Niranjan Reddy
-
సభలో టీడీపీని నవ్వులపాలు చేసిన YSRCP ఎంపీలు
-
బాధితుడినే నిందితుడిగా మార్చారు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్టాప్లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్ను బెదిరించిన మెసేజ్లు అందులో ఉన్నాయని తెలిపారు.అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.ఆ బాధ్యత పోలీసులపై ఉందినిరంజన్రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్పై దాడి కేసులో సురేష్ రిమాండ్ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రక టించిన రేవంత్రెడ్డి ప్రభు త్వం అరకొరగా అమలు చేసిందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం నోరు పారేసుకుని దుర్భాషలాడతారా అని బీఆర్ఎస్ మాజీమంత్రి ఎస్.నిరంజన్రెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నేత ఇంతియాజ్ ఇషాక్తో కలసి నిరంజన్రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.రుణమాఫీ తోపా టు ఆరు గ్యారంటీలను రేవంత్ చెప్పిన గడువు లోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తాన ని హరీశ్ అన్నారని అయితే రేవంత్ మాత్రం రుణమాఫీ అమలు పూర్తయిందని దబాయిస్తు న్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రైతు లందరికీ రూ.31వేల కోట్ల రుణమాఫీ జరుగు తుందని చెప్పి, ప్రస్తుతం రూ.17వేల కోట్లకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్రావును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఇప్పటివరకు 1,11,027 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
-
ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఎంపీ నిరంజన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.కాగా, రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు . ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘కేంద్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్న పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దు. పెట్టుబడిదారుల్లోభయాన్ని తొలగించాలి. అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు. దాని వల్ల దేశానికి జీడీపీకి పెద్దగా ఉపయోగం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ, మరో వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరించిందన్నారు. రాజ్యాంగ నియమాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభా పక్షాలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయని వివరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుతుండగా, రాహుల్గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ద్వంద్వ విధానాలకు రాహుల్ గాంధీ స్వస్తి పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 33 శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. దీనిని బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఆగడాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టు కుని దానినే అపహాస్యం చేస్తున్నారని నిరంజన్రెడ్డి విమర్శించారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో శనివా రం రాహుల్ గాంధీకి నిరంజన్రెడ్డి లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ .. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశి్నస్తామని, రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్ను బీజేపీ ఇక్కట్లకు గురిచేసిన సందర్భంలో పారీ్టలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. -
నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్రెడ్డి పాలన సాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైనందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ కి ఫిర్యాదు
-
అరాచకాన్ని అరికట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా కొనసాగుతున్న దాడులు, హింసాకాండను తక్షణం అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను పార్టీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ అల్లరిమూకలు సంధి కాలాన్ని ఎంపిక చేసుకుని విధ్వంసాలకు తెగబడటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టం చేసింది.అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని కోరింది. ఈమేరకు రాష్ట్రపతి, గవర్నర్కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్ రెడ్డి గురువారం విడివిడిగా లేఖలు రాశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను మరో లేఖ ద్వారా కోరారు. ఆ లేఖల్లో పేర్కొన్న వైఎస్సార్సీపీ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లలపై దాడులు..రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అసాంఘిక శక్తులు యథేచ్చగా హింసాకాండకు పాల్పడుతున్నాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, పిల్లలపై దాడులకు దిగడంతోపాటు ఇక మీదట మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాయి. బాధిత కుటుంబాలు ప్రాణ భయంతో ఇళ్లు, గ్రామాలను విడిచిపెట్టి వెళుతున్నాయి. వైఎస్సార్సీపీకి చెందినవారి ఆస్తులపై దాడులు చేస్తూ జీవనాధారాన్ని నాశనం చేస్తుండటంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు శాఖ నిర్లిప్తతఅల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నా పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందనా లేదు. పరిస్థితి తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత 24 గంటల్లో దాడులు, దౌర్జన్యాలు అమాంతం పెరగడం వెనుక పక్కా కుట్ర ఉంది. ఇవిగో ఆధారాలు వైఎస్సార్సీపీనేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై రౌడీమూకల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మీడియాలో ప్రచురితమైన కథనాలను మీకు సమర్పిస్తున్నాం. వాటిని పరిశీలించి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న విధ్వంసకాండ తీవ్రతను గుర్తించాలని కోరుతున్నాం. తక్షణం దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలి. శాంతి భద్రతలను కాపాడి ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించండి. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
దస్తగిరితో చంద్రబాబే పిటిషన్ వేయించారు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, వైఎస్ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్రెడ్డి తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవాదులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. వారివి సంబంధం లేని వాదనలు సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్కు బెయిల్ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కోర్టు అవినాశ్కు బెయిల్ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయస్థానం అవినాశ్కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్తో కలసి నడుస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూవర్ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెనుకేసుకుని వస్తోంది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమెతో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని బెయిల్ను రద్దు చేయాలని ఆమె కోరలేదు. ఎవరు ఏ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతూ అవినాశ్ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ ‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబిరం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు. జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తున్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్తగిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు. విచిత్రమేమిటంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లోనూ అవినాశ్ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్ను కొట్టివేయాలి’ అని నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డి, గజ్జల ఉదయ్కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్రెడ్డికి భాస్కర్రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్రెడ్డితోపాటు ఉదయ్కుమార్కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్రెడ్డి అన్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్కృష్ణ తెలిపారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది: మాజీమంత్రి నిరంజన్రెడ్డి
-
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి: నిరంజన్రెడ్డి
-
రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకాలను దుబారా అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు భిక్ష అంటున్న కాంగ్రెస్ పార్టీకి, రైతులు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో బ్యాంకు అప్పుల వసూలుకు రైతుల ఇంటి తలుపులు తీసుకెళ్లిన ఘటనలు ఉండేవని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వెల్లడించారు. కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పాలమూరు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతుల పొలాలకు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి శిస్తురద్దు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ద్వారా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడం ద్వారా విత్తన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. నిందలు, వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను పట్టించుకోరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
హింసను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలోకి వెళ్లా రని, అందుకే హింసను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగెస్ర్ నేతలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హిత వు చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడా హింసకు తావివ్వలేదని.. అవహేళనలు, అవమా నాలు, కవ్వింపులు జరిగినా సంయమనం పాటించినట్లు చెప్పారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం హేయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగం, రావుల, పి.చంద్ర శేఖర్, ఎర్ర శేఖర్ల రాకతో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలోనే నేతలకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లో ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కారని, పారాచూట్ నేతలకు టికెట్లిచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు ‘కొనుగోలు’గా మారారని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ ఎంపీపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందే: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సంస్కారం లేని వాడిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పరుష పదజాలంతో స్థాయి మరిచి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తాము తప్ప ఎవరూ అధికారం చేయొద్దు అనే రీతిలో వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. అహింస పద్దతిలో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. కేసిఆర్ ను వ్యూహాత్మకంగా ఢీకొట్టలేక హింసాత్మక సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే నిన్న మా ఎంపీపైన కత్తితో దాడి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకునే సత్తా ఉందని తెలిపారు. పక్క పార్టీల్లో విశ్వాసం కోల్పోయే పరిస్తితి కి వచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
జడ్చర్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలి టీలోని నాగసాల శివారులో సింగిల్విండో వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. నిరంజన్రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గోదాంల నిల్వసామర్థ్యం 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షుడు వాల్యానాయక్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
మట్టిని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి. -
వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధి ల్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆకాంక్షించా రు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం ఎంతో పురోగతి సాధించింది. జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుంచి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొ క్క ఎదుగుదలను ప్రతి దశలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని మంత్రి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపా రు. మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వల్ల లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. ప్రపంచస్థాయికి తెలంగాణ వ్యవసాయం: తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని నిరంజన్రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమన్నారు. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదని అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రం డికెటర్ నగరంలోని అతిపెద్ద ఫార్మ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. -
అయోవా–తెలంగాణ మధ్య పరస్పర సహకారం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అయోవా రాష్ట్రం – తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలున్నాయన్నారు. రెండు రాష్ట్రాలూ ఆహారధాన్యాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో నంబర్ వన్గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. పలు విధాన నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందన్నారు. తెలంగాణ సాధించిన విజయాలు గర్వించదగ్గవని ఆడమ్ కితాబిచ్చారు. తెలంగాణలో ఐదు విప్లవాలు అనంతరం నిరంజన్రెడ్డి అయోవా సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మైక్ నెయిగ్ను కలిశారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో వృద్ధి సాధించి నీలి విప్లవం సాధించామని చెప్పారు. అలాగే, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్ రెవల్యూషన్ సాధించిన తెలంగాణ, ఇప్పుడు నూనె గింజల ఉత్పత్తిలో పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తోందని వివరించారు. తెలంగాణ సాధించిన అయిదు విప్లవాల గురించి విన్న మైక్ నెయిగ్ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే ప్రపంచంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ వర్సిటీ అయిన అయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ను మంత్రి సందర్శించారు. వర్సిటీ ప్రెసిడెంట్ వెండీ వింటర్స్టీన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయోవా వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం ఉండాలనే చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఫోటో ఆయన ఇంట్లో ఉంటే నీకేంటి నొప్పి
-
త్వరలోనే తెలంగాణకు వస్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వచ్చి వ్యవసాయ ప్రగతి చూస్తానని హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ అన్నారు. తన ఆరోగ్యం కుదుటపడ గానే రాష్ట్రానికి వస్తానని చెప్పారు. చెన్నైలో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్తో బుధవారం ఆయన నివాసంలో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్రావు భేటీ అయ్యారు. అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ విజ యాలను వివరించామని నిరంజన్రెడ్డి తెలిపారు. స్వామినాథన్ స్ఫూర్తి తోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పామన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, పంటల కొను గోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. 98 ఏళ్ల వయసులోనూ స్వామినాథన్ జ్ఞాపకశక్తి అమోఘమన్నారు. ఈ భేటీలో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు. -
57.24 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం... రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. -
రుణాలివ్వడమూ సాయమేనా?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి రూ. 20 లక్షల కోట్లు, గొర్రెల కోసం రూ. 23 వేల కోట్ల రుణాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గొప్పగా చెప్పుకోవడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రుణాలివ్వడమూ సాయమేనా అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదేనని, బీజేపీ పాలనలో కొత్తగా వచ్చింది కాదని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గి, వినియోగం పెరిగిందని విమర్శించారు. రూ.6,300 కోట్లతో ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి అరబస్తా యూరియానైనా రైతుల కోసం ఉత్పత్తి చేశారా? దానిని మార్కెట్లోకి పంపించారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వాస్తవాలను దాచిపెట్టి రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఇస్తే, రైతుబంధును అనుకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.9,500 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. ఫసల్ భీమా యోజన.. బీమా కంపెనీల ప్రయోజనాల కోసమేనని, ఈ పథకం ప్రీమియం ఎక్కువ.. పరిహారం తక్కువ అని వ్యాఖ్యానించారు. పెంచిన మద్దతుధరల గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, పెరిగిన సాగు ఖర్చుల గురించి మాట్లాడాలని, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రైతాంగం నడ్డి విరిగిందని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్రప్రభుత్వం.. రైతుల సాగు ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్కు జాతీయహోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే, తెలంగాణలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాకూ నిధులు కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. -
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. -
‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు. -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
రఘునందన్ రావు ఎవరి మెప్పు కోసం నాపై ఆరోపణలు చేశారో తెలియదు
-
ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్గల్లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. రఘునందన్పై చట్టపరంగా ముందుకెళ్తాం పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్హౌస్ ఎలా? -
165 ఎకరాల్లో ఫామ్హౌస్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ కట్టుకుంటే తాము కట్టుకోవద్దా అని మంత్రులు కూడా ఫామ్హౌస్లు కట్టుకున్నారన్నారు. రఘునందన్రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూడు ఫామ్హౌస్లు కట్టిన వ్యవసాయ మంత్రి ‘వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం మూడు ఫామ్హౌస్లు కట్టారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాల విసీర్ణంలో ఒక ఫామ్హౌస్ నిర్మించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారు. ఈ భూమిలో మూడున్నర ఎకరాల సీసీ రోడ్డు నిర్మించారు. గిరిజనుల పేరిట రూ.7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్హౌస్ ఎలా కట్టారు?. నదిలో గోడ కట్టడంతో పాటు, మట్టి నింపి రీ సిల్టింగ్ చేయడం.. ఇవన్నీ నేరాలే. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఓ గిరిజన సోదరి పేరు నుంచి మంత్రి కుటుంబసభ్యుల పేర్లపైకి బదిలీ అయ్యాయి. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకుని కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. మానవపాడు మండల తహశీల్దార్ కార్యాలయం 2021 అక్టోబర్లో తగలబడి ఈ ఫామ్హౌస్ భూములకు సంబంధించిన రికార్డులు కాలి బూడిదయ్యాయి. అధికారులు కేసు పెట్టాక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, ఇప్పటివరకు చార్జిషీట్ వేయలేదు. ఇదిలావుండగా పాన్గల్ మండలం కొత్తపేట గ్రామ పంచాయితీలో వంద ఎకరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి మరో ఫామ్హౌస్ కట్టారు. పెద్ద మందాడి మండలం మోజర్ల సమీపంలో 50 ఎకరాల్లో ఇంకొక ఫామ్హౌస్ కట్టారు. ఇంకా చాలామంది మంత్రుల ఫామ్హౌస్ల చరిత్రలు నా వద్ద ఉన్నాయి..’అని రఘునందన్ చెప్పారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలి ‘గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటల రాజేందర్ను, అంతకుముందు ఓ దళిత మంత్రిని కేబినెట్ నుంచి తొలగించారు. మరి ఇప్పుడు నిరంజన్రెడ్డిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోవడం లేదు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఒక న్యాయం.. అగ్రకులాల వారికి మరో న్యాయమా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. అవినీతిని ఉపేక్షించకుండా సీఎం కేసీఆర్ మంత్రిపై చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను కబ్జా చేస్తున్న వారిని, తహసీల్ ఆఫీస్లను తగులబెట్టి, రికార్డులు లేవు కాబట్టి తమ పేరిట ఆస్తులు మార్చుకోవాలని చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..’అని రఘునందన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర వేదికలను కూడా ఆశ్రయిస్తామని అన్నారు. -
అవినాశ్, భాస్కర్రెడ్డిలను ఇరికించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ నేతలు, వైఎస్ సునీత కలసి తప్పుదారి పట్టిస్తున్నారని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిలను కేసులో ఇరికించేందుకు కుట్ర సాగుతోందని భాస్కర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. టీడీపీ నేతలు, సునీతకు సీబీఐ దర్యాప్తు అధికారి కూడా పూర్తిగా సహకరించారని చెప్పారు. దర్యాప్తు సరిగా చేయడం లేదని భావించిన సుప్రీంకోర్టు ఆ అధికారిని విచారణ నుంచి తప్పించిందని వివరించారు. ప్రత్యక్ష సాక్షులను, ఆధారాలను పట్టించుకోకుండా దస్తగిరి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించినా, బెయిల్ ఇచ్చినా సునీత మౌనంగా ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని వెల్లడించారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ చెప్పినట్లు ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని, అతనికి బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలివ్వాలి’ అని కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చింది. అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలంలో చెప్పిన వాటికి సాక్ష్యం లేదు. ఇలా ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒకరు చెప్పారంటూ వ్యక్తులను నేరంలోకి నెట్టడం చట్టవ్యతిరేకం. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీరిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇచ్చారు. దస్తగిరిని కస్టడీలోకి తీసుకోలేదు. విచారణా జరపలేదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు దస్తగిరి హత్యలో కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. అతని వద్ద కొంత నగదు కూడా దొరికింది. ఆయుధాన్ని అతనే తెచ్చినట్లు, హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అతన్ని అప్రూవర్గా ప్రకటించేలా కడప కోర్టులో సీబీఐ కౌంటర్ వేసింది. 2021 ఆగస్టులో అనుకూల వాంగ్మూలం ఇచ్చిన కారణంగానే అక్టోబర్లో బెయిల్కు సీబీఐ సహకరించింది. మన వెనుక అవినాశ్, భాస్కర్రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ చెబుతోంది. అసలు ఎవరి పేర్లూ చెప్పలేదని గంగిరెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడంలేదు. వారికి ఏది కావాలో దాన్నే పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తు్తన్నారు. గూగుల్ టేక్ అవుట్ డేటాను ఆధారంగా చేసుకోవడం సరికాదు’ అని నిరంజన్రెడ్డి వాదించారు. టీడీపీతో సునీత మిలాఖత్ ‘వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు. ఇది మొదటి భార్య, కూతురు సునీత, అల్లుడికి నచ్చలేదు. ఆస్తుల విషయంలోనూ వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు కూడా ఉన్నాయి. అలాగే తన తల్లితో వివేకా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సునీల్ యాదవ్ చెప్పాడు. ఇలాంటి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగింది. వీటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్తో వివేకా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నికల్లో అవినాశ్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. వివేకా హత్య తర్వాత ఇదే విషయాన్ని సునీత కూడా చెప్పారు. టీడీపీతో ఆమె మిలాఖత్ అయినప్పటి నుంచి మాట మార్చారు. విభేదాలు ఉన్న వారిని వదిలిపెట్టి.. సన్నిహితులను కేసులో ఇరికించేందుకు పథకం సాగుతోంది. దస్తగిరిపై వాచ్మేన్ రంగన్న చెప్పిన ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడం చట్టవిరుద్ధం. అతనికి బెయిల్ ఇచ్చే సమయంలోనూ అన్ని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్ చట్టప్రకారం ఇవ్వలేదు కనుక కడప కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. దర్యాప్తు అధికారులకు అవినాశ్, భాస్కర్రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు హాజరవుతున్నారు. భాస్కర్రెడ్డిని నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్రెడ్డి నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
'పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు.. 9 ఏళ్లుగా ఆత్మాభిమానం ఎటుపోయింది'
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. 'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది. కేసీఆర్ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ -
గద్వాలలో సరెండర్ లొల్లి!.. హాట్టాపిక్గా మారిన వ్యవహారం
సాక్షి, మహబూబ్నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్టాపిక్గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్ను పంచా యతీరాజ్శాఖ కమిషనరేట్కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్మీట్ నుంచే మంత్రికి ఫోన్.. తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు. కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
అవినాశ్పై తొందరపాటు చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లో పూర్తిగా సీల్డ్ కవర్లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది. పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. ‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు. మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్రెడ్డి వివరించారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్రెడ్డితోపాటు భాస్కర్రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు. వీడియో రికార్డింగ్తోనే విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్రెడ్డికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. వివేకా లేఖను తొక్కిపెట్టారు.. ‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు. -
ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ మాదాపూర్: సాగులో నూతన పద్ధతులు, ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉంటూ వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. పంటల సాగు కు అనేక రాయితీలను అందిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్స్లో కిసాన్ అగ్రి షో–2023ను కిసాన్ ఫోరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్వినర్ నిరంజన్ దేశ్పాండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారని నిరంజన్రెడ్డి చెప్పారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న పలు ఆవిష్కరణలను చూస్తుంటే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్ఛితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకురాగలదని అనిపిస్తోందని అన్నారు. వినూత్న ఆవిష్కరణలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అధిక దిగుబడులను పొందాలని రైతులకు సూచించారు. మనకు అవసరమైన పంటలతో పాటు విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరారు. దేశంలో పప్పు దినుసులు, వంటనూనెల కొరత నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ, ప్రపంచ అవసరాలకు సరిపడే విధంగా రైతాంగం తమ పంటలను పండించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు. నూతన సాంకేతికతల వినియోగానికి.. హైదరాబాద్లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడంపై నిరంజన్ దేశ్ పాండే హర్షం వ్యక్తం చేశారు. వ్యవ సాయ రంగంలో నూతన సాంకేతికతల వినియోగానికి ఈ ప్రదర్శన బాట వేయగలదన్నారు. 20కి పైగా అగ్రి స్టార్టప్స్ నూతన సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. జ్ఞాన కేంద్రం వద్ద రైతులు తెలంగాణకు పనికొచ్చే నూతన సాంకేతికతల గురించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పారు. 160కి పైగా కంపెనీల అనుసంధానం అగ్రి స్టార్టప్స్ ప్రత్యేక విభాగమైన స్పార్క్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాష్ట్ర వ్యవసాయ వర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం సహా పెద్ద సంఖ్యలో ప్రధాన పరిశ్రమలు ఈ షో కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మూడురోజుల పాటు కొనసా గే ఈ ఎక్స్పోలో 150కి పైగా ఎగ్జిబిట ర్లు పాల్గొంటున్నా రు. ఈ వేదిక ద్వారా 160కి పైగా కంపెనీలు అనుసంధానం కాగలవని అంచనా. ఆకట్టుకుంటున్న స్టాళ్లు.. అగ్రి ఇన్పుట్, నీటి నిర్వహణ, పరికరాలు, ఉపకరణాలు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్కు సంబంధించిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలు, ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగా అభివృద్ధి చేసిన ఎన్నో వినూత్న వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. -
అవును.. అప్పుడు పేదలు గట్కే తిన్నరు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు ఆకలి రాజ్యమేలింది. తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న గట్క, సజ్జలు, ఒట్టు వడ్లు, నల్లవడ్లు, మొక్కజొన్న గట్క తిని పేదలు బతికేవారు. మా ఊళ్లో మేం గట్క తిని, గంజి తాగేవాళ్లం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యంపోయింది’అని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యంలో కాసాని సోమవారం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని ఎద్దేవా చేశారు. 15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని, ఆ 15 రోజులలోనే కొన్ని వేలమంది ప్రజలు తిండికి అలమటించేవారని గుర్తుచేశారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేదలకు కడుపు నిండా తినే అవకాశం రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా ఇచ్చారని పునరుద్ఘాటించారు. కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో ధమ్ బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్రెడ్డి చెప్పాలని, హైదరాబాద్లోని పాతబస్తీ హోటళ్లలో దొరికిన ధమ్ బిర్యానీ మహబూబ్నగర్లో దొరికిందా అని ప్రశ్నించారు. దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని పేర్కొన్నారు. పచ్చజొన్నలు తినడం కరెక్టు కాదా? ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చారా.. లేదా..? ఆహార భద్రత తెలుగుదేశం పార్టీ వచ్చాకే వచ్చిందనడం వాస్తవం కాదా? చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని ఆయన సవాల్ విసిరారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రూ.2కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికి పరాకాష్ట అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, 15వ శతాబ్దం నుంచే హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి అని పేర్కొన్నారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేకసార్లు ప్రస్తావించారని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ప్రసిద్ధి అని వివరించారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల వరకు గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్ధికి బాటలు వేశారని వివరించారు. అక్కసు, ఆక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అని, 1956లో ఆంధ్రలో విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని పేర్కొన్నారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జొన్నకలి, జొన్నయంబలి జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’ అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని నిరంజన్రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
5.42 లక్షల మందికి రుణాలు మాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రూ. 36 వేల వరకు రుణాలున్న 5.42 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్లో రూ. 90 వేల వరకున్న రుణాల మాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. శాసనసభలో ఆదివారం సభ్యులు బీరం హర్షవర్ధన్రెడ్డి, బిగాల గణే‹Ù, నలమోతు భాస్కర్రావు, ఆశన్నగారి జీవన్రెడ్డి, అంజయ్య యాదవ్, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ కొల్లాపూర్ మండలం రాంపూర్లో రూ. 5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, త్వరలోనే అక్కడ మార్కెట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. -
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్గౌడ్ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటాం
సాక్షి, హైదరాబాద్: కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించామని, మొక్కలు నాటేందుకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా కంపెనీలు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని, రైతు వేదికలలో శిక్షణ ఇప్పించాలని, ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు వారికి అవగాహన, ఇతర సహకారం కల్పించాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుపై శనివారం రెడ్హిల్స్ ఉద్యాన శిక్షణ కేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా 1,502 ఎకరాల్లో 38 ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి కావాలని ఆదేశించారు. 2023– 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్ పామ్ మొక్కలు ఉన్నాయని, ఇవి మరో 1.50 లక్షల ఎకరాలకు సరిపోతాయని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ జరిగిందని, నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ఈ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ఐఐసీ ద్వారా భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బొప్పాస్పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల కేంద్రాల ఏర్పాటుపై పరిశీలనకు అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఓట్ల కోసం ఏదైనా చేస్తారు
సాక్షి, సిద్దిపేట: ‘గోవును, గుడిలో భగవంతున్ని పూజించేది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్లతో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి అని ప్రశ్నించారు. ధరలు పెంచడం తప్ప ఎవరికి ఏం చేశారని నిలదీశారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కోట్ల కొలువులు ఇస్తా మని ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభు త్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. మిషన్ 90 సీట్లు కాదు: నిరంజన్రెడ్డి మిషన్ 90 సీట్ల పేరుతో తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని ఓ బీజేపీ నాయకుడు అన్నాడని, వాళ్లు మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికష్టాలొచ్చినా సీఎం కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందని.. అలాంటి కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీకి చెందిన వ్యక్తికి చెక్కు ఆపేశా..: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ నిజామాబాద్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన చెక్కును ఆపేశానని చెప్పారు. ’’ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెక్కు రాలేదని అడిగాడు.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎందుకు..ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావ్ ’’అని అడిగానని బాజిరెడ్డి తెలిపారు. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని ప్రశ్నించానని చెప్పా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర సైతం ఓ గుండు గాడు ఉన్నాడని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ’’బీజేపీ వాళ్లు జై శ్రీరామ్ అని అంటున్నారు.. మోదీకి భార్య లేదు కాబట్టి శ్రీరాముని భార్య సీతను కూడా విడదీస్తారా.. జై సీతారామ అనాలి’’అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు తెలంగాణ ద్రోహి: నిరంజన్ రెడ్డి
-
టీఆర్ఎస్లో పీక్ స్టేజ్కు పాలిటిక్స్.. మంత్రితో జెడ్పీ చైర్మన్ వాగ్వాదం!
వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతలుగా జిల్లాకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం హెల్త్ సెక్టార్ గ్రాంట్స్ రూ.84 లక్షలు, రూ.2.10 కోట్ల నిధుల కేటాయించగా.. వాటిని వినియోగించే అంశంలో జెడ్పీ సమావేశంలో మంత్రి అధికారులు సూచనలు చేశారు. అయితే ‘మా ప్రమేయం లేకుండా పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ చేస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు జనం గౌరవం ఏముంటుంది. ఈ పాటిదానికి గ్రాంట్ జెడ్పీకి ఇవ్వటం దేనికి.. నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి మీరే పనులు చేయిస్తే.. సరిపోతుంది కదా.’ అని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి నిలదీశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ప్రభుత్వం నిధులతో పాటు ఇచ్చిన నిబంధనలను పాటించి నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. గ్రాంట్ విడుదలైన తర్వాత నాలుగుసార్లు నిధులను వెచ్చించే నిబంధనలను మార్చుతూ.. సర్క్యులర్ పంపించారు. ఎంత వరకు సమంజసం అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశంలో కూర్చోవాలా.. వెళ్లిపోనా.. అంటూ జెడ్పీ చైర్మన్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన నిమ్మకుండిపోయారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల జిల్లాఅధికారుల ఎదుట మంత్రి, జెడ్పీ చైర్మన్ విభేదించుకోవటం చూసి నివ్వెరపోయారు. కొద్దిసేపటికే.. మంత్రి సమావేశం నుంచి మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందంటూ.. వెళ్లిపోయారు. -
అత్యాధునిక టెక్నాలజీతో విత్తన పరీక్షా కేంద్రం
ఏజీవర్సిటీ(హైదరాబాద్): ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ మారిందని, మన విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్లోని విత్తన పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయస్థాయి విత్తన పరీక్ష వర్క్షాప్ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణకే కాకుండా భారత విత్తన పరిశ్రమకు సేవలు అందించడానికి అత్యా«ధునిక టెక్నాల జీతో విత్తన పరీక్షాకేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విత్తనోత్పత్తిదారులకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ వర్క్షాప్ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తనరంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ ఈ విత్తన పరీక్షాకేంద్రంలో మనదేశంలోని విత్తనోత్పత్తి సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతుల తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఎంతో నేర్చు కోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణుడు ఎడ్డీ గోల్డ్శాక్(సౌతాఫ్రికా) మాట్లాడుతూ తెలంగాణలో నాణ్య మైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ విత్తనోత్పత్తి రంగానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, అందుకే తెలంగాణ అంతర్జాతీయస్థాయి కార్యక్రమానికి వేదిక అయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన సంస్థ ఎం.డి. కేశవులు మాట్లాడుతూ ఈ వర్క్షాప్లో అను భవజ్ఞులైన అంతర్జాతీయస్థాయి విత్తన ప్రముఖులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే వర్క్షాప్లో ఇండియాతోపాటు టాంజానియా, కెన్యా, ఇండోనేíసియా, డెన్మార్క్, దక్షిణ కొరియా, నైజీరియా, ఆస్ట్రే లియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు బేడీలంటే భయం లేదు.. నేను పులి బిడ్డను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటాను. అవినీతిపై మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు అంత వణుకెందుకు?. అవినీతిపై చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిది నోరా? మోరినా? అని ఆగ్రహం చేశారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు. పోలీసులు టీఆర్ఎస్కు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను టీఆర్ఎస్లో విలీనం చేయాలి. మంత్రి నిరంజన్ రెడ్డిపై మేము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేసి పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గంగాపూర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్దే అన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడక్కడా మిగిలిన పనులను సైతం సీఎం కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. -
తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు!
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం.. గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు. తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్తో పాటు ఆర్బీకే చానల్ తరహాలో ఓ అగ్రి చానల్ను ప్రారంభిస్తామని నిరంజన్రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్లో ఉన్న మినుము సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలిస్తారు. -
విశ్వసాహితీ మూర్తి సినారె
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, విశ్వ సాహితీమూర్తి సి.నారాయణరెడ్డి చిరస్మరణీయుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవం తెచ్చి పెట్టారన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పుర స్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్కు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి అంశాల చుట్టూనే సాగిందన్నారు. ఆలోచనాత్మక కావ్యం విశ్వంభర ఆయనను విశ్వసాహితీ పీఠంపై నిలబెట్టిందని అభినందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా.. ఆయన తన ప్రతి పదవికీ వన్నె తీసు కొచ్చారని గుర్తుచేశారు. సినారె తెలుగుదనానికి నిలువెత్తు సంతకమన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో మాతృభాష బిల్లు ప్రధానమైందన్నారు. ఉన్నత విద్యవరకు మాతృభాష ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని పట్టుబట్టారని, నూత న జాతీయ విద్యావిధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన ఆకాంక్షించిందేనని చెప్పారు. ప్రతిభారాయ్ మాట్లాడుతూ, సినారె పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ ప్రారంభంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య, రచయిత్రి ఓల్గా, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
రుణంతో సాగు చేసినా సబ్సిడీ: నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులు రుణం తీసుకుని ఆయిల్పామ్ సాగు చేసినా వారికి చెందాల్సిన సబ్సిడీని అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రుణం అనేది ఆప్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తేయడంలేదని స్పష్టం చేశారు. ఆయిల్పామ్ డిమాండ్ను గమనించే ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేలమంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామని వెల్లడించారు. -
తెలంగాణపై కేంద్రం అక్కసు
గజ్వేల్: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం అక్కసు వెళ్లగక్కుతోందని.. నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల్లో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రకు తెరలేపిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎరువుల రేక్ పాయింట్, గూడ్స్ రైలును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు వరంగల్కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయామని చెబుతారా?, నీతి ఆయోగ్ చెప్పినా.. రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని చెబుతారా?, ఐటీఐఆర్ను రద్దు చేశామని చెబుతారా? అంటూ ప్రశ్నిం చారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో రాష్ట్రం ఖర్చుపెట్టిందే ఎక్కువన్నారు. భూసేకరణ, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ.650 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. రైలు లాభాలు ఇలా.. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల మేర కొత్తగా బ్రాడ్గేజ్ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.1,160.47 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్ గా ఆవిర్భవించనుంది. ఇది పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. సిద్ది పేట జిల్లాతోపాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీదుగా కొడకండ్ల వరకు 43 కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ను ప్రత్యామ్నాయంగా మార్చి.. దేశంలోని ముఖ్యమైన నగరాలకు కొన్ని కొత్త రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించారు. ఇక్కడి రేక్ పాయింట్కు తొలిరోజు సోమవారం గూడ్స్ రైలు ద్వారా ఏపీలోని కాకినాడ నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్కు చెందిన 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయి. భవిష్యత్లో ఎఫ్సీఐ గోదాములకు, అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల తరలింపు, కూరగాయల రవాణా కోసం వినియోగించనున్నారు. -
రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎంపికైన వైఎస్సార్సీపీ సభ్యులు ఎస్.నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్య తెలుగులో, నిరంజన్రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు, తెలంగాణ నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు దామోదర్రావు, పార్థసారధిరెడ్డిలతో కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ తదితరులు హాజరయ్యారు. -
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, ఎస్.నిరంజన్రెడ్డి నూతన ఎంపీలుగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం) -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్ రెడ్డి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చేతుల -
వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బీసీలకు సముచిత స్థానం: బొత్స అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నామినేటెడ్ పదవులతోపాటు నామినేషన్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: సజ్జల బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే.. 1.ర్యాగ కృష్ణయ్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 13, 1954 విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్పేట మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. ► 2014లో హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2. వేణుంబాక విజయసాయిరెడ్డి పుట్టిన తేదీ: జూలై 1, 1957 సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ పదవులు: ► ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా పనిచేశారు. ► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. ► వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు)కు ఎంపికయ్యారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3. బీద మస్తాన్రావు పుట్టిన తేదీ: జూలై 2, 1958 సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్) ► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ► చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్లో ఫైనాన్షియల్ మేనేజర్గా పనిచేశారు. ► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు. ► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. ► బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ► 2019 డిసెంబర్లో వైఎస్సార్సీపీలో చేరారు. ► బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ► కోవిడ్ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్కు విరాళం ఇచ్చారు. ► 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ వాషింగ్టన్, యూఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 4. నిరంజన్రెడ్డి పుట్టిన తేదీ: జూలై 22, 1970 సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ విద్యార్హతలు: హైదరాబాద్లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్లో న్యాయ విద్యను అభ్యసించారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా సేవలు అందించారు. -
నిరంజన్రెడ్డి: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై పట్టున్న న్యాయ నిపుణుడు
సాక్షి, నిర్మల్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డిని వైఎస్సార్సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయన. పైగా కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉంది ఈయనకు. అందుకే రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. జులై 22, 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు నిరంజన్రెడ్డి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్లోనే ఉన్నత విద్యంతా పూర్తి చేశారు. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు.. నేపథ్యాలు ఇవే!
సాక్షి, అమరావతి: జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తూ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది వైఎస్సార్సీపీ. పైగా గత మూడేళ్లలో అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది కూడా. తాజాగా పెద్దల సభకు పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే.. ఆర్ కృష్ణయ్య ► ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. ► సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ► ఎంఏ, ఎంఫిల్తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. ► విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ► నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. ► 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్రావు ► ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్రావు. ► జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జననం. ► విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్నకు ఫైనాన్షియల్ మేనేజర్గా పని చేసిన బీద మస్తాన్రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ► బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. ► బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్గానూ పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్గానూ పనిచేశారు. ► రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్రావు. విజయసాయి రెడ్డి ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. ► 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. ► చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ► రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. ► రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. ► జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► హైదరాబాద్లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్రెడ్డి. ► ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ► రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్గా పని చేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
రాజ్యసభకు నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖరారు
-
ఏపీ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు. -
‘పంజాబ్లో మీ పార్టీని ఈడ్చి తన్నారు’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే బీజేపీలో చేరుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘రెండు పర్యాయాలు క్షమించకనే ఓడించారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది మేము చేస్తున్నాం. మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?. పంజాబ్ లో ఈడ్చి తన్నారు. మీ కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని పంజాబ్ ప్రజలు శిక్షించారు. తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోంది.రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతుంది. మీరు ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారు.జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదు. ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాదించుకున్నాం.పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్దించింది. నిన్న మొన్న కాంగ్రెస్ను తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి👉టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు -
వారు తిష్ట వేసినా ఫలితం ఉండదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కాదు. ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలాంటి వాళ్లు వచ్చి ఇక్కడే తిష్ట వేసినా ఫలి తం ఉండదు’అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అడ్డాలో ఎవరి ఆటలు సాగవన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను అబద్ధాలతో నిం దిస్తే ప్రజల అభిప్రాయం మారదన్నారు. అపరిపక్వ రాష్ట్ర బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్తో నడ్డా వీధిరౌడీలాగా మాట్లాడారని దునుమాడారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్కు అవార్డులు ఇస్తే, నడ్డా మాత్రం అవినీతి టీఆర్ఎస్ ప్రభు త్వం అంటూ విమర్శలు చేయడం చోద్యంగా ఉందన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి నిరూపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడ్డాకు సిగ్గుంటే 2014లో మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. బండి సంజయ్ మాటలు డబ్బాలో రాళ్లేసినట్లు ఉంటాయని ఎద్దేవా చేశారు. సీఎంను ఏక వచనంతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తా నని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిన్నటిదాకా సోనియా, రాహుల్ను బూతులు తిట్టి మళ్లీ అక్కడే రాజకీయ ఆశ్రయం పొందారని నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్లో రేవంత్ రుడాలి (చనిపోయినప్పుడు ఏడ్చేందుకు వచ్చే అద్దె మనుషులు) పాత్ర పోషిస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్కు చావు డిక్లరేషన్ అవుతుంద న్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారన్నారు. ‘2018 ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చింది.. అయినా ప్రజలు తిరస్కరించారు.. ఇప్పుడదే పాత పాట పాడుతోంది’ అని విమర్శించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి
‘‘రాజమౌళిగారు ఓ బాట వేశారు. ఇక ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న సుకుమార్గారు తీసిన ‘పుష్ప’ ఇండియన్ సినిమా అయిపోయింది. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ అయిపోయింది. అల్లు అర్జున్, యశ్, రామ్చరణ్, ఎన్టీఆర్.. అఫ్కోర్స్ వీరందరి కంటే ముందు ప్రభాస్... పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. కంటెంట్లో బలం ఉంటే ఏ ప్రాంతం వారయినా అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు చెరిగిపోవాలి. భాషతో సంబంధం లేకుండా ఇది ఇండియన్ సినిమా. ప్రతి యాక్టర్ కూడా ఇండియన్ యాక్టర్.. అనేది రావాలి.. వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రామ్చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘1988లో నాగబాబు ‘రుద్రవీణ’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేం ఢిల్లీ వెళ్లాం. కార్యక్రమానికి ముందు హైటీ ఉంటుంది. ఆ హాలులో ఇండియా సినిమా వైభవం అంటూ కొన్ని సినిమాల పోస్టర్స్, యాక్టర్స్.. అంటూ క్లుప్తంగా కొంత నోట్స్ ఉంది. పృథ్వీ రాజ్కుమార్, దిలీప్కుమార్, దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్రగార్ల ఫొటోలు ఉన్నాయి. ఎమ్జీఆర్గారు, జయలలితగారు ఉన్న స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్గారి ఫోటో ఉంది. అంతే... కన్నడ కంఠీరవ రాజ్కుమార్గారిది కానీ విష్ణువర్ధన్ గారిది కానీ, మన గొప్ప నటులు ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగార్లు కానీ, తమిళంలో శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ లేవు. ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇటు ప్రాంతీయ సినిమాలకు కూడా సరైన గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను మద్రాస్లో కూడా ఈ విషయాలను ప్రెస్తో పంచుకున్నాను. కానీ నా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసింది. మావన్నీ ఇండియన్ సినిమాలే అని ప్రతి ఒక్కరు గర్వపడేలా, ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలాంటి సినిమాలు మనం రొమ్మువిరుచుకుని నిలబడేలా చేశాయి. అలాంటి సినిమాల రూపకర్త రాజమౌళి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళిగారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిని సభాముఖంగా అభినందిస్తున్నాను. రాజమౌళిగారు ప్రోత్సహించడం వల్లే ‘ఆచార్య’ సాధ్యమైంది. చరణ్ను, నన్ను కలిసి స్క్రీన్పై సురేఖ చూడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పటికీ చరణ్ ‘ఆచార్య’ చేయడానికి రాజమౌళిగారు ఒప్పుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మా ఇంటి సభ్యుడైపోయారు. ‘డాడీ సినిమాలో నేను కనబడితే చాలు అని!’ శివతో చరణ్ అన్నాడట. నేనంటాను... చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అన్న డౌట్ వచ్చింది. రాజమౌళిగారితో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలకు, వారి తర్వాతి సినిమాలు ఫ్లాప్స్ అనే టాక్ విన్నాను. అది ‘ఆచార్య’ రూపుమాపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మరో హిట్ అవుతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మగధీర’ టైమ్లో కథ చెప్పినపుడు చరణ్ విషయాలు చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారనుకున్నాను. కానీ తర్వాతి కాలంలో చిరంజీవిగారు చరణ్కి ఎటువంటి సలహాలు ఇవ్వరని తెలుసుకున్నాను. తన తప్పులను దిద్దుకొని, దర్శకుడు చెప్పిన ప్రతీది నేర్చుకొని, తనకు తానుగా ఎదిగిన వ్యక్తి రామ్చరణ్. చిరంజీవిగారు తనతో కలిసి నటించే వ్యక్తులతో, చివరికి ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఇది చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చిరంజీవిగారి అభిమానిగా చెబుతున్నా... చిరంజీవిగారు ఎంత బాగా నటించినా నా హీరో చరణే.. సినిమాలో బాగా నటించాడు (నవ్వుతూ). మంచి సందేశాలిచ్చే సినిమాల దర్శకుడు కొరటాల శివ. మాస్ చిత్రంగా ముందుకు వస్తున్న ‘ఆచార్య’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాన్ కరెప్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. సినిమాల ద్వారానే నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నేను మా నాన్నగారిని ఇన్నేళ్లుగా చూసి ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ, మారేడుమిల్లిలో 20 రోజులు నాన్నగారితో నటించి, దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవాలతో పోలిస్తే ఈ 20 ఏళ్లు నథింగ్ అనిపించింది. నాన్నగారితో నటించడం డబుల్ బొనాంజాలా భావిస్తున్నా. మా నిర్మాతలు పెద్ద పిల్లర్స్గా నిలిచారు’’ అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘1991లో నిర్మల్లోని ఓ థియేటర్కు వచ్చారు చిరంజీవిగారు. రోడ్లపై ఉన్న ఆ జనసందోహంలో నేనూ ఒకడిని. చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేయగలిగా. యాక్టర్స్, రెమ్యునరేషన్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అసలు పారితోషికం తీసుకోకుండానే సినిమా చేశారు. సినిమా రానివ్వండి.. వచ్చిన తరవాత తీసుకుంటాము అని నాకు సపోర్ట్ చేసిన నా ఇద్దరు హీరో (చిరంజీవి–చరణ్)లు, దర్శకుడికి థ్యాంక్స్. సినిమాల బిజినెస్ ఆంధ్రాలో ఎక్కువగా ఉండేది. తెలంగాణలో తక్కువ. అలా తెలంగాణలో బిజినెస్ పరంగా కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు .. ఇలా సినిమాల కలెక్షన్స్ పెరిగాయి. ఫలితంగా థియేటర్స్ పెరిగాయి. చిరంజీవిగారి సినిమాలతోనే అది జరిగింది. ఈ రోజు తెలుగు సినిమా పాన్ ఇండియా గురించి ఆలోచించగులుతోందంటే కారణం చిరంజీవిగారే’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి సినిమాల టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చించుకున్నాం. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలనుకుంటే ఇప్పుడు ఆయనతో కెమెరా, యాక్షన్ అంటూ సినిమాకి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. సినిమాకు ‘ఆచార్య’ అని టైటిల్ పెట్టాం. కానీ మాకు చిరంజీవి అనే ఒక ఆచార్య దొరికారు’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు: రామ్చరణ్ వెబ్ సిరీస్తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
కిషన్ రెడ్డి పై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
అది ‘వ్యాపార’ కేంద్రం!
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. – వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మంత్రులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం నిరంజన్రెడ్డి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం’’అని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు. -
‘ఉప్పుడు’ నిప్పు.. పీయూష్, రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధం
యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు బియ్యంపై రాజకీయ నిప్పు రాజుకుంది!! పరస్పర విమర్శలు, వాగ్వాదానికి దారితీసింది!! ‘కేవలం ముడి బియ్యం ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి? మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలా కాదు.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి... మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డి స్పందిస్తూ ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనాలని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్రం సేకరణ విధానం మార్చుకోవాలి’ అని సూచించగా ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’ అంటూ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై మరో మంత్రి ప్రశాంత్రెడ్డి స్పందిస్తూ ‘మాకూ సమయం వస్తుంది’ అని అన్నట్లు తెలిసింది. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి చర్చించేందుకు భేటీ అయిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడితే, డిమాండ్ లేని సరుకును మార్కెట్లో ఎలా అమ్ముతారంటూ కేంద్రమంత్రి ప్రశ్నించడంతో సమావేశంలో వేడి రాజుకుంది. ఓ దశలో ధాన్యం సేకరణ అంశం పక్కకు వెళ్లి, రాజకీయ ప్రకటనలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులంటే, మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండంటూ పీయూష్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో భేటీ మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్.. ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేకేలతో కూడిన బృందం.. గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎక్కువ సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించినట్లు తెలిసింది. 20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించాం: నిరంజన్రెడ్డి తొలుత ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి నిరంజన్రెడ్డి.. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే 20 లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించామని, సాగైన మేరకు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉంటుందని, బాయిల్డ్ రైస్ను తీసుకునేలా కేంద్రం విధానపరమైన నిర్ణ యం చేయాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘కేవలం రారైస్ ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి?, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలాకాదు బాయిల్డ్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి. మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి..’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు.. పీయూష్కు గట్టిగా బదులిచ్చిన నిరంజన్రెడ్డి.. ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనమని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర విధానం మార్చుకోవాలి..’అని అన్నారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో మాకూ సమయం వస్తుందంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. పరస్పరం వీడియోలు, క్లిప్పింగ్ల ప్రదర్శన ఇదే సమయంలో వ్యవసాయం, రైతులకు మద్దతుగా 2013లో ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యాక గుజరాత్ అగ్రికల్చర్ సమ్మిట్లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు చూపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆలోచనలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తు తం తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చూపాలి కదా?, సానుకూల నిర్ణయాలు చేయాలి కదా? అని అన్నారు. పీయూష్ మాట్లాడుతూ ఇది తన పరిధి కాదని, ప్రధాని స్థాయిలో నిర్ణయం చేయాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలను మంత్రులు భేటీలో ప్రస్తావిస్తే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర రాష్ట్ర నేతలు ధాన్యం పండించండి. వంద శాతం కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు..’ అని చెప్పారు. ఆయా వ్యాఖ్యల వీడియోలు చూపించారు. కాగా ప్రధాని మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్లను కేంద్ర అధికారి ఒకరు చూపించినట్టు తెలిసింది. -
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్రెడ్డి
-
భారతీయ మహిళలది విశిష్ట స్థానం: నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు. -
నదులకు జీవం పోశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదులకూ హక్కులున్నాయి: వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు. దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం.శ్యామ్ప్రసాద్రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
80 దేశాలకు విత్తనాల ఎగుమతులు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
27న రాష్ట్రస్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి, సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు,ను నిర్వహిస్తున్నట్లు గాంధీ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాసంలో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని పంటలను ప్రోత్సహిస్తూ వస్తున్నామన్నారు. -
ఆదిలాబాద్లో పత్తి పరిశోధన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం టోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరం జన్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాల ను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావే శంలో మంత్రి మాట్లాడారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలని సూచించారు. అంతర్జాతీ యంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగులో మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నారు నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా బీచుపల్లి ఫ్యాక్టరీ అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం స్థలసేకరణకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్లో 84 ఎకరాల్లో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి విత్తన నిల్వకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీబాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు రుణాలు రూ.లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది. ఇందులో పంట రుణాలను రూ. 67,863 కోట్లుగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళికను రూ. 1,66,384.90 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫోకస్ పేపర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునం దన్రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం వైకే రావు, ఎస్ఎల్బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొందరు, మరికొందరు నేరుగా పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలి: మంత్రి నిరంజన్రెడ్డి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రం గానికి రుణ పరపతి పెంచాలని బ్యాంకర్లను కోరారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని, నాబార్డు సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఈ పథకాల వల్ల తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోందన్నారు. అయితే సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని నిరంజన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతోపాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలన్నారు. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా... రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ స్టేట్ ఫోకస్ పేపర్లో వ్యవసాయం, ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్లో సాంకేతిక ఆవిష్కరణల వంటి అంశాలపై దృష్టిసారించినట్లు నాబార్డు తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి పాడిపరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలు అందించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని సూచించింది. ఒక జిల్లా–ఒక పంట పథకం కింద ఉద్యాన పంటల క్లస్టర్ ఆధారిత ఉత్పత్తిని ప్రోత్సహించాలని నాబార్డు భావిస్తోంది. 2024–25 నాటికి తొమ్మిది జిల్లాల్లో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ చేపట్టింది. దానికి అవసరమైన ఊతం ఇవ్వాలని నాబార్డు బ్యాంకర్లకు సూచించింది. కాగా, 2021–22లో వ్యవసాయ రుణాలు రూ. 83,368 కోట్లు ఉండగా 2022–23లో అవి రూ. లక్ష కోట్లు దాటనుండటం విశేషం. -
సామాజిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ముందుకు రావడం అభినందనీయమని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. టీ–హబ్లో నిర్వహించిన టీటా గ్లోబల్ సింపోజియంను ఆదివారం ప్రారంభించిన అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడారు. 50 దేశాల నుంచి పలువురు టెక్కీలు, టీటా సభ్యులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఈ జనరల్ బాడీని మంత్రి ప్రారంభించారు. అగ్రికల్చర్లో టెక్నాలజీ అనుసంధానం ఎలా అనే అంశంపై టీటాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కృషి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల సారథ్యంలోని యువ ఇంజినీర్లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీఇచ్చారు. కేసీఆర్ వంటి విజన్ గల నేత, కేటీఆర్లాంటి మంత్రి ఉండటం అదృష్టమన్నారు. అహంకారం లేని సంస్కారంతో కూడిన జ్ఞానాన్ని పంచకలిగే వ్యక్తులను తయారుచేయాలని టీటాకు సూచించారు. అప్లికేషన్ వాడుకునే పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఐటీలో తన మనవడు బెటర్ టీచర్ అని చమత్కరించారు. ఐహబ్ చైర్మన్ కల్పన మాట్లాడుతూ అన్నదాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ఉత్తమమార్గంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సందీప్ మఖ్తల మాట్లాడుతూ, 12 ఏళ్లుగా 50 దేశాలకు పైగా టెక్కీలతో టీటా సింపోజియంను ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, లెఫ్టినెంట్ కల్నల్ బిక్షపతి, ప్రత్యూష, రమేశ్ తదితరులు మాట్లాడారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అకాల వర్షాలతో చేతికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో పంట దెబ్బతింది. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నాం. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి న్యాయం జరిగేలా చూస్తాం. అధైర్యపడొద్దు..’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిరంజన్రెడ్డి మంగళవారం హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చేసి బతకాలో తెలుస్తలేదు ‘కౌలుకు తీసుకుని ఆరెకరాల్లో మిర్చి పంట వేసిన నేను రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన.. నా భార్య, నేను, ముగ్గురు ఆడపిల్లలు పంట మీదే ఆశలు పెట్టుకున్నం. తామర పురుగు సోకితే మందులు కొట్టినా.. పరిస్థితి చక్కబడి పంట చేతికందే సమయం లో వడగళ్లకు మొత్తం నేలరాలింది.. ఏం చేసి బతకాలో తెలుస్తలేదు..’అంటూ నడికుడ యువరైతు తోర్నె అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఐదెకరాల్లో మిర్చిపంట వేసి ధర బాగా పలుకుతుండటంతో తాహ తుకు మించి ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన. అకాల వర్షం వచ్చి మొ త్తం ఊడ్చుకెళ్లింది.. మీరు ఆదుకోకుంటే మాకు చావే శరణ్యం’అంటూ నడికుడకు చెందిన రైతు మాషబోయిన బాబు బోరుమన్నారు. అనంతరం మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్ర విధానాలు లోపభూయిష్టం దేశ పాలకుల అసంబద్ధ విధానాల వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మంత్రులు విమర్శించారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కారేనని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతోంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని చెప్పారు. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమేనని, నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని తెలిపారు. రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంటలను పరిశీలించిన అనంతరం మంత్రులు నర్సంపేటలో అధికారులతో పంట నష్టంపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. కాగా.. మంత్రుల బృందం నష్ట పరిహారంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడంపై నర్సంపేట మండలంలోని ఇప్పల్తండా, ఆకులతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. -
ఐదో రోజు రూ.1,047.41 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద ఐదో రోజు సోమవారం రూ.1,047.41 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 4,89,189 మంది రైతుల ఖాతాల్లోకి ఈ రైతుబంధు నిధులు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5,294.09 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. 20–30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఒకప్పుడు తెలంగాణలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని పేర్కొన్నారు. రైతుబంధు కింద రైతులకు రూ.50 వేల కోట్లు అందజేసిన పథకం ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేదని నిరంజన్రెడ్డి తెలిపారు. -
‘రైతుబంధు’ వినూత్నం: నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ముద్ర ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రంలాంటిదన్నారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో పంజాబ్ను మించిపోవడం అసాధారణ విజయమన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. -
పామాయిల్ రంగంలో స్వావలంబనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ మిషన్ బిజినెస్ సమిట్’ను హైదరాబాద్లో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ రంగంలో దేశం స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ జాతీయమిషన్కు వనరుల కొరత ఉండబోదని తెలిపారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, ఆయిల్ పామ్ సేద్యానికి అనువుగా ఉన్న 28 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి మాట్లాడుతూ మనం వంట నూనె దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభు త్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. 30 లక్షల ఎకరాలు ఆయిల్పాం: నిరంజన్రెడ్డి తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు ఆయిల్పాం లక్ష్యంగా పెట్టుకుందని, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్పామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్ఎఫ్బీ) టన్నుకు రూ. 15 వేలు కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరుతూ కేంద్ర మంత్రి తోమర్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 3–4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరిగింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించారు. -
కేంద్ర ప్రభుత్వమా? రాజకీయ పార్టీయా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని. కేంద్ర మంత్రులు రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై రెండురోజుల్లో చెబుతామని పీయూష్ గోయల్ అన్నందుకే గురువారం సాయంత్రం ప్రభుత్వ పనిగంటలు ముగిసేవరకు తాము ఎదురుచూశామని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చల మధ్యలో మాట్లాడడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేష్రెడ్డి, రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేమడిగేది ఖరీఫ్ అదనపు కొనుగోళ్ల గురించే.. తెలంగాణ రైతుల కోసం గత 6 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నామని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అయితే తాము ఢిల్లీకి ఏదో పనిలేక వచ్చినట్లు చులకనగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం వస్తే చులకనగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులను క్రమబద్ధీకరించాల్సిన కేంద్రం సరిగ్గా పని చేయని కారణంగానే తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ధాన్యం సేకరణ అంశంలో కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తాము అడుగుతున్నామని తెలిపారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వద్దని కేంద్రం చెప్పిన విషయాన్ని తాము రైతులకు చెప్పామన్నారు. ఇప్పుడు తాము అడిగేది ఖరీఫ్ దిగుబడి అదనపు కొనుగోళ్ల గురించేనని మంత్రి స్పష్టం చేశారు. పంట పండించడం అన్యాయమా? దేశంలోని సగం రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణలో సాగు జరుగుతుందని, యాసంగిలో ఎక్కువ వరి పండేది తెలంగాణలోనే అని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం చేసిన తప్పా..?, రైతులు పంట పండించడం అన్యాయమా? అని ప్రశ్నించారు. దేశంలోని రైతాంగాన్ని వ్యవసాయం చేయొద్దు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగ విషయంలో కేంద్రానికి ఒక విధానం లేని కారణంగానే సమస్య వచ్చిందన్నారు. ఏడేళ్లు గడిచినా మోదీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయలేదని, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. -
తేలేదాకా కదలం
ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరాం. బియ్యం తరలింపుపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్సీఐ పైనే ఉంటుంది. వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటి? సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం తరలింపు అంశాలపై తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉండాలని, దీనిపై స్పష్టత వచ్చాకే హస్తిన నుంచి కదలాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు మరో రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. మంగళవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో భేటీ అనంతరం తెలంగాణ భవన్లో సహచర మంత్రులు, ఎంపీలతో కలిసి నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరామని, ఒకట్రెండు రోజుల్లో చెబుతామని కేంద్రమంత్రి అన్నారని తెలిపారు. బియ్యం తరలింపుపై లోతైన అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారని ధ్వజమెత్తారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్సీఐ పైనే ఉంటుందని, వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన మంత్రిగా ధాన్యాన్ని కొనిపించే బాధ్యత కిషన్రెడ్డికి లేదా? అని నిలదీశారు. రైతుల పక్షాన రాష్ట్రానికి సాయం చేయకుండా అనవసర నిందలు వేస్తున్నారని విమర్శించారు. -
కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ని అడిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రెండు రోజుల్లో రాతపూర్వక హమీని ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరంజన్రెడ్డి విమర్శించారు. రైల్వే రెక్స్ కేటాయించకపోవడం వల్లే.. రబీ బియ్యం సరఫరా పూర్తికాలేదన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని.. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజల కోసమే వచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం -
పంటలు సేకరించడం కేంద్రం విధి
సాక్షి, హైదరాబాద్: మద్దతు ధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి అని, ఈ పద్ధతి దశాబ్దాలుగా సాగుతోందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతాకుమార్ కమిటీ ధాన్యం ఎగుమతులు చేయాలని, పంటలన్నీ సేకరించాలని సూచించినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరు తదితర అంశాలపై నిరంజన్రెడ్డి రాష్ట్ర రైతులకు గురువారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలతో రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలబింస్తోందని లేఖలో మండిపడ్డారు. కేంద్రం రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా నష్టపోకుండా రైతులు వరికి బదులుగా ఇతర పంటలు పండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలమన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ప్రతి సీజన్కు ముందే ఏయే పంటలు వేయాలో సూచనలు చేస్తుందన్నారు. -
ఈ సినిమా ఏంటో ఆ డైలాగ్ చెబుతోంది: మంత్రి నిరంజన్ రెడ్డి
‘‘నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు’ అనే డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెబుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సి.నిరంజన్ రెడ్డి అన్నారు. రామ్గౌడ, ప్రియాపాల్ జంటగా వీజే సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సి.రవిసాగర్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ‘‘మంచి సందేశం ఇవ్వాలనే ఈ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు రవిసాగర్. ‘‘చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు? పెద్దయ్యాక ఎలా తయారవుతున్నారు? అనే కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు వీజే సాగర్. -
రైతు నిరసనలు దక్షిణాదికి విస్తరిస్తాయనే..
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు దక్షిణాదికి కూడా విస్తరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు ఏర్పడుతుందనే ప్రధాని నరేంద్రమోదీ వెనక్కి తగ్గారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. విద్యుత్మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలసి శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్లో నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు దేశంలోనే అత్యంత ప్రజాదరణ, పాలనాప్రజ్ఞ, దక్షత ఉండటం, వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడంతో కేంద్రంలో చలనం వచ్చిందన్నారు. అన్నిభాషల మీద పట్టుకలిగిన కేసీఆర్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోదీ ప్రభుత్వానికి తెలుసని, అందుకే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని, రైతుల పోరాటంలో కాంగ్రెస్పాత్ర ఇసుమంత కూడా లేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల ద్వారా యువతను సాగు వైపు మళ్లించాలని సూచించారు. విద్యుత్ చట్టాలను కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమే వడ్లు కొనేలా చట్టం తేవాలి: ఎంపీలు కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసేలా చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు, నూతన వ్యవసాయచట్టాలపై సీఎం కేసీఆర్ ఆందోళనకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. లోక్సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్రెడ్డి పార్టీ ఎంపీలు రం జిత్రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేతతో కలసి శుక్రవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ చట్టాలపై కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి వడ్లను కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. -
బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమస్యలు లేని దగ్గర బీజేపీ నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నిజానికి తెలంగాణలో రైతులకు ఎలాంటి సమస్య లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు యాసంగి పంట కొంటారా లేదా అనేదానికి సమాధనం చెప్పకుండా ఇప్పుడు ఇంకో కొత్తరకం ఆందోళన చేస్తున్నారు. దేశంలో రైతుల ధర్నాను పట్టించుకోకుండా ఇక్కడ రైతుల కోసం ప్రేమ చూపిస్తున్నారు. రైతు ధాన్యాన్ని ప్రతిగింజ కాపాడుకుంటాడు. బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి ధాన్యాన్ని ఆగం చేస్తున్నారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలి. రైతులు పండించే పంటలో మీ పార్టీ పాత్ర ఏంటి?. బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. రైతులకు బీజేపీ ఉరితాడు వేస్తోంది. దేశంలో ఎలగబెట్టేది లేక రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. మీ పార్టీ బిజినెస్ పార్టీ, కార్పొరేట్ పార్టీ. రైతుల కోసం ఇన్నేళ్లలో బీజేపీ చేసిందేమిటి?' అంటూ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. చదవండి: (పీకల్లోతు కష్టాల్లో హైదరాబాద్ మెట్రో.. రూ. 3 వేల కోట్లు) -
బీజేపీ నేతలు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారు: నిరంజన్ రెడ్డి
-
రైతుల కోసం నిధులు లేవా?
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నిధులు ఖర్చు చేసే స్తోమత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిరంజన్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి దెబ్బతిన్న చరిత్రను కేంద్ర ప్రభుత్వం నెమరు వేసుకోవాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న విధానాలను అదే పా ర్టీకి చెందిన రాష్ట్ర నేతలు అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారత్లో అనేకమంది ఆహార కొరతతో బాధ పడుతున్నారని, దేశంలో ధాన్యం నిల్వలు పేరు కుపోతున్నా పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కొత్త వ్యవసాయ విధానాలను అవలంబించాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నా, పంటల మార్పిడి కోసం కేంద్రం ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి ప్రశ్నించారు. యాసంగిలో బాయిల్డ్ బియ్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇస్తే రైతులు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వస్తుందన్నారు. పంటల సాగుపై కేంద్రానికి విధానం లేదు రాష్ట్రాల వారీగా సాగయ్యే పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి విధానం లేదని నిరంజన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ అధ్వర్యంలో జరిగిన మహాధర్నాపై కాంగ్రెస్ శాసన సభాపక్షం నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. నల్లచట్టాలకు కాంగ్రెస్ పునాదులు వేస్తే, మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందన్నారు. శుక్రవారం తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా రైతుల కోసం చేశామని, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నరేంద్ర మోదీ 51 గంటల దీక్ష చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చిస్తారని, త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయని వెల్లడించారు. రైతులు చైతన్యమైతే అద్భుతాలు సృష్టించవచ్చు: నిరంజన్రెడ్డి రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని, వరి సాగు నుంచి రైతుల దృష్టి మళ్లించాలని నిరంజన్రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం హైదరాబాద్లోని ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే పంటల మార్పిడి వైపు రైతులను మళ్లించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఆముదాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, రైతులు కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలని సూచించారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
వెంటనే ఎరువులివ్వండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయకు వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబర్ లో కేంద్రానికి తాను లేఖ రాశానని చెప్పారు. అక్టోబర్, నవంబర్కు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకుగాను, 3.67 లక్షల మెట్రిక్ టన్నులే కేంద్రం కేటాయించిందన్నారు. అందులోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే కేంద్రం సరఫరా చేసిందని తెలిపారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఓడల నుంచి ఎరువులను కేటాయించాలని నిరంజన్రెడ్డి కోరారు. గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ నౌక నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, విశాఖ పోర్టుల్లో ఆర్సీఎఫ్, చంబల్, ఐపీఎల్ ఫెర్టిలైజర్స్కు చెందిన ఓడల నుంచి 30వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలన్నారు. అలాగే క్రిబ్కో కంపెనీ నుంచి 2 అదనపు రేక్ల యూరియా కేటా యించాలని కోరారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి సరఫరాలో పెంచి భర్తీ చేయాలన్నారు. -
ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని, తెలంగాణవాసిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలసి మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్లో జరిగే పరిణామాలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్ను కేంద్రం ప్రోత్సహించడం వల్లే దేశవ్యాప్తంగా అనేక బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బు చెల్లిస్తోందని, కానీ కేంద్రం నుంచి ఆరు నెలల తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బు వస్తుండటంతో రాష్ట్రంపై వడ్డీ భారం పడుతోందన్నారు. వడ్డీ భారాన్ని భరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చలనం లేదని నిరంజన్రెడ్డి వెల్లడించారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ చెప్తుం డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరి ధాన్యం పండించాలని చెప్తున్నారని నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్తో కలిసి తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన సంద ర్భంలో ఆయన వెకిలినవ్వుతో సమాధానం ఇచ్చారని మంత్రి గంగుల అన్నారు. -
Telangana: యాసంగి వడ్లేవీ కొనం
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే యాసంగి సీజన్తో సహా ఏ యాసంగిలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. ప్రస్తుత వానాకాలంతో పాటు భవిష్యత్లో ఏ వానాకాలం సీజన్లోనైనా ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అయితే ఎఫ్సీఐ ద్వారా ఏ సీజన్లోనూ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. యాసంగి దొడ్డు వడ్లలో నూక ఎక్కువ ఉంటుందనే కారణంతో ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి ఎఫ్సీఐ తప్పుకున్న తర్వాత ఆ వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ యాసంగిలో పెసలు, మినుములు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలని వినమ్రంగా చెప్తున్నాం’అని వ్యవ సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి,పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కుండబద్దలు కొట్టారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని సాగు చేసే రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని జిల్లాల్లో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని వరి సాగు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో సాగు చేయకండి’అని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని గందరగోళానికి గురిచేయొద్దు.. ‘గత యాసంగిలో మిల్లింగ్ చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం నేటికీ తీసుకోలేదు. రైతులను రోడ్ల మీదకు తెచ్చి ధర్నాలు, నిరసనల ద్వారా లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను క్రమంగా నియంత్రించి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామనే ఉత్తర్వులను కేంద్రం నుంచి ఇప్పించాలి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతిచ్చాం’అని నిరంజన్రెడ్డి చెప్పారు. ‘రైతాంగానికి కేంద్రం మేలు చేయాలనుకుంటే కరోనా నేపథ్యంలో చేపట్టిన 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదారు నెలలు పొడిగించాలి. రాష్ట్రాలు బియ్యం ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్తోంది, కానీ, బియ్యం ఎగుమతి విధానాలు రాష్ట్రం పరిధిలో ఉండవు. వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. తన బాధ్యత నిర్వర్తించకుండా రాష్ట్రాలను బాధ్యులను చేయడం సరికాదు’అని నిరంజన్రెడ్డి అన్నారు. పత్తికి ధర తగ్గితే కొనుగోలు కేంద్రాలు... ‘యాసంగిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే వరి వంగడాలను రూపొందించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను కోరాం. ప్రస్తుతం యాసంగిలో సాగుకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యాసంగికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని కలుస్తాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి షరతులు పెట్టం. ప్రస్తుతం పత్తి సాగు చేసిన రైతులు ఎంఎస్పీ కంటే అదనపు ధర పొందుతున్నారు. ఎంఎస్పీ కంటే దిగువకు పత్తి ధర పడిపోతే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధితో పాటు రైతు సంక్షేమానికి సీఎం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది వానాకాలంలో 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 62.08 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న కొన్ని పరిస్థితులను రైతులకు వివరించేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు’అని నిరంజన్రెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలో ధాన్యం కుప్ప వద్ద రైతు మరణంపై కలెక్టర్ నివేదిక అందిందని, అది సహజ మరణమని పేర్కొన్నారు. కాగా, మిల్లులకు ధాన్యం తెస్తున్న రైతులను నియంత్రించేందుకు స్థానిక అధికారులు టోకెన్లు ఇస్తున్నారని గంగుల వెల్లడించారు. మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్దన్రావు పాల్గొన్నారు. ధాన్యం కొంటామని ప్రకటిస్తే కాళ్లు పట్టుకుంటా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి: ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధమని చెప్పే ధైర్యం బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు లేదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో ప్రకటన చేయిస్తే ఆయన కాళ్లు పట్టుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సహకార సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఖరీఫ్ ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ రూ.25 వేల కోట్లు కేటాయించి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తెలంగాణకు దొంగచాటుగా తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట కొనడం సాధ్యంకాదని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎకరాకు రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరం, అవమానకరం. ఈ విషయంలో కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రెండు పర్యాయాలు వెళ్లినా నిర్లిప్తవైఖరే చూపుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రంతో పంచాయితీ ఉండదు. – నిరంజన్రెడ్డి ప్రభుత్వపరంగా ధాన్యం కొనుగోలుకు సూర్యాపేట జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు రావడం లేదు. రాష్ట్రంలో కోతలు జరుగుతున్న కొద్దీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – గంగుల -
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
-
యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్ను భవిష్యత్లో ఎఫ్సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు. (చదవండి: కేంద్రం, ఎఫ్సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి) ‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు. రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్పోర్ట్స్ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్ రెడ్డి తెలిపారు. చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు -
ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నిలదీశారు. బీజేపీ థర్డ్ క్లాస్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం ప్రతి గింజా కొంటాం అనే దాకా ఆమరణ దీక్ష చేయండని ఎద్దేవా చేశారు. నిరంజన్ రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యాసంగి వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించి లేఖ తీసుకురావాలని అన్నారు. గురువారం సాయంత్రానికి కేంద్రం నుంచి ప్రకటన తెప్పిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకే బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, వారు మొనగాళ్లే అయితే తన చాలెంజ్ను స్వీకరించాలన్నారు. బండి సంజయ్ ప్రచారం కోసం ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం కొంటాం అంటే తెలంగాణ ప్రభుత్వం వద్దందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిని కలిసినా.. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి మాట్లాడిన తరువాత కూడా బాయిల్డ్ రైస్ ఇవ్వొద్దని పౌరసరఫరాల కమిషనర్కు లేఖలు పంపించారని నిరంజన్ రెడ్డి చెప్పారు. 60 లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 63 లక్షల ఎకరాలు వరి సాగైందని చెబితే.. ఇంత ఎట్లా వేస్తారని, శాటిలైట్లో అంత చూపించడం లేదని గోయల్ అనుమానం వ్యక్తంచేశారని తెలిపారు. కేంద్రానికి నచ్చిన గ్రామాల్లో రహస్యంగా సర్వే చేసి వరి సాగును నిర్ధారించుకోమని చెప్పామన్నారు. నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనలేమని నిస్సిగ్గుగా చెప్పారని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్కు రూ.10 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు ఇస్తున్నామన్నారు. ‘వానాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు జరుపుతున్నాం. వానాకాలం 1.35 కోట్ల టన్నుల వడ్లు కొనాలని కేంద్రాన్ని కోరాం. అయితే, 59.70 లక్షల టన్నులు మాత్రమే కొనేందుకు అనుమతించింది’అని ఆయన పేర్కొన్నారు. పంట సాగును పరిశీలించాక పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణి అని, వారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పదవిచ్చి, బాధ్యతనిచ్చి అందలమెక్కించిన కేసీఆర్ను బొంద పెడతానన్నప్పుడే ఈటల రాజేందర్ సంస్కారం బయటపడిందని నిరంజన్రెడ్డి విమర్శించారు. బహిరంగంగా తప్పులు చేసి దొరికిపోయింది ఈటలే అని అన్నారు. హుజూరాబాద్ రైతాంగం బీజేపీ చిల్లర చేష్టలు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. -
మంత్రి వర్గంలో సంస్కార హీనులు
ఇబ్రహీంపట్నం: ‘తెలంగాణ మంత్రివర్గంలో సంస్కారం లేని వ్యక్తులు ఉన్నారు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రులు మొరుగుతున్నారు’అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. మంత్రి నిరంజన్రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితను కూడా ఇలాగే హేళన చేస్తారా అని ప్రశ్నించారు. ఈ కుక్కకు కేసీఆర్ బిడ్డ కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలని కోరారు. ఆయనకు భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా..? అంటూ నిలదీశారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలనే ధ్యేయంగా ఈ నెల 20న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఎలిమినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చెర్లపటేల్గూడ మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకుంది. 9 రోజుల్లో వంద కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లి విజయమ్మతో కలసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని, రాజన్న రాజ్యం కోసం పోరాడాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వ భూములే కాకుండా పట్టా, అసైన్డ్ భూములను రైతుల నుంచి లాక్కున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తామన్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిషన్రెడ్డి తీరు ఉందని విమర్శించారు. ఆయన స్వగ్రామమైన ఎల్మినేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానంటూ çషర్మిల సవాల్ విసిరారు. సమస్యలుంటే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ నీలం రమేశ్, కొండా రాఘవరెడ్డి, పి.రాంరెడ్డి, ఏనుగు సునీల్కుమార్, అమృతసాగర్, మాదగోని జంగయ్యగౌడ్, ముస్తాఫాలు పాల్గొన్నారు. షర్మిల మాటకు ప్రాణమిచ్చే మనిషి మాటకు కట్టుబడే మనిషి షర్మిల అని, ఆమె సంకల్పబలం చాలా గొప్పది అని దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజలతో మమేకమైతేనే సమస్యలు తెలుస్తాయని..అందుకు ఎంతో ముఖ్యమైన సాధనం పాదయాత్రని, వైఎస్సార్ కూడా ఇదే అంశాన్ని చెప్పే వారని గుర్తు చేశారు. అయన బాటలో షర్మిల పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలపంచుకుంటుందని చెప్పారు. ఆమెను ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. -
బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్ను స్వీకరించాలన్నారు. ‘‘రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. వారి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తున్నాం. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. వరి సాగు, వరి కొనుగోలు చేయటం లేదని బండి సంజయ్ దీక్షలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రచారం చేయాలని ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనలేమని, బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణ నుండి ఒక్క గింజ కొనం అని నిస్సిగ్గుగా చెప్పారని మంత్రి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. -
రైతుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
-
పప్పు, నూనెగింజల సాగుపై రైతుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఆయిల్ పామ్పై దృష్టి పెట్టాలి పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించామని మం త్రి చెప్పారు. వచ్చే వానాకాలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొ క్కలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. పత్తి మద్దతు ధర రూ. 6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7 వేలకు పైగా పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు భారీగా పత్తి సాగు చేయాలని సూచించారు. -
వారి పుట్టుక తెలంగాణ.. ఆత్మలు ఆంధ్రవి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతల పుట్టుక తెలంగాణలోనే అయినా వారి ఆత్మలు మాత్రం ఆంధ్రవని మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల బతుకు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలసి బుధవారం ఇక్కడ టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అప్పట్లో శ్రీకృష్ణ కమిటీకి కాంగ్రెస్పార్టీ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేదని, ఆర్డీఎస్ ఆయకట్టును మాత్రం 20 వేల ఎకరాలకు కుదించిందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్టుల విషయమై కాంగ్రెస్పార్టీని వందల సార్లు విమర్శించారని గుర్తుచేశారు. శ్రీకాంతాచారి ఫొటోలు వాడుకోవడం, ఆయన విగ్రహానికి దండలు వేయడం కాంగ్రెస్ దౌర్భాగ్యానికి నిదర్శనమని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. అరుపులు, కేకలతో అధికారం దక్కదని, తెలంగాణ ఎల్లలు తెలియనివారు కూడా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు పచ్చగా మారుతుంటే.. పాలమూరు జిల్లా పచ్చగా మారుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఎక్కువగా భర్తీ చేశామని, కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఇక్కడి నిరుద్యోగుల భవిష్యత్తు బాధ్యతను టీఆర్ఎస్ ప్రభు త్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, శాశ్వతఖైదీగా అక్కడే ఉంటారని బాలరాజు అన్నారు. బ్లాక్మెయిల్కు రేవంత్రెడ్డి ‘జంగ్ సైరన్’ అని కొత్తపేరు పెట్టారని ఎద్దేవా చేశారు. తాము సహనం కోల్పోతే చీల్చి చెండాడుతామంటూ గువ్వల విరుచుకుపడ్డారు. జంగ్ సైరన్ సభల్లో కాం గ్రెస్నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రాములు ఆరోపించారు. -
AP: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్
‘ఏపీలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల గురించి చాలా కాలంగా వింటున్నాం. ఇవి చాలా బాగున్నాయని.. రైతులకు విశేష సేవలందిస్తున్నాయని తెలిసి ఓ సారి కళ్లారా చూద్దామని వచ్చా. వీటిద్వారా రైతులకు అందుతున్న సేవలు నేను ఊహించిన దానికంటే చాలా బాగా అందుతున్నాయి. ఆర్బీకేలు ఓ వినూత్నమైన విధానం.’ – సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ సాక్షి, అమరావతి: ఏపీలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను, ఇక్కడ వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణలోని రైతు వేదికల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిస్తామని, ఆయన అనుమతితో రైతు వేదికలను రైతు సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన తెనాలి మండలం మున్నంగి–1 ఆర్బీకేను సందర్శించారు. అనంతరం అత్తోట, నంది వెలుగు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులతో ముచ్చటించారు. అక్కడి రైతులు పాటిస్తున్న సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలపైనా ఆరా తీసారు. ఆర్బీకేల ఏర్పాటు లక్ష్యం ఏమిటి, ఇవా ఎలా పనిచేస్తున్నాయి, ఒక్కో ఆర్బీకేలో ఎంతమంది సిబ్బంది ఉంటారు. వారు ఎలాంటి సేవలందిస్తున్నారు, రైతుల కోసం ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తున్నారనే వివరాలను మున్నంగి–1 ఆర్బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ‘ఆర్బీకే ఓ వినూత్నమైన విధానం. రైతులకు సంబంధించిన అన్ని సేవలు ఒకేచోట (వన్స్టాప్ షాప్లో) లభిస్తున్నాయి’ అంటూ అక్కడి విజిటర్స్ రిజిస్టర్లో తన అభిప్రాయాన్ని రాశారు. తెనాలి ఏడీ బత్తుల శ్రీకృష్ణ దేవరాయులు, ఆర్బీకే వీఏఏ, వీహెచ్ఏలు ఆర్బీకేల పని తీరును మంత్రికి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలపై తన మనోగతాన్ని మంత్రి నిరంజన్రెడ్డి ‘సాక్షి’తో సోమవారం పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. మా రైతులకూ ఇదే తరహా సేవలందిస్తాం ‘మా రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన రైతు వేదికలను అభివృద్ధి చేసే విషయంలో మా ఆలోచన మాకుంది. వాటికి ఏపీలోని ఆర్బీకేల సాంకేతికత ఏ మేరకు తోడ్పడుతుందో పరిశీలిస్తున్నాం. రైతు వేదికలకు మరింత సాంకేతిక జోడించి అత్యుత్తమ సేవలందించడం ద్వారా నిత్యం క్రియాశీలకంగా ఉండేలా రైతులకు అందుబాటులో తీసుకురావాలన్నది మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఆయన సంకల్పం మేరకు రైతు వేదికల ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ పరిశీలించిన అంశాలన్నిటిపైనా త్వరలోనే ప్రతిపాదనలు రూపొందించి కేసీఆర్కు నివేదిస్తాం. ఆర్బీకేల తరహాలో తెలంగాణ రైతు వేదికలను రైతు సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్ మా రాష్ట్రంలో రైతు వేదికలు కట్టి రైతులకు శిక్షణ ఇస్తున్నాం. కానీ.. ఆర్బీకేల స్థాయిలో మా దగ్గర సేవలందించడం లేదు. ఇక్కడి రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘వన్స్టాప్ షాప్’ కింద ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఓ చానల్ సైతం నడుపుతున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీ ద్వారా రైతులు స్వయంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు. కియోస్క్ టెక్నాలజీ ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే పంపిణీ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. దారి మధ్యలో అత్తోట, నంది వెలుగు గ్రామాల్లోని పొలాల దగ్గర ఆగి రైతులతో మాట్లాడా. వాళ్లు ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఆర్బీకేలను, వాటి ద్వారా రైతులకు అందుతున్న సేవలను కళ్లారా చూశా.. ఆర్బీకేలు చాలా బాగున్నాయ్. ఈ వినూత్న ప్రయోగం ద్వారా అందిస్తున్న సేవలతో రైతులు పూర్తిగా ప్రభుత్వంతో ఉన్నారని నా పరిశీలన లో అర్థమైంది. -
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, సతీశ్బాబు, రాసరి మనోహర్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్రావు ఈటల రాజేందర్పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి, కేసీఆర్కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. -
మూడు జిల్లాల్లో జూట్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూట్ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ కంపెనీలు అంగీకరించి శుక్రవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో గ్లోస్టర్ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు ఐటీ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కేటీఆర్ మట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు జూట్ పరిశ్రమ లేదని, ఈ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూట్ పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ మూడు పరిశ్రమలతోపాటు మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. జనపనార పంటలకు ప్రోత్సాహం మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 3.20 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఏపీల నుంచే రూ. 49.26 నుంచి రూ. 61.78కి ఒక్కో గన్నీ బ్యాగును సేకరిస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ కోసం రూ. 2.36 వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త జూట్ మిల్లుల ఏర్పాటుతో రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు నిధుల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. గన్నీలతోపాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు, ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అన్నారు. -
TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: ఎగుమతులు పెరిగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. అందువల్ల రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆమె సోమవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోమిత బిశ్వాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ, అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే పరిశ్రమలశాఖ ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించి, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతామన్నారు. ఈ దిశగా రైతులు దృష్టి సారించాలన్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతో పాటు పప్పుగింజల సాగుకు కేంద్ర సహకారం అందిస్తామని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీని పరిశీలిస్తామన్నారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలి.. అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలని మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయబోమన్న ఎఫ్సీఐ అర్థాంతర నిర్ణయం రైతాంగానికి గొడ్డలిపెట్టు అన్నారు. ఈ నిర్ణయంతో రైతాంగం ఆందోళనలో ఉన్నారన్నారు. వరి సాగు నుంచి నూనె, పప్పుగింజలు, ఆయిల్ పామ్ సాగు వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు ప్రణాళికతో ముందు కెళ్తున్నామన్నారు. దొడ్డు వడ్లను సేకరించ బోమన్న ఎఫ్సీఐ నిర్ణయం వాయిదా వేయాలన్నారు. తెలంగాణ మామిడికాయకు అంతర్జాతీయ ప్రసిద్ధి ఉందన్నారు. కానీ, కేంద్రం నుంచి తగినంత సహకారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్కు వంద శాతం రాయితీ కల్పించాలన్నారు. అలాగే రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని నిరంజన్రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా, శోభ హైదరాబాద్ జీడిమెట్ల వద్ద ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కూరగాయలు, పువ్వులు)ను సందర్శించారు. చదవండి: హుస్సేన్సాగర్లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. -
రైతు వేదికలకు టీఫైబర్
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): వ్యవసాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రిహబ్లో సామాన్య రైతులకు స్థానం కల్పించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. క్షేత్రస్థాయిలో సామాన్య రైతుల ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆగ్రిహబ్ వేదిక కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 2,601 రైతు వేదికలకు టీ–ఫైబర్ అనుసం ధానం చేస్తున్నామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం జరిగినా, పరిశోధనలు జరిగిన గ్రామాల్లోని రైతు వేదికల ద్వారా రైతులు చూడొచ్చన్నారు. తెలుగు భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, అగ్రిహబ్లో సామాన్య రైతులకు తెలిసేలా తెలుగులో రాసి ఉంచాలని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ.9 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అగ్రిహబ్ను కేటీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన దేశంలోని వివిధ కంపెనీలకు చెందిన వ్యవసాయ అధునాతన యంత్రాలను, విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని, అందుకే మనం ఏ పని చేసినా సామాన్య రైతులకు పనికొచ్చేలా ఉండాలని చెప్పారు. రైతును మించిన శాస్త్రవేత్త లేరని వారి ఆలోచనలో మార్పు తెచ్చి నూతన పద్ధతుల్లో పంటలు పండించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రపంచదేశాలకు ఎగుమతి చేసేలా.. దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఏటా 60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పుకోవడం చాలా గర్వంగా కేటీఆర్ అన్నారు. వ్యవసాయ పరిశోధనల విస్తృతి పెరగాలని, నూతన వంగడాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు తెలంగాణ నుంచి పండ్లు, కూరగాయలు ఎగుమతి చేసేలా ప్రభుత్వం వర్సిటీలో జరిగే పరిశోధనల కోసం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఏడేళ్లుగా చేస్తున్న మిషన్ కాకతీయ, హరిత హారంలాంటి కార్యక్రమాల ద్వారా పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయని చెప్పారు. సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్లు భూగర్భ జలం పెరగడంతో ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారని ఉదహరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2023 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిందని, అది ఒట్టి హామీగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్కు ఇష్టమైన రంగం:నిరంజన్రెడ్డి మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు అత్యంత ఇష్టమైన రంగాల్లో మొదటిది వ్యవసాయం, రెండోది సాగునీటి రంగం, మూడోది గ్రామీణాభివృద్ధి అని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో త్వరలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఎక్కడికెళ్లినా భూమికి పచ్చని రంగేసినట్లు అన్న గోరటి వెంకన్న పాటలా మారిందని, ఇది ముఖ్యమంత్రి కృషి ఫలితమే అని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించిన పలు పుస్తకాలను మంత్రు లు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసా య కళాశాల టాపర్లుగా వచ్చిన విద్యార్థులకు పట్టాలు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, సుధీర్రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు పాల్గొన్నారు. -
Telangana: నేటి నుంచి రైతు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమపై వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రూ.25,001 నుంచి రూ.25,100 వరకున్న రుణమాఫీపై ట్రయల్ నిర్వహించారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలను ఈ నెల 30 వరకు మాఫీ చేస్తారు. 6,06,811 మంది రైతులకు రూ.2005.85 కోట్లు మాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రూ.25 వేలలోపు రుణాలను 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రైతులకు శుభాకాంక్షలు: నిరంజన్రెడ్డి రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్కు రైతాంగం తరఫున ధన్యవాదాలు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగురంగానికి కేసీఆర్ ఆసరాగా నిలిచారు. ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. పంట మారి్పడి వైపు రైతులను ప్రోత్సహించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తాం. -
6 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది. ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనా లని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని అమలుచేశాకే ఈ ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. కోవిడ్వల్ల గతంలో ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచే కొనసాగించామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని వివరించారు. ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలి ఉందని, బ్యాలెట్ బాక్సుల రక్షణ నిమిత్తం రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అడిగిందొకటి.. ఇచ్చింది మరొకటి... అలాగే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలుచేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా, ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ మరో పిటిషన్ వేసిందన్నారు. కానీ, ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ను అమలుచేయాలని జనసేన కోరలేదన్నారు. అయితే.. సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్ను కొట్టేసి, జనసేన పిటిషన్లో మాత్రం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలుచేయాలంటూ తీర్పునిచ్చారని నిరంజన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికల కమిషనర్ గురించి సింగిల్ జడ్జి పలు వ్యాఖ్యలు చేశారని, వాటిని తీర్పు నుంచి తొలగించాలని కోరారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేయాలని నిరంజన్రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. జనసేన తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించగా.. ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రూ.160 కోట్ల మేర ఖర్చయిందని.. అందువల్ల ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై పూర్తైన వాదనలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్ నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8 నుంచి మార్చి 10 వరకు సుప్రీంకోర్టు చెప్పిన 4 వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తయింది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుపై స్టే ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 4 వారాల కోడ్ అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే కోడ్ అమలు చేశారన్నారు. 4 వారాల కోడ్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా ఎస్ఈసీని అడగలేదని, ఈ కోడ్పై ఏ ఒక్కరు కోర్టుకు ఫిర్యాదు చేయలేదని లాయర్ నిరంజన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏప్రిల్ 8న జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. -
తెలుగు సాహిత్య శిఖరం సినారె
సుల్తాన్బజార్: జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్య శిఖరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతి ఉత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభలో మామూలుగా సభ్యులెవరైనా 100 ప్రశ్నలు వేస్తే గొప్ప అని, కానీ సినారె నామినేటెడ్ సభ్యులుగా ఉన్న సమయంలో తమ పదవీ కాలంలో 624 ప్రశ్నలు వేశారని వెల్లడించారు. ఈరోజు రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినందుకు ఎక్కువగా చర్చిస్తున్నారని, కానీ సినారె 1960లోనే రామప్ప పేరుతో అద్భుతమైన రూపకం రాశారని నిరంజన్రెడ్డి తెలిపారు. పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి సినీగీత సర్వస్వం 7వ సంపుటిని మంత్రి నిరంజన్రెడ్డి, మొత్తం 7 పాటల వివరాలతో కూడిన అనుక్రమణికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. పరిషత్తులో నెలకొల్పడానికి రూపొందించిన సినారె నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని శాంతా బయోటెక్స్ అధినేత డాక్టర్ ఐ.వరప్రసాదరెడ్డి ఆవిష్కరించి, చిత్రకారుడు జె.వి.ని సత్కరించారు. పరిషత్తు ఏటా అందజేస్తున్న సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని ఈసారి సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.25 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ సినారె పరిషత్తుకు 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వ్యవహరించి సర్వాంగీణ వికాసానికి కృషి చేశారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, సినారె, తాను అశోక్నగర్లో ఉన్నప్పుడు కలిసి ఇందిరాపార్కులో నడకకు వెళ్లేవారమని, వారు రాసిన అనేక కవితలకు తొలి శ్రోతగా ఉండే అవకాశం కలిగిందన్నారు. సీఎంవో ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ సినారె కవితలను, సినీగీతాలను ఆలపించారు. కోశాధికారి మంత్రి రామారావు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
జీవితంలో సినిమా ఒక భాగం: నిర్మాత నిరంజన్ రెడ్డి
‘టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలోనే ప్రేక్షకులు సినిమాలను థియేటర్స్లో చూసేందుకు వస్తున్నారు. అలాంటిది సినిమాను అమితంగా ప్రేమించే మన తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ రీ ఓపెన్ అయితే తప్పక వస్తారనే నమ్మకం ఉంది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా మా బ్యానర్లోని సినిమాలను థియేటర్స్లోనే విడుదల చేస్తున్నాం’అని అన్నారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. గురువారం (జూలై 22)న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యాచరణ, విడుదలకు సిద్ధంగా ఉన్న తమ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘మా తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా. కానీ నేను పుట్టి, పెరిగింది అంతా హైదరాబాద్లోనే. ఇంజినీరింగ్ తర్వాత యూఎస్లో మాస్టర్స్ పూర్తి చేసి రెండేళ్ళు ఉద్యోగం చేశాను. ఆ నెక్ట్స్ ఓ ఐటీ కంపెనీని స్టార్ట్ చేశా. రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తున్నాను. మనందరి జీవితాల్లో సినిమా అనేది ఒక భాగం. సో.. సినిమాలపై ఆసక్తి, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. టైమ్ వేల్యూని మేం బాగా ఫాలో అవుతాం. దాదాపు 200మంది కొత్త సాంకేతిక నిపుణులు మమ్మల్ని సంప్రదించారు. మా బ్యానర్లో రూపొందిన ‘హౌస్ అరెస్ట్’ సినిమాను థియేటర్స్ రీ ఓపెన్ చేసిన వెంటనే విడుదల చేస్తాం. రెండు వారాల తర్వాత మా మరో చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘హను మాన్’ఓ సూపర్ హీరో ఫిల్మ్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. భవిష్యత్లో ఓటీటీ రంగంలోకే కాదు.. ఎగ్జిబిటర్గా కూడా రావాలని ప్లాన్ చేస్తున్నాం. మా టీమ్ సభ్యులు చైతన్య, ఆశిన్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు’’ అని అన్నారు. -
నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు కుదిరాకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని.. కానీ ఏపీ మాత్రం ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారని.. కానీ తాగునీటి కోసమనే పేరిట ఈ ప్రాజెక్టు నుంచి రాయలసీమ, నెల్లూరుకు సాగునీరు తరలిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ కంటే తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 300 మీటర్ల వెడల్పుతో కాల్వలు తవ్వుతోందని.. మొత్తం నదినే మళ్లించి, రిజర్వాయర్ను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజీ, భీమా ఇరిగేషన్ కాల్వను ప్రతిపాదించామని నిరంజన్రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేయరేం.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. మరి ఏపీ అక్రమ ప్రాజెక్టుల మీద ఎందుకు కేసులు వేయడం లేదని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయి కేసీఆర్కు మంచి పేరు వస్తే ఎలాగనే దురుద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని ఆరోపించారు. నదీ జలాలు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్దే బాధ్యత అని విమర్శించారు. -
రసవత్తరంగా ‘హుజురాబాద్’ రాజకీయాలు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రాజకీయ పార్టీల నేతలు హల్చల్ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ జమ్మికుంట వీణవంక మండలాల్లో పర్యటించి ఈటలపై విమర్శలు సంధించారు. ఈటల స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించారే తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం పట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజురాబాద్లో ఏవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మిగతా నియోజకవర్గాల్లో అదేవిధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు. చదవండి: హుజూరాబాద్లో ‘సోషల్’ వార్కు రెడీ.. రేవంత్రెడ్డి వ్యూహాత్మక అడుగులు: ఆసక్తికర భేటీ -
పొలం గట్టుపై నుంచి మంత్రితో మాట్లాడిన సీఎల్పీ నేత
సాక్షి, ఖమ్మం: కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాంటాలు వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. చింతకాని మండలం తిమ్మినేని పాలెం పొలం గట్టు మీద నుంచి వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కొన్ని రోజుల తరబడి వడ్లు కొనకుండా, మిల్లులు అలాట్ కాకుండా, లారీలు రాకుండా గత కొన్ని రోజులుగా పొలంలో తడుస్తున్న ధాన్యం గురించి వ్యవసాయ శాఖామంత్రికి చెప్పి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే తరుగు కూడా 6 కిలోల నుంచి 8 కిలోల వరకూ తీస్తున్నారని, అంత మొత్తంలో తరగు తీయకుండా చూడాలని మంత్రికి చెప్పారు. గత కొన్ని రోజులుగా ఎర్రుపాళెం, మధిర, చింతకాని, బోనకల్, ముదిగొండ తదితర మండలాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి, సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. జిల్లా అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని సీఎల్పీనేతకు హామీ ఇచ్చారు. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల గురించి పలు మండలాల్లో సీఎల్పీ నేత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చింతకాని మండలంలోని తిమ్మినేని పాళెం, తిరుమలాయపాళెం, జగన్నాథపురం, పందిళ్ల పళ్లి, రామక్రిష్ణాపురం వంటి పలు గ్రామాల్లో ఈ రోజు ఆయన పర్యటించారు. ఈ మేరకు పీపీఎస్ఈ కొ-ఆపరేటివ్ సొసైటీ కింద నాగులవంచ కొనుగోలు కేంద్రానికి మిల్లును అలాట్ చేయలేదని రైతులు తమ గోడును సీఎల్పీ నేత వద్ద వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొప్పుల గోవింద రావు, పందిళ్లపల్లి ఎంపీటీసీ వీరభద్రం, సొసైటీ డైరెక్టర్లు తూము కోటేశ్వర రావు, రామారావు, మండల కాంగ్రెస్ నాయకులు బసవయ్య, కోరపాటి రాము తదితరుల పాల్గొన్నారు. చదవండి: వైరల్: కానిస్టేబుల్ మానవత్వం.. సలామ్ కొడుతున్న నెటిజన్లు -
మంత్రి నిరంజన్రెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డికి కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయనకు దగ్గు, స్వల్ప జ్వరం ఉండటంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, సోమవారం పాజిటివ్ అని తేలిందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మంత్రుల క్వార్టర్ట్స్లోని తన నివాసంలో నిరంజన్రెడ్డి హోంక్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వల్ప జ్వరం, దగ్గు ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు. కాగా, మూడురోజుల కిందట వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్రెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ కమిషనరేట్లోని పేషీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు, కొందరు వ్యవసాయ అధికారులు కూడా కరోనా బారినపడ్డారు. ఆయిల్ఫెడ్, మార్క్ఫెడ్ తదితర వ్యవసాయ అనుబంధ విభాగాల్లోనూ కొందరు ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో వారితో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చదవండి: కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి! -
వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున
‘‘ఒకే రకమైన జానర్స్లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు. ► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి సినిమాలో కమర్షియల్ యాక్షన్కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్ ఆడియన్స్కి ఎగై్జటింగ్గా అనిపిస్తాయి. ► ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్ఐఎ టీమ్ లీడర్గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్ను పట్టుకోవడమే విజయ్ వర్మ లక్ష్యం. ‘వైల్డ్ డాగ్’ కొత్త కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు. ► ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను. అయితే ‘వైల్డ్ డాగ్’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది. ► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్ఫుల్ పాత్ర. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది. నేను, అఖిల్ కలసి ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్తో సినిమా ఉంటుంది. -
నేను ఫిట్గా ఉండటానికి కారణం అదే : నాగార్జున
‘‘దేనికీ భయపడాల్సిన అవసరం లేదనే ఓ గొప్ప నమ్మకంతో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాను. కొత్తదనం ఎక్కడ ఉందా? అని వెతుకుతుంటాను. నేను యంగ్గా ఫిట్గా ఉన్నానంటే కారణం కొత్తవారితో వర్క్ చేయడమే. చేసిన పనే చేయడం ఇష్టం ఉండదు. ఒకే రకమైన పాత్రల్లో నన్ను నేను చూసుకోవడం నాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టే పని చేయను’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ‘వైల్డ్డాగ్ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా బేస్ క్యాంప్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘వైల్డ్డాగ్’ కథ నాకు నచ్చడానికి కారణం ఏసీపీ విజయ్వర్మ క్యారెక్టర్. విజయ్ వర్మ మంచి తండ్రి, మంచి మానవతావాది, మంచి భర్త, మంచి టీమ్ లీడర్. ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తాడు. అతను ప్రేమించేది భారతదేశాన్ని. నేను చేసిన సినిమాల్లో వన్నాఫ్ ది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విజయ్ వర్మ. ఈ సినిమాకు నిజమైన వైల్డ్డాగ్ నిర్మాత నిరంజన్రెడ్డి. గగనం, క్షణం, ఘాజీ, ఊపిరి వంటి డిఫరెంట్ సినిమాలను నిరంజన్ చేశారు. ఇదొక ప్రయోగాత్మక సినిమా అనే విషయం పక్కనపెడితే, ఎంటర్టైన్మెంట్ మూవీ కూడా. కోవిడ్ కారణంగా కొన్ని రోజులు ఇళ్ళలో ఉండి, ఆ తరవాత షూటింగ్ కోసం మనాలీ వెళ్లాం. అక్కడ నా మాస్క్ తీసి బయటపడేశాను. నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు అర్థం అయ్యింది.. పని అనేది చాలా ఇంపార్టెంట్ అని’’ అన్నారు. ‘‘తెలుగులో ప్రయోగాత్మక సినిమా చేయాలనుకునే అందరికీ నాగార్జునగారు ధైర్యమే. తెలుగులో నాగార్జునగారు పరిచయం చేసిన 40వ డైరెక్టర్ సాల్మన్’’ అన్నారు నిరంజన్రెడ్డి. ‘‘వైల్డ్డాగ్’ సినిమాకు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్. నాగార్జునగారితో వర్క్ చేయడంతో నా కల నిజమైనట్లుగా ఉంది’’ అన్నారు తమన్. 67వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినీపరిశ్రమలో అవార్డులు సాధించిన ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, కొరియోగ్రాఫర్ రాజుసుందరం, ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఎడిటర్ నవీన్ నూలిలను ‘వైల్డ్డాగ్’ చిత్రబృందం సన్మానించింది. -
నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్
‘‘నా కెరీర్లో కొన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి కావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టింది. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇతర భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చేశాను. ఈ కారణంగా తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను’’ అన్నారు హీరోయిన్ సయామీ ఖేర్. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్ చెప్పిన విశేషాలు... ► ‘వైల్డ్ డాగ్’లో నేను ఆర్యా పండిట్ అనే ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్గా కనిపిస్తాను. ‘రా’ ఏజెంట్ అయిన నేను నాగ్ సార్ లీడ్ చేస్తున్న ‘ఎన్ఐఏ’ టీమ్లో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ► నాగార్జున ‘శివ’ సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు. కానీ ఆయన సినిమాల్లో నా ఫేవరెట్ ‘గీతాంజలి’ మూవీ. అంత పెద్ద స్టార్తో కలిసి నటించేందుకు నేను మొదట నెర్వస్గా ఫీలయ్యాను. కానీ ఆయన సెట్లో సరదాగా ఉంటారు. ఓ సారి నాగ్ సార్ ఇంటి నుంచి బిర్యానీ తెస్తే, ఓ పట్టుపట్టాను. ► సాధారణంగా హీరోయిన్ పాత్రలకు పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. కానీ ఈ సినిమాలో నాకు చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. నాగ్ సార్తోనూ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నాకు స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఫిట్గా ఉంటాను. ఆ ఫిట్నెస్ నాకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చేసేందుకు ఉపయోగపడింది. ఈ సినిమా కోసం మార్షల్స్ ఆర్ట్స్లో నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ► ప్రతి యాక్టర్కూ కొందరితో వర్క్ చేయాలని ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్ నా ఫేవరెట్స్. వారితో సినిమాలు చేయాలని ఉంది. అలాగే డైరెక్టర్స్లో మణిరత్నం, రాజమౌళిగారు అంటే నాకు ఇష్టం. ప్రస్తుతం రెండు ఓటీటీ ప్రాజెక్ట్స్తో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను. -
పచ్చదనం ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో పచ్చదనం ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని, ఆరేళ్ల క్రితమే ఆయన రాష్ట్రంలో హరిత హారానికి నాంది పలికారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. హరిత తెలంగాణగా మార్చాలనుకుంటున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఆయన పుట్టినరోజున కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీ సంతోష్కుమార్ ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. కొచ్చి నుంచి ఎయిర్పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులకు ఆయన మొదటి మొక్కను అందజేయగా.. పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొక్కలను అందజేసి వాటిని బుధవారం నాటాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ మాట్లాడు తూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కూడా మంచి సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మూడేళ్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్నో మొక్కలు నాటినట్లు గెయిల్ (జీహెచ్ఐఏఎల్) సీఈఓ ప్రదీప్ఫణికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణకు దేవుడిచ్చిన వరం కేసీఆర్: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ను దేవుడు బహు మతిగా ఇచ్చారని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం కేసీఆర్ సేవామండలి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు హైదరాబాద్లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహోన్నత మేధావి కేసీఆర్: నిరంజన్రెడ్డి, రాష్ట్ర మంత్రి మాటను ఆయుధంగా చేసి సమాజాన్ని మలుపు తిప్పి అహింసతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత మేధావి సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సాధించి, రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపే ప్రయత్నంలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం..
సాక్షి, మహబూబ్నగర్: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, ఇందుకు తగ్గట్టుగా పని చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలు పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులను ఆయా ఉద్యోగులకు అందించారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేయాలని మంత్రులు కోరారు. ఖజానా డబ్బులన్ని ఉద్యోగుల జీతాల పెంపుకే ఇచ్చారన్న భావన ప్రజల్లో కలగకుండా పీఆర్సీని పెంచుకుందమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, న్యాయ బద్దమైన పీఆర్సీ వచ్చేలా తాము కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో 2021 డైరీ, క్యాలెండర్లను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. -
జనం లేని సేన.. జనసేన: నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. ‘‘వరద బాధితులను కేసీఆర్ సర్కార్ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్లో మేం సాయం చేస్తే అడ్డుకుంటారా?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని, ఎందరు కలిసినా ప్రజలు టీఆర్ఎస్నే ఆదరిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: టీఆర్ఎస్ భయపడుతుంది: బండి సంజయ్) నిజమైన హిందువు కేసీఆరే: కేకే నిజమైన హిందువు కేసీఆరేనని టీఆర్ఎస్ నేత కేకే అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్ఎస్ విధానమని తెలిపారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించామని చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని కేకే పేర్కొన్నారు. (చదవండి: పవన్ కళ్యాణ్పై బాల్కసుమన్ సెటైర్లు) -
మిషన్ మనాలీ
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మనాలీలో ప్రారంభం అయింది. 20 రోజుల పాటు మనాలీ షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్లో పాల్గొంటూ ‘బిగ్బాస్’ చిత్రీకరణ కోసం వారాంతరాల్లో హైదరాబాద్ వస్తారట నాగార్జున. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివరి లోపల పూర్తికానుంది. -
40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనపు గోదాములు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న గోదాములకు అదనంగా మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సామర్థ్యంతో మరిన్ని గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వీటి నిర్మాణానికి ఇప్పటికే మార్కెటింగ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఇచ్చిందని, త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సోమవారం టీఆర్ఎస్ సభ్యులు పెద్ది సుదర్శన్రెడ్డి, జైపాల్యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలు చాలా చోట్ల గుర్తించడంతో భూముల సమస్య లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 4.17లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు 176 మాత్రమే ఉండేవని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17.20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 452 గోదాములను నిర్మించినట్లు వివరించారు. దీంతోపాటు మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రతి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
సాగు పెరిగింది.. ఎరువుల కోటా పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎరువుల కోటా కూడా పెంచాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన యూరియా కోటాను వెంటనే పంపించాలని విన్నవించారు. ‘తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసొచ్చిన వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో ఈసారి గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగైంది. మరో 8.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉండగా, ఇంకో ఆరేడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. మొత్తంగా ఈ వానాకాలంలో దాదాపు కోటీ 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 3.5 లక్షల టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 7 లక్షల టన్నుల యూరియా వినియోగమైంది’అని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరుల రాకతో గతంతో పోలిస్తే ఆరేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్కు 10.5 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. ఈ నెల కోటా కింద రెండున్నర లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 80 వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, మిగిలిన మొత్తాన్ని వెంటనే పంపించాలని కోరారు. మంత్రి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉన్నారు. -
అందుబాటులో అవసరమైన యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు. జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, -
అన్నదాతలకు ఆన్లైన్ కన్సల్టేషన్
సాక్షి, హైదరాబాద్: రైతులకు అండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీకన్సల్ట్ యాప్ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్లో టీకన్సల్ట్ ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు. టీకన్సల్ట్ అగ్రికల్చర్ అప్లికేషన్ను వానాకాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా నిపుణులతో అనుసంధానం అయ్యారు. ఈ యాప్నకు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావుతో టీకన్సల్ట్ ద్వారా సందేహాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, అగ్రి సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ఆన్లైన్ సేవలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లా డుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా వ్యవ సాయానికి సాంకేతికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్.కె.సంగమేశ్వరరావు పాల్గొన్నారు. -
జూరాల నీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్రెడ్డి
ధరూరు(గద్వాల): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలసి జూరా ల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ల ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి రైతులకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. వానాకాలం పంట కింద జూరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందిస్తామని, చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
రాష్ట్ర రుణ ప్రణాళిక 1.61లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్దేశించారు. ఇం దులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లు కాగా, పంట రుణాల లక్ష్యం రూ. 53,222 కోట్లుగా ఉంది. అందులో వానాకాలంలో 60%, యాసంగిలో 40% కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రుణ ప్రణాళిక ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.62 శాతం పెరిగాయి. ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ. 53,222 కోట్లుగా నిర్దేశించుకున్నారు. అంటే 9.20 శాతం పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ. 12,061 కోట్లు చూపారు. గతేడాది కంటే 5.38 శాతం పెంచారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ. 2,422 కోట్లు కేటాయించారు. ఇది గతం కంటే 16.02 శాతం పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 7,435 కోట్లు కేటాయించారు. రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాలు పెంచారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పడావు భూములను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేశారు. ఎంఎస్ఎంఈకి 35,196 కోట్లు సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్ఎంఈ) రూ. 35,196 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఉంది. విద్యా రుణాలు రూ. 2,165.73 కోట్లు , గృహ సంబంధిత రుణాలు రూ. 8,048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆత్మనిర్బర్ కింద రుణాలు... కరోనా నేపథ్యంలో ఆత్మనిర్బర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్ఎల్బీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్ఎంఈలకు రూ. 2,513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 1,688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చారు. అదే సమయంలో రూ. 231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్కు కూడా ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి, ఎస్ఎల్బీసీ అధ్యక్షులు, ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, నాబార్డు సీజీఎం కృష్ణారావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
సంక్షోభంలోనూ సంక్షేమం
సిరిసిల్ల: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ఆపలేదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో పర్యటించారు. నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, రైతు వేదిక నిర్మాణా లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల రాష్ట్రం లో 95 శాతం ప్రభుత్వ ఆదాయం తగ్గినా సం క్షేమ పథకాల అమలును ఎక్కడా ఆపలేదన్నారు. తొలివిడతగా 5.5 లక్షల మంది రైతుల పంటల రుణాలను రూ.1,200 కోట్లమేర మాఫీ చేశామన్నారు. ఏ ప్రధానీ చేయని విధంగా రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు అందించామని, రూ.1,400 కోట్లతో రైతుబీమా అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు సాగునీటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి నిరంతరం నీరందిస్తామని పేర్కొన్నారు. అక్కరకు రాని, మద్దతు ధరలేని పంటలు వేయొద్దని రైతులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రైతులకు మేలు చేయడం తప్ప సీఎం కేసీఆర్కు వేరే ఎజెండా లేదన్నారు. అనేక మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. బీడు భూములకు నీళ్లు వచ్చి పల్లెలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని, రాష్ట్రంలో ప్రతీ రైతుకు రైతుబంధు ఇస్తుంటే మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. రైతులను సంఘటితం చేయడమే రైతు వేదిక లక్ష్యమన్నారు. రైతు వేదికలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. సేద్య ఆలయాలుగా రైతు వేదికలు: రాష్ట్రంలో రైతు వేదికలు సేద్యానికి ఆలయాలుగా ఉంటాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, వేములవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2,602 క్లస్టర్లు ఉన్నాయ ని, ప్రతీ క్లస్టర్లో రైతు వేదికలు నిర్మిస్తామని తెలిపారు. రైతుల కు నీళ్లు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ.. రైతు బీమా కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు లాభసాటిగా ఉండే పంటలనే ప్రభుత్వం సూచిస్తుందన్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని, అవి ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రైతులను సీఎం కేసీఆర్ నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారన్నారు. బడ్జెట్లో ఏ టా రూ.60 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయం బాగుంటేనే అన్నీ బాగుంటా యని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారన్నారు. రైతు వేదికల ఏర్పాటు ద్వారా పంట మార్పులతో తెలంగాణ రైతులు దేశ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉంటారన్నా రు. పంట మార్పిడి విధానం పాటించాలని, శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదించే ఏయే పంటలు వేయాలో నిర్ణయిస్తామన్నారు. చాలామంది రైతులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల గురించి సీఎం కేసీఆర్ కంటే ఎక్కువగా ఆలోచించే మొనగాడు ఉన్నాడా.. అని మంత్రి ప్రశ్నిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదావరి జలాలను చూసి సంతోషం అనిపించిందని నిరంజన్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ తం డ్రికి తగిన తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని మంత్రి కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సొంత ఖర్చులతో 6 రైతు వేదికలు జిల్లాలో తాను సొంత ఖర్చులతో ఆరు రైతు వేదికలను నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండ లాలతోపాటు తమ అమ్మమ్మ ఊరు అయిన బోయినపల్లిలో వీటిని నిర్మిస్తానని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ వేదికలను అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేదికలు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతాయని మంత్రి స్పష్టం చేశారు. -
‘ట్రాక్’తో సాగు అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: పంటల వివరాల నమోదు ప్రక్రియను ‘ట్రాక్’పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంటల వివరాల నమోదు కీలకం కానుండటంతో ఆ బాధ్యతలను తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వంభావిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో ట్రాక్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి సమావేశమయ్యారు. వానాకాలం నుంచి పంటల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్ డేటాను రిమోట్ సెన్సింగ్తో అనుసంధానం చేస్తే పంట ఉత్పత్తిని అంచనా వేసి 95% కచ్చితమైన సమాచారం వస్తుందన్నారు. -
‘రైతుల మేలుకే కొత్త విధానం’
సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరువు మార్కెట్ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్గా పటాన్ చెరువు మార్కెట్ను మార్చాలి. మార్కెట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం. ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది. జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
చైనా, అమెరికాలను అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: చైనా, అమెరికా దేశాల ఉత్పాదకతలను మనం అధిగమించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. మన దగ్గర మానవ వన రులు, సాగుభూమి పుష్కలంగా ఉన్నా వారిని అందుకోలే కపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేతలతో జరిగిన సమావేశంలోనూ, ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుండి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడిందన్నారు. ఈ నేపథ్యంలోనే చారిత్రక మార్పునకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మన ఆహార అవసరాలకు సరిపడిన పంటలు పండిస్తున్నామని, కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్నిచ్చే పంటలను పండించాల్సి ఉందన్నారు. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. 42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తోందన్నారు. అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపితే 42 శాతమన్నారు. వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను ఆర్థిక నిపుణులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. 52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశమని, వారిని ఆ అప్పుల ఊబి నుండి బయటపడెయ్యాలనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరి కోతలు పూర్తయ్యేలా సాగు చేస్తే అకాల వర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుందన్నారు. తెలంగాణ ఆహార సెజ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయన్నారు. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాలి... ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి, పసుపు తదితర రకాల విప్లవాలు వచ్చాయని నిరంజన్రెడ్డి అన్నారు. మనం మరో వి ప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయం అని అన్నారు. 40 రోజులుగా అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చలు జరిపామన్నారు. ప్రపం చవ్యాప్తంగా మొక్కజొన్న అధిక ఉత్పత్తితో నిల్వలు పేరుకు పోయాయని అన్నారు. అందుకే ఈసారి ప్రత్యామ్నాయంగా కంది వేయాలని చెబుతున్నామన్నారు. వ్యవసాయ సంస్కరణలను రైతులు ఆహ్వానిస్తున్నారన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలను విపక్షాలు ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చాయా అని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ప్రాజెక్టులు ఇవన్నీ వారిని సంప్రదించే చేశామా అని ప్రశ్నించారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆత్మహత్యలను రాజకీయంగా వాడుకోవడం తప్పితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపే కార్యాచరణ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. వ్యవసాయంలో కూలీల కొరత తీర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీని అనుసంధానం చేయాలని కోరు తున్నదన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, వీసీ ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను ఆర్థిక శాఖ ఏకమొత్తం గా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6.10 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొతాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి వెనువెంటనే రుణ మొ త్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందు కు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. వచ్చే సీజన్కు రైతుబంధుకు రూ.7వేల కోట్లు ఇటు వానాకాలం పంటకు రైతుబంధు సాయం పైనా మం త్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్లో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు కింద డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ.7వేల కోట్లను ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా రైతు లు పంటలువేసే సమయానికన్నా ముందే ఖాతాల్లో డబ్బు లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 1.40 కోట్ల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో కలసి పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను హరీశ్రా వు, నిరంజన్రెడ్డి ఆదేశించారు. రైతులకు అందించే రుణమా ఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్లలో జమయ్యే విషయం లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని బ్యాంకు అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ము ఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పెళ్లి ఖర్చులు విరాళంగా ఇచ్చిన తెలంగాణ జంట..
సంగారెడ్డి : తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా చేసిన.. రూ. 2 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన ఓ యువకుడిని మంత్రి నిరంజన్రెడ్డి అభినందించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఏఈఓగా పనిచేస్తున్న సంతోష్ వివాహం ఆదివారం శిరీష అనే అమ్మాయితో జరిగింది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అతి కొది మంది అతిథుల మధ్య వీరు పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి ఖర్చు ఆదా అయింది. అయితే తన పెళ్లికి కొన్ని రోజుల ముందటే ఆ మొత్తాన్ని సంతోష్ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి నిరంజన్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్కడి వచ్చారు. సంతోష్ తన పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకున్న రూ. 2 లక్షలను కరోనా నివారణ చర్యలకు విరాళంగా ఇచ్చినందుకు అభినందించారు. అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్ నిర్ణయం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వివాహ వేడుక సందర్భంగా అక్కడికి వచ్చినవారిలో చాలా మంది మాస్క్లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ప్రజల కోసం దీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం కార్యక్రమాలు చేయడం మాని, ప్రజల కోసం దీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. పసుపు బోర్డు కోసమో, కాళేశ్వరానికి జాతీయ హోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతు ధర కోటా పెంపు కోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారన్నారు. సీఎం కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారన్నారు. బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుంచి మూడు రూపాయలు తెచ్చారా? ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి సాధించిన ఒక్క పనైనా చూపాలన్నారు. -
‘మూడు రూపాయలైనా తెచ్చారా?..’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుండి మూడు రూపాయలైనా తెచ్చారా అంటూ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం నిర్మించారని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు చేపట్టారని, బీజేపీ నేతలు కేంద్రంలోని తమ ప్రభుత్వంతో పోరాడి సాధించిన ఒక్క పనైనా చూపాలని సవాల్ విసిరారు మద్దతు ధరపై కొనుగోలు కోటా పెంచాలని పదే పదే కేంద్రాన్ని కోరుతున్నది బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. ( అద్దెదారులకు ఊరట.. ) బీజేపీ నేతలు పసుపు బోర్డు కోసమో, పసుపుకు మద్దతు ధర కోసమో, కాళేశ్వరానికి జాతీయ హోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతు ధర కోటా పెంపు కోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారని అన్నారు. ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం తెలంగాణ బీజేపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం దీక్షలు చేయాలని సూచించారు. రైతే తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమన్నారు. దేశంలో 30 వేల కోట్లతో పంటలు కొంటున్న రాష్ట్రం ఏదన్నా ఉందా అని ప్రశ్నించారు. ( రెండు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి ) కరోనా విపత్కర పరిస్థితులలో కూడా రైతుల చేతికష్టం మట్టిపాలు కాకూడదని గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు తెరిచి పంటను కొంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4996 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,08, 5237 మెట్రిక్ టన్నుల ధాన్యం, 935 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,89,353.90 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 84 కొనుగోలు కేంద్రాల ద్వారా 56,019.6 మెట్రిక్ టన్నుల పప్పుశనగ, 11 కేంద్రాల ద్వారా 2803.7 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేశారని వెల్లడించారు. అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
రైతులకు అసౌకర్యం కలగొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు చెం తకే వెళ్లి ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూ చించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితులలో ప్రభుత్వ ఆంక్షలకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమి కూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి బీఆర్కేఆర్ భవన్లో సమీక్షా సమా వేశం నిర్వహించారు. సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో పరిమితులు అవసరం లేదని, రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నా రు. గ్రామాల వారీగా ధాన్యం అ మ్మకానికి వచ్చే పరిస్థితులు అం చనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వా రా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేం ద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను సరఫ రా చేయాలన్నారు. టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. తేమ ని ర్ధారణ యంత్రాలు కొరత లేకుండా చూసుకోవాలని, గన్నీ బ్యాగులను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు ప్రాథమిక సహకార సంఘా లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ వ్యవసాయ మార్కెట్ల వరకూ రైతులు ధా న్యం తెచ్చే అవకాశం రానివ్వమని చెప్పారు. రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1,760 కి కొనుగోలు చేయాలని తెలిపారు. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధిగా ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. నిత్యావసరాలకు గ్రీన్ ఛానల్.. ఇతర రాష్ట్రాల, రాష్ట్రం నుంచి పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. టోల్ ప్లాజాలు చెక్ పోస్ట్ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, దీనిని అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ జీవో విడుదల చేశామన్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్ ఈసీ యాక్ట్లో ఉన్నందున వాటి రవాణా, సరఫరాపై ఎటువంటి ఆంక్షలుండవని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య తదితరులు హాజరయ్యారు. -
అది నిజం కాదు
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్రెడ్డితో కలిసి రామ్చరణ్ ‘ఆచార్య’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చరణ్ టైమ్ కేటాయించడంలేదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీని గురించి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటినుండి ప్రతి విషయంలోను రామ్చరణ్ సహకారం పూర్తిగా ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని డిస్కషన్స్లోనూ మాతో పాటు సమానంగా దగ్గరుండి చరణ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని బాధ్యతలను కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వర్తిస్తున్నాయి’’ అన్నారు. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం: ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. సాయంత్రం 5 గంటలకు మన గుమ్మాల్లోకి వచ్చి వైద్య సేవలందిస్తున్న వారికి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఐకమత్యంతో ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. – చిరంజీవి -
‘ఆచార్య’ అవన్నీ పుకార్లే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైకెర్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, కరోనా భయాల నేపథ్యంలో సినిమా షూటింగ్కి కొద్ది రోజులు విరామం ఇచ్చారు. ఈనేపథ్యంలో.. చిత్ర నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం సాగుతోంది. దీనిపై మాటినీ ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ సంస్థకి, మాకు ఎలాంటి విభేదాలు లేవని, సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కలిసి చర్చిస్తున్నామని ప్రకటనలో తెలిపింది. ‘ఆచార్య సినిమాకు సంబంధించి అన్ని విషయాలపై కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ అంశమైనా ఇద్దరి అంగీకారంతోనే ఫైనల్ అవుతుందని పుకార్లకి ఫుల్స్టాప్ పెటింది మాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థ. కాగా, చిరంజీవికి ఇది 152వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రాఫీ: తిరు. ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. -
మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్చంద్ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
అన్నదాతకు అందలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయిం చింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటా యించారు. 2018–19 బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు సర్కారు తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికా వడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రైతుబంధుకు గత బడ్జెట్లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్పుస్తకాల సంఖ్య పెర గడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018–19 ఖరీఫ్లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019–20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు... గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం తెలిసిందే. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త నిర్ణయం. గతానికి ఇప్పటికీ ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వారందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తారు. అది కూడా ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు ఉన్న రుణాలు రూ. 24,738 కోట్లుగా ఉండగా ఆయా రైతుల సంఖ్య ఎంతనేది వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. అంటే నాలుగేళ్లలో క్లియర్ చేసే అవకాశముంది. వాటిని కూడా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అందిస్తారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కు రూ. 1,000కోట్లు ఈ బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రైతు బీమాకు రూ. 1,141 కోట్లు.. రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది. ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా బడ్జెట్లో మాత్రం నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 304.34 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు. రైతు బడ్జెట్ ఇది రైతు బడ్జెట్ అని మళ్లీ నిరూపితమైంది. బడ్జెట్లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. రైతుబంధు పథకానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు రైతు రుణాల మాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించడం సాహసోపేతమైన చర్య. – నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
యాసంగి అంచనా.. 77.73 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యాసంగి సీజన్లో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 77.73లక్షల టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని, ఈ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరంభమయ్యే కొనుగోళ్లకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని సూచించింది.2019–20 యాసంగి కార్యాచరణపై సోమవారం హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్ సదుపాయం, రవాణా అంశాలపై చర్చించారు. గోదాముల్లో నిల్వ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థలతో పాటు కేంద్ర ఆహార సంస్థ,, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి స్టోరేజ్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల దళారులు రాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
రాష్ట్రాలకే అవకాశం ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 91వ కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) పాలకమండలి సమావేశానికి హాజరై ఆయన ప్రసంగించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు చేయాలంటే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయంలో మార్పులుంటాయని, అందువల్ల రాష్ట్రాలకే కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం ఇవ్వాలని కోరారు. ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అనుకూల చర్యల ద్వారా ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది గతేడాదికన్నా 40.8% పెరుగుదలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుందని వివరించారు.