July
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లు 30 లక్షలు అప్..
న్యూఢిల్లీ: జూలైలో మొబైల్ టారిఫ్లను పెంచిన ప్రభావం ప్రైవేట్ రంగ టెల్కోలపై కనిపించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన జూలై గణాంకాల ప్రకారం బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 29.4 లక్షల మేర పెరిగింది. ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్స్ 16.9 లక్షలు, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 14.1 లక్షలు, రిలయన్స్ జియో యూజర్లు 7.58 లక్షల మంది తగ్గారు. దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్ నాటి 120.56 కోట్ల నుంచి జూలైలో స్వల్పంగా క్షీణించి 120.51 కోట్లకు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర టెలికం సర్కిల్స్లో మొబైల్ కనెక్షన్లు తగ్గాయి. జూలై తొలి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సుమారు 10–27 శాతం శ్రేణిలో టారిఫ్లను పెంచడం తెలిసిందే. -
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు
న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్ డాలర్ల చమురు భారత్కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. దీంతో మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్కు, యూరప్కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లియర్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. బొగ్గుకు సైతం డిమాండ్.. ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్ 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్ఈఏ నివేదిక వెల్లడించింది. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు. ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. → జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. → ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూలై వ్యవధిలో.. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది. → అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. -
AMFI: ఈక్విటీ ఫండ్స్లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్క్యాప్ ఫండ్స్లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్లో ఇవే ఫండ్స్లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్ఎఫ్వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్లో లిక్విడ్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్ఎఫ్వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్ఎఫ్వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్ఎఫ్వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
హైదరాబాద్లో నియామకాల జోరు
ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్లో మంచి వృద్ధి నమోదైంది. ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది. మొత్తం 2,877 జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్ పోస్టింగ్లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్పై జాబ్ పోస్టింగ్లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్లోని రాజ్కోట్లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్నగర్లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. హైదరాబాద్లో జోరు హైదరాబాద్లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది. విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది. దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్ఫోర్స్లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్యాక్టివ్గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
జులైలో ప్రధాని రష్యా టూర్..!
న్యూఢిల్లీ: జులైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మోదీ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన ఒక రోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అదికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవలే మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇటలీకి వెళ్లొచ్చారు. -
ఈ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసా?
Bank Holidays in July 2024: జూలై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ జాబితాను సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా బ్యాంకులు ఈ సెలవులను నిర్ణయిస్తాయి.దేశంలోని అన్ని బ్యాంకులు, శాఖల్లో సాధారణ వారాంతపు సెలవులు వర్తిస్తాయి. అన్ని ఆదివారాలతో పాటు పండుగలు, జాతీయ సెలవు దినాలు, రెండు, నాలుగో శనివారాలు వంటి వారాంతపు సెలవులు ఈ జాబితాలో ఉన్నాయి.జులై సెలవుల జాబితా ఇదే..» జూలై 3 బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్లో సెలవు» జులై 6 ఎం.హెచ్.ఐ.పి డే సందర్భంగా ఐజ్వాల్లో సెలవు» జులై 7 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 8 కాంగ్ (రథజాత్ర) సందర్భంగా ఇంఫాల్లో సెలవు» జులై 9 ద్రుప్కా షిజి సందర్భంగా గ్యాంగ్ టక్లో సెలవు » జులై 13 రెండో శనివారం దేశం అంతటా సెలవు» జులై 14 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 16 హరేలా సందర్భంగా డెహ్రాడూన్లో సెలవు» జులై 17 మొహర్రం/అషూరా/యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్లలో సెలవు» జులై 21 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 27 నాల్గవ శనివారం దేశం అంతటా సెలవు» జులై 28 ఆదివారం దేశం అంతటా సెలవుఈ సెలవులను బ్యాంకుల భౌతిక శాఖలలో పాటిస్తారు. అయితే ఈ సెలవు రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవల ద్వారా కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
జూలై–సెప్టెంబర్కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్కల్లా ఎల్నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్నినో కారణంగా భారత్లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో క్షీణత
కోల్కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది. ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000 -
జూలైలో కార్పొరేట్ డీల్స్ 3.1 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ముఖ్య డీల్స్.. ► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రూట్ మొబైల్లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది. ► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. ► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది. -
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
టమాట భగ్గు:15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్జెట్ ఎండీకి భారీ షాక్!) వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. -
రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూలై నెలలోనూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే నెలవారీ పెట్టుబడులు రూ.15,245 కోట్లకు చేరాయి. ఒక నెలలో సిప్ పెట్టుబడుల పరంగా ఇదే గరిష్ట రికార్డు కావడం గమనార్హం. జూన్ నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,734 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు 2022 అక్టోబర్ నుంచి ప్రతి నెలా రూ.13వేల కోట్లకు పైనే వస్తున్నాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి జూలై నెలలో మొత్తం మీద రూ.7,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో వచి్చన పెట్టుబడులతో పోల్చిచూస్తే 12 శాతం తగ్గాయి. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. జూలై నెలలో ఈక్విటీ, డెట్ ఇలా అన్ని విభాగాలు కలసి మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.82,046 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బలపడుతున్న సిప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈక్విటీల్లోకి సిప్ రూపంలో రూ.58,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్ రూ.1.56 లక్షల కోట్లను సిప్ రూపంలో ఆకర్షించాయి. సిప్ అనేది ప్రతీ నెలా పెట్టుబడులు పెట్టుకు నే సాధనం. దీనివల్ల మార్కెట్లలో ఉండే అస్థిరతల రిస్క్ కొనుగోలుపై తగ్గుతుంది. ఈ సానుకూలతలను అర్థం చేసుకుంటున్న ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు ఈక్విటీల్లోకి 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు వస్తున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే జూన్ నెలలో ఈక్విటీ పథకాలు రూ.8,637 కోట్లను ఆకర్షించగా, జూలైలో రూ.7,626 కోట్లకు తగ్గాయి. జూలై నెలలో ఐదు నూతన పథకాలు ప్రారంభం కాగా, వీటి వరకే రూ.3,011 కోట్లు సమీకరించాయి. లార్జ్క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీక్యాప్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోని పథకాలు పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ ఫండ్స్ ► స్మాల్క్యాప్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,171 కోట్లు వచ్చాయి. గడిచిన నాలుగు నెలలుగా స్మాల్క్యాప్ పథకాల్లోకి ఇతర పథకాలతో పోలిస్తే అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► లార్జ్క్యాప్ నుంచి రూ.1,880 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గడిచిన మూడు నెలలుగా లార్జ్క్యాప్ పథకాలు పెట్టుబడులను కోల్పోతున్నాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగం నుంచి రూ.1,067 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ విభాగం గడిచిన నాలుగు నెలలుగా పెట్టుబడులను కోల్పోతోంది. ► ఈఎల్ఎస్ఎస్ విభాగం నుంచి రూ.592 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.932 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,327 కోట్లు, మిడ్క్యాప్ఫండ్స్ రూ.1,623 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.342 కోట్లు, వ్యాల్యూఫండ్స్ రూ.703 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,429 కోట్ల చొప్పున పెట్టుబడులను రాబట్టాయి. డెట్ ఫండ్స్ ► డెట్ ఫండ్స్లోకి రూ.61,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఈ విభాగం నుంచి నికరంగా రూ.14,135 కోట్లకు బయటకు వెళ్లడం గమనార్హం. ► అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్లోకి రూ.51,938 కోట్లు వచ్చాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.8,608 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.7,027 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.2,865 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,000 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ► ఓవర్ నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.10,746 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ ఫండ్స్ నుంచి రూ.1,309 కోట్లను ఉపసంహరించుకున్నారు. లాభాల స్వీకరణ.. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో అన్నింటికంటే సిప్ పనితీరు గొప్పగా ఉంది. 33 లక్షల నూతన సిప్ ఖాతాలు నమోదయ్యాయి’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జూన్తో పోలిస్తే జూలై నెలలో ఈక్విటీల్లోకి నికర పెట్టుబడులు తగ్గడానికి లాభాల స్వీకరణే కారణమై ఉండొచ్చని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి కూడా అనుసరించి ఉండొచ్చన్నారు. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
జీఎస్టీ వసూళ్ల ఉత్సాహం
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే.. ► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు ► సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.29,773 కోట్లు. ► ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా) ► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా) ఆర్థిక సంవత్సరంలో తీరిది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి. -
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
విజృంభిస్తున్న డెంగ్యూ.. వచ్చే నెలలో మరింత వ్యాప్తి..
ఢిల్లీ: దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఒక్క జులై నెలలోనే దాదాపు 121 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరదల కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని వైద్యులు తెలిపారు. ఆగష్టు నెలలో డెంగ్యూతో పాటు మలేరియా, చికన్ గున్యా వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జులై వరకు మొత్తం 243 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఒక్క జులై నెలలోనే దాదాపు సగంపైనే కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల నగరంలో 72 మలేరియా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. జులై చివరి వారంలోనే 34 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్కి 20 షాంపిల్స్ పంపించగా.. అందులో 19 కేసులు టైప్ 2 డెంగ్యూగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, శరీరంపై ఎర్రని చారలు, ప్లేట్లెట్స్ తగ్గడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పులు ఉంటాయని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. రానున్న వర్షాకాలం కావునా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్స్ చూడండి!
భారతదేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తన థార్ 4x4, బొలెరో, బొలెరో నియో, మరాజో, ఎక్స్యువి300 వంటి కార్ల మీద డిస్కౌంట్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 73,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?) మారుతి సుజుకి విషయానికి వస్తే.. కంపెనీ ఈ నెలలో నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ. 64,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్ మీద కూడా కంపెనీ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. -
హైదరాబాద్లో బ్యాంకులకు సెలవులు 8 రోజులే..
వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. హైదరాబాద్లో బ్యాంకు సెలవులు జూలై 2: ఆదివారం జూలై 8: రెండో శనివారం జూలై 9 : ఆదివారం జూలై 16 : ఆదివారం జూలై 22 : నాలుగో శనివారం జూలై 23 : ఆదివారం జూలై 29: మొహర్రం జూలై 30: ఆదివారం ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) కాగా ఓలా ఎస్1 ఎయిర్ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) Test drove the first S1 Air vehicles!! Loving them 🙂 Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62 — Bhavish Aggarwal (@bhash) May 23, 2023 -
భారత్లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. వార్షిక అంచనాలు ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్ ఉత్పత్తి 9.96 మిలియన్ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్ టన్నులు, 34 మిలియన్ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్ను భారత్ ఉత్పత్తి చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్ క్షేత్రంలో తక్కువ గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది. -
రెండేళ్ల కనిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పీనోట్ల పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. జులైకల్లా వీటి విలువ రూ. 75,725 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్ చివరికల్లా రూ. 80,092 కోట్లకు చేరిన పీనోట్ పెట్టుబడులు 20 నెలల కనిష్టానికి చేరాయి. తదుపరి జులైకల్లా రూ. 75,725 కోట్లకు వెనకడుగు వేశాయి. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడులు క్షీణించాయి. ఇంతక్రితం 2020 అక్టోబర్లో మాత్రమే వీటి విలువ ఈ స్థాయిలో అంటే రూ. 78,686 కోట్లను తాకాయి. (కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు) పీనోట్ జారీ ఇలా పీనోట్లుగా పిలిచే పార్టిసిపేటరీ నోట్లను దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) జారీ చేస్తుంటారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రిజిస్టర్కాని విదేశీ సంస్థలు దేశీయంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే ఇందుకు తగిన పరిశీలన ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో జూన్ చివరికల్లా పీనోట్ పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. రూ. 75,725 కోట్లకు పరిమితమయ్యాయి. యూఎస్ ఫెడ్ కఠిన పరపతి విధానాల నేపథ్యంలో 10ఏళ్ల బాండ్ల ఈల్డ్స్ బలపడుతున్నాయి. దీంతో ఎఫ్పీఐలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆనంద్ రాఠీ షేర్స్, శాంక్టమ్ వెల్త్ తదితర సంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. (అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!) ఈక్విటీలే అధికం జూన్కల్లా నమోదైన పీనోట్ పెట్టుబడుల్లో రూ. 66,050 కోట్లు ఈక్విటీలకు చేరగా.. రుణ సెక్యూరిటీలకు రూ. 9,592 కోట్లు లభించాయి. ఇక హైబ్రిడ్ సెక్యూరిటీలలో కేవలం రూ. 82 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. జూన్కల్లా నమోదైన రూ. 80,092 కోట్లలో ఈక్విటీలకు రూ. 70,644 కోట్లు చేరగా.. డెట్ విభాగంలో రూ. 9,355 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. వరుసగా 9 నెలల అమ్మకాల తదుపరి తిరిగి ఈ జులైలో ఎఫ్పీఐలు నికర పెట్టుబడిదారులుగా నిలవడం గమనార్హం! ఈ బాటలో ఆగస్టులోనూ ఈక్విటీలపట్ల అత్యధిక పెట్టుబడులకు మక్కువ చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్కు సంబంధించి ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ యువ చిచ్చరపిడుగు గుస్తావ్ మెక్కియోన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ఎమ్మా లాంబ్, నతాలీ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచిన బెయిర్స్టో తన కెరీర్ బెస్ట్ ఫామ్ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఇక లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. ఆసీస్పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్పై తొలి టెస్ట్లో 5/82, 4/135, రెండో టెస్ట్లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గుస్తావ్ మెక్కియోన్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్ ఆఫ్ ద మంత్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్ 3 మ్యాచ్ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్ వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. చదవండి: భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్లో మ్యాచ్ ఎప్పుడంటే..? -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
జులైలో తిరుమల శ్రీవారికి అత్యధిక హుండీ ఆదాయం
-
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
గాల్లో తేలినట్టుందే! రాకేశ్ ఝున్ఝున్వాలాకు గుడ్న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్మార్కెట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది. ఝున్ఝున్వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది. We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations. — Akasa Air (@AkasaAir) July 7, 2022 -
పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త..
చండీగఢ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జూలై 1నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈనెల 16న పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమమై దీనిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఇప్పుడు మీరు అయిదేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు.. పంజాబ్ ప్రజలు రేపు పెద్ద ప్రకటన వినబోతున్నారు’’ అని ఆప్ ట్వీట్ చేసింది. అయితే ఢిల్లీలోని ఆప్ సర్కార్ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్ ఇచ్చిన హామీల్లో.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నెలబెట్టుకుంది ఆప్ సర్కార్. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 చోట్ల విజయకేతనాన్ని ఎగరవేసింది. చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్టెల్కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
ఈపీఎఫ్వోలో కొత్తగా 15 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో కొత్త సభ్యుల నమోదు జూన్తో పోలిస్తే జులైలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా జులైలో 14.65 లక్షలుగా నమోదైంది. వీరిలో 9.02 లక్షల మంది తొలిసారిగా చేరిన వారు. ఇక మిగతా వారు గతంలో ఈపీఎఫ్వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్ మధ్య నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్డౌన్ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది. -
జూలైలో ఊపందుకున్న ఎకానమీ: ఇక్రా
ముంబై: భారత్ ఎకానమీ జూలైలో భారీగా రికవరీ అయినట్లు రేటింగ్ సంస్థ– ఇక్రా పేర్కొంది. సెకండ్వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం దీనికి కారణమని వివరించింది. పారిశ్రామిక, సేవల రంగాలు, రవాణా, టోల్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. 13 నాన్–ఫైనాన్షియల్ ఇండికేటర్లను చూస్తే, అందులో 10 సానుకూల ఫలితాలను ఇచ్చాయని వివరించింది. జీఎస్టీ ఈ–వే బిల్లులు, ఇంధన వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, వెహికిల్ రిజిస్ట్రేషన్, దేశీయ పాసింజర్ ట్రాఫిక్ వంట విభాగాలు 2021 జూన్తో పోల్చితే 2021 జూలైలో గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపింది. ఇదే వరవడి కొనసాగవచ్చని పేర్కొంది. -
టోకు ధరల స్పీడ్ 11.16 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 11.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 11.16 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ధరల స్పీడ్ రెండంకెలపైనే కొనసాగుతోంది. అయితే జూన్తో పోల్చితే టోకు ద్రవ్యోల్బణం తగ్గడమే కొంతలో కొంత ఊరట. ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం)లలో కూడా టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి (లో బేస్ ఎఫెక్ట్) ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 జూలైని తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతం. అక్టోబర్ వరకూ టోకు ధరల తీవ్రతపై లో బేస్ ఎఫెక్ట్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం తగ్గు తూ వస్తోంది. జూలైలో అసలు ఈ విభాగంలో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది. జూన్లో ఇది 3.09%. ఉల్లి ధరలు మాత్రం జూలైలో 72.01% పెరిగాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు జూన్లో 36.34% ఉంటే, జూలైలో 40.28 శాతంగా ఉంది. ► సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం టోకు ధరల పెరుగుదల జూలైలో 11.20 శాతం. జూన్లో ఇది 10.88%. -
‘అబ్బా.. ఏం ఉక్కపోత’.. ఇదో వరల్డ్ రికార్డ్ మరి!
మబ్బు పట్టిన వాతావరణం ఉన్నా.. అధిక వేడి, ఉక్కపోతతో ‘ఇది అసలు వానాకాలమేనా?’ అనే అనుమానం చాలామందికి కలిగించింది జులై నెల. ఇక ఆగస్టు లోనూ ఇదే తీరు కొనసాగుతున్నా.. అక్కడక్కడ చిరు జల్లులు- ఓ మోస్తరు వానలు, ఎక్కడో దగ్గర భారీ వర్షాలు.. తప్పించి పెద్దగా సీజన్ ప్రభావం కనిపించడం లేదు. దీంతో ఈసారి ఆగష్టు నాటికే అధిక వర్షాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయన్న భారత వాతావరణ శాఖ జోస్యం తప్పినట్లే అయ్యింది!!. ఇక ఈ భూమ్మీద ఇప్పుటిదాకా నమోదుకానీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈసారే నమోదు అయ్యాయి మరి!. యూఎస్ నేషనల్ ఓషనిక్ అండ్ ఎట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), యూరోపియన్ కాపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీసెస్, యూఎన్ క్లైమేట్ సైన్స్ రిపోర్ట్.. ఈ మూడూ కూడా స్వల్ఫ తేడాలతో జులై నెలను ‘హాటెస్ట్ మంత్’గా ప్రకటించాయి. గత వంద సంవత్సరాల్లో ఈ సీజన్లో ఈ జులైను ఉక్కపోత నెలగా అభివర్ణించాయి. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ఈ సీజన్ సమ్మర్.. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాకాల సీజన్ కొనసాగుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా వర్షాభావ ప్రాంతాల్లోనూ వాతావరణం ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తోంది. వేడి ప్రభావంతో శీతల గాలుల ప్రభావమూ తగ్గడం ఈసారి విశేషం. చదవండి: కలిసి కదిలితేనే భూరక్ష ‘‘ఇదో కొత్త రికార్డు. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, కార్చిచ్చు ప్రమాదాలు.. మరోవైపు కుంభవృష్టితో వరదలు, భూతాపం-వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని ఎన్ఓఏఏ ప్రతినిధి స్పినార్డ్ వెల్లడించాడు. 142 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఈసారి రికార్డును లెక్కగట్టారు. సముద్ర ఉపరితల వాతావరణంపై 0.93 సెంటీగ్రేడ్ పెరుగుదల వల్ల 50 డిగ్రీల సెల్సియస్ కన్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈసారి జూన్ చివర్లోనూ చాలా దేశాల్లో(ఉదాహరణకు పాకిస్థాన్) నమోదు అయ్యాయని ఆయన వివరించాడు. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని ఇప్పటికే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) హెచ్చరికలు జారీ చేసింది కూడా. పర్యావరణ సంరక్షణను ప్రభుత్వాలు, సంబంధిత ఆర్గనైజేషన్లే నిర్వర్తించాలన్న రూల్ ఏం లేదు. సాధారణ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తే.. వాతావరణ ప్రతికూల మార్పులను కొంతలో కొంత తగ్గించవచ్చనేది పర్యావరణ నిపుణుల మాట. ►ఆహార వృథాను అరికట్టడం ►కొంచెం కష్టంగా అనిపించినా.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని నెమ్మదిగా తగ్గించడం. ►అవసరమైతే ఇంధన వనరుల విషయంలో ప్రత్యామ్నాయాలకు జై కొట్టడం ►ఎనర్జీ(ఇంట్లో కరెంట్) పొదుపుగా వాడడం ►చెట్ల సంరక్షణ.. మొక్కల పెంపకం -
కట్టడిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో అదుపులోనికి వచ్చింది. 5.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 జూలైలో పోల్చితే 2021 జూలైలో రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.59 శాతం పెరిగిందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేటు–రెపోకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (ఆర్బీఐకి) ప్రకారం 2 నుంచి 6శాతం శ్రేణిలో ఉండాలి. అయితే మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలుగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.15 శాతం ఉంటే, జూలైలో 3.96 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల చూస్తే జూన్లో 0.7 శాతం తగ్గితే, జూలైలో ఈ తగ్గుదల ఏకంగా 7.75 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు ఇదే కాలంలో 10.01% నుంచి 9.04%కి దిగివచ్చాయి. అయితే మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆయిల్ ఫ్యాట్స్ ధరలు 32.53% పెరిగాయి. అయితే జూలైలో ఈ పెరుగుదల రేటు 35%గా ఉంది. -
అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. -
5 ఏరియాలు టాప్, మరో ఆరు ఏరియాల్లో వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్లో 20 ఓపెన్కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్లోని మణుగూరు టాప్గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
మూడో నెలా ‘సేవలు’ పేలవం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్వేవ్ నేపథ్యంలో సేవల రంగం వరుసగా మూడవనెల జూలైలోనూ క్షీణతలోనే ఉంది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 45.4గా నమోదయ్యింది. జూన్లో ఇది 41.2 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటేనే దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సేవల రంగంలో వ్యాపార క్రియాశీలత, కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన మరింత భారీగా పడిపోయినట్లు నెలవారీ సర్వే వెల్లడించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. రాబోయే ఏడాది ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నిరాశాజనకంగా ఉండడం మరో అంశం. ఈ తరహా నిరాశావాద ధోరణి ఏడాదిలో ఇదే తొలిసారి. మహమ్మారి కనుమరుగవడంపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు జూలైలో వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు డీ లిమా పేర్కొన్నారు. ఈ రంగంలో వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ ఉపాధి అవకాశాలు క్షీణతలోనే ఉన్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా సేవల రంగానిదే. సేవలు, తయారీ కలిపినా మైనస్సే... మరోవైపు సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ వరుసగా మూడవనెలా క్షీణతలోనే కొనసాగింది. జూన్లో 43.1 వద్ద ఇండెక్స్ ఉంటే, జూలైలో 49.2 వద్దకు చేరింది. ఇండెక్స్ కొంత పెరగడమే ఇక్కడ ఊరట. 50కి పైన సూచీ వస్తేనే కాంపోజిట్ ఇండెక్స్ వృద్ధిలోకి మారినట్లు భావించాల్సి ఉంటుంది. ముడి పదార్థాల ధరల తీవ్రత సూచీలపై పడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. జూలైలో ఒక్క తయారీ రంగం మాత్రం క్షీణత నుంచి బయటపడ్డం కొంతలో కొంత ఊరటనిస్తున్న అంశం. జూన్లో 48.1 వద్ద క్షీణతలో ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 55.3 వృద్ధిలోకి మారింది. వరుసగా 36 నెలలు 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ పీఎంఐ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి 2020 ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చి, అదే జోరును కొనసాగించింది. అయితే సెకండ్వేవ్ ప్రభావంతో జూన్లో తిరిగి క్షీణతలోకి జారింది. -
జూలైలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశ ఎగుమతులు
న్యూఢిల్లీ: గత నెల జూలైలో భారత్ రికార్డు స్థాయిలో 35.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది కీలక పాశ్చాత్య మార్కెట్లలో వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం. దీంతో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాథమిక డేటాలో మర్కండైజింగ్ దిగుమతులు కూడా $46.4 బిలియన్ల వరకు పెరిగాయి. ఇది చరిత్రలో రెండవ అత్యధికం. ఇక వాణిజ్య లోటు $11.2 బిలియన్లకు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం దేశాల ఎగుమతుల విలువ భారీగా పెరగగా, మలేషియా, ఇరాన్, టాంజానియాల ఎగుమతులు అత్యధికంగా క్షీణించాయి. అదేవిధంగా యుఎఇ, ఇరాక్, స్విట్జర్లాండ్ దేశాల దిగుమతులలో విలువ భారీగా పెరిగితే.. ఫ్రాన్స్, జర్మనీ, కజకస్తాన్ దిగుమతులు క్షీణించాయి. జూలైలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలను ఎక్కువగా ఎగుమతి జరిగాయి. ఇక అగ్ర దిగుమతి వస్తువులలో ముడి చమురు, బంగారం, విలువైన రాళ్ళు, వంట నూనెలు ఉన్నాయి. జూలై 2021లో భారతదేశం మర్కండైజింగ్ ఎగుమతుల విలువ 35.17 బిలియన్ డాలర్లు, గత ఏడాది జూలై కంటే ఈ ఏడాది జూలై నెలలో ఎగుమతుల విలువ 34% పెరిగాయి. 'ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది' అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి 500 బిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల మర్కండైజింగ్ ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. "కాబట్టి, రాబోయే ఆరు సంవత్సరాలలో సేవల ఎగుమతులు $500 బిలియన్లు, మర్కండైజింగ్ ఎగుమతులు $1 ట్రిలియన్లు ఉంటాయి. వార్షిక $1.5 ట్రిలియన్ల మొత్తం ఎగుమతులతో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం గణనీయమైన వాటాను కలిగి ఉంటుంది" అని వాణిజ్య కార్యదర్శి బి.వి.ఆర్. సుబ్రమణియన్ గత నెలలో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) గత వారం 2021 ప్రపంచ వృద్ధి అంచనాలో ఎటువంటి మార్పులు చేయకుండా 6% శాతం వద్దే ఉంచింది. ఇక మనదేశ వృద్ది అంచనాను ఐఎంఎఫ్ ఏప్రిల్ లో అంచనా వేసిన 12.5% నుంచి 9.5% తగ్గించింది. -
టాప్గేర్లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జులైకి సంబంధించి వస్తు సేవల పన్ను ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021 జులై నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వసూళ్లు ఇలా జులైకి సంబంధించి మొత్తం 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవగా ఇందులో సీజీఎస్టీ 22.19 వేల కోట్లు, ఎస్జీఎస్టీ 28.53 వేల కోట్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులకు సంబంధించి ఐజీఎస్టీ రూ. 57.86 వేల కోట్లు వసూలు అయినట్టు మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2,138 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ 2,730 కోట్లు వచ్చాయి. తెలంగాణకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ.2,876 కోట్ల నుంచి రూ. 3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరగగా ఏపీలో 28 శాతం పెరిగాయి. కరోనా తగ్గడంతో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్డడంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు ఆర్థిక మంత్రి. గత రెండు నెలలుగా ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని ఆర్థికక శాఖ పేర్కొంది. అంతకు ముందు కోవిడ్ కారణంగా మే, జూన్లలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్హౌజ్లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని అల్లాహార్లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్లోకి వన్ప్లస్ నార్డ్ 2
వన్ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక టీజర్లో ధృవీకరించింది. వన్ప్లస్ నార్డ్ 2పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. తాజాగా కంపెనీ నార్డ్ 2 గురించి అధికారిక వివరాలను టీజ్ చేసింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. కంపెనీ వన్ప్లస్ నార్డ్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో రావచ్చని సమాచారం. భారతీయ కస్టమర్ల కోసం వన్ప్లస్, మీడియాటెక్ తో జతకట్టినట్లు కంపెనీ తెలిపింది. మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి వన్ప్లస్ స్మార్ట్ఫోన్ గా వన్ప్లస్ నార్డ్ 2 5జీ నిలవనుంది. గతంలో వన్ప్లస్ ఏ మోడల్లో వాడని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీని దీనిలో ఉపయోగించనున్నారు. వన్ప్లస్ నార్డ్ 2లో AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్ను చేర్చనుంది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు అదే బ్రైట్ నెస్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ కనెక్టివిటీ సపోర్ట్తో వచ్చే వన్ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్ప్లే తీసుకు రానున్నారు. ఈ డిస్ప్లే ఓఎల్ఇడీ టెక్నాలజీ, ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇక, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చే అవకాశం ఉంది. -
జులై మూడోవారంలో ప్రారంభంకానున్న లష్కర్ బోనాలు
-
జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటరీ్మడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. మొదటి పరీక్షలను జూలైలో నిర్వహించి ఆగస్టులో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో పరీక్షల నిర్వహణపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్కు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు. పరీక్షలను జూలై మధ్యలో నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ముద్రించినందున పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రశ్నపత్రంలో ఇచి్చన మొత్తం ప్రశ్నల్లో 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మార్కులను రెట్టింపు చేసి 100 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేరు వేరు సెట్ల ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్లుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా, ఇతరత్రా కారణాలతో ఈ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మూడో సెట్ ప్రశ్నపత్రంతో తర్వాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత మేర భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు జూలైలో నిర్వహిస్తారని.. పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘సాక్షి’గురువారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర, ఒకేషనల్ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ తేదీలను కనీసం 15 రోజుల ముందు చెబుతామని వివరించారు. చదవండి: డబుల్ హ్యాపీ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చదవండి: తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు -
జూలై 4 కల్లా అమెరికాలో సాధారణ స్థితి
వాషింగ్టన్: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4 నాటికి కోవిడ్ మహమ్మారి నుంచి దేశం విముక్తి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజుకల్లా అమెరికా సాధారణ స్థితికి చేరుకోవాలని జో బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని వయోజనులందరూ మే 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్కి అర్హులని ఆయన ప్రకటించారు. జనవరి 20 న అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత జో బైడెన్ తొలిసారి చేసిన ప్రైమ్ టైమ్ ప్రసంగంలో దేశాన్ని కోవిడ్ రహితంగా మార్చేందుకు ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగానే మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీపై బైడెన్ సంతకం చేశారు. ఈ జూలై నాలుగు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం మాత్రమే కాదని, ఇది కరోనా నుంచి విముక్తిదినం కూడానని ప్రకటించారు. కోవిడ్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో మహమ్మారిగా ప్రకటించి ఏడాది అయ్యింది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామని బైడెన్ చెప్పారు. అమెరికాలో 527,000 మంది కోవిడ్తో మరణించారన్నారు. ఈ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారికన్నా, రెండో ప్రపంచయుద్ధంలో చనిపోయిన వారికన్నా, వియత్నాం వార్లో మృత్యువాత పడిన వారికన్నా ఎక్కువని బైడెన్ చెప్పారు. అధికారం చేపట్టిన తొలి వందరోజుల్లో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేయడమే తన లక్ష్యమని బైడెన్ చెప్పారు. ‘‘అయితే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, దాన్ని దాటేయబోతున్నాం. వంద రోజులు కాదు, 60 రోజుల్లోనే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ని అందించనున్నాం’’అని జో బైడెన్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వాధికారులు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్తయారీదారులతో కలిసి పనిచేస్తూ, ఈ సురక్షితమైన మూడు కంపెనీల నుంచి లక్షలాది వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేస్తోందని చెప్పారు. మే1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సినేషన్, ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలి లాంటి సమాచారం కోసం కొత్త వెబ్సైట్ల ఆవిష్కరణ, సురక్షితమైన వాతావరణంలో బడులు తెరవడం ప్రాధామ్యాలని బైడెన్ చెప్పారు. పూర్తిస్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ అయ్యే వరకు ప్రజలు ఏం చేయాలనే విషయాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తుందని చెప్పారు. ఆసియా అమెరికన్లపై దాడులు దుర్మార్గం కోవిడ్ మహమ్మారి కాలంలో ఆసియా ఆమెరికన్ల్ల పై దాడులు ఆపివేయాలని బైడెన్ వ్యాఖ్యానించారు. 2020 మార్చి 19 నుంచి, డిసెంబర్ 31 వరకు కోవిడ్ సమయంలో 2,800 ఆసియా అమెరికన్ల పట్ల విద్వేష పూరిత ఘటనలు నమోదయ్యాయి. ఇది ఘోరమైన విషయమని, తోటి అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు ముందు వరుసలో ఉండి వారు పోరాడుతున్నారని బైడెన్ అన్నారు. బైడెన్ వ్యాఖ్యలపట్ల భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్ఓ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. -
బాగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో 35 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ రంగ సమాచార విశ్లేషణా సంస్థ ‘ప్రాప్ఈక్విటీ’ తెలిపింది. ఈ కాలంలో 50,983 యూనిట్లు (ఇల్లు/ఫ్లాట్) అమ్ముడు పోయినట్టు ఈ సంస్థ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. కానీ అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్ల సంఖ్య 78,472గా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలో మార్కెట్లలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని ఈ సంస్థ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు వార్షికంగా చూస్తే 46% తగ్గి 29,520 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గత వారం ఓ నివేదికను విడుదల చేసిన విషయం గమనార్హం. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొంత మేర కోలుకుంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంతో చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పలు పథకాలు, ఆఫర్ల మద్దతుతో డెవలపర్లు తమ నిల్వలను గణనీయంగా తగ్గించుకోగలరు. పండుగల సీజన్లోకి ప్రవేశించాము. ఆఫర్లు, తగ్గింపులు, ఆకర్షణీయమైన చెల్లింపుల పథకాల మద్దతుతో ఈ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము’’ అని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజా తెలిపారు. (చదవండి: ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!) -
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
జూలై 27 నాటికి ‘రఫేల్’ రాక!
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల సరఫరా త్వరలో మొదలు కానుంది. తొలి దశలో భాగంగా జూలై 27 నాటికి ఆరు రఫేల్ యుద్ధవిమానాలు అందనున్నాయని భారత వాయుసేన వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచేదేనని ఆ వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక వాయుసేన స్థావరంగా భావించే అంబాలా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో రఫేల్ యుద్ధవిమానాలు ఉంటాయని సమాచారం. భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్నాథ్కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం. రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ తయారు చేసే మిటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణితోపాటు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు రఫేల్లోని ముఖ్యమైన ఆయుధాలు. దీంతోపాటు ఇజ్రాయెల్ తయారీ హెల్మెట్లు, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లోబ్యాండ్ జామర్లు, పది గంటల ఫ్లయిట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివి భారత్ కోసం ప్రత్యేకంగా చేర్చారు. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ ఇప్పటికే పైలెట్ల శిక్షణ మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసింది. తొలి దఫా సరఫరా కానున్న యుద్ధ విమానాలు అంబాలా కేంద్రంగా పనిచేయనుండగా రెండో దఫా సరఫరా అయ్యేవాటిని పశ్చిమ బెంగాల్లోని హసిమార వైమానిక కేంద్రంలో ఉంచేందుకు రూ.400 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా ఆరు శిక్షణ విమానాలు. -
‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్సిటీ, ఐకియా వంటివి కూడా.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన.. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ రెండ్రోజుల్లో వంతెన పైకి వాహనాలకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. వచ్చే నెలాఖరులో ప్రారంభం.. బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఇది ప్రారంభమయ్యాక ఆ సొగసులకు పర్యాటకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను కాలినడకన మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతి స్తారని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదించాలనే కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాహ నాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, ప్రత్యేక తరహా లైటింగ్ సిస్టంతో కేబుల్ బ్రిడ్జి రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మనుంది. వివిధ బొమ్మలు వెలుతుర్లో కనువిందు చేయనున్నాయి. దుర్గంచెరువులోని నీళ్లూ మిలమిలా మెరవనున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభంలోగా జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనుల పూర్తికీ జీహెచ్ఎంసీ శ్రమిస్తోంది. ► ఐటీ శాఖ నిర్వహిస్తున్న ఈ–ప్రొక్యూర్మెంట్ విభాగం ద్వారా సుమారు రూ.1,20,434 అంచనా వ్యయం కలిగిన 1,55,182 టెండర్లను నిర్వహించారు. ఈ గణాంకాలతో టెండర్ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ► టెక్నాలజీ ఎంపవరింగ్ గరŠల్స్ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్ లిటరసీ నైపుణ్యాన్ని అందించింది. ► కరోనా రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్ను టీ–వర్క్స్ తయారుచేసింది. ► తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తెలుగు వికీపీడియా రూపకల్పనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో కలిసి పనిచేస్తోంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ► తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర నిర్వహించి 120 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను గుర్తించారు. ► నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టీ–వ్యాలెట్’యాప్ను 11 లక్షల మంది వినియోగదారులు క్రియాశీలంగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.6,795 కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరిగాయి. ► ఐటీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ఇప్పటికే నాలుగేళ్లను పూర్తి చేసుకుంది. ఫేస్బుక్, యూటీసీ, బోయింగ్ వంటి కంపెనీలతో కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది. ► తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా 3.50 లక్షల మంది నిరుద్యోగ యువతకు, 1,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 40కిపైగా కార్పొరేట్ కంపెనీలతో 4,500 మంది విద్యార్థులకు టాస్క్ ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. ► దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 6 శాతం. 250కిపైగా కంపెనీలు రాష్ట్రంలో లక్షా 16 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. ► 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం రూ.7,337 కోట్ల పెట్టుబడులను తెచ్చింది. స్కైవర్త్ గ్రూప్, ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ► మైక్రాన్ తన ఉద్యోగులను 700 నుంచి 2,000 పెంచింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. -
20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు, ఆయా విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 20 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారం భమయ్యాక నవంబర్/ డిసెంబర్లో నిర్వహిం చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను యూనివర్సిటీలకు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్ స్టడీస్లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు. మార్గదర్శకాలివే.. ► పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి. ► బ్యాక్లాగ్లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్లో ఒక సెమిస్టర్ తర్వాత మరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్లాగ్ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్కు ప్రమోట్ చేయాలి. ► సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. ► ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్ వంటికి ఆన్లైన్లోనే నిర్వహించాలి. పీహెచ్డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్లైన్లోనే నిర్వహించాలి. -
దశల వారీగా పాఠశాలలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశల వారీగా స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిస్థితిని బట్టి జూలై 1 నుంచి లేదా 15 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అధికా రులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడే స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా నిర్ణయాలు లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకవేళ కరోనా అదుపులోకి వస్తే జూలైలో ప్రారంభించాలని, అప్పుడు మొదట 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. టీచర్లను మాత్రం పాఠశాలల పునఃప్రారంభ దినమైన జూన్ 12 నుంచే వచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లంతా గ్రామ పంచా యతీల సమన్వయంతో పాఠశాలలను శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్ చేయించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల నుంచి నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపైనా చర్చించారు. ఎక్కువుంటే షిఫ్ట్ పద్ధతిలో.. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ పద్ధతుల్లో కొనసాగించాలని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇది అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, డిజిటల్ తరగతులు, కేబుల్ టీవీ ద్వారా తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వాస్తవానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కానే కాదని పేర్కొన్నా.. ఉన్నత తరగతులకు ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యక్ష బోధన లేకుంటే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, భౌతిక దూరం పాటించడం గ్రామీణ పాఠశాలల్లో పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కరోనా అదుపులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపైనా విద్యా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరో 10–15 రోజుల తర్వాత కరోనా పరిస్థితిని చూసి మళ్లీ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోగా అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతోనూ ఓసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై 15 నుంచి ఇంటర్ తరగతులు ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్ విద్యా కార్యక్రమాలపైనా బోర్డు అధికారులు మంత్రికి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే ఇంటర్లో సిలబస్ తగ్గించొద్దని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే సిలబస్ అలాగే ఉండాలని, అవసరమైతే నష్టపోయిన పని దినాలను ఆన్లైన్ బోధన ద్వారా సర్దుబాటు చేయాలని సూచించారు. భేటీలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్య సీనియర్ అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
శ్రీరాముడికి జలాభిషేకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద పూర్తి ఆయకట్టు సాగులోకి తెచ్చేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కింద నిర్ణయించిన పూర్తి ఆయకట్టుకు నీరివ్వడంతో పాటే ప్రతి చెరువును నింపి నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు జూలై నుంచి నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల మేరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం ఆయకట్టుకు నీరు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గతేడాది వానాకాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నీటి వినియోగం పెద్దగా అవసరం లేక పోయింది. అదే యాసంగి సీజన్లో మాత్రం స్టేజ్–1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. దీనికోసం మొత్తంగా 90 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇందులో 25 నుంచి 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా తరలించిన నీటి వాటా ఉంది. అయితే ఈ ఏడాది స్టేజ్–1, 2ల కింద ఉన్న మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు జూలై ఒకటి నుంచే నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులోకి ఆగస్టు నుంచి అధిక ప్రవాహాలుంటాయి. గత పదేళ్ల ప్రవాహాల లెక్కలు తీసుకుంటే జూన్, జూలైలో వచ్చిన ప్రవాహాలు సగటున 10 నుంచి 15 టీఎంసీల మేర ఉండగా, ఆగస్టులో 50 నుంచి 60 టీఎంసీలుంది. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎస్సారెస్పీలో 30 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఇందులో 10 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి మిగతా 20 టీఎంసీల నీటిని జూలై నుంచే సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్ఫా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్మఠ్, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. వస్తే వరద.. లేదంటే ఎత్తిపోత ఆగస్టులో ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేసుకుంటూ, ప్రవాహాలు ఉంటే ఆ నీటితో, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే లోయర్ మానేరు కింద 5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుంచే స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లా వరకున్న 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇక ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడితే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి తరలించి, ఆయకట్టుకు నీరివ్వనున్నారు. ఇప్పటికే పునరుజ్జీవ పథకం పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా కనీసంగా 200 టీఎంసీల ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటితో పాటే కాళేశ్వరం నీటిని కలిపి మొత్తంగా 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వరద కాల్వ కింద 49, ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, కాళేశ్వరం కింద మరో 1,200 చెరువులున్నాయి. ఆరునూరైనా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ప్రతి చెరువునూ నింపడం లక్ష్యంగా సాగు నీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఇదే అంశమై సోమవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
ఆస్ట్రియా రేసుతో ఆరంభం!
పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) అభిమానులకు శుభవార్త. కరోనా మహమ్మారితో వాయిదా పడిన 2020 ఫార్ములావన్ సీజన్ జూలై నెలలో ఆరంభం కానుంది. జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్ప్రితో తాజా సీజన్ను ఆరంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ సోమవారం ప్రకటించారు. జూలై–ఆగస్టు నెలల్లో యూరప్లో రేసులను నిర్వహించి... అనంతరం ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పూర్తి చేసి డిసెంబర్లో మధ్య ఆసియాలో సీజన్ను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది కనీసం 15 రేసులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు∙ఫ్రాన్స్ గ్రాండ్ప్రిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఈ ఏడాది రద్దయిన మూడో గ్రాండ్ప్రి జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మొనాకో రేసులు రద్దవగా... మరో ఏడు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే ఈసారి బ్రిటిష్ గ్రాండ్ప్రి నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. -
జూలై వరకు బ్యాడ్మింటన్ టోర్నీల్లేవు: బీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), థాయ్లాండ్ ఓపెన్ (జూన్ 9–14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16–21), రష్యా ఓపెన్ (జూలై 7–12) ఉన్నాయి. షూటింగ్ వరల్డ్కప్లు కూడా... మరోవైపు మే నెలలో భారత్లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగానే ఉన్నందున డిమాండ్ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25–30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55–60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు. -
రికార్డు సృష్టించిన జూలై
ఇప్పుడైతే శాంతించాయి గానీ.. రెండు నెలల కింద ఎండలు మండిపోయిన విషయం మనకు తెలిసిందే.. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఎన్నడూ లేని స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్, అమెరికాతో పాటు భూ ఉత్తరార్ధ గోళంలోని అనేక దేశాల్లో వడగాడ్పులు ప్రజలను ఠారెత్తించాయి. ఈ ఏడాది తొలి 6 నెలల ఉష్ణోగ్రత రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. జూలైలో భూమి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉన్న ట్లు స్పష్టం చేసింది. 20వ శతాబ్దం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీ సెల్సియస్ ఉండగా.. జూలై ఉష్ణోగ్రత 16.75 డిగ్రీలుగా నమోదైంది. మూడేళ్ల కింద అంటే 2016లో సుమారు 16 నెలల పాటు రికార్డు స్థాయి ఉష్ణో గ్రతలు నమోదైన తర్వాత అంతటి ఉష్ణోగ్రత లు నమోదు కావడం ఇదే తొలిసారి. 1998 తర్వాత జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతూ వస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
టోకు ధరలు దిగొచ్చాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో కేవలం 1.08 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో సూచీలోని వస్తువుల బాస్కెట్ మొత్తం ధర కేవలం 1.08 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 25 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2017జూన్లో 0.9 శాతం) టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార వస్తువుల ధరలు అదుపులోఉండడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూన్లో టోకు ద్రవ్యోల్బణం 5.27 శాతం అయితే, ఈ ఏడాది జూన్లో ఈ రేటు 2.02 శాతంగా ఉంది. -
ఎగుమతులు పెరిగాయ్... దిగుమతులు తగ్గాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్ డాలర్లు. కాగా అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. ► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో నీరసం 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2019 జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎగుమతులపై ప్రతికూల అవుట్లుక్ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్ ట్రేడ్ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ. అంతర్జాతీయ ప్రతికూలత ఎనిమిది నెలల తర్వాత జూన్లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్టీ తక్షణ రిఫండ్ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. – శరద్ కుమార్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రూపాయి క్షీణత ప్రభావమే.. జూన్ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ -
స్వల్పంగా తగ్గిన డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి. -
స్వల్పంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి,న్యూఢిల్లీ: జూలై నెలలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టీ) వసూళ్లు స్వల్ప వృద్ధిని నమోదు చేసాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత నెలలో 96,483 కోట్ల రూపాయలుతో పోలిస్తే రూ. 873 కోట్ల మేర పెరిగాయి. అంచనాలకనుగుణంగానే ఈ మాసంలో 95,610 కోట్ల రూపాయలు వసూలైనాయి. సెంట్రల్ జీఎస్టీ రూ. 15,877 కోట్లు, రాష్ట్ర జిఎస్టీ రూ. 22,293 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ రూ. 49,951 కోట్లు (దిగుమతులపై సేకరించిన 24,852 కోట్ల రూపాయలు) సెస్ రూ. 8,362 కోట్ల రూపాయలు (దిగుమతులపై రూ .794 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే జూలై 31, 2018 వరకు జూలై నెలలో మొత్తం గరిష్ఠంగా 3 లక్షల రిటర్న్స్ దాఖలుకాగా 66 లక్షల రూపాయలు వసూలైనాయి. -
జూలై 26 లేదా 27న అమీర్పేట్ టు ఎల్బీనగర్
-
ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం
-
బిగ్ స్క్రీన్, మాసివ్ బ్యాటరీ : బడ్జెట్ ధర
సాక్షి,ముంబై: మోటోరోలా నుంచి మరో స్మార్ట్ఫోన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. మోటో ఈ5ప్లస్ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను విడుదలచేయనుంది. అనంతరం మోటోఈ5ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ట్విటర్లో వరుసగా టీజర్లు వదులుతోంది. పాక్డ్ విత్ మాసివ్ బ్యాటరీ, బహుమతులూ అంటూ ఊరిస్తోంది. మోటో ఈ4 ప్లస్ సక్సెసర్గా దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు 10వేల రూపాయలుగా నిర్ణయించవచ్చని సమాచారం. జూలై మాసంలోనే లాంచ్ కానుందని భావిస్తున్న ఈ5 ప్లస్ స్మార్ట్ఫోన్పై అంచనాలు ఇలా ఉన్నాయి: మోటో ఈ5ప్లస్ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 720x1440పిక్సెల్స్రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ సెల్ఫీకెమెరా 12ఎంపీ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ Love watching what you love, all day, every day!? Tell us which of these situations best describes you by sharing a screenshot with #helloentertainment. Stand a chance to win the soon to be launched #motoe5plus, packed with a massive battery! ( T&C - https://t.co/gvLvh3ESo6 ) pic.twitter.com/HFoSte6Qrb — Motorola India (@motorolaindia) June 30, 2018 BIG battery. BIG screen. For BIG entertainment. The #motoe5plus is on its way. Get set to say #helloentertainment! Stay tuned. pic.twitter.com/eGKxElhLmY — Motorola India (@motorolaindia) June 29, 2018 -
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం
న్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఇది 1.88శాతంగా నిలిచింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ మంత్ ఆన్మంత్ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం. కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్ను రికార్డ్ చేసింది. గత నెల ఇది 21.16 శాతంగా నమోదైంది. ప్రధానంగా టమాటా ధరలు దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా. ఫ్యూయల్ అండ్ పవర్ 4.37 శాతంగా నిలిచింది. ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు , ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో వచ్చే ఆర్బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. -
అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది. -
ఎయిర్ ఇండియా ఉద్యోగుల జీతాలు?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవైపు అప్పుల భారంతో కునరిల్లుతున్న సంస్థను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సంక్షోభంలో ఉన్న సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో వేలమంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. జూలై నెలలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ఆలస్యం చేసిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వీటిని వచ్చే వారం చెల్లించే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ఆలస్యానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగాఎలాంటి ప్రకటన రాలేదని ఆయన చెప్పారు. దీంతో ఇప్పటికే ప్రయివేటైజేషన్కు వ్యతిరేకంగా, ఉద్యోగభద్రతపై ఆందోళనలో పడిన ఉద్యోగులు ఇపుడు మరింత కలవర పడుతున్నారు. ఎయిర్ఇండియాలో సుమారు 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా మునుపటి యుపిఎ ప్రభుత్వం 2012లో పది సంవత్సరాల కాల వ్యవధిలో రూ.30 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అందించింది. రూ. 50,000 కోట్ల రుణ భారంతో ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సూత్ర ప్రాయ అంగీకారం చెప్పింది. సంస్థలోని పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటు చేసిన మంత్రత్వి కమిటీ తీవ్రంగా పని చేస్తోంది. అటు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో, టాటా గ్రూప్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఈ నెలకు ఇంతే..!
► ఆగస్టులో విస్తారంగా వర్షాలు ► జిల్లాను పూర్తిస్థాయిలో తాకని నైరుతి రుతుపవనాలు ► గాలిలో పెరిగిన తేమ శాతం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆనందపడిన రైతాంగం గత కొద్దిరోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు వస్తున్నా.. చినుకు జాడ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. నైరుతి రుతు పవనాలు పూర్తిస్థాయిలో జిల్లాలో విస్తరించకపోవడంతోనే భారీ వర్షాలు కురవడం లేదనే అభిప్రాయం వాతావరణ శాఖ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. ఈ నెలలో చెదురుమదురు వర్షాలే ఉంటాయని.. ఆగస్టు నెలలో మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయని చెప్పారు. ఆమదాలవలస రూరల్: వాన దేవుడు ముఖం చాటేశాడు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూలై నెలలో వర్షపాతం లోటు సగం కంటే ఎక్కువగా ఉంది. ఉత్తరాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కోస్తాంధ్రాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థతి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడ మేఘాలు ఉంటే ఆ ప్రాంతంలోనే వర్షం పడుతోంది తప్ప.. జిల్లా అంతటా వర్షాలు పడటం లేదు. దీనికి ప్రధాన కారణం నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడమే కారణమని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూన్ నెలలో 160 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది జూన్ నెలలో కేవలం 80 మి.మీ వర్షపాతం జిల్లాలో నమోదు అయిందని పేర్కొన్నారు. అలాగే జూలై నెలలో 230 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 50 శాతం మాత్రమే నమోదైందని వివరించారు. వాతావరణంలోనే మార్పులే కారణం వర్షం ముఖం చాటేయడానికి వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమని జగన్నాథం చెప్పారు. వాతావరణం కాలుష్యం కావడంతో దీని ప్రభావం వర్షాలపై పడుతోందన్నారు. నైరుతి రుతుపవనాల కదలిక బాగానే ఉన్నా.. అవి జిల్లాను తాకకుండా పోతున్నాయన్నారు. కేరళను తాకి శ్రీలంక, బంగ్లాదేశ్, హిమలయాల మీదుగా ఉత్తరాఖండ్ వైపు పయనిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో అటవీ సంపద అధికంగా ఉండటంతో పవనాలు అటువైపు పయనించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉన్నందున రుతు పవనాలు రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. చిరాకు కలిగిస్తున్న వాతావరణం గత కొద్ది రోజులుగా ఉన్న వాతావరణం జనానికి చిరాకు తెప్పిస్తోంది. ఉష్టోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. నైరుతి రుతు పవనాలు జిల్లాను పూర్తిస్ధాయిలో తాకే వరకు ఎండ తీవ్రత కూడా ఉంటుందంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందంటున్నారు. జిల్లాలో సగటు ఉష్టోగ్రత 36 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జూలై నెలలో భారీ వర్షాలు పడటానికి అవకాశం లేదనే చెప్పాలి. జిల్లాలో పూర్తిస్థాయిలో వర్షం కురవాలంటే ఆగస్టు 4వ తేదీ వరకు ఆగాల్సిందే. వాతావరణంలో పెరిగిన తేమ శాతం వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 65–70 మధ్య నమోదవుతుంది. ఉష్టోగ్రతలు కూడా 36 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 75–85 మధ్య ఉంటుంది. దీనివల్ల రాత్రి ఉష్టోగ్రతలు 26 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కపోతకు గురై నీరసించి కంటిమీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం జూలై నెలలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు కలవర పడుతున్నారు. పంటలపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మెట్ట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు వర్షాలు లేని కారణంగా తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పోటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటిలో పిచికారి చేసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు మరో నెల రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చి రుతుపవనాలు పూర్తిస్థాయిలో జిల్లాను తాకుతాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. జూలై నెలలో మాత్రం అంతగా వర్షాలు కురవడానికి అవకాశం లేదు. జిల్లాలో అటవీ శాతం తగ్గడం వలన ఇలాంటి మార్పులు వస్తున్నాయి. అందుకే గోగు పంట సాగు విస్తృతంగా చేపట్టాలి. ఈ సాగు వలన వర్షాలు కూడా సమయానికి కురిసే అవకాశం ఉంటుంది. ఎకరా గోగు పంట సాగు 10 ఎకరాల అటవీ సంపదతో సమానం. పచ్చదనాన్ని విపరీతంగా పెంచితేనే జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. లేకుంటే వాతావరణంలో ఇలాంటి మార్పులు తప్పవు. – జె.జగన్నాథం, భూ విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనాస్థానం -
మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
-
సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు కౌన్సిల్ ఆమోదం
ముంబై: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో మరో కీలక అంకం ముగిసింది. జీఎస్టీ కౌన్సిల్ 11వ కీలకమైన చట్టాలను ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ కౌన్సిల్ శనివారం ముంబై నిర్వహించిన ఉమ్మడి నియంత్రణపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశలో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి చట్టాలకు ఆమోదం లభించింది. ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నామని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. జీఎస్టీ అమలుకు ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల సాధికారతకు కేంద్రం అంగీకారం తెలపడంతో చిన్న వ్యాపారాలకు భారీ ఊతం లభించింది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్మెంట్ అంశాలపై తదుపరి సమావేశంలో కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన 26 పాయింట్లకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు అంచెల పన్నుల విధానాన్ని ఆమోదం లభించింది. అలాగే కనీస పన్నురేటు 5 శాతంగా మధ్యస్థంగా 12-18శాతంగాను, అత్యధికంగా 28శాతంగా ఉండనున్నాయి.దీంతో ఇప్పటికే పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్నాభిప్రాయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) జులైనుంచి అమలు మరింత ఖాయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను శాఖ ఉద్యోగులకు సమాన అధికారులు ఉండనున్నాయి. వీటిని త్వరలోనే పార్లమెంటు ఆమోదంకోసం ఉంచుతుంది. కౌన్సిల్ తదుపరి సమావేశం మార్చి 16 జరగనుంది. ఈ సమావేశంలో మిగిలిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. కొత్త పరోక్ష పన్నుల చట్టం కింద రూ. 50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన హోటల్స్ కనీస పన్ను స్లాబ్ 5 శాతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాతిపదికన ఉంటుంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో జులై 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 26% వృద్ధి
ఇది రికార్డు స్థాయి... న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ జూలైలో 26 శాతం వృద్ధి చెందింది. రెండంకెల వృద్ధి నమోదుకావడం ఇది వరుసగా 24వ సారి. ప్రయాణికుల పెరుగుదలకు తక్కువ టికెట్ ధరలు కారణంగా ఉన్నాయి. దేశీ విమానయాన కంపెనీలు జూలైలో 85.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో అవి చేరవేసిన ప్రయాణికులు సంఖ్య 67.62 లక్షలు. ఇదివరకు ప్రయాణికుల రద్దీ వృద్ధి గరిష్ట స్థాయి 25%గా ఉండేది. ఇప్పుడు ఆ రద్దీ వృద్ధి 26 శాతమనే కొత్త గరిష్ట స్థాయికి చేరింది. దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 561 లక్షల మందిని గమ్యాలకు చేరిస్తే.. గతేడాది ఇదే సమయంలో 456 లక్షల మందిని గమ్యాలకు అంటే 23 శాతం వృద్ధి . టాప్లో ఇండిగో: మార్కెట్ వాటా పరంగా చేస్తే ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జూన్లో 37.9%గా ఉన్న దీని మార్కెట్ వాటా జూలైకి 39.8%కి చేరింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్వేస్ (16.3%), ఎయిర్ ఇండియా (14.8 శాతం), స్పైస్జెట్ (11.7 శాతం) ఉన్నాయి. -
భూమిపై అత్యంత వేడి నెలగా జూలై
మియామి: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలై నెలలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) ప్రకటించింది. నాసా తాజాగా వెల్లడించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించాక ఎన్ఓఏఏ తన నెలవారీ నివేదికను విడుదలచేసింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11 డిగ్రీలు ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ నెల భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. -
ప్రాజెక్టులకు జలకళ
– జీడీపీ జూలైలో నిండడం ఇదే తొలిసారి – నేడో, రేపో గేట్లెత్తి హంద్రీ నదికిS విడుదల – జిల్లావ్యాప్తంగా 90 శాతం చెరువులకు నీరు – శ్రీశైలంలో నీటి చేరికకు రెట్టింపు మొత్తంలో అవుట్ ఫ్లో – నీటిమట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవాకు విడుదల కర్నూలు సిటీ: జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు దానిపై ఆధారపడిన వెలుగోడు, ఆవుకు అలగనూరు రిజర్వాయర్లు మినహా జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్ చెరువులు జలంతో తొణికిసలాడుతున్నాయి. హంద్రీనదిపై 1979లో నిర్మించిన గాజులదిన్నె (సంజీవయ్య సాగర్) ప్రాజెక్టు జూలై చివరి నాటికి పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారిగా ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. తుంగభద్రపై కర్నూలు మండలం సుంకేసుల వద్ద నిర్మించిన కోట్ల విజయ భాస్కర్రెడ్డి బ్యారేజీ ఇప్పటీకే పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కేసీ కాల్వకు 2 వేల క్యుసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. 37 ఏళ్లలో మొదటి సారి...! జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలకు తాగు,సాగునీటి కోసం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద హంద్రీనదిపై గాజులదిన్నె ప్రాజెక్టుకు 1971లో పునాదులు వేసి 1979 నాటికి పూర్తి చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు, నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు. గోనెగండ్ల, కోడుమూరు, క్రిష్ణగిరి, దేవనకొండ మండలాలకు చెందిన 21 గ్రామాల పరిధిలోని 24,372 ఎకరాలకు జీడీపీ నీరే ఆధారం. నిర్మించింది మొదలు ఈ రోజు వరకు తీసుకుంటే జూలై నెలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో నేడో, రేపో ప్రాజెక్టు గేట్లు పైకెత్తి హంద్రీనదికి విడుదల చేసేందుకు అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. నదీతీర గ్రామాల వారిని అప్రమత్తం చేసేందుకు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల ఆయకట్టుకు జలజీవాలు.. మైనర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల కింద 634 చెరువులుండగా వాటి పరిధిలో 80,226 ఎకరాల స్థీరికరించిన ఆయకట్టుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల బనగానపల్లె, డోన్ నియోజకవర్గాలు మినహా 90 శాతం చెరువులు పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరాయి. ఫలితంగా ఆయా చెరువుల కింద ఆయకట్టు భూముల్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లోను మించి అవుట్ ఫ్లో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలంకు ఇన్ఫ్లో, అంతకు మించి ఆవుట్ ఫ్లో కొనసాగుతోంది. కష్ణా నది ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా కుడి, ఎడమ పవర్ హౌస్ల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువన ఉన్న సాగర్కు 32 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 824.60 అడుగుల నీటిమట్టం వద్ద 44.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి మట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు పంపింగ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
రాయికోడ్ మండలంలో 205 మి.మీ వర్షపాతం
రాయికోడ్ : మండలంలో జూలై నెలలో 205 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 225 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్లో నిరాశ పరిచిన వర్షాలు జూలైలో ఊరటనిచ్చాయి. జూన్ నెలలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 మిల్లీమీటర్లు కురిసింది. జూలై 6న 24 మిల్లీమీటర్లు, 21న 30 మిల్లీమీటర్లు, 22న 80 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటపొలాలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని హస్నాబాద్ చెరువు పొంగిపొర్లుతోంది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక కరువును చవిచూసిన జనం చెరువులు నిండటంతో వాటిని వీక్షించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టులోనూ ఆశించన మేర వర్షాలు కురిసి తమ అంచనాలకు తగ్గట్టుగా పంటల దిగుబడులు రావాలని ఆశిస్తున్నారు. మండలంలో అత్యధికంగా ఈ ఏడాది 7,500 హెక్టార్లలె పత్తి పంటను సాగు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 14 వేల మంది రైతుల్లో 10 వేల మంది పత్తి సాగు చేశారు. 5 వేల మంది రైతులు 4,500 హెక్టార్లలో సోయాబీన్, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేశారు.