమ ప్రణాళికలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.ఆదిల్ రషీద్ సైతంగాయం వల్ల సీజన్ నుంచి తప్పుకొంటే ఎవరూ తప్పుబట్టరు. బోర్డు కూడా ఇందుకు మినహాయింపు ఇస్తుంది. కానీ ఇలా వేరే కారణాలు చూపుతూ అర్ధంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని మొయిన్ అలీ బ్రూక్ తీరును విమర్శించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ కూడా మొయిన్ అలీ తరహాలోనే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో మొయిన్ అలీని కోల్కతా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..? -
అతడిని కెప్టెన్ చేస్తారా?.. అదే జరిగితే..: స్టువర్ట్ బ్రాడ్ వార్నింగ్
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఘోర పరాభవాలు చవిచూసింది. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 (ICC ODI World Cup)లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బట్లర్ బృందం... కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ జట్టు చేతిలోనూ ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గ్రూప్-బి మ్యాచ్లలో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సౌతాఫ్రికా చేతిల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.అంతకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్లోనూ ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోస్ బట్లర్ (Jos Buttler) ఇంగ్లండ్ టీ20, వన్డే జట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.బట్లర్ వారసుడిగా స్టోక్స్? ఈ నేపథ్యంలో బట్లర్ స్థానంలో యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నియామకం దాదాపు ఖరారైందనే వార్తలు రాగా.. ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ మాత్రం భిన్నంగా స్పందించాడు. బట్లర్ వారసుడిగా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా స్పందించాడు.బెన్ స్టోక్స్ను గనుక వన్డే జట్టు కెప్టెన్ను చేస్తే అంతకంటే అనాలోచిత నిర్ణయం మరొకటి ఉండదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి మాట్లాడటం కూడా వృథా ప్రయాసేనని పేర్కొన్నాడు. ఇప్పటికే స్టోక్స్పై పనిభారం ఎక్కువై.. గాయాల బారిన పడుతున్నాడని.. అలాంటిది అదనపు బాధ్యతలు అప్పగిస్తే అతడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండదుఈ మేరకు... ‘‘స్టోక్స్ను కెప్టెన్గా నియమిస్తే అంతకంటే నిరాశ కలిగించే విషయం మరొకటి ఉండదు. ఇంగ్లండ్ బోర్డు గనుక ఈ పని చేస్తే.. అప్పుడు స్పందించడానికి నా దగ్గర మాటలు ఉండవు. ముందుగా షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకోవాలి.టెస్టు క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అతడు ఐపీఎల్ను వదిలేశాడు. కీలక సిరీస్లలో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఫిట్గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గడిచిన మూడేళ్లలో స్టోక్స్ ఎన్ని ఓవర్లు బౌల్ చేశాడో గుర్తుందా?మోకాలి గాయం వల్ల అతడు సతమతమైపోతున్నాడు. ఇలాంటి సమయంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఓవర్ల వేయాలంటూ అతడిపై అదనపు భారం మోపడం ఏమాత్రం సరికాదు. గణాంకాలతో పనిలేదు.121 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన క్రికెటర్గా చెబుతున్నా.. టెస్టు మ్యాచ్ ఆడటం కంటే యాభై ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్ ఆడటం వల్లే ఆటగాళ్లు ఎక్కువగా అలసిపోతారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. స్టోక్స్పై అదనపు భారం మోపితే.. పరిస్థితులు మరింత దిగజారిపోతాయంటూ ఇంగ్లండ్ బోర్డును ఈ సందర్భంగా హెచ్చరించాడు.గాయాలతో సావాసంకాగా 33 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్టోక్స్ ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్గా ఉన్నాడు. ఇక జూలై 2022లో వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డే వరల్డ్కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత మళ్లీ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున వైట్బాల్ క్రికెట్ ఆడనేలేదు. గత రెండేళ్లుగా అతడు మోకాలి నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. 2024 ది హండ్రెడ్ లీగ్ సమయంలో మరోసారి గాయపడ్డ స్టోక్స్.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్తో సిరీస్కూ గైర్హాజరైన స్టోక్స్.. సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా తీసుకువస్తే అతడి కెరీర్కే ప్రమాదమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు దక్కని చోటు.. కెప్టెన్గా అతడు! -
ఐపీఎల్ నుంచి ఔట్.. హ్యారీ బ్రూక్కు బీసీసీఐ షాక్..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్-2025(IPL 2025) నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే రాబోయే సిరీస్లను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం ..వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. ఈ క్రమంలో అతడిపై కఠిన చర్యలకు భారత క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. బ్రూక్పై రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సస్పెన్షన్ గురించి బీసీసీఐ ఇప్పటికే ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి."ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త రూల్స్ గురించి ప్రతీ ఆటగాడికి స్పష్టంగా తెలియజేశాము. ఈ రూల్స్ ప్రకారం.. హ్యారీ బ్రూక్పై రెండేళ్లపాటు నిషేదం విధించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో పాటు బ్రూక్కు అందించాము. బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ప్రతీ ఆటగాడు కట్టుబడి ఉండాలి" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. కాగా బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్-2027 వరకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.చదవండి: IPL 2025: లక్నోకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు? -
IPL 2025: బ్రూక్ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు, ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టు సేవలకు సిద్దమయ్యేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ తెలిపాడు. బ్రూక్ను గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి. గత సీజన్లోనూ బ్రూక్ ఇలాగే పొంతన లేని కారణాలు చెప్పి క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్లో కూడా ఢిల్లీనే బ్రూక్ను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బ్రూక్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలిగినా, అసలు కారణాలు వేరే అని తెలిసింది. ఆ సీజన్ వేలంలో తక్కువ ధర (రూ. 4 కోట్లు) పలికినందుకు బ్రూక్ వైదొలిగాడట. 2023 సీజన్లో బ్రూక్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల రికార్దు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. 2024 వేలంలోనూ బ్రూక్ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించగా.. నిరాశ ఎదురైంది.కాగా, బ్రూక్ తాజా నిర్ణయంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. మరి బ్రూక్పై ఐపీఎల్ నిర్వహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.బ్రూక్ ఎపిసోడ్ బయటికి వచ్చాక మరో ముగ్గురు విదేశీ స్టార్లు ఐపీఎల్-2025 నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారని సమాచారం.ఆర్చర్ జాతీయ విధుల దృష్ట్యా ఐపీఎల్కు డుమ్మా కొడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ హోమ్ సమ్మర్కు ముందు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయపడటంతో ఆర్చర్ను ఐపీఎల్ నుంచి వైదలగాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది హోం సమ్మర్లో ఇంగ్లండ్ టెస్ట్ల్లో భారత్ను ఢీకొట్టాల్సి ఉంది. ఆర్చర్ను 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.ఆడమ్ జంపా విషయానికొస్తే.. ఇతన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. జంపా కూడా జాతీయ విధుల పేరుతో ఐపీఎల్కు డుమ్మా కొట్టనున్నాడని తెలుస్తుంది. జంపా 2024 సీజన్లోనూ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో జంపా రాజస్థాన్ రాయల్స్కు ఆడాల్సి ఉండింది.మిచెల్ స్టార్క్ విషయానికొస్తే.. గత సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ను ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. 2025 సీజన్కు ముందు స్టార్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలుగుతాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఇదే కారణం చేత స్టార్క్ తదితర ఆసీస్ టెస్ట్ జట్టు సభ్యులు ఐపీఎల్ నుంచి వైదొలుగుతారని సమాచారం. -
ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్.. బ్యాన్ పడుతుందా?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైదొలిగాడు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్ను ఢిల్లీ కొనుగోలు చేసింది.రాబోయే సిరీస్లు సిద్దమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. ఐపీఎల్ 2024 సీజన్లో కూడా ఢిల్లీనే రూ.4 కోట్లకు హ్యారీ బ్రూక్ని కొనుగోలు చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది సీజన్ నుంచి కూడా బ్రూక్ తప్పకున్నాడు.ఐపీఎల్-2025 సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెట్కు కేటాయించాలని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్కు వారి అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.బ్రూక్పై బ్యాన్..!కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఆటగాడు సరైన కారణంగా లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే సదరు ప్లేయర్పై రెండేళ్ల బ్యాన్ పడనుంది. మరి హ్యారీ బ్రూక్పై ఐపీఎల్ నిర్వహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కాగా ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో బ్రూక్ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. కాగా ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యారీ ఆడాడు. రూ.13.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడిన హ్యారీ బ్రూక్, 11 మ్యాచుల్లో 190 పరుగులు చేశాడు.ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్ను ఎంపిక చేయలేదు. కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?
ఇంగ్లండ్ క్రికెట్లో కెప్టెన్గా జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్థానం ముగిసింది. ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జోస్ బట్లర్ శుక్రవారం ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు నాకౌట్ రేసుకు దూరమైన నేపథ్యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బట్లర్ వెల్లడించాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని వెల్లడించాడు. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు, జట్టుకు మేలు చేస్తుందనుకుంటున్నా. సారథ్య బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’ అని బట్లర్ వెల్లడించాడు.అయితే 2022 టీ20 ప్రపంచకప్ను నాయకుడిగా తన జట్టుకు అందించిన బట్లర్.. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో తన మార్క్ను చూపించలేకపోయాడు. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన ఇంగ్లీష్ జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో బట్లర్ కెప్టెన్సీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.కెప్టెన్గా హ్యారీ బ్రూక్..?పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్గా మిడిల్-ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. గతేడాది బట్లర్ గైర్హజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఇంగ్లండ్ జట్టు సారథిగా కూడా బ్రూక్ వ్యవహరించాడు.అయితే ఈ సిరీస్ను 3-2 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అయితే జట్టులో లివింగ్ స్టోన్, అదిల్ రషీద్, డకెట్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి .. ఇంగ్లండ్ హెడ్ కోచ్ మాత్రం బ్రూక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లండ్ మాజీలు సైతం బ్రూక్ను కెప్టెన్గా నియమించాలని ఈసీబీని సూచిస్తున్నారు. ఇంగ్లండ్ తమ తదుపరి వైట్బాల్ సిరీస్ ఈ ఏడాది మేలో వెస్టిండీస్తో ఆడనుంది. ఈ గ్యాపులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కొత్త వైట్బాల్ కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్లు ఔట్
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను అద్బుతమైన బంతితో వరుణ్ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.బంతి పిచ్ అయిన వెంటనే షార్ప్గా టర్న్ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్లో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్ను వరుణ్ ఔట్ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ Through the gates! 🎯The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo— BCCI (@BCCI) January 25, 2025 -
భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్గా భారత్కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడుకాగా 2022లో వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.బట్లర్ వారసుడిగాఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటున్న బ్రూక్ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో మొత్తంగా 11 మ్యాచ్లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో 2024 ఎడిషన్కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది. కోల్కతా, చెన్నై, రాజ్కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్కే పరిమితం! -
మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్.. నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్కు రూట్కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్లో ఉన్న ఆదిల్ రషీద్కు కిందకు దించాడు. -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్లో నంబర్వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్వన్గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.తాజా ర్యాంకింగ్స్లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్లో భారత్పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.20వ స్థానానికి పడిపోయిన కోహ్లిఆసీస్తో రెండో టెస్ట్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్కు పడిపోయాడు. రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్లో భారత్పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. తొలి రోజు ఇంగ్లండ్దే
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు.క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న సెకెండ్ టెస్టులో బ్రూక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించిన బ్రూక్ కేవలం 91 పరుగుల్లోనే తన 8వ టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 115 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక అతడి అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 280 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ అతడితో పాటు ఓలీ పోప్(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్ 3, మాట్ హెన్రీ రెండు వికెట్లు సాధించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతం 194 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే రెండు వికెట్లు సాధించగా.. వోక్స్, అట్కిన్సన్, స్టోక్స్ తలా వికెట్ పడగొట్టారు. -
జైస్వాల్ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్గా రికార్డు
క్రైస్ట్చర్చ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్తో (77) కలిసి ఐదో వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్క్రిస్ట్-2483 -
Eng vs NZ: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన.. ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ఎంట్రీ
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్కు సిరీస్ను కోల్పోయింది.కివీస్తో మూడు టెస్టులుఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్గా వ్యవహరించే అవకాశం ఉంది.మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లో రాణించిన ఆల్రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి అరంగేట్రం పక్కామరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: Mumbai Pitch: కివీస్తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!? -
రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకున్న రూట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తాజా ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్తో ముగిసిన తొలి టెస్ట్లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (932) సాధించి టాప్ ర్యాంక్ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్ విలియమ్సన్తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్, బ్రూక్ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్లో సెంచరీలు చేసిన పాక్ ఆటగాళ్లు అఘా సల్మాన్, షాన్ మసూద్ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్తో టెస్ట్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్ లీచ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఆల్రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. జో రూట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు -
పాక్తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్తో జరిగిన మ్యాచ్లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
టెస్ట్ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది. బ్రూక్ తన ట్రిపుల్ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్- సెహ్వాగ్- 278 బంతులు- బ్రూక్- 310 బంతులు- మాథ్యూ హేడెన్- 362 బంతులు- సెహ్వాగ్- 364 బంతులుకాగా, ఈ మ్యాచ్లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. పాక్పై ట్రిపుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.ముల్తాన్ వికెట్పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
పాక్కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఇప్పటికే జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చేరాడు. ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్కు స్వర్గధామంలా ఉన్న ముల్తాన్ పిచ్పై బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్డేను తలపిస్తూ పాక్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 ఫోర్లు, 1 సిక్సర్తో బ్రూక్ తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం 218 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.అది పిచ్ కాదు.. హైవే!తొలి టెస్టుకు సిద్దం చేసిన ముల్తాన్ పిచ్పై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్కు పనికిరాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్వింగ్, టర్న్ లేకుండా హైవేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్ను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 658 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(220), జో రూట్(259) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 414 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ! వీడియో First Test double ton for Harry Brook 💯💯#PAKvENG | #TestAtHome pic.twitter.com/ZjikCyBQpu— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024 -
PAK VS ENG 1st Test: లక్కీ బ్రూక్..!
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులే వెనుకపడి ఉంది. జో రూట్ (176), హ్యారీ బ్రూక్ (141) అజేయ శతకాలతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరువగా.. ఓలీ పోప్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, ఆమెర్ జమాల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.What happened there?! 😲Brook is rendered lucky 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/qk5dzRKEYn— Pakistan Cricket (@TheRealPCB) October 9, 2024లక్కీ బ్రూక్ఈ మ్యాచ్లో బ్రూక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమెర్ జమాల్ బౌలింగ్లో బ్రూక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ వికెట్లకు తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో బ్రూక్ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు లక్కీ బ్రూక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో బ్రూక్ ఆరో టెస్ట్ సెంచరీని, రూట్ 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో బ్రూక్కు ఇది ఆరో సెంచరీ. పాక్పై కేవలం ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగవది. బ్రూక్తో పాటు మరో ఎండ్లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా -
బెన్ డకెట్ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
బ్రిస్టల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో అలరించారు. విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు స్కోర్ చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. చదవండి: ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో -
ENG VS AUS 5th ODI: జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్.. వీడియో
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 231/5గా ఉంది. బెన్ డకెట్ (88 బంతుల్లో 101), జాకబ్ బెథెల్ (15 బంతుల్లో 6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 58 పరుగులు జోడించారు. అనంతరం సాల్ట్ ఆరోన్ హార్డీ బౌలింగ్లో ఔట్ కాగా.. విల్ జాక్స్ క్రీజ్లోకి వచ్చాడు. జాక్స్ వచ్చీ రాగనే హార్డీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో డకెట్కు కెప్టెన్ బ్రూక్ జత కలిశాడు. వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.Harry Brook toying with Azam Zampa. pic.twitter.com/LFuqt2BTLL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపాకు చుక్కలు చూపించిన బ్రూక్బ్రూక్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్లో 52 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేయగా.. అందులో మెజార్టీ శాతం పరుగులు జంపా బౌలింగ్లోనే సాధించాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, రెండు బౌండరీలు సాధించగా.. కేవలం జంపా బౌలింగ్లోనే ఓ బౌండరీ, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు, ఓ బౌండరీ కేవలం 13 బంతుల వ్యవధిలో సాధించాడు. Harry Brook brings up his fifty with a six!!pic.twitter.com/rHltKptBTz— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2024జంపా బౌలింగ్లో బ్రూక్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. మరో ఎండ్లో డకెట్ తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను టెయిలెండర్ బెథెల్ సహకారంతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. బ్రూక్ ఔటైన అనంతరం క్రీజ్లోకి వచ్చిన జేమీ స్మిత్ (6), లివింగ్స్టోన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హార్డీ, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.బ్రూక్ ఇన్నింగ్స్లో విశేషాలు..బ్రూక్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడుబ్రూక్ సిక్సర్తో హాఫ్ సెంచరీ మార్కును తాకాడుఈ సిరీస్లో బ్రూక్కు ఇదివరకు మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (110, 87, 72)ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ల్లో అత్యధిక పరుగులు (312) చేసిన కెప్టెన్గా రికార్డుగతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (310) పేరిట ఉండేదిడకెట్ ఇన్నింగ్స్లో విశేషాలు..డకెట్కు వన్డేల్లో ఇది రెండో సెంచరీడకెట్ తన తొలి సెంచరీని (ఐర్లాండ్) సైతం ఇదే గ్రౌండ్లో (బ్రిస్టల్) చేశాడుఈ సిరీస్లో డకెట్కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్ (95, 63, 101)చదవండి: రాణించిన హోప్, హెట్మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు -
Eng Vs Aus ODI: లివింగ్స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్లో గ్లెన్ మాక్స్వెల్కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
ఇంగ్లండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర పుటల్లోకెక్కాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. బ్రూక్ ఈ ఘనతను తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సాధించాడు. బ్రూక్ 25 ఏళ్ల 215 రోజుల వయసులో ఇంగ్లండ్ కెప్టెన్గా సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. కుక్ 26 ఏళ్ల 190 రోజుల వయసులో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా సెంచరీ చేశాడు. ఈ జాబితాలో బ్రూక్, కుక్ తర్వాత ఇయాన్ మోర్గాన్ (26 ఏళ్ల 358 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 50 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 52 రోజులు) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 348 రోజుల తర్వాత ఆస్ట్రేలియా ఓ వన్డే మ్యాచ్లో ఓడింది. ఆ జట్టు వరుసగా 14 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఓ మ్యాచ్ను కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 24) చెస్టర్ లీ స్ట్రీట్లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 46 పరుగుల తేడాతో ఆసీస్పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (60), అలెక్స్ క్యారీ (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. Harry Brook's 15 boundaries Vs Australia. - A match winning hundred by captain Brook. ⭐pic.twitter.com/RDCF37v3c1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ను విజేతగా నిర్దారించారు. బ్రూక్ 94 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విల్ జాక్స్ 82 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 84 పరుగులు చేశాడు. లివింగ్స్టోన్ (33) బ్రూక్కు జతగా అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్లోని నాలుగో వన్డే సెప్టెంబర్ 27న లార్డ్స్లో జరుగుతుంది. చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో డక్వర్త్-లూయిస్ ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో తమ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. ఐదు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు ఇంగ్లీష్ జట్టు తగ్గించింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్కు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమైనప్పటకి మిగితా బ్యాటర్లు సత్తాచాటారు. ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(60), గ్రీన్(42), హార్దీ(44) రాణించారు.సెంచరీతో చెలరేగిన బ్రూక్..?అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. మిచిల్ స్టార్క్ దెబ్బకు 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లపై బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. 94 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 13 ఫోర్లు,2 సిక్సులతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37.4 ఓవర్లలో 254-4 వద్ద మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలో వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో డక్వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది. -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కెప్టెన్గా హ్యారీ బ్రూక్25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతున్నాయి. ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్పై ఇంగ్లండ్పై ఘన విజయం -
Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. తొమ్మిదికి పడిపోయిన బాబర్
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.టాప్-10లోనే మనోళ్లుఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.తొమ్మిదికి పడిపోయిన బాబర్కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లుఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
ఇంగ్లండ్ బ్యాటర్ల మతి పోగొట్టిన లంక స్పిన్నర్.. వైరల్ వీడియో
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ప్రభాత్ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను మతి పోగొట్టే బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ ప్రభాత్ మాయాజాలం ధాటికి నోరెళ్లబెట్టారు. ఊహించని విధంగా బంతి స్పిన్ కావడంతో ఆ ఇద్దరు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రభాత్ ఇంగ్లండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.Prabhat Jayasuriya with two absolute jaffas. 🤯pic.twitter.com/oeyooLHWPP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
Eng vs SL: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై లంకతో మూడు మ్యాచ్లు ఆడనుంది. మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును సోమవారం ప్రకటించింది. వైస్ కెప్టెన్గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు అవకాశం ఇచ్చింది. కాగా బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఓలీ పోప్ సారథిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి డిప్యూటీగా బ్రూక్ను ఎంపిక చేసింది.ఈ జట్టులో నలుగురు పేసర్లు మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్లకు చోటిచ్చింది. కాగా గతేడాది జూన్లో ఇంగ్లండ్కు చివరగా ఆడిన పాట్స్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్కు కూడా స్థానం దక్కింది. ఇక డాన్లారెన్స్, బెన్ డకెట్ ఓపెనర్లుగా దిగనుండగా.. మిడిలార్డర్లో ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జామీ స్మిత్ ఆడనున్నారు.మూడు టెస్టులు.. షెడ్యూల్ ఇదేఆగష్టు 21- 25 వరకు మాంచెస్టర్లో తొలి టెస్టు, ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు లండన్(లార్డ్స్)లో రెండో టెస్టు, సెప్టెంబరు 6- సెప్టెంబరు 10 వరకు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం ఇంగ్లండ్- శ్రీలంక టెస్టులు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆరంభం కానున్నాయి.శ్రీలంకతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుడాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
సామ్ కర్రన్ ఆల్రౌండ్ షో.. మెరుపు హాఫ్ సెంచరీ.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు
మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
బట్లర్పై వేటు.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్గా యువ బ్యాటర్?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్పై వేటు పడనుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో ఓ యువ బ్యాటర్కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత?!వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ పూర్తిగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే ప్రపంచకప్లో తొమ్మిదింట కేవలం మూడే గెలిచి సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.బట్లర్కు బైబైఇక అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్లో సూపర్-8కు చేరుకునేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కష్టమ్మీద సెమీ ఫైనల్ చేరినప్పటికీ.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 కెప్టెన్ను మార్చే విషయమై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రోబ్ కీ సంకేతాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో 33 ఏళ్ల బట్లర్ను తొలగించేందుకే ఇంగ్లండ్ బోర్డు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ వార్తలపై హ్యారీ బ్రూక్ తాజాగా స్పందించాడు.నా స్థాయికి మించిన పదవి అది‘‘వావ్.. నా స్థాయికి మించిన పదవి అది. కానీ దీని గురించి నాకేమీ తెలియదు. సూపర్చార్జర్స్కు తొలిసారిగా కెప్టెన్గా వ్యవహరించబోతున్నాను. ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తానో చూద్దాం. వచ్చే రెండునెలల పాటు మీతో మాట్లాడుతూనే ఉంటాను కదా!అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పట్లో కెప్టెన్సీ మార్పు ఉండబోదనే అనుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. టెస్టు క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు.ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తదుపరి ‘ది హండ్రెడ్ లీగ్’లో పాల్గొనున్నాడు. నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఇదే జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్కోచ్గా నియమితుడయ్యాడు.భవిష్య హెడ్కోచ్గా ఫ్లింటాఫ్?కాగా ఇంగ్లండ్ వన్డే, టీ20ల భవిష్య హెడ్కోచ్గా ఫ్లింటాఫ్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్లో అతడి మార్గదర్శనంలో 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ కెప్టెన్గా పనిచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బెన్ స్టోక్స్ సారథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు శుక్రవారం(జూలై 26) నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్.. భారీ జంప్ కొట్టిన బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.విండీస్ను చిత్తు చేసిమూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.అగ్రపీఠానికి చేరువైన రూట్నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.భారీ జంప్ కొట్టిన బ్రూక్ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు. -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, సెకెండ్ ఇన్నింగ్స్లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో చేతులెత్తేసింది. బషీర్తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
బ్రూక్ సెంచరీ.. రూట్ రికార్డు హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. హ్యారీ బ్రూక్ కెరీర్లో ఐదో శతకం.. సొంతగడ్డపై తొలి శతకం పూర్తి చేసి సత్తా చాటాడు. బ్రూక్ 118 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 109 పరుగుల వద్ద బ్రూక్.. జేడన్ సీల్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జాషువ డసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రూక్ కేవలం 23 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు చేయడం విశేషం. బ్రూక్ క్రికెట్లో 14 టెస్ట్లు ఆడి 62.55 సగటున 1376 పరుగులు చేశాడు.బ్రూక్కు జతగా మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ కెరీర్లో 63వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (68) టాప్లో ఉండగా.. శివ్నరైన్ చంద్రపాల్ (66) రెండో స్థానంలో నిలిచాడు. రూట్.. అలెన్ బోర్డర్, రాహుల్ ద్రవిడ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేయకముందే రూట్ టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11869) ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్లో ఉండగా.. పాంటింగ్, కలిస్, ద్రవిడ్, కుక్, సంగక్కర, లారా.. రూట్ కంటే ముందున్నారు.కాగా, నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 300 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ (80), జేమీ స్మిత్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 416 పరుగులు, విండీస్ 457 పరుగులు చేశాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (121), విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది: లారా
క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా.. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.దూకుడైన ఆటగాళ్లు తక్కువేఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్గా ఆడుతున్నారు.వీరిద్దరికే ఆ సత్తా ఉందిఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్తో వ్యాఖ్యానించాడు.కాగా టీమిండియా భవిష్య కెప్టెన్గా పేరొందిన ఓపెనర్ శుబ్మన్ గిల్కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపు
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ను హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సాల్ట్ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్స్టోన్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్ బట్లర్ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మన్ 2, డేవిడ్ వీస్, బెర్నాల్డ్ స్కోల్జ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.నమీబియా ఇన్నింగ్స్లో వాన్ లింగెన్ 33, నికోలాస్ 18 (రిటైర్డ్ హర్ట్), డేవిడ్ వీస్ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ భారీ తేడాతో ఓడాల్సి ఉంది. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన హ్యారీ బ్రూక్
కౌంటీ ఛాంపియన్షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ప్రస్తుత సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను 4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల చేత బ్రూక్ ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బ్రూక్ స్థానాన్ని డీసీ యాజమాన్యం సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్తో భర్తీ చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్ ఐపీఎల్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుని వ్యక్తిగత కారణాలను సాకుగా చూపాడంటూ ప్రచారం జరుగుతుంది. బ్రూక్ను 2023 వేలంలో సన్రైజర్స్ 13.25 కోట్లకు సొంతం చేసుకోగా.. తాజాగా సీజన్లో అతనికి ఆ స్థాయి మొత్తం లభించలేదు. ఈ కారణంగానే బ్రూక్ ఐపీఎల్ను స్కిప్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. బ్రూక్తో పాటు ఆడమ్ లిత్ (101) కూడా సెంచరీతో కదంతొక్కడంతో యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అంతకుముందు లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ హ్యారిస్ (56), బెన్ మైక్ (90), టామ్ స్క్రీవెన్ (56) అర్దసెంచరీలతో రాణించారు. యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత లీసెస్టర్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. 26/0 స్కోర్ వద్ద భారీ వర్షం కురువడంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్లో కొత్తగా మరో ఫాస్ట్ బౌలర్ చేరాడు. వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. విలియమ్స్ను డీసీ 50 లక్షల బేస్ ప్రైజ్కు సొంతం చేసుకుంది. కాగా, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ దారుణ ప్రదర్శనకు ఆ జట్టు బౌలింగే ప్రధాన కారణం. ఈ జట్టులోని బౌలర్లు ప్రతి మ్యాచ్లో పోటాపోటీపడి పరుగులు సమర్పించుకుంటూ వరుస ఓటములకు కారకులవుతున్నారు. ముఖ్యంగా పేసర్ అన్రిచ్ నోర్జే చాలా దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. డీసీ యాజమాన్యం ఈ సఫారీ పేసర్పై భారీ అంచనాలు పెట్టుకుంటే, అతను మాత్రం సాధారణ బౌలర్ కంటే హీనంగా బౌలింగ్ చేస్తూ తుస్సుమనిపిస్తున్నాడు. నోర్జే ప్రతి మ్యాచ్లో 12కు పైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకుంటున్నాడు. డీసీ మేనేజ్మెంట్ లిజాడ్ విలియమ్స్ను ఎంపిక చేసుకోవడానికి నోర్జే వరుస వైఫల్యాలే కారణమని తెలుస్తుంది. నోర్జే స్థానాన్ని లిజాడ్ విలియమ్స్తో భర్తీ చేయాలని డీసీ భావిస్తుంది. ఈ సీజన్లో నోర్జే ప్రదర్శనలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్పై 4-0-48-1 సీఎస్కేపై 4-0-43-0 కేకేఆర్పై 4-0-59-3 ముంబై ఇండియన్స్పై 4-0-65-2 ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే?
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు హ్యారీ బ్రూక్ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది సీజన్ మొత్తానికి బ్రూక్ దూరమయ్యాడు. గత నెలలో తన బామ్మ కన్నుమూసిన నేపథ్యంలో కుటుంబసభ్యులతో ఉండాలని బ్రూక్ నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 4 కోట్లకు బ్రూక్ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఇటీవల కాలంలో మెక్గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు తన పవర్ హిట్టింగ్ స్కిల్స్తో అందరిని అకట్టుకుంటున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత బిగ్బాష్లీగ్ సీజన్లో కూడా మెక్గర్క్ అదరగొట్టాడు. మెల్బోర్న్ రెనగాడ్స్కు ప్రాతినిథ్యం వహించిన మెక్గర్క్.. 257 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిపై ఢిల్లీ కన్నేసింది. చదవండి: #Rachin Ravindra: రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్గా -
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2024 నుంచి బ్రూక్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీకి బ్రూక్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియాతో టెస్టు సిరీస్ నుంచి సైతం బ్రూక్ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. కాగా గతేడాది సీజన్తో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. కానీ ఎస్ఆర్హెచ్ నమ్మకాన్ని బ్రూక్ వమ్ము చేశాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఐపీఎల్-2024కు ముందు ఆరెంజ్ ఆర్మీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన హ్యారీని రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఈ ఏడాది సీజన్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడికి బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది. చదవండి: Happy Birthday Siraj: బ్యాటర్ టూ బౌలర్.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి -
టెస్టు సిరీస్కు బ్రూక్ దూరం
లండన్: భారత్తో గురువారం నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సిరీస్కు ముందు ఇంగ్లండ్కు పెద్ద దెబ్బ తగిలింది. జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్, అద్భుతమైన ఫామ్లో ఉన్న హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టును వదిలి వెళ్లాడని, సిరీస్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. తొలి టెస్టు కోసం ఆదివారమే ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్కు చేరుకుంది. బ్రూక్ స్థానంలో డాన్ లారెన్స్ను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తరఫున 11 టెస్టులు ఆడిన లారెన్స్ 551 పరుగులు చేశాడు. -
ఇండియాతో టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. రూక్కు ప్రత్యామ్నాయంగా సర్రే ఆటగాడు డాన్ లారెన్స్ను ఎంపిక చేశారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. బ్రూక్ కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు అతన్ని రిలీవ్ చేసినట్లు ఈసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత్తో సిరీస్ కోసం అబుదాబీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్నాహక శిబిరంలో ఉంది. బ్రూక్ కూడా జట్టుతో పాటు అబుదాబీలోనే ఉన్నాడు. బ్రూక్ను తక్షణమే జట్టు నుంచి రిలీవ్ చేస్తున్నట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. బ్రూక్ జట్టును వీడటం వల్ల ఇంగ్లండ్కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బ్రూక్ మిడిలార్డర్లో కీలక ఆటగాడు కావడం వల్ల ఇంగ్లండ్ విజయావకాశాలకు తప్పక గండి పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రూక్ తన అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 24 ఏళ్ల బ్రూక్ 2022లో టెస్ట్ అరంగేట్రం చేసి 12 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్రూక్ 62.1 సగటున 1181 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించే అతి కొద్ది మంది ఆటగాళ్లలో బ్రూక్ ఒకడు. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ల మధ్య టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును చాలా రోజుల కిందటే ప్రకటించారు. భారత్ సైతం తొలి రెండు మ్యాచ్లకు జట్టును ప్రకటించింది. భారత్తో సిరీస్కు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే (కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, దృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ -
ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 31 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విజయానికి ఆండ్రీ రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే పెద్దగా ఫామ్లో లేని బ్రూక్ స్ట్రైక్లో ఉండడంతో విండీస్ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను బ్రూక్ తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్లు, ఓ ఫోర్ బాది ఇంగ్లండ్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఆర్హెచ్ తప్పు చేసింది..!? ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున హ్యారీ బ్రూక్ ఆడాడు. గత సీజన్ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2024 సీజన్కు ముందు హ్యారీని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో విండీస్పై బ్రూక్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఎస్ఆర్హెచ్ అతడిని వదిలి తప్పు చేసింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతడికి మరోక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. 𝗧𝗵𝗲 𝗛𝗜𝗚𝗛𝗘𝗦𝗧 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝘂𝗻 𝗰𝗵𝗮𝘀𝗲 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝘁𝗵𝗲 𝗪𝗲𝘀𝘁 𝗜𝗻𝗱𝗶𝗲𝘀! 🏏 Just watch this final over... Harry Brook take a bow! 👏#WIvENG pic.twitter.com/raErDRlvTZ — Cricket on TNT Sports (@cricketontnt) December 16, 2023 -
చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్
గ్రెనిడా వేదికగా వెస్టిండీస్తో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ కెప్టెన్ పావెల్ బంతిని సీనియర్ ఆండ్రీ రస్సెల్ను బంతిని అందించాడు. అయితే స్ట్రైక్లో ఉన్న హ్యారీ బ్రూక్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అనంతరం రెండు, మూడు బంతులను సిక్స్లు బాది మ్యాచ్ను ఇంగ్లండ్ వైపు మలుపు తిప్పాడు. ఈ క్రమంలో చివరి మూడు బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. బ్రూక్ ఐదో బంతికి సిక్స్ బాది ఇంగ్లండ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో పూరన్(82) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 డిసెంబర్ 19న జరగనుంది. చదవండి: రింకూ సిక్సర్ సింగ్ -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్తో వన్డే సిరీస్లో బిజీగా ఉన్నాడు. విండీస్తో తొలి మ్యాచ్లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్పై విండీస్ ఈ ఫీట్ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన విండీస్కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
సన్రైజర్స్ తప్పుచేసింది.. పశ్చాత్తాపపడక తప్పదు: టామ్ మూడీ
IPL 2024- Sunrisers Hyderabad: ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సన్రైజర్స్ హైదరాబాద్ పశ్చాత్తాపపడక తప్పదని ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ అన్నాడు. బ్రూక్ వంటి అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడిని వదిలి ఫ్రాంఛైజీ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్ను రూ. 13 కోట్ల 25 లక్షలకు సన్రైజర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ డాషింగ్ క్రికెటర్ ప్రదర్శన ఆశించినస్థాయిలో లేకపోవడంతో తాజా వేలానికి ముందు విడుదల చేసింది. ఐపీఎల్-2023లో బ్రూక్ 11 మ్యాచ్లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్న సన్రైజర్స్ ఆదివారం నాటి రిలీజ్ లిస్టులో బ్రూక్ పేరును చేర్చింది. సగం ధరకే కొనాలని ప్లాన్! కానీ.. ఈ విషయంపై స్పందించిన ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘బ్రూక్ను రిలీజ్ చేసి మళ్లీ సగం ధరకే అతడిని సొంతం చేసుకోవాలన్నది సన్రైజర్స్ వ్యూహం అయి ఉండొచ్చు. అయితే, ఇలాంటి నిర్ణయం వల్ల ఎస్ఆర్హెచ్ కచ్చితంగా పశ్చాత్తాపపడుతుంది. ఎందుకంటే.. హ్యారీ బ్రూక్ తప్పకుండా వేలంలోకి వస్తాడు. అసాధారణ ప్రతిభ ఉన్న బ్రూక్ కోసం పోటీ తప్పకుండా ఉంటుంది’’ అని టామ్ మూడీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అతడిని బాధ్యుడిని చేయడం సరికాదు అదే విధంగా బ్రూక్ సేవలను సన్రైజర్స్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని టామ్ మూడీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. టీ20 క్రికెట్లో ఓపెనింగ్ చేయని బ్యాటర్ను టాపార్డర్కు ప్రమోట్ చేసి ఎస్ఆర్హెచ్ తప్పు చేసిందని పేర్కొన్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ను ముందుగా రప్పించి మూల్యం చెల్లించడమే కాకుండా.. అందుకు అతడిని బాధ్యుడిని చేయడం సరికాదని విమర్శించాడు. యువ ఆటగాడైన బ్రూక్ సేవలను సుదీర్ఘకాలం పాటు వినియోగించుకునే అవకాశాన్ని మిస్ చేసుకుందని టామ్ మూడీ సన్రైజర్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు.. సన్రైజర్స్ జట్టు ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), అకీల్ హోసిన్ (వెస్టిండీస్), దేశవాళీ క్రికెటర్లు సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ, కార్తీక్ త్యాగిలను కూడా విడుదల చేసింది. వేలం కోసం ప్రస్తుతం సన్రైజర్స్ వద్ద రూ. 34 కోట్లు ఉన్నాయి. చదవండి: T20I: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్ రికార్డు బ్రేక్ -
IPL 2024: 13 కోట్ల ఆటగాడిని వదిలేసిన సన్రైజర్స్.. మరో బౌలర్కు ఝలక్
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్తో తెగదెంపులు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతనితో పాటు మరో గుర్తింపు పొందిన బౌలర్ను కూడా వేలానికి వదిలేసింది. మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసి, 19 మందిని కొనసాగించింది. సన్రైజర్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. హ్యారీ బ్రూక్ ఆదిల్ రషీద్ సమర్థ్ వ్యాస్ కార్తీక్ త్యాగీ వివ్రాంత్ శర్మ అకీల్ హొసేన్ సన్రైజర్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు.. ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్) అబ్దుల్ సమద్ రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్ హెన్రిచ్ క్లాసెన్ మయాంక్ అగర్వాల్ అన్మోల్ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీశ్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) అభిషేక్ శర్మ మార్కో జన్సెన్ వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్ హక్ ఫారూకీ -
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు కీలక నిర్ణయం..
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 సీజన్ నుంచి బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్కు బ్రూక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది డిసెంబర్లో వైట్బాల్ సిరీస్ల కోసం వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ రెండు సిరీస్లకు వెర్వేరు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలోను హ్యారీ బ్రూక్ సభ్యునిగా ఉన్నాడు. ఈ క్రమంలో రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే విధంగా ఇంగ్లండ్ కరేబియన్ టూర్ డిసెంబర్ 3న మొదలు కానుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసినంతరం ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. వరల్డ్కప్ జట్టులో కీలక మార్పు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్కప్ జట్టులో కీలక మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన జట్టులో సభ్యుడైన జేసన్ రాయ్పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంది. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్.. కోలుకోకపోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2019లో ఇంగ్లండ్ వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రాయ్.. వెన్నునొప్పి కారణంగా ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ సిరీస్లో రాయ్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన డేవిడ్ మలాన్.. అద్భుతంగా రాణించి, ఓపెనర్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. మలాన్ ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 92.33 సగటున, 105.73 స్ట్రయిక్రేట్తో 277 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో మలాన్ వరల్డ్కప్లో ఓపెనర్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. మలాన్ను జతగా జానీ బెయిర్స్టో మరో ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. మలాన్ ఓపెనర్ బెర్త్కు ఫస్ట్ ఛాయిస్గా మారడం, రాయ్ ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్లో లేకపోవడంతో అతనిపై వేటు పడింది. అయితే, ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పెద్ద ఆకట్టులేకపోయిన హ్యారీ బ్రూక్ను రాయ్ స్థానంలో వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రూక్ ఇతర ఫార్మాట్ల ఫామ్ను పరిగణలోకి తీసుకుని ఇంగ్లండ్ సెలెక్టర్లు అతన్ని వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేసి ఉండవచ్చు. బ్రూక్ మిడిలార్డర్ బ్యాటర్ కావడం అతని ఎంపికకు మరో కారణం కావచ్చు. ఇటీవల ముగిసిన హండ్రెడ్ టోర్నీలో బ్రూక్ చేసిన సెంచరీని, కివీస్తో జరిగిన టీ20 సిరీస్లో అతని ఫామ్ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుని ఉంవచ్చు. కాగా, ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన 4 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే పర్యటనలో అంతకుముందు జరిగిన 4 మ్యాచ్ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్ విల్లీ, సామ్ కర్రన్ -
హ్యారీ బ్రూక్, మలాన్ విధ్వంసం.. న్యూజిలాండ్ చిత్తు
ఇంగ్లండ్ టూర్ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. చెస్టర్-లీ-స్ట్రీట్ ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లీష్ జట్టు బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43) పరుగులతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో సౌథీ, లూకీ ఫెర్గూసన్, సోధి తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 1న జరగనుంది. చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్!
ది హండ్రడ్ లీగ్లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో భాగంగా మంగళవారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బ్రూక్ సంచలన క్యాచ్తో మెరిశాడు. బౌండరీ లైన్ దగ్గర బ్రూక్ విన్యాసాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఏం జరిగిందంటే..? వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్లో బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ జంప్ చేస్తూ ఒంటి కాలితో బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ రోప్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతిని మైదానంలో విసిరేశాడు. ఈ క్రమంలో అప్పటికే బౌండరీ లైన్ వద్దకు చేరుకున్న మరో ఫీల్డర్ హోస్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన జానీ బెయిర్ స్టో(44) బిత్తరపోయాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇదే మ్యాచ్లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్రూక్ కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా హండ్రెడ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. చదవండి: APL 2023: అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD — Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023 -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్కు ముందు ఈ మూడు లీగ్ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్కతా నైట్రైడర్స్పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ బ్రూక్ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున 11 మ్యాచ్ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
హండ్రెడ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఫీట్ సాధించాడు. వెల్ష్ ఫైర్తో నిన్న (ఆగస్ట్ 22) జరిగిన మ్యాచ్లో బ్రూక్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్ లీగ్ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. బ్రూక్ తన ఇన్నింగ్స్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. కేవలం ముగ్గురు మాత్రమే.. హండ్రెడ్ లీగ్లో చరిత్రలో (పురుషుల ఎడిషన్లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్దే ఫాస్టెప్ట్ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్లో విల్ జాక్స్ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్ స్మీడ్ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. హండ్రెడ్ లీగ్లో అత్యధిక స్కోర్.. హండ్రెడ్ లీగ్లో బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్లో అత్యధిక స్కోర్ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ట్యామీ బేమౌంట్ ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్గా హండ్రెడ్ లీగ్లో ఇదే అత్యుత్తమ స్కోర్గా రికార్డైంది. Every. Ball. Counts. Harry Brook has done it 💥#TheHundred pic.twitter.com/iCC6FbKVkG — The Hundred (@thehundred) August 22, 2023 బ్రూక్ సెంచరీ వృధా.. వెల్ష్ ఫైర్పై బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్.. వెల్ష్ ఫైర్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. బ్రూక్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో బ్రూక్ (మూడంకెల స్కోర్), ఆడమ్ హోస్ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2, మ్యాట్ హెన్రీ, డేవిడ్ పెయిన్, వాన్ డర్ మెర్వ్, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. What a knock! 💥 Stephen Eskinazi scored the third-fastest fifty of the men's competition. 👏#TheHundred pic.twitter.com/pJqc1hXspG — The Hundred (@thehundred) August 23, 2023 విధ్వంసం సృష్టించిన వెల్ష్ ఫైర్ ప్లేయర్లు.. 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (39 బంతుల్లో 44; ఫోర్, 3 సిక్సర్లు), జో క్లార్క్ (22 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్ ఫైర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. -
మాథ్యూ షార్ట్ విధ్వంసం.. హ్యారీ బ్రూక్ ఊచకోత
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా సథరన్ బ్రేవ్స్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న మ్యాచ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాళ్లు మాథ్యూ షార్ట్, హ్యారీ బ్రూక్ శివాలెత్తిపోయారు. ఓపెనర్గా వచ్చిన షార్ట్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ (27 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. Stop what you're doing and watch THIS 🤯#TheHundred pic.twitter.com/3S56KdtbyQ — The Hundred (@thehundred) August 6, 2023 వీరిద్దరికి టామ్ బాంటన్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రేవ్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, తైమాల్ మిల్స్ తలో వికెట్ పడగొట్టి కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా, మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హండ్రెడ్ లీగ్ చరిత్రలో ఈ మ్యాచ్లో సూపర్ ఛార్జర్స్ చేసిన స్కోరే (201) అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. 2021 ఎడిషన్లో ఇదే సూపర్ ఛార్జర్స్ చేసిన 200 స్కోర్ ఈ మ్యాచ్కు ముందు వరకు టాప్ స్కోర్గా ఉండింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్స్.. 48 బంతుల తర్వాత 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. డెవాన్ కాన్వే (15), ఫిన్ అలెన్ (10) ఔట్ కాగా.. జేమ్స్ విన్స్ (32), డు ప్ల్యూయ్ (2) క్రీజ్లో ఉన్నారు. -
సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్బై! అతడికి కూడా
ఐపీఎల్-2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచి అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఈ ఏడాది సీజన్లో కొత్త కెప్టెన్, కొత్త హెడ్కోచ్తో బరిలోకి దిగినప్పటికీ.. ఎస్ఆర్హెచ్ ఆట తీరు మాత్రం మారలేదు. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. 13 కోట్ల ఆటగాడికి గుడ్ బై.. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం. అదే విధంగా గత సీజన్లో నిరాశపరిచిన కొంతమంది ఆటగాళ్లను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో ముందు వరుసలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హ్యారీ బ్రూక్ కోసం సన్రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి ఎస్ఆర్హెచ్ గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. మరోవైపు రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ను వదులుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. సుందర్ గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకోగా.. మాలిక్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్.. 5 వికెట్లు మాత్రమే చేశాడు. వీరితో పాటు మరికొంత మందికి కూడా ఎస్ఆర్హెచ్ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు సంబంధించిన మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: WC 2023: టీ20 వరల్డ్కప్ మాదిరే ఈసారి కూడా! ఇషాన్ను ఆడిస్తే రోహిత్ ‘డ్రాప్’.. మరి కోహ్లి సంగతి? -
Ashes 3rd Test: ఆసీస్పై ఇంగ్లండ్ గెలుపు.. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్లో ఆసీస్పై ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ (75) కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను గెలిపించాడు. మిచెల్ స్టార్క్ (5/78) ఫైఫర్తో ఇంగ్లండ్ను భయపెట్టినా.. వోక్స్ (32 నాటౌట్) సహకారంతో బ్రూక్ ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బ్రూక్ ఔటయ్యాక వుడ్ (12 నాటౌట్) అండతో వోక్స్ ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను గెలిపించిన బ్రూక్ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసినా ఆటగాడిగా చరిత్ర సృస్టించాడు. బ్రూక్ 1058 బంతుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని చేరుకోగా.. గతంతో ఈ రికార్డు కివీస్ ఆల్రౌండర్ కొలిన్ గ్రాండ్హోమ్ (1140) పేరిట ఉండేది. ఈ జాబితాలో గ్రాండ్హోమ్ తర్వాత టిమ్ సౌథీ (1167), బెన్ డకెట్ (1168) ఉన్నారు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు.. టెస్ట్ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిఫ్ (12 ఇన్నింగ్స్లు), విండీస్ మాజీ ఎవర్టన్ వీక్స్ (12)ల పేరిట సంయుక్తంగా ఉండగా.. యాషెస్ సిరీస్ మూడో టెస్ట్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. బ్రూక్ 17 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుని, ఇంగ్లండ్/జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్ (13) రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ (14) మూడో స్థానంలో, లెన్ హటన్ (16), ఫ్రాంక్ వారెల్ (16), రోవ్ (16) నాలుగో స్థానంలో ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా, 5 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). బ్రూక్, వోక్స్, వుడ్లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
బ్రూక్ దురదృష్టం ఆస్ట్రేలియా అదృష్టం
-
లక్నోతో సన్రైజర్స్ కీలక పోరు.. 13 కోట్ల ఆటగాడికి మరో సారి నోఛాన్స్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకునేందుకు ఉప్పల్ స్టేడియంలో నేడు(శనివారం) జరిగే కీలక మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. గత మ్యాచ్లో రాజస్తాన్పై విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. అదే జోరును ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ వివ్రాంత్ శర్మ స్థానంలో అన్మోల్ప్రీత్ సింగ్, టి నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా జట్టులోకి వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక మరోసారి మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ బెంచ్కే పరిమితమమ్యే ఛాన్స్ ఉంది. గత కొన్ని మ్యాచ్ల నుంచి దారుణంగా విఫలమవతున్న హ్యారీ బ్రూక్ను రాజస్తాన్తో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అతడి స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్కు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఫిలిప్స్ సంచలన ఇన్నింగ్స్తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కాబట్టి మరోసారి బ్రూక్ స్థానంలో ఫిలిప్స్ వైపే ఎస్ఆర్హెచ్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. కాగా రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనగోలు చేసిన హ్యారీ బ్రూక్ తనదైన మార్క్ చూపడంలో విఫలమయ్యాడు. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, రాహల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, , మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్ చదవండి: మేమంతా విఫలమయ్యాం.. అతడొక్కడే అదరగొట్టాడు! టర్న్ చేస్తాడని అనుకున్నా: హార్దిక్ -
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
రియాన్ పరాగ్ అకాడమీ.. మీకు దణ్ణం సామీ
-
ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్కు వదిలేసి మంచి పని చేసింది..!
రాజస్థాన్ రాయల్స్తో నిన్న (మే 7) జరిగిన హైటెన్షన్ గేమ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్గా మలచడం, సన్రైజర్స్ గెలవడం.. అంతా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నాయి. ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి, గెలుపు ట్రాక్లో ఉంచింది మాత్రం డైనమైట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. ఈ కివీస్ బ్యాటర్.. ఎస్ఆర్హెచ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావాల్సిన తరుణంలో సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 25) ఆడి అసాధ్యమనుకున్న గెలుపుపై ఆశల రేకెత్తించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచిన ఫిలిప్స్ మ్యాచ్ను సన్రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఫిలిప్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓటమిపాలై, లీగ్ నుంచి నిష్క్రమించేది. ఫిలిప్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ ఫిలిప్స్.. సనరైజర్స్ హ్యారీ బ్రూక్ను వదిలించుకుని నీకు అవకాశమిచ్చి మంచి పని చేసిందంటూ సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 13.25 ఆటగాడి (బ్రూక్) కంటే అందులో పది శాతం (1.5 కోట్లు) కూడా రేటు దక్కని ఫిలిప్స్ చాలా బెటరని అంటున్నారు. కేకేఆర్పై బ్రూక్ చేసిన సెంచరీ కంటే రాజస్థాన్పై ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమని కొనియాడుతున్నారు. సెంచరీ మినహాయించి దాదాపు ప్రతి మ్యాచ్లో విఫలమైన బ్రూక్ను ఇకపై పక్కకు పెట్టి ఫిలిప్స్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు మినుకమినుకుమంటున్న దశలో ఫిలిప్స్ ఎస్ఆర్హెచ్ను ఫైనల్ ఫోర్కు చేరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్ సంజు శాంసన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్లు) చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్రైజర్స్ను గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్రైజర్స్ -
హ్యారీ బ్రూక్ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి! అయినా కష్టమే
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్తో చావోరేవో తేల్చుకోవడానికి సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా ఆదివారం రాజస్తాన్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్కు ఇంకా 5 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే మిగిలిన మ్యాచ్లు అన్ని విజయం సాధించాలి. ఇక రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ జట్టులో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. వరుసగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "రాజస్తాన్తో మ్యాచ్లో ఓడిపోతే హైదరాబాద్ కథ ముగిసినట్లే. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఉన్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావడం చాలా కష్టం. హైదరాబాద్ జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో కూడా పలు సమస్యలు ఉన్నాయి. హ్యారీ బ్రూక్ను పక్కన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. అతడి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్కు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలి" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్(అంచనా): అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, కార్తీక్ త్యాగి చదవండి: GT Playing XI vs LSG: అన్నదమ్ముల సవాల్.. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ! అతడు కూడా.. -
ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం..
IPL 2023 SRH Vs KKR: ‘‘ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆఖరి ఓవర్లలో మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ పని పూర్తి చేయడంలో విఫలమయ్యాం’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ విచారం వ్యక్తం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న మార్కరమ్.. తాను మాత్రం ఆరంభంలో తడబాటుకు లోనయ్యానని.. అదే ఓటమికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాణా, రింకూ మెరుగ్గా ఐపీఎల్-2023లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో రైజర్స్ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సొంతమైదానంలో 5 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(31 బంతుల్లో 42 పరుగులు)కు తోడు.. రింకూ సింగ్(35 బంతుల్లో 46 పరుగులు) రాణించడంతో మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ 166 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (PC: IPL Twitter) క్లాసెన్ రాణించినా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(18), అభిషేక్ శర్మ(9)తో పాటు హ్యారీ బ్రూక్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ మార్కరమ్.. 40 బంతుల్లో 41 పరుగులు చేయగలిగాడు. ఆరో స్థానంలో వచ్చిన క్లాసెన్ 20 బంతుల్లో 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే ప్రభావం చూపింది అయితే, ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన నేపథ్యంలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో రైజర్స్ను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులే రావడంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. తాను ఆరంభంలో బంతులు వృథా చేయడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ఇదో గుణపాఠం ‘‘బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. లక్ష్య ఛేదనలో తడబడ్డాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇదొక గుణపాఠం. లోపాలు సవరించుకుని ముందుకు సాగుతాం’’ అని మార్కరమ్ చెప్పుకొచ్చాడు. కాగా విజయంతో ఈడెన్ గార్డెన్స్లో తమకు ఎదురైన పరాభవానికి రైజర్స్పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కేకేఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి(4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: IPL 2023: లిటన్ దాస్ స్థానంలో బిగ్ హిట్టర్.. ఇక నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023 -
ఏ స్థానంలో వచ్చినా అంతే.. విసుగెత్తిస్తున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా అదే దారుణ ఆటతీరు కనబరుస్తున్నాడు. తాజాగా గురువారం కేకేఆర్తో మ్యాచ్లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్పై ఈ సీజన్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఈసారి మాత్రం పేలవంగా ఔట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు. అనుకుల్ ఫుల్లెంగ్త్ డెలివరీ వేయగా.. బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో సెంచరీ మినహా బ్రూక్ మిగతా 8 మ్యాచ్లు కలిపి 79 బంతులు ఎదుర్కొని 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు''.. ''ఆడించింది చాలు.. బెంచ్కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్ చేశారు. #HarryBrook feels like he conquered India again after making a 💯 on a flat track and made comments on the Indian fans, now he will get roasted based on his lean patch after that. A huge Kudos to #SRH team management who continue to buy these expensive foreign players who have… pic.twitter.com/N50bbUZbUS — Pichaa Paati (@Pichaa_paati) May 4, 2023 చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ -
SRH: ఏదో పొడిచేస్తాడనుకుంటే!.. అతడొక్కడేనా?! నాకు నమ్మకం ఉంది!
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోలేక కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో డకౌట్ అయిన బ్రూక్పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్గా.. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్పై సన్రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి. కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్లో సన్రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. అతడొక్కడేనా! వాళ్లు కూడా ఇక బ్రూక్తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు. చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ టీ20 కాస్త అదుపుతప్పి... టెస్ట్ మ్యాచ్ గా ఆడితే.. ఇదే పరిస్థితి..!
-
బ్యాటర్గా విఫలం.. కొత్త అవతారం ఎత్తిన హ్యారీ బ్రూక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని చవి చూసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో హోంగ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. బ్యాటర్ల వైఫల్యంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ ప్రదర్శన ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. స్పిన్నర్ల బలహీతనను అధిగమించలేక బ్రూక్ వికెట్ పారేసుకుంటున్నాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో అయితే 14 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే బ్యాటర్గా పూర్తిగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కాసేపు కెమెరామన్గా అలరించాడు. బ్రూక్ కెమెరామన్ పాత్రను పోషించడంపై కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. ''ఓ మ్యాన్.. ఇవాళ బ్రూక్ రూపంలో మనకు ఒక కొత్త కెమెరామన్ కనిపిస్తున్నాడు. టెలివిజన్ ప్రొడక్షన్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెమెరామన్గా బ్రూక్ చరిత్ర సృష్టించాడు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా బ్రూక్ను వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. He'll whack it outta the park and show you how it sails through the air too - Harry Brook 😉#SRHvDC #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/ar6t314xu3 — JioCinema (@JioCinema) April 24, 2023 చదవండి: #JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం -
ఈ మాత్రం ఆటకేనా 13 కోట్లు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో సన్రైజర్స్ చతికిలబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్(49) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్(34),మనీష్ పాండే(34) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు సాధించగా.. భువనేశ్వర్ కుమార్ రెండు,,నటరాజన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. తీరు మారని బ్రూక్ ఇక కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. ఆ తర్వాతి మ్యాచ్ల్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో 14 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 7 పరుగులు మాత్రమే చేశాడు. నోర్జే బౌలింగ్లో అనవసరపు షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. అంతకుముందు సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన బ్రూక్ 163 పరుగులు చేశాడు. అందులో కేకేఆర్తో మ్యాచ్లో చేసిన 100 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. అంటే మిగితా 6 మ్యాచ్ల్లో అతడు కేలం 63 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణంగా విఫలమవుతున్న బ్రూక్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నాను. ఇంగ్లండ్కు వెళ్లి టెస్టులు ఆడుకో పో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది సెంచరీ కొడితే హీరో అన్నారు.. ఇప్పుడు జీరోనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ ఏడాది సీజన్కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్ను రూ.13.25 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: సన్రైజర్స్ను ఓడించి, ఢిల్లీని గెలిపించింది అతనే..! -
SRH VS MI: బ్రూక్ ఆ బలహీనతను అధిగమిస్తాడా..?
కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టి మాంచి ఊపు మీద ఉన్న సన్రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్పై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయి. ఇవాళ (ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో బ్రూక్ ఎలా ఆడతాడో అని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రూక్కు సంబంధించిన ఓ బలహీనతపై నెట్టింట డిబేట్లు జరుగుతున్నాయి. అరంగేట్రం ఐపీఎల్ సీజన్లో ఆడిన తొలి 3 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమై, కేకేఆర్తో జరిగిన నాలుగో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్రూక్.. కేకేఆర్తో మ్యాచ్ సహా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో స్పిన్నర్లకు ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. బ్రూక్.. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 13 పరుగులు చేసి చహల్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ కాగా.. ఆతర్వాతి మ్యాచ్లో (లక్నో) 3 పరుగులు చేసి బిష్ణోయ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. అనంతరం పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డ బ్రూక్.. ఆ మ్యాచ్లో అర్షదీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. తాజాగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బ్రూక్ శతక్కొట్టినప్పటికీ స్పిన్నర్లకు ఎదుర్కోవడంలో అతని లోపాలు స్పష్టం బయటపడ్డాయి. ఆ మ్యాచ్లో 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ చేసిన బ్రూక్.. పేసర్ల బౌలింగ్లో 258 స్ట్రైక్రేట్ కలిగి, స్పిన్నర్ల బౌలింగ్లో 117 స్ట్రైక్రేట్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్లో బ్రూక్ ఆడిన నాలుగు మ్యాచ్లను పరిశీలిస్తే.. పేసర్ల బౌలింగ్లో 50 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 166 స్ట్రైక్రేట్తో పరుగులు సాధించగా.. స్పిన్నర్ల బౌలింగ్లో 44 బంతులు ఎదుర్కొని 104 స్ట్రైక్రేట్ చొప్పున కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్రూక్ ఈ సీజన్లో ఔటైన 3 సందర్భాల్లో రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్లో ఔట్ కాగా.. ఓసారి పేసర్కు వికెట్ సమర్పించుకున్నాడు. పేస్ బౌలింగ్లో బ్రూక్ సగటు 83 ఉంటే.. స్పిన్ బౌలింగ్లో అది కేవలం 23గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే స్పిన్నర్ల విషయంలో బ్రూక్ ఎంత బలహీనంగా ఉన్నాడో అన్న విషయం ఇట్టే స్పష్టమవుతుంది. ఇక ముంబైతో మ్యాచ్లో బ్రూక్ ఈ బలహీనతను అధిగమిస్తే.. అతని నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐపీఎల్ 2023లో తొలి రికార్డ్ క్రియేట్ చేసిన బ్రూక్
-
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్రైజర్స్ ఆటగాడిగా
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ఎట్టకేలకు బ్యాట్ను ఝులిపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 12 ఫోర్లు, 3 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తద్వారా ఐపీఎల్-16వ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రూక్ రికార్డును సృష్టించాడు. దీనితో పాటు పలు అరుదైన రికార్డులను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు. బ్రూక్ సాధించిన రికార్డులు ఇవే.. ►ఐపీఎల్లో సెంచరీ సాధించిన ఐదో ఇంగ్లీష్ బ్యాటర్గా బ్రూక్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో ఉన్నారు. ఇందులో బట్లర్ అత్యధికంగా ఐదు సార్లు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ►ఐపీఎల్లో సెంచరీ నమోదు చేసిన మూడో ఎస్ఆర్హెచ్ బ్యాటర్గా బ్రూక్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఉన్నారు. అదే విధంగా సొంత మైదానం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం)లో కాకుండా బయట సెంచరీ సాధించిన తొలి ఎస్ఆర్హెచ్ ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. వార్నర్, బెయిర్ స్టో హైదరాబాద్లోనే సెంచరీలు చేశారు. సన్రైజర్స్ గ్రాండ్ విక్టరీ ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్పై 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్(71), రింకూ సింగ్ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. చదవండి: IPL 2023: సన్రైజర్స్కు ఇప్పటికి జ్ఞానోదయం అయింది.. వచ్చిన వెంటనే దుమ్మురేపాడు! I. C. Y. M. I When Harry Brook hits, it stays HIT! 👌👌 Relive his two cracking SIXES off Umesh Yadav 🎥 🔽 Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/rVBtgeInVW — IndianPremierLeague (@IPL) April 14, 2023 -
కేకేఆర్ బ్యాటింగ్ పవర్తో సహా ఆ విషయం నాకు ముందే తెలుసు.. అయితే: మార్క్రమ్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్లో వరుసగా ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో విజయం అందుకుంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగల్గింది. కెప్టెన్ నితీష్ రాణా(75), రింకూ సింగ్(58) అద్భుతంగా రాణించనప్పటకీ కేకేఆర్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జానెసన్, మార్కండే రెండు వికెట్లు, భువనేశ్వర్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్..హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. భువీ సూపర్.. హ్యారీ అద్భుతం పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రమ్ మాట్లాడుతూ.. "మా హోం గ్రౌండ్లో కాకుండా బయట తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్తుందని నాకు ముందే తెలుసు. కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం. కానీ మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు. అదేవిధంగా మాకు బ్యాటింగ్లో అద్భుతమైన ఆరంభం లభించింది. అదే జోరును ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగించాం. మాకు చాలా బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి బ్యాటర్లకు పూర్తి స్వేచ్చను ఇచ్చాం. హ్యారీ బ్రూక్ ఎటువంటి ఆటగాడో మనందరికీ తెలుసు. మరోసారి అతడు తాను ఎంటో నిరూపించుకున్నాడు. అటువంటి ఆటగాడు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే హ్యారీ విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇచ్చాం. ఆఖరిగా ప్రతీ మ్యాచ్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటాం" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ -
KKR Vs SRH: బ్రూక్ బంగారం...
కోల్కతా: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో రైజర్స్ 23 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 100 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్లు), అభిషేక్ శర్మ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ నితీశ్ రాణా (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్స్లు), రింకూ సింగ్ (31 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. మెరుపు భాగస్వామ్యాలు... ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే బ్రూక్ దూకుడు మొదలైంది. ఉమేశ్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, ఉమేశ్ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. రసెల్ ఒకే ఓవర్లో మయాంక్ (9), రాహుల్ త్రిపాఠి (9)లను అవుట్ చేసినా మరోవైపు బ్రూక్ జోరు ఆగలేదు. అతనికి జత కలిసి మార్క్రమ్ కూడా చెలరేగిపోయాడు. ఫలితంగా పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 75/2కు చేరింది. మరోవైపు సుయశ్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్.. వరుణ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన మార్క్రమ్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్రూక్ పండగ చేసుకున్నాడు. తొలి బంతిని సిక్స్గా మలచిన అతను మరో 4 ఫోర్లు బాదాడు. అభిషేక్ కూడా మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో 18 ఓవర్లు ముగిసేసరికి రైజర్స్ స్కోరు 200 పరుగులకు చేరింది. బ్రూక్, అభిషేక్ నాలుగో వికెట్కు 33 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. చివరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి బ్రూక్ శతకాన్ని అందుకోగా, ఆఖర్లో క్లాసెన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను సుయశ్ వదిలేయడం కూడా రైజర్స్ ఇన్నింగ్స్లో కీలక క్షణం. దీనిని వాడుకున్న బ్రూక్ ఆ తర్వాతి 27 బంతుల్లో మరో 55 పరుగులు చేశాడు. ఆరంభంలోనే తడబాటు... ఛేదనలో నైట్రైడర్స్కు శుభారంభం దక్కలేదు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0) అవుట్ కాగా, జాన్సెన్ వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్ (10), నరైన్ (0)లను వెనక్కి పంపాడు. ఇలాంటి స్థితిలో ఉమ్రాన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ కేకేఆర్ ఇన్నింగ్స్కు కాస్త ఊపు తెచ్చింది. ఈ ఓవర్లో రాణా వరుస బంతుల్లో 4, 6, 4, 4, 4, 6 (మొత్తం 28 పరుగులు) బాదడం విశేషం. అయితే తన వరుస ఓవర్లలో జగదీశన్, రసెల్ (3)లను మర్కండే అవుట్ చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాణా మాత్రం తన జోరును కొనసాగించాడు. గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ మరో ఎండ్ నుంచి కెప్టెన్కు సహకరించాడు. వీరిద్దరి భాగస్వామ్యం (39 బంతుల్లో 69) కొంత ఆశలు రేపినా... లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఈ ఇద్దరి ప్రయత్నం సరిపోలేదు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (నాటౌట్) 100; మయాంక్ (సి) వరుణ్ (బి) రసెల్ 9; రాహుల్ త్రిపాఠి (సి) గుర్బాజ్ (బి) రసెల్ 9; మార్క్రమ్ (సి) రసెల్ (బి) వరుణ్ 50; అభిõషేక్ (సి) శార్దుల్ (బి) రసెల్ 32; క్లాసెన్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–46, 2–57, 3–129, 4–201. బౌలింగ్: ఉమేశ్ 3–0– 42–0, ఫెర్గూసన్ 2–0–37–0, నరైన్ 4–0–28–0, రసెల్ 2.1–0–22–3, వరుణ్ 4–0–41–1, సుయశ్ 4–0–44–0, శార్దుల్ 0.5–0–14–0. కోల్కతా నైట్రైడర్స్ బ్యాటింగ్: గుర్బాజ్ (సి) ఉమ్రాన్ (బి) భువనేశ్వర్ 0; జగదీశన్ (సి) (సబ్) ఫిలిప్స్ (బి) మర్కండే 36; వెంకటేశ్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 10; నరైన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; రాణా (సి) సుందర్ (బి) నటరాజన్ 75; రసెల్ (సి) జాన్సెన్ (బి) మర్కండే 3; రింకూ (నాటౌట్) 58; శార్దుల్ (సి) సుందర్ (బి) ఉమ్రాన్ 12; ఉమేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–0, 2–20, 3–20, 4–82, 5–96, 6–165, 7–197, బౌలింగ్: భువనేశ్వర్ 4–1–29–1, జాన్సెన్ 4–0–37–2, నటరాజన్ 4–0–54–1, ఉమ్రాన్ 2–0–36–1, మర్కండే 4–0–27–2, సుందర్ 2–0–20–0. ఐపీఎల్లో నేడు బెంగళూరు Vs ఢిల్లీ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) లక్నో Vs పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
గెలిచారు.. కానీ తప్పిదాలు చాలానే
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్నినమోదు చేసింది. శుక్రవారం కేకేఆర్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచినప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బౌలింగ్ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు. సులువైన క్యాచ్లు వదిలేయడంతో పాటు రనౌట్ చాన్స్లు కూడా మిస్ చేశారు. కేకేఆర్ ముందు 229 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యం ఉంది కాబట్టే ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకోవచ్చు. అటు ఇటుగా టార్గెట్ 200 ఉండుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. రానున్న మ్యాచ్ల్లో ఫీల్డింగ్, బౌలింగ్ లాంటి అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హ్యారీ బ్రూక్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడం.. కెప్టెన్ మార్క్రమ్ హఫ్ సెంచరీ చేయడం.. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు తిరుగుండదనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ గాడిలో పడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా తయారవుతుంది. ఇదే జోష్ను వచ్చే మ్యాచ్ల్లోనూ కంటిన్యూ చూస్తే ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
అంతా బాగానే ఉంది.. ఆ బలహీనతను అధిగమిస్తే తిరుగుండదు
ఐపీఎల్ 16వ సీజన్లో హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో పాటు డెబ్యూ ఐపీఎల్ ఆడుతున్న బ్రూక్కు ఇదే తొలి సెంచరీ. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న హ్యారీ బ్రూక్ ఆటపై అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సెంచరీ మాట అటుంచితే ఒక్క విషయంలో మాత్రం బ్రూక్ వెనుకబడ్డాడు. కేకేఆర్తో మ్యాచ్లో స్పిన్ ఆడడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్లో అతని స్ట్రైక్రేట్ 258 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్లో అతని స్ట్రైక్రేట్ 117గా ఉండడం గమనార్హం. ఒకవేళ వచ్చే మ్యాచ్ల్లో బ్రూక్ స్పిన్ ఆడడంపై దృష్టి పెడితే అతనికి తిరుగుండదు. ఎలాగూ పేసర్ల బౌలింగ్ను చీల్చిచెండాడుతున్నాడు. ఇక హ్యారీ బ్రూక్కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్తో మ్యాచ్లో ఏకంగా సెంచరీతో మెరిసి విమర్శకుల నోళ్లు మూయించాడు. చదవండి: 'గర్ల్ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'గర్ల్ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి సెంచరీ బ్రూక్ దే. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ ఊచకోత కోశాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ను చూసిన అతని గర్ల్ఫ్రెండ్ చప్పట్లతో అభినందించడం వైరల్గా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ''స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. కానీ పవర్ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మార్క్రమ్, అభిషేక్ శర్మలకు సహకరించా. వాళ్లు ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నా. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు. నా వంతు పాత్ర పోషించా.. ఇంకా మ్యాచ్ మిగిలే ఉంది. మా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల రిత్యా వాళ్లు వెళ్లిపోయారు.. కానీ నా గర్ల్ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్నింగ్స్ను బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా'' అంటూ తెలిపాడు. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫 Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV — JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook said, "my girlfriend is here, but the rest of the family just left. I knew this would happen as soon as they left I'll get some runs (laughs)". pic.twitter.com/TJatdittlh — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2023 -
హ్యారీ బ్రూక్ చరిత్ర.. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి సెంచరీ
ఐపీఎల్ 2023 సీజన్లో తొలి సెంచరీ నమోదైంది. ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కేకేఆర్తో మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. తాను ఆడుతున్న డెబ్యూ ఐపీఎల్లోనే సెంచరీ బాదిన క్రికెటర్గా హ్యారీ బ్రూక్ చరిత్రకెక్కాడు. 55 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 99 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక హ్యారీ బ్రూక్ సెంచరీ.. ఓవరాల్గా ఐపీఎల్లో 76వది కావడం విశేషం. అయితే సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్లో విఫలమైన బ్రూక్ కేకేఆర్తో మ్యాచ్లో మాత్రం తన బ్యాటింగ్ పవరేంటో రుచి చూపించాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్లో అతని స్ట్రైక్రేట్ 295 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్లో అతని స్ట్రైక్రేట్ 95గా ఉండడం గమనార్హం. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV— JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook, turning out to be the 𝗦𝗮𝘂𝗰𝗲rer's stone 🪄 The 𝐌𝐀𝐈𝐃𝐄𝐍 𝐈𝐏𝐋 💯 we all waited for 😍 | @Harry_Brook_88 pic.twitter.com/BV5Hc2Nm17 — SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023 -
#HarryBrook: 13.25 కోట్లు దండగన్నారు.. ఇప్పుడు చెప్పండి!
టెస్టులాడే ఆటగాడిని ఐపీఎల్కు తీసుకొచ్చారు.. 13.25 కోట్లు పెట్టి కొంటే దారుణంగా విఫలమవుతున్నాడు.. ఎస్ఆర్హెచ్ ఇలాంటి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుందో అర్థం కాదు.. ఇవి తొలి మూడు మ్యాచ్ల్లో హ్యారీ బ్రూక్ విఫలమైనప్పుడు వచ్చిన విమర్శలు. సోషల్ మీడియాలో అయితే బ్రూక్ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా కెప్టెన్ మార్క్రమ్ సహా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకముంచింది. ఎట్టకేలకే శుక్రవారం(ఏప్రిల్ 14) కేకేఆర్తో మ్యాచ్లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్తో మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్తో మెరిశాడు. బ్రూక్ ఫామ్లోకి కాస్త అతన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ఓపెనింగ్లో పంపింస్తే రాణించే అవకాశం ఉంటుంది అని ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అందుకే ఓపిక ఉండడం చాలా అవసరం అని అంటారు. ఏమో బ్రూక్ ఇకపై తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందేమో. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ హ్యారీ బ్రూక్ తొలుత విఫలమయ్యాడు. ఒకసారి కుదురుకున్నాకా అతనికి అడ్డు లేకుండా పోయింది. పీఎస్ఎల్లో 10 మ్యాచ్లాడిన బ్రూక్ ఏడు ఇన్నింగ్స్లు ఆడి 262 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఇక కేకేఆర్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కనబెడితే.. బ్రూక్ లాంటి ఆటగాడు ఫామ్లోకి రావడం ఎస్ఆర్హెచ్కు కొండంత బలం. రానున్న మ్యాచ్ల్లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది. -
కేకేఆర్తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్రైజర్స్ తుది జట్టు ఇదే
KKR vs SRH Probable Playing XIs: ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఎస్ఆర్హెచ్ తలపడనుంది. పంజాబ్ కింగ్స్పై గెలిచి ఈ మెగా ఈవెంట్లో బోణీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. అదే జోరును కేకేఆర్పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యరీ బ్రూక్ను పక్కన పెట్టాలని ఎస్ఆర్హెచ్ టీమ్ మెనెజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 13 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక అతడి స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ పిలిఫ్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్ధానంలో అభిషేక్ శర్మ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు మ్యాచ్ల్లో సుందర్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో సన్రైజర్స్ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్క్రమ్ అద్భుతమైన ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.. ఇక బౌలింగ్ పరంగా కూడా ఎస్ఆర్హెచ్ పటిష్టంగా ఉంది. ఉమ్రాన్ మాలిక్, భువీ, నటరాజన్ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గుర్భాజ్ స్ధానంలో జాసన్ రాయ్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. పిచ్ రిపోర్ట్ ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అకుకూలిస్తుంది. ఇదే స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వికెట్పై స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) కోల్కతా నైట్ రైడర్స్ : జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి సన్రైజర్స్ హైదరాబాద్: గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ చదవండి: IPL 2023: గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్ -
రూ.13.25 కోట్లు గోవిందా
-
మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట?
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హైదారాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్టు కోల్పోయి ఛేదించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిఫాఠి(74 నాటౌట్) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ మార్క్రమ్(37నాటౌట్) రాణించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 66 బంతుల్లో 99 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ను అందించాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్ రెండు, జానెసన్, భువీ ఒక వికెట్ సాధించాడు. తీరు మారని హ్యారీ బ్రూక్.. ఇక ఎస్ఆర్హెచ్ తలరాత మారినప్పటికీ.. ఆ జట్టు ఆటగాడు హ్యరీ బ్రూక్ ఆట తీరు మాత్రం మారడం లేదు. మరోసారి బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన బ్రూక్.. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన బ్రూక్ 14 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్ను రూ.13.25 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది. ఇక ఇంత భారీ మొత్తం తీసుకుని మరి దారుణంగా విఫలమవుతున్న బ్రూక్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "నీకు మారమా మరి, 13 కోట్లు తీసుకున్నావు ఇదే నా ఆట" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా? 3 Nee lucky number ah annaw 🤧 #HarryBrook #SRHvPBKS pic.twitter.com/Yqv9Lsw8b9 — Trolling Thopulu (@Trollingthopulu) April 9, 2023 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్
IPL 2023- SRH- Harry Brook: ‘‘ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి నా దృష్టి విదేశీ ఆటగాళ్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు.. వారికి లభించే మొత్తాలను గమనిస్తూ ఉంటా. అందుకు తగ్గట్లే వాళ్లు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తా. కానీ, వారి విషయంలో నా అంచనాలు చాలా వరకు తలకిందులు అయ్యాయి. ఉపఖండ పిచ్లపై.. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. భారీ ప్రైస్ ట్యాగ్ల నేపథ్యంలో నెలకొన్న అంచనాలు అందుకోవడం అంత తేలికేమీ కాదు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అతికొద్ది మంది మాత్రమే ఐపీఎల్లో ఒత్తిడి అధిగమించి తమను తాము నిరూపించుకున్నారు. అయితే, ఆస్ట్రేలియన్లు, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు ఇక్కడి పరిస్థితులు, ఐపీఎల్ ఫార్మాట్ను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ ఇంగ్లిష్ ఆటగాళ్లు మాత్రం ఇంకా వారిలా అదరగొట్టలేకపోతున్నారు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కోట్లు కుమ్మరించారు ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో మంజ్రేకర్ ఈ మేరకు స్టార్ స్టోర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవే బ్రూక్ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి బ్రూక్ త్వరలోనే తనదైన శైలిలో చెలరేగాలని ఆశిస్తున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘‘హ్యారీ బ్రూక్ ఫామ్లోకి వస్తాడనే అనుకుంటున్నా? అయితే అది ఎప్పుడంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఇందుకు మరో రెండు మ్యాచ్లు లేదంటే మూడు మ్యాచ్ల సమయం పట్టొచ్చు. తన బలమేంటో తెలుసుకుని.. తన నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతాడు. ప్రస్తుతం అతడిపై అధిక ధర పలికిన ప్లేయర్ అనే ట్యాగ్.. చుట్టూ జనాల అంచనాలు.. భారత పిచ్లపై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనుభవలేమి ఒత్తిడిని పెంచుతున్నాయి. వీటిని అధిగమిస్తే బ్రూక్ తప్పకుండా రాణించగలడు’’ అంటూ మంజ్రేకర్ హ్యారీ బ్రూక్కు అండగా నిలబడ్డాడు. 13 కోట్ల రూపాయలు పలికిన పవర్ హిట్టర్.. ఐపీఎల్లో ఇలా 24 ఏళ్ల బ్రూక్ బిగ్ హిట్టర్గా పేరొందాడు. గతేడాది 6 టెస్టులు ఆడి ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 372 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్- 2023 మినీ వేలంలో సన్రైజర్స్ అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఈ సన్రైజర్స్ బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్తాన్, లక్నోలతో మ్యాచ్లలో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మంజ్రేకర్ ఈ మేరకు అండగా నిలవడం గమనార్హం. చదవండి: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్!
Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది. లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్రైజర్స్ హెడ్కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఐపీఎల్-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు. పేలవమైన ప్రదర్శనతో రైజర్స్ వరుస ఓటములు ఇప్పటికైనా తమ బ్యాటింగ్ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్రైజర్స్.. పదహారో ఎడిషన్నూ పేలవంగా ఆరంభించింది. సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన రైజర్స్... శుక్రవారం నాటి మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఎయిడెన్ అన్న.. హ్యారీ బ్రూక్ మరీ ఘోరంగా తొలి మ్యాచ్లో టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్ జట్టుపై రాహుల్ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది. వాళ్లిద్దరు అవుట్ అవడం దెబ్బతీసింది ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత.. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హ్యారీబ్రూక్ వెనువెంటనే పెవిలియన్ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు. చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కదు. టి20లంటే వేగానికి మారుపేరు అన్న సంగతి పక్కనబెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్ఆర్హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే అంతకముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న ఒక్క కారణంతో హ్యారీ బ్రూక్కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లోనే హిట్టింగ్ చేశాడంటే టి20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీ ఎస్ఆర్హెచ్ను నవ్వుల పాలయ్యేలా చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరే ఫస్ట్ మ్యాచులో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచులో ఇంకా దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచులో 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసిన హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు. అయితే, నిజానికి బ్రూక్కు టెస్టు క్రికెట్లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లండ్ తరఫున 20 టి20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేసి.. మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. చదవండి: Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి? -
SRH Vs RR: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఒక్క మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన లేదు. గెలిపించే భాగస్వామ్యమే రాలేదు. టాప్–5లో ఒక్కరూ కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టలేదు. ఇలాంటి ఆటతో ఐపీఎల్ మ్యాచ్ గెలవాలని ఏ జట్టయినా కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆట ఇలాగే ఉంది. ముందుగా నియంత్రణ లేని బౌలింగ్తో రెండొందలకు పైగా పరుగులు ఇచ్చిన జట్టు ఆ తర్వాత బ్యాటింగ్లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇక కోలుకునే అవకాశమే లేకపోయింది. ఫలితమే సొంతగడ్డపై భారీ ఓటమి. అన్ని రంగాల్లో రాణించిన రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయంతో తమ సీజన్ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఐపీఎల్ సీజన్(2023)ను సన్రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి పోరులో పేలవ ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జట్టులో టాప్–3 ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసి ఓడిపోయింది. అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ చహల్ (4/17) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ల జోరు... పవర్ప్లేలో ఇద్దరు రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి, బట్లర్ విధ్వంసం సృష్టించారు. సన్రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి ఐదు ఓవర్లలో రాయల్స్ వరుసగా 14, 17, 19, 17, 12 పరుగులు రాబట్టింది. భువీ ఓవర్లో యశస్వి రెండు ఫోర్లు, బట్లర్ సిక్స్ కొట్టగా... వాషింగ్టన్ సుందర్ ఓవర్లో వరుస బంతుల్లో బట్లర్ రెండు సిక్స్లు బాదాడు. ఆపై నటరాజన్ ఓవర్లో బట్లర్ 4 ఫోర్లుతో చెలరేగాడు. ఫజల్ ఓవర్లో కూడా 3 ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 85 పరుగుల (35 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 7.4 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 100 పరుగులకు చేరింది. ఈ దశలో రాయల్స్ ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ సామ్సన్ తీసుకున్నాడు. సామ్సన్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరోవైపు 34 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. ఉమ్రాన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్, అతని తర్వాతి మరో ఫోర్, సిక్స్ బాదాడు. తక్కువ వ్యవధిలో రాజస్తాన్ జట్టు యశస్వి, దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) వికెట్లను కోల్పోగా, 28 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. చేతులు కాలాక హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో 7–15 మధ్య తొమ్మిది ఓవర్లలో రాజస్తాన్ 75 పరుగులు చేసింది. ఆపై డెత్ ఓవర్లలో కూడా స్కోరును పెంచుకోవడంలో రాయల్స్ విఫలమైంది. మరోసారి హైదరాబాద్ బౌలర్లు చక్కటి బంతులతో ప్రత్యర్థిని నిరోధించగలిగారు. ఆఖరి ఐదు ఓవర్లలో సామ్సన్ వికెట్ కోల్పోయి రాజస్తాన్ 43 పరుగులే సాధించగలిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం కారణంగానే ఆ జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్కు ఆరంభంలోనే దెబ్బ పడింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0) వెనుదిరిగారు. పేలవ ప్రదర్శన కారణంగా పవర్ప్లేను హైదరాబాద్ 30 పరుగులతోనే ముగించింది. ఘనమైన రికార్డులు, ఎన్నో అంచనాలతో తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ (21 బంతుల్లో 13; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోయాడు. 13.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అతడు.. తొలి మ్యాచ్లో కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. యజువేంద్ర చహల్ బౌలింగ్లో బ్రూక్ బౌల్డయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (8) కూడా విఫలం కావడంతో 48 పరుగుల వద్ద హైదరాబాద్ సగం టీమ్ డగౌట్ చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు) అవుట్ కావడంతో సన్రైజర్స్ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో సమద్ కొన్ని మెరుపులు మెరిపించినా అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో సమద్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టగా, ఉమ్రాన్ (19 నాటౌట్) 2 సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు. సన్రైజర్స్ తన తదుపరి మ్యాచ్ను శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. IPL 2023 SRH Vs RR Scorecard: స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) మయాంక్ (బి) ఫజల్ 54; బట్లర్ (బి) ఫజల్ 54; సామ్సన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55; పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2; పరాగ్ (సి) ఫజల్ (బి) నటరాజన్ 7; హెట్మైర్ (నాటౌట్) 22; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–85, 2–139, 3–151, 4–170, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–36–0, ఫజల్ హఖ్ 4–0–41–2, సుందర్ 3–0–32–0, నటరాజన్ 3–0–23–2, ఆదిల్ రషీద్ 4–0–33–0, ఉమ్రాన్ 3–0–32–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) బౌల్ట్ 0; మయాంక్ (సి) బట్లర్ (బి) చహల్ 27; త్రిపాఠి (సి) హోల్డర్ (బి) బౌల్ట్ 0; హ్యారీ బ్రూక్ (సి) చహల్ 13; సుందర్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 1; ఫిలిప్స్ (సి) ఆసిఫ్ (బి) అశ్విన్ 8; సమద్ (నాటౌట్) 32; రషీద్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 18; భువనేశ్వర్ (బి) చహల్ 6; ఉమ్రాన్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–34, 4–39, 5–48, 6–52, 7–81, 8–95. బౌలింగ్: బౌల్ట్ 4–1–21–2, ఆసిఫ్ 3–0–15–0, హోల్డర్ 3–0–16–1, అశ్విన్ 4–0–27–1, చహల్ 4–0–17–4, నవదీప్ సైనీ 2–0–34–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Easy as you like 😉@yuzi_chahal wins the battle of the spinners 👌👌 Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/7yIPE3juHm — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
IPL 2023: రాజస్తాన్తో ఎస్ఆర్హెచ్ ఢీ.. అతడిపైనే అందరి కళ్లు
ఐపీఎల్-2023 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్రైజర్స్ హైదారాబాద్ సిద్దమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఆరెంజ్ ఆర్మీ సరి కొత్తగా బరిలోకి దిగబోతుంది. అయితే కెప్టెన్గా ఎంపికైన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్ తొలి మ్యాచ్కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో ఆ జట్టు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో కెప్టెన్ భువీతో పాటు అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరు చెలరేగితే రాజస్తాన్కు కష్టాలు తప్పవు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మినీవేలంలో ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హారీ బ్రూక్ని రూ.13.5 కోట్లకి సన్రైజర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆశలన్నీ బ్రూక్పైనే పెట్టుకుంది. ఇంగ్లండ్ తరపున అదరగొడుతున్న బ్రూక్ ఐపీఎల్లో ఎలా రాణిస్తాడో అని అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఓపెనింగ్ స్థానం కోసం కోసం మయాంక్ అగర్వాల్ని కూడా రూ.8.25 కోట్లు వెచ్చించి మరీ ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మరోవైపు రాజస్తాన్ కూడా పటిష్టంగా కన్పిస్తోంది. రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, శాంసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో బౌల్ట్, అశ్విన్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో ఓ సారి పరిశీలిద్దాం. తుది జట్లు(అంచనా) ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ఒబెడ్ మెక్కాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఉమేశ్ యాదవ్.. ఒకే ఒక్కడు! -
IPL 2023: రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్రైజర్స్ బ్యాటర్కే!
IPL 2023- Orange Cap Holder Prediction: ‘‘నేనైతే ఆరెంజ్ క్యాప్ అతడికే దక్కుతుంది అనుకుంటున్నా. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనతో బెస్ట్ ప్లేయర్ అవుతాడని భావిస్తున్నా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుస్తాడనే నమ్మకం ఉంది’’ అంటూ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. ఇంగ్లండ్ యువ కెరటం, సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. 24 ఏళ్ల హ్యారీ బ్రూక్.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఇక పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్లలో 148.32 స్ట్రైక్రేటుతో 2432 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో సన్రైజర్స్ హైదరబాద్ ఫ్రాంఛైజీ కళ్లు చెదిరే మొత్తానికి బ్రూక్ను సొంతం చేసుకుంది. అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో హ్యారీ బ్రూక్పై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అతడు జట్టులో ఉండటం వల్ల మిడిలార్డర్లో సన్రైజర్స్కు మంచి ‘బూస్టింగ్’ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ వేలంలో అవలంబించిన వ్యూహాల గురించి మాట్లాడుతూ.. ‘‘వేలంలో సన్రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. బ్రూక్ను కొనుగోలు చేసి మంచి పనిచేసింది. వాళ్లకు అతడు కీలక బ్యాటర్ కానున్నాడు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బ్రూక్పై ప్రశంసలు కురిపించిన స్టీవ్ హార్మిసన్.. ఐపీఎల్-2023 సీజన్లో అతడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. కాగా ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్తో సన్రైజర్స్ ఐపీఎల్-2023లో మొదటి మ్యాచ్ ఆడనుంది. సన్రైజర్స్ జట్టు ఇదే స్వదేశీ ఆటగాళ్లు ►రాహుల్ త్రిపాఠి ►అభిషేక్ శర్మ ►వాషింగ్టన్ సుందర్ ►భువనేశ్వర్ కుమార్ ►కార్తీక్ త్యాగి ►నటరాజన్ ►అబ్దుల్ సమద్ ►ఉమ్రాన్ మలిక్ ►మయాంక్ అగర్వాల్ ►అన్మోల్ ప్రీత్ సింగ్ ►మయాంక్ మర్కండే ►వివ్రాంత్ శర్మ ►మయాంక్ దాగర్ ►సమర్థ్ వ్యాస్ ►సన్వీర్ ►ఉపేంద్ర సింగ్ ►నితీశ్ కుమార్ రెడ్డి. విదేశీ ఆటగాళ్లు ►ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ►గ్లెన్ ఫిలిప్స్ ►మార్కో జాన్సెన్ ►ఫజల్ హఖ్ ఫారుఖీ ►హ్యారీ బ్రూక్ ►హెన్రిచ్ క్లాసెన్ ►ఆదిల్ రషీద్ ►అకీల్ హొసీన్. చదవండి: ICC ODI WC 2023: 'ఆడేది మెగాటోర్నీ అలా కుదరదు'.. ప్లాన్ బెడిసికొట్టిందా? Virat Kohli: 'ముందుచూపు తక్కువ.. కొన్న కార్లను అమ్మేసుకున్నా’ 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 -
ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా లీగ్ కోసం ఆయా జట్లు తమ ప్రాక్టీస్ను కూడా మొదలపెట్టాయి. ఆయా జట్లు తమ హాంగ్రౌండ్స్లో ప్రాక్టీస్ సెషన్స్లో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో సరికొత్తగా బరిలోకి దిగబోతున్న సర్రైజర్స్ హైదరాబాద్ సైతం ఉప్పల్ నెట్స్లో తీవ్రంగా చమటోడ్చోతుంది. ఆ జట్టు బ్యాటర్ హ్యారీ బ్రూక్ నెట్ ప్రాక్టీస్కు వీడియోను ఎస్ఆర్హెచ్ ట్విటర్లో షేర్ చేసింది. నెట్స్లో ఫాస్ట్బౌలర్లను ఎదుర్కొన్న బ్రూక్.. భారీ సిక్స్లతో విరుచుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐపీఎల్-2023 మినీవేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ను రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన సూపర్ ఫామ్ను ఐపీఎల్లో కూడా కొనసాగించాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్2న ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. చదవండి: SL vs NZ: క్లియర్గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 -
ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్ అప్కమింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్లోనూ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్ మాత్రమే కావడం విశేషం. బాబర్ 2021 ఏప్రిల్లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్కు పోటీగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్నే వరించింది. బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్కు ఓటింగ్ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్, ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ పోటీపడినప్పటికీ, గార్డ్నర్నే అవార్డు వరించింది. బ్రూక్, బాబర్ తరహాలోనే గార్డ్నర్ కూడా ప్లేయర్ అఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్నర్, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్.. రేసులో బ్రూక్తో పాటు ఎవరున్నారంటే..?
ఫిబ్రవరి నెలకు గానూ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. ఫిబ్రవరి మాసంలో న్యూజిలాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ రైజింగ్ స్టార్ హ్యారీ బ్రూక్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 తొలి రెండు టెస్ట్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా, జింబాబ్వే పర్యటనలో జరిగిన రెండు టెస్ట్ల్లో అదరగొట్టిన విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ అవార్డు రేసులో ఉన్నారు. బ్రూక్.. న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా తొలి రెండు టెస్ట్ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. -
NZ Vs Eng: పార్ట్టైమ్ పేసర్ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్ మామ!
New Zealand vs England, 2nd Test: న్యూజిలాండ్తో రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బౌలింగ్ స్కిల్తోనూ ఆకట్టుకున్నాడు. పర్యాటక జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్ను అవుట్ చేసి బ్రేక్ అందించాడు. న్యూజిలాండ్ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న కేన్ మామ జోరుకు ఈ పార్ట్టైమ్ పేసర్ అడ్డుకట్ట వేశాడు. జాక్ లీచ్, ఆండర్సన్, బ్రాడ్ల బౌలింగ్ను చెండాడిన విలియమ్సన్ వికెట్ను హ్యారీ బ్రూక్ తన ఖాతాలో వేసుకోవడం నాలుగో రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. ఇక హ్యారీ బ్రూక్కు ఇదే తొలి టెస్టు వికెట్ కావడం మరో విశేషం. పార్ట్టైమ్ పేసర్ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా ఫాలో ఆన్ ఆడుతున్న కివీస్కు తన అద్భుత బ్యాటింగ్తో ఊపిరిలూదాడు విలియమ్సన్. క్రీజులో పట్టుదలగా నిలబడి 282 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసిన కేన్ మామ.. 152వ ఓవర్లో హ్యారీ బ్రూక్ బౌలింగ్లో వెనుదిరిగాల్సి వచ్చింది. పార్ట్టైమ్ పేసర్ బ్రూక్ బౌలింగ్లో విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా ఒడిసిపట్టిన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వెంటనే బంతిని వికెట్లకు గిరాటేశాడు. అయితే, బ్యాట్కు బంతి తాకిందా లేదా అన్న సందిగ్దం నెలకొన్న వేళ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రివ్యూకు వెళ్లి సఫలమయ్యాడు. దీంతో విలియమ్సన్ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో.. హ్యారీ బ్రూక్కు టెస్టుల్లో వికెట్ సమర్పించుకున్న తొలి బాధిత బ్యాటర్గా విలియమ్సన్ నిలిచాడు. ప్రత్యర్థికి కివీస్ సవాల్ ఫాలో ఆన్ ఆడిన కివీస్ 483 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. 258 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇక తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. ఈ టెస్టులోనూ గెలవాలంటే విజయానికి 210 పరుగులు అవసరం. బ్రూక్, రూట్ వల్లే ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో హ్యారీ బ్రూక్ కీలక పాత్ర పోషించాడు. జో రూట్ అజేయ సెంచరీ(153)కి తోడుగా 186 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: అంతర్జాతీయ టీ20 మ్యాచ్.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్ ఖతం, అత్యంత చెత్త రికార్డులు NZ VS ENG 2nd Test: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే..! The man with the golden arm, Harry Brook 💪 His first test wicket is a key one of Kane Williamson 😍 A breakthrough from out of nowhere! #NZvENG pic.twitter.com/usMAvhIImV — Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023 -
పట్టుబిగించిన ఇంగ్లండ్.. భారమంతా కేన్ మామపైనే..!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61) అర్ధసెంచరీలు చేసి ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (25 నాటౌట్), హెన్రీ నికోల్స్ (18) క్రీజ్లో ఉన్నారు. జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టగా.. జో రూట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత పూర్తిగా కేన్ విలియమ్స్న్పై ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్లో ఉన్న హ్యారీ బ్రూక్ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్ (153 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో వీరిద్దరూ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్వెల్ 2, సౌథీ, వాగ్నర్ తలో వికెట్ దక్కించకున్నారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. కెప్టెన్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే న్యూజిలాండ్ ఈ మాత్రం కూడా స్కోర్ చేయలేకపోయేది. ఇంగ్లండ్ వెటరన్ పేస్ సింహాలు ఆండర్సన్ (3/37), స్టువర్ట్ బ్రాడ్ (4/61) మరోసారి చెలరేగగా. జాక్ లీచ్ (3/80) పర్వాలేదనిపించాడు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా!
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్రూక్ కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. బ్రూక్ ప్రస్తుతం డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతడు 169 బంతుల్లో 184 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్లో 5 సిక్స్లు, 24 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 100.8 సగటుతో 807 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఈ క్రమంలో ఓ అరుదైన ఘతనను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో అతడు 807 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కాంబ్లీ రికార్డు బ్రేక్చేశాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. క్రీజులో రూట్(101),బ్రూక్ (184) పరుగులతో ఉన్నారు. చదవండి: T20 WC: అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్! దురదృష్టం అంటే టీమిండియాదే? -
Steve Smith: గిల్కు అంత సీన్ లేదు.. ప్రపంచ క్రికెట్ను శాసించబోయేది అతడే..!
అవకాశం దొరికితే టీమిండియా ఆటగాళ్లపై బురదజల్లేందుకు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మాజీలు, ఆ రెండు జట్ల అభిమానులు రెడీగా ఉంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాలకు చెందిన వారు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కి, విషం చిమ్మే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా మనవాళ్లు ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలాంటి అవకాశం ఎప్పుడోసారి దొరికితే మాత్రం ఈ రెండు దేశాలకు చెందిన వారు పండుగ చేసుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ అవకాశమే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు దొరికింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో ఓ సందర్భంగా భవిష్యత్తు క్రికెట్ సూపర్ స్టార్ ఎవరు అనే ప్రశ్నను నిర్వహకులు స్మిత్ను అడిగారు. ఈ ప్రశ్నకు వారు టీమిండియా శుభ్మన్ గిల్, ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్స్ అనే రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లను తక్కువ చేసి చూపే ఇలాంటి ఓ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న స్మిత్కు ఈ ప్రశ్న రూపంలో బంపరాఫర్ వచ్చింది. ఈ ప్రశ్న సంధించగానే ఏమాత్రం తడుంకోని స్మిత్, రెండో ఆప్షన్ లేదు అన్నట్లుగా ఠక్కున హ్యారీ బ్రూక్ పేరు చెప్పాడు. 23 ఏళ్ల హ్యారీ బ్రూకే భవిష్యత్తు సూపర్ స్టార్ అని కితాబునిచ్చాడు. టీమిండియా శుభ్మన్ గిల్తో పోలిస్తే బ్రూక్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్నాడని కొనియాడాడు. స్మిత్ ఆన్సర్తో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఏకీభవించాడు. దీంతో స్మిత్ మరింత సౌండ్ పెంచి టెక్నిక్ విషయంలో, విదేశీ పిచ్లపై బ్రూక్ అద్భుతమైన ప్రదర్శనలు కనబర్చాడని పాకిస్తాన్, న్యూజిలాండ్ టూర్లను ఉదహరించాడు. గిల్కు వ్యతిరేకంగా ఓటు వేసి శునకానందం పొందుతున్న స్మిత్కు భారత అభిమానులు తగిన బుద్ధిచెబుతున్నారు. గతంలో కోహ్లిని, నిన్ను ఇలాగే పోల్చారు.. ఇప్పుడు కోహ్లి ఎక్కడ.. నువ్వు ఎక్కడా అంటూ గాలి తీసేస్తున్నారు. కాగా, ఫ్యూచర్ సూపర్ స్టార్ ఎవరు అనే విషయంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నప్పటికీ.. గిల్, బ్రూక్ ఇద్దరు సూపర్ టాలెంటెడ్ ఆటగాళ్లన్న విషయం ఒప్పుకోవాల్సిందే. తొలుత టెస్ట్ల్లోనే సత్తా చాటిన గిల్ ఆ తర్వాత వన్డే, టీ20ల్లోనూ చెలరేగిపోయాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అతి కొద్దిమంది క్రికెటర్లలో గిల్ కూడా ఒకడిగా నిలిచాడు. బ్రూక్ విషయానికొస్తే.. ఇతను కూడా ఆరంగ్రేటం నుంచి ఫార్మాట్లకతీతంగా అదిరిపోయే పర్ఫామెన్స్తో అదరగొడుతున్నాడు. వన్డేలు, టీ20లతో పోలిస్తే బ్రూక్ టెస్ట్ల్లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్లో 77.9 సగటున 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 623 పరుగులు చేశాడు. -
ENG Vs NZ: గర్జించిన వెటరన్ సింహాలు.. న్యూజిలాండ్ను మట్టికరిపించిన ఇంగ్లండ్
బజ్బాల్ విధానాన్ని అవలంభించి ఇంగ్లండ్ జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై ఆడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్ట్లో ఆతిధ్య జట్టును 267 పరుగుల తేడాతో మట్టికరిపించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్కు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్లో ఆండర్సన్ 7 వికెట్లతో విజృంభించగా.. బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ వెటరన్ పేస్ ద్వయం రెండో ఇన్నింగ్స్లో నిప్పులు చెరిగారు. బ్రాడ్ 4, ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాశించారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్బౌల్డ్లు కావడం మరో ఆసక్తికర విషయం. ఇంగ్లండ్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆండర్సన్, బ్రాడ్ ధాటికి 126 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అటాకింగ్ ఫార్ములాను అమలు చేసిన ఇంగ్లండ్ మరోసారి సక్సెస్ సాధించింది. ఆండర్సన్, బ్రాడ్తో పాటు ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా.. టామ్ లాథమ్ (15), బ్రేస్వెల్ (25) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 306 పరుగులకు ఆలౌటైంది. 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 374 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటై 267 పరుగుల తేడతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో టామ్ బ్లండెల్ (138) సెంచరీతో, కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశారు. అనంతరం ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్సెంచరీలతో రాణించగా.. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బౌలర్లు వాగ్నర్ 6, టిక్నర్ 4, కుగ్గెలిన్ 4, బ్రేస్వెల్ 3, సౌథీ 2 పడగొట్టగా.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 7, బ్రాడ్ 5, రాబిన్సన్ 5, జాక్ లీచ్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది. -
ENG VS NZ 1s Test: నిప్పులు చెరిగిన బ్రాడ్.. ఓటమి దిశగా కివీస్
2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో (డే అండ్ నైట్) విజయం దిశగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు రెండో ఇన్నింగ్స్లో 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (10-5-21-4) నిప్పులు చెరగడంతో మూడో రోజు ఆఖరి సెషన్లో కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. క్రీజ్లో డారిల్ మిచెల్ (13),ర మైఖేల్బ్రేస్వెల్ (25) ఉన్నారు. బ్రాడ్ 4 వికెట్లతో విజృంభించగా.. రాబిన్సన్ ఓ వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో లాథమ్ (15), డెవాన్ కాన్వే (2), విలియమ్సన్ (0), హెన్రీ నికోల్స్ (7), టామ్ బ్లండెల్ (1) దారుణంగా విఫలమయ్యారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌటైంది. రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్సెంచరీలతో రాణించగా.. ఓలీ పోప్ (49), స్టోక్స్ (31), రాబిన్సన్ (39), జాక్ క్రాలే (28), బెన్ డక్కెట్ (25) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్, బ్రేస్వెల్ చరో 3 వికెట్లు తీయగా.. వాగ్నర్, కెగ్గెలిన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో చేసిన 325 పరగుల స్కోర్కు న్యూజిలాండ్ ధీటుగానే బదులిచ్చింది. టామ్ బ్లండెల్ (138) సెంచరీతో కదం తొక్కగా.. కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 4, ఆండర్సన్ 3, బ్రాడ్, జాక్ లీచ్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలిన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. మరో వికెట్ ఉండగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. -
ఇంగ్లండ్ టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్.. తొలి రోజే.. ఓ వికెట్ ఉన్నా..!
2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్లో ఇవాళ (ఫిబ్రవరి 16) ప్రారంభమైన తొలి టెస్ట్లో (డే అండ్ నైట్ టెస్ట్) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి రోజు.. అది కూడా కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడి, ఓ వికెట్ ఉన్నా తొలి ఇన్నింగ్స్ను 325 పరుగుల (9 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో 20.. 30 పరుగులు అదనంగా చేసే అవకాశం ఉన్నా ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ సోషల్మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా లేక ఇంకేమైనానా అంటూ ఇంగ్లండ్ నిర్ణయాన్ని దుయ్యబడుతున్నారు. టెస్ట్లను కూడా టీ20ల్లా ఆడాలనుకుంటే, కేవలం వాటికే పరిమితం కావచ్చు కాదా అంటూ సలహాలిస్తున్నారు. ఇంగ్లండ్ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇంగ్లండ్ తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల టెస్ట్ క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. సంప్రదాయ టెస్ట్ మ్యాచ్లను బజ్బాల్ అనే అతిగతి లేని విధానాన్ని అమలు చేసి చంపేస్తున్నారని తూర్పారబెడుతున్నారు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు ఆడే ఓపిక లేకపోతే, ఇంట్లోనే కూర్చోవాలి కానీ, ఆటకు కళంకం తేవడమెందుకని నిలదీస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ టీమ్ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో వేగం పెంచిన విషయం విధితమే. ఫలితం త్వరగా రాబట్టాలనే ఉద్దేశంతో ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగడమే వారి ప్రణాళిక. దీనికి వాళ్లు బజ్బాల్ అప్రోచ్ అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి వారు ఈ విధానంలో టెస్ట్లు ఆడి 100 శాతం సఫలమయ్యారు. అయితే సంప్రదాయ టెస్ట్ క్రికెట్ వాదులు ఇంగ్లండ్ అమలు చేస్తున్న బజ్బాల్ విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే టీ20ల వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, కివీస్తో తొలి టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రాకెట్ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బెన్ డక్కెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్ (42), బెన్ ఫోక్స్ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి రాబిన్సన్ (15 నాటౌట్; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్ ఆండర్సన్ బరిలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలెన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్ పేసర్లకు సహకరించడం మొదలుపెట్టిందని తెలిసి వారు హడావుడిగా పరుగులు సాధించి, ప్రత్యర్ధిని బరిలోకి ఆహ్వానించారని సమాచారం. డిన్నర్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ ఆఖరి 4 వికెట్లను 46 పరుగుల వ్యవధిలో కోల్పోవడం వారి ప్రణాళికకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఇంగ్లండ్ వ్యూహాలు కూడా ఫలించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 37 పరగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాన్వే (17), వాగ్నర్ (4) క్రీజ్లో ఉన్నారు. -
డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
డిసెంబర్ నెల 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (జనవరి 10) ప్రకటించింది. భీకర ఫామ్లో ఉన్న ఇంగ్లండ్ మిడిలార్డర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ ఇటీవల ముగిసిన పాకిస్థాన్ టూర్లో విశేషంగా రాణించి 3 టెస్ట్లో ఏకంగా 468 పరుగులు స్కోర్ చేశాడు. ఫలితంగానే అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం బ్రూక్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసీస్ ఆల్రౌండర్ ట్రవిస్ హెడ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ అతడివైపే మొగ్గుచూపింది. డిసెంబర్లో బ్రూక్ ఆడిన 3 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి, పాక్ను వారి సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పాక్తో టెస్ట్ సిరీస్లో బ్రూక్ సహా మిగతా ఇంగ్లీష్ ప్లేయర్లంతా మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 3-0 తేడాతో పాక్ను ఊడ్చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. డిసెంబర్ నెలలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆష్లే.. ఈ సిరీస్లో 166.66 స్టయిక్ రేట్తో 115 పరుగులు చేసి 18.28 సగటున 7 వికెట్లు పడగొట్టింది. ఈ అవార్డు కోసం ఆష్లే.. న్యూజిలాండ్ సూజీ బేట్స్, ఇంగ్లండ్ చార్లీ డీన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. కాగా, పురుషుల ప్లేయర్ ఆఫ్ డిసెంబర్ మంత్ అవార్డు గెలుచుకున్న హ్యారీ బ్రూక్ను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
IPL 2023: బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీబ్రూక్ పంట పండింది. ఇటీవలే కాలంలో నిలకడగా ఆడుతున్న బ్రూక్ టి20 వరల్డ్కప్లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్లో సెంచరీలతో కథం తొక్కిన హ్యారీ బ్రూక్కు శుక్రవారం కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో బ్రూక్దే అత్యధికం కావడం విశేషం. బ్రూక్ తర్వాత మయాంక్ అగర్వాల్ రూ. 8.25 కోట్లకు ఎస్ఆర్హెచ్కే అమ్ముడుపోయాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను రూ. 2కోట్ల కనీస ధరకు గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ఇక అజింక్యా రహానేనను సీఎస్కే కనీస ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక హ్యారీ బ్రూక్ ఇటీవలే పాకిస్తాన్తో ముగిసిన టెస్టు సిరీస్ ద్వారా 125 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా హ్యారీబ్రూక్ నిలిచాడు.ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్తో టెస్టు సిరీస్లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. What do you make of this buy folks? 💰💰 Congratulations to Harry Brook who joins @SunRisers #IPLAuction | @TataCompanies pic.twitter.com/iNSKtYuk2C — IndianPremierLeague (@IPL) December 23, 2022 చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా -
ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్ను వారి సొంతగడ్డపై వైట్వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్లో 179 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
PAK VS ENG: బ్రూక్ సెంచరీ.. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మూడో టెస్ట్
కరాచీ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 7/1 ఓవర్నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ (150 బంతుల్లో 111; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, ఓలీ పోప్ (51), బెన్ ఫోక్స్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటై, కీలకమైన 50 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, నౌమాన్ అలీ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ వసీం జూనియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. పాక్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 29 పరుగులు వెనుకపడి ఉంది. అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) క్రీజ్లో ఉన్నారు. మ్యాచ్లో ఇంకా 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం రావడం ఖాయమని స్పష్టమవుతుంది. తొలి రోజు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్ను అమలు చేసి తొలి రెండు టెస్ట్ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. -
బాధపడకు స్టోక్స్.. నీ త్యాగం ఊరికే పోలేదు!
17 సంవత్సరాల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక మూడోటెస్టులోనూ గెలిచి ఇంగ్లండ్ క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు పాక్ మాత్రం ఎలాగైనా టెస్టు గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. ఇక మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఆడుతుంది. పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ రనౌట్ అయిన తీరు ఆసక్తిగా నిలిచింది. హ్యారీ బ్రూక్తో ఏర్పడిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా స్టోక్స్ రనౌట్గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో ఐదో బంతిని బ్రూక్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బ్రూక్, స్టోక్స్లు రెండు పరుగులు తీశారు. అయితే స్టోక్స్ మూడో పరుగు కోసం వస్తున్నాడని బ్రూక్ అంచనా వేయలేదు. బ్రూక్స్ పరిగెత్తాలనుకొనేలేపే పాక్ ఫీల్డర్ బంతిని అందుకొని నాన్స్ట్రైక్ ఎండ్వైపు విసిరాడు. అప్పటికే స్టోక్స్ స్ట్రైకింగ్ ఎండ్వైపు వచ్చేశాడు. బ్రూక్స్ కోసం స్టోక్స్ తన వికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే స్టోక్స్ త్యాగం ఊరికే పోలేదు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన కెప్టెన్ను ఔట్ చేశానన్న బాధనో ఏమో తెలియదు కానీ మరోసారి కీలక సెంచరీతో మెరిశాడు బ్రూక్స్. ఈ సిరీస్లో బ్రూక్స్కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 111 పరుగులు చేసిన బ్రూక్స్ మహ్మద్ వసీమ్ జూనియర్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతేకాదు పనిలో పనిగా 125 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టాడు బ్రూక్స్. ఇంగ్లండ్ తరపున తొలి ఆరు ఇన్నింగ్స్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా బ్రూక్స్ నిలిచాడు. ఇంతకముందు కేఎస్ రంజిత్ సిన్హ్జి 418 పరుగులతో ఉన్నాడు. తాజాగా బ్రూక్స్ రంజిత్సిన్హ్జిని అధిగమించాడు. "Utter, utter confusion!" ⚡#PAKvENG | #UKSePK pic.twitter.com/wdyDwg9AIU — Pakistan Cricket (@TheRealPCB) December 18, 2022 చదవండి: 125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం -
125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్తో ప్రారంభమైన టెస్టు సిరీస్లో బ్రూక్ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా పాక్తో మొదలైన మూడో టెస్టులో మరోసారి సెంచరీతో మెరిసిన హ్యారీ బ్రూక్ 125 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా హ్యారీబ్రూక్ నిలిచాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్తో టెస్టు సిరీస్లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు జరుగుతున్న ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. బెన్ ఫోక్స్ 60, మార్క్వుడ్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకు ఆలౌట్ అయింది. Harry Brook has broken KS Ranjitsinhji's 125 year-old record for the most runs in a batter's first 6 men's Test inns for England: 436 HARRY BROOK (12, 153, 87, 9, 108, 67*) 418 KS Ranjitsinhji (62, 154*, 8, 11, 175, 8*) 411 Tip Foster (287, 19, 49*, 21, 16, 19) — Mark Puttick (@GryllidaeC) December 18, 2022 చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు -
Pak Vs Eng: పాక్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్ కూడా
England tour of Pakistan, 2022 - Pakistan vs England, 1st Test: చారిత్రాత్మక మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ బౌలర్ జాహిద్ మొహమ్మద్కు చేదు అనుభవం ఎదురైంది. అరంగేట్రంలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. నిర్జీవమైన పిచ్పై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుగుల వరద పారించి పలు రికార్డులు బద్దలు కొట్టారు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదేసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏకంగా 235 పరుగులు.. ఇక ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాహిద్ పరిస్థితి మరీ ఘోరం. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి మొత్తంగా 33 ఓవర్లు బౌల్ చేసిన 34 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. 7.10 ఎకానమీతో ఏకంగా 235 పరుగులు సమర్పించుకున్నాడు. అత్యంత చెత్త రికార్డు తద్వారా శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా అతడి పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్గా జాహిద్ మొహమ్మద్ నిలిచాడు.ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో జాహిద్ 4 వికెట్లు కూల్చాడు. ఇంగ్లండ్ సెంచరీ వీరుడు బెన్ డకెట్, జో రూట్, రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జాహిద్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 3 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో హ్యారీ బ్రూక్ 27 పరుగులు పిండుకుని అతడికి మరో పీడకలను మిగిల్చాడు. ఇక ఈ జాబితాలో టాప్-5లో ఉన్న వాళ్లు వీరే! 1. జాహిద్ మొహమ్మద్(పాకిస్తాన్)- 2022- ఇంగ్లండ్తో మ్యాచ్లో 235 పరుగులు 2. సూరజ్ రాందివ్(శ్రీలంక)- 2010- ఇండియాతో మ్యాచ్లో- 222 పరుగులు 3. జేసన్ క్రెజా(ఆస్ట్రేలియా)- 2008- ఇండియాతో మ్యాచ్లో- 215 పరుగులు 4. ఒమరి బాంక్స్(వెస్టిండీస్)- 2003- ఆస్ట్రేలియాతో మ్యాచ్లో- 204 పరుగులు 5. నీలేశ్ కులకర్ణి(ఇండియా)- 1997- శ్రీలంకతో మ్యాచ్లో 195 పరుగులు చదవండి: Rashid Khan: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కిన హ్యారీ బ్రూక్ Ricky Ponting: రికీ పాంటింగ్కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు Naseem and Saud combine again to take another wicket ☝️ Harry Brook's fine knock comes to an end. #PAKvENG | #UKSePK pic.twitter.com/mFHywF93Z7 — Pakistan Cricket (@TheRealPCB) December 2, 2022 -
తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కిన హ్యారీ బ్రూక్
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. టెస్టులో తొలిరోజే ఇంగ్లండ్ 500 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు జట్టులో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం మరో విశేషం. ఇక తొలిరోజు ఆటలో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ రెండో రోజు ఆటలోనూ ఒక రికార్డును అందుకున్నాడు. అదేంటంటే పాక్ స్పిన్నర్ జహీద్ మసూద్ వేసిన ఒక ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు పిండుకున్న తొలి బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదిన బ్రూక్.. తర్వాతి మూడు బంతులను బౌండరీలు తరలించాడు. ఇక చివరి బంతికి మూడు పరుగులు తీశాడు. ఇంతకముందున్న రికార్డు కూడా హ్యారీ బ్రూక్పైనే ఉంది. ఇదే మ్యాచ్లో తొలిరోజు ఆటలో షకీల్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన బ్రూక్ 24 పరుగులు పిండుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు పాక్ బౌలర్లను చీల్చి చెండాడిన ఇంగ్లండ్ బ్యాటర్లు రెండోరోజు ఆటలో మాత్రం కాస్త తడబడ్డారు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 101 ఓవర్లలో ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(122), బెన్ డక్కట్ (107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్ (153) సెంచరీలతో చెలరేగారు. 506/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ జహీద్ ఆహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నషీం షా మూడు వికెట్లు, మహ్మద్ అలీ రెండు, హారీష్ రఫ్ ఒక్క వికెట్ సాధించారు. Harry Brook smashed 27 in an over vs Zahid Mahmood 🔥🙌🏻#PAKvsEng #PakvsEng2022 #PAKvENG pic.twitter.com/lHt4pYMhdl — Cricket.Social (@_cricketsocial) December 2, 2022 చదవండి: ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. తీసిపారేయొద్దు ఇదీ రికార్డే -
17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 101 ఓవర్లలో ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(122), బెన్ డక్కట్ (107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్ (153) సెంచరీలతో చెలరేగారు. 506/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 151 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ జహీద్ ఆహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నషీం షా మూడు వికెట్లు, మహ్మద్ అలీ రెండు, హారీష్ రఫ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ ఆడుతోంది. అయితే ఈ చారిత్రత్మక టెస్టు తొలి రోజు పాకిస్తాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టీ20 తరహాలో ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు తొలి రోజు ఏకంగా 506 పరుగులు రాబట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన పాకిస్తాన్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. చదవండి: IPL Mini Auction: రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా -
Pak Vs Eng: పాక్కు దిమ్మతిరిగిపోయింది! టీమిండియా రికార్డు బద్దలు.. ఇంకా
Pakistan vs England, 1st Test: మ్యాచ్కు ముందు రోజు ఇంగ్లండ్ జట్టులోని పలువురు క్రికెటర్లు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడటంతో... తొలి టెస్టు నిర్ణీత సమయానికి మొదలవుతుందో లేదోనని సందేహం. అయితే గురువారం ఉదయం గం. 7:30కు తుది జట్టులో ఆడేందుకు 11 మంది కోలుకున్నారని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ పాకిస్తాన్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. దాంతో నిర్ణీత సమయానికి ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇలా మ్యాచ్ మొదలయిందో లేదో ఇంగ్లండ్ జట్టు తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించింది. టెస్టు మ్యాచ్లో టి20 మెరుపులను చూపించింది. జీవంలేని పిచ్పై పాక్ బౌలర్లు తేలిపోగా... ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఫలితంగా 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ రోజే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. England tour of Pakistan, 2022-Rawalpindi: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్ ఎవ్వరూ ఊహించనిరీతిలో విధ్వంసం సృష్టించింది. గురువారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... వెలుతురు మందగించి తొలి రోజు ఆటను ముగించే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు సాధించింది. దంచికొట్టిన ఓపెనర్లు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (111 బంతుల్లో 122; 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107; 15 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించారు. హ్యారీ బ్రూక్తో కలిసి బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. జో రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఒక్కడే తక్కువ స్కోరుకు అవుటయ్యాడు. 73 ఫోర్లు, 3 సిక్స్లు వెలుతురు మందగించడంతో తొలి రోజు నిర్ణీత 90 ఓవర్లకు బదులు 75 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పూర్తి కోటా ఓవర్లు వేసిఉంటే ఇంగ్లండ్ స్కోరు 600 దాటేది. తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు 73 ఫోర్లు, 3 సిక్స్లు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్తో పాక్ జట్టు తరఫున హారిస్ రవూఫ్, మొహమ్మద్ అలీ, సౌద్ షకీల్, జాహిద్ మొహమ్మద్... ఇంగ్లండ్ జట్టు తరఫున లివింగ్స్టోన్, విల్ జాక్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మరి ఈ మ్యాచ్లో నమోదైన రికార్డులు పరిశీలిద్దామా?! ప్రపంచ రికార్డు రావల్పిండి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ సాధించిన పరుగులు 506. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ తొలి రోజే ఏ జట్టూ 500 పరుగులు చేయలేదు. 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 494 పరుగులు సాధించింది. 112 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును గురువారం ఇంగ్లండ్ జట్టు బద్దలు కొట్టింది. ఇదే తొలిసారి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే ఓ జట్టు తరఫున నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ కలిసి ఈ ఘనత సాధించారు. టీమిండియా రికార్డు బద్దలు పాక్తో తొలి టెస్టు తొలి సెషన్లో (లంచ్ సమయానికి) ఇంగ్లండ్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేసిన పరుగులు 178. గతంలో ఏ జట్టూ తొలి సెషన్లో ఇన్ని పరుగులు చేయలేదు. 2018లో అఫ్గానిస్తాన్తో బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి సెషన్లో భారత్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. ఈ రికార్డును ఇంగ్లండ్ సవరించింది. ఐదో క్రికెటర్గా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ వేసిన 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ వరుసగా ఆరు ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్గా నిలిచాడు. గతంలో సందీప్ పాటిల్ (భారత్; 1982లో బాబ్ విల్లిస్ (ఆస్ట్రేలియా) బౌలింగ్లో), గేల్ (విండీస్;20 04లో హోగార్డ్ (ఇంగ్లండ్) బౌలింగ్), శర్వాణ్ (వెస్టిండీస్; 2006లో మునాఫ్ పటేల్ (భారత్) బౌలింగ్లో), జయసూర్య (శ్రీలంక; 2007లో అండర్సన్ (ఇంగ్లండ్) బౌలింగ్లో) ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..! Harry Brook gets to his first 💯 in his second Test #PAKvENG | #UKSePK pic.twitter.com/fE7u8IeYm5 — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 Given out on review ☝️ Mohammad Ali has his first Test scalp 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/eGXqxedHmB — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 The century moment for Ollie Pope 👍#PAKvENG | #UKSePK pic.twitter.com/fwv0r0QgMS — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 -
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. తీసిపారేయొద్దు ఇదీ రికార్డే
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎంత కష్టమో.. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ప్రతీ బంతి సిక్సర్ లేదా బౌండరీ వెళ్లాలని రూల్ లేదుగా. మరి ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు అనేది తీసిపారేయాల్సిన అంశం కాదు. దీనిని కూడా ఒక రికార్డు కింద పరిగణించొచ్చని అభిమానులు పేర్కొంటున్నారు. తాజాగా పాకిస్తాన్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. బ్రూక్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 68వ ఓవర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీల్ వేశాడు. మొదటి బౌండరీ మిడ్ వికెట్ మీదుగా తరలించిన బ్రూక్స్ ఆ తర్వాత వరుసగా ఎక్స్ట్రా కవర్స్, పాయింట్, మిడాన్, ఎక్స్ట్రా కవర్స్, చివరి బంతిని మళ్లీ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. అలా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్న బ్రూక్ స్కోరు ఒక్క ఓవర్ ముగిసేలోపే 60 నుంచి 84 పరుగులకు చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక హ్యారీ బ్రూక్ వన్డే తరహాలో 80 బంతుల్లోనే శతకం మార్కును అందుకోవడం విశేషం. ఇక ఇంగ్లండ్ ఆడుతుంది టెస్టు మ్యాచ్ లేక వన్డేనా అన్న తరహాలో బ్యాటర్లు రెచ్చిపోయారు. పాక్ బౌలింగ్ను చీల్చి చెండాడిన ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు ఒకేరోజు శతకాలతో మెరవడం విశేషం. తొలుత ఓపెనర్లు జాక్ క్రాలీ(122 పరుగులు), బెన్ డకెట్(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన ఓలీ పోప్ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది. ప్రస్తుతం హ్యారీ బ్రూక్(81 బంతుల్లోనే 101 నాటౌట్) సూపర్ ఫాస్ట్తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Harry Brook smashed 4,4,4,4,4,4 to Saud Shakeel in a single over @aaliaaaliya pic.twitter.com/Rb6ZZtyzVO — Muhammad Noman (@Nomancricket29) December 1, 2022 చదవండి: పిచ్చ కొట్టుడు కొడుతున్నారు.. డీఆర్ఎస్ కూడా లేకపాయే!