park
-
సీఎం రేవంత్ కంటే నాకే ఎక్కువ నచ్చింది: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్కు తలమాణికంగా మారుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయన్నారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్ 2000వ సంవత్సరంలో ఈ పార్క్ మొదలు పెట్టారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి విదేశాల నుంచి మొక్కలు తెచ్చి నాటారు. అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ఈ పార్క్ను చూసి ముచ్చట పడ్డారు. అయితే ఈ పార్క్ మీకంటే ముందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పార్క్లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యానవనం వల్ల చాలామంది ఉపాధి దొరుకుతుంది అని ఆకాంక్షించారు.చదవండి: ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు! -
పవన్ పార్టనర్ కు 1200 ఎకరాలు
-
ఇది ఆజాద్ పార్క్..!
ప్రయాగ్రాజ్ (అలహాబాద్) పేరు వినగానే త్రివేణి సంగమం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ఆనందభవన్ గుర్తు వస్తుంది. గూగుల్లో వెతికితే అలహాబాద్లో చూడాల్సిన ప్రదేశాల్లో ఆజాద్ పార్క్ కనిపిస్తుంది. టూర్ ప్లాన్లో పార్కులెందుకు, టైమ్ వేస్ట్ అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆజాద్ పార్కును చూసి తీరాలి. నగరం మధ్యలో 133 ఎకరాల విశాలమైన పార్కు, పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. వాహనాల రణగొణ ధ్వనులు వినిపంచనంత ప్రశాంత వాతావరణం అలరించి తీరుతుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కళ్లు చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ కోసం వెతుకుతాయి. ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారీ, ఆజాద్ అనేది ఆయన బిరుదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశమే ఈ పార్కు.చదువరుల పార్కుఆజాద్ పార్క్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైంది. అప్పుడు దాని పేరు ఆల్ఫ్రెడ్ పార్క్. జాతీయోద్యమవాదులు ఈ పార్కులో తలదాచుకుని ఉద్యమవ్యూహాలు రచించేవారు. అలా చంద్రశేఖర్ ఈ పార్కులో ఉన్న సమయంలో ఆ సమాచారం తెలుసుకున బ్రిటిష్ పోలిస్ అధికారి, తన బృందంతో మోహరించాడు. ఆజాద్ తన తుపాకీతో ముగ్గురు పోలీసులను చంపేశాడు. ఆ కాల్పుల్లో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలిసుల చేతిలో చిక్కకుండా తన తుపాకీతో కణత మీద కాల్చుకుని ప్రాణత్యాగం చేశాడు ఆజాద్. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆజాద్ విగ్రహాన్ని స్థాపించి ఆజాద్ మెమోరియల్గా తీర్చిదిద్దారు. ఆ పార్కుకు ఆజాద్ పేరు పెట్టారు. విగ్రహం దగ్గర నిలబడి ఆజాద్కి సెల్యూట్ చేసి మౌనంగా నివాళి అర్పించి బరువెక్కిన గుండెతో ముందుకు సాగిపోతారు పర్యాటకులు.పార్కులో లైబ్రరీ!ఆజాద్ పార్కులో ఆజాద్ మెమోరియల్తోపాటు విక్టోరియా మెమోరియల్ కూడా ఉంది. అయితే అందులో ఇప్పుడు విక్టోరియా స్టాచ్యూ లేదు. ప్రయాగ్రాజ్ సంగీత్ సమితి, మదన్ మోహన్ మాలవ్యా స్టేడియం, అలహాబాద్ మ్యూజియం ఉన్నాయి. అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ స్లైట్ నిర్మాణాలు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో 5వేల మందికి పైగా సందర్శిస్తారని అంచనా. టికెట్ ఐదు రూపాయలు మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఇక్కడకు నగరవాసులు రెగ్యులర్గా వస్తుంటారు. మంత్లీ టికెట్ వంద రూపాయలు. ఏడాదికి పాస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు. పార్కులోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం. రెగ్యులర్గా వాకింగ్కి వచ్చే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ నడక వేగం తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు. కోచ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. లైబ్రరీలో సివిల్స్కి ప్రిపేరయ్యే వాళ్లు కనిపిస్తారు. ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కో చోట దుప్పటి పరుచుకుని పుస్తకాలు పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. వారి ఏకాగ్రత స్థాయి ఎంతలా ఉంటుందంటే పర్యాటకులు వారి పక్కనే నడిచి వెళ్తున్నా సరే... పుస్తకంలో నుంచి తలతిప్పి చూడరు. వారి చదువుకు భంగం కలిగించకూడదనే పర్యాటకులే ఒకరికొకరు సైగ చేసుకుంటూ శబ్ధం చేయకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు ఐదు రూపాయలే కానీ పార్కు గేటు దగ్గర కొబ్బరిబోండా డెబ్బై రూపాయలు. లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది. 45 నిమిషాలపాటు సాగే ఈ షోలో మోతీలాల్ నెహ్రూ ఇల్లు ఆనందభవన్, అందులో సాగిన స్వాతంత్య ఉద్యమ రచన వివరాలు, ఆజాద్ పార్కులో సాగిన ఉద్యమ ఘట్టాలతో షో నడుస్తుంది. ఆజాద్ మరణంతో ముగిసే ఈ షో మరోసారి మనసును బరువెక్కిస్తుంది. ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువుల వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో? లైట్ అండ్ సౌండ్ పూర్తయి పార్కులో నుంచి బయటపడేటప్పటికి ఎనిమిది గంటలవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
లవర్స్కు అనుమతి లేదు !
ఎక్కడైనా పార్క్ల వద్ద సైకిళ్లు, వాహనాలు తీసుకురావొద్దని, చెత్తాచెదారం పడేయొద్దనే సూచనలతో బోర్డులు చూస్తుంటాం. కానీ ఖమ్మంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఉన్న ఫ్రీడమ్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డును మాత్రం ప్రతిఒక్కరు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ బోర్డుపై సైకిళ్లు పార్క్ లోపలికి తీసుకురావొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత క్రికెట్ ఆడొద్దనేవి రెండు సూచనలు ఉన్నాయి. ఇక మూడోది మాత్రం ‘లవర్స్కు అనుమతి లేదు’ అని రాశారు. పార్క్కు చిన్నాపెద్ద వాకింగ్ కోసం వస్తుండగా గంటల తరబడి తిష్ట వేస్తున్న కొన్ని జంటలు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు వస్తుండడంతోనే ఇలా బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. – ఖమ్మంమయూరిసెంటర్ -
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్నగర్కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/కొయ్యూరు: రాష్ట్రంలో చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది. 4,756 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన శేషాచలం పార్కు రాష్ట్రంలో మొదటిది కాగా తాజాగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రెండో పార్కును ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వివిధ జీవరాశులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బయోస్పియర్ పార్కును అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలకు యునెస్కో సహాయం అందించనుంది. బయోస్పియర్ రిజర్వ్గా మర్రిపాకల అటవీ ప్రాంతం మర్రిపాకల అటవీప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్గా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చింతపల్లి డీఎఫ్వో వైవీ నర్సింగరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు డిపోలో కలప వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతూరు, రంపచోడవరం డీఎఫ్వోలను సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. దట్టమైన అడవి ఉన్న మర్రిపాకల ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొందరు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవావరణ పార్కులో 3 జోన్లు ఉంటాయి కోర్ జోన్: ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలను అనుమతించరు. బఫర్ జోన్: పరిమితంగా స్థానిక ప్రజలను మాత్రమే అవసరమైన వనరుల సమీకరణకు అనుమతిస్తారు. ఫ్రీ జోన్: ఇది పార్కు వెలుపలి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేకుండా సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 18 పార్కులు..జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో చేపట్టింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు ఏర్పాటయ్యాయి. -
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
1000 ఎకరాల్లో కొత్త జూపార్క్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్లో ఉంచాలని చెప్పారు. జామ్నగర్లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్నెస్సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు. పర్యాటకంపై వేర్వేరు పాలసీలు టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో.. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండివేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలుసాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు. -
అక్వేరియం ఏమైనట్టు!.. రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన
సాక్షి, హైదరాబాద్: అక్వా మెరైన్ పార్కు..హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టన్నెల్ అక్వేరియం ప్రాజెక్టు ఇది. కొత్వాల్గూడ ఎకో పార్కులో అత్యాధునిక హంగులతో అక్వేరియం నిర్మాణానికి హెచ్ఎండీఏ అప్పట్లో ప్రణాళికలను రూపొందించింది. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. కానీ ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచలేదు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిరి్మంచాలని భావించారు. రెండుసార్లు టెండర్లు కూడా ఆహా్వనించారు. కానీ నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ప్రస్తుతం ఎకోపార్కు తుది దశకు చేరుకుంది. కానీ టన్నెల్ అక్వేరియం ఏర్పాటు మాత్రం పెండింగ్ జాబితాలో పడిపోయింది. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల హెచ్ఎండీఏ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను, పార్కులను పరిశీలించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన టన్నెల్ అక్వేరియంపైన ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లనున్నదనేది చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.150 కోట్లతో ప్రతిపాదించిన అక్వేరియం ప్రతిపాదన ఉన్నట్లా? లేనట్టా అనే అంశంపైనా సందిగ్ధం నెలకొంది. నగర పర్యాటకానికి మణిహారం.... హిమాయత్సాగర్కు చేరువలో హెచ్ఎండీఏ 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్గూడ ఎకోపార్కు నిర్మాణం చేపట్టింది. నగరవాసులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక అందమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా పార్కును విస్తరించారు. ఈ పార్కులోనే సుమారు 4.27 ఎకరాల్లో టన్నెల్ అక్వేరియం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్వేరియంలపైన అధికారులు అధ్యయనం కూడా చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అక్వా మెరైన్ పార్కుల కంటే మరిన్ని ఆధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కానీ పీపీపీ పద్ధతిలో ప్రతిపాదించిన ఈ భారీ అక్వేరియం నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదు. గత సంవత్సరం రెండుసార్లు టెండర్లు పిలిచారు. స్పందన రాకపోవడంతో కొంతమంది ఆసక్తి కలిగిన డెవలపర్లతో ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ వారి నుంచీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పెండింగ్ జాబితాలో పడిపోయింది. దీనిపై మరోసారి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన అధికారులు ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా పెట్టేయడమా లేక, మరోసారి ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి విధి విధానాల్లో మార్పులు చేయడమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రంగు రంగుల చేపలతో... ⇒ కొత్వాల్గూడ ఎకో పార్కు ఏర్పాటు కోసం, చెన్నై వీజీటీ మెరైన్పార్కు, అహ్మదాబాద్ సైన్స్సిటీ ప్రాజెక్టులపైన అధికారులు అధ్యయనం చేశారు. ఆ తరువాత దేశంలోనే అతి పెద్ద టన్నెల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ⇒ వేయి రకాల రంగు రంగుల చేపలు, మెరైన్ స్పీసెస్, బహుళ టన్నెల్స్తో ఈ మెగా అక్వా మెరైన్ పార్కును అందంగా తీర్చి దిద్దాలని భావించారు. షార్క్ చేపల నుంచి డాలి్ఫన్ల వరకు ఉంటాయి. ఇది సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే విధంగా, అతి పెద్ద జలాశయం అడుగున పర్యటిస్తూ వీక్షిస్తున్న అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది. ⇒ అలాగే అక్వేరియంను దగ్గరి నుంచి వీక్షించేందుకు అనుగుణంగా ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ అతి పెద్ద డోమ్ థియేటర్, సెవెన్ డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, హెల్మెట్ అక్వేరియం వంటివి ఏర్పాటు చేసేందుకు సైతం అప్పట్లో ప్రణాళికలను రూపొందించారు. ⇒ పిల్లల కోసం కియోస్్కలను కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ⇒ కనీసం 2500 మంది ఒకేసారి సందర్శించేందుకు వీలుగా సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావించారు. అక్వేరియంలో ఏర్పాటు చేసే టన్నెల్ ట్యాంక్ మలుపు 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. ⇒ కనీసం 100 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు వాక్ వేలతో టన్నెల్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ మొత్తం అక్వేరియం సుమారు 3 వేల మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యానికి తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి
చైనాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. నలుగురు అమెరికన్ అధ్యాపకులపై దాడి జరిగింది. దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్లోని ఒక పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్ ఈ ఘటనను ధృవీకరించారు.మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు. కాగా అమెరికా పౌరులపై దాడి ఘటనను చైనా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్క్లోజర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్కు వేదికైంది. బ్రిటన్కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
Vijayawada Riverfront Park Photos: సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు)
-
ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ముంపు సమస్య నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్నగర్, భూపేష్ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్కాలనీ, రామలింగేశ్వర్నగర్ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవారు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్ వాల్ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇన్చార్జి వరద ప్రాంతాలకు రక్ష కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్ డిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
‘మా పార్కును కాపాడండి ప్లీజ్’
హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు. హైకోర్టుకు చిన్నారుల లేఖ ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. స్థలం సంగతేంటీ? అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. పెద్దల వల్ల కానిది పిల్లలు.! ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
తెరపైకి తెలంగాణ పార్కు
జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం వికారాబాద్కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ స్పీకర్ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిధుల మల్లింపుతో నిలిచిన పనులు 2019 జనవరి 29న అప్పటి కలెక్టర్ ఉమర్ జలీల్ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద వికారాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. పర్యాటకులు పెరిగే అవకాశం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తొలి ప్రాధాన్యత పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్ను కోరాం. – మంజుల, మున్సిపల్ చైర్పర్సన్, వికారాబాద్ -
విశాఖ జూ పార్క్లో దారుణం.. కేర్ టేకర్పై ఎలుగుబంటి దాడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు -
కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే మనుషులు, జంతువులు, చివరికి పక్షులు కూడా పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు. జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? #WATCH | Sprinkling of water done in Delhi's National Zoological Park, as a measure against the rise in Air Quality Index (AQI) in the national capital (04/11) pic.twitter.com/ufyMDFV4YU — ANI (@ANI) November 5, 2023 -
ఒకప్పుడు అది ఉప్పుగని!
రుమేనియా క్లజ్ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది. పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్, ఫెర్రీవీల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్పార్కు ఇదే కావడం విశేషం. (చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!) -
ఆకట్టుకుంటున్న ఫైవ్ డీ థియేటర్
(సీతంపేట నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) అడవుల నడుమ నేల.. నింగి.. నీటిపై సాహస విన్యాసాలు పులకింపజేస్తాయి. ప్రకృతి ధర్మాలకు ఆలవాలమైన మెరుపులు.. వర్షం.. గాలి దుమారం.. పొగ మంచు.. మంచు కురవడం వంటి అనుభూతులన్నీ కృత్రిమంగా ఒకేసారి సాక్షాత్కరించి మనసుల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన తొలి గిరిజన గ్రామీణ అడ్వెంచర్ పార్కులో ఫైవ్ డీ థియేటర్లోకి వెళితే ప్రకృతి అనుభూతులు ఒకేచోట దొరుకుతాయి. సీతంపేట ఏజెన్సీలో లోయలు, కొండలు, జలపాతాలు, నీటి వనరులు పర్యాటక ప్రదేశాలకు అనువైన ప్రాంతాలు. వీటిని దృష్టిలో పెటు్టకుని అడ్వెంచర్ థీమ్గా పర్యాటకులకు విహారంతోపాటు వినోదాన్ని పంచేలా పార్కును నిర్మించారు. ఇది 2019 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో బోటింగ్ కోసమే ఈ పార్కు ఉపయోగపడేది. ఇప్పుడు అందరి వినోద, విహార యాత్రకు నెలవైంది. పార్కులో ప్రత్యేకతలివీ అడ్వెంచర్ పార్కులో 5డీ థియేటర్ ప్రధాన ఆకర్షణ. రూ.79 లక్షలతో నిర్మించిన ఈ థియేటర్ వద్ద కృత్రిమ జలపాతం, థియేటర్ ముందు భాగం అంతా అడవి జంతువుల బొమ్మలతో తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లే గది, పక్కన విభాగాలన్నీ ఫైబర్ మెటీరియల్తో అందంగా మలిచారు. 5డీ థియేటర్లో మెరుపులు, వర్షం, గాలి, బుడగలు, పొగమంచు, మంచు వంటివి వెంటవెంటనే వచ్చేలా 5 నిముషాల నిడివితో సినిమా ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అడ్వెంచర్ పార్కులో నేల, నింగి, నీటిపై సాహస విన్యాసాలతో వినోదం పొందేలా అభివృద్ధి చేశారు. చిన్నారులకు మెర్రీ గ్రో రౌండ్, క్యాట్ వాక్, క్లైంబింగ్ వాల్, బర్మా బ్రిడ్జి, కమాండో నెట్ వంటి వాటితో బాల విహార్ విభాగం ఉంది. యువతకు కమాండో నెట్, బంగీ జంప్, రాపెల్లింగ్ వాల్ వంటి విన్యాసాలతో కూడిన సాహస విహార్. ఆట పాటలతోపాటు కళలు, నృత్య ప్రదర్శనలకు వేదికగా ఆనంద విహార్. బోటింగ్, వాటర్ రోలర్ వంటి వాటితో జల విహార్. ఎతైన కొండలు, అవరోధాలను దాటుకుని టెర్రైన్ వెహికల్ రైడ్కు వైవిధ్య విహార్. నీటిపై తాళ్ల సాయంతో వేలాడే బ్రిడ్జిపై నడిచి వెళ్లే విస్మయ విహార్. నీటిపై గాలిలో తేలుతూ వెళ్లే స్కై సైక్లింగ్ వినూత్న విహార్. బుల్రైడ్స్, సుమో ఫైటింగ్, బంగీ రన్నింగ్, టార్పలిన్ వంటి వినోద విహార్. షూటింగ్, ఆర్చరీ, బాస్కెట్ బాల్తో సౌర్య విహార్. గుర్రాలపై స్వారీ ఆశ్వవిహార్. పారాచూట్తో చిన్నపాటి ఎగిరే యంత్రాలతో గగన విహార్ విభాగాలను ఏర్పాటు చేశారు. రోజుకు 600 మంది సందర్శకులు వస్తున్నారు. వారాంతంలో అయితే 3 వేల మంది వస్తున్నారు. అడ్వెంచర్ పార్కు ద్వారా నెలకు రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తోంది. తొలి అడ్వెంచర్ పార్కు మన్యం జిల్లా సీతంపేటలో ‘రావెకలబండ’ పేరుతో సహజసిద్ధమైన పురాతన చెరువు ఉంది. 3.70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీనిని అభివృద్ధి చేశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఫైవ్ డీ థియేటర్ ప్రారంభించి అడ్వెంచర్ పార్కులోని అన్ని విభాగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేయడంతో గిరిజన ప్రాంతంలో తొలి అడ్వెంచర్ పార్కుగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 57 గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరిన్ని కుటుంబాలకు పరోక్షంగా ఈ పార్కు వల్ల ఉపాధి లభిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి పర్యాటక కేంద్రంగా మారింది సుమారు పదెకరాల్లో విస్తరించిన సీతంపేట అడ్వెంచర్ పార్కును రూ.2.53 కోట్లతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారు. పర్యాటకులతో రాకతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పరోక్ష ఉపాధి లభిస్తుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. – కల్పనా కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీతంపేట ఐటీడీఏ -
రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: ఐటీ, ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీఐఐసీ (ఏపీ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కూడా భారీ ఐటీ బిజినెస్ పార్క్ను ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. మధురవాడ హిల్ నెంబర్–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ తాజాగా బిడ్లను ఆహ్వనించింది. ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫెసిలిటీలతో పాటు తగినంత పార్కింగ్ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్ను సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్పీవీలో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా.. ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 40 శాతం ఈక్విటీగా సమకూర్చాల్సి ఉంటుంది. ఈక్విటీ రూపంలో ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం రూ.1,380 కోట్లను రుణ రూపంలో సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అన్నీ భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించామని, భాగస్వామ్య కంపెనీ ఎన్నిక అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. గడిచిన ఐదేళ్లలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్ సంస్థలు విశాఖలో ఏర్పాటుకావడంతో స్థిరాస్తి ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఐ–స్పేస్ బిజినెస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్లో గల ఒక వాటర్పార్క్లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
నల్లమలకు పులికూనలు
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు. పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే. ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు. దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్ఎస్టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు: నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి. అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్క్లోజర్లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి. అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్టాక్లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
హుస్సేన్సాగర్ తీరంలో మరో అందమైన పార్కు
హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్సాగర్ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్సాగర్ సుందరీకరణలో భాగంగా జలవిహార్ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్ఎండీఏ లేక్వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. విశేషాలెన్నో.. ► ఈ పార్కులో ఎలివేటెడ్ వాక్వేస్ను ఏర్పాటు చేశారు. ఈ వాక్వేలపై నడుస్తుంటే హుస్సేన్సాగర్ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్ వాక్వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్వేలను ఏర్పాటు చేశారు. ► అద్భుతమైన ఆర్కిటెక్చర్తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్, పంచతత్వ వాక్వే, సెంట్రల్ పాత్వే, అండర్ పాస్లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్ ఉంటుంది. కాంటిలివర్, పర్గోలాస్, విద్యుత్ కాంతులతో అందంగా ఆకట్టుకొనే శిల్పాలు సందర్శకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇల్యుమినేషన్ బొలా ర్డ్స్, ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, నియో ఫ్లెక్స్లైటింగ్ వంటి విద్యుత్ కాంతుల నడుమ బోర్డ్ వాక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందమైన ల్యాండ్స్కేప్.... ► లేక్వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్స్కేప్తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్ డిౖజైన్లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్లొకేట్ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు. ► పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్స్కేప్, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఎంట్రీ టికెట్ ఇలా.. ► లేక్వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి. -
పార్క్లో సరదాగా..
న్యూఢిల్లీ: నిత్యం కీలకమైన కేసుల విచారణ, వాదోపవాదనలను ఆలకించడంలో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కొద్దిసేపు అవన్నీ పక్కనబెట్టారు. మధ్యాహ్నం వేళ కొన్ని కేసుల వాదనలు విన్నాక మధ్యలో కొద్దిసేపు విరామం ప్రకటించారు. వెంటనే కొందరు జడ్జీలతో కలిసి అక్కడే ఉన్న ప్రముఖమైన సుప్రీంకోర్టు పార్క్లో కలియతిరిగారు. అక్కడికి వచి్చన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులతో సరదాగా మాట్లాడారు. అక్కడి కెఫెటేరియాలో టీ తాగారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు సీజేఐతోపాటు నడిచారు. -
కాలం కలిసి వస్తే డంప్యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్లోని రాజ్గఢ్లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్యార్డ్ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్యార్డ్లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్) -
ఆ పార్కులో మాట్లాడుకోడాల్లేవ్! అంతా సైలెంట్..
పెద్దగా మాటలుండవు. ఒక పదీ పదిహేనుమందివచ్చి పార్కులో కలుస్తారు. అందరి చేతుల్లో వారికి నచ్చిన పుస్తకాలు ఉంటాయి. తలా ఒకచోట కూచుని పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదువుకుంటారు. వీడ్కోలుకు ముందు కాసిన్ని కబుర్లు... ఒక చాయ్... ఒకరి పుస్తకం మరొకరికి అరువు...ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం ఆరోగ్యకరమైన బృందం...సెల్ఫోన్ల కాలుష్యంలోముంబైలో తాజా ట్రెండ్ ‘సైలెంట్ రీడింగ్‘. శనివారం సాయంత్రం 5 గంటలు. ముంబైలోని జుహూలో కైఫీ ఆజ్మీ పార్క్. మెల్లమెల్లగా కొంతమంది నడుచుకుంటూ వచ్చి ఒకచోట జమయ్యారు. వారి చేతుల్లో పుస్తకాలు, చాపలు, దుప్పట్లు, చిరుతిండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి నచ్చినచోట దుప్పటి పరిచి పుస్తకం తెరిచి కూచున్నారు. దూరం నుంచి చూస్తే ఒక పదిహేను ఇరవై మంది శిలల్లా కూచుని చేతుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మంచి ప్రకృతిలో, మంచి సమయంలో, నచ్చిన పుస్తకాన్ని, తమలా పుస్తకాలను ఇష్టపడేవారి సమక్షంలో చదువుకోవడం ఎంత బాగుంటుంది? పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలను చదివేవారితో స్నేహానికి మించింది లేదు. అందుకే ఇప్పుడు ముంబైలో ‘సైలెంట్ రీడింగ్’ అనేది ఒక ట్రెండ్గా మారింది. కొత్త స్నేహితులను పరిచయం చేస్తోంది. సైలెంట్ రీడింగ్ ఎందుకు? పుస్తకాభిమానులు బుక్ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్లినా, ఆథర్ టాక్కు వెళ్లినా ఏదో రణగొణధ్వని. పుస్తకం గురించి తక్కువ... మెరమెచ్చులు ఎక్కువ. అంతేకాదు, కొంతమంది పుస్తకాన్ని తప్ప దానిని రాసినవారిని కలవాలనుకోరు. మరికొంతమంది ఇంట్రావర్ట్లు తాము నిశ్శబ్ద స్నేహితులుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారంతా ఏ గోలా లేని ‘సైలెంట్ రీడింగ్’ని ఇష్టపడుతున్నారు. ఈ సైలెంట్ రీడింగ్ గ్రూపుల్లో వాగుడుకాయలకు ప్రవేశం లేదు. హాయిగా నిశ్శబ్దంగా చదువుకోవడమే. మంచి పుస్తకాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడమే. బెంగళూరులో మొదలు బెంగళూరులోని కబ్బన్ పార్క్లో శ్రుతి షా, హర్ష్ స్నేహాన్షు ఇద్దరు పుస్తక ప్రేమికులు ‘కబ్బన్ రీడ్స్’ పేరుతో ‘సైలెంట్ రీడింగ్’ని 2022 డిసెంబర్లో మొదలెట్టారు. కబ్బన్ పార్క్లో పుస్తక ప్రేమికులు విశేషంగా వచ్చి వారానికి ఒకసారి పుస్తకాలు చదువుకుని వెళ్లడం అందరినీ ఆకర్షించింది. దాని ప్రభావంతో ముంబైలోని జుహూలో దియా సేన్గుప్తా, రచనా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు ‘జుహూ రీడ్స్’ పేరుతో ఈ సంవత్సరం మేలో ‘సైలెంట్ రీడింగ్’ను మొదలెట్టారు. వెంటనే జుహూలోని పుస్తక ప్రేమికులను ఇది ఆకర్షించింది. అన్ని వయసుల వాళ్లు ఇక్కడికి వచ్చి కూచుని ప్రశాంతంగా పుస్తకాలు చదవసాగారు. అంతేనా? వీల్చైర్లో ఉండేవారు కూడా వచ్చి పుస్తకంలో, పుస్తకాన్ని ఇష్టపడేవారి సమక్షంలో ఓదార్పు పొందసాగారు. ‘సెల్ఫోన్లు వచ్చాక పుస్తకం చదివే అలవాటు తగ్గింది. మనుషులు సెల్ చూసుకుంటూ కనిపించడమే అందరికీ తెలుసు. కాని ఒకప్పుడు పుస్తకం చదువుతూ కనిపించేవారు. సైలెంట్ రీడింగ్ వల్ల పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు అందరినీ ఆకర్షిస్తున్నారు. దానివల్ల పుస్తకాలు చదవాలన్న అభిలాష పెరుగుతోంది. మేము ఆశిస్తున్నది అదే’ అని జుహూ రీడ్స్ నిర్వాహకులు అన్నారు. దేశ, విదేశాల్లో... బెంగళూరు కబ్బన్ పార్క్తో మొదలైన సైలెంట్ రీడింగ్ ఉద్యమం ఇప్పుడు ముంబైలో బాంద్రా, దాదర్, కొలాబా లాంటి ఐదారు చోట్లకు విస్తరించింది. ఇక మన దేశంలోని ఢిల్లీ, పూణె, చెన్నై, కొచ్చి, హైదరాబాద్లకు కూడా వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా కబ్బన్ రీడ్స్ గురించి తెలుసుకున్న వారు న్యూయార్క్, లండన్, దుబాయ్, మెల్బోర్న్లలో కూడా సైలెంట్ రీడింగ్ సమూహాలను తయారు చేస్తున్నారు. ‘ఈ రీడింగ్స్కు వచ్చినవారు మంచి స్నేహితులుగా మారుతున్నారు. బిజీ లైఫ్లో మనిషి ఒంటరితనాన్ని ఫీలవుతున్నాడు. ఆ ఒంటరితనం పోగొట్టేందుకు సైలెంట్ రీడింగ్ గ్రూపులు సాయం చేస్తున్నాయి’ అని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నానా చెత్త ప్రభావంలో పడి అనవసర భావోద్వేగాలకు లోను కావడం కన్నా వికాసం, జ్ఞానం, జీవితానుభవం, ఆహ్లాదం పంచే పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడం నేటి తక్షణావసరం. పుస్తకాలు చదివే వారితోనే నాగరిక సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా సైలెంట్ రీడింగ్ గ్రూపులు సమాజాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల్ని పుస్తకాభిమానులు ఎక్కడికక్కడ అందుకోవాల్సిన అవసరం ప్రతి ఊళ్లో, పట్టణంలో ఉంది. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ప్రతి నియోజకవర్గానికీ ఓ అటవీ పార్కు
మణికొండ: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికీ ఓ అటవీ పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 109 పార్కులకు గానూ 73 పూర్తి చేశామని, మంచిరేవులలో 74వ పార్కు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నగర శివారు చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మంచిరేవుల ఔటర్రింగ్ రోడ్డుకు ఆనుకుని 360 ఎకరాలలో రూ.7.38 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ట్రెక్ పార్కును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పి.సబితారెడ్డి, పి.మహేందర్రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే లక్ష్యాన్ని దాటి 270 కోట్ల మొక్కలను నాటామన్నారు. అందులో 80శాతం మొక్కలు బతుకుతున్నాయని, ఈ ఏడాది 30 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామని వివరించారు. హైదరాబాద్లో 60నుంచి 70 పార్కులు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ లంగ్ స్పేస్లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్తో ఈ ట్రెక్ పార్కును అభివృద్ధి చేశామన్నారు. ఇందులో 50 వేల రకాల మొక్కలు, 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ట్రాక్, 4 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, యాంఫీ థియేటర్, ట్రీ వాటర్ ఫాల్, వాచ్ టవర్ లాంటి అనేక సౌకర్యాలను కల్పించామనీ స్థానిక ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. పార్కును ప్రారంభించి సఫారీ వాహనంలో పర్యటించి, మొక్కలు నాటారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కోట్లాది మొక్కలు నాటడం ఎంతో మంచి కార్యక్రమమని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతో‹Ùకుమార్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసుకున్నా పచ్చదనం తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రం 7.3శాతం పెరగటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, పైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రతాప్రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ హరీశ్, బండ్లగూడ మేయర్ మహేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్కుకు 'వాజ్పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
పాట్న: బిహార్లో అటల్ బిహారీ వాజ్పేయీ పార్కు పేరును కోకోనట్ పార్క్గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. పార్క్ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 'వాజ్పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్పేయీ పేరు అలాగే ఉంది. ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్.. -
అతిపెద్ద ఐస్క్రీమ్ పార్లర్..
ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్క్రీమ్ పార్లర్. క్యూబాలోని హవానా నగరంలో ఉంది. పేరు కొపేలియా పార్క్. ఈ పార్లర్లో పనిచేసే సిబ్బందికి అస్సలు ఖాళీ ఉండదు. ఒక రౌండ్లో 600ల మంది కస్టమర్లకు ఒకేసారి ఐస్క్రీమ్ అందిస్తుంటారు. రోజూ ఇక్కడకు కనీసం 30 వేలమంది వస్తుంటారు. 1966లో నిర్మించిన దీనిని ఐస్ క్రీమ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత పెద్ద ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్క్రీమ్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కో ఐస్క్రీమ్ ధర కేవలం రూ.17.20 మాత్రమే. ధర తక్కువ అని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే! ఈ పార్లర్లోని ఐస్క్రీమ్ రుచులు విదేశీ పర్యాటకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతం అయిన తర్వాత అమెరికా నుంచి ఫిడెల్ క్యాస్ట్రో 28 కంటైనర్ల ఐస్క్రీమ్ ఆర్డర్ ఇచ్చారట. దాని రుచి ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట! దీంతో అలాంటి ఐస్క్రీమ్ తమ దేశంలోనూ ఉండాలనే ఉద్దేశంతో కొపేలియా పార్క్ నిర్మించారట! (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
పార్కుగా మారనున్న రైల్వేస్టేషన్
పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్ కెంట్ కౌంటీలోని లాయిడ్ పట్టణంలో ఉంది ఈ స్టేషన్. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది. స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు. (చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!) -
అమ్మా! తల్లి.. ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో..
సింహం అంటేనే హడలిపోతాం. ఏదో దూరంగా చూసి ఆనందిస్తాం. కనీసం బోనులో ఉన్నా కూడా దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతాం. పైగా అది పెట్టే గాండ్రింపుకే హడలి చస్తాం. అలాంటిది దానితో కలిసి భోజనం షేర్ చేసుకోవడమా! అమ్మ బాబోయ అనేస్తాం. కానీ ఇక్కడొక అమ్మాయి అంత ధైర్యం చేయడమే కాదు, దాంతో కలిసి భోజనం చేసింది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ పెద్ద సింహంతో కలిసి భోజనం చేసింది. అదీకూడా అది తినే ప్టేటులోనే ఫుడ్ షేర్ చేసుకుంది. ఏ మాత్రం జంకకుండా దాంతో ఓ ఫ్రెండ్ మాదిరి కూర్చొని దర్జాగా తింటోంది. ఈ ఘటన యూఏఈలోని వైల్డ్లైఫ్ పార్క్ రాస్ ఏఐ ఖియామ్లో చోటు చేసుకుంది. ఇక నెట్టింట వైరల్ అవతున్న.. అందుకు సంబంధించిన వీడియోకి మిలియన్స్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by حديقة حيوانات رأس الخيمة (@rak_zoo) (చదవండి: 68 ఏళ్ల వయసులో ఓ మహిళ చేసిన సాహసం! గాల్లో ఉండగా పైలట్ అస్వస్థతకు గురవ్వడంతో...) -
రాజీవ్ పార్క్ ను కడప ప్రజలకు అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
వైజాగ్ జూపార్క్లో "టైగర్ జానకి" మృతి
విశాఖపట్నం: జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది. జూలో ఎన్క్లోజర్లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను అలరించే జానకి కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురైంది. జూ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా ఆహారం కూడా తినలేదని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ప్రస్తుతం జూలో మూడు పెద్ద పులులున్నట్లు పేర్కొన్నారు. -
ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!
పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు. అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్ సులువుగా నడిచేలా.. చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు. ♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. -
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా పార్క్ విజయనగరంలో ఏర్పాటు
-
విజయనగరం : అట్టహాసంగా మహిళా పార్కు ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
మహిళలకోసం ప్రత్యేకంగా పట్టణంలోని ప్రకాశం పార్క్
-
బెంగుళూరులో దారుణం.. పార్కులో నుంచి యువతిని ఊడ్చుకెళ్లి..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు పార్క్కు వెళ్లిన ఓ యువతిని నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఉదయం ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. మార్చి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చొని మాట్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి.. రాత్రి సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. నలుగురు కలిసి ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి తోశారు. అనంతరం ఆ వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లారు. అంతేగాక అఘాయిత్యం గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించారు. అమిnrso బాధితురాలి ఆరోగ్యం బాలేక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన ఘోరాన్నికుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు పోలీస్ అధికారి సీకే బాబా వెల్లడించారు. -
రూల్స్ బ్రేక్, చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని.. పెంపుడు కుక్కతో పార్క్కి వెళ్లి
ప్రముఖులు ఏం చేసినా అవి వైరల్గా మారుతుంటాయి. ఈ అంశంలో దేశాధినేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు నడిచే నడక నుంచి, ప్రవర్తించే తీరు.. ఇలా ప్రతిదీ కెమెరా కంట పడుతుంది. అందుకే వాళ్లు కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలిసో తెలియకో చిన్న చిన్న పోరపాట్లు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటారు. ఈ తరహాలోనే ఇటీవల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట లాక్ డౌన్ చట్టం ఉల్లంఘణ, ఆ తర్వాత కారు సీటు బెల్టు పెట్టుకోనందుకు జరిమానా.. తాజాగా మరోసారి తన పెంపుడు కుక్క వల్ల రూల్స్ను బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డారు రిషి సునాక్. అసలేం జరిగిందంటే.. పెంపుడు కుక్కతో పార్క్కు.. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ లండన్లోని హైడ్ పార్క్కు కాసేపు కాలక్షేపానికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ఓ పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి ఆ పార్కులో వదిలేశారు. అయితే జంతువుల్ని అలా వదిలేయడం ఆ పార్క్ నిబంధనలకు విరుద్ధం. దీంతో పార్కులోకి వన్య ప్రాణులను బంధించి తీసుకురావాలన్న రూల్ను సునాక్ బ్రేక్ చేశారు. స్వేచ్ఛగా అక్కడ సంచరిస్తోన్న కుక్కను గమనించిన సిబ్బంది వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి పార్క్ రూల్స్ను వివరించారు. దీంతో పాటు సునాక్ పెంపుడు కుక్క మెడకు పట్టీ పెట్టి అందించారు. దీనంతటిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇది కాస్తా దేశ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. గతంలొ కరోనా మహమ్మారి నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సమయంలో ప్రధాని రిషి సునాక్ కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆయనకు ట్రాఫిక్ పోలీసులు 50 పౌండ్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా తన పెంపుడు కుక్క వ్యవహారంతో మరో సారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. Rishi Breaks Law Walking Dog With No Lead in Royal Parkhttps://t.co/dgjkp0z2kZ pic.twitter.com/hcgr39MHSi — Guido Fawkes (@GuidoFawkes) March 14, 2023 -
పార్కులో కూర్చుంటే జరిమానా
సాక్షి, కృష్ణరాజపురం: మా సేవలు ఊరికే రావు. ప్రజలకు భద్రత కల్పించాలంటే.. చాలా ఖర్చవుతుంది అన్నట్టుగా ఉంది కొందరు ఖాకీల వ్యవహారశైలి. వారి వల్ల నిజాయతీగా పనిచేసేవారిని కూడా అనుమానంతో చూసే పరిస్థితి నెలకొంది. ఐటీ సిటీలో సంపిగెహళ్లి, ఆడుగోడి పోలీసులు ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం రచ్చ కావడం మరిచిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఉద్యానవనంలో కూర్చుని ఉన్న స్నేహితులను ఓ కానిస్టేబుల్ బెదిరించి వారి వద్ద నుంచి రూ. 1000 వసూలు చేశాడు. ఫొటోలు తీసి, డబ్బు ఇవ్వాలని.. వివరాలు.. జనవరి 29వ తేదీన నగరంలోని వైట్ఫీల్డ్ వద్ద కుందళహళ్లిలో ఉన్న ఉద్యానవనంలో ఆర్ష లతీఫ్ అనే యువతి, స్నేహితునితో కూర్చుని ఉంది. కులాసాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి వారిని తన మొబైల్తో ఫొటోలు తీయసాగాడు. ఇక్కడ పార్కులో ఏం చేస్తున్నారు?, ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని వారిని గదమాయించాడు. తాము ఏమీ చేయడం లేదని, ఊరికే కూర్చుని ఉన్నామని చెప్పారు. పార్క్లో కూర్చోడానికి కూడా పర్మిషన్ కావాలా? అని యువతీ యువకుడు అడిగారు. దాంతో కానిస్టేబుల్.. ఏమిటీ రూల్స్ మాట్లాడుతున్నారు? రండి స్టేషన్కు వెళదాము, అక్కడ అన్నీ బయటకి వస్తాయని బెదిరించారు. ఇక్కడే అయితే రూ. వెయ్యి జరిమానా కట్టి వెళ్లిపోండి. స్టేషన్కు వస్తే మీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించి, వారి వద్ద నుంచి రూ . వెయ్యి ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. తరువాత తమ బాధాకర అనుభవం ఇదీ యువతి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: వధువు కావాలా.. నాయనా?) -
టిప్పు సుల్తాన్ పేరు తొలగించిన మహా సర్కార్
ముంబై: మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఉద్దవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని.. తాజాగా షిండే సర్కార్ రద్దు చేసింది. ముంబై మలాద్ ప్రాంతంలోని ఓ పార్క్కు టిప్పు సుల్తాన్ పేరును తొలగిస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సకల్ హిందూ సమాజ్, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత, ముంబై సబర్బన్ డిస్ట్రిక్ గార్డియన్ మినిస్టర్ మంగళ్ ప్రభాత్ పేరు తొలగింపునకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్కు జారీ చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ బ్యానర్ను తొలగించారు. అంతేకాదు.. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అసలు ఆ పేరు ఉండాలని ఎవరూ అక్కడ కోరుకోలేదని ఆయన అంటున్నారు. ఉన్నపళంగా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, టిప్పు సుల్తాన్ పేరుతో ఓ బ్యానర్ వెలిసిందని, ఆ సమయంలో అక్కడ నిరసనలు జరిగాయని గుర్తు చేశారాయన. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, ప్రజాభీష్టాన్ని గౌరవించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్, బీఆర్ అంబేద్కర్.. ఇలాంటి మహనీయుల పేర్లను నిర్ణయించాలని బీజేపీ స్థానికులను కోరుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించిన సమయంలో బీజేపీ సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనూ టిప్పు సుల్తాన్ పట్ల వ్యతిరేకత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Finally, victory of the Right! Ordered removal of name Tipu Sultan from the park in Malad after considering the protests by Sakal Hindu Samaj & demand by @iGopalShetty Ji in the DPDC meeting. Last year MVA govt had named the ground after Tipu Sultan and we had to protest it! pic.twitter.com/IRBgiAmfbZ — Mangal Prabhat Lodha (@MPLodha) January 27, 2023 -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
వామ్మో దెయ్యాల ఊళ్లు.. ఆ ఇళ్లలో ప్రేతాత్మలు ఉన్నాయా?.. అక్కడికి వెళ్లాలంటే?
ఆ ఊళ్లో ఎటుచూసినా చెదురు మదురుగా విసిరేసినట్లుండే భూత్ బంగ్లాలే కనిపిస్తాయి. వీధుల్లో తిరుగుతుంటే, అక్కడక్కడా పాడుబడిన వాహనాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా కనిపించే దెయ్యాల ఊళ్లుగా పేరుమోసిన ఊళ్లలో ఆ ఊరొకటి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఊరి పేరు బోడీ. ఇదొక చిన్న పట్టణం. రెండువందలకు పైగా ఇళ్లు, చర్చిలు, పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోదకేంద్రాలు, హోటళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండరు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతుంటారు. పర్యాటకులు బస చేయడానికి ఇక్కడా ఎలాంటి వసతులూ ఉండవు. బాగున్న రోజుల్లో ఈ ఊరి జనాభా పదివేలకు పైగానే ఉండేది. ఊరికి దగ్గరగానే బంగారు గని ఉండేది. గనిలో పనిచేసేవాళ్లంతా ఈ ఊళ్లో ఉండేవాళ్లు. ఊరే కాదు, ఊరవతల ఉండే బంగారు గని కూడా ఇప్పుడు ఖాళీగా మిగిలింది. దెయ్యాల భయంతోనే జనాభా అంతా ఈ ఊరిని విడిచిపెట్టి తలోదిక్కూ వెళ్లిపోయారు. డెబ్బయ్యేళ్ల కిందట ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకెవ్వరూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయకపోవడంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని ‘బోడీ స్టేట్ హిస్టారిక్ పార్క్’గా మార్చింది. గుండెధైర్యం ఉన్న పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వస్తుంటారు. వారిలోనూ కొందరు ఇక్కడ కొన్ని పాడుబడిన ఇళ్లలో ప్రేతాత్మలు చూశామని, కొన్ని ఇళ్ల నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు విన్నామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. పాడుబడిన ఇళ్లలో అప్పటి జనాలు వాడుకున్న ఫర్నిచర్, ఇతర వస్తువులు దుమ్ముపట్టి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఊరిని సందర్శించడానికి పగటి వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. రుతువును బట్టి సందర్శకులను అనుమతించే వేళల్లో మార్పులు ఉంటాయి. -
తటాక తీరంలో ఆనంద విహారం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ఉస్మాన్సాగర్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా గండిపేట తీరంలో ఏర్పాటు చేసిన సువిశాలమైన లాండ్స్కేప్ పార్కును మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. అలాగే కొత్వాల్గూడ ఎకో పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.6 కోట్లతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ గండిపేట్ పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కులో ఓపెన్ఎయిర్ థియేటర్ ప్రత్యేకమైన ఆకర్షణ. చక్కటి సీటింగ్ సదుపాయంతో ఉండే ఈ థియేటర్ పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక విశేషాలను, ప్రత్యేకతలను ఈ థియేటర్లో ప్రదర్శిస్తారు. పార్కు అందాలను ద్విగుణీకృతం చేసేలా స్వాగత ద్వారాన్ని భారీ ఆకృతిలో నిర్మించారు. సెంట్రల్ పెవిలియన్, ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్, గార్డు రూమ్ తదితర సదుపాయాలు ఉన్నాయి. సందర్శకులతో పాటు వాకింగ్కు వచ్చేవారి కోసం నడక దారులు ఏర్పాటు చేయనున్నారు. పార్కులో హరివిల్లులను తలపించే రంగురంగుల ఫ్లవర్ టెర్రస్లు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో పిల్లలు ఆడుకొనే రకరకాల పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. పిక్నిక్ జోన్లో పుట్టిన రోజు వంటి వేడుకలు చేసుకోవచ్చు. ఉస్మాన్సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన కొత్వాల్గూడ ఎకో పార్కును సుమారు రూ.75 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కులో 6 ఎకరాల్లో పక్షుల ఆవాసం (బర్డ్స్ అవేరి), రెండున్నర కిలోమీటర్ల బోర్డు వాక్, పాత్వేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఓఆర్ఆర్ను అనుసంధానం చేసే బ్రిడ్జీలు, ఫుడ్కోర్టులు, విలాసవంతమైన కుటీరాలు, సమావేశ మందిరం వంటివి ఏర్పాటు చేయనున్నారు. -
బాంబులతో దద్ధరిల్లిన ఉక్రెయిన్ ...ఘోరంగా విరుచుకుపడ్డ రష్యా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై ఘోరంగా వరుస బాంబులతో విరుచుకుపడింది రష్యా. అందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా కురిపించిన బాంబు వర్షంలో కీవ్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ బ్రిడ్జ్ ఆఫ్ గ్లాస్ పై దారుణంగా బాంబు దాడి జరిగింది. దీంతో వంతెన బూడిదతో కప్పబడినట్లుగా నిర్మానుష్యంగా మారింది. అలాగే ఎప్పుడూ జనాలతో అత్యంత రద్దీగా ఉండే షెవ్చెంకో పార్కుపై కూడా దాడులు జరిగాయి. అక్కడ మొత్తం దట్టమైన పొగ వ్యాపించి విధ్యంసకరంగా మారింది. మరోక వీడియోలో ఈ బాంబు దాడుల సమయంలో వీధుల గుండా వెళ్తున్న అమ్మాయి కనపిస్తుంది. ఆమె భయం భయంగా వెళ్తుంటే ఆమెకు సమీపంలోనే క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆమె భయంతో వేగంగా పరిగెడుతూ వెళ్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ మిసైల్ దాడిలో చిక్కుకుని అల్లకల్లోలంగా మారింది. The Bridge of Glass in the very heart of Kyiv pic.twitter.com/CvsRfTEAoJ — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) October 10, 2022 Shevchenko Park in central Kyiv now. Probably the city’s busiest park, usually packed with people and street musicians pic.twitter.com/9kIS4rBiKq — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 A girl was recording herself as she walked through what looks like Shevchenko Park in Kyiv this morning. She was almost killed by a Russian rocket pic.twitter.com/1Fa40ypcyg — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 (చదవండి: ‘కెర్చ్ వంతెన’కు ప్రతీకారం.. ఉక్రెయిన్పై మిసైల్స్తో భీకర దాడులు) -
జూ కీపర్పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
కునో పార్క్లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
Rajiv Gandhi park: అత్యాధునిక హంగులతో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
-
నగరానికి శోభ.. గండిపేట పార్కు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్కులో యాంఫీ థియేటర్తో పాటు గ్రీనరీతో కూడిన అందమైన ప్రదేశాలను ఏర్పాటు చేశారన్నారు. గండిపేట పార్కును అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు, హెచ్ఎండీఏ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అందమైన హైదరాబాద్ నగరానికి ఈ పార్కు మరింత శోభను తీసుకొస్తుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, గండిపేట పార్కును 5.50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ.35.60 కోట్ల వ్యయంతో పార్కును రూపొందించారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రన్స్ ప్లాజా, వాక్వేస్, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను నిర్మించారు. -
ఆ గార్డెన్లో గాలి పీలిస్తే పైకే!
ఎవరినైనా పార్క్ లేదా గార్డెన్కు ఎందుకు వెళ్తారని అడిగితే ఏం చెబుతారు? రకరకాల పూల మొక్కలు, చెట్లతో కూడిన అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తూ సేదతీరేందుకు, స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు వెళ్తామని బదులిస్తారు. కానీ ఇంగ్లండ్లోని ఆల్న్విక్లో ఉన్న ఓ గార్డెన్కు ఎవరైనా వెళ్లాలనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే! ఎందుకంటే ఇది మామూలు గార్డెన్ కాదు మరి.. పూలచెట్లు, పరిమళభరిత గులాబీలు కూడా ఉన్న ఈ పార్క్లో ఎవరైనా కాస్త గట్టిగా అక్కడి గాలి పీలిస్తే కళ్లు తిరిగి పడిపోవడమో లేదా మరణించే అవకాశం కూడా ఉందట! ఈ మిస్టరీ వెనక కాస్త హిస్టరీ ఉందిలెండి. అదేమిటంటే.. ఈశాన్య ఇంగ్లాండ్లోని నార్త్అంబర్ల్యాండ్ కౌంటీ రాజ్యవంశ పాలనాధికారి సతీమణి అయిన జేన్ పెర్సీ కొన్నేళ్ల కిందట తమ కోట ఆవరణలోని 14 ఎకరాల తోట సుందరీకరణకు నడుంబిగించింది. గార్డెన్కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేందుకు సాధారణ పూల మొక్కలతోపాటు 100 రకాల విషపూరిత మొక్కలను వివిధ దేశాల నుంచి తెప్పించింది. ఇందులో మాంక్స్హుడ్, రోడోడెడ్రాన్స్, వోల్ఫ్స్ బేన్ వంటి విషపూరిత జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన మొక్కగా గిన్నిస్ బుక్ గుర్తించిన రిసిన్ (వాడుక భాషలో క్యాస్టర్ బీన్ మొక్కగా పిలుస్తుంటారు) కూడా ఈ గార్డెన్లో ఉంది. దీంతో అవి ఎలా ఉంటాయో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. అయితే సాధారణంగా పార్కుల్లో ‘పూలను తెంచొద్దు’ అని రాసి ఉండటాన్ని చూసే ఉంటారు. కానీ ఈ ‘పాయిజన్ గార్డెన్’ దగ్గర మాత్రం ‘ఇక్కడ ఆగొద్దు, పూల వాసన చూడొద్దు’ అని రాసి ఉండటం గమనార్హం! ఎందుకంటే ఇందులోని విషపూరిత మొక్కలు విడుదల చేసే విషవాయువులను పీలిస్తే సొమ్మసిల్లి పడిపోవడం లేదా మరణించడం ఖాయమట! అందుకే ‘ద పాయిజన్ గార్డెన్’ వద్ద ఉన్న భారీ గేటుపై పుర్రె, ఎముక గుర్తును ఉంచి మరీ ఈ విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎవరైనా ఇందులోకి ప్రవేశించాలంటే కచ్చితంగా గైడ్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు. అయినా కొందరు ఆకతాయితనంతో ఆ మొక్కల ఆకులు, పూల వాసన పీల్చి స్పృహ తప్పుతుంటారని పేర్కొన్నారు. నిర్వాహకుల లెక్కల ప్రకారం ఈ గార్డెన్ను ఏటా 6 లక్షల మంది సందర్శిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వృక్ష శాస్త్రవేత్తలే. ‘వరల్డ్స్ డెడ్లీయెస్ట్ గార్డెన్’ అంటూ ట్విట్టర్లో తాజాగా ఓ వ్యక్తి ఈ గార్డెన్ గేటు ఫొటో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. -
పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత
కంప్యూటర్ యుగంలో కాలంతో పాటే మనిషి పరుగెత్తుతూ యాంత్రిక జీవన విధానానికి అలవాటు పడిపోతున్నాడు. పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రశాంతంగా కొంత సమయాన్ని గడిపేందుకు వీలుగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో పంచతత్వ పార్కు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కులో నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మానసిక ప్రశాంతతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: పోచారం మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎల్ఐజీ కాలనీలో ప్రభుత్వ ఆదేశానుసారం పోచారం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పార్కు కేంద్ర బిందువు వద్ద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ సెక్టార్ల ఆకృతిలో పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తదుపరి వలయంలో 20 ఎంఎం, 10 ఎంఎం కంకర రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎంఎం చిప్స్, ఇసుక, నల్ల రేగడి మట్టి, చెట్ల బెరడు, నీటి బ్లాకుల అనుసంధానంతో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. ఈ ట్రాక్పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై పలు స్థాయిల్లో ఒత్తిడి కలుగుతుంది. తద్వారా శరీరంలో సరైన రక్తప్రసరణ జరిగి అనారోగ్యాలు దూరమవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. రూ.15 లక్షల నిధులతో.. స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదాన్ని పంచే పంచతత్వ పార్కు కోసం రూ.15లక్షల నిధులు వెచ్చించారు. పలు ప్రత్యేకతలతో నిర్మించిన ఈ పంచతత్వ పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. పార్కులోని మొక్కల పేర్లు.. పార్కులో ఫైకస్ పాండా, అలోవిరా, కృష్ణ తులసి, రణపాల, రియో, మినీ దురంతో ఎల్లో, ఇప్రోబియా మిల్లి, మినీ దురంతో పింక్, పాండనస్, మినీ ఎక్సోరా వైట్, వాము, లెమన్ గ్రాస్, ధవనమ్, పొడపత్రి తదితర మొక్కలున్నాయి. పంచతత్వ పార్కులో వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ► నిద్రలేమిని నివారిస్తోంది ► కంటి చూపు మెరుగవుతుంది ► నాడీ వ్యవస్థ బలోపేతమవుతుంది ► రోగనిరోధక శక్తి పెరుగుతుంది ►శక్తి వృద్ధి చెందుతుంది ►రుతుచక్రం సజావుగా సాగుతుంది ► వేడిని తగ్గిస్తుంది ► బీపీ తగ్గుతుంది ► గుండె పనితీరు మెరుగవుతుంది ► ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కులుగుతుంది ► ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది పార్కులో ఇవి పాటించాలి.. ►పాదరక్షలు లేకుండా నడవాలి. ► సమయం తీసుకుని నెమ్మదిగా నడవాలి. ► క్రమం తప్పకుండా నడుస్తూ పురోగతిలో ఉండాలి. ►గాలిని పీల్చుతూ వదులుతూ ఉండాలి. ►ఎక్కడైనా నడవలేకపోతే, అక్కడ మరో రోజు ప్రయత్నించాలి ►నడక విషయంలో పట్టుదల ఉండాలి ►శరీరంలోని వ్యర్థాలు పోవాలంటే నీరు తాగాలి రీయో ►రీయో ఆకులతో డికాషన్ తయారు చేసుకుని తాగుతారు. దీని వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఒంట్లో చల్లదనం కోసం కూడా తీసుకుంటారు. వాము ►వాము మొక్క ఆకుల వాసన ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మానసికి ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లెమన్ గ్రాస్ ►లెమన్ గ్రాస్ మొక్కలున్న చోటకు దోమలు రావు. దీనిలో ఏ, బీ1, బీ2, బీ3, బీ5, బీ6, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ శాతం చాలా ఎక్కువ. లెమన్ గ్రాస్తో చేసిన టీ(చాయ్) నిద్రలేమిని తగ్గిస్తుంది. మస్తిష్కంతో పాటు కండరాలను రిలాక్స్ అయ్యేట్లు చేస్తుంది. అల్జీమర్స్ చికిత్సలో దీనిని వాడతారు. పొడపత్రి ►పొడపత్రి ఆకుల రసాన్ని పరగడుపున 7 రోజులు తీసుకుంటే చక్కెర వ్యాధి నయమవుతుంది. ధవనం ►దీనినే మాచిపత్రి అని కూడా అంటారు. ఈ మొక్క మంచి సువాసను వెదజల్లుతుంది. దీని వాసన పీల్చుకోవడం ద్వా రా ఒత్తిడి దూరమవుతుంది. దీని ఆకుల నుంచి తీసిన నూనెను చర్మవ్యాధులు, పంటి నొప్పి, చెవి నొప్పి తగ్గడానికి వినియోగిస్తారు. పాండనస్ ఆకర్షణీయమైన ఆకులతో మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. వేడి నీళ్లలో దీని ఆకు వేస్తే మంచి సువాసన వస్తుంది. ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు -
పార్క్లో బట్టలు లేకుండా సంచరిస్తూ.. కనిపించిన వారితో..
బనశంకరి(బెంగళూరు): ఒంటిపై దుస్తులు లేకుండా ఉద్యానవనాల్లో సంచరిస్తూ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విదేశీ పర్యాటకున్ని ఆదివారం సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్చేశారు. జేమ్స్ అనే విదేశీయుడు శివరామకారంత లేఔట్పార్కులో బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో సంపిగేహళ్లి పోలీసులు వచ్చి అతన్ని పట్టుకోబోయారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. చిన్నారిని చిదిమేసిన టిప్పర్ మండ్య: మద్దూరు తాలూకా దుండనహళ్లిలో ఘోరం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూమిక (6) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో జనం రోడ్డుపై ధర్నా చేసి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కెస్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పదిరోజుల్లో తేజ పెళ్లి.. పెద్దలు పత్రికలు పంచుతుంటే.. -
బాబోయ్ ఎండలు.. సాయంత్రం కాగానే అక్కడ క్యూ కడుతున్న జనం
సాక్షి,సైదాబాద్(హైదరాబాద్): భానుడి భగభగలతో ఉదయమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారులు, పెద్దలు సాయంత్రం వేళల్లో మాత్రం కాలనీల్లోని ఉద్యానవనాల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఉదయమంతా ఏసీలు, కూలర్ల నుంచి కృత్రిమ చల్లదనంతో ఉపశమనం పొందుతూ సాయంత్రం కాగానే ప్రకృతి సహజంగా వచ్చే చల్లదనం కోసం పార్కులకు చేరుకుంటున్నారు. ఆటపాటలతో చిన్నారుల సందడి... ► ఐఎస్సదన్ డివిజన్లోని పలు పార్కుల్లో సాయంత్రం వేళల్లో చిన్నారులు సందడిగా గడుపుతున్నారు. ► ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో చదువులకు తాత్కాలికంగా విరామం రావడంతో చిన్నారులు ఆట పాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ► సరస్వతీనగర్ కాలనీలోని పార్క్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట పరికరాల వద్ద చిన్నారులు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. ► తమ పిల్లలు పార్కుల్లో ఉరుకులు, పరుగులు పెడుతూ ఆటలాడుకోవటం వారి తల్లిదండ్రులకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ► కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ వంటి వాటితో రోజంతా గడుపుతున్న తమ చిన్నారులు సాయంత్రం ఇలా ఆడుకోవడం వల్ల శారీరక దృఢత్వాన్ని పొందుతారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముచ్చట్లతో సేద తీరుతున్న పెద్దలు... ►భానుడి ప్రతాపం తగ్గి సాయంత్రం చల్లబడుతుండగానే సీనియర్ సిటిజన్లు తమ కాలనీల్లోని పార్కులకు చేరుకుంటున్నారు. పార్కుల్లోని వాకింగ్ ట్రాక్పై కొద్ది సేపు నడుస్తున్నారు. ► తర్వాత పార్కుల్లోని సిమెంట్ బెంచీలపై కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. ► సరస్వతీనగర్ కాలనీ పార్క్కు సాయంత్రం కాగానే వయో వృద్ధులు చేరుకుంటున్నారు. వాకింగ్ చేశాక అందరూ ఒకచోటికి చేరుతున్నారు. ప్రకృతి సహజంగా వస్తున్న చల్లటి గాలిలో సేద తీరుతూ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అన్ని పార్కుల్లో పచ్చదనం పెంచాలి... ► డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలలోని పార్కులు పూర్తిగా ఆధునీరించబడగా, మరికొన్ని పార్కులు పచ్చదనానికి నోచుకోవటం లేదు. ► దాంతో తమ ప్రాంతంలో పార్కు సరిగా లేక ఆ ప్రాంతం వారు పక్క కాలనీలోని పార్కులకు వెళ్తున్నారు. దీంతో పార్కుల్లో సాయంత్రం వేళ రద్దీ ఎక్కువ అవుతోంది. కొన్ని కాలనీల వారు ఇతర ప్రాంతాల వారు తమ కాలనీలకు రావద్దని వారిస్తున్నారు. ► డివిజన్లోని అన్ని పార్కుల్లో పచ్చదనం, వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ఆట పరికరాలు, వసతులు కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని పలు కాలనీలవాసులు అభిప్రాయపడుతున్నారు. ఉల్లాసంగా గడుపుతున్నాం ఉదయం పూట భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడుతున్న మేము సాయంత్రం కాగానే పార్కులకు వెళ్లి ఉల్లాసంగా గడుపుతున్నాం. సరస్వతీనగర్ కాలనీ పార్కులో పచ్చదనం చెదిరిపోకుండా కాలనీవాసులంతా కలిసి పరిరక్షించుకుంటున్నాం. పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పరికరాలను మరితం నాణ్యమైనవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – గున్న మహేందర్రెడ్డి, సరస్వతీనగర్ కాలనీ చిన్నారులను చూస్తే ముచ్చటేస్తోంది ఎండకాలంలో ఉపశమనానికి ఇళ్లలో ఎన్ని పరికరాలు ఉన్నా పార్కుల్లో ప్రకృతి సిద్ధమైన చల్లదనం చాలా బాగుంటుంది. కొద్దిసేపు వ్యాయామం చేసి మరికొద్ది సేపు సహచరులతో మాట్లాడితే సాయంత్రం సమయం వేగంగా గడిచిపోతోంది. పార్కుల్లో చిన్నారులంతా చేరి ఆటలతో సందడిగా గడపడం చూస్తే ముచ్చటేస్తోంది. ఇతర కాలనీల్లోని పార్కులను కూడా ఆధునీకరిస్తే అక్కడ వారికీ ఉపయోగకరంగా ఉంటుంది. – గోపాల్రెడ్డి, సరస్వతీనగర్ కాలనీ చదవండి: Hyderabad: వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి -
LB Nagar: కామినేని ఫ్లైఓవర్ల కింద పార్కు
సాక్షి, హైదరాబాద్: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది. ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం. ఇప్పటికే షేక్పేట, బహదూర్పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్బీనగర్ జోన్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్న్యూస్) దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం. (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి) -
పుత్తూరు మున్సిపల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది
A shocking video Bull forceful way To Lift Lion: సహజంగా జంతవుల దాడి చేసుకుంటుంటాయి. అవి ఒక్కోసారి ఘోరంగా కూడా ఉంటాయి. అయితే పులి వేట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది వేటాడిందంటే ఏ జంతువైన దాని పంజా దెబ్బకి పడిపోవాల్సింది. చాలా వరకు ఏ జంతువునైనా అది సునాయాసంగా పట్టుకుని దాడి చేస్తుంది. ఏమైందో ఏమో ఈ ఎద్దు వద్ద ఆ సింహం ఆటలు సాగలేదు. పైగా దాన్ని చూసి పారిపోయింది. వివరాల్లోకెళ్తే...టాంజానియాలోని తరంగిరే నేషనల్ పార్క్లో ఒక ఎద్దు పైకి సింహం దాడి చేస్తుంది. ఆ ఎద్దుని గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆ ఎద్దుని విపరీతమైన కోపంతో ఆ సింహాన్ని కొమ్ములతో ఎత్తిపడేసి ఒక్కసారిగి దాడి చేసింది. ఆ సింహాన్ని పరిగెట్టెంత వరకు తరిమి తరిమి కొట్టింది. అయితే ఈ ఆ పార్క్ వద్దకు వచ్చిన కొంత మంది పర్యాటకు ఈ ఘటనను చిత్రించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Tanzania destination safari (@tanzania_destination_vacations) (చదవండి: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!) -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పార్కు
-
Crocodiles: ముచ్చటగా 32.. దత్తత తీసుకుంటారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూ పార్కులో ఎన్నెన్నో రకాల వన్యప్రాణులున్నాయి. ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, కనుజులు, జింకలు, వివిధ రకాల పక్షులతో పాటు వివిధ జాతుల పాములు జూకు వెళ్లే సందర్శకులకు నేరుగా ఎన్క్లోజర్లలో కనిపిస్తుంటాయి. అయితే జూలో మొసళ్లు ఎక్కడా అని సందర్శకులు వెతుకుతుంటారు. అసలు జూలో మొసళ్లే లేవని ఇంకొందరు అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. జూలో మొసళ్లు కూడా ఉన్నాయి.. ఒకటి కాదు.. రెండు.. కాదు.. మూడు రకాలకు చెందిన 32 మకరాలున్నాయి. వాటి సంతతిని ఇప్పుడిప్పుడే వృద్ధి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో మూడు ఉప్పు నీటి మొసళ్లు, ఆరు ఘరియల్స్, 23 మగ్గర్ మొసళ్లు(మూడు పెద్దవి, 20 పిల్లలు) ఉన్నాయి. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. కొలను ఒడ్డున పిల్లలతో మగ్గర్ మొసళ్లు జూ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి మొసళ్లకు అధికారులు ప్రత్యేక స్థానం కల్పించారు. మొదటి నుంచి మూడు రకాల మొసళ్లను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. వాటి కోసం పాముల జోన్ వెనుక భాగం, సాగర్ ద్వారం నుంచి కుడివైపులో రెండు కొలనులు, సాగర్ ద్వారంలో ఎడమ వైపు ప్రధాన రహదారి పక్కనే మరో కొలను ఏర్పాటు చేశారు. వీటిలో సాగర్ ద్వారం నుంచి కుడి వైపున ఉప్పునీటి మొసళ్లు(సాల్ట్ క్రోకోడైల్), మగ్గర్ మొసళ్ల కొలనులు ఉన్నాయి. సాగర్ ద్వారం నుంచి ఎడమ వైపు ఘరియల్ మొసళ్లు కొలను నిర్మించారు. ఉప్పునీటి మొసలి ఈ మూడు కొలనుల్లో మొదట్లో ఒక్కో జత చొప్పున ఆయా రకాలకు చెందిన మొసళ్లు విడిచిపెట్టారు. అవి సందర్శకులను అలరించేవి. అవి రానురాను వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అయినా ఎప్పుడూ వాటి మూడు రకాల సంఖ్య 10 దా టేది కాదు. ఇప్పుడు మూడు పదులు దాటడం విశేషం. మగ్గర్ జాతి మొసళ్లు రెండు ఆడవి, ఒకటి మగది(పెద్దవి) ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆడ మొసలి గతేడాది మే 20న 20 పిల్లలను పొదిగింది. దీంతో వాటి సంఖ్య ఒక్క సారిగా 3 నుంచి 23కు చేరింది. ఆ 20 పిల్లలు ప్రస్తుతం జనక మొసళ్లతో వాటి కొలనులో హుషారుగా తిరుగుతున్నాయి. తల్లి మొసలితో పాటు ఒడ్డుకు చేరి గట్టుమీద గడుపుతున్నాయి. ఇక్కడ పొదగబడిన పిల్లలన్నీ బతకడం విశేషం. సాధారణంగా పొదగబడిన కొద్ది రోజులకు కొన్ని పిల్లలు నీటిలో తిరుగుతున్న సమయంలో పెద్ద మొసళ్లు ఢీకొనడం, ఒడ్డుకు చేరిన సమయంలో ఏవైనా పక్షులు ఎత్తుకుపోవడంతో ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ ఇవి పొదగబడి సుమారు తొమ్మిది నెలులు గడిచింది. ప్రస్తుతం ఇవి సుమారు 5 నుంచి 8 కిలోల బరువు పెరిగాయి. దీంతో వీటిని పక్షులు ఎత్తుకెళ్లలేవు. సరికదా కొలను లోపల పెద్ద మొసళ్లు ఢీకొన్నప్పుటికీ తట్టుకొనే శక్తి వచ్చిందని యానిమల్ కీపర్లు, జూ అధికారులు అంటున్నారు. పిల్లలన్నీ బతకం అరుదైన విషయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘరియల్స్ ఇక్కడ సాగర్ ద్వారం దాటగానే ఎడమ వైపు రోడ్డు పక్కన ఘరియల్స్ కొలను ఉంది. జూ ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 6 ఘరియల్ జాతికి చెందిన మొసళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆడవే. ఇవి తరుచూ కొలను నీటి నుంచి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటికి సుమారు అర మీటరు పొడవున నోరు ఉంటుంది. ఆ నోటిని పైకి పెట్టి నీటిలో ఈదుతూ చేపలను పట్టుకుని తింటాయి. ఇవి ఒడ్డుకు చేరి ఎక్కువ సేపు గడుపుతూ సందర్శకులను అలరిస్తుంటాయి. ఇదీ మొసళ్ల మెనూ.! ఇక్కడ మొసళ్లకు రోజులో రెండుసార్లు ఆహారం అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చికెన్, బీఫ్ను బోన్స్(దుమ్ములు)తో కలిపి కైమా చేసి వేస్తుంటారు. వీటితోపాటు కొన్ని రోజుల్లో చేప పిల్లలను, పెద్ద చేప ముక్కలు కొలనుల్లో వేస్తున్నారు. ఇవిగాక కొలనులో వాటికి దొరికిన నత్తలు, కీటకాల లార్వా తింటాయి. ఇది లా ఉండగా ఇక్కడ వాటి సంఖ్య పెరుగుతున్న రీతిలోనే వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా భారీగా పెరిగిపోతుంది. అందుకే జూ అధికారులు దాతలు ముందుకొచ్చి వాటిని దత్తత తీసుకోవాలని కోరుతున్నారు. ఉప్పునీటి మొసళ్లు ఇక్కడ ప్రస్తుతం ఉప్పు నీటి మొసళ్లు మూడున్నాయి. ఈ మూడూ ఆడవే. నాలుగేళ్ల కిందట ఇక్కడ ఒక జత ఉప్పునీటి మొసళ్లు ఉండేవి. వాటిలో ఆడ మొసలి గుడ్లు పెట్టి సుమారు 10 పిల్లలను పొదిగింది. ఆ పిల్లల్లో 8 మృతి చెందాయి. దీంతో పాటు ఇక్కడ మగ మొసలి కూడా వృద్ధాప్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ప్రస్తుతం మూడు ఆడ ఉప్పునీటి మొసళ్లు ఈ కొలనులో సందర్శకులను అలరిస్తున్నాయి. మొసళ్లను దత్తత తీసుకోండి జూలో మొసళ్ల సంఖ్య పెరిగింది. అవి సందర్శకులను అలరిస్తున్నాయి. వాటితో పాటు జూలో అన్ని జాతుల వన్యప్రాణులు సంఖ్య పెరిగింది. అందుకే దాతలు ముందుకు వచ్చి వాటిని దత్తత తీసుకుని ఆహారం అందించాలని కోరుతున్నాం. మొసళ్లను వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఒక్కో మొసలికి వారానికి రూ.525, నెలకు రూ.2,000, ఆరు నెలలకు రూ.12,000, ఏడాదికి రూ.24,000 ఆహారం కోసం ఇచ్చి దత్తత తీసుకోవచ్చు. ఉప్పు నీటి మొసలి, ఘరియల్స్లో ఇక్కడ మగవిలేవు. దీంతో ఆయా రకాల మొసళ్లను ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
అలా చేశాడని.. చితకబాది నడిరోడ్డుపై బట్టలు విప్పి ఊరేగించారు
బెంగళూరు: ఒంటరిగా మహిళలు, బాలికలు కనపడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. అలా ప్రవర్తించిన ఓ ఆకతాయికి నడిరోడ్డుపై చితకబాది బుద్ధి చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హసన్ జిల్లాలోని మహారాజా పార్క్ వద్ద బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణతో రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, బట్టలూడదీసి ఊరేగించారు. దాడికి గురైన వ్యక్తి విజయపుర జిల్లాకు చెందిన మేఘరాజ్గా గుర్తించారు. హసన్ నగరంలో భవన నిర్మాణ కార్మికుడు.మేఘరాజ్ పార్క్కి అప్పుడప్పుడు వచ్చి సేదతీరుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మేఘారాజ్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు కొందరు అతనిపై దాడి చేశారు. అయితే పోలీసులకు అప్పగించడానికి బదులు, వారు అతనిని కొట్టి, బట్టలు విప్పి, ఆపై రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అయిన హేమావతి విగ్రహం సర్కిల్ దగ్గర ఒంటిపై బట్టలు లేకుండా ఊరేగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మేఘరాజ్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆరా తీసిన హసన్ నగర పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై..దాడి చేసి ఊరేగించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలిక మాత్రం మేఘరాజ్పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. -
ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!!
ఒకటి రెండు కాదు, వందలు వేలు పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిండిపోయింది ఆఇల్లు. ఆహ్లాదంతో పాటు పచ్చదనం, చల్లదనంతో ఇల్లు ఉద్యానవనాన్ని తలపిస్తోంది. పందిరిలా వేలాడే పూల కుండీలతో అందమైన మొక్కలు ప్రకృతి ప్రేమికులను మురిపించటంతోపాటు ఔషధగుణాల మొక్కలు కాలుష్యరహితంగా మనిషి ఆయువు పెంచుతూ ఆందోళన, ఒత్తిడిల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అంటూ ఇంటిగుమ్మం మొదలు దాబాపై వరకు అడుగడుగునా అనేక రకాల మొక్కలతో నిండి ఉంది ఆఇల్లు. పెద్దపల్లిరూరల్: ఇంటి ఆవరణంతా ఆకర్షణీయమైన పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ వివిధ రకాల్లో మొక్కలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి పట్టణం ఫారెన్స్ట్రీట్కు చెందిన సయ్యద్ అతీఫ్. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూల కుండీలు, గోడలు, దాబాపై వేలాడదీసిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల, రంగురంగుల మొక్కలు పచ్చటి ప్రకృతిని చూస్తున్నా అనుభూతిని కలిగిస్తుంది. (చదవండి: రిస్క్లో ‘కియోస్క్’లు!!) పార్కును తలపించేలా... అతీఫ్ ఇల్లు పార్కును తలపింపిస్తోంది. తన ఇంటి ఆవరణలో వందలాది రకాల మొక్కలను పెంచి పోషిస్తుండడం ప్రకృతిపై ఆయనకు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. అలాగే మొక్కలను కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. అతీఫ్ పెంచుతున్న మొక్కలివీ... యాలకులు, ఆల్స్పైస్,ఆరెగాను, అల్లం, వెల్లుల్లితోపాటు ఆపిల్బేర్, వాటర్ యాపిల్, డ్రాగన్ప్రూట్, మామిడి, సపోట, నారింజ, గ్రేప్స్,స్టాబెర్రీ, జామలాంటి పండ్ల మొక్కలు, రణపాల, ఇన్సూలిన్, తిప్పతీగ, నల్లేరు, వాయు, రకరకాల తులసి, లెమన్గ్రాస్ లాంటి ఔషధ గుణాలున్న వాటిని పెంచుతున్నాడు. బీర, దొండ, చిక్కుడు, కాకరలాంటి తీగజాతి మొక్కలతో పాటు మిరప, పుదీన, పాలకూర, తోటకూర, వంకాయ, టమాట వంటి కూరగాయ మొక్కలున్నాయి. మల్లె, లిల్లీ, డాలియా, ఇంపేషంట్స్, జినియా, పింక్ట్రంపెట్, గులాబీ, మందారం, రుమెల్లా, చామంతి, మాస్రోజెస్, కలోంచె, జర్బెరా లాంటి పూలమొక్కలు, ఆగ్లోనెమ, ఫిలోడెండ్రాన్, సింగోనియమ్, మనీప్లాంట్, పోథీస్, స్పైడర్ప్లాంట్స్ కోలియస్, ఆర్నికపామ్, ఇంచ్ప్లాంట్, స్నేక్ప్లాంట్, కాక్టస్, డైఫెన్బాచియాలాంటి ఆకర్షణీయ మొక్కలు అతీఫ్ ఇంట్లో దర్శనమిస్తాయి. 800 రకాల మొక్కలు పెంచుతున్నా... మా తాత, తండ్రి తోటల పెంపకంలో ఉండడంతో చిన్నప్పటి నుంచి మొక్కలపై ఆసక్తి పెరిగింది. పచ్చదనమంటే నాకు ప్రాణం. మనసుకు ఎంతో హాయినిస్తుంది, ఇంటి ఆవరణలోని ఖాళీస్థలం, గోడలను ఆసరాగా తీసుకుని దాదాపు 800 వెరైటీల మొక్కలను కుండీల్లో పెంచుతున్నా. ఎక్కడికి వెళ్లినా నావద్ద లేని మొక్కలు కనిపిస్తే ఎంత ఖర్చయినా పెట్టి కొంటాను. ఇప్పటికే దాదాపు మూడు లక్షల దాకా వెచ్చించాను. ఎర్రమట్టి, ఇసుక, కిచెన్ వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడతాను. షుగర్ పేషెంట్లకు అవసరమైన ఆకులను ఉచితంగా అందించటంతోపాటు కూరగాయలను పంచిపెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. – సయ్యద్ అతీఫ్, పెద్దపల్లి (చదవండి: మహిళలను బెదిరించి బంగారం చోరీ) -
కారులో మకాం వేసిన కొండ చిలువ.. ఎంత భయంకరంగా ఉందో..
మెల్బోర్న్: సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము.. ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. అయితే.. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి దారితప్పి వస్తుంటాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలను మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బ్రిస్బెన్ పట్టణంలో ఉండే జోష్ కాస్ట్లీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరదాగా క్విన్స్లాండ్కు పిక్నిక్కు వెళ్లాడు. వారు తమ వాహనాన్ని బుష్లాండ్ సమీపంలో పార్క్ చేసి బయటకు లోపలికి వెళ్లిపోయారు. పిక్నిక్లో సరదాగా గడిపిన తర్వాత.. బయటకు వచ్చారు. అప్పుడు వారు ఒక షాకింగ్ సంఘటనను చూశారు. వారు పార్క్ చేసిన కారు అద్దానికి ఒక మీటరు పొడవున్న.. కొండ చిలువ చుట్టుకుని ఉండటాన్ని గమనించారు. దీంతో ఆశ్చర్యపోయారు. జోష్ కాస్ట్లీ పాములను పడుతుంటాడు. ఇప్పటికే పాములను పట్టిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మాత్రం.. జోష్ కాస్ట్లీ ఎందుకో ఆ కొండ చిలువను పట్టే సాహసం చేయలేదు. అతను.. పీటర్ అనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. పీటర్ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు. గతంలో ఒక పామును పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కాస్ట్లీ.. పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత.. సమయానికి వైద్యం అందండంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ కొండ చిలువ చిత్రాన్ని కూడా.. కాస్ట్లీ తన ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’ ‘ నీ అదృష్టం బాగుంది..’, ‘ కారు అద్దాన్ని భలే చుట్టేసుకుందే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్బిన్ కవరే డ్రెస్సు.!
లండన్: ఈ మధ్యకాలంలో చాలామంది విన్నూత్న రీతిలో రకరకాల డ్యాన్స్లు లేదా ఫీట్లు లేదా రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలతో ప్రజలను ఆకర్షించడం చూస్తునే ఉన్నాం. ఆఖరికీ అసాధ్యమనే వాటిని కూడా సుసాధ్యం అనిపించేలా చేసి ప్రజలందరీ మనస్సులను గెలుచుకున్న వాళ్ల గురించి విని ఉన్నాం. కానీ కొంతమంది తమ వెర్రి చెష్టలు చూస్తే మనకు గందరగోళంగా అనిపిస్తుంది. (చదవండి: ఫిజిక్స్లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్నే అద్దెకు తీసుకున్నాడు) అలా అని వాళ్లు తెలివిలేని అమాయకులా అంటే ఆది కాదు. ఎందువల్ల కొంత మంది ఈ విధంగా అర్ధంకాని రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు కానీ. వాటికి కూడా ఏదైనా అర్థం ఉంటుందేమో. ఏదిఏమైనా వారే నేరుగా చెబితే గానీ మనకు తెలియదు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే. ఆహారం పై ఉప్పు చల్లడం, నమ్మశక్యం కానీ వస్తువులతో మాంసాన్ని కోసి చూపించే వీడియోలతో సాల్ట్ బేగా ప్రసిద్ధిగాంచిన టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే ఇప్పుడు సరికొత్త వీడియోతో ప్రజలను విస్మయానికే గాక గందరగోళానికి గురి చేస్తున్నాడు. అయితే ఆ వీడియోలో సాల్ట్ బేగా పిలుసున్న చెఫ్ నస్రెట్ పైన డస్ట్బిన్ కవర్ను టీ షర్ట్లా ధరించి, కింద ఒక షార్ట్ వేసుకుని వినూత్నరీతిలో కనపడతాడు. అంతేకాదు నస్రెట్ ఒక పార్క్లో ఉడుతలకు, పావురాలకు ఆహారం తినిపిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నట్లు కనిపిస్తాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో తోపాటుగా "ప్రకృతి ప్రేమికులు ఆనందంగా ఉంటారు" అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవ్వడమే కాక నస్రెట్ ఎందుకలా చెత్త సంచిని టీషర్ట్గా ధరించాడు అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెర తీస్తారు. పైగా నస్రెట్ యునైటెడ్ కింగ్డమ్లోని తన రెస్టారెంట్లో అధిక ధరల నేపథ్యంలో ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) -
తలపాగే ప్రాణాలను కాపాడింది
కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. (చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్లో ఉన ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా వాకింగ్ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i — Sikh Community of BC (@BCSikhs) October 16, 2021 -
మహారాష్ట్ర సమీపంలో డైనోసర్ ల ఆనవాళ్ళు
-
నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన
-
దయగల పార్కు.. ఎందరిలోనో మార్పు!
ఒక చిన్న ఆలోచన.. ఏదైనా మంచి చేయాలనే తపన.. ఎంతో మార్పు తెస్తుంది. మానవత్వం చూపుతుంది. పదిమందికి ఉపయోగపడుతుంది. మరెందరికో ప్రేరణ కలిగిస్తుంది. ఒకటి రెండుగా.. రెండు నాలుగుగా.. సాయం చేసే చేతుల సంఖ్య విస్తరిస్తుంది. ఆర్తులకు అండగా నిలుస్తుంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అదో చిన్న పార్కు. చిన్నచిన్న మొక్కలతో కనిపించే ఈ ఉద్యానవనం పెద్ద మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పార్కుకి వెళ్తే ‘నీ దగ్గరున్న వస్తువుల్లో నీకు ఉపయోగపడనవి.. వేరొకరికి అత్యవసరం కావొచ్చు. అలాంటి వస్తువుల్ని ఈ పార్కుకు తీసుకురండి.. అవసరమైన వాళ్లకి ఈ పార్కు ఇస్తుంది..’ అని ఒక బోర్డు కనిపిస్తుంది. ‘సమాజం మనకి చాలా ఇచ్చింది. అందుకే మనం తిరిగి ఇచ్చెయ్యాలి. లేదంటే లావైపోతాం..’ ఇటీవల ఒక సినిమాలోని ఈ డైలాగ్ మంచి పాపులర్ అయింది. నిజమే.. మనకు మంచి చేస్తున్న సమాజంలో మంచి పనులు చేస్తే.. పదిమందికి జీవితాన్ని అందించవచ్చు. వాల్ ఆఫ్ కైండ్నెస్ పేరుతో విశాఖ మహానగరపాలక సంస్థ (జీవీఎంసీ) శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన చిన్న ఆలోచన.. నగరవాసుల పెద్ద మనసుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు బహిర్భూమిగా ఉన్న ఈ స్థలం.. నేడు ఎందరో పేదలకు దుస్తుల్ని, ఇతర సామగ్రిని అందిస్తోంది. దాతృత్వ నిలయం జీవీఎంసీ 69వ వార్డు పరిధిలో జాతీయ రహదారి పక్కన బీహెచ్ఈఎల్ గోడ వద్ద సుమారు 400 గజాల స్థలాన్ని స్థానికులు పాతికేళ్లుగా బహిర్భూమిగా మార్చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు నిత్యం పారిశుధ్య కార్మికులు శ్రమించాల్సి వచ్చేది. రోజూ ఈ పరిస్థితి చూస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ బోయిన శ్రీనివాసరావు వినూత్నంగా ఆలోచించారు. ఆ ప్రాంతాన్ని పార్కుగా మార్చాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ప్రాంతాన్ని పార్కుగా మార్చేందుకు భెల్ యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకున్నారు. స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటించారు. తన జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చించి ఫ్లెక్సీలు, గోడకు రంగులు వేయించారు. గేటు మాత్రమే ఉండి.. సరైన కంచె లేకపోవడంతో ఇక్కడ నాటిన పూల మొక్కలకు, నాపరాళ్లకు రక్షణ ఉండేదికాదు. ఈ పార్కును దయగల పార్కుగా మార్చాలని భావించిన శ్రీనివాసరావు అక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇది దాతృత్వపు స్థలంగా మారింది. ఈ దయగల పార్కు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అనేకమంది ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని ఈ పార్కులోకి తీసుకొస్తున్నారు. దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, వంటసామగ్రి.. ఇలా తమకు అవసరంలేని వాటిని దాతలు తీసుకొచ్చి పార్కులో ఉంచుతున్నారు. వాటిని అవసరమైన నిరుపేదలు, కూలీలు తీసుకెళుతున్నారు. తెచ్చేవాళ్లు, తీసుకెళ్లేవాళ్లు నిరభ్యంతరంగా పార్కులోకి రావచ్చు. ఎవరికీ ఆటంకాలు లేవు. కైండ్నెస్ పార్కులో పాత దుస్తులను వేస్తున్న దాత సౌకర్యాలు కల్పిస్తే మరింత మేలు తోచిన సాయం చేయాలన్నది నా సంకల్పం. దీనికి కార్పొరేషన్ అధికారుల నుంచి మంచి సహకారం అందింది. చాలామంది దాతలు వస్తున్నారు. తమకు అవసరం లేని ఎన్నో వస్తువులు ఇస్తున్నారు. కానీ వాల్ ఆఫ్ కైండ్నెస్కు సరైన రక్షణ లేకపోవడం వల్ల అనేక వస్తువులు దుర్వినియోగమవుతున్నాయి. పెద్ద మనసుతో ఎన్నో రకాల వస్తువులు అందించేందుకు వస్తున్నా.. వాటిని సంరక్షించలేకపోతుండటంతో.. తిరిగి తీసుకెళ్లిపోవాలని మేమే దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాతలు సహకరించి.. ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, అల్మరాలు పెడితే.. చాలామందికి ఈ దయగల పార్కు ఉపయోగపడుతుంది. – బోయిన శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్, జీవీఎంసీ నా మనవడికి మంచి దుస్తులు దొరికాయి నేను ఈ పార్కుకి రెండు రోజులకోసారి వస్తాను. మా మనవడు వేసుకోడానికి మంచి దుస్తులు, ఆడుకోడానికి బొమ్మలు ఇక్కడ దొరుకుతున్నాయి. వైజాగ్ నగరంలో సాయం చేసే దాతలు చాలామందే ఉన్నారని ఈ పార్కుకి వచ్చినప్పుడల్లా అనిపిస్తుంటుంది. – అప్పన్న, నాతయ్యపాలెం పేదల అవసరాలు తీర్చే పార్కు ఈ పార్కు మా ఇంటి అవసరాల్ని ఎన్నోసార్లు తీర్చింది. మేము కొనుక్కోలేని వస్తువులు ఎన్నో ఇక్కడ దొరికాయి. మాలాగే చాలామంది ఇక్కడికి వచ్చి.. నచ్చిన దుస్తులు, వస్తువులు తీసుకెళుతున్నారు. నిజంగా ఇది దయగల పార్కే. సాయం చేసిన ప్రతి ఒక్కరినీ దేవుడు చల్లగా చూస్తాడు. – పెంటమ్మ, రైల్వే ట్రాక్ దరి, బీహెచ్ఈఎల్ స్వచ్ఛభారత్కు ఆదర్శంగా.. ఒక బహిర్భూమిని వాల్ ఆఫ్ కైండ్నెస్గా మార్చిన శానిటరీ ఇన్స్పెక్టర్ని జీవీఎంసీ కమిషనర్తోపాటు అధికారులమంతా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇటీవల అమరావతిలో జరిగిన సమావేశంలోనూ ఈ దయగల పార్కుని ఉన్నతాధికారులు ప్రశంసించారు. స్వచ్ఛ భారత్కు ఆదర్శంగా పార్కుని తీర్చిదిద్ది కమిషనర్ సూచనల మేరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. – వి.సన్యాసిరావు, అదనపు కమిషనర్, జీవీఎంసీ -
Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు
రెండు వందల అడుగుల పొడవు. నూట యాభై అడుగుల వెడల్పు. డెబ్బై అడుగుల ఎత్తు... ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఆ పరిమాణమే దీనిని గిన్నిస్ బుక్లో చేర్చింది. జటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న జటాయు నేచర్ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. అతడు ఫిల్మ్ మేకర్ కూడా. రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు. మన రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే టూర్ మధురానుభూతికి మినిమమ్ గ్యారంటీ. పక్షిలోపల మ్యూజియం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్ మ్యూజియం ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. జటాయు పార్కు సందర్శనలో పర్యాటకులు జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ కొంగ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ -
పిల్లలాడుకునే బొమ్మనుకుని ‘చావు’తో ఆడుకున్నారు..
వాషింగ్టన్: భార్యాభర్తలు పిల్లలతో కలిసి సరదాగా పిక్నిక్కు వెళ్లారు. అక్కడ నదిలో వారికి ఓ వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి పిల్లలాడుకునే బొమ్మలా ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ వస్తువును వారు నదిలో ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టారు. ఆ తర్వాత వస్తువు గురించి నిజం తెలిసి ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది. ఎందుకంటే వారు పార్క్లో ఆడుకున్న వస్తువు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని బాంబు. చదువుతుంటేనే గుండె జారి పోతుంది కదా.. ఆ వివరాలు.. అమెరికాకు చెందిన డేవిడ్, కరెన్ హబ్బర్ట్ తమ పిల్లలతో కలిసి నాటింగ్హామ్షైర్లోని నెవార్క్లోని థోర్స్బీ పార్క్కు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో డేవిడ్కు పక్కనే ఉన్న నదిలో ఓ వింత వస్తువు కనిపించింది. దాన్ని తెచ్చి భార్యకు చూపించాడు. ఈ ఇనుప వస్తువును చూస్తే.. ఏదో పేలుడు పదార్థంలాగా అనిపిస్తుంది అన్నాడు. కానీ డేవిడ్ భార్య అతడి మాటలు కొట్టి పారేసింది. దాన్ని కేవలం పిల్లలు ఆడుకునే వస్తువుగా తేల్చింది. దాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాడో.. అక్కడే పెట్టమంది. భార్య మాట ప్రకారం డేవిడ్ దాన్ని నదిలో పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత వారు బాంబుకు పది మీటర్ల దూరంలో పిల్లలతో కలిసి చేపలు పట్టారు.. ఆడుకున్నారు.. తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కరెన్ థోర్స్బీ పార్క్ ఫేస్బుక్ పేజ్లో తాము కనుగొన్న వస్తువు గురించి చూసి ఆశ్చర్యపోయింది. ఆ పోస్ట్ మొత్తం చదివి భయంతో కుప్పకూలింది. పార్క్ వారు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్ కనుగొన్న ఆ మెటల్ వస్తువు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబని.. దాని నుంచి దూరంగా ఉండాలని.. పట్టుకోవద్దని సూచించింది. పార్క్లో ఎక్కడైనా ఇలాంటి మెటల్ వస్తువులు కనిపిస్తే.. వెంటనే తమ పార్క్ సిబ్బందికి తెలపాలని.. వారు దాన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా కరెన్ మాట్లాడుతూ.. ‘‘నిజం తెలిసిన తర్వాత దీని గురించి నా భర్తకు తెలపాలంటే భయపడ్డాను. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. నేను షాకయ్యాను’’ అన్నది. ఇక గతంలో ఈ పార్క్ రెండో ప్రపంచ యుద్ధ స్థావరంగా ఉండేదని తర్వాత తెలిసింది. చదవండి: రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు -
‘‘నీ డ్రెస్ చాలా చిన్నగా ఉంది.. ఈ టీ షర్ట్ తీసుకో’’
వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి. తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్టాక్ యూజర్కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది. పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్డమ్లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు. చదవండి: భారత్లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా? వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ -
‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’
రాంగోపాల్పేట్: పోలీసునని చెప్పి నెక్లెస్ రోడ్డుకు వచ్చే జంటలను బెదిరించి డబ్బు, నగదును బలవంతంగా తీసుకుని వెళుతున్న ఓ పాత నేరస్తుడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన మరాఠి సృజన్కుమార్ (45) పాత నేరస్తుడు. విలాసాలకు అలవాటు పడిన సృజన్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం నెక్లెస్రోడ్తో పాటు నగరంలోని వివిధ పార్కులకు వచ్చే జంటలను టార్గెట్ చేసేవాడు. పార్కులకు వెళ్లి అక్కడ ఉండే జంటకు తాను పోలీసునని చెప్పి మీ విషయం మీ ఇంట్లో వారికి చెబుతానని బెదిరించే వాడు. కేసు లేకుండా చేయాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇలాగే ఈ నెల 15వ తేదీన ఓ జంట నెక్లెస్రోడ్లో ఉండగా నిందితుడు వెళ్లి తాను పోలీసునని ఇక్కడేం చేస్తున్నారని బెదిరించాడు. పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళతానని మీ ఇంట్లో వాళ్లని పిలిపించాలని చెప్పాడు. అలా చేయకూడదంటే తనకు రూ.2లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం ఇంట్లో తెలిస్తే బాగుండదని నగదు ఇచ్చేందుకు వారు సిద్ధద్దమయ్యారు. అయితే అంత డబ్బ తమ వద్ద లేని చెబితే వారిని ప్యాట్నీ సెంటర్లోని చందన బ్రదర్స్ షోరూమ్కు తీసుకుని వెళ్లి రూ.2 లక్షల విలువ చేసే 45 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేశాడు. వాటి బిల్లును ఈ జంట ఏటీఎం కార్డు నుంచి కట్టించాడు. తర్వాత తాము మోసపోయామని గ్రహించిన ఈ జంట మరుసటి రోజు మహంకాళి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డీఐ పురుషోత్తం డీఎస్ఐ నరేష్తో కలిసి ధర్యాపుత చేపట్టి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 22 గ్రాముల బంగారంతో పాటు మొబైల్ ఫోన్, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నగరంలో నగరంలో 12, విశాకపట్టణంలో 4, వరంగల్లో 1 రాబరీ, కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నాయి. చదవండి: హైదరాబాద్లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే? -
జూపార్క్... అధికారుల నిర్లక్ష్యం
-
భారత్లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా?
అహ్మదాబాద్: 2020లో భూమి మీద చాలా వింతలు జరిగాయి. గతంలో ఎప్పుడూ చూడని ఓ కొత్త మహమ్మారి (కరోనా వైరస్) ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలను అడుగు బయటపెట్టనీయకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ (ఏకశిల రాయి) ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నిర్మాణాలను చూస్తూంటే.. గ్రహాంతర వాసులే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద 'మిస్టీరియస్ మోనోలిత్' ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. పార్కులో ఈ మోనోలిత్ ఏకశిలను ఎవరు నిర్మించారో తానెప్పుడూ చూడలేదని పార్కులో పనిచేసేవారు అంటున్నారు. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు. ‘సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాను" అని తోటమాలి తెలిపారు. పార్కుకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మోనోలిత్ ఏకశిల ఫొటోలను షేర్ చేశారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా కనిపిస్తోంది. ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ ఏకశిలా పార్కులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ మోనోలిత్ ముందుగా అమెరికాలోని ఉటా ఎడారిలో గుర్తించబడింది. ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. -
ప్రాజెక్టులతో మహా సంక్రాంతి
జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.374.17 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. కార్య నిర్వాహక రాజధానిగా ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు సన్నద్ధమవుతున్న విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా జీవీఎంసీ చేపట్టిన స్మార్ట్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలకు అనుగుణంగా చేపట్టిన ప్రాజెక్టుల విశేషాలివీ.. సాక్షి, విశాఖపట్నం: విశ్వనగరిని అభివృద్ధి మణిమకుటంగా మార్చేందుకు సంకల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విశాఖ నగర ప్రజల సంక్షేమం కోసం జీవీఎంసీ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ సందర్భంగా వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జిందాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టు ఫ్యాబ్రికేషన్స్(జెఐటీఎఫ్) సంస్థతో జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కాపులుప్పాడ డంపింగ్ యార్డు స్థలంలోని 17.50 ఎకరాల యార్డులో ప్లాంట్ నిర్మాణ పనులను జిందాల్ సంస్థ రెండేళ్ల క్రితం ప్రారంభించింది. రూ.320 కోట్లతో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ విశాఖ లిమిటెడ్ పేరుతో ప్లాంట్ సిద్ధమవుతోంది. యార్డులో డంప్ చేసిన చెత్తనంతటినీ ప్లాంట్లోకి పంపించి.. రోజుకు 18 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. వచ్చిన చెత్తను బాయిలర్లలో వేసి మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఈ చెత్తను వేడి చేసేందుకు అవసరమైన నీటిని మారికవలస సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పైప్ లైన్ల ద్వారా తీసుకురానున్నారు. విద్యుత్ ఉత్పత్తి జరిగిన తర్వాత మిగిలిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. జనవరి మొదటి వారానికి ప్లాంట్ పూర్తి కానుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు రూ.320 కోట్లు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ రూ.9.70 కోట్లు వారసత్వ కట్టడాల పరిరక్షణ ప్రాజెక్టు రూ.10.97 కోట్లు వుడా పార్కు అభివృద్ధి రూ.33.50 కోట్లు స్మార్ట్గా వుడా పార్కు బీచ్ రోడ్డులో 47 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎకరాలను ఖాళీగా విడిచిపెట్టి, మిగిలిన 40 ఎకరాల్లో ఉన్న వుడా పార్కును సమగ్ర అభివృద్ధి చేసి స్మార్ట్ పార్క్గా రూపొందిస్తున్నారు. రూ.33.50 కోట్లతో పార్కు ఆధునికీకకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లేక్ బోటింగ్ ఆధునికీకరణలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎథిలీన్ ప్రాపలీన్ డయిన్ ప్రోమేన్ మెనిమేర్(ఈపీడీపీఎం) ఫ్లోరింగ్ నిర్మించారు. పిల్లలు ఆటలాడుకునేలా, పెద్దలు కూర్చొని కబుర్లు చెప్పుకునేలా మల్టీ పర్పస్ లాన్, స్పోర్ట్స్ ఏరియాలో స్కేటింగ్ రింగ్తో పాటు టెన్నిస్కోర్టులు, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఓపెన్ కోర్టులు పార్కులో సిద్ధమవుతున్నాయి. యాంపీ థియేటర్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఎంట్రన్స్ ప్లాజాలో పగోడాలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖద్వారం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉల్లాసంతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు ఏర్పాటు చేసి వాటి శాస్త్రీయ నామాలు సూచించే బోర్డులు పెడుతున్నారు. మొత్తమ్మీద వుడా పార్కు సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కొత్త రూపు సంతరించుకుంది. పార్కింగ్ కష్టాలకు చెక్ జగదాంబ జంక్షన్లో పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు జీవీఎంసీ రూ.9.70 కోట్లతో రాష్ట్రంలో తొలి మల్టీ లెవెల్ కార్పార్కింగ్, దేశంలో తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. 367 చ.మీ. విస్తీర్ణంలో మొత్తం 100 కార్లు పార్క్ చేసేలా దీన్ని నిర్మించారు. ఇప్పటికే కార్ల పార్కింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తం 6 లెవెల్స్లో స్ట్రక్చర్ నిర్మించారు. దివ్యాంగులు కూడా పార్క్ చేసుకునేలా సౌకర్యం కల్పించారు. పూర్తి సెన్సార్ల సహకారంతో పార్కింగ్ చేసేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది. వారసత్వ సంపద పరిరక్షించేలా... నగరంలోని వారసత్వ సంపదను పరిరక్షించేందుకు జీవీఎంసీ నడుం బిగించింది. చారిత్రక గురుతులుగా మిగిలి, శిథిలావస్థలో ఉన్న టౌన్హాల్, ఓల్డ్ మున్సిపల్ హాల్ సంరక్షణ బాధ్యతలను స్వీకరించింది. రూ.4.13 కోట్లతో టౌన్హాల్, రూ.6.84 కోట్లతో పాత మున్సిపల్ భవనం సంరక్షణ పనులు చేపట్టింది. దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయి. పాత కట్టడాలు రూపురేఖలు కోల్పోకుండా, రెండు భవనాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు ఎంవీపీ కాలనీలోని స్పోర్ట్స్ ఎరీనాను రూ.19.89 కోట్లతో నిర్మిస్తున్నారు. రూ.20 కోట్లతో మూడు స్మార్ట్ రహదారులు పూర్తి చేస్తున్నారు. జనవరి మొదటి వారానికల్లా ఈ రెండు ప్రాజెక్టుల పనులు పూర్తయితే.. వీటిని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే నగర వాసులకు మరింత ఆహ్లాదం, అంతకు మించి ఆరోగ్యం అందుతుందని భావిస్తున్నారు. -
ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు
ఈ ఏడాది సెప్టెంబర్ 25న గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కనుమరుగయ్యారు కానీ పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. ఆయనకు నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. అక్టోబర్లో ఈ వనం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. గత వారం ఆవిష్కరించారు. చనిపోయే నాటికి బాలు వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నింటినీ ‘ట్రెబల్ క్లెఫ్’ (సంగీత స్వర చిహ్నం) ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలివి. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఈ వనం ఆవిష్కరణ వేడుకలో బాలు కుమారుడు ఎస్.పి. చరణ్, సోదరి ఎస్.పి. శైలజ వర్చ్యువల్గా పాల్గొన్నారు. -
పార్క్లో విచిత్ర మంటలు
మాడ్రిడ్: 'అగ్ని దేవుడు చలికాలంలో చిన్నవాడు.. ఎండాకాలంలో ఎదిగినవాడు' అని ఓ సామెత. మరి ఈ ఎండాకాలంలో అగ్నికి చెక్క వంటి వస్తువులు తోడైతే మరింత భగ్గుమంటుంది. అడ్డొచ్చిన అన్నింటినీ ఆహుతి చేస్తుంది. కానీ చిత్రంగా ఓ పార్క్లో అగ్గి రాజేసుకున్న మంటలు ఎలాంటి హాని చేయలేదు. ఈ విచిత్ర ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. కాలహోరాలోని ఓ పార్క్లో మంటలు చెలరేగాయి. అయితే అవి అక్కడున్నవారికి చెమటలు పట్టించడం మాని బిత్తరపోయేలా చేసింది. క్రమశిక్షణగా మండుతూ ముందుకు సాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చిలుక నిర్ణయం: యాజమాని షాక్!) సముద్రంలోని అలల్లాగా ముందుకు వస్తూ గడ్డిని బూడిద చేస్తూ పోయాయి. కానీ అక్కడ ఉన్న చెట్లను, చెక్క బల్లలను ఏమాత్రం పట్టించుకోలేదు. వీటిని దాటి వెళ్లిపోయాయే తప్ప చుట్టుముట్టలేదు. బుధవారం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. 37 వేల మందికి పైగా వీక్షించారు. అయితే ఇదెలా సాధ్యమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మంటల వెనక నుంచి బలమైన గాలి వీస్తుండటం వల్లే అవి అలా వేగంగా ముందుకెళుతున్నాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇదంతా ఎవరో కావాలనే చేశారని మరొకరు కామెంట్ చేశారు. (డ్యాన్స్ చేస్తూ పాడె మోసిన పోలీసులు!)