Investors
-
స్టాక్ మార్కెట్లో ఎక్కువమంది అలాంటి ఇన్వెస్టర్లే..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లేనని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్పష్టం చేశారు. మార్కెట్లో లావాదేవీలు నిర్వహించే 11 కోట్లమందిలో కేవలం 2 శాతమే డెరివేటివ్స్లో పాలు పంచుకుంటుంటారని వివరించారు.మార్కెట్ పార్టిసిపెంట్లలో 98 శాతంమంది దీర్ఘకాలానికి మదుపు చేసేవారేనని పేర్కొన్నారు. ఇది దేశీయంగా క్రమశిక్షణ కలిగిన పెట్టుబడుల పద్ధతిని సూచిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి మెజారిటీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకే కట్టుబడుతుంటారని తెలియజేశారు. తద్వారా ఇటీవల సింగపూర్లో జరిగిన బృంద చర్చలో భారత స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఊహాజనిత(స్పెక్యులేటివ్) ట్రేడింగ్పైనే ఆధారపడి కదులుతుంటాయన్న అభిప్రాయాలకు చెక్ పెట్టారు.పెట్టుబడులులేని పెట్టుబడిదారీవిధానం ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్లు చౌహాన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇలా స్పందించారు. ‘సంప్రదాయబద్ధంగా చూస్తే భారీ పెట్టుబడుల ద్వారా మాత్రమే సంపద సృష్టి జరుగుతుందన్నది వాస్తవమే అయినా ఇటీవల ఆధునిక సాంకేతికతలు రూల్స్ను తిరగరాస్తున్నాయి. ఏఐ, బ్లాక్చెయిన్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ తదితరాలు కనీస పెట్టుబడితోనే వ్యాపార విస్తరణకు దారి చూపుతున్నాయి. వెరసి ఎకనామిక్ మోడల్ సంప్రదాయ పెట్టుబడి ఆవశ్యకత విధానాల నుంచి దూరం జరుగుతోందంటూ’ వివరించారు. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లూ.. వీళ్లతో జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ (NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.మోసగాళ్లు.. వారి ఫోన్నంబర్లు ఇవే..ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్ఎస్ఈ వెల్లడించింది.“టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.“వీవీఎల్” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి9662890247 నంబర్ ద్వారా మోసగిస్తున్నారు.సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.“సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223, 9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్మెంట్ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్ఎస్ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్గా పేర్కొంటే తమ వెబ్సైట్లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. -
2 నెలల్లో లక్ష కోట్లు ఉఫ్!
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్వైపు మళ్లాయి! కారణాలు ఇవీ...మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది. అధికారం చేపట్టాక భారత్సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు. నేలచూపుల తీరిదీ బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.నిపుణుల అంచనాలు నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.భారత్ బేర్ వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎఫ్పీఐల షాక్
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ ‘మిత్రా’ ప్లాట్ఫామ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్ ప్లాట్ఫామ్ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్ఫామ్ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్), చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన (అన్క్లెయిమ్డ్) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్ఫామ్ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.రిజిస్టార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్ఫామ్.. క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్ ఫోలియోలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్టీఏలు, ఆర్ఐఏలు, యాంఫి, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులను సెబీ ఆదేశించింది. -
ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం
యాక్టివ్లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది.పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పుఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్యాక్టివ్గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్ఫామ్పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది. -
ఇంధన రంగంలో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత ఇంధన రంగం(Energy Sector)లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. వచ్చే అయిదేళ్లలో భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధనానికి మారాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2025లో (ఐఈడబ్ల్యూ 25) వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను సాధించాలన్న లక్ష్యాలు, చమురు .. గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు బిడ్డింగ్ ప్రకటించడం మొదలైనవి దేశీయంగా ఇంధన రంగానికి దన్నుగా నిలుస్తాయని ఆయన చెప్పారు.వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, కొత్త ఆవిష్కరణలను రూపొందించేలా ప్రతిభావంతులను ప్రోత్సహించడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోందని తెలిపారు. ఆర్థికంగాను, రాజకీయంగానూ దేశం పటిష్టంగా ఉందని ప్రధాని వివరించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాబోయే రెండు దశాబ్దాలు చాలా కీలకమని, వచ్చే అయిదేళ్లలో దేశం అనేక మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి దేశం అయిదో స్థానానికి చేరిందని చెప్పారు. ఈఈఎస్ఎల్ ఒప్పందాలు.. ఐఈడబ్ల్యూ సందర్భంగా ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తమ 15వ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలతో రూ. 500 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండొనేషియా–మలేషియా–థాయ్ల్యాండ్ గ్రోత్ ట్రయాంగిల్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (ఐఎంటీ–జీటీ జేబీసీ), గ్రీన్ గ్రోత్ ఏషియా ఫౌండేషన్ (జీజీఏఎఫ్), ఐఐటీ హైదరాబాద్ వీటిలో ఉన్నాయి. విద్యుత్ ఆదా చేసే లైటింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కూలింగ్ సాంకేతికతలు మొదలైన వాటి రూపకల్పనకు ఎంవోయూలు తోడ్పడనున్నాయి. -
భారత్లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్టీఏలో ఐస్ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
11 కోట్లకు ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్ను (2024 ఆగస్ట్ నాటికి) అధిగమించింది. చివరి కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం ఐదు నెలల్లోనే చేరినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎన్ఎస్ఈ వద్ద ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు వేగాన్ని అందుకున్నాయని, గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగినట్టు తెలిపింది. ఎన్ఎస్ఈ 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మొదటి కోటి ఇన్వెస్టర్ల చేరికకు 14 ఏళ్లు పట్టగా, తదుపరి కోటి మందికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం 3.5 ఏళ్లలోనే చేరారు. ఆ తర్వాత కోటి మంది చేరికకు కేవలం ఏడాది సమయం తీసుకుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ పేర్కొంది. ‘‘గత ఐదు నెలల నుంచి రోజువారీ యూనిక్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు 47,000 నుంచి 73,000 మధ్య ఉంటున్నాయి. డిజిటైజేషన్ వేగాన్ని పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో అవగాహన, అందరికీ ఆర్థిక సేవల చేరువ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ పనితీరు బలంగా ఉండడం వంటివి దోహదం చేశాయి’’అని ఎన్ఎస్ఈ వివరించింది. -
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
ఫండ్స్లో పెట్టుబడులకు క్యూ
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్ఎఫ్వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కాగా.. 2023లో 212 ఎన్ఎఫ్వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ల ఎఫెక్ట్ సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్ఎఫ్వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్ఎఫ్వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది. ఈఎస్జీ సైతం గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్ఎఫ్వోల ద్వారా ఫండ్స్కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్ఎఫ్వో గత ఏప్రిల్లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్లో అత్యధిక ఎన్ఎఫ్వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం! -
బుల్ స్వారీలో ‘ఆమె’ ఫస్ట్
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. ఇదే సమయంలో సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్లలో హైదరాబాదీలు అధికంమహిళా ఇన్వెస్టర్ల విషయంలో పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. 2022లో ఏపీలో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. -
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్లో, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
వాటి జోలికి వెళ్లొద్దు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
గత 30 రోజుల్లో క్లయింట్ ఎలాంటి లావాదేవీలను చేపట్టని సందర్భంలో తదుపరి సెటిల్మెంట్లో మూడు రోజుల్లోగా ఖాతాలోని నిధులను వెనక్కి ఇవ్వవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. ఖాతాల నెలవారీ రన్నింగ్ సెటిల్మెంట్ సైకిల్కు సంబంధించి స్టాక్ బ్రోకర్లకు సెబీ తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.రానున్న సెటిల్మెంట్ రోజులకు ఇది వర్తించనున్నట్లు కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. దీనికి క్వార్టర్లీ సెటిల్మెంట్గా సైతం పిలిచే సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు.. సరళతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ తాజా మార్గదర్శకాలకు ప్రతిపాదించింది. వెరసి క్లయింట్ల నిధుల సెటిల్మెంట్ను తప్పనిసరి చేయనుంది. ఈ అంశాలపై ఈ నెల 26వరకూ సెబీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.ఇదిలా ఉండగా అనామక ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా లభించే అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లొద్దని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. ఈ అన్రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ను అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ఈ క్రమంలోనే మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆథరైజ్డ్ స్టాక్బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ల్లోకి మాత్రమే వెళ్లాలని సెబీ సూచించింది. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్ప్రైజెస్లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్ప్రైజెస్లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్కవరింగ్కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
పదేళ్లలో భారత్ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా..
2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. పాలన చేపట్టిన కొన్నాళ్లకే మోదీ ఓ పథకాన్ని తీసుకొచ్చారు.. అదే మేక్ ఇన్ ఇండియా..! భారత్ను ప్రపంచంలో టాప్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్గా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సీన్ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్ భారీగా భారత్ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కారణాలుమరోవైపు భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అటు వైద్య సేవలు, విద్య, భద్రత లాంటి అంశాల కోసం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక కొన్ని దేశాలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొన్ని యూరప్ దేశాలు, కరేబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం లేదా రెసిడెన్సీ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. దీంతో మార్కెట్ రిస్క్ ఎందుకని.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే బెటర్ అని చాలామంది భారతీయులు భావిస్తున్నారు...!భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. ఉదాహరణకు.. డీమానిటైజేషన్.. అంటే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. 2016లో నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారులు తమ పెట్టుబడులను ఇండియాలో ఉపసంహరించుకున్నారు. అటు నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.వ్యాపారుల కష్టాలను పెంచిన జీఎస్టీమరోవైపు 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.ఇదీ చదవండి: ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..పెట్టుబడిదారులకు శాపంగా పన్నులుదేశంలో పెరిగిన పన్నులు పెట్టుబడిదారులకు శాపంగా మారాయి. ఫ్లిప్కార్ట్ లాంటి భారతీయ కంపెనీలు కూడా విదేశాలలో పెట్టుబడులు పెంచడం ప్రారంభించాయి. అటు భారత్ రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోవడం కూడా పెట్టుబడిదారులపై ప్రభావం చూపింది. రూపాయి విలువ 2014లో డాలర్కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి. -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
బోర్డు తిప్పేసి.. రూ.7 వేల కోట్లు కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: ఒకటి రెండు కాదు ఏకంగా రూ.7 వేల కోట్ల స్కాం జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపించి పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది అస్సాంలోని గువాహటికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్. ఈ సంస్థకు హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలోనూ కార్యాలయం ఉంది. నగరానికి చెందిన వందలాది మంది ఇన్వెస్టర్లు డీబీ స్టాక్ బ్రోకింగ్లో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించకుండా బిచాణా ఎత్తివేయడంతో లబోదిబోమంటూ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 23 వేల మంది పెట్టుబడులు అస్సాంకు చెందిన దీపాంకర్ బర్మన్ 2018లో డీబీ స్టాక్ బ్రోకింగ్ను ప్రారంభించారు. ఈ సంస్థకు గువాహటితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోనూ కార్యాలయాలున్నాయి. పెట్టుబడులపై ఏడాదికి 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం, మూడు నెలలకు 27 శాతం, నెలకు 8 శాతం చొప్పున వడ్డీ ఇస్తామని ప్రకటించారు. దీంతో స్థానికులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంతకాలం పాటు వడ్డీ చెల్లించిన ఈ సంస్థ.. ఈ ఏడాది జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి మన దేశంతో పాటు ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్ల నుంచి కూడా డిపాజిట్లు సేకరించారు. సుమారు 23 వేల మంది పెట్టుబడులు పెట్టారు. గత నెలలో పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పంచాక్షర్ రూ. 11 లక్షలు, గంటాడి హరి రూ. 88.50 లక్షలు, విశ్వజీత్ సింగ్ రూ. 36.80 లక్షలు, పి.రాజు మహేంద్ర కుమార్ రూ. 26 లక్షలు, వందపాటి లక్ష్మి రూ. 64.50 లక్షలు.. ఇలా డీబీ స్టాక్ బ్రోకింగ్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని పలువురు బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీపాంకర్ బర్మన్, అతని సహచరులపై చీటింగ్తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 21న బర్మన్ అస్సాంలోని ఆఫీసు బోర్డు తిప్పేసి గువాహటి నుంచి పరారయ్యారు. దీంతో పాన్ బజార్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. బర్మన్ ఆ్రస్టేలియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్లిస్టెడ్, అన్రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ ఈటీఎఫ్లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్లో గడువు తీరిన ఎస్జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
స్టార్టప్ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
‘అలా అయితే.. బంగ్లాకు పెట్టుబడిదారులు వెళ్లరు’
ఢిల్లీ: రాజకీయ సంక్షోభాలతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్లా మారితే పొరుగుదేశానికి పెట్టుబడిదారులు వెళ్లకుండా దూరంగా ఉంటారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భారత్ టెక్స్-2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘భారతదేశానికి పెద్ద కార్మిక మార్కెట్ ఉన్నందున బంగ్లాదేశ్ లేదా వియత్నాం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమ ఎటువంటి సవాలును ఎదుర్కోవడం లేదు. బంగ్లాదేశ్ పాకిస్థాన్లా మారితే పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తారు. ప్రతి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నాం. మేము మరిన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. భారత్ టెక్స్-2025 కార్యక్రమాలు ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీ వరకు భారత్ మైదాన్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీల్లో ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లో వస్త్రాలు, హస్తకళలు, గార్మెంట్ మెషినరీ, దుస్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ జరగనుంది. -
ఇన్వెస్టర్లను భయపెడుతున్న నాలుగు పదాల ట్వీట్
ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.హిండెన్బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.హిండెన్బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.Something big soon India— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024 -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
ఒలింపిక్స్ నేర్పించే పెట్టుబడి పాఠాలు
భారత క్రీడాకారులు పతకాల బోణీ కొట్టడంతో దేశీయంగా క్రీడాభిమానులందరికీ ఒలింపిక్స్పై ఆసక్తి మరింత పెరిగింది. వివిధ దేశాల క్రీడాకారులు వేర్వేరు అంశాల్లో పోటీపడుతుండటం చూడటానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఎలాగైతే సిద్ధమవుతారో, ఇన్వెస్టర్లు కూడా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఏళ్ల తరబడి ప్లానింగ్ చేసుకోవాలి. పొదుపు చేయాలి. వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యుచువల్ ఫండ్స్లో.. అందునా లార్జ్క్యాప్స్లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఒలింపిక్స్ మనకేం నేరి్పస్తాయో ఓసారి చూద్దాం. ఒలింపిక్స్, లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ వేర్వేరు ప్రపంచాలుగా అనిపించినా తరచి చూస్తే వాటి మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సునాయాసమనేది ఓ అపోహ.. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ ప్రధానంగా దిగ్గజ సంస్థలపైనా, సుదీర్ఘకాలంగా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన కంపెనీలపైనా దృష్టి పెడతాయి. ఈ కంపెనీలన్నీ అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో మార్కెట్లను, ప్రోడక్టులను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించినవై, ఎంతో శ్రమించినవై ఉంటాయి. అనుభవజు్ఞలైన ఒలింపిక్ టీమ్ సభ్యుల్లాగే లార్జ్ క్యాప్ కంపెనీలు నేడు సునాయాసంగా ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వాటి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందుతుంటాయి. పటిష్టమైన బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పుష్కలంగా వనరులు ఉంటాయి. అనేక విజయాలు సాధించి అపార అనుభవం ఆర్జించిన ఒలింపిక్స్ టీమ్ ఎలాగైతే అసాధారణ పరిస్థితుల్లోనూ పట్టు తప్పకుండా నిలదొక్కుకోగలదో ఈ కంపెనీలు కూడా కఠిన పరిస్థితుల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావు. దృఢసంకల్పంతో విజయానికి బాటలు.. మారథాన్ రేసులో తలెత్తే అలసట, అనూహ్య పరిస్థితులను శారీరకంగా, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనేది బాగా తెలిసి, తగు వ్యూహాలను రూపొందించుకున్న మారథానర్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా అమెచ్యూర్ మారథానర్ ప్రారంభంలో కొన్ని మైళ్లు అలవోకగా పరుగెత్తవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే కాళ్లు సహకరించవు. ఊపిరి ఆడదు. సరైన యాటిట్యూడ్, మానసిక శిక్షణ లేకపోతే ఆ దశలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అనుభవజూ్ఞలైన ఒలింపిక్ క్రీడాకారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కఠిన శిక్షణ పొందినందున ముందుకు సాగిపోతారు. లార్జ్ క్యాప్ కంపెనీలు కూడా అచ్చంగా అలాంటివే. అవి గతంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎన్నింటినో చూసి ఉంటాయి. మారిపోతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నవై ఉంటాయి. తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆర్థిక సామర్థ్యాలు కలిగి ఉన్నవై ఉంటాయి. తుపానులు ఎదురైతే ఎలా బైటపడాలన్నది ఈ కంపెనీలకు బాగా తెలిసి ఉంటుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు.. ఒలింపిక్స్లో వివిధ విభాగాల్లో పోటీపడతారు. 2024 ఒలింపిక్స్లో 39 స్పోర్ట్స్వ్యాప్తంగా 329 ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా బ్రేక్డ్యాన్సింగ్కు కూడా చోటు కల్పించారు. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్లోను ఇలాంటి వైవిధ్యం ఉంటుంది. వివిధ ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పతకాలు గెల్చుకునే అవకాశాలు ఎలాగైతే మెరుగుపడతాయో వివిధ రంగాలవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్ ఫండ్స్ రిసు్కలను తగ్గించుకుని మెరుగైన రాబడులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.సురేశ్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా -
ఈ వారం ఐపీఓల ఇన్వెస్టర్లకు పండగే
-
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్అండ్గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
నాలుగేళ్లలో 50వేల కోట్ల లాభాలు: నితిన్ కామత్ ట్వీట్ వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించిన తరువాత చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత అనుకున్నంత లాభాలు లాలేదు, కానీ ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఇందులో ఒకటి జెరోధా కంపెనీ.జెరోధా కంపెనీ కో ఫౌండర్ నితిన్ కామత్ ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఈక్విటీ పెట్టుబడిదారులు గత నాలు సంవత్సరాల్లో రూ. 50,000 కోట్ల లాభాలను సాధించారు. రూ. 4,50,000 కోట్ల ఏయూఎంలో రూ. 1,00,000 కోట్ల లాభాలను పొందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నితిన్ కామత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి.Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores. By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024 -
గోల్డ్ బాండ్లకు ఇన్వెస్టర్ల ఆదరణ...
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది. -
సెన్స్క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇన్వి ట్స్లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
ఫెడ్ నిర్ణయాలకు ఎదురుచూపు
ముంబై: అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే రిలయన్స్ (1.45%)తో పాటు మెటల్, ఇంధన, ఆటో షేర్లూ రాణించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్లో 672 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 105 పాయింట్ల లాభంతో 72,748 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207 పాయింట్ల రేంజ్లో 22,124 వద్ద గరిష్టాన్ని, 21,917 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 32 పాయింట్లు పెరిగి 22,056 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ తర్వాత ఇటీవల దిగివచి్చన నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ,, ప్రైవేటు బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ స్వల్పంగా 0.4% లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది. -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర ప్లాట్ఫామ్ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్తో పోలిస్తే పోర్ట్ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్మార్క్తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ని బట్టి ఇండెక్స్ ఫండ్స్పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
నక్క తోక తొక్కిన గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లు
-
2024లో పెట్టుబడులకు దారేది..?
ఇన్వెస్టర్లు ఏడాదికోసారి తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను తప్పకుండా సమీక్షించు కోవాలి. అప్పుడే ఏ విభాగానికి ఏ మేరకు కేటాయింపులు చేయాలన్న స్పష్టత వస్తుంది. ఈక్విటీలు ఆల్టైమ్ గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. క్యాపిటల్ మార్కెట్లపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్.. వీటిల్లో ఏ విభాగం పనితీరు ఎలా ఉంటుంది..? ఇది తెలిస్తే.. తమ పెట్టుబడుల్లో వేటికి ఎంత మేర ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్ అస్థిరతలను తట్టుకునే విధంగా తమ పోర్ట్ఫోలియోను నిర్మించుకోవచ్చు. దీనిపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీ అవకాశాలు దీర్ఘకాలంలో ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయని తెలిసిందే. 2024 సైతం ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ‘‘2024 పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నాం. అంతర్జాతీయ, దేశీయ ముఖచిత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉండడం, మానిటరీ పాలసీ రేట్ల విషయంలో సర్దుబాట్లు, ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు మద్దతునిస్తున్నాయి’’అని ఫండ్స్ ఇండియా సీఈవో గిరిరాజన్ మురుగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత పలు దేశాల మధ్య యుద్ధాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అవరోధాల నడుమ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. ‘‘అంతర్జాతీయంగా వాణిజ్యం విషయంలో మారిన ప్రాధాన్యతలు భారత్కు అనుకూలించనున్నాయి. పలు రంగాల్లో భారత్ అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను పెంచుకోనుంది. ఒకవైపు సేవల ఎగుమతుల్లో బలంగా ఉన్నాం. మరోవైపు తయారీలోనూ బలమైన స్థానం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’’అని ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు కెన్నెత్ ఆండ్రడే పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య ఎంపికగా ఉంటుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘భారత్ ఆర్థిక అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వృద్ధి అంచనా 2.7 శాతాన్ని భారత్ వృద్ధి అంచనాలు 6.5–7 అధిగమిస్తున్నాయి. భారత ప్రభుత్వం వైపు నుంచి పారదర్శక, స్థిరమైన, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు ఈ వృద్ధికి బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవేదికపై భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్వర్గధామంగా మారుస్తున్నాయి’’అని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమన్ వీర్ తెలిపారు. ఈక్విటీల్లోనూ మెరుగైన రాబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అన్న సందేహం వస్తుంది. కేంద్ర సర్కారు దేశీ తయారీ బలోపేతంపై విరామం లేకుండా కృషి చేస్తోంది. కనుక తయారీ రంగం 2024లోనూ బలమైన పనితీరు చూపించనుంది. 2024 సంవత్సరం మధ్య నుంచి వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత భారత మార్కెట్లకు మరింత బూస్ట్నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘‘వడ్డీ రేట్ల కోతతో విదేశీ ఇనిస్టిట్యూషన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా భారత్కు తరలివస్తాయి. దీంతో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, రైల్వే ఇన్ఫ్రా, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీలు లాభపడనున్నాయి’’అని మురుగన్ వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆండ్రడే తెలిపారు. ‘‘ఈ ఏడాది డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ప్రభుత్వరంగ, ఫార్మా కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. నూతనతరం (న్యూఏజ్) వ్యాపార కంపెనీలు అయితే డార్క్హార్స్గా నిలుస్తాయి. ఫైనాన్షియల్స్, ఐటీ, తయారీ, ప్రభుత్వరంగ సంస్థలు, హెల్త్కేర్ థీమ్లు సైతం ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయి’’ అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా అభిప్రాయపడ్డారు. 2022 ఈక్విటీలకు అనుకూలంగా లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2022, 2023 రెండు సంవత్సరాలకు కలిపి చూస్తే సెన్సెక్స్ ఇచి్చన నికర వార్షిక రాబడి 11.5 శాతమే. మార్కెట్ల వ్యాల్యూషన్లు కొంచెం గరిష్ట స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు వైవిధ్యంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్, లార్జ్క్యాప్ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, అధిక రుణభారంతో నడిచే కంపెనీలకు దూరంగా ఉండాలని మురుగన్ సూచించారు. రియల్ ఎస్టేట్ దశాబ్ద కాలం పాటు రియల్ ఎస్టేట్లో డిమాండ్ పెద్దగా పెరగలేదు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిమాండ్ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. వచ్చే ఐదు, పదేళ్ల పాటు రియల్ ఎస్టేట్ మెరుగైన పనితీరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు, విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుకు అనుగుణంగా ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, భౌతిక రియల్ ఎస్టేట్ అన్నది భారీ పెట్టుబడికి సంబంధించిన అంశం. అధిక ఆర్జన కలిగిన వర్గానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ‘‘పెట్టుబడి పరంగా రియల్ ఎస్టేట్ అన్నది క్లిష్టమైన, లిక్విడిటీ పెద్దగా లేని సాధనం. వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, రిస్్కలు కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’అని హర్ష గెహ్లాట్ సూచించారు. వాణిజ్య రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అందుకు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లను పరిశీలించొచ్చు. బంగారం దీర్ఘకాలంలో (10–15 ఏళ్లు అంతకంటే ఎక్కువ) బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడులను ఇస్తున్నట్టు ఫండ్స్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. చారిత్రక గణాంకాలను పరిశీలించినా ఇదే విషయం తెలుస్తుంది. దీర్ఘకాలంలో బంగారంపై రాబడి ద్రవ్యోల్బణం కంటే 2–4 శాతం అధికంగా ఉంటోంది. స్వల్పకాలానికి ఇది అనుకూలమైన సాధనం కాదు. అదే పనిగా స్థిరమైన రాబడులను అన్ని కాలాల్లోనూ బంగారం నుంచి ఆశించరాదు. మధ్య మధ్యలో బంగారం కొన్నేళ్లపాటు ఎలాంటి రాబడులు లేకుండా కొనసాగుతందని చెప్పడానికి గత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యానికి తోడు, అనిశి్చత సమయాల్లో, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపకరిస్తుంది. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ బంగారంలో పెట్టుబడికి బలమైన నేపథ్యాలుగా చూడొచ్చు. రాబడులు అధిక స్థాయిలో లేకపోయినా, మరే ఇతర సాధనంలో లేనంతగా పెట్టుబడుల భద్రతకు బంగారం భరోసానిస్తుంది. రిస్్కలను ఎదుర్కొనేందుకు వీలుగా పోర్ట్ఫోలియోలో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది’’అని ఫిన్ఎడ్జ్ సీఈవో హర్ష గెహ్లాట్ సూచించారు. బంగారానికి అనుకూలించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్లు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. డాలర్ నుంచి వైవిధ్యం కోరుకోవడం కూడా బంగారానికి మద్దతునిచ్చే అంశం. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బంగారానికి డిమాండ్ ఉండడం 2023లో ధరలకు మద్దతునిచి్చందని, 2024లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. భారత్, చైనా బంగారం కొనుగోళ్లలో రెండు అతిపెద్ద దేశాలు కాగా, వీటి నుంచి ఈ ఏడాదీ కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మన దేశం బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందన్న అంచనా కూడా ఉంది. అయితే బంగారానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించుకోవాలన్న సందేహం ఏర్పడొచ్చు. ‘‘పెట్టుబడులకు బంగారాన్ని వైవిధ్య సాధనంగా చూడొచ్చు. అదే సమయంలో బంగారంపై పరిమితికి మించి చేసే పెట్టుబడులతో ప్రతికూల ఉత్పాదకత కూడా ఎదురుకావచ్చు. కనుక ఇన్వెస్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతానికి మించకుండా బంగారానికి కేటాయించుకోవచ్చు’’అని నిపుణుల సూచన. వేటికి ఏ మేరకు.. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఒక్కో సాధనానికి ఎంత మేరకు కేటాయింపులు చేయాలన్నదీ కీలకమే. ఇన్వెస్టర్ వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల కాల వ్యవధి, పెట్టుబడుల వెనుక ఉన్న లక్ష్యం ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ నియమం ప్రకారం.. ఐదేళ్లు అంతకుమించి ఎక్కువ కాలం పాటు తన పెట్టుబడులు కొనసాగించే వెసులుబాటు ఉండి, అధికంగా వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్స్ మొదటి ఆప్షన్ అవుతుంది. ఫండ్స్ బలమైన నియంత్రణల మధ్య, తక్కువ వ్యయాలు, చక్కని వైవిధ్యంతో, తగినంత లిక్విడిటీతో, నిపుణుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని, ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని గెహ్లాట్ సూచించారు. రిస్క్ నివారణకు ఈక్విటీల్లో దీర్ఘకాలానికి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఐదేళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేసే వారు ఈక్విటీలకు మొత్తం పెట్టుబడుల్లో 70–80% వరకు, డెట్కు 15–20% వరకు, బంగారానికి 5–10% మధ్య కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ పదేళ్లు అంతకుమించి అయితే ఈక్విటీలకు 80–90%, డెట్కు 5–10%, బంగారానికి 5–10% వరకు కేటాయించుకోవచ్చు. పదేళ్లకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే 20% వరకు కేటాయింపులు చేసుకోవచ్చన్నది సూచన. అప్పుడు డెట్ కేటాయింపులను రియల్ ఎస్టేట్కు మళ్లించుకోవచ్చు. డెట్ సాధనాలు.. డెట్ (స్థిరాదాయ) విభాగంలో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలమేనని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘2023–24 వృద్ధి అంచనాలను ఆర్బీఐ అర శాతం పెంచి 7 శాతం చేసింది. 2024లో కనీసం మూడు పర్యాయాలు రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇచి్చంది. వడ్డీ రేట్ల కోతతో బాండ్ ధరలు పెరుగుతాయి. ఇది బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అనుకూలం’’అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా పేర్కొన్నారు. ‘‘2024–25లో జీడీపీ 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. అదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చు. గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కనుక 2024–25 ద్వితీయ ఆరు నెలల్లో ఆర్బీఐ రేట్ల కోత చేపట్టొచ్చు. ఆ నిర్ణయం పదేళ్ల భారత ప్రభుత్వ బాండ్ల (ఐజీబీ)కు అనుకూలిస్తుంది. భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లలో ఉన్న వారు రేట్ల కోత ప్రయోజనాలు పొందుతారు’’అని ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సీఐవో దావల్ దలాల్ తెలిపారు. 10 ఏళ్ల ఐజీబీ ప్రస్తుతమున్న 7.17 స్థాయి నుంచి 2025 మార్చి నాటికి 6.75 శాతానికి దిగొస్తుందని దలాల్ అంచనా వేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రమంగా వ్యవధి పెంచుకోవాలని, ఐజీబీలను జోడించుకోవాలని సూచించారు. స్వల్ప కాలానికి కార్పొరేట్ సంస్థలు షార్ట్డ్యురేషన్ బాండ్ల జారీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిపై ఈల్డ్స్ పెరగొచ్చని.. ఇన్వెస్టర్లు దీర్ఘకాల బాండ్లలో ప్రస్తుతమున్న అధిక రేట్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని దలాల్ అంచనా వేశారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల డెట్ సాధనాలపై ఇప్పుడు కాల వ్యవధితో సంబంధం లేకుండా ఒకటే పన్ను విధానం ఉండడాన్ని మర్చిపోకూడదు. డెట్ సాధనాలపై వచ్చే ఆదాయం వ్యక్తుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారి ఆదాయ శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మెరుగైన రాబడులు ఇచ్చే డెట్ సాధనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. మీడియం డ్యురేషన్తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఒకటి. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నందున ఈ సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ సహజంగా తక్కువ. -
సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ► అమెరికాలో డిసెంబర్కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ► మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులపై రేటింగ్ డౌన్గ్రేడ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.51% నష్టపోయాయి. ► బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► ఈక్విటీ షేర్ల బైబ్యాక్కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
డోమ్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ..
న్యూఢిల్లీ: పెన్సిళ్ల తయారీ దిగ్గజం డోమ్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి తొలి రోజే(బుధవారం) ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కంపెనీ 88 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 5 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 5.7 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఈ బాటలో సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 8 రెట్లు బిడ్ చేయగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి కేవలం 6% మాత్రమే స్పందన నమోదైంది. ఇష్యూ లో భాగంగా కంపెనీ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 850 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకి రూ. 750–790 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించిన కంపెనీ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 538 కోట్లు సమకూర్చుకుంది. -
ఎఫ్పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
2024 గ్లోబల్ బ్యాంకింగ్పై నెగటివ్ అవుట్లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
పెట్టుబడిదారులు కంగారు పడక్కర్లేదు..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024లో ‘మంచి మెజారిటీ’తో మళ్లీ అధికారంలోకి రానుందని, ప్రపంచ పెట్టుబడిదారులు ‘చింతించాల్సిన అవసరం లేదు’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధి వేగాన్ని పెంచేందుకు వ్యవస్థాగత సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసిన ఒక వెర్చువల్ చర్చాగోష్టిలో చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వాతావరణాన్ని, క్రింది స్థాయిలో వాస్తవాలను గమనించే ఎవ్వరికైనా ప్రధాని మోదీ మళ్లీ మంచి మెజారిటీతో తిరిగి వస్తున్నారని అర్థమవుతుందని ఆమె ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చే వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, అలాగే కేంద్రం తీసుకున్న పలు చర్యల వల్ల వ్యాపార వాతావరణం మెరుగుపడిందని అన్నారు. రోజ్గార్ మేళా ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ కనెక్టివిటీ కారిడార్ (ఐఎంఈసీ)పై ఇజ్రాయెల్ –గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ‘‘అది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. ఒకటి లేదా మరొక సంఘటన ఏదీ దీనిని ప్రభావితం చేయబోదు’’ అని స్పష్టం చేశారు. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్ఆర్ఏ) ప్లాట్ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్అండ్వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్అండ్వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్ఆర్ఏ ప్లాట్ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ
సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు. కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
కొనసాగుతున్న ఎఫ్పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
ఈక్విటీ ఫండ్స్లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి. స్మాల్క్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు. థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం. డెట్లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.841 కోట్లు వచ్చాయి. అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్లో రూ.80,528 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. -
Vestian: హౌసింగ్లో భారీగా సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్ వసతులకు డిమాండ్ను పెంచుతుందన్నారు. ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్ క్వార్టర్లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్ ఆస్తులు 164 మిలియన్ డాలర్లు, ఇండ్రస్టియల్ వేర్హౌసింగ్ ఆస్తులు 190 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి. -
ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు
సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి చెందిన తాజా నివేదిక ఒకటి సంచలనం రేపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు బాంబు పేల్చారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్ డీల్స్ మెరుగుపడే అవకాశం ఉందని భావించారు. ఇటీవలి తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటూ నిరాశను ప్రకటించారు. దీంతో ఐటీపై తమ నెగటివ్ ధోరణిని కొనసాగిస్తామని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా తాజా నోట్లో తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉండ బోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గైడెన్స్ను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ని "వాష్అవుట్"గా ఇన్వెస్టర్లు పేర్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ 2025 వ్యూహంపై దృష్టి పెట్టాలని వారు భావిస్తారన్నారు. (స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్కు కష్టమే!) వివిధ పరిశ్రమల ఎగ్జిక్యూటివ్లతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఆశావమదృక్పథం కనపించలేదన్నారు డిమాండ్ ఇంకా పుంజుకోనందున్న ఐటీ పరిశ్రమపై తమ దృక్పథం బేరిష్గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గాలేదని వెల్లడించారు. అలాగే దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్సిఎల్టెక్తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ యుఎస్ బేస్డ్ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్య మవుతున్నాయని తెలిపాయి. ( క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది. అంతేకాదు త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఎదురుచూస్తున్న టెకీలకు నిరాశే ఎదురైంది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) కాగా ఇప్పటికే భారత్ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడి పోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్బోర్డింగ్ జాప్యంతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. (ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్) -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్లో పెట్టుబడులు, ట్రేడింగ్కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్ఫామ్లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్లు, పోర్ట్ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
స్టార్టప్లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్లిస్టెడ్ స్టార్టప్లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
పెట్టుబడి సలహాలపట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త: ఎన్ఎస్ఈ
ముంబై: ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని దిగ్గజ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. ఏంజెల్వన్ ఆల్గో సంస్థ పేరుతో శ్రేయా మిశ్రా అనే వ్యక్తి సెక్యూరిటీల మార్కెట్ సలహాలు(టిప్స్) ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలియజేసింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై లాభాల హామీతో 8347070395 మొబైల్ నంబరుతో ట్రేడింగ్కు సలహాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎక్సే్ఛంజీలో ట్రేడింగ్ సభ్యులుగా రిజిస్టరైన ఏంజెల్ వన్ లిమిటెడ్ తాజాగా ఎన్ఎస్ఈకి స్పష్టం చేసినట్లు తెలియజేసింది. చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ టిప్స్ ఇస్తున్న ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాల్సిందిగా ఒక ప్రకటనలో సూచించింది. ఎన్ఎస్ఈ వెబ్సైట్ నుంచి ''https:// www.nseindia.com/ invest/ find& a& stock& broker'' లింక్ ద్వారా మీ స్టాక్ బ్రోకర్ గురించి తెలుసుకునేందుకు వీలు కల్పించినట్లు వివరించింది. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
ఐదేళ్ల గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు జూన్ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో (క్యాపిటల్ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్ జారీ చేసే ఎఫ్పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది. బలమైన పనితీరు వల్లే.. సాధారణంగా ఎఫ్పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్ చివరికి ఎఫ్పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్ నెలలో చేరాయి. అదే నెలలో డెట్మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
హౌసింగ్లో సంస్థాగత పెట్టుబడులు ఐదు రెట్లు
న్యూఢిల్లీ: హౌసింగ్ (ఇళ్ల నిర్మాణం)లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. జనవరి–జూన్ మధ్య 433 మిలియన్ డాలర్లు (రూ.3,526 కోట్లు) వచ్చాయి. ఈ వివరాలను కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో హౌసింగ్లో పెట్టుబడులు 89.4 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్ హౌసింగ్ ఆస్తుల్లోకి 95 శాతం అధికంగా 350 మిలియన్ డాలర్ల (రూ.2870 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్హౌసింగ్లోకి వచి్చన పెట్టుబడులు 179.8 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆఫీస్లు, విదేశీ కార్పొరేట్ సంస్థలు, విదేశీ బ్యాంక్లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ ఫండ్ సంస్థలు, విదేశీ ఎన్బీఎఫ్సీ, సావరీన్ వెల్త్ ఫండ్స్ (సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం) ఈ పెట్టుబడులు సమకూర్చాయి. నివాస గృహాల విభాగంలో పెట్టుబడులు మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. ప్రధానంగా దేశీయ పెట్టుబడులు ఈ వృద్ధికి మద్దతుగా ఉన్నాయి. పెరుగుతున్న వినియోగంతో స్థిరమైన వృద్ధికి అవకాశాలు ఉండడంతో పారిశ్రామిక ఆస్తుల విభాగం రెండున్నర రెట్లు అధికంగా పెట్టుబడులను ఆకర్షించింది. తయారీ రంగం నుంచి డిమాండ్ ‘‘తయారీ రంగం వేగంగా వృద్ధిని చూస్తోంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, తయారీ రంగంలో బలమైన వృద్ధితో ఈ రంగం ఇక ముందూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’అని నివేదిక వెల్లడించింది. డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్ హాలీడ్ హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ తదితర ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగంలో పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 60 శాతం క్షీణించి 158 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన పెట్టుబడులు 399 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. భారత రియల్ ఎస్టేట్ విభాగంలోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 43 శాతం పెరిగి 3.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.57 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు. ఈ 3.7 బిలియన్ డాలర్లలో, అత్యధికంగా కార్యాలయ ఆస్తుల విభాగం 2.7 బిలియన్ డాలర్లు ఆకర్షించింది. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి సంస్థాగత పెట్టుబడులు 95 శాతం తగ్గి 15.1 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక రిటైల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల విభాగం గతేడాది తొలి ఆరు నెలల్లో 492 మిలియన్ డాలర్లు రాబట్టగా, ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. రియల్ ఎస్టేట్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2019లో 6.3 బిలియన్ డాలర్లు, 2020లో 4.8 బిలియన్ డాలర్లు, 2021లో 4 బిలియన్ డాలర్లు, 2022లో 4.9 బిలియన్ డాలర్ల చొప్పున వచ్చాయి. -
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
చిట్ఫండ్ స్కాం: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. పెట్టుబడిదారుల సొమ్మును రికవరీ 61 ప్రాపర్టీలను జులై 17న వేలం ద్వారా విక్రయించ నున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 26.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. చట్టవిరుద్ధ పథకాల ద్వారా పబ్లిక్ నుంచి పెట్టుబడులను సమీకరించడంతో శారద్ గ్రూప్పై సెబీ తాజా చర్యలకు నడుం బిగించింది. గ్రూప్నకు పశ్చిమబెంగాల్లోని భూములతోపాటు.. ఇతర ఆస్తులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1వరకూ వేలం వేయనున్నట్లు వెల్లడించింది.ఈవేలం నిర్వహణలో సీ1 ఇండియా, ఆస్తుల విక్రయంలో క్విక్ఆర్ రియల్టీ.. సెబీకి సహకారాన్ని అందించనున్నాయి. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ -
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో.. నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఇది గడిచిన ఆరు నెలల కాలంలో నెలవారీ అత్యంత కనిష్ట స్థాయి ఈక్విటీ పెట్టుబడులు కావడం గమనించొచ్చు. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 27వ నెలలోనూ నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.6,480 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. అంతకుముందు నెల మార్చిలోనూ రూ.20,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) మే నెలకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్లోకి మే నెలలో వచ్చిన నికర పెట్టుబడులు రూ.57,420 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.1.21 లక్షల కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గాయి. 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తులు రూ.43.2 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్ చివరికి ఇవి రూ.41.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆల్టైమ్ గరిష్టానికి సిప్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు మే నెలలో వచ్చాయి. ఇది నెలవారీ ఆల్టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.13,728 కోట్లుగా ఉన్నాయి. అనిశ్చితుల్లోనూ పరిశ్రమ మంచి పనితీరు చూపించినట్టు యాంఫి సీఈవో ఎన్ వెంకటేశ్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు తోడు, వేసవి విహార పర్యటనలు, విద్యా సంబంధిత ఖర్చులు మే నెలలో పెట్టుబడులు తగ్గడానికి కారణమై ఉండొచ్చు’’అని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ డిజిటల్ బిజినెస్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. లాభాల స్వీకరణకు తోడు, అమెరికా డెట్ సీలింగ్ పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళనతో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఉండొచ్చని మార్నింగ్స్టార్ రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా అభిప్రాయపడ్డారు. విభాగాల వారీగా.. ► లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.1,362 కోట్లను ఆకర్షించాయి. ► ఫోకస్డ్ ఫండ్స్లోకి రూ.944 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.504 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ పథకాలు రూ.46,000 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్లోకి రూ.45,234 కోట్లు రాగా, హైబ్రిడ్ ఫండ్స్లోకి రూ.6,093 కోట్లు వచ్చాయి. ► ఓవర్నైట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.18,910 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆర్బిట్రేజ్ ఫండ్స్లోకి రూ.6,694 కోట్లు వచ్చాయి. ► బ్యాలన్స్డ్ హైబ్రిడ్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాల నుంచి రూ.997 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేటెడ్ ఫండ్స్లోకి రూ.103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే విలువల పరంగా తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ను ఎంచుకుంటున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
ఐకియో లైటింగ్కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285కాగా.. సోమవారం(5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 182 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 285 ధరలో 16 ఫండ్స్కు 63.84 లక్షల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో సొసైటీ జనరాలి, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్మన్ శాక్స్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. అనుబంధ సంస్థకు నిధులు ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం ఐకియో లైటింగ్ వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది. -
ఫండ్స్లోకి భారీగా మిలీనియల్ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లోకి గడిచిన ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 మధ్య) 84.8 లక్షల మంది మిలీనియల్ ఇన్వెస్టర్లు కొత్తగా అడుగు పెట్టా రు. ఈ వివరాలను క్యామ్స్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. గత ఐదేళ్లలో కొత్త ఇన్వెస్టర్లలో 54 శాతం మంది మిలీనియల్స్ ఉండడం విశేషం. 1980–1990 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్గా చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఉత్ప త్తులపై గతంతో పోలిస్తే అవగాహన, ప్రచారం విస్తృతం కావడం తెలిసిందే. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు ఫలితంగా ఏటాటా కొత్త ఇన్వెస్టర్లలో చక్కని వృద్ధి కనిపిస్తోంది. ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే సరళంగా చేసుకునే వెసులుబాటు కూడా ఇందుకు అనుకూలిస్తోంది. 2018–19 నుంచి 2022–23 మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి కొత్తగా 1.57 కోట్ల మంది ఇన్వెస్టర్లు ప్రవేశించారు. 2022–23లో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగా ఉందని, సంపద సృష్టికి మిలీనియల్స్ మ్యూచువల్ ఫండ్స్ను మెరుగైన సాధనంగా చూస్తున్నట్టు క్యా మ్స్ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశించిన మిలీనియల్ ఇన్వెస్టర్లలో మహిళలు 30%గా ఉన్నారు. మహిళల్లోనూ పెట్టుబడుల పట్ల ఆసక్తి పెరుగుతుందనడానికి ఇది నిదర్శనం. -
ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా) (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) వీరు ఎన్ఎస్ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఖాతా వివరాలు (యూజర్ ఐడీ, పాస్వర్డ్) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్ఎస్ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
రియల్టీలో భారీ లావాదేవీలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు 2018–22 మధ్య భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. 12.2 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు సమారు) ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,800 ఎకరాల భూమిని సమీకరించినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో డెవలపర్ల నుంచి భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాల్లో భూముల కొనుగోలు పెరిగిందని.. 6,800 ఎకరాల్లో అధిక భాగం 2021 జనవరి తర్వాత సమకీరించినదిగా పేర్కొంది. ‘‘భూముల క్రయ విక్రయాల పరంగా 2022 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలం కోసం చూస్తున్నట్టు ఇది తెలియజేస్తోంఇ’’ అని సీబీఆర్ఆ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మొత్తం కొనుగోలు చేసిన భూముల్లో నివాస, మిశ్రమ వినియోగానికి సంబంధించే 60 శాతంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనే భూముల సమీకరణకు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రానున్న సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి ప్రాపర్టీల సరఫరా ఎక్కువగా ఉంటుందని సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. గ్రీన్ఫీల్డ్ కార్యాలయాల అభివృద్ధికి సంబంధించి భూముల కొనుగోళ్లు మొత్తం పెట్టుబడుల్లో 19 శాతంగా ఉండగా, ఇండస్ట్రియల్ రంగంలో 9 శాతం, లాజిస్టిక్స్ అవసరాల భూముల కోసం 7 శాతం పెట్టుబడులు వచ్చాయి. పార్క్ల అభివృద్ధికి సంబంధించి భూముల సమీకరణ 3 శాతంగా ఉంది. ప్రాంతాల వారీ.. ► 2018–22 మధ్య జరిగిన భూముల కొనుగోళ్లలో 67 లావాదేవీలు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే నమోదయ్యాయి. 760 ఎకరాల కొనుగోలుకు 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబలు వచ్చాయి. ► ముంబైలో 960 ఎకరాలకు సంబంధించి 3.8 బిలియన్ డాలర్ల విలువైన 73 లావాదేవీలు నమోదయ్యాయి. ► బెంగళూరులో 1.1 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 ఎకరాలకు సంబంధించి 44 లావాదేవీలు జరిగాయి. ► హైదరాబాద్ మార్కెట్లో 2018–22 మధ్య మొత్తం 24 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 970 ఎకరాల కొనుగోలుకు 0.9 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ► పుణె నగరంలో 450 ఎకరాలకు సంబంధించి 27 లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వీటి విలువ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ► చెన్నై రియల్టీ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది. ► ఇక దేశంలోని మిగిలిన పట్టణాల్లో 1,300 ఎకరా లకు సంబంధించి లావాదేవీలు నమోదయ్యాయి. విలువలు ఇలా... 2018–22 మధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొత్తం మీద 43.3 బిలియన్ డాలర్ల విలువ చేసే (రూ.3.55 లక్షల కోట్లు) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. నార్త్ అమెరికా, సింగపూర్ కేంద్రంగా పనిచేసే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లను ఈక్విటీ రూపంలో సమకూర్చారు. ఈ కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల్లో ఇవి 58 శాతంగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం స్థిరంగా ఉంటుందని, 16–17 బిలియన్ డాలర్ల మేర రావచ్చని అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఆఫీస్ విభాగం అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగాల్లోకి పెట్టుబడులు వస్తాయన్నారు. -
కళ తప్పిన బంగారం ఈటీఎఫ్లు.. కారణమిదే!
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం ప్రియం.. వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి. ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే. బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు. -
లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం డేటా, ఆర్బీఐ మినిట్స్, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు ట్రెండ్ను నిర్దేశించడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 17,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఎగువున 18వేల స్థాయి వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాల దృష్ట్యా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ రంగం ఒత్తిడికి లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల క్యూ4 ఆర్థిక ఫలితాలను స్పందించాల్సి ఉంటుంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్తో సహా 50కి పైగా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఎగుమతి ఆధారిత కంపెనీలపై అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మార్చి త్రైమాసిక ఫలితాల ద్వారా తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం మార్చి డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా సోమవారం(నేడు) విడుదల అవుతుంది. మరుసటి రోజు మంగళవారం చైనా తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి, పారిశ్రామి కోత్పత్తి డేటాతో పాటు యూరోజోన్ ఫిబ్రవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గణాంకాలు వెల్లడి కానున్నా యి. ఇక బుధవారం జపాన్ ఫిబ్రవరి పారిశ్రామి కోత్పత్తి, యూరోజోన్ మార్చి ద్రవ్యోల్బణ విడుదల అవుతుంది. జపాన్ మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అమెరికా ఇళ్ల అమ్మకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపా న్ మార్చి ద్రవ్యోల్బణం, యూరోజోన్ తయారీ రంగ సర్వీసు, అమెరికా తయారీ రంగ సర్వీసు డేటా వెల్లడి కానుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ► విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ ఇన్వెస్టర్లు 2023–24ని సానుకూలంగా ప్రారంభించారు. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్పీఐ ధోరణి అస్థిరంగా ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. -
నామినీ అప్డేట్ గడువు పొడిగింపు: సెబీ
న్యూఢిల్లీ: ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువును ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకూ అనుమతిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 2021 జూలైలో తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. ఇలా చేయని ఖాతాలను డెబిట్లు చేపట్టేందుకు వీలులేకుండా నిలిపివేయనున్నట్లు తెలియజేసింది. తదుపరి 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం తప్పనిసరి చేసింది. వెరసి నామినీ వివరాలు అందించడం లేదా నామినేషన్ను ఉపసంహరించేందుకు మరో ఆరు నెలల గడువు లభించింది. 2022 ఆగస్ట్1లోగాఎంఎఫ్ సబ్స్క్రయిబర్లకు నామినీ వివరాలివ్వడం లేదా నామినేషన్ నుంచి తప్పుకునేందుకు 2022 జూన్లో సెబీ తప్పనిసరి చేసింది. ఆపై 2022 అక్టోబర్ 1వరకూ గడువు పెంచింది. తదుపరి 2023 మార్చి31వరకూ మరోసారి గడువు పొడిగించింది. 2021 అక్టోబర్ తదుపరి డీమ్యాట్ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు డిక్లరేషన్ ఫామ్ ద్వారా నామినీ వివరాలిచ్చేందుకు వీలు కల్పించింది. ఇదేవిధంగా నామినేషన్ను తప్పించేందుకూ వీలుంది. -
క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది. క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. లగ్జరీ లైఫ్కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్స్కైని గత ఏడాది డిసెంబర్లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్కు షాకిచ్చిన వ్యాపారవేత్త!
మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. ఉక్రయిన్తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు. ఉక్రెయిన్పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్తో కలిసి పని చేస్తాం -
AP Global Investors Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నాం
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా జరుగుతోంది. అనేక మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న స్నేహపూర్వక వాతావరణంతో అనేక కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రిలయెన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు సదస్సును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఏపీ ప్రభుత్వంతో తాము ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నామంటూ ట్విటర్ ద్వారా తెలియజేశారు. Happy to announce that we have signed an MoU with the Andhra Pradesh Govt to set up a 3 MTPA steel plant near Krishnapatnam Port. This plant will provide employment to 10,000 people & will strengthen our association with Andhra Pradesh & its people. #APGlobalInvestorsSummit pic.twitter.com/c7HQPt7LRF — Naveen Jindal (@MPNaveenJindal) March 3, 2023 Proud to represent our chairman @gautam_adani and group @adanionline at #APGIS2023 . @APSEZ will add 100 Million tonnes of new capacity at gangavaram and Krishnapattanam. @AdaniGreen will add 15 GW of renewable plant. @AmbujaCementACL will add 10 MMT of cement in AP state. — Karan Adani (@AdaniKaran) March 3, 2023 ReNew is at the Advantage AP: Global Investors Summit 2023. More information to follow!@Advantage_APGov #APGIS2023 pic.twitter.com/V15yRf8tKB — ReNew (@ReNewCorp) March 3, 2023 -
‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్కు హాజరయ్యారు. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్లో ఏపీ దూసుకుపోతోంది. -
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
అదానీ రుణాలపై సెబీ కన్ను, ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లకు మరో 51 వేల కోట్ల షాక్
సాక్షి, ముంబై: అదానీ గ్రూపులో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్ రేపిన మరింత ముదురు తోంది. వికీపీడియా సంస్థ ఆరోపణల దుమారానికి తోడు తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్రెడిట్ రేటింగ్ సంస్థల నుండి అదానీ గ్రూప్ కంపెనీల స్థానిక రుణాలు, సెక్యూరిటీల అన్ని రేటింగ్ల వివరాలను కోరినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. సెబీ అదానీ సంస్థల రుణాల రేటింగ్లపై సమాచారాన్ని కోరిందంటూ ఎకనామిక్ టైమ్స్ నివేదించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. తీవ్ర అమ్మకాలతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 51,000 కోట్లు నష్టపోయారు. బుధవారం నాటి నష్టాల మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 9.55 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్ షేరు 4.66 శాతం కుప్పకూలాయి. ఇంకా అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు ఒక్కొక్కటి 5 శాతం పడిపోయాయి. గత రెండు వారాల్లో అత్యంత దారుణ పతనాన్ని బుధవారం చవిచూశాయి. అదానీ గ్రూప్ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్కు ముందస్తు చెల్లింపులు చేస్తున్నప్పటికీ స్టాక్ పతనం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా, కమర్షియల్ పేపర్లకు సంబంధించిన ఫిబ్రవరి బకాయిల కోసం SBI MF, HDFC MF & ABSL MFలకు ముందస్తు చెల్లింపులు జరిగాయి. అలాగే మార్చి బకాయిలకు ముందస్తు చెల్లింపును కూడా ప్రకటించింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ హోల్డర్లకు కొన్ని వారాల్లో రుణ రీఫైనాన్సింగ్ ప్లాన్లను ప్రకటిస్తామని కూడా అదానీ ప్రకటించింది. పలు అదానీ కంపెనీల స్టాక్ ధరలు భారీగా పతనంతో లిక్విడిటీ పొజిషన్లు, రుణాలు తీసుకున్న కంపెనీల రుణ చెల్లింపు సామర్థ్యంపై ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అని నిర్ధారించడానికి సెబీ బహుశా ప్రయత్నిస్తోందట. కాగా హిండెన్బర్గ్ ఆరోపణలు అదానీ గ్రూపు తత్రీవంగా ఖండించినప్పటికీ ఈ వివాదం ఇంకా సమసి పోక ముందే వికిపీడియా ఎంట్రీలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని వికిపీడియా స్వతంత్ర వార్తాపత్రిక సైన్ పోస్ట్ ఆరోపించింది.పెయిడ్ ఎడిటర్లను పెట్టి తమ గ్రూప్నకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని వాదించిన సంగతి తెలిసిందే. -
Adani Group crisis: రూ. 10 లక్షల కోట్లు హాంఫట్, 24వ స్థానానికి గౌతం అదానీ
సాక్షి, ముంబై: అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్లసంపద రోజురోజుకు ఆవిరైపోతూ వస్తోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్లను కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్క రోజు పతనంతో గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్ రూపాయిలకు పడిపోయింది. (ఇదీ చదవండి: Valentine's Day 2023:వామ్మో..చాట్జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!) హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలతో జనవరి 24న ప్రారంభమైన మెల్ట్డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది మరోవైపు అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ 53 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్సీఐ గత వారం చివరిలో దాని గ్లోబల్ ఇండెక్స్లలో భాగమైన కొన్ని గ్రూప్ కంపెనీల వెయిటింగ్లను తగ్గించడం, అలాగే గ్రూప్ తన క్యాపెక్స్ ప్లాన్లను తగ్గించాలని యోచిస్తున్న తాజా నివేదికల తరువాత తాజా నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హిండెన్బర్గ్ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ను నియమించినట్టు తెలుస్తోంది. (Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) అంతా బానే ఉంది: ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్ కుదుటపడిన తర్వాత గ్రూప్లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు. -
UP Global Investors Summit 2023 యూపీపై అంబానీ వరాల జల్లు, వేల కోట్ల పెట్టుబడులు
లక్నో: యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉత్తరప్రదేశ్పై వరాల జల్లు కురిపించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు, అదనంగా రూ.75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జియో, రీటైల్, రెన్యూవల్, రంగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అంబానీ ప్రకటించారు. రానున్న పది నెలల్లో (డిసెంబరు,2023 నాటికి యూపీలోని మూలమూలకు జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేశ్ అంబానీ చెప్పారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ దేశంలోని 'ఉత్తమ్' ప్రదేశ్గా అభివృద్ధి చెందుతోందంటూ కితాబిచ్చారు. ఉద్యోగ, సహయోగ్ కలబోతగా అభివృద్ధి బాటలో యూపీ పయనిస్తోందిన్నారు. రిలయన్స్ రిటైల్ ద్వారా ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ, వ్యవసాయేతర కొనుగోళ్లను పెంచుతాంమనీ, కొత్త బయో ఎనర్జీ వ్యాపారాన్ని ప్రారంభించనున్నామని కూడా ప్రకటించారు.ఈ సందర్భంగా యూనియన్ బడ్జెట్ 2023-24 ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి పునాది వేసిందని అంబానీ ప్రశంసించారు. కాగా శుక్రవారం ఫిబ్రవరి 10నుంచి మూడు రోజుల పాటు 2023న లక్నోలో జరగనున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు ముఖ్య అతిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు పాల్గొన్నారు -
Tesla Tweet: ఎలన్ మస్క్కు భారీ ఊరట
శాన్ ఫ్రాన్సిస్కో: దాదాపు నాలుగేళ్ల క్రిందట.. టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ఆ ఒక్క ట్వీట్ ఆ కంపెనీ పెట్టుబడిదారులను బెంబేలెత్తించింది. నిర్లక్ష్యంగా ఆయన చేసిన ఆ ట్వీట్.. కంపెనీ షేర్లను ఘోరంగా పతనం చేసింది. వెరసి.. సొంత కంపెనీ, సొంత ఇన్వెస్టర్లు, సొంత సీఈవో పైనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదీ బిలియన్ల డాలర్ల పరిహారం కోరుతూ!. కానీ, ఎలన్ మస్క్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కోర్టు కూడా ఆసక్తి చూపలేదు. ఆయనకు భారీ ఊరటే ఇచ్చింది. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్) కోర్టు.. ఎలన్ మస్క్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన ట్వీట్ ద్వారా ఎలన్ మస్క్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తద్వారా వాటాదారులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 2018లో టెస్లా ప్రైవేట్ ఫండింగ్కు వెళ్తోందంటూ ఓ ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అయితే.. కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేసిన పెట్టుబడిదారులను అణిచివేసే ప్రయత్నమే అయినా.. సదరు వ్యాపారవేత్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తద్వారా టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయని టెస్లా ఇన్వెస్టర్లు మస్క్పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. కానీ, మస్క్ చేసిన ‘‘ఫండింగ్ సెక్యూర్డ్’’ ట్వీట్ సాంకేతికంగా సరికాదని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. ఎలన్ మస్క్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తద్వారా ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ తన ట్వీట్లతో నెటిజన్స్లో ‘హీరో’గా పేరు సంపాదించుకుంటున్నప్పటికీ .. టెస్లాను మాత్రం నిండా ముంచుతూ పోతున్నాడు. టెస్లాలో తన పేరిట ఉన్న అధిక వాటాలను ఇదివరకే మస్క్ అమ్మేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో ఎలన్ మస్క్ ఇంకా చెలరేగిపోయే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు దావాల్లోనూ మస్క్కి అనుకూలంగానే తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నాం. ఇక నుంచి తనకు ఏది అనిపిస్తే దానిని సోషల్ మీడియా వేదికగా ఎలన్ మస్క్ ప్రకటించే అవకాశం ఉందని, అది భావ స్వేచ్ఛ ప్రకటనగా పరిగణించడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను చేజిక్కించుకున్న ఎలన్ మస్క్.. ఆ మైక్రోబ్లాగింగ్ కంపెనీ వ్యవస్థను అతలాకుతలం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్
ముంబై: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో) పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ ఇష్యూను ఉపసంహరించుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఎఫ్పీవో ద్వారా సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని పేర్కొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్పీవో జనవరి 31న ముగిసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టుతో బుధవారం కూడా గ్రూప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Union Budget 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు! -
విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరగ్గా.. అందులో పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్గా ఉంటోందని సీఎం జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే మేం నెంబర్ వన్గా ఉన్నాం. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్లో.. మూడు ఏపీకే రావడం శుభపరిణామం. సింగిల్ డెస్క్ సిస్టమ్ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్.. మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని ఇన్వెస్టర్లను కోరారు. -
ఐటీఐ నుంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఫ్లెక్సి క్యాప్ ఫండ్కు సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్కు నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. దీని ద్వారా సమీకరించిన నిధులను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో సంస్థ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయాలనుకునే మదుపరులకు ఇది అనువుగా ఉంటుంది. ధీమంత్ షా, రోహన్ కోర్డే ఈ ఫండ్ను నిర్వహిస్తారు. 2019లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీఐ .. ప్రస్తుతం 16 ఫండ్లను అందిస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి దాదాపు రూ. 3,557 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. చదవండి: ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్తో దూసుకుపోతోంది! -
స్టాక్ మార్కెట్: 3 నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. టీప్లస్1 సెటిల్మెంట్ ట్రేడింగ్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చేవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కూడా జరగనుంది. ఈ పరిణామాణాలకు తోడు వారాంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. బాండ్లపై రాబడుల పెరుగుదల, క్రూడాయిల్ ధరల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి 59,307 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 287 పాయింట్లు క్షీణించి 17,604 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడు నెలల కనిష్ట ముగింపు. అదానీ గ్రూప్ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ రెండుశాతం, మిడ్క్యాప్ సూచీ 1.30% నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,978 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.4,252 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రెండు శాతం క్రాష్ అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ..., రిపబ్లిక్ డే సెలవు రోజు తర్వాత దేశీయ మార్కెట్ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 60,167 వద్ద, నిప్టీ 15 పాయింట్ల పతనంతో 17,877 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆ తర్వాత అమ్మకాల వెల్లువతో ఒక దశలో సెన్సెక్స్ 1,231 పాయింట్లకు పైగా నష్టపోయి 58,975 దగ్గర, నిఫ్టీ 398 పాయింట్లు క్షీణించి 17,494 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. రెండు రోజుల్లో రూ.10.65 లక్షల కోట్ల నష్టం గత రెండురోజుల్లో సెన్సెక్స్ 1,648 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో 10.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. నిఫ్టీ సైతం 514 పాయింట్లు క్షీణించింది. అదానీ గ్రూప్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇచ్చిన వివరణ, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది. ఈ గ్రూప్నకు చెందిన మొత్తం ఏడు కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ 20% లోయర్ సర్క్యూట్, అదానీ విల్మార్, అదానీ పవర్ షేర్లు ఐదుశాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు వరుసగా 18%, 16% చొప్పున నష్టపోయాయి. ఇటీవల అదానీ గ్రూప్ విలీనం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీల షేర్లు సైతం 17%, 13% చొప్పున నష్టపోయాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో గడిచిన రెండు రోజుల్లో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.4.17 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఎఫ్పీవోకు బిడ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవోకు తొలి రోజు(27న) రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 4.7 లక్షల బిడ్స్ దాఖలయ్యాయి. 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. ఆఫర్కు ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. గడువు ఈ నెల 31న(మంగళవారం) ముగియనుంది. బీఎస్ఈలో షేరు 19 శాతం పతనమై రూ. 2,762 వద్ద ముగిసింది. చిన్న ఇన్వెస్టర్లకు కేటాయించిన 2.29 కోట్ల షేర్లకుగాను 4 లక్షల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 2,656 షేర్లకు, నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 96.16 లక్షల షేర్లకుగాను 60,456 షేర్ల కోసం బిడ్స్ లభించాయి. బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
రెండో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్చేసి 61,046 వద్ద నిలిచింది. వెరసి మళ్లీ 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ 112 పాయింట్లు జమ చేసుకుని 18,165 వద్ద ముగిసింది. అయితే తొలుత మార్కెట్లు కొంతమేర డీలా పడ్డాయి. వెనువెంటనే ఊపందుకుని చివరివరకూ పటిష్టంగా కదిలాయి. ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం స్వల్ప కొనుగోళ్లు చేపట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఆసియా, యూరోపియన్ మార్కెట్ల సానుకూలతలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం(17న) సైతం సెన్సెక్స్ 563 పాయింట్లు ఎగసిన విషయం విదితమే. కాగా.. తొలుత సెన్సెక్స్ 60,569 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ ఆపై 61,110 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో నిఫ్టీ 18,184– 18,032 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. డాలరుతో మారకంలో రూపాయి బౌన్స్బ్యాక్ కావడం మార్కెట్లకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెటల్స్ జూమ్ ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.7 శాతం పుంజుకోగా, ఫార్మా, ప్రయివేట్ బ్యాంకింగ్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. పీఎస్యూ బ్యాంక్స్ 1.25 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఎల్అండ్టీ, యూపీఎల్, విప్రో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ, దివీస్, గ్రాసిమ్ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. రూపాయి స్పీడ్... డాలరుతో మారకంలో వరుసగా మూడు రోజుల నష్టాలకు దేశీ కరెన్సీ చెక్ పెట్టింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 28 పైసలు లాభపడి 81.41 వద్ద ముగిసింది. అయితే రూపాయి తొలుత 81.80 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి డాలరు ఇండెక్స్ వెనకడుగు వేయడం, దేశీ ఈక్విటీలు ఊపందుకోవడంతో 81.25 వరకూ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం క్షీణించి 101.93కు చేరడం రూపాయికి హుషారునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్ హైలైట్స్ ►ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఆదాయం 41 శాతం ఎగసి రూ. 3,384 కోట్లను తాకడంతో ల్యాండ్మార్క్ కార్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 587 వద్ద ముగిసింది. తొలుత రూ. 599 వరకూ ఎగసింది. 2022 డిసెంబర్ 23న లిస్టయిన తదుపరి ఇదే గరిష్టం! ►క్యూ3 ఫలితాలపై అంచనాలతో ఉషా మార్టిన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్చేసి రూ. 191 వద్ద ముగిసింది. తొలుత రూ. 199 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ► గత మూడు వారాల్లో 20% ర్యాలీ చేసిన యురేకా ఫోర్బ్స్ షేరు బీఎస్ఈలో తొలుత 1.5 శాతం బలపడి రూ. 537 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. చివరికి అమ్మకాలు పెరిగి 1.6% నష్టంతో రూ. 521 వద్ద ముగిసింది. -
మార్కెట్ బౌన్స్బ్యాక్
ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 563 పాయింట్లు జంప్చేసి 60,656 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 158 పాయింట్లు ఎగసి 18,053 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్కు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ, బ్యాంకింగ్ సంస్థలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,704– 60,072 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 18,072–17,887 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. పీఎస్యూ బ్యాంక్స్ డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఆయిల్, ఐటీ, ఆటో రంగాలు 1.2–0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, బ్రిటానియా, అల్ట్రాటెక్, మారుతీ 3.7–1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ 1.6–0.4 శాతం మధ్య నీరసించాయి. రూపాయి వీక్ డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు క్షీణించింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 81.70 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 81.58కాగా.. మంగళవారం(17న) ట్రేడింగ్లో 81.79 వద్ద ప్రారంభమైంది. తదుపరి 81.89 వరకూ నీరసించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుని 102.4కు బలపడటం దేశీ కరెన్సీని దెబ్బ తీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. మంగళవారం ట్రేడింగ్లో చిన్న షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1,890 నష్టపోగా, 1,621 లాభపడ్డాయి. గత రెండు రోజుల్లో రూ. 3,173 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్పీఐలు తాజాగా రూ. 211 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! స్టాక్ హైలైట్స్ ∙హైదరాబాద్లో వాణిజ్య నిర్మాణాలకుగాను రూ. 1,000–2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఎల్అండ్టీ కౌంటర్ 4 శాతం జంప్చేసింది. రూ. 2217 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,218 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. నేడు(18న) వాటాదారుల అత్యవసర సమావేశం(ఈజీఎం) నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషాలిటీ రెస్టారెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతంపైగా జంప్చేసింది. రూ. 273 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టం రూ. 283 వరకూ దూసుకెళ్లింది. చదవండి: Rage Applying: కంపెనీలను కుదిపేస్తున్న'రేజ్ అప్లయింగ్' సునామీ -
స్టార్టప్లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు!
తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న తారలు క్రేజ్ ఉన్నంత వరకు వెండితెరపై కనిపిస్తూ ఆపై కనుమరుగయ్యేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పటి తారలు మరో ముందడుగు వేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారు. ప్రస్తుత సినీ స్టార్లు మరో ముందడుగు వేసి తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని స్టార్టప్ (startups) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సంస్థల నుంచి లాభాలు ఆర్జించడమే కాకుండా తమ పెట్టుబడుల ద్వారా ఆ స్టార్టప్లకు కూడా గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం! అనుష్క శర్మ విరాట్ కోహ్లీ భార్యగా, బీ టౌన్ నటిగా అనుష్క శర్మ అందరికీ తెలుసు. ఈ బాలీవుడ్ నటి ఇటీవలే ప్రత్యామ్నాయ మీట్ పుడ్ స్టార్టప్ బ్లూ ట్రైబ్ ఫుడ్స్లో పెట్టుబడి పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా చేరారు. విరుష్క జంట ఈ స్టార్టప్లో ఎంత పెట్టుబడులు పెట్టారనే తెలియదు. వీటితో పాటు మిల్లెట్స్తో తయారుచేసే ఫుడ్ బ్రాండ్ స్లర్ప్ ఫామ్ (Slurrp Farm)లో అనుష్కకు పెట్టుబడులు ఉండగా, డిజిట్ ఇన్సురెన్స్ కంపెనీలోనూ వాటాలున్నాయి. పంకజ్ త్రిపాఠి ప్రముఖ బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి 30 లక్షలకు పైగా రైతుల నెట్వర్క్ను కలిగి ఉన్న అగ్రిటెక్ ప్లాట్ఫారమ్లో పెట్టుబడి పెట్టారు. ఇది రైతులకు అవసరమైన డేటాను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఈ నెట్వర్క్. దీని ద్వారా రైతలు తమ భూమి నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు ఇది వారికి సహకరిస్తుంది. అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన అలియా భట్కు చాలా వ్యవస్థాపక ఆసక్తులు ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్-మద్దతుగల D2C స్టార్టప్ ఫూల్ లో పెట్టుబడులు పెట్టింది. 2017లో స్థాపించబడిన ఈ స్టార్టప్ ఆలయాల్లో పూల వ్యర్థాలతో అగరబత్తీలు, దూప్స్టిక్లను తయారు చేస్తుంది. అలియా గతంలో ఓమ్నిచానెల్ లైఫ్స్టైల్ రిటైలర్ నైకా, ఫ్యాషన్-టెక్ స్టార్టప్ స్టైల్క్రాకర్లో పెట్టుబడులు పెట్టింది. అదనంగా, అలియా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని నవంబర్ 2020లో 'ఎడ్ ఎ మమ్మా," ఎడ్ ఏ మామ్మ (Ed-a-Mamma) పేరిట చిన్నపిల్లల దుస్తుల ప్లాట్ఫాంనూ నిర్వహిస్తోంది. దీపిక పదుకొణె: బాలీవుడ్ నటి, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె సైతం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇటీవల పాపులర్ అయిన మింత్రాలోనూ దీపికకు పెట్టుబడులు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని వాల్మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేఏ ఎంటర్ప్రైజస్ ఎల్ఎల్పీ పేరిట ఓ కంపెనీ నెలకొల్పారు. వీటితో పాటు మరికొన్ని సంస్థలో వాటాలు ఆమెకు ఉన్నాయి. సోనూసూద్: సోనూసూద్.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కె12 అనే ఎడ్యుకేషన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. జితిన్ భాటియాతో కలిసి Explurger అనే సోషల్ మీడియా యాప్ను సైతం సోనూ ప్రారంభించారు. చదవండి: కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి! -
మళ్లీ మార్కెట్ల పతనం
ముంబై: షార్ట్ కవరింగ్తో ముందురోజు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. సెన్సెక్స్ 632 పాయింట్లు కోల్పోయి 60,115 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 809 పాయింట్లవరకూ జారి 59,938కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 187 పాయింట్లు పడిపోయి 17,914 వద్ద స్థిరపడింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 18,000 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ కౌంటర్లతోపాటు ఇతర బ్లూచిప్స్లో ఊపందుకున్న అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అయితే డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పుంజుకోవడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్న నేపథ్యంలో మార్కెట్లలో తాజా అమ్మకాలు నమోదైనట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ విశ్లేషకులు ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. గత వారం చివర్లో వరుసగా మూడు రోజులు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణ పథంలో సాగిన విషయం విదితమే. విదేశీ ఎఫెక్ట్ నేటి(10న) ట్రేడింగ్లో యూరోపియన్ మార్కెట్లు నేలచూపులకే పరిమితంకావడం, అంతకుముందు యూఎస్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రిటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు విదేశీ అంశాలకు ప్రభావితమైనట్లు తెలియజేశారు. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఐటీసీ, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ ప్రధానంగా నష్టపోయాయి. అయితే టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం బలపడ్డాయి. ముందురోజు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ 1 శాతం వెనకడుగు వేసింది. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో టెలికం, సర్వీసులు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ, కమోడిటీస్, రియల్టీ రంగాలు 1.6–0.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు మెటల్, హెల్త్కేర్, ఆటో, ఆయిల్– గ్యాస్ స్వల్పంగా బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2189 నష్టపోగా.. 1329 లాభపడ్డాయి. సోమవారం రూ. 203 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మరో రూ. 2,109 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,807 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► ఈ ఏడాది తొలి అర్ధభాగంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించిన ష్నీడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా షేరు 14 శాతం దూసుకెళ్లి ఏడేళ్ల గరిష్టం రూ. 203కు చేరింది. ► క్యూ3లో జేఎల్ఆర్ హోల్సేల్ అమ్మకాలు ఊపందుకోవడంతో టాటా మోటార్స్ షేరుకి డిమాండ్ పెరిగింది. పతన మార్కెట్లోనూ 6 శాతం జంప్చేసి రూ. 413 వద్ద ముగిసింది. ►సెర్బియన్ సంస్థ నోవెలిక్లో 54 శాతం వాటా కొనుగోలు వార్తలతో సోనా కామ్స్టార్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 448 వద్ద ముగిసింది. -
అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా?
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: కోవిడ్ భయాలకు తోడు తాజాగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ విస్తృత స్థాయిలో మార్కెట్లో అన్ని రంగాలలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 60 వేల స్థాయిని, నిఫ్టీ 18 వేల స్టాయిలను కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సెన్సెక్స్ 981 పాయింట్లు క్షీణించి 60 వేల దిగువన 59,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు నష్టపోయి 17,807 వద్ద నిలిచింది. మధ్య, చిన్న తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామీతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.11%, మిడ్క్యాప్ సూచీ 3.40 చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.706 కోట్లు షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,399 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో థాయ్లాండ్ తప్ప అన్ని దేశాల సూచీలు నష్టాల రెండున్నర శాతం వరకు క్షీణించాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఈ వారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు కోల్పోయాయి. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 1961 పాయింట్ల(మూడుశాతానికి పైగా) పతనంతో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15.78 లక్షల కోట్లు తగ్గి రూ. 272.12 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల భారీ పతనం ప్రభుత్వరంగ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 14%, యూనియన్ బ్యాంక్ 10.57%, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ షేర్లు పదిశాతం, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 8–7% చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్. పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ షేర్లు 5 నుంచి మూడుశాతం పతనమయ్యాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 6.5% నష్టపోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► లిస్టింగ్ తొలిరోజే ల్యాండ్మార్క్ కార్స్ షేరు డీలాపడింది. ఇష్యూ ధర (రూ.506)తో పోలిస్తే 7% డిస్కౌంట్తో రూ.471 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12% క్షీణించి రూ.446 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం నష్టంతో రూ.456 వద్ద స్థిరపడింది. ► అబాన్స్ హోల్డింగ్స్ కూడా ఇష్యూ ధర (రూ.270)తో పోలిస్తే 1% నష్టంతో ఫ్లాట్గా రూ.273 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ట్రేడింగ్లో 20% క్షీణించి రూ.216 అప్పర్ సర్క్యూట్ తాకి ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలే!
నాకు పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఒకటి గడువు తీరడంతో కొంత మొత్తం చేతికి వచ్చింది. వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. అచ్చమైన ఈక్విటీ ఫండ్స్తో పోలిస్తే ఆటుపోట్లు తక్కువే. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలానికి ఈ ఫండ్స్లోనూ రిస్క్ ఉంటుంది. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ను కూడా పరిశీలించొచ్చు. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్లో మాదిరే ఉంటాయి. కాకపోతే వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉండడంతో, వాటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్కు వెళ్లొచ్చు. నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు వరకు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్లో ఇది ఒకటి!
ఆర్బీఐ రెపో రేట్ల పెంపుతో కొంత కాలంగా డెట్ మార్కెట్లు అస్థిరతలను చూస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ వరుసగా రేట్లను పెంచుతూనే వస్తోంది. ఇప్పటికే 2.25 శాతం వడ్డీ రేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున, రానున్న కాలానికి అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు అనువైనవి డైనమిక్ బాండ్ ఫండ్స్. పరిస్థితులకు తగినట్టు ఇవి స్వల్ప కాలం నుంచి దీర్ఘకాల సాధనాల మధ్య పెట్టుబడులను మార్చే సౌలభ్యంతో పనిచేస్తాయి. ఈ విభాగంలో ఎన్నో పథకాలు అంబాటులో ఉన్నాయి. మంచి పనితీరు చూపించే టాప్ ఫండ్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ ఒకటి. రాబడులు.. గడిచిన ఆరు నెలల్లో పెట్టుబడి 5 శాతం మేర వృద్ధి చెందగా, ఏడాది కాలంలో 4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో ఏటా 7.30 శాతం, ఐదేళ్లలో 7.26 శాతం, ఏడేళ్లలో 8.28 శాతం, పదేళ్లలో 9.28 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. స్వల్పకాలంతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడి స్థిరంగా, మెరుగ్గా కనిపిస్తోంది. డైనమిక్ బాండ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్సీజన్స్ బాండ్ ఫండ్లోనే అధిక రాబడులు ఉన్నాయి. మూడేళ్లలో 1.5 శాతం, ఐదేళ్లలో 1.30 శాతం, ఏడేళ్లలో 1.5 శాతం, పదేళ్లలో 1.60 శాతం అధిక రాబడులు ఈ పథకం ఇవ్వడాన్ని గమనించాలి. ఈ పథకం ఆరంభమైన 2009 నుంచి చూస్తే వార్షిక రాబడి సుమారు 9 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం, పోర్ట్ఫోలియో.. ఈ విభాగంలో నిర్వహణ ఆస్తుల పరంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ అతిపెద్దది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.6,074 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసినప్పుడు ఈ పథకం తన పోర్ట్ఫోలియోలోని సాధనాల డ్యురేషన్ను ( కాలవ్యవధి) పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని భావించినప్పుడు, ఆ ప్రయోజనాలను ఒడిసి పట్టేందుకు, మార్కెట్ టు మార్కెట్ నష్టాలను తగ్గించుకునేందుకు పోర్ట్ఫోలియోలోని డెట్ సాధనాల డ్యురేషన్ను తగ్గిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ పోర్ట్ఫోలియో డ్యురేషన్ మార్పులపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఈ పథకానికి ఎంతో అనుభవం ఉంది. ఈ పథకం కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ (జీసెక్) ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో డ్యురేషన్ పథకంగా, వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో అక్రూయల్ పథకంగా పనిచేస్తుంది. ఈ పథకం ఆరంభం నుంచి ఎన్నో పర్యాయాలు వడ్డీ రేట్ల సైకిల్ (పెరగడం, తరగడం)ను చూసింది. కనుక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా, మెరుగైన నిర్ణయాలు తీసుకోడంలో కాస్త అనుభవం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియో సగటు డ్యురేషన్ 1.91 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెరుగుదల సైకిల్లో ఉన్నాం. కనుక డ్యురేషన్ తక్కువగా ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 38.2 శాతం ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో కలిగి ఉంది. అంటే వడ్డీ రేట్లు పెరిగినా, తరిగినా రిస్క్ ఉండదు. 29 శాతం పెట్టుబడులను ఏఏ మైనస్ అంతకంటే మెరుగైన రేటింగ్ సాధనాల్లో కలిగి ఉంది. మొత్తం పెట్టుబడుల్లో 92.91 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయగా, 7.09 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
పీఎంఎస్కు సెబీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల(పీఎంఎస్)కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇకపై పోర్ట్ఫోలియో మేనేజర్స్ క్లయింట్ల నిధులను నిర్వహించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పేరుతో అదనపు రక్షణాత్మక మార్గదర్శకాలను అనుసరించవలసి ఉంటుంది. పనితీరు(పెర్ఫార్మెన్స్), ప్రామాణికత(బెంచ్మార్కింగ్)లకు సంబంధించి సెబీ తాజా గైడ్లైన్స్ను ప్రకటించింది. క్లయింట్ల పెట్టుబడి ఆశయాలకు అనుగుణంగా నిధులను నిర్వహించేటప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్(ఐఏ)ను పాటించవలసి ఉంటుంది. పనితీరు, ప్రామాణికతలపై సమీక్షకు ఇవి అవసరమని సెబీ తెలియజేసింది. 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకిరానున్న తాజా మార్గదర్శకాలు పోర్ట్ఫోలియో మేనేజర్ల పనితీరును తెలుసుకునేందుకు సహాయకారిగా నిలవనున్నట్లు పేర్కొంది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీ బ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లోని కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్లు ఈ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్లో అదరగొడుతూ పెట్టుబడిదారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఉక్కు రంగంలో కామధేను లిమిటెడ్ కంపెనీ. కామధేను స్టాక్ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలును అందించింది. కేవలం 50 రోజుల్లో 190% రాబడి.. తగ్గేదేలే కామధేను లిమిటెడ్ ఒక చిన్న నుంచి మధ్యస్థ పరిమాణ ఉక్కు కంపెనీ. ఈ స్టాక్ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే, పెట్టుబడిదారులకు 190% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 25, 2022, అంటే దీపావళి మరుసటి రోజున, స్టాక్ రూ.129 వద్ద ట్రేడింగ్లో ఉండగా, డిసెంబర్ 15, 2022న నాటికి స్టాక్ రూ.374 వద్ద ట్రేడవుతోంది. దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్ అక్టోబర్ 25, 2022న కామధేను షేర్లను కొనుగోలు చేయడానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టుంటే, వాటి ప్రస్తుత విలువ రూ.2.90 లక్షలకు పెరిగింది. అనగా ఇన్వెస్టర్లకు రూ. 1.90 లక్షల రిటర్న్స్ని ఇచ్చింది.దీపావళి నుంచి ఈ స్టాక్ రాకెట్గా దూసుకోపోయింది. అదే సమయంలో, కంపెనీ రెండేళ్లలో 246 శాతం, మూడేళ్లలో 314 శాతం రాబడిని ఇచ్చింది. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
మరోసారి భారీ సేల్: మునుగుతున్న టెస్లా, ట్విటర్ కోసమే? ఇన్వెస్టర్లు గగ్గోలు
న్యూఢిల్లీ: ట్విటర్ డీల్ తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్లాలో వరుసగా బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించడం కలకలం రేపుతోంది. ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్ హోదాను కోల్పోయిన మస్క్ మరోసారి 3.5 బిలియన్ల డాలర్ల విలువైన 22 మిలియన్ల టెస్లా షేర్లను విక్రయించారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం డిసెంబర్ 12-15 నుండి మూడు రోజుల మధ్య స్టాక్లను అమ్మేశారు. అయితే ఈ విక్రయానికి గల కారణాలను మస్క్ వెల్లడించలేదు. నవంబర్ 2021 నుండి, మస్క్ సుమారు 40 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీంతో టెస్లాలో ఏడాది క్రితం 17 శాతంగా ఉన్న మస్క్ వాటా ఇపుడు 13.4 శాతానికి చేరింది. ఖర్చులను తగ్గించుకునే పనిలో వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్, ట్విటర్ ఆఫీసుల్లో చాలావరకు అద్దె చెల్లిపులను కూడా నిలిపి వేసిందట. అటు 44 బిలియన్ డాలర్లకుఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన తరువాత నుంచి ప్రకటనదారులు ఒక్కొక్కరూ వైదొలగు తున్నారు. నవంబర్లో అంతకుముందు సంవత్సరం కంటే 85 శాతం పడిపోయాయని తెలుస్తోంది. ట్విటర్ ఆదాయంలో 89 శాతం ప్రకటనలదే. దీంతో మస్క్ సకక్షోభంలో పడిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కొనుగోలులో భాగంగా ట్విటర్ సంవత్సరానికి సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పిచ్చిన బ్యాంకులు ఈ త్రైమాసికంలో నష్టాల బుకింగ్కు సిద్ధమవుతున్నాయి. మస్క్ నవంబర్లో 3.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, అంతకుముందు ఏప్రిల్లో 8.4బిలియన్ డాలర్లు, ఆగస్టులో 6.9 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా షేర్లు 28 శాతం పతనాన్ని నమోదు చేశాయి. తాజాగా రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో టెస్లా కంటే ట్విటర్పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారంటూ టెస్లా పెట్టుబడిదారులు మస్క్పైమండిపడుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
12 కోట్లకు బీఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల ఖాతాలు గత 148 రోజుల్లో కోటి జత కలిశాయి. దీంతో ఎక్సే్ఛంజీలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్ల మైలురాయిని తాకింది. జులై 18 నుంచి డిసెంబర్ 13 మధ్య కాలంలో కోటి ఖాతాలు కొత్తగా జ త కలసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. కాగా.. ఇంతక్రితం 11 కోట్ల ఇన్వెస్టర్ల సంఖ్య చేరేందుకు 124 రోజులు తీసుకోగా.. 10 కోట్లకు 91 రోజులు, 9 కోట్లకు 85 రోజులు, 8 కోట్లకు 107 రోజులు పట్టడం గమనించదగ్గ అంశం! యూనిట్ క్లయింట్ కోడ్(యూసీసీ) ఆధారంగా 2022 డిసెంబర్ 13కల్లా రిజిస్టరైన ఇన్వెస్టర్లు 12 కోట్లకు చేరినట్లు బీఎస్ఈ తెలియజేసింది. వీరిలో 42 శాతంమంది 30–40 వయ సువారుకాగా.. 23 శాతంమంది 20–30 వయసును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక 40–50 వయసు వ్యక్తుల వాటా 11 శాతంగా వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో 20 శాతం మహారాష్ట్రకు చెందగా.. 10 శాతంతో గుజరాత్, 9 శాతంతో యూపీ, 6 శాతంతో రాజస్తాన్, తమిళనాడు తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
పెట్టుబడులు పెట్టాలా ? ఎందులో, ఎప్పుడు, ఎలా..
ప్రపంచమంతటా మార్కెట్లు కాస్త గందరగోళంగా ఉన్నాయి. అయితే, మిగతా సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మాత్రం కాస్త మెరుగ్గానే ఉంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయులకు చేరిందని, గ్లోబల్ మార్కెట్లు స్వల్పకాలికం నుండి మధ్యకాలికంగా కాస్త సానుకూలంగా ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, పరిస్థితులు కనిపిస్తున్నంత ఆశావహంగా ఏమీ లేవు. ఎందుకంటే 2023–24లోనూ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఈక్విటీలపైనా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి ప్రభావం ఎక్కువగా ఉండని సాధనాల మీద ఇన్వెస్టర్లు దృష్టి పెడితే ప్రయోజనకరంగా ఉండవచ్చు. పటిష్టమైన నిర్వహణ నైపుణ్యాలు, భారీ డిమాండ్ ఉండే రంగాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వాటి తయారీ సంస్థలు దీర్ఘకాలిక లాభదాయకత దెబ్బతినకుండా తమ ఉత్పాదనల తయారీ, వ్యయాలు మొదలైన వాటిని సులభంగానే సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ఆయిల్, ఇంటరీ్మడియరీ రసాయనాల ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం పడినా.. భారతీయ రసాయన రంగ సంస్థలకు అంతర్జాతీయంగా డిమాండ్పరమైన దన్ను లభించవచ్చు. పటిష్టమైన ధరల విధానం, మంచి డిమాండ్ గల ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు.. కాస్త రేట్లు పెంచినా నిలదొక్కుకోగలవు. సర్వీస్ కంపెనీలు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సర్వీస్ ఆధారిత కంపెనీలు, రంగాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా ఉండదు. అధిక వేల్యుయేషన్లు, మాంద్యం రిసు్కల భయాలతో 2022లో గణనీయంగా కరెక్షన్కి లోనైన ఈ తరహా సంస్థలపై దృష్టి పెట్టవచ్చు. భారీ వేల్యుయేషన్లు, బలహీన నగదు ప్రవాహాలు ఉన్న కొత్త తరం టెక్ కంపెనీల్లో స్వల్పకాలికంగా ఒడిదుడుకులు ఉండవచ్చు. ఒక మోస్తరు వేల్యుయేషన్, పటిష్టమైన బ్యాలెన్స్ షీటు గల ఇన్ఫీ, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి పూర్తి ఐటీ కంపెనీలు మెరుగ్గా ఉంటాయి. రుణరహితమైనవి లేదా రుణభారం తక్కువగా ఉండి, వడ్డీ రేట్ల ప్రభావానికి లోను కాని కంపెనీలు.. మార్కెట్ను మించి రాబడులు అందించగలవు. తయారీ రంగ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు వర్తించే రంగాల ఆశావహంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పర్యావరణ అనుకూల ఇంధనం, 5జీ, ఇథనాల్, డిఫెన్స్ మొదలైన పరిశ్రమలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. అయితే, పనితీరు స్థాయి, వేల్యుయేషన్లతో ఆయా కంపెనీలు ఎంత మేర లబ్ధి పొందగలవనేది పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి. వీటిలో చాలా మటుకు సంస్థల వేల్యుయేషన్ ఎక్కువగానే ఉంటోంది. ఇక, సైక్లికల్స్ అయిన మెటల్స్, ఇన్ఫ్రా, ఆయిల్.. మైనింగ్ రంగాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అలాగే అంతర్జాతీయ వ్యాపారాల్లోను పెట్టుబడులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం శ్రేయస్కరం. స్మాల్ క్యాప్స్ ఆకర్షణీయం.. 2022లో బాగా కుదేలైన స్మాల్ క్యాప్ స్టాక్స్ దీర్ఘకాలిక ప్రాతిపదికన పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ షేర్లు కోలుకుని దీర్ఘకాలిక సగటు వేల్యుయేషన్ స్థాయుల్లో ట్రేడవుతున్నాయి. లార్జ్ క్యాప్ షేర్లు సగటుకు మించి ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన దేశంగా భారత్ నిలుస్తోంది. దేశీ నిఫ్టీ50 సూచీ .. ఎస్అండ్పీ 500తో పోలిస్తే 20 శాతం, ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్తో పోలిస్తే 100 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. మిగతా సంపన్న, వర్ధమాన మార్కెట్లు కోలుకునే కొద్దీ స్వల్ప, మధ్యకాలికంగా భారత్ ఆకర్షణీయత కాస్త తగ్గవచ్చు. ఏది ఏమైనా.. విలువ గల షేర్లను, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనేది భవిష్యత్ పెట్టుబడులకు ప్రధాన సూత్రంగా ఉండాలి. ఎకానమీ మందగిస్తుండటం, వడ్డీ ఈల్డ్లు ఆకర్షణీయంగా మారుతున్న నేపథ్యంలో ఒక మోస్తరు రిస్కు తీసుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీకి 60 శాతం, డెట్కు 40 శాతం కేటాయించే సమతూక విధానాన్ని పాటించవచ్చు. -
ఆర్ఆర్ కేబుల్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లుసహా ఎఫ్ఎంఈజీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా వచ్చే మే నెలలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక దరఖాస్తును దాఖలు చేసే అవకాశముంది. ఆర్ఆర్ గ్లోబల్ గ్రూప్ కంపెనీ రానున్న మూడేళ్లపాటు ప్రతీయేటా టర్నోవర్ను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెరసి 2026కల్లా రూ. 11,000 కోట్ల అమ్మకాలు అందుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీగోపాల్ కాబ్రా తెలియజేశారు. 2023–24 మూడో త్రైమాసికంలో ఐపీవో చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
దేహాత్ రూ.486 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్ దేహాత్ రూ.486 కోట్ల నిధులను సమీకరించింది. సోఫినా వెంచర్స్, టెమసెక్తోపాటు ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఆర్టీపీ గ్లోబల్ పార్ట్నర్స్, ప్రోసస్ వెంచర్స్, లైట్రాక్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. కంపెనీ నిధులు సమీకరించడం గడిచిన రెండేళ్లలో ఇది మూడోసారి. 2012లో దేహాత్ ఏర్పాటైంది. 10,000లకు పైచిలుకు దేహాత్ సెంటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 15 లక్షల మంది రైతులను డిజిటల్ వేదికగా కొనుగోలుదార్లతో అనుసంధానించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
స్టాక్ మార్కెట్ కంటే రిస్క్ తక్కువ..సిప్లోకి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
న్యూఢిల్లీ:ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన రూ.12,976 కోట్లను అధిగమించాయి. సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మార్కెట్ ర్యాలీల్లో, పతనాల్లోనూ పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుంది. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి రిస్క్ తగ్గుతుంది.దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పైగా నెలవారీ సంపాదనకు అనుగుణంగా ప్రణాళిక మేరకు, నిర్దేశిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ సానుకూలతలపై రిటైల్ ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, దీని రూపంలో వచ్చే పెట్టుబడులు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మే నెలలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు చొప్పున వచ్చాయి. ఏప్రిల్ నెలకు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ఏడు నెలల్లో రూ.87,000 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. ‘‘మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక రేట్ల పెంపునకు స్పందిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తులు, ఫోలియోల్లోనూ వృద్ధి ఉన్నట్టు చెప్పారు. అక్టోబర్ నెలలో కొత్తగా 9.52 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే నంబర్ను ఫోలియోగా పేర్కొంటారు. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య అక్టోబర్ చివరికి 5.93 కోట్లకు చేరింది. సిప్ రూపంలో స్థిరమైన పెట్టుబడుల రాక మన ఈక్విటీ మార్కెట్లలో కొంత స్థిరత్వానికి సాయపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీల్లోకి రూ.9,390 కోట్లు ఇక అక్టోబర్ నెలకు ఈక్విటీ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా 20వ నెలలోనూ (2021 మార్చి నుంచి) ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్టయింది. కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.14,100 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. మార్కెట్లలో అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.147 కోట్లు వచ్చాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.2,818 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని రకాల విభాగాలు కలిపి చూస్తే ఫండ్స్ పరిశ్రమలోకి అక్టోబర్లో రూ.14,047 కోట్లు వచ్చాయి. దీంతో ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.39.5 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ చివరికి ఇది రూ.38.4 కోట్లుగా ఉంది. -
భారత్ పెట్టుబడులకు స్వర్గధామం : ప్రధాని మోదీ
-
ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పనితీరును మార్చడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసి అధిక లాభాలు ఆర్జించడంపైనా, ఇన్వెస్టర్లకు మరింత రాబడులు అందించడంపైనా దృష్టి సారించాలని ఒత్తిడి పెంచుతోంది. (Jay Y Lee శాంసంగ్కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు) ఇందులో భాగంగా కొత్త తరాన్ని కూడా ఆకర్షించేలా పథకాల వ్యూహాలను మార్చుకోవాలని, లాభ దాయకతను పెంచేలా మరిన్ని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టడాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సమీక్షలో సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా 65 ఏళ్ల సంస్థను ఆధునీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) అలాగే పథకాలను కూడా ఆధునీకరించేలా మేనేజ్మెంట్తో కలిసి పని చేస్తు న్నట్లు అధికారి వివరించారు. రూ. 902-949 ధర శ్రేణితో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీని ద్వా రా ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్లు వచ్చాయి. (Hero MotoCorp ఫిలిప్పైన్స్లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) అయితే, మే 17న లిస్టింగ్ తొలి రోజే ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 872 వద్ద లిస్టయిన ఎల్ ఐసీ షేరు అప్పటి నుంచి కోలుకోలేదు. ప్రస్తు తం రూ. 595 దగ్గర ట్రేడవుతోంది. కానీ వచ్చే ఏడా ది వ్యవధిలో ఎల్ఐసీ షేరు బాగా రాణిస్తుందని కొన్ని బ్రోకరేజీలు బులిష్గా ఉన్నాయి. రేటు రూ. 1,000 స్థాయికి చేరవచ్చని సిటీ అంచనా వేసింది. -
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
స్టాక్ మార్కెట్: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల ఏడురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒకటిన్నర శాతం పతనమూ సూచీల నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టంతో 59,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,656 వద్ద నిలిచింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లు రాణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ అర శాతం లాభపడగా, స్మాల్క్యాప్ సూచీ 0.35% చొప్పున నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.247 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.872 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్కాంగ్, తైవాన్, కొరియా, ఇండోనేషియా, చైనా దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ సూచీలు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 60వేల స్థాయి నుంచి వెనక్కి సెన్సెక్స్ ఉదయం 171 పాయింట్ల లాభంతో 60,003 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 17,808 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,081 గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 59,489 పాయింట్ల వద్ద కనిష్టానికి దిగివచ్చింది. నిఫ్టీ 17,637–17,812 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్లకు సెలవు బలిప్రతిపద సందర్భంగా (నేడు)బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ‘మూరత్ ట్రేడింగ్’లో లాభాలు దీపావళి(హిందూ సంవత్ 2079 ఏడాది)సందర్భంగా సోమవారం జరిగిన ‘మూరత్ ట్రేడింగ్’లో దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.15 నిమిషాల మధ్య జరిగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 17,731 వద్ద స్థిరపడింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
బంగారం: ఈ తరహా పెట్టుబడులు బెస్ట్!
ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలు మొదలైన ప్రతికూల పరిణామాలు నెలకొన్నప్పటికీ 2022లో పసిడి ఇన్వెస్టర్లకు అంతగా కలిసి రాలేదు. అయినప్పటికీ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా పసిడి రేట్ల తీరుతెన్నులు చూస్తే.. బంగారం ధరలు 2021లో 4 శాతం మేర తగ్గాయి. ఒక దశలో రూ. 43,320కి (పది గ్రాములు) పడిపోయాయి. అక్కణ్నుంచి సుమారు 28 శాతం ర్యాలీ చేసి 2022 మార్చిలో రూ. 55,558కి చేరాయి. దీన్ని బట్టి చూస్తే బంగారానికి దీర్ఘకాలిక ట్రెండ్ ఇంకా సానుకూలంగానే ఉంది. సాంకేతికంగా గత ఆర్థిక సంవత్సరంలో బంగారం ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 56,191–ఇటీవలి కనిష్టమైన రూ. 43,320 స్థాయుల మధ్య తిరుగాడింది. ప్రస్తుతం సుమారు రూ. 51,000 స్థాయిలో ఉన్న పసిడి వచ్చే ఏడాది దీపావళి నాటికి రూ. 56,000కు చేరుకోవచ్చు. కాబట్టి తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయొచ్చు. టెక్నికల్గా చూస్తే రూ. 46,000–46,300 మద్దతుగా ఉంటుంది. దాన్ని కోల్పోతే రూ. 41,000కు తగ్గవచ్చు. మరోవైపు, రూ. 55,200–56,100 నిరోధ స్థాయిగా ఉండొచ్చు. దాన్ని దాటేస్తే రూ. 61,500 అటుపైన రూ. 66,000 వద్ద గట్టి నిరోధం ఎదురుకావచ్చు. చదవండి: ముదురుతున్న మూన్లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది! -
మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: అపారమైన సహజ వనరులు, ప్రగతిశీల విధానాలు గల తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఒడిశాలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఒడిశా ప్రభుత్వం, ఫిక్కి సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భువనేశ్వర్లో నిర్వహించే ‘‘మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 22’’కార్యక్రమానికి సన్నాహకంగా హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో సోమవారం పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఒడిశా నిలిచిందన్నారు. భువనేశ్వర్లో ఐటీ కంపెనీల ఏర్పాటు వేగంగా సాగుతోందని, ఒడిశా స్టార్టప్ హబ్ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్ కేశరి దేబ్, ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల యజమానులు సమావేశంలో పాల్గొన్నారు. -
పీఈ పెట్టుబడులు 77 శాతం డౌన్
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 3.84 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏకంగా 77.5 శాతం క్షీణించాయి. సీక్వెన్షియల్గా జూన్ క్వార్టర్తో పోలిస్తే 43.5 శాతం తగ్గాయి. 2021 మూడో త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు 17.05 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.80 బిలియన్ డాలర్లు వచ్చాయి. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ గ్రూప్లో భాగమైన రెఫినిటివ్ సమీకరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో పీఈ పెట్టుబడులు 33 శాతం క్షీణించి 19.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, భారత్ ఆధారిత పీఈ ఫండ్స్ తొలి తొమ్మిది నెలల్లో 8.98 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 123 శాతం అధికం. తగ్గిన డీల్స్.. : డేటా ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో డీల్స్ 14.6 శాతం తగ్గాయి. 478 నుంచి 408కి పడిపోయాయి. అయితే, జూన్ త్రైమాసికంలో నమోదైన 356 డీల్స్తో పోలిస్తే 14.6 శాతం పెరిగాయి. తొలి తొమ్మది నెలల్లో ఇంటర్నెట్ సంబంధ కంపెనీల్లోకి పెట్టుబడులు 52 శాతం తగ్గి 7.47 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి 29 శాతం పెట్టుబడులు తగ్గాయి. అటు ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీల్లోకి వచ్చే నిధులు 25.7 శాతం, ఇండస్ట్రియల్స్లోకి 12.4 శాతం క్షీణించాయి. రవాణా రంగంలోకి మాత్రం 56.8 శాతం, కమ్యూనికేషన్స్లో 950 శాతం, కంప్యూటర్ హార్డ్వేర్ సంస్థల్లోకి 197 శాతం పెరిగాయి. టాప్ డీల్స్లో కొన్ని.. వెర్స్ ఇన్నోవేషన్ (827.7 మిలియన్ డాలర్లు), థింక్ అండ్ లెర్న్ (800 మిలియన్ డాలర్లు), బండిల్ టెక్నాలజీస్ .. భారతి ఎయిర్టెల్ (చెరి 700 మిలియన్ డాలర్లు), టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (494.7 మిలియన్ డాలర్లు) మొదలైనవి టాప్ డీల్స్లో ఉన్నాయి. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
క్యూ2 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: దేశీయ సూచీలు ఈ వారం కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి మందగమన భయాల నేపథ్యంలో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అర్థిక మాంద్య భయాలు, మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాలు నేపథ్యంలో గతవారంలో సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొని ఉన్న అనిశ్చితుల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. అయితే దేశీయ పండుగ సీజన్ డిమాండ్, క్యూ2 ఆర్థిక ఫలితాల ఫలితాల జోష్ అస్థిరతలను పరిమితం చేయోచ్చు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, స్పెషాలిటీ కెమికల్స్, మౌలిక రంగ షేర్లు రాణించే వీలుంది. గడిచిన మూడు వారాలుగా నిఫ్టీ 16,800–17,350 స్థాయిల పరిధిలో ట్రేడవుతోంది. కొనుగోళ్లు కొనసాగితే 17,100 వద్ద తక్షణ నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అటు పిదప 17,700 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,800 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 300 కంపెనీలు రెడీ ముందుగా నేడు మార్కెట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్మార్ట్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఏసీసీ, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హావెల్స్ ఇండియా, పీవీఆర్, ఎల్అండ్టీ టెక్నాలజీస్ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. మాంద్యం భయాలు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, మాంద్య భయాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిరతలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలర్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ ఒకశాతానికి పైగా బలపడింది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం జీవితకాల కనిష్టం(82.350) వద్ద స్థిరపడింది. ఇటీవల భారత మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్లు సైతం ‘‘బేరీష్’’ వైఖరి ప్రదర్శిస్తున్నారు. రేపు అమెరికా సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఉండొచ్చు. ప్రథమార్థంలో రూ.7500 కోట్ల ఉపసంహరణ దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ‘‘బేరీష్’’ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో(1–14 తేదీ ల మధ్య) రూ.7,500 కోట్లను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠి న ద్రవ్య విధాన అమలుతో ఆర్థిక మాంద్యం మొ దలవుతుందనే భయాలు ఎఫ్పీఐల్లో నెలకొన్నట్లు నిపుణులు తెలిపారు. ఆగస్టులో రూ.51,200 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఈ ఏడాది పది నెలల్లో రూ.1.76 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: అమెజాన్ మైండ్బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్! -
యాక్సిస్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్..
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ .. నాస్డాక్ 100 టీఆర్ఐ ఆధారిత ఈటీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. హితేష్ దాస్ దీనికి ఫండ్ మేనేజరుగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్ఎఫ్వో అక్టోబర్ 21న ముగుస్తుంది. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. పేరొందిన టెక్ కంపెనీలతో పాటు హెల్త్కేర్ తదితర రంగాల కంపెనీలు నాస్డాక్ 100 సూచీలో భాగం. అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టడం ద్వారా లబ్ధి పొందే అవకాశంతో పాటు రూపాయి పతనాన్ని హెడ్జ్ చేసుకునేందుకు కూడా ఈ ఫండ్ ఉపయోగపడగలదని సంస్థ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు. చదవండి: బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. క్లీన్ ఎనర్జీ, పోర్ట్లు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ వ్యాపార విస్తరణలో ఇప్పటికే దూకుడుగా ఉన్న సంస్థ తన విస్తరణ ప్రణాళికపై మరింత వేగం పెంచింది. దాదాపు 10 బిలియన్ల డాలర్ల మేర విదేశీ నిధులు సమకీరించనుంది. ముఖ్యంగా సింగపూర్ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్ , సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీతోతో సహా పలు పెట్టుబడిదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు మింట్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది. అదానీ గ్రూపుకుటుంబ సభ్యులు, టాప్ గ్రూప్ పలువురు ఎగ్జిక్యూటివ్లు ఈ పెట్టుబడిదారులతో చర్చలు జరిపినట్టు నివేదించింది. పలు దఫాలుగా గ్రూపు సంస్థలు, ప్రమోటర్ గ్రూప్-అనుబంధ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. అయితే జీఐసీ అదానీ గ్రూప్ ఈ వార్తలపై స్పందించలేదు. అలాగే మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు టెమాసెక్ తిరస్కరించింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, డాటా సెంటర్లు తదితర వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ రాబోయే దశాబ్దంలో 100 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నామని, ఇందులో ఎక్కువ భాగం న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలో ఈ పెట్టుబడులుంటాయిన అదానీ గ్రూపు ఛైర్మన్ అదానీ గత నెలలో ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నామని ఇటీవలి ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవోల సదస్సులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 143 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు అదానీ. -
సెన్సెక్స్.. బౌన్స్ బ్యాక్!
ముంబై: ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులు తదుపరి ఆర్బీఐ ప్రకటించిన జీడీపీ, ద్రవ్యోల్బణ అంచనాలతో దూసుకెళ్లాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో సాంకేతికంగా కీలకమైన స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు జమ చేసుకుని 57,427 వద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగసి 17,094 వద్ద స్థిరపడింది. కొత్త సిరీస్(అక్టోబర్) తొలి రోజు ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్లే 0.5 శాతం రెపో పెంపు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్యాంకింగ్, మెటల్ జోరు..: ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఆటో, వినియోగ వస్తువులు 3–1.5% మధ్య ఎగశాయి. హిందాల్కో, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్ ద్వయం, కొటక్ బ్యాంక్, టైటన్, హెచ్డీఎఫ్సీ ద్వయం, టాటా స్టీల్, ఐసీఐసీఐ, యూపీఎల్, మారుతీ, యాక్సిస్ 5.6–2.3% మధ్య జంప్చేశాయి. ►5జీ సేవలు ప్రారంభంకానుండటంతో ఎయిర్టెల్ షేరు సరికొత్త గరిష్టం రూ. 809ను తాకింది. చివరికి 4.6% జంప్చేసి రూ. 800 వద్ద ముగిసింది. ►ప్రమోటర్ సంస్థ స్పిట్జీ ట్రేడ్ 40 లక్షల షేర్లను కొనుగోలు చేసిన వార్తలతో అదానీ గ్రీన్ ఎనర్జీ 12.5 శాతం దూసుకెళ్లింది. రూ. 2,253 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,405కు ఎగసింది. ►పవర్గ్రిడ్ నుంచి రూ. 333 కోట్ల విలువైన ఆర్డర్ను పొందిన వార్తలతో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 1,192 వద్ద ముగిసింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!
తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడికి అధికంగా లాభాలు రావాలని ఏ ఇన్వెస్టరైనా భావిస్తాడు. అయితే అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నప్పటికీ సరైన ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే, లాభాలనిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Gensol Engineering Ltd ).. గత 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్లలో ఒకటిగా నిలివడంతో పాటు ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టుల కోసం సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో ప్రస్తుత ప్రాజెక్ట్లను కలిగి ఉంది. వామ్మో.. రూ. లక్షకి 20 లక్షలు ఇటీవల జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు రూ. 1,390.65 వద్ద ముగిశాయి. అయితే అంతకుముందు షేర్ రూ.1,426.45 వద్ద ముగిసింది. క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 2.51% తగ్గింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ని గమనిస్తే దీని ధర గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. బహుశా ఈ స్థాయిలో పెరుగుతుందని అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఊహించిఉండరేమో. ఈ షేర్ ధరపై ఓ లుక్కేస్తే.. గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా ఉండేది. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఈ స్టాక్ రూ.1,390.65కి చేరుకుంది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ₹ 21.93 లక్షల రాబడినిచ్చింది. ఇదే షేర్ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇస్తూ ఇన్వెస్టర్లకి కాసుల పంట కురిపించిందనే చెప్పాలి. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది. ఇటీవలే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), భారత ప్రభుత్వం, బ్రైత్వైట్ & కో. లిమిటెడ్ (BCL) సహా క్లయింట్ల నుంచి రూ. 531 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో దాదాపు 121 MWp సామర్థ్యంతో నిర్మించనున్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వయసు 30 ఏళ్లు. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. సిప్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అనుకూలం? మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి అభినందనలు. పెట్టుబడులను మరీ ఆలస్యం చేయొద్దంటూ తరచుగా మేము చెబుతుంటాం. మీరు పన్ను ఆదా చేయడం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్టు అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మంచి ఆప్షన్ అవుతుంది. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ఈ ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవేళ మీరు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేట్లు అయితే అందుకు ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనమే అవుతుంది. ఇవి పూర్తి ఈక్విటీ పథకాలు. వేర్వేరు మార్కెట్ పరిమాణంతో కూడిన, వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. దీంతో దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడినిస్తాయి. అయితే, వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుందని మర్చిపోవద్దు. సిప్ అయితే విడిగా ప్రతి సిప్ పెట్టుబడికి మూడేళ్లు అమలవుతుంది. ఒకవేళ మీరు ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్ను ఆదాను కోరుకోనట్టయితే.. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను ఆదా ప్రయోజనాన్ని వాడుకుని ఉంటే, అప్పుడు మీ ప్రణాళిక వేరే విధంగా ఉండొచ్చు. మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు సాధారణంగా 65 నుంచి 80 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలకు కేటాయిస్తాయి. డెట్ అన్నది ఈక్విటీలతో సంబంధం లేనిది. డెట్ పెట్టుబడుల రాబడులు ఈక్విటీల మాదిరిగా భారీ అస్థిరతలకు లోను కావు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుంది. కనుక ఈఎల్ఎస్ఎస్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. రెండు నుంచి మూడేళ్ల పాటు వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, ఈక్విటీలు ఎలా పనిచేస్తాయో అవగాహన వచ్చిన తర్వాత.. అప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలైన.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను దీర్ఘకాల లక్ష్యాల కోసం ఎంపిక చేసుకోవచ్చు. నేను రూ.50,000 మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా ను. మా పిల్లల విద్య కోసం ఆరు నెలల తర్వాత ఈ మొత్తం కావాల్సి ఉంది. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇంత స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందు లక్ష్యం విషయంలో రాజీ పడడానికి అవకాశం ఉండదు. ఎంతో కాలం లేదు కనుక పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే కొనసాగించుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి. పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఆరు నెలలే ఉంది కనుక కచ్చితంగా ఆ సమయానికి పెట్టుబడిని రాబడితో పాటు సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులో చేసే డిపాజిట్ రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి బీమా ఉంటుంది. ఇవి కాకుండా లిక్విడ్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్ ఫండ్స్లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
డెట్లో నమ్మకమైన రాబడి
స్వల్ప కాల లక్ష్యాలకు డెట్ సాధనాలే అనుకూలం. ఈక్విటీలంటే కనీసం ఐదేళ్లు అంతకుమించి వ్యవధి కావాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారి కోసం, స్వల్పకాల లక్ష్యాల కోసం డెట్ ఫండ్స్లో.. తక్కువ రిస్క్, మెరుగైన రాబడుల కోసం చూసే వారికి మనీ మార్కెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవచ్చు. 2018–20 మధ్యకాలంలో డెట్ మార్కెట్లో రుణ చెల్లింపుల ఎగవేతలు, సంక్షోభ సమయంలోనూ మనీ మార్కెట్ ఫండ్స్ విభాగం బలంగా నిలబడింది. పెట్టుబడుల విధానం.. ఇవి తక్కువ కాల వ్యవధి కలిగిన సాధనాల్లో (సాధారణంగా ఏడాదిలోపు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక క్రెడిట్ రిస్క్ భయం అక్కర్లేదు. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. అందుకని ప్రస్తుత తరుణంలో ఈ పథకాలు ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు. తక్కువ రిస్క్ కోరుకునే వారికి కూడా అనుకూలం. ఈ విభాగంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా నాలుగు పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి.. ఆదిత్య బిర్లా సన్లైఫ్ (ఏబీఎస్ఎల్) మనీ మేనేజర్, హెచ్డీఎఫ్సీ మనీ మార్కెట్, ఎస్బీఐ సేవింగ్స్, నిప్పన్ ఇండియా మనీ మార్కెట్. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వీటిని పరిశీలించొచ్చు. ఈ పథకాలన్నీ కూడా కనీసం రూ.10వేల కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులు కలిగి ఉన్నవి కావడం గమనించాలి. రాబడులు మనీ మార్కెట్ ఫండ్స్ మూడేళ్లకు పైన పన్ను అనంతరం రాబడుల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన పనితీరు చూపించాయి. డెట్ పథకాల్లో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులు కొనసాగించినట్టయితే, లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనిస్తే ఈ మూడు పథకాల్లోనూ వార్షికంగా 7.5 శాతానికి పైనే ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఇవి మనీ మార్కెట్ ఫండ్స్ విభాగంలో రాబడుల పరంగా మెరుగైన స్థానంలో నిలిచాయి. మూడేళ్లలో సగటున రోలింగ్ రాబడి 7.5–7.8 శాతం చొప్పున ఉంది. ఈ కాలంలో గరిష్ట రాబడి 8.9–9.5 శాతం వరకు ఉంటే, కనిష్ట రాబడి 5–5.2 శాతం మధ్య ఉంది. ఒక్క 2021 సంవత్సరాన్ని మినహాయిస్తే గడిచిన పదేళ్ల కాలంలో ఈ పథకాల్లో రాబడి 6.29–9.2 శాతం మధ్య ఉంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో రేట్లు 6–7 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. మూడేళ్లకు మించిన కాలానికి వచ్చే రాబడిపై 20 శాతం పన్ను పడుతుంది. కాకపోతే రాబడి నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించుకోవచ్చు. ఇండెక్సేషన్ ప్రయోజనం వల్ల రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు. కనుక మూడేళ్లు, ఐదేళ్ల పాటు పెట్టుబడులపై ఈ పథకాల్లో పన్ను అనంతరం నికర వార్షిక రాబడి 7 శాతానికి పైనే, అది కూడా రిస్క్ లేకుండా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో ఈ నాలుగు పథకాలూ తక్కువ రిస్క్ పోర్ట్ఫోలియో కలిగి ఉన్నాయి. వీటి పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ (కాల వ్యవధి ముగియడం) 0.28–0.38 సంవత్సరాలుగా ఉంది. అంటే ఏడాదిలో ఒకటో వంతు. 71–113 వరకు సెక్యూరిటీ సాధనాల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ఒక సాధనంలో 5 శాతానికి మించి పెట్టుబడులు లేవు. వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఫండ్స్లోకి భారీగా కొత్త పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ వేదికల అనుసంధానత, మ్యూచువల్ ఫండ్స్ పథకాల పట్ల పెరుగుతున్న అవగాహన ఫలితాలనిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్ట్) 70 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభం కావడం గమనార్హం. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి చివరికి ఫోలియోలు 12.95 కోట్లుగా ఉన్నాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 కోట్ల చొప్పున కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈ గణాంకాలు ఫండ్స్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్త ఇన్వెస్టర్ల రాకను సూచిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. డీమోనిటైజేషన్ గృహ పొదుపులు డిజిటలైజ్కు దారితీసిందని, దీనికితోడు రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాకకు సాయపడినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ప్రజల్లో మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన పెరగడం, ప్రచార కార్యక్రమాలు, సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం, డిజిటలైజేషన్ పెరగడం, మహిళల భాగస్వామ్యం ఫోలియోలు పెరిగేందుకు కారణాలుగా ఎల్ఎక్స్ఎంఈ ఎండీ ప్రీతిరాతి గుప్తా పేర్కొన్నారు. అలాగే, సంప్రదాయ సాధనాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడడం పెరిగినట్టు చెప్పారు. ఎల్ఎక్స్ఎంఈ అన్నది కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన తొలి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావడం గమనించాలి. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా ఈ ఏడాది మార్చి నాటికి 55.2 శాతంగా ఉంటే, ఆగస్ట్ చివరికి 56.6 శాతానికి చేరింది. మ్యూచువల్ ఫండ్స్లో ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఒక ఖాతా ఉంటుంది. ఒక ఇన్వెస్టర్కు ఒకే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పరిధిలో ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు ఉండొచ్చు. కనుక ఒకే ఇన్వెస్టర్కు ఎక్కువ సంఖ్యలో ఖాతాలు ఉంటాయి. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 57,981కి పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్గా సెన్సెక్స్ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్ అయితే అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఫెడ్ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనం,ఎఫ్ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్లుక్ను బేరిష్గా మార్చాయి. దీనికి తోడుఫెడ్బాటలోనే ఆర్బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు నుంచి రూ.12,000 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–16 వరకు దేశీ ఈక్విటీల్లోకి నికరంగా రూ.12,084 కోట్ల పెట్టుబడులను జోప్పించారు. యూఎస్ ఫెడ్ సహా అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో దూకుడు తగ్గించుకుంటాయన్న అంచనాలే నికర పెట్టుబడులకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ నెలలోనూ ఎఫ్పీఐల నికర పెట్టుబడులు రూ.51,200 కోట్లుగా ఉండగా, జూలైలో రూ.5,000 కోట్లు కావడం గమనార్హం. వరుసగా తొమ్మిది నెలల పాటు భారత ఈక్విటీల్లో నికర విక్రయాల తర్వాత జూలై నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడుల బాట పట్టడం తెలిసిందే. అయితే, వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సమీప కాలంలో ఎఫ్పీఐ పెట్టుబడుల్లో ఆటుపోట్లు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. అనుకూలం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిదానంగా వెళ్లొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కాస్త శాంతించడంతో భారత ఈక్విటీలు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోవడం కంటే కొనసాగడమే మంచిదన్న అభిప్రాయంతో వారున్నట్టు తెలిపారు. ఇక ఈ నెలలో 16వ తేదీ వరకు ఎఫ్పీఐలు డెట్ మార్కెట్లో నికరంగా రూ.1,777 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్తో ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి!
నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా? మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు. ‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ స్టాక్ స్ప్లిట్నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్గా దీనివల్ల నాకు ఏం జరగనుంది? దయచేసి వివరాలు తెలియజేయగలరు. సాధారణంగా ఫండ్ హౌస్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్ యూనిట్ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్ ఎన్ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్ను స్ప్లిట్ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఆరంభంలో 2.21 లక్షల కోట్లు హుష్ కాకి, కానీ చివర్లో
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలనుంచి కోలుకున్నా చివరకు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభం నష్టాల నుంచి కోలుకున్నాయి. అలాగే మిడ్ సెషన్ తరువాత లాభాల్లోకి మళ్లాయి సూచీలు. కానీ చివరి గంటలోతిరిగి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 60,347 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు లేదా 0.4 శాతం నష్టంతో 18004 వద్ద స్థిరపడ్డాయి. ఫైనాన్షియల్స్, మెటల్లాభపడగా, ఐటీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. గ్లోబల్ మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేసినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలకు పైన నిలబడటం విశేషం. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ఇండెక్స్లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 37 పైసలు క్షీణించి 79.44 వద్ద ముగిసింది. కాగా, అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ ట్రెండ్, ఫెడ్ భారీగా వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల మధ్య మార్కెట్లో బుధవారం నాటి ఆరంభ ట్రేడింగ్లో పెట్టుబడిదారుల సంపద రూ. 2.21 లక్షల కోట్లకు పైగా తుడుచుపెట్టుకు పోయింది. అయితే ఈ నష్టాలనుంచి కోలుకోవడంతో కాస్త ఇన్వెస్టర్లు కాస్త ఊరట చెందారు. -
ఈక్విటీల్లో రిటైలర్లకు రాబడులు అంతంతే!
ముంబై: గడిచిన రెండు దశాబ్దాల్లో ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. కానీ, ఈ ప్రయాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పొందిన రాబడులు (సొంతంగా) మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, మార్కెట్లు ప్రతికూలంగా మారిపోతే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను వేగంగా మార్చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన వివరాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. 2003 నుంచి 2022 వరకు (20 ఏళ్లు) ఈక్విటీ మార్కెట్లు, డెట్ ఫండ్స్కు సంబంధించి 2009–2022 (14 ఏళ్లు) గణాంకాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ విభాగాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు కనిష్ట స్థాయిలో ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ రాబడులు గరిష్టంగా ఉన్నాయి. ఇదీ వ్యత్యాసం.. 2003 నుంచి 2022 మధ్య మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ పెట్టుబడులపై సగటున 19.1 శాతం వార్షిక రాబడులను సంపాదించాయి ఇదే కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 13.8 శాతంగానే ఉంది. ఇక సిప్ ద్వారా వచ్చిన రాబడులు 15.2 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 7.4 శాతం మేర ఉంటే, ఫండ్స్ సంస్థలకు 12.5 శాతం చొప్పున వచ్చాయి. ఇక్కడ కూడా సిప్ రాబడి 10.1 శాతానికి పరిమితమైంది. ఇక పూర్తిగా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు 6.6 శాతం మేర వార్షిక రాబడి సంపాదించగా, సిప్ ఫండ్స్ సంస్థల రాబడి 7 శాతం చొప్పున ఉంది. ఎందుకని..? మరి రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు ఎందుకు తక్కువగా ఉన్నాయి..? మార్కెట్లు అస్థిరంగా మారిన వెంటనే ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ను వేగంగా మార్చేస్తుండడం రాబడులను దెబ్బతీస్తోంది. మార్కెట్ ధోరణికి తగ్గట్టు పరుగెత్తకుండా.. పూర్తి మార్కెట్ సైకిల్ వరకు పెట్టుబడులను కొనసాగించడమే దీనికి పరిష్కారమని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో సూచించింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా నిర్ణీత కాలానికి) రాబడులు అధ్యయనంలోకి తీసుకుంది. స్వల్పకాల మార్కెట్ల అస్థిరతలను చూసి సిప్ నిలిపివేస్తే, అసలు లక్ష్యమే దెబ్బతింటుందని యాక్సిస్ మ్యాచువల్ ఫండ్ హెచ్చరించింది. అస్థిరతల్లో స్థిరత్వం కోల్పోకుండా, పెట్టుబడులను నమ్మకంగా కొనసాగించడం.. అది సాధ్యం కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఈ నివేదిక తెలియజేస్తోంది. -
వావ్.. మార్కెట్లో భారీగా పెరుగుతున్న ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి
సాక్షి, ముంబై: దేశంలో స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేయడం విశేషం. కోవిడ్కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య 40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం. బుల్లిష్ మార్కెట్ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్లో డీప్ కరెక్షన్ కారణంగా జూన్లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు -
డెట్ ఫండ్స్కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70,213 కోట్లను ఉపసంహరించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ఇందుకు దారితీసింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్య పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు మరికొంత తగ్గొచ్చు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ తెలిపారు. జూన్ చివరికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 5 శాతం తగ్గి రూ.12.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ చివరికి ఇవి రూ.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి రూ.14.16 లక్షల కోట్లు. -
రాబడి కోసం కొత్త మార్గం..!
కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు. సంప్రదాయ డెట్ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ఇన్వాయిస్ ఫైనాన్స్ / డిస్కౌంటింగ్ అంటే... ఇన్వాయిస్ ఫైనాన్స్, డిస్కౌంటింగ్ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్ను నోట్బుక్ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్బుక్ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను రూ.90వేలకే ఒక ప్లాట్ఫామ్లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ డీల్లో పేపర్ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్ తయారీ కంపెనీ నోట్ బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు. ఎలా పనిచేస్తుంది..? ఇది స్టార్టప్ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్ఇన్వెస్ట్, క్రెడ్ఎక్స్ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తుంటాయి. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్బీఎఫ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు ‘ఇన్వాయిస్ ఫైనాన్స్/ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్వాయిస్ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్వాయిస్లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి. సౌకర్యవంతం... ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్లైన్ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్ఫామ్లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్ఫామ్పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్ చేసే ఇన్వాయిస్లను ఆయా ప్లాట్ఫామ్లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్తో సంయుక్తంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల అవకాశాలు జిరాఫ్ ప్లాట్ఫామ్.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్కు సంబంధించి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్ డీల్ను లిస్ట్ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఏర్పడితే... డిఫాల్ట్ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్ను క్లోజ్ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్ ప్లాట్ఫామ్పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ డీల్ కూడా ఉంది. క్రెడ్ఎక్స్ ప్లాట్ఫామ్లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తోంది. సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్వాయిస్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది. ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం. రిస్క్లు ఏమిటంటే.. ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్ఫామ్లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్ఫామ్లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు. కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్ఫామ్లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్లో 7%, ఎఫ్డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది. ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్ తదితర అంశాల ఆధారంగా రిస్క్ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్వాయిస్లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్వాయిస్లపై రిస్క్ తక్కువగా ఉంటుంది. -
ఈక్విటీల్లో ఎఫ్పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
స్టాక్ మార్కెట్: ఏప్రిల్ 13 తర్వాత.. ఇదే తొలిసారి
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారమూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు కలిసొచ్చాయి. కేంద్రం వెల్లడించిన స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించగలిగాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 545 పాయింట్లు పెరిగి 58,115 వద్ద నిలిచింది. ఏప్రిల్ 13వ తేదీ తర్వాత సెన్సెక్స్ 58 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 17,340 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. కాగా, ఇటీవల జీవితకాల కనిష్టానికి దిగివచ్చిన రూపాయి రికవరీ క్రమంగా రికవరీ అవుతోంది. సోమవారం 18 పైసలు బలపడి నెలగరిష్ట స్థాయి 79.24 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా వాహన విక్రయాలు జూలైలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఆటో షేర్లు భారీగా గిరాకీ నెలకొంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇకపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 4 రోజులు: రూ.12.74 లక్షల కోట్లు 4 రోజుల ర్యాలీతో రూ.12.74 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► 5జీ స్పెక్ట్రం కోసం రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు పైగా బిడ్లు ధాఖలవడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. రిలయన్స్ 2.60% ఎగసి రూ.2,575 వద్ద స్థిరపడింది. ఎయిర్టెల్ షేరు 2.40% పెరిగి రూ.694 వద్ద ముగిసింది. చదవండి: ఆగస్ట్లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్ఫోన్లు ఇవే! -
అమెరికా ఎఫెక్ట్.. ఆ షేర్ల జోరు అదిరింది!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో పాటు యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, మారుతీ, టాటా స్టీల్ తదితర కీలక కంపెనీల కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో మూడు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 16,642 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. విస్తృతస్థాయిలో మధ్య తరహా షేర్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం ర్యాలీ చేసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40% పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 437 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.712 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 79.91 స్థాయి వద్ద స్థిరపడింది. ఫెడ్ పాలసీ ప్రకటనకు ముందు(బుధవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. క్యూ1లో నికర లాభం 45 శాతం వృద్ధి చెందడంతో ఎల్అండ్టీ షేరు 2.5% పైగా లాభపడి రూ.1,797 వద్ద ముగసింది. ప్రతి రెండు షేర్లకు ఒక షేరు (1:2) చొప్పున బోనస్గా ఇచ్చేందుకు బోర్డు అనుమతినివ్వడంతో గెయిల్ షేరు రెండుశాతం లాభంతో రూ.147 వద్ద నిలిచింది. -
స్టాక్ మార్కెట్: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కొత్త తరం కంపెనీల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 498 పాయింట్లు నష్టపోయి 55,268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 147 పాయింట్లు క్షీణించి 16,500 దిగువున 16,484 వద్ద నిలిచింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలోని మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,548 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నేటి (బుధవారం) రాత్రి ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ.., జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలతో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ను ప్రభావితం చేసే సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 563 పాయింట్లు క్షీణించి 55,203 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పతనమైన 16,631 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జొమాటో షేర్ల పతనం కొనసాగింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో 13% పతనమై రూ.41.25 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సరికి 12.41% నష్టంతో రూ.41.65 వద్ద నిలిచింది. ► 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం ప్రారంభమవడంతో టెలికం రంగ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఎయిర్టెల్ షేరు ఒకశాతం లాభపడగా, వొడాఫోన్ ఐడియా షేరు 1% నష్టపోయింది. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎలాంటి లాభ నష్టం లేకుండా ఫ్లాట్గా రూ. 2,420 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రం వేలం నేటితో ముగియనుంది. -
జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే?
సాక్షి, ముంబై: భారతీయ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోకు భారీ షాక్ తగిలింది. సోమవారం నాటి మార్కెట్లో జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో 14.3 శాతం కుప్పకూలాయి. లిస్టింగ్ తరువాత షేర్ లాకిన్ పీరియడ్ ముగియడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే జీవితకాలపు కనిష్టం 50.05ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత మరో రికార్డు కనిష్ట స్థాయి రూ.47.50కి చేరుకుంది. 2021 లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు, ఉద్యోగులు ఇతర పెట్టుబడిదారుల ఒక ఏడాది లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో జొమాటో షేర్లు రికార్డు పతనాన్ని నమోదు చేసింది. ఈ రోజు 14 శాతానికిపై గా క్రాష్ కాగా, లిస్టింగ్ అయినప్పటి నుండి జొమాటో విలువలో 60శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి.జూలై 23, 2021న ముంబై మార్కెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రానున్న ఆర్బీఐ పాలసి సమావేశాల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లు కుప్పకూలగా,నిఫ్టీ 118 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు కూడా 4 శాతం నష్టపోయింది. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? -
ఇన్వెస్టర్లకి అలర్ట్: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో.. ఓ లుక్కేద్దాం!
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల వెల్లడి, ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ఎక్స్పైరీ ముగింపుతో పాటు కీలక కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటన అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘స్టాక్ సూచీలు ఈ వారం తీవ్ర ఊగసలాటకు గురికావొచ్చు. బుధ, గురువారాల్లో వెలువడనున్న ముఖ్యంగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు, రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని శాసించవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే 16,800–850 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,250–16,500 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు గతవారంలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఐటీ, బ్యాంకింగ్, వినిమయ, మెటల్ షేర్లకు రాణించడంతో సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ ముందుగా నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కంపెనీల షేర్లకు నిఫ్టీ సూచీలో 30 శాతానికిపైగా వెయిటేజీ ఉంది. ఇక వారంలో నిఫ్టీ సూచీలో 18 కంపెనీలతో సహా సుమారు 400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, శ్రీ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీఐసీ, సన్ ఫార్మా కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(జూలై 26న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు (బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఫెడ్ కమిటీ గత సమీక్షలో చెప్పినట్లు 50–75 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపునకే కట్టడి ఉండొచ్చు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి అధికప్రాధాన్యతనిస్తూ ఒకశాతం పెంపునకు మొగ్గుచూపితే అది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లే అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎఫ్ఐఐల యూటర్న్ కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.ఈ జూలైలో ఇప్పటి వరకు(1–22 తేదీల్లో) రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్లో తిరిగి కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడం, దేశీయ జూన్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం కూడా కలిసొచ్చింది’’ అని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెల జూన్లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
డాలర్.. రన్ రాజా రన్!
మంథా రమణమూర్తి ‘డాలర్ మాకు కరెన్సీ. మీకు సమస్య.’ 51 ఏళ్ల కిందట అమెరికా ఆర్థిక మంత్రి జాన్ కొనల్లీ చేసిన ఈ వ్యాఖ్యల్ని... ప్రపంచ మానవాళిపై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ డాలర్ అమెరికాకు కరెన్సీనే. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే. డాలర్ విలువ పెరిగినా... తగ్గినా... ప్రపంచంలోని ప్రతి కుటుంబంపైనా దాని ప్రభావం పడక తప్పదు. అలాంటి డాలర్ ఇçప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా భావించే యూరప్ యూరో, యూకే పౌండ్, జపాన్ యెన్, చైనీస్ యువాన్... ఇవన్నీ డాలర్తో పోలిస్తే దారుణంగా క్షీణిస్తున్నాయి. అన్నిటికన్నా ఘోరంగా జపాన్ యెన్ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 20.57 శాతం మేర క్షీణించింది. ఏడాది కిందట డాలర్కు 110 యెన్లు కాగా... ఇప్పుడు 138.5 యెన్లు పెడితే తప్ప ఒక డాలర్ రావటం లేదు. యూకే పౌండ్ కూడా అంతే. ఏడాది కాలంలో ఏకంగా 15.5 శాతం పతనం కాగా... యూరో అదే స్థాయిలో 14 శాతం క్షీణించింది. ఆసియా దిగ్గజాలు చైనా, భారత్ మరీ అంత క్షీణించకుండా తమ కరెన్సీలను కాపాడుకున్నాయి. యువాన్ 4.5 శాతం, రూపాయి 6.25 శాతం మాత్రమే పతనమయ్యాయి. కరెన్సీలెందుకు పతనమవుతున్నాయి? అందరూ చెప్పే ప్రధాన కారణాలు రెండు. మొదటిది కోవిడ్ సంక్షోభం. దాదాపు రెండున్నరేళ్లు ప్రపంచపటంలో ఒక్కదేశాన్నీ వదలకుండా చుట్టేసిన ఈ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఫలితంగా ప్రపంచం మొత్తం మునుపెన్నడూ చూడని వైపరీత్యాల్ని చూసింది. లాక్డౌన్లతో జీవితం అస్తవ్యస్తమయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లి... ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి... అమెరికా లక్షల కోట్ల కరెన్సీని ముద్రించి బ్యాంకింగ్లోకి ప్రవేశపెట్టింది. వినియోగం పెంచడానికి నేరుగా జనం ఖాతాల్లోకీ నగదు వేసింది. మిగిలిన దేశాలు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాయి. అది జనం చేతుల్లోకి రావటం కోసం వడ్డీ రేట్లు తగ్గించాయి. అలా... ప్రపంచమంతా వినియోగాన్ని పెంచే పనిలో పడింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... నగదు లభ్యత పెరగటంతో అసలే తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండు... ఆ వెనకే ధరలూ పెరిగాయి. దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు మరింత ఇబ్బందికి గురయ్యాయి. ఫలితంగా... ద్రవ్యోల్బణం రయ్యిమంది. కాకపోతే చాలా దేశాలు కొంతవరకూ దీన్ని తట్టుకుని మనగలిగాయి. అందుకే కరెన్సీలు కూడా ఆరేడు నెలల కిందటిదాకా కాస్తంత స్థిరంగానే కనిపించాయి. ఇదిగో... అప్పుడు మొదలయింది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం. ఐదు నెలల కిందట మొదలయిన ఈ యుద్ధానికి ముగింపు దొరక్కపోవటం... ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియకపోవటంతో అసలే దెబ్బతిని ఉన్న సప్లయ్ వ్యవస్థలు మరింత కునారిల్లాయి. ముడిచమురు ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన రష్యాపై ఆంక్షల కారణంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గి... ధర విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం రికార్డులు తిరగ రాస్తోంది. దీన్ని కట్టడి చేయటానికి అమెరికాతో సహా... ప్రభుత్వాలన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి. అమెరికా సైతం వడ్డీ రేట్లు పెంచుతూ అంతకు ముందు వ్యవస్థలోకి వదిలిన నగదును వెనక్కి తీసుకోవటం మొదలెట్టింది. వడ్డీ రేట్లు పెరిగితే... కరెన్సీ విలువ పతనం కావటమన్నది సహజం. డాలర్... ఎప్పుడూ పెరగటమేనా? కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నపుడు కూడా డాలర్తో పోల్చినప్పుడు మన కరెన్సీలు ఎంతో కొంత క్షీణిస్తూనూ వచ్చాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ క్షీణత ఇంకాస్త ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ డాలర్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అన్నిచోట్లా డిమాండ్ పడిపోయింది. దీంతో ఏమవుతుందోనన్న భయం కొద్దీ ప్రపంచమంతా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలవైపు పరుగులెత్తింది. ఫలితంగా డాలర్ పెరిగి... ఇతర కరెన్సీలు క్షీణత నమోదు చేశాయి. ఇప్పుడు కూడా అంతే. అన్నిచోట్లా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ వ్యవస్థలో నగదు తగ్గి... మళ్లీ అది మందగమనానికి దారితీస్తుంది. మాంద్యమూ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డాలర్ ఇన్వెస్ట్మెంట్లే సురక్షితం. కాబట్టి డాలర్కే డిమాండ్. అందుకే అది పెరుగుతోంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే! జాన్ కొనల్లీ 51 ఏళ్ల కిందట జీ10 సదస్సులో చేసిన వ్యాఖ్యలు... అక్షర సత్యాలని!!. ఎవరికి లాభం... ఎవరికి నష్టం లాభనష్టాల విషయానికొస్తే డాలర్ బలోపేతమై స్థానిక కరెన్సీలు బలహీనమవున్నప్పుడు అది దేశ ప్రజలందరికీ నష్టమేనని చెప్పాలి. నేరుగా డాలర్తో అవసరం లేకున్నా... డాలర్ బలపడితే ఏ దేశమైనా దిగుమతులకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. భారత్ విషయానికొస్తే మన మొత్తం జీడీపీలో 21 శాతం వరకూ దిగుమతులే. అదే సమయంలో ఎగుమతులు 18.5 శాతం వరకూ ఉంటాయి. దిగుమతుల్లో అత్యధికం ముడిచమురు వాటాయే. ఈ రెండింటికీ మరీ దారుణమైన తేడా లేదు కనకే మన కరెన్సీ కొంతైనా ఈ పరిస్థితులను తట్టుకోగలుగుతోందన్నది వాస్తవం. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే మాత్రం ఆ ప్రభావం మన రూపాయిపై కాస్త తీవ్రంగానే పడుతుంది. విదేశాల్లో తమ పిల్లల్ని చదివించేవారికి ప్రధానంగా ఇది ఇబ్బందే. అనుకున్న బడ్జెట్లు తారుమారవుతాయి. అయితే తమ వారు విదేశాల్లో పనిచేస్తూ డాలర్లలో సంపాదించేవారికి మాత్రం ఇది చాలావరకూ ఊరటే. ఐటీ కంపెనీల వంటి ఎగుమతి ఆధారిత సంస్థలకు, అత్యధికంగా విదేశీ రెమిటెన్సులు వచ్చే కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ పరిణామం కలిసొచ్చేదే. దేశం మొత్తానికి ఏటా వచ్చే 86 బిలియన్ డాలర్లలో 19 శాతం వరకూ కేరళ వాటాయే. కోవిడ్తో ఇది దెబ్బతిన్నా... మళ్లీ యథా పూర్వ స్థితికి చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి... 32 ఏళ్లలో 15 నుంచి 80కి! 1990కి ముందు డాలర్ విలువ 15 రూపాయలే. కాకపోతే ఆ మాత్రం వెచ్చించాలన్నా సర్కారుకు చుక్కలు కనిపించేవి. దాంతో దిగుమతులపై ఆంక్షలు. కార్లు, స్కూటర్లు, ఫోన్లు, గ్యాస్.. ఏదైనా దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతికి డాలర్ల కొరత కనక డబ్బులు పెట్టి కొనాలనుకున్నా ఏదీ దొరకని పరిస్థితి. అన్నింటికీ రేషనే. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చాక సరళీకరణ విధానాలతో కంపెనీలకు ద్వారాలు తెరిచారు. అలా తెరిచిన రెండేళ్లలోనే డాలర్ విలువ ఏకంగా 30 రూపాయలకు చేరింది. నాటి నుంచి.. డాలర్ల అవసరంతో పాటు విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే ముడిచమురు, వజ్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, భారీ యంత్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, వంటనూనెలు, ఉక్కు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కనక డాలర్ మాదిరే వీటి ధరలూ పెరుగుతున్నాయి. ఆ మేరకు సామాన్యులపైనా ఈ ప్రభావం పడుతోంది. మున్ముందు పరిస్థితేంటి? కోవిడ్ తదనంతర పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నవారు కుదుటపడలేదు. అప్పట్లో డిమాండ్ లేక, అయినా నిర్వహించలేక మూతపడ్డ వ్యాపారాల పరిస్థితి అలానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం... ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇవన్నీ చూస్తుంటే సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో కుదుటపడటానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. అప్పటి దాకా అంతా సురక్షితమైన పెట్టుబడులవైపు వెళతారు కనక డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశాలే ఎక్కువన్నది నిపుణుల అంచనా. ఈ లెక్కన చూస్తే రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక దీనితో ముడిపడి ఉన్న స్టాక్ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పవు. కాబట్టి డాలర్తో అవసరాలున్న వారు ఇవన్నీ గమనంలోకి తీసుకున్నాకే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఏ సంక్షోభమూ ఎక్కువకాలం ఉండదు. -
ఇన్వెస్టర్లు అలా చేస్తే నష్టపోవాల్సిందే.. బడా బ్రోకరైజ్ సంస్థ హెచ్చరిక!
భారత్ స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ డిమ్యాట్ అకౌంట్ హోల్డర్లుతో పలు ఆసక్తికర విషయాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆయన తరచుగా ట్రేడర్స్ టిప్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని కామత్ హెచ్చరించారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మోసపోయే సులువైన మార్గం వారి లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవడమేనని వెల్లడించారు. పెన్నీ స్టాక్స్ సహాయంతో మోసగాళ్లు కృత్రిమ నష్టాలను సృష్టించవచ్చని తెలిపారు. మోసగాళ్లు ధనాన్ని తరలించడానికి ఇల్లిక్విడ్ ఆప్షన్ లేదా పెన్నీ స్టాక్లను ఉపయోగించి కృత్రిమ నష్టాలను సృష్టిస్తారన్నారు. అందుకే వీటి పట్ల కాస్త అప్రమత్తత అవసరమని చెప్పారు. సాధారణంగా తమ బ్యాంక్ ఐడీ, లాగిన్ల వివరాలు ఇతరులతో పంచుకోకుండా ఎలా వ్యవహరిస్తారో, అదే విధంగా వారి ట్రేడింగ్ ఖాతా లాగిన్ల విషయంలోనూ వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. అఫిషియల్ బ్రోకర్ వెబ్సైట్లు, యాప్లు కాకుండా ఎక్కడా లాగిన్ వివరాలను నమోదు చేయకపోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏ గుర్తింపులేని సలహాదారులు భారీ రాబడిని ఆఫర్ చేస్తాయని , అలాంటి మోసగాళ్లపై తమ టీమ్ గతంలో కొరడా ఝుళిపించిందని కామత్ వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో కొందరు తెలియక వారి అకౌంట్ వివరాలను ఇతరులతో వాట్సప్, టెలిగ్రామ్లలో కూడా పంచుకుంటారని చెప్పారు. ఇలాంటి వాటిని చేయకపోవడమే మంచిదని సూచించారు. ఇన్వెస్టర్లున ట్రేడ్ చేసే ముందు వాటిని బాగా అర్థం చేసుకోవాలని కామత్ సూచించారు. The other way accounts get compromised is through phishing frauds. It's Important to not enter login details anywhere apart from the official broker websites and apps. From our experience having dealt with a bunch of frauds, here are the large issues we have spotted👇2/4 — Nithin Kamath (@Nithin0dha) July 11, 2022 చదవండి: Nothing Phone Price: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన నథింగ్ ఫోన్ (1), ధర ఎంతంటే! -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
బజాజ్ ఆటో: భారీ బై బ్యాక్కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో షేరుకి రూ. 4,600 ధర మించకుండా 9.61 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 2,500 కోట్లవరకూ వెచ్చించనుంది. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. వెరసి ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ను మినహాయించి వాటాదారుల నుంచి రూ. 10 ముఖ విలువగల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. కంపెనీ ఈక్విటీలో 9.61 శాతం వాటాకు సమానమైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు రెగ్యులేటరీకి బజాజ్ ఆటో సమాచారమిచ్చింది. కాగా మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి చెందిన రూ. 19,090 కోట్ల మిగులు నగదు, ఇతరాలతో పోల్చినప్పుడు బైబ్యాక్ పరిమాణం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో మంగళవారం నాటిమార్కెట్లో కంపెనీ షేరు స్వల్ప లాభాలకు పరిమితమైంది. -
మార్కెట్లో లాభాలు.. అంతా ఆశామాషీ కాదు గురూ!
వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం, బ్యాంకు వడ్డీరేట్లు సోసోగా ఉండటంతో ఇటీవల కాలంలో అనేక మంది ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్మార్కెట్ వైపు చూస్తున్నారు. ఇలా మార్కెట్లోకి వెళితే అలా సొమ్ము రెట్టింపు చేసుకోవచ్చన్నట్టుగా ఆత్మవిశ్వాసం చూపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ఆన్లైన్ స్టాక్మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ కీలక సూచనలు చేశారు. స్టాక్మార్కెట్లో లాభాలపై నితిన్ కామత్ స్పందిస్తూ.. చాలా మంది సోషల్ మీడియా మాయలో ఉండిపోయి స్టాక్ మార్కెట్పై ఏవేవో అంచనాలు పెంచుకుంటున్నారు. స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే లాభాలు అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. కానీ వాస్తవం అలా ఉండదు. షేర్ మార్కెట్లో లాభాలు పొందడం అంత సులభమైన పని కాదు’ అని తెలిపారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్లో లాభాలు పొందడం అన్నది ప్రపంచంలో ఉన్న కష్టమైన పనుల్లో ఒకటని నితిన్ అన్నారు. గడిచిన కొన్ని నెలలలు మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా మార్కెట్లో లాభాలు తెచ్చుకోవడం అన్నది మరింత కష్టసాధ్యమైన పనిగా మారిందని నితిన్ అభిప్రాయపడ్డారు. బేర్ పంజా దెబ్బలకు మార్కెట్ విలవిలాడుతుంది. సాధారణంగా ‘లాంగ్’ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ‘షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెట్టుబడి పెట్టడం బెటరనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎదుగుదలకు చాలా సమయం పడుతుంది కానీ కుప్పకూలడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి. కానీ అదే పనిగా షార్ట్స్ మీద పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం కూడా చాలా కష్టంగా ఉంది అంటూ ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను నూతన ఇన్వెస్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు నితిన్ కామత్. గతేడాది నవంబర్ నుంచి మార్కెట్లో అస్థితర రాజ్యమేలుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 62 వేల గరిష్టాలను టచ్ చేసి ఆరు నెలల వ్యవధిలోనే 52 వేల కనిష్టాలకు కూడా పడిపోయింది. నిఫ్టీ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పేటీఎం, జోమాటో వంటి షేర్లు ఇన్వెస్టర్లకు రక్తకన్నీరు మిగిల్చాయి. ఇక బీరాలు పలుకుతూ వచ్చిప ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్ రోజునే ఢమాల్ అంది. For most traders living in the social media bubble, it must seem like everyone except you is killing it trading the markets. FYI, it mostly ain't real. Trading is one of the toughest ways to make money & the kind of volatility of the last few months makes it even tougher. 1/2 — Nithin Kamath (@Nithin0dha) June 27, 2022 చదవండి: ఇలా చేయడం వల్లే ఆ కంపెనీకి ఎన్నడూ లేనన్ని లాభాలు! -
టెక్నాలజీ దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. మార్కెట్లపై డిజిటైజేషన్ ప్రభావం గణనీయంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఎక్కడ దుర్వినియోగ మవుతున్నాయి, ఎక్కడ సడలించాలి, ఎక్కడ కఠినతరం చేయాలి అనే అంశాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తదితర నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్, కార్యదర్శి రాజేశ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారదర్శక విధానాలు ఉండాలి.. సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేసే డిజిటైజేషన్కు సంబంధించిన విధానాలు సముచితంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. డిజిటైజేషన్తో నియంత్రణ సంస్థలు, ఇతరత్రా సంస్థలు ప్రయోజనం పొందాలన్నారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను.. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు షాక్ అబ్జర్బర్లుగా ఉంటున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినా మార్కెట్లు పతనం కాకుండా దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంక్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మార్చి నెల గణాంకాల ప్రకారం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) దగ్గర యాక్టివ్గా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్లకు పెరిగింది. ఎస్ఎన్ఏతో పారదర్శక పాలన.. కార్యక్రమంలో భాగంగా నేషనల్ సీఎస్ఆర్ ఎక్సే్చంజ్ పోర్టల్ను, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడంపై స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు, వాటి వినియోగాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్బోర్డును సీతారామన్ ఆవిష్కరించారు. దీనితో పాలన మరింత పారదర్శకంగా మారగలదని, రాష్ట్రాలకు కేంద్రం పంపే ప్రతీ రూపాయికి లెక్క ఉంటుందన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు రూ. 4.46 లక్షల కోట్లు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారికి క్లెయిమ్ల విషయంలో తోడ్పాటు కోసం ఐఈపీఎఫ్ఏ ప్రత్యేక విండో ప్రారంభించింది. Smt @nsitharaman launches National CSR Exchange Portal during Iconic Day celebrations of @MCA21India under the #AzadiKaAmritMahotsav. The portal is a digital initiative on CSR enabling stakeholders to list, search, interact, engage & manage their CSR projects on voluntary basis. pic.twitter.com/B6Pf495Py4 — NSitharamanOffice (@nsitharamanoffc) June 7, 2022 -
మార్కెట్ అస్థిరతలను తట్టుకోవడం ఎలా?
మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. చదవండి: విద్యా రుణం.. అన్నీ ఆలోచించాకే..! -
ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్
లక్నో/కాన్పూర్: 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్కు మాత్రమే ఉందన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడో పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... అదొక సరికొత్త రికార్డు ‘‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి ఇండియాకు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు. సంస్కరణలు కొనసాగుతాయ్ మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నాం. ‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నాం. రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్ సిద్ధంగా ఉంది. దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతాం. నవ్య కాశీని సందర్శించండి 2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ ఖాతాదారులు ఉండేవారు. ఇప్పుడు 78 కోట్లకు చేరారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేది రూ.11–12కు దిగొచ్చింది. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్ ఫైబర్తో కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలు. 70 వేల దాకా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. యూపీలో నా సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా. ఘనమైన పురాతన చరిత్ర ఉన్న కాశీ నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది’’ అని మోదీ వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో తమ పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించారు. మోదీ విజన్కు అనుగుణంగా పని చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసల వర్షం కురిపించారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి వంశ పారంపర్య రాజకీయాలపై (పరివార్వాద్) ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. యూపీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామమైన పరౌంఖ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంశ పారంపర్య రాజకీయాల వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు దక్కకుండా పోతాయన్నారు. అలాంటి రాజకీయాలు చేసేవారంతా తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెప్పారు. వారి ఆటలను ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో జన్మించిన వారు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావాలంటే వంశ పారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తానని మోదీ చెప్పారు. దానివల్ల రాజకీయాల్లో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అంతకముందు కాన్పూర్ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి రాష్ట్రపతి కోవింద్ స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి రావడం పట్ల తనకు సిగ్గుగా ఉందని మోదీ అన్నారు. కోవింద్ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన మోదీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. పరౌంఖ్లో పథ్రీమాత ఆలయాన్ని, బీఆర్ అంబేడ్కర్ భవనాన్ని, మిలన్ కేంద్రాన్ని కోవింద్తో కలిసి మోదీ సందర్శించారు. -
ట్విటర్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి
శాన్ ఫ్రాన్సిస్కో: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ను కొనుగోలు యత్నాల్లో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఈలాన్ మస్క్కు బాసటగా పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, టెస్లా బోర్డు సభ్యుడు ల్యారీ ఎలిసన్ సహా పలువురు ఏకంగా 7.1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఎలిసన్ (1 బిలియన్ డాలర్లు), సెకోయా క్యాపిటల్ ఫండ్ (800 మిలియన్ డాలర్లు), వైక్యాపిటల్ (700 మిలియన్ డాలర్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ సహా పలువురితో మస్క్ చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఈ పెట్టుబడులు సాకారమైతే.. ట్విటర్ కొనుగోలు కోసం మస్క్ తీసుకోవాల్సిన రుణాల భారం దాదాపు సగానికి తగ్గుతుంది. నగదు, ఈక్విటీ రూపంలో చెల్లించే పరిమాణం 21 బిలియన్ డాలర్ల నుంచి 27.25 బిలియన్ డాలర్లకు చేరుతుంది. దాదాపు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఆఫర్ ఇచ్చారు. చదవండి: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్లో ట్విస్ట్.. కోర్టుకెక్కిన వాటాదారు -
ఇన్వెస్టర్లకు బ్రోకింగ్ సంస్థల గాలం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి మెగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో పాలసీదారులు, ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు మళ్లించడంపై బ్రోకింగ్ సంస్థలు, ఫిన్టెక్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇనాక్టివ్ ఖాతాలను మళ్లీ పునరుద్ధరించేలా మదుపుదారులను ప్రోత్సహించడం మొదలుకుని క్యూఆర్ కోడ్తో అప్పటికప్పుడు డీమ్యాట్ ఖాతాలను తెరవడం, వినూత్న ఆఫర్లు ఇవ్వడం వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎల్ఐసీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవడానికి .. సంక్లిష్టమైన బ్యాŠంకు లావాదేవీతో సంబంధం లేకుండా, అత్యంత సంపన్న ఇన్వెస్టర్లకు (హెచ్ఎన్ఐ) యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నాయి. దేశీయంగా అతి పెద్ద బ్రోకింగ్ సంస్థ జిరోధా, ఈ మధ్యే బ్రోకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన పేటీఎం మనీ ఇప్పటికే దీన్ని అమల్లోకి తేగా, మిగతా సంస్థలు అదే బాట పట్టనున్నాయి. తమ దగ్గరే డీమ్యాట్ ఖాతాలు తెరిచేలా డిజిటల్, సంప్రదాయ బ్రోకింగ్ సంస్థలు పలు స్కీములు, గిఫ్ట్ వోచర్లతో పాలసీదారులను ఊరిస్తున్నాయి. కొత్త క్లయింట్లకు ఏంజెల్ వన్ బ్రోకింగ్ సంస్థ రూ. 15,000 విలువ చేసే వోచర్లు ఆఫర్ చేస్తోంది. చాలా మటుకు బ్రోకరేజీలు ఇప్పటికే రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఐపీవోకి దరఖాస్తు చేసుకునేందుకు ’ప్రీ–అప్లై’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడేందుకు ఫిన్టెక్ సంస్థ స్పైస్ మనీ తాజాగా రెలిగేర్ బ్రోకింగ్తో జట్టు కట్టింది. మూణ్నెల్లలో 91 లక్షల ఖాతాలు.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సీడీఎస్ఎల్) గణాంకాల ప్రకారం జనవరి–మార్చి మధ్య కాలంలో కొత్తగా 91 లక్షల డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి. దీంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల నుంచి (గతేడాది డిసెంబర్ ఆఖర్లో) 8.97 కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ ఐపీవోపై రిటైల్ ఇన్వెస్టర్లలో భారీగా ఆసక్తి నెలకొందని యాక్సిస్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో కోసమే గత నెలలో 45,000 పైచిలుకు ఖాతాలు తెరిచామని, వీరిలో 40 శాతం మంది కస్టమర్లు .. మార్కెట్కు కొత్త వారేనని వివరించాయి. మే 4న ప్రారంభమయ్యే ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాలు (22.13 కోట్ల షేర్లు) విక్రయిస్తోంది. ఉద్యోగులకు షేరు ధరపై రూ. 45, పాలసీదారులకు రూ. 60 మేర డిస్కౌంట్ లభించనుంది. 2008లో రిలయన్స్ పవర్కి రికార్డు స్థాయిలో వచ్చిన 48 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మించి ఎల్ఐసీ ఐపీవోకి బిడ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. తద్వారా దేశీయంగా ఇది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఎల్ఐసీ ఐపీవో బిడ్కు పేటీఎం రూటు క్యూఆర్ కోడ్ స్కానర్తో డీమ్యాట్ ఖాతా వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) అనుబంధ సంస్థ అయిన పేటీఎం మనీ ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు, పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్ను ఏర్పాటు చేశామని.. జీవిత కాలం ఎటువంటి చార్జీల్లేని డీమ్యాట్ ఖాతాను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. ఎవరైనా తమ ఫోన్ నుంచి క్యూఆర్కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా డీమ్యాట్ ఖాతాను తమ వద్ద తెరవొచ్చని సూచించింది. ఖాతా తెరిచిన అనంతరం ఎల్ఐసీ ఐపీవోకు బిడ్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అవుతుండగా.. 9న ముగియనుంది.‘‘ గత కొన్ని ఏళ్లుగా క్యాపిటల్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఎల్ఐసీ ఐపీవోతో ఇది మరింత పెరగనుంది. దేశవ్యాప్తంగా పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ఉచిత డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించొచ్చు’’అని పేటీఎం మనీ అధికార ప్రతినిధి తెలిపారు. పేటీఎం మనీ హోమ్స్క్రీన్లో ఐపీవో సెక్షన్కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు ఇవ్వడం ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు. -
ఆనందం రెండు రోజులే.. మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నిన్న సాయంత్రం నుంచే అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రోజు ఉదయం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మరోవైపు యూఎస్, ఏసియా మార్కెట్ సూచీలు సైతం బలహీనంగా కదలాడుతుండంతో అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు మార్కెట్ మొదలైన 20 నిమిషాల్లోనే భారీగా నష్టాలను చవి చూశాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 57,531 పాయింట్లతో మొదలైంది. క్రితం రోజు ముగింపుతో పోల్చితే దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల జోరు కొనసాగడంతో ఉదయం 9:20 గంటల సమయానికి 597 పాయింట్లు నష్టపోయి ఒక శాతం క్షీణత నమోదు చేసి 57,314 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైను ఎన్ఎస్ఈ నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 17,206 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
భారీగా నష్టపోయిన సూచీలు.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాలు
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. మార్చి నెలకు సంబంధించి వెలువడిన చిల్లర ద్రవ్యోల్బణం ఫలితాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేశాయి. దీంతో అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా మెటల్, ఐటీ రంగాల్లో షేర్లు భారీగా నష్టపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 58,964 పాయింట్ల దగ్గర మార్కెట్ క్లోజవగా ఈరోజు ఉదయం 58,743 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 388 పాయింట్లు నష్టపోయి 58,576 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 145 పాయింట్లు నష్టపోయి 17,530 పాయింట్ల దగ్గర ముగిసింది. ఓవరాల్గా సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 0. 2 శాతం క్షీణించాయి. నిఫ్టీలో పదిహేను సెక్టార్లలో 12 సెక్టార్లు నష్టాల్లో ముగిశాయి. -
రియల్ ఎస్టేట్లోకి విదేశీ పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి 23.9 బిలియన్ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్ వివరించింది. పెట్టుబడుల వివరాలు.. 2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్కు పెద్ద పీట రియల్ ఎస్టేట్లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్ స్పేస్ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత ఎన్బీఎఫ్సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్ అసెట్స్లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. డేటా సెంటర్ల బూమ్ డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
ప్రైవేటీకరణ ఎలా చేద్దాం? విదేశీ ఇన్వెస్టర్లతో ప్రధాని కీలక సమావేశం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసెట్ మానిటైజేషన్ వ్యూహాలు, దేశ వృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాల గురించి చర్చించేందుకు ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ 2022 మార్చి 9న సమావేశం కానున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆ్రస్టేలియా తదితర ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, మౌలిక రంగం .. రియల్ ఎస్టేట్ వర్గాలు , లీగల్ నిపుణులు మొదలైన వారు ఈ భేటీలో పాల్గోనున్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం), నీతి ఆయోగ్ కలిసి నిర్వహిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వెబినార్లో 22 శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. ‘ప్రైవేటీకరణ వ్యూహాల అమలు విషయంలో ఆయా రంగాల నిపుణులు, ఇన్వెస్టర్లు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నది ఈ వెబినార్ లక్ష్యం‘ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్నప్పటికీ ఆ తర్వాత రూ. 78,000 కోట్లకు సవరించింది. కానీ ఇప్పటి వరకూ రూ. 12,400 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. చదవండి: మోదీ సర్కార్ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! -
లాభాల స్వీకరణకే మొగ్గు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ వారం నష్టాలతో ఆరంభమైంది. యుద్ధం ఎఫెక్ట్తో గత వారం స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో వారాంతంలో భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. సోమవారం ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల బాట పట్టాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 55121 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఉదయం 9:38 గంటల సమయంలో అయితే 900ల పాయింట్లకు పైగా నష్టపోయి 55 మార్క్ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత కోలుకుంది. ఇక ఎన్ఎస్ఈ నిప్టీ 265 పాయింట్లు నష్టపోయి 16,392 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్ ప్రారంభమైన గంట వ్యవధిలో నిఫ్టీ 1.59 శాతం క్షీణించడగా సెన్సెక్స్ 1.42 శాతం క్షీణించింది. పవర్గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.